Wednesday 26 April 2017

గానగంధర్వుణ్ణి తను కూర్చిన పాటల్ని పాడినందుకు కోర్టుకీడ్చిన ఇసైజ్ఞాని తను కూర్చడానికి రాగకర్తల నుంచి అనుమతి తీసుకున్నాడా?

          ముఖే ముఖే సరస్వతీ అన్నట్టు ఒక మనిషి నుంచి ఒక మనిషికి వ్యాపించే భావాల మీద, రాగాల మీద ఏ ఒక్క మనిషికీ కాపీరైటు లేదు. మనకి తెలిసిన ప్రతి విషయమూ ఇంకొకరి నుంచి తెలిసిందే అవుతుంది - మన తలిదండ్రులు నేర్పితేనే మనకి మాటలు వచ్చాయి! అయినా కొందరు నాకు తెలిసిందీ, నేను పాడందీ, నేను కూర్చిందీ నా సొంతమే అంటున్నారు!సార్వజనీనమైన కళమీద సొంతహక్కుల కోసం సాటి కళాకారుల మీద కేసులు కూడా వేస్తున్నారు, ఏమి చిత్రం?

          ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ సంగెతం ఉంది,ప్రతి సంగీతంలోనూ రాగాలు ఉన్నాయి,ప్రతి రాగానికీ స్వరాలు ఉన్నాయి - చిత్రంగా అన్ని  రకాల సంగీత రీతుల్లోనూ ఉన్న స్వరాలు ఏడు మాత్రమే!ఆ స్వరాల వెనక గణితం ఉంది - ఫ్రీక్వెన్సీ,డిలే అనే రెండింటి మిళాయింపుని ఒక స్థిరాంకంగా తీసుకుని దాన్ని మెట్లు మెట్లుగా పెంచితే మిగిలిన స్వరాలు ఏర్పడతాయి.షడ్జమం అనేది ఇక్కడ బేసిక్,రిషభం దానికంటే ఒక యూనిట్ పెంపు(కానీ పెంపులో ఒక నిష్పత్తి ఉంటుంది, అది లాగరథమిక్ స్కేల్) - ఇట్లా లెక్క ప్రకారం స్వరాలను ఏర్పరచారు. వారెవరో ఈనాటివారికి తెలియనే తెలియదే!వారు పేటెంటు హక్కుల కోసం ఆ పని చేశారా?ఆ స్వరాలని గాత్రంలో పలికించినా వాద్యం మీద పలికించినా లెక్క ఒకటే కాబట్టి నాదరమ్యతలో తేడా వుండదు!"నీ లీల పాడెద దేవా...!" పాటలో యస్.జానకి ఆలాపనా సన్నాయి ఆలాపనా ఒకే స్థాయిలో పలకడమే దానికి నిదర్శనం."షడ్జమం మయూరో వదతి" శ్లోకం ప్రకారం అవి ఆయా జంతువుల గొంతునుడి వచ్చే ఏకసూత్ర ధ్వనులు.అలాంటి విశ్వజనీనమైన సంగీతం మీద తనకి మాత్రమే పేటెంట్ హక్కులు ఉన్నాయనటం స్వరజ్ఞాని యొక్క అజ్ఞానం మాత్రమే!

          విశ్వనాధ సత్యనారాయణ గారి పురాణ వైర ఫ్రంధమాలలో "వేదవతి" కధ ప్రత్యేకమైనది!అందులో వేదవతి అనే ఆ నవలానాయకి దేహం సంగీతానికి విపరీతంగా ప్రతిస్పందిస్తుంది - ఎంతగా అంటే స్వరబద్ధమైన సంగీతం వింటూ ఉంటే క్షణ క్షణానికీ జీవశక్తులు ఉత్తేజితమై కొద్ది మిమిషాల్లోనే పూర్ణచందుడిలా తళుకులీనుతుంది,కర్ణకఠోరమైన సంగీతం వింటూ ఉంటే క్రుంగి కృశిస్తుంది!ఆ నవలలో భగవంతుడి మీద పగతో రగిలిపొయే జయధ్రధుడి వారసత్వంలో వచ్చే ప్రతినాయకుడి పేరు నిమేషధారి,వాడో మాంత్రికుడు.వాడు ఆయుష్షుని నిమిషాల లెక్కన పెంచుకోగలిగినవాడు.దాన్ని సాధించడానికి వేదవతిని కిడ్నాప్ చేసి వేదనాదం వినిపించి ఆమేనుంచి ఆయుష్షును నిమిషాలుగా గహిస్తాడు!అలా ఆయుష్షును పెంచుకున్నాక ఆమెకి పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తాడు - తప్పించుకోవడానికి శక్తి కూడా లేనంత నీరసించి పోతుంది వేదవతి.కల్పన బాగుంది కదూ - ఇప్పటి హాలీవుడ్ సినిమాల వాళ్ళకి కూడా రాని యెన్నో చిత్రవిచిత్రమైన కల్పనలు ప్రతి పురాణ వైర కధలోనూ ఉంటాయి - ఆయన్ని వెనక్కి నడిచేవాడు అని వెక్కిరించారు!అసలు విషయం యేమిటంటే ఈమెని వెతకడానికి బయలుదేరినవాళ్ళలో ఒక జానపదుడు ఉంటాడు,ఆ పాత్రకి విశ్వనాధ పెట్టిన పేరు టికటిక!నిమేషధారి తన స్థావరంలో లేని సమయంలో ఈ జానపదుడు  ఆ దగ్గిరలో తిరుగుతూ పాడిన జానపద గీతాలలో వైదిక సంగీతం వినబడి కృశించిన వేదవతి తేరుకుని నిండు తేజస్సును సమకూర్చున్నట్టు విశ్వనాధ వారు కల్పన చేశారు.ఆ వెంటనే తప్పించుకుంటుందో,లేక టికటిక ఆమెను కనిపెట్టటం జరిగి కధ కొంచెం నడిచాక తప్పించుకుంటుందో నాకు గుర్తు లేదు.అయితే ఇక్కడ విశ్వనాధ చెప్పదల్చుకున్న విషయమే ముఖ్యం - సంగీతం ఎవడబ్బ సొమ్మూ కాదు!

          ఇళయరాజా గురించి సినిమా పరిశ్రమలో తరచుగా కొన్ని మాటలు వినబడతాయి - ముక్తసరిగా మాట్లాడతాని,మాటిమాటికీ ట్యూన్లు మార్చడానికి విసుక్కుంటాడని,ఇలాంటివి చాలావరకు వినయాన్ని కాకుండా పాండితీగర్వాన్ని సూచించే లక్షణాలు!ఆ సహజమైన అహంభావంతోనే బాలసుబ్రమణ్యం మీద కేసు వేసి ఉండవచ్చును.కొందరు కాపీరైటు ఉల్లంఘనలకి ఇతరేతర వ్యక్తుల నుంచి గట్టి స్పందన కోసం చేశాడంటున్నారు గానీ నాకు మాత్రం ఈ పనిలో పాండితీగర్వానికి సంబంధించిన దుర్మార్గమే కనబడుతున్నది.యెందుకంటే,గానగంధర్వుణ్ణి తను కూర్చిన పాటల్ని పాడినందుకు కోర్టుకీడ్చిన ఇసైజ్ఞాని ఆ పాటల్నితను కూర్చడానికి ముందు రాగకర్తల నుంచి అనుమతి తీసుకున్నాడా?

Wednesday 19 April 2017

కాంగ్రెసు ముక్త భారత్ అంటే కాంగ్రెసును బయటెక్కడా కనిపించకుండా తనలోకి లాక్కొవడమా?

          మొదటిసారి ఈ "కాంగ్రెస్ ముక్త్ భారత్!" అన్న నినాదం మోదీగారి నోటినుంచి వచ్చినప్పుడు నేను ఎగిరి గంతేశాను!అసలు మోదీ అమ్నస్సులో ఈ నినాదం ఎప్పుడు పుట్టిందో!స్కూలు రోజుల నాడు పుట్టిన ఈ లక్ష్యంతోనే ఆవేశపడి ఇన్ని దశాబ్దాల తర్వాత ప్రధాని అయ్యాడా?లేక అనుకోకుండా ప్రధాని ఈ మధ్య కొత్తగా పుట్టిన వెర్రా ఇది!ఎందుకంటే,ఒకానొకప్పుడు ఈ రకమైన భావజాలం ఉన్నవాళ్లని గాంధీని చంపిన దేశద్రోహులుగా ముద్రవేసి వారి మాతకి విలువ లేకుండా చేసిన కలాంలోనూ,లోక్సభలో కేవలం 2 సీట్లు మాత్రమే ఉండి బిక్కుబిక్కుమంటున్న కాలంలోనూ,అద్వానీ గారు రదహయాత్రతో అప్రతిహతంగా రామబహ్క్తులను భాజపా అవిపుకు వోటుబ్యాంకుగా మారుస్తున్న కాలంలోనూ,వాజపేయి గారు కాంగ్రెసుకి అఖిల భారత్ భ్రష్టాచారీ కాంగ్రెసు అని పేరు మార్చుకోమని చురకలు వేసినప్పుడు గానీ ఎవరికీ తట్టని కొత్త వూహ కదా ఇది!

          హఠాత్తుగా అద్వానీ కేసు ముందుకు రావడంలో పైకి కనబడుతున్నది నిజమని మీరు నమ్ముతున్నారా?నాకైతే రివర్స్ గేరులో హిందువుల్ని రెచ్చగొట్టడానికి భాజపా ఆడుతున్న నాటకం అనిపిస్తున్నది!ముస్లిములని వోటుబ్యాంకుగా ఉపయోగించుకోవాలనుకున్న కాంగ్రెస్ పారీ,హిందూ వ్యతిరేక భావజాలపు కమ్యునిష్టు పార్టీ ఏమాత్రం బలంగా లేవు.ముస్లిం మతపెద్దలు మొదటినుంచీ సయోధ్య వైపుకే మొగు చూపుతున్నారు.రాజకీయంగా తాము కగజేసుకోకుండా ఇరుపక్షాల మతపెద్దల్నీ ఒక్కచోట కూర్చోబెడితే చాలు!అయితే.ముస్లిములు పరిహారం అడుగుతారు - 1000 కోట్లు కావచ్చు,లేక 3000 కోట్లు కావచ్చు!అది ఇవ్వకుండా రప్పించుకోవాలనే ఎఉగడలతోనే హిందూ మతతత్వ శక్తులు పావులు కదుపుతున్నాయి

          ప్రతి ఒక్క చతుర్యుగం తర్వాత జలప్రళయం జరిగే లెక్కని చూసుకున్నా యుగాల వెనకటి రాముడి ఆనవాళ్ళక్ ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో సాక్ష్యాలు పట్టుకోవటం దాదాపు అసాధ్యం.మసీఎదును సాక్ష్యాలు పట్టుకోవటం దాదాపు దుర్మార్గమే.అది ఒప్పుకుని ముస్లిములతో స్నేహపూర్వకమైన చర్చల ద్వారా గుడి కట్టడం మర్యాదస్తులైన ప్రతి ఉక్కరూ కోరుకుంతూన్నారు.కానీ భజపాను శాసించే శక్తులు మర్యాదకి కాకుండా సమర్ధతకి పెద్దపీట వేస్తున్నాయి - అదే గుడి కట్టడానికి అసలైన ప్రతిబంధకం. 

          కానీ అక్కడ అసలు సయోధ్య ద్వారా కాకుండా హిందువుల్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టి తమకి నిరంకుశామైన అధికారం సాధించుకోవాలని భాజపా వ్యూహం.అది ఫలిస్రే దేశం మళ్ళీ రాజుల కాలంలోకి వెళ్ళీపోవడం ఖాయం - నిజంగా అది జరుగుతుందా?ప్రపంచ స్థాయిలోనే భాజపా అతి పెద్ద రాజకెయ పార్టీఅ ని అంకెల ద్వారానే సష్టంగా తేలిపోయింది.ఇది హఠాత్తుగా జరిగినదీ కాదు,దానంతటదిగా జరిగిపోయిందీ కాదు.ఎప్పటినుంచో కమలమే సకలం కావాలి,కాంగ్రెసు ముక్త భారతాన్ని సాధించాలి అనే వ్యూహం పనిచెయ్యడం ద్వారానే జరిగింది.కానె ఆ వ్యూహం ఇదివరకు కాంతెసు ఆ స్థాయికి రావడానికి ఉపయోగంచిన పద్ధతియే కదా!వ్యాపించటానికి కాంగ్రెసు పద్ధతినే పాటిస్తే కాంగ్రెసుని అనుకరించినట్టే కదా!భాజపా కూడా అచ్చం కాంగ్రెసులాగే మారిపోయినట్టే కదా!సీసా మీద లేబుల్ మార్చినంత మాత్రాన జిన్ను రమ్ము అవుతుందా?

          తమిళనాట జయలలిత మరణం తర్వాత జరిగిన,జరుగుతున్న,జరగబోతున్న సంఘటనల వెనక భాజపా ప్రమేయం అందరికీ తెలిసిన విషయమే - అది కాంగ్రెసు నీచమైన శవరాజకీయమే!నిన్న జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆదిత్యనాధ్ తప్ప మిగిలిన వాళ్ళు ముఖ్యమంత్రులు కావటం కాంగ్రెసు మార్కు రాజకీయం ద్వారా కాదని యే భాజపా అభిమాని అయినా గుండెల మీద చెయ్యేసుకుఇ చెప్పగలడా!కాంగ్రెస్ ముక్తభారత్ అంటే బయటెక్కడా కాంగ్ర్సెసుని కనబడకుండా చేసి అద్దంలో చూసుకుంటే తనలోనే కాంగ్రెస్ కనబడేటట్టు తయారుకావడం అనుకుంటున్నాడా మోదీ!


అద్వానీ కేసుకీ రాముడ్ గుడికీ లంకె పెట్టి హిందువుల్ని రెచ్చగొట్టడం అమానుషం!

Tuesday 4 April 2017

శ్రీరాఘవం దశరధాత్మజం అప్రమేయం!

దేవుడు దేవుడిలా ఎక్కడో ఉండి
ఇక్కడి మనుషుల్ని శాసించకుండా
మనిషై పుట్టి పెరిగి మనం పడుతున్న 
కష్టాలనే తను కూడా అనుభవించి
ధర్మం తప్పకుండానే కష్టాల్ని అధిగమించి
సఖుడై, గురువై, మార్గదర్శకుడైన
మొదటి అవతారపురుషుడు రాముడు!

చైత్ర శుద్ధ నవమి నాడు
కౌసల్యా దశరధులకు తనయుడై జన్మించి
శ్రీమహాలక్ష్మి అంశయైన సీతకు ప్రాణనాధుడై
ఆదిశేషుని వంటి లక్ష్మణుడికి అన్నయై
వానర శ్రేష్ఠుడైన సుగీవుడికి మిత్రుడై
పరమశివుని అంశయైన ఆంజనేయుడికి ప్రభువై
శరణు కోరిన విభీషణుడికి రక్షకుడై
ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని కలగజేసిన
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరాముడు

అయోధ్యలో దశరధనందనుడై జన్మించి,
మిధిలలో జనకరాజపుత్రి సీతని పరిణయమాడి,
తండ్రిమాట కోసం అయోధ్యానగరం విడిచి
దండకారణ్యంలో పధ్నాలుగేళ్ళు గడిపి,
రావణుడు చెరబట్టిన సీతను సాధించడానికి
కిష్కింధ చేరి సుగ్రీవుడితో స్నేహం చేసి,
ఆంజనేయుడు ఆనవాళ్ళు కనిపెట్టి చెప్పగానే
రామసేతువు నిర్మించి లంకను చేరి,
దుష్టుడైన దశకంఠ రావణుణ్ణి సంహరించి
సాధు సజ్జనులకు ఆనందం కలిగించిన శ్రీరాముడు
మీకు సమస్త సుఖాలనూ ఇవ్వాలని ఆశిస్తూ -
శ్రీరామనవమి శుభాకాంక్షలు!

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...