Sunday 31 May 2015

మోదీ కా మోళీ!బాబూ కా డాబూ!చందూ కా దందా?మేరా కు క్యా హోగయా కాలియా?!

     అమ్మమ్మ మోదీ,యెంత బులబులాగ్గా మోసం చేస్తున్నావు?కాంగ్రెస్సోళ్లని మించిపోయావుగా!కాంగ్రెస్సోళ్ళు అవినీతి గబ్బులో కూరుకుపోయి ఊపిరి సలపక వొదిలేసిన మంచి స్కీము లన్నిటికీ మాంచి జబర్దస్తు కొత్త పేర్లు తగిలించి వదలటం తప్ప సొంతంగా చేసిన గట్టి పని యేమిటో చెప్పు కొంచెం?ఇమేజి బిల్డింగ్ పేరుతో పదాల గారడీతో విదేశాల్లో స్పీచులు దంచి డప్పు కొట్టుకోవటం తప్పిస్తే మేక్ ఇన్ ఇండియా పేరుతో నువ్వు చేసిన హడావిడికి యెంత ఫలితం దక్కిందో లెక్కలు చెబుతావా కాస్త! అయినా మనోళ్లకి మంచి ట్రైనింగిచ్చి ప్రపంచ మార్కెట్లోకి వదిల్తే అక్కడి నుంచి తెచ్చే లాభం యెక్కువా,వాళ్లని ఇక్క దింపి అన్నీ అమర్చిపెట్టి లాభమంతా వాళ్ళు తీసుకుపోగా మనకి మిగిలే ఆడుగూబొడుగూ పన్నులు యెక్కువా?కామన్ సెన్సు లేనోళ్ళు యేం చెప్పినా వింటారనా, వాళ్లకింద యెంతమందిని మనవాళ్లని ఉద్యోగులుగా కూర్చోబెతావు,యెన్ని దశాబ్దాలకి వీళ్ళు పైకొస్తారు - యేంటీ స్వాభిమానం లేని జాతర?ఆ చాటున దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళూ నువ్వేదో ఒకప్పుడు ముఖ్యమంత్రిగా  గుజరాతుని పైకి తీసుకొచ్చావని నమ్మకంతో ఆ సమర్ధతని దేశం రంజిలో చూపిస్తే మేము కూడా బాగుపడతామని నమ్మి నీకు గుద్దిపారేస్తే గుజరాతు ప్రధానమంత్రి అనుకునేలా కడుపు నిండిన గుజరాతుకే ఇంకా పెడుతున్నావుగా!పనులు చేయించుకోవటానికీ వెంట తిప్పుకోవటానికీ దేశంలో మనుషులే కరువయ్యారా గుజరాతోళ్ళు తప్ప?అప్పుడు రాష్ట్రావతరణ రోజున ఆంధ్రోళ్ళకి యెంత గొప్ప బైస్కోపు చూపించావు,ఇప్పుడు రాజధాని భూమి పూజకీ నువ్వే వస్తావంట కదా!అప్పుడు నువ్వు పులిమిన కలరు పాలిపోయిందని మరోసారి కొత్త కొత్త రంగులు పులిమి వెళ్తావా నాయనా?తల్లిని చంపి పిల్లని పుట్టించిందని కాంగ్రెసుని యెంత తిట్టావు,మీకు నేనున్నానన్నావు,అడిగిన సాయమల్లా చేస్తానన్నావు,అన్నీ గాలి కబుర్ల కింద తేల్చేసావు - యెందుకింకా నాటకాలు? ప్రత్యేక హోదా ఇవ్వకుండా యే ముఖం పెట్టుకుని వస్తావు భయ్యా!నిధులు కూడా పదివేల కోట్లడిగితే ఎనిమిదివేల కోట్లు ముష్టి విదిల్చినట్టు విదిల్చావు నీకు మేము ఆనందంగా స్వాగత సత్కారాలు చెప్తామని యెలా అనుకున్నావు!నీకు మాన మర్యాదలు ఉంటే వచ్చే ముందు ప్రత్యేక హోదా సంగతి తేల్చి చెప్పు!అది ఇవ్వడం కుదరకపోతే నికరంగా రాష్ట్రానికి యెంత మేలు చెయ్యగలవో సభలో చెప్పు,బయట వాగే చెత్త వాగుడు మేము నమ్మం - నిండుసభలో ఒక ప్రధాని మాకిచ్చిన హామీయే గాలికి పోయే పేలపిండిలా తయారయింది రేపు శంకుస్థాపన రోజున కూడా మళ్ళీ నలగని డ్రస్సుతో చెదరని నవ్వుతో నువ్వు సొల్లు కబుర్లు చెబీతే పగటివేషగాడనే చెత్తపేరు తప్ప గొప్పపేరు రాదు,అది తెలుసుకో!


     అర్రెర్రె బాబుని కదిలిస్తే చాలు హైదరాబాదుని నేనే యెత్తాను,నేనే మోశాను,నేనే నేనే అనే సోది యెత్తుకుంటాడు వినేవోళ్ళకి బోరు గొడుతుందేమోనని కూడా అనుకోడు,అదేం మనిషో!23 జిల్లాల ప్రజల కష్టార్జితమంతా ఒక్క నగరాన్ని యెత్తడానికే పెట్టావు,మరి విడిపోయేటప్పుడు ఇప్పుడు నువ్వు యేల్తున్న 13 జిల్లాల వాటా నీ దమ్ము చూపించి రాబట్టలేక పోయావేం?తాతల నాడు తాగిన నేతుల వాసన కాదయ్యా ఇవ్వాళ నువ్వేం ఉధ్ధరించావో చెప్పవయ్యా!విడిపోయి యేడాది గడిచినా ఇంకా పొరుగు రాష్ట్రంలో యెందుకున్నావు నువ్వు?విభజన అన్యాయంగా జరిగింది అని ఇన్నిసార్లు నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేని బడుధ్ధాయిలం కాదుగా మేము,అట్లా అన్యాయంగా జరుగుతుంటే చూస్తూ వూరుకోవడం,కాకుంటే మరీ బాగుండదని శవాసనం వెయ్యటం తప్ప ఆ అన్యాయం జరక్కుండా అడ్డుకోగలిగావా?నీ సమర్ధత చూపించాల్సిన ఈ టైములో అసమర్ధత బయటపడే సన్నాయినొక్కు లెందుకు నొక్కుతావు?తెలుగువాళ్లని కలపడం అని పైకి గొప్ప ఆదర్శాన్ని చెప్తూ నువ్వు ఇంతవరకూ ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్యన తలెత్తిన అన్ని వివాదాల్లోనూ తెలంగాణా ముఖ్యమంత్రితో మెతకగా యెందుకు వ్యవహరిస్తున్నావు?2019లో తెలంగాణాలో గెలవడం కోసం ఆంధ్ర ప్రజల పౌరుషానికి భిన్నంగా వ్యవహరిస్తున్నావు - ప్రజలు మాత్రం నువ్వు దూకుడుగా ఉంటే చూడాలనుకుంటున్నారు!నువ్వు ఆంధ్రప్రదేశ్ అనే స్వతంత్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రివా తెలంగాణ ముఖ్యమంత్రికి సామంతుడివా?రానని చెటెక్కి కూర్చుని నీ పిలుపుల్ని వినోదంగా చూస్తున్నా సిగ్గు లేకుండా అన్నిసార్లు తెలంగాణ ముఖ్యమంత్రిని యెందుకట్లా దేబిరిస్తావు? పరిపాలించడానికి నీకో 13 జిల్లాల రాష్ట్రముంది,యెన్నో సమస్యలు ఉన్నాయి,ప్రజలు నీనుంచి యెంతో ఆశిస్తున్నారు - నువ్వు మాత్రం రెండుకళ్ళ సిధ్ధాంతం ప్రజలకి చెప్తూ తెలంగాణా వొదిలి రాలేకుండా వున్న్నావు.భ్రమల నుంచి బయట పడు!అక్కడ కొలువుదీరి ఉన్నవాడు నీకు లొంగే ఘటం కాదు,అతనింకా నీ పార్టీలో నీ కింద పనిచేసిన కాలం నాటి మనిషి కాడు,అతనికి తెలంగాణా ముక్తిప్రదాత అనే గొప్ప ఉంది - నిన్నటి గొప్ప తప్ప ఇవ్వాళ నీకేమి వుంది?రాజధాని గొప్పగా ఉంటే చరిత్రలో నీపేరు నిలబడుతుంది,ఆ ప్రాంతం వాళ్ళకి గొప్పగా ఉంటుంది - అప్పుడు హైదరాబాదు విషయంలో చేసిన తప్పునే ఇప్పుడు రాజధాని పేరుతో మళ్ళీ పదింతలు గట్టిగా చేస్తే ఈ చిన్న ముక్క కూడా నాలుగు ముక్కలవుతుంది - కళింగ కేకలు మొదలైనాయి తొలిదశలోనే పట్టించుకో!ఆంధ్ర-తెలంగాణ మధ్యన జరిగే తగాదాల్లో గానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి సాధించుకోవలసినవి సాధించడంలో దూకుడు పెంచకపోతే 2015లో తెలంగాణలో గెలవడం కాదు ఆంధ్రలో కూడా మట్టికొట్టుకుపోతావు,తెలుసుకుని బుధ్ధిగలిగి మసులుకో - దూకుడు పెంచవయ్యా చంద్రయ్యా!

     అబ్బబ్బ కేసీఆర్ దర్జా చూస్తా ఉంటే రాజుల కాలం యెందుకూ పనికిరాదనిపిస్తా వుండ్లే!?అక్కడి ఇక్కడి చిన్నా చితకా రాజులేంది ఇంద్రుడు కూడా యేడుస్తా వుండాలి?దిష్టి తగిలి పొయ్యేట్టుంది బంగారు మారాజుకి,గాలీ దూళీ సోక్కుండా బక్తులంతా పూజలూ గట్రా సెయ్యాలి - ఈపాటికే సేస్తా వుండారేమో!విభజన కోసం ఆంధ్రోళ్లని తిడుతూ అంత గయ్యాళితనం చూపించినా ఆఖరికి లోక్ సభలో దరిద్రపు సన్నివేశాల్తో యెన్ని అమంగళాలకయినా సిధ్ధపడి చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు  తెచ్చుకుని "అది మనకే,ఇహ మనకే,కుర్సి మనదే" అని యెన్ని గంతులు వేసినా తెలంగాణా ప్రజానీకం అత్తెసరు మెజార్టీయే ఇచ్చి ఒకరకంగా బిత్తరపోయేలా చేశారు!అయ్యగారు కూడా ఇక ఆంధ్రోళ్ళని తిట్టమాకండి అని ఒక హుకుం జారీ చేసి ఆ ఆంధ్రోళ్ళ కాళ్లల్లో తను గుచ్చిన ముల్లుల్ని తనే నోటితో తీసే పనిలో ఒళ్ళు మరిచిపోతున్నా యే తెలంగాణా స్వాభిమానీ అదేమని గద్దించి అడగకపోవడం అయ్యగారి అదృష్టమో మరొకటో కాదు,విభజన వాదుల్లో ఉన్న పైత్యకారి తనమే అది!విడిపోతే రాష్ట్రం అభివృధ్ధి సాధిస్తుందనే గ్యారెంటీ వాళ్ళకి ముందునుంచే లేదనేది స్పష్టంగా ప్రతి ఒక్కరికీ తెలుసు!ఒకప్పడు అటువైపునా ఇటువైపునా జరిగిన వుద్యమాలలో సిధ్ధాంత బధ్ధత ఉంటే విడిపోవాలి అనే కోరిక మాత్రం బలంగా ఉన్న శాడిష్టులు కొందరు లాఘవంగా సాగించిన పైస్థాయి పైరవీలతొనూ మీడియా ప్రపంచంలోని రాజకీయాలతొనూ బలవంతంగా సృష్టించి కొనసాగించబడిన ఉద్యమం ఇప్పటిది!కోరికలో న్యాయం ఉంటే, వారిలో దాన్ని వివరించగలిగిన సమర్ధత ఉంటే కేసీఆర్ తో సహా విభజనవాదులు ఆంధ్రోళ్లని తిడుతూ కేవలం తెలంగాణ లోనే ఉండకుండా ఆంధ్రప్రాంతంలోకి కూడా వచ్చి ఇదుగో ఇందువల్ల మేము విడిపోతున్నాం, ఇది మా న్యాయమయిన కోరిక అని ఆంధ్ర ప్రజల మద్దతుని కూడా అడిగి మొత్తం 23 జిల్లాల ప్రజల ఆశీస్సులతో శాసనసభలో థంపింగ్ మెజారిటీ తెచ్చుకుని రాజమార్గంలోనే దాన్ని సాధించుకుని ఉండేవారు,కాదంటారా?ఆ రకమయిన పరిస్థితి ఇవ్వాళ కేసీఆర్ మహారాజులుం గారికి అయాచిత వరంలాగ కలిసొచ్చింది - కేసీఆర్ పాలనని యేమాత్రం విమర్శించినా తెలంగాణా విఫల ప్రయోగం అనే కారణం చూపించి మళ్ళీ ఈ రెండు రాష్ట్రాల్నీ కలిపి ఒక్కటి చెస్తారేమోననే భయమే కేసీఆర్ పట్ల యెంత వ్యతిరేకత వున్నా నోరు మెదపకుండా ఉండేలాగ చేస్తున్నది!నిన్న గాక మొన్న హరగోపాల్ యేమి చెప్పాడు?అరగంట మాట్లాడితే చాలు ఒకదాని నొకటి ఖండించుకునే వాదనలు తెలంగాణ వాళ్ళు మాత్రమే చెయ్యగలరేమో అనిపించేటట్టు "తెలంగాణ సమాజం చాలా వైబ్రాంట్" అని ఒకచోట చెప్పి "నాయకులు ప్రజలంత వైబ్రాంట్ కాదు" అని తేల్చి చెప్పడం యే విధంగా చూసినా వైరుధ్యమే కదా?ప్రజలు మాత్రమే వైబ్రాంట్ అయి వుండి వారినుంచి వచ్చే నాయకులు వైబ్రాంట్ కాకపోవడం అనే అసలైన వైరుధ్యాన్ని కప్పిపుచ్చి ఆంధ్ర దోపిడీ అనే అబధ్ధాన్ని భుజానేసుకుని మొయ్యడమే ఇవ్వాళ్టి తెలంగాణా ఉద్యమంలోని నిజాయితీ పరులు జవాబు చెప్పకుండా తప్పించుకోలేని అసలైన తప్పు?!

     రేపటి తెలంగాణ యెట్లా ఉందబోతుందో కేసీఆర్ కుటుంబానికి తప్ప యెవరికీ స్పష్టత లేదు గానీ ఇవ్వాళ్టి తెలంగాణ మాత్రం మధ్యయుగాల నాటి రాజరిక పరిపాలన యెట్లా ఉంటుందో ఇవ్వాళ చూడాలనుకునేవాళ్ళకి వుదాహరణగా నిలుస్తుంది!ప్రజాస్వామ్యబధ్ధంగానే రాచరికాన్ని చూపించగలగడంలో నీ ప్రజ్ఞ అమోఘం చందూ,కానీ రాజుల్ని కూలగొట్టడానికి కారణమయింది మంత్రి,సామంత,దండనాధిపతుల్లో యెవరో ఒకరు కారణమైన దుస్థితి కూడా దాపరించే ప్రమాదం ఉందని తెలుసుకో!కూటనీతిని నమ్ముకున్న రారాజు అంతిమ యుధ్ధంలో తొడలు విరిగి కూలిపోయిన దృశ్యాన్ని నీ చేజేతులా తెచ్చుకోకుండా ప్రజాస్వామయబధ్ధంగా పరిపాలించు!ముందు జాగ్రత్తగా తెలంగాణా విఫల ప్రయోగం అని నిరూపించడానికి కంకణం కట్టుకున్నాడని వేరేవాడి మీద ఒక పుచ్చొంకాయ స్టేట్మెంటు పారేసి తెలివైన మాట మాట్లాడాననని పొంగిపోతున్నావేమో,నిజంగా రేపటి రోజున తెలంగాణ విఫల ప్రయోగం అన్ తేలితే దానికి మొదటి కారణం నువ్వే అవుతావనేది తెలుసుకుని బుధ్ధి గలిగి మసులుకో!మహాత్ములనుకున్నవాళ్ళ పట్లనే  పక్షపాతం చూపించని చరిత్ర నీకు భుజకీర్తులు తొడిగి సత్కరించటానికి నువ్వు సాధించాలనుకున్నది రాజమార్గంలో సాధించలేదు - యేదో ఉద్యమవేడిలో అట్లా అన్నాను పట్టించుకోకండి అని నువ్వు అన్నంతమాత్రాన గాయపడ్డ మనసులు శాంతించవు,యెందుకో తెలుసా?ఇప్పటివరకూ చేసిన పుణ్యానికి వైభవాలు చూశావు ఇప్పుడు చేసిన సీతాహరణం అనే పాపానికి ఇకముందు కష్టాలు అనుభవిస్తావు అనే పావని రావణునికి చెప్పిన ధర్మసూక్ష్మం తెలుసుకంటే బాగుపడతావు - సాహిత్యాన్ని కూలంకషంగ చదివిన పండితుడవటగా?ప్రజల్ని మరిచిపోయి ప్రజాస్వామ్యాన్ని లెక్క చెయ్యకుండా ఇప్పటిలాగే కళ్ళు మూసుకుని నడిస్తే నాలుగేళ్ళ తర్వాత నిజంగానే వోట్లడగటానికి మొహం చెల్లని పరిస్థితి రావొచ్చు - కాస్త కళ్ళు తెరిచి చూడండి చంద్రశేఖరేంద్ర మహారాజులుం గారూ!

     ఈ ముగ్గురిలో యెవ్వరూ కూడా ప్రజలు తమకు తం ఆకాంక్షల్ని నెరవేర్చడానికి అవకాశం ఇచ్చారనే గమనిక లేకుండా ఇదంతా వోట్లు రాబట్టగలగడంలోని తమ ప్రజ్ఞయే అనుకోవడమే కారణం అని అంత ధీమాగా ఉండటాన్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతున్నది!ప్రజలకి చెయ్యాల్సిన ఒక మంచిపనికి కూడా ఈ పని చేస్తే యెన్ని వోట్లు పడతాయి అనే లెక్క వేసుకుని చేస్తున్న ఈనాటి రాజకీయ సంస్కృతి జగన్ లాంటి వాళ్ళ యొక్క అవినీతి కన్నా ప్రమాదకరమైనది,అయినా దీనికి తరుణోపాయం కూడా కనిపించటం లేదు - యెందుకని?ఆంధ్రప్రదేశ్ విభజనని తమకి అనుకూలంగా వాడుకోవటానికి యెట్లా అయితే ఆరాటపడి 23 జిల్లాల ప్రజలూ సంతోషంగా ఒప్పుకుని శాంతియుతంగా జరిగే విధంగా కాకుండా ప్రజల మధ్యన ఒక కనిపించని తెరని దించినంత భయానకంగా జరగడానికి కారణమైనట్టుగానే అవే రాజకీయ పక్షాలు జగన్ అనే చదరంగం లోని మంత్రి లాంటి కీలకమయిన పావుని తమకి లాభం చేకూర్చేటందుకు తురుపుముక్కలా వాడుకోవాలని ఆరాటపడటం చూస్తుంటే ఈ దేశంలో ఒక క్షణం కూఒడా ఉందకూడదన్నంత ఆవేశం కలుగుతున్నది?!

     జగన్ మీద ఉన్న ఆరోపణలు రుజువై అతను జైలు కెళ్తాడని నేను మొదటినుంచీ ఇప్పటివరకూ  యే ఒక్క క్షణమూ అనుకోలేదు!అతని మీద అభియోగం యేమిటి?తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని కదా/అదే గనక నిజమైతే అప్పుడు మంత్రివర్గంలో ఉండి దాన్ని ఆపలేకపోయినందుకు గానీ ప్రోత్సహించినందుకు గానీ అప్పుడు రాజశేకర రెడ్డి మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న బొత్స,రఘువీరా రెడ్డి లాంటివాళ్ళు కూడా దోషులు కావాలి గదా!వాళ్ళందరూ వాగ్మూలాలు ఇవ్వడమూ వాళ్ళు యే అక్రమమూ చెయ్యలేదన్న మాటతో వాళ్లని వొదిలేశాక ఇంక జగన్ యెట్లా నేరస్తువుతాడు?అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు మేము తప్పు చెయ్యలేదని రొమ్ములు విరుచుకుని తిరుగుతుంటే జగన్ యెట్లా దొరుకుతాడు చట్టానికి,ఆలోచించండి?వ్యాపారస్తుల్లో కొందరు అతను ముఖ్యమంత్రి కొడుకు గాబట్టి అతని సంస్థలో పెట్టుబడులు పెట్టతం ద్వారా ప్రభుత్వంతో ప్రయోజనాలు సాధించుకోవాలని అనుకున్న వాళ్ళ కేసులే బయటికొచ్చి రుజువవుతున్నాయి తప్ప ఇంతవరకూ జగన్ నేరస్తుడు అని చెపే ఆధారం ఒక్కటి కూద దొరకలేదు,అవునా!అలాంటి వ్యాపారస్తులు ఇప్పుడు కూడా ఉన్నారు.కాబట్టి నేను వూహించినంత వరకూ అతన్ని సమయం చూసుకుని నిర్దోషిగా విడుదల చేసి బయటికి తీసుకొచ్చి తమ ప్రయోజనాల కోసం వాడుకోవటానైఅకి పనికొచ్చే తురుపు ముక్క స్థానం అతనిది!తన పొజిషన్ అంత సేఫ్ అని తెలీసే అతను అంత ధైర్యంగా ఉన్నాడనేది నా అంచనా.ఇవ్వాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా మాత్రమే అతని విడుదలని ప్రభావితం చెయ్యగలదు కాబట్టి యెప్పుడు అతన్ని బయటికి తీసుకొస్తే దాని ద్వారా భాజపాకి ప్రయోజనం కలుగుతుందో ఆసమయానికి జగన్ విడుదల జరుగుతుంది!వాళ్ళు బహుశా కర్ణూడు అర్జునుడి కోసం నాగాస్త్రాన్ని దాచినట్టు చంద్రబాబు తమని దాటిపోయి సొంతబలం పెంచుకుని తోక ఝాడిస్తే అప్పుడు జగన్ సాయంతో బాబుని ఇబ్బంది పెట్టడం కోసం చూస్తున్నారని నా అనుమానం,ఆ భయం వల్లనే రాష్త్రానికి చెయ్యాల్సిన సహాయాలు చెయ్యకపోయినా పోరాడాల్సిన పరిస్థితి కనబడుతున్నా సొంతమనుషుల్ని కూడా కేంద్రతో ఘర్షణ పడవద్దని చెప్పి అంత జాగ్రత్త పడుతున్నాడేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి?

     అందువల్లనే యెన్నికల ముందువరకూ జగన్ గురించి యేనాడూ సానుకూలంగా స్పందించని కేసీఆర్ యెన్నికల తర్వాత అధికారంలోకి వచ్చాక రాజకీయంగా జగన్ వైపుకి మొగ్గు చూపుతున్నాడు కాబోలు!భాజపా - తెదెపా ద్వయం కలిసి ఆలోచించుకుని జగన్ అనే పావుని విడుదల చేసి కేసీఆర్ మీదకి వొదిలితే కేసీఆర్ ఇబ్బంది పడటం ఖాయం!కేసీఆర్ ఇప్పటివరకూ ఆంధ్ర-తెలంగాణ వివాదాల్లో లాభపడటం తెలంగాణలో పట్టుకోసం రెండుకళ్ళ సిధ్ధాంతి చూపిస్తున్న మెతకతనమే యెక్కువ కారణం కాగా ఆ బలహీనత జగన్ వైపు లేదు,పైగా కేసీఆర్ లాగే అతని వ్యవహార సరళి కూడా దూకుడుగానే ఉంటుంది!ఈ ఇద్దరు దూకుడు మనుషులూ కలిస్తే ఆ ఇద్దరు మెతక నాయుళ్ళూ తట్టుకోలేరు,ఈ ఇద్దరు దూకుడు మనుషుల్నీ ఒకరికొకర్ని యెదురుగా నిబెడితే యెక్కువ ఇబ్బంది కేసేఅర్ వర్గానికే!ఇప్పటికే అధికారం లేక అల్లల్లాదుతున్న పాతకాపులైన రెడ్డి కులస్థులు జగన్ వైపు సపోర్టు ఇస్తే కేసీఆర్ కొత్తగా పైకి తీసుకువచ్చి బితుకూ బితుకూ మంటున్న వెలమ కులస్థులు అంత గట్టిగా నిలబడలేకపోవచ్చు!అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పకలో బల్లెమై కూర్చుని ప్రజలకి గట్టిమేలు చేసే విధంగా ఒత్తిడి పెట్టగలడు!లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రికి యెదురు నిలబడి అతని కళ్ళు కొంచెం నేలమీదకి చూసేలా ప్రభావితం చెయ్యగలుగుతాడు!నేనేదో తెలితక్కువగా అతన్ని యెక్కువ చేస్తున్నానని అనుకుంటే బొత్స అతనివైపుకి చేరడం కేసీఆర్ అతనితో కలవడానికి చూడటం దేనికి గుర్తో అర్ధం చేసుకోండి!ఇవ్వాళా రేపూ రాష్ట్రాలు విడిపోవటం,ప్రభుత్వాలు మారటం అన్నీ ప్రజాబీష్టాల కనుగుణంగా జరగడం లేదనేది మొదటిసారి తెలిసినప్పుదు ఆశ్చర్యంగా వుండవచ్చు,కానీ పైస్థాయిలో ఉన్నవాళ్ల అవసరాల కనుగుణంగా నాయకులు ఆడిపాడి అలరిస్తున్న రాజకీయం యెప్పట్నుంచో నడుస్తున్నదనేది అక్షరసత్యం!తాము వేసిన విలువైన వోట్ల మూలంగానే అవన్నీ జరుగుతున్నాయని భావించేవాళ్ళు పిచ్చివాళ్ళు?తన మాటల ద్వారా సంచలనాన్ని సృష్తించి అయినా సరే మెజార్టీ ప్రజల్ని సమ్మోహితుల్ని చెయ్యగలిగినవాడు పనికొచ్చేవాడి కింద లెక్కలోకి వస్తాడు!అలాంటివాణ్ణి మీడియా కొంత హైప్ సృష్టించీ, వ్యాపార పారిశ్రామిక వర్గాలు నిధులు సమకూర్చీ,ప్రచార వ్యూహకర్తలు అధ్భుతమైన తమ మేధాశక్తితో అతన్ని అనితరసాధ్యుడిగా నిలబేట్టి విపుల జన సమూహం ముందు తమ కలల్ని సాకారం చెయ్యగలిగిన రక్షకుడిగా ఆవిష్కరించీ అధికారంలో కూర్చోబెడతారు, అతడు వారి ఆకాంక్షల కనుగుణంగా పరిపాలిస్తాడు - స్వింగ్ ఫ్యాక్టర్ అనేదాన్ని ప్రభావితం చెయ్యగలిగిన మైనార్టీలకి రిజర్వేషన్లు ఇవ్వటం, అయోధ్యలో రామాలయం కట్టటం లాంటివి ఆ యజ్ఞంలో విసరబడే సమిధలు, అంతే!

     తెలంగాణలో యే ఉద్యమ వీరుల త్యాగాలతో యెదిగి ముఖ్యమంత్రి స్థానం వరకూ వచ్చాడో ఆ వ్యక్తియే ఉద్యమవీరుల్ని పనిగట్టుకుని దూరం పెట్టి ఉద్యమద్రోహుల్ని దగ్గరకి తీసుకుంటున్న దృశ్యంలో నాకు కనబడుతున్నది ఇది - ఆనాటి ఉద్యమవీరులు ఈనాడు కూరలో కరివేపాకులు,వాళ్ళకి వోట్లు వేసిన ప్రజలు గొర్రెలు!తెరాసా ఒకటే కాదు అన్ని పార్టీలూ ఇదే సంస్కృతిలో ఉండటానికి కారణం వీళ్ళెవరూ అధికార ప్రాప్తికి అసలు కారణం కాదు గనకనే!కాబట్టి జగన్ కేసు వీలయినంత తొందరగా తేలాల్సిన అవసరం ఇవాళ్టి చరిత్రకి చాలా ఉంది!అతడు దిఎషి అని నిరూపించబడి జైలుకి వెళ్తే వెంఠనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికీ కాస్త లేటుగా తెలంగాన ముఖ్యమంత్రికీ ఒక సస్పెన్సు విదిపోయి రిలీఫ్ వస్తుంది.కేంద్రంలో ఉన్న భాజపాకి గూడా కేస్ తమ హయాంలో పూర్తి అయింది గాబట్టి గొప్పగా చెప్పుకోవచ్చు.అలా కాకుండా ఆధారాలు లేవని తేలిపోయి నిర్దోషిగా బయత్టి కొస్తే మాత్రం యెవరివైపుకి చెరి యెవర్ని ఇబ్బంది పెడతాదనేది మాత్రం నేను చెప్పలేను గానీ ఈఎ రెందు రాష్ట్రాల్లోని రాజకీయ వాతావరనం వేడెక్కటం మాత్రం ఖాయం!

అరె వో సాంబా!అబ్ ఆయా మజా ఖేల్ కా?

1 comment:

  1. మిత్రులకి నమస్కారం!
    ఇది నా 100వ పోష్టు - యమస్పీడుగా ఉన్నట్ట్టున్నా?
    బ్లాగ్స్పాట్ అడ్మిన్ చూపిస్తున్న సాంకేతికమయిన లెక్కలు ఇట్లా ఉన్నాయి:
    పోష్టులు -> 100
    విజిట్స్ ఇప్పటి రోజు - 10
    విజిట్స్ నిన్నటి రోజు - 107
    విజిట్స్ నిన్నటి మాసం - 7,021
    మొత్తం వీక్షణలు ->53,524
    -------------------------------------

    దేశాల వారీగా
    ఇండియా - 848
    అమెరికా సంయుక్త రాష్ట్రాలు - 299
    సింగపూరు - 55
    సంయుక్త అరబ్బు దేశాలు - 30
    ఆస్ట్రేలియా - 27
    జర్మనీ - 27
    బ్రిటన్ - 25
    ___/\___

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...