Saturday 24 February 2018

ఎందుకిలా చేస్తారో! ఈ మనుషు లెందుకిలా మనసులతో ఆడుకుంటారో!

ఎందుకిలా చేస్తారో!
ఈ మనుషు లెందుకిలా మనసులతో ఆడుకుంటారో!

మాకది ఇస్తే మీకిది ఇస్తాం అని ఆశలు రేపుతారు -
మనం ఇస్తే పుచ్చుకుని నవ్వుకుంటారు గానీ,
మనకి ఇవ్వాల్సింది ఇవ్వడానికి ఏడుస్తారు!
చేసిన పాపం ఇంగువ కట్టిన మూట.
ఏం బావుకుంటారు?

మీరూ మేమూ ఒకటే అంతా సమానమే అంటారు -
మనల్ని కటికనేల మీద కూర్చోబెడతారు,
వాళ్ళు పట్టు బాలీసుల మీద కూర్చుంటారు!
మరొకడొచ్చి కిందకి లాగేవరకే పటాటోపం.
ఏం సుఖపడతారు?

కాలు కందకుండా చూసుకుంటానని కబుర్లు చెబుతారు -
మూరెడు మల్లెలు కొనలేని వెధవలు కూడా
మల్లెపూల మంచం కోసం కలలు గంటారు!
మంచం దిగాక తెలుస్తుంది మగతనం.
ఏం ఉద్దరిస్తారు?

తనని ప్రేమిస్తే స్వర్గం చూపిస్తానని కోతలు కోస్తారు -
ప్రేమిస్తే ఇంకాస్త ప్రేమించమని అంటారు,
కాదంటే వాళ్ళే చంపి స్వర్గానికి పంపిస్తారు!
చిప్పకూడు తినేప్పుడు తెలుస్తుంది నిజం.
ప్రేమంటే బతికించడం తప్ప
చంపడం కాదని,ఏం లాభం?

ఇతరుల్ని మోసం చెయ్యడమే గొప్ప తెలివి అనుకుంటారు -
ఇతరుల్ని మోసం చేస్తూ మీసాలు మెలేస్తారు,
ఇతరులు మోసం చేస్తే పళ్ళు కొరుకుతారు!
ఏం మూర్ఖత్వం వాళ్ళది?
ఎంత సిగ్గులేని తనం!

ఎందుకిలా చేస్తారో!
ఈ మనుషు లెందుకిలా ఆత్మల్ని అమ్ముకుని బతుకుతారో!

Tuesday 20 February 2018

భవిష్యత్తులో రోబోట్లు నిజంగా మనుషుల మీద తిరగబడతాయా?అసలు యంత్రానికి స్వంతబుద్దిని ఇవ్వడమూ ఆలోచన నేర్పడమూ సాధ్యమా?


సనాతన ధర్మం మనుషుల్ని మూడు రకాల కింద కుదించింది - తామసులు,రాజసులు,సాత్వికులు అని!మీరు ఆన్‌లైన్ షాపింగ్ కోసం వెబ్ ముందు గానీ ఫోను ముందు గానీ కూర్చుంటే వాళ్ళు మీముందు రేడియో బటన్లూ చెక్ బాక్సులూ కలిపి ఒక వెబ్ ఫార్మ్ పెడతారు.మీ ముక్కూ మొహం వాళ్ళకి తెలియకపోయినా మీరు నొక్కిన బటన్లని బట్టి వాళ్ళు మీకు కావలసిన వస్తువుని మీకు పంపిస్తారు - లెక్క ప్రకారం పని జరిగిపోతుంది.వ్యాపారం చేసి లాభం పొందాలనుకున్నవాడు గానీ ఓట్లు సంపాదించి అధికారం పొందాలనుకునేవాడు గానీ ప్రతి మనిషినీ పట్టించుకోవాలంటే గిట్టుబాటు కాదుఅలాగని అసలు పట్టించుకోకపోతే మట్టానికి మునిగిపోతాడు.
ఇద్దరికీ సులువైన పద్ధతి యేంటంటే వాళ్ళు ఏ సమూహాన్ని సంతృప్తి పరచాలనుకుంటున్నారో ఆ సమూహాన్ని కొన్ని సామాన్య లక్షణాలను ప్రదర్శించే చిన్న చిన్న గ్రూపులుగా విడగొట్టి ఏ గ్రూపుకి ఏ అంశం నచ్చుతుందో తెలుసుకోవటం తేలిక.అయితే, తొలిప్రేలుడు సిద్ధాంతకర్తల లాగే అంతకుముందు ఏమీ లేదనీ ఉండటానికి వీల్లేదనీ అనుకున్నాడో యేమో కార్ల్ మార్క్స్ మానవ జాతి యొక్క తొలిదశ అని చెప్పిన ఆదిమ కమ్యూనిజపు కాలం నుంచీ ఇప్పటివరకూ మానవ సమూహాలు అన్నీ సనాతన ధర్మం చెప్పిన తామసం,రాజసం,సాత్వికం అనే మూడింటిలో ఏదో ఒక లక్షణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఎంత కఠినంగా విశ్లేషించినా నాలుగో గ్రూపు కనబడటం లేదు.
రోబోట్ల గురించి తలకట్టు పెట్టి వ్యాపారం,రాజకీయం అంటున్నానేమిటా ఆని ఆశ్చర్యపోతున్నారా?నేను ఇక్కడ కూర్చుని రాసినదాన్ని మీరు అక్కడ కూర్చుని చదివేలా చెయ్యగలుగుతున్న కంప్యూటర్ టెక్నాలజీ ఎందుకు ఉనికిలోకి వచ్చిందో రోబోట్ల వాడకం కూడా అందుకే ఉనికిలోకి వచ్చింది - వ్యాపారం కోసమే!వ్యాపారం అనగానే మూర్ఖపు కమ్యునిష్టుల మాదిరి ముఖం చిట్లించకండి,కస్టమర్ని మోసం చెయ్యని వ్యాపారం చాలా అవసరం - మనం జంతువుల నుంచి విడిపోయి ఒక ప్రత్యేకత సాధించడానికి కారణం మనకి వ్యాపార సూత్రాలు తెలియడమే!
మిగిలిన జంతువుల కన్న మానవుడిలో భిన్నమైన లక్షణం అత్యద్భుతమైన జ్ఞాపకశక్తి - ఇవ్వాళ తెలిసిన విషయాన్ని రేపటికి గుర్తుపెట్టుకోగలగడం వల్లనే మానవుడు ఇంత ప్రగతిని సాధించాడు. కార్ల్ మార్క్స్ దానికి ఆదిమ కమ్యూనిజం అనే పేరు పెట్టి తన సిద్ధాంతాన్ని అక్కడినుంచే మొదలుపెట్టడానికి కారణం కూడా వస్తువుల వినిమయం మొదలైన తొలిదశ కాబట్టి కావచ్చు - కానీ అతను దాన్ని మరీ ఎక్కువ ప్రేమించి మానవాళి అంతిమలక్ష్యం కూడా అదే అనటం మాత్రం అశాస్త్రీయమైన ప్రతిపాదనయే!
వ్యాపారం యొక్క ప్రయోజనమూ, దాని వెనక ఉన్న జ్ఞానసంచయం యొక్క అవసరమూ మనిషిని సుఖపెట్టటానికే, సుఖం అంటే సోమరితనం కాదు - అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ ఫలితాన్ని పొందడం. దీనికోసమే చక్రం అనే తొలియంత్రాన్ని కనిపెట్టాడు ఆది మానవుడు.ఇప్పటికీ మానవసమొహం ఉపయోగించే ప్రతి యంత్రంలోనూ ఈ చక్రమే రకరకాల రూపాల్లో ఒదిగిపోయి కనిపిస్తున్నది - ఒకే దైవం అనేక రూపాల్లో సాక్షాత్కరిస్తున్నట్టు!
ఇవ్వాళ మనం రూపాయి అని పిలుస్తున్నది దాన్ని సంపాదించడానికి మనం పడిన శ్రమకి గుర్తు.ఇక్కడ శ్రమ అనడం కన్న జ్ఞానం అనడం వల్ల విషయానికి మరింత స్పస్టత వస్తుంది.అవ్యక్తుడైన పరమాత్మను తెలుసుకోవడానికి ప్రతిమ ఎలా అవసరమో ఒక మనిషి నిన్నటి రోజున చేసిన శ్రమ వెనక ఉన్న జ్ఞానమే ఇవ్వాళ రూపంలోకి వచ్చి రూపాయి/డాలర్/రూబుల్ అనే పేర్లతో అతని ఆదాయం అవుతుంది.కేవలం దేహశ్రమతో చెయ్యలేని పనిని బుద్ధి చాతుర్యంతో చెయ్యగలిగితే ఆ బుద్ధి చాతుర్యమే ఎక్కువ ఆదాయాన్ని తెస్తుంది - అది సహజమే!ఒక మనిషి టన్ను బరువున్న ఇనపగుండుని తనొక్కడే యెత్తగలడా!చాలెంజి రాముడిలా కొన్ని సంవత్సరాల పాటు రకరకాల సాధనలు చేస్తే ఎత్తగలడేమో!కానీ కప్పీలూ గొలుసులూ తయారుచేసుకుని తెలివిని ఉపయోగిస్తే ఎన్నిసార్లు ఎత్తమన్నా ఎత్తగలడు -అదీ కొద్ది నిమిషాల్లోనే!
ఈ రకమైన యంత్రాల వినియోగం పట్ల ఇపటివరకు ఎవరికీ అభ్యంతరం రాలేదు గానీ వీటికి కొంత ఆలోచన నేర్పుదామని అనుకునేసరికి కొందరు కంగారు పడిపోతున్నారు,అలా చేస్తే ఒకనాటికి అవి తెలివి మీరిపోయి మనిషి మీద తిరగబడి మానవజాతిని సర్వనాశనం చేస్తాయని భయపెడుతున్నారు, ఇదే మానవాళి యొక్క ఆఖరి ఆవిష్కరణ/పరిశోధన అని ఇతరుల్ని కూడా భయపెడుతున్నారు.
 నాస్తికులకీ హేతువాదులకీ ఆస్తికుల్నీ భక్తుల్నీ వీళ్ళు చేస్తున్న  తర్కవిరుద్ధమైన,అశాస్త్రీయమైన పనుల్ని చూసి హాచ్చెర్యం పడిపోయి వాళ్ళలో వాళ్ళు అనుక్కుని విసుక్కునే మూసమాటలు "ఈ యంత్రయుగంలో...?!", "ఈ రాకెట్ యుగంలో...?!", "ఈ కంప్యూటర్ యుగంలో...?!","ఈ ఇంటర్నెట్ యుగంలో...?!" అని తరాల పాటు వింటున్నా వీళ్ళు జాలిపడుతున్నవాళ్ళు సుబ్భరంగానే బతికేస్తున్నారు. వీళ్ళ విసుగుకి మాత్రం విసుగు రావటం లేదు.అయినా ముందు ముందు వీళ్ళు అసలు ఉండకపోవచ్చు - PEW వారి లెక్కల ప్రకారం మొదటినుంచీ మానవ సమూహాలలఓ నాస్తికులే అత్యల్ప సంఖ్యలో ఉంటూ వస్తున్నారనీ రాబోయే కాలంలో వీరి సంఖ్యలో మరింత తగ్గుదల కనిపించి ఒక శతాబ్దం తర్వాత వీరి అలికిడే ఉండదనీ తెలుస్తున్నది.అంటే,"ఈ రోబోట్ల యుగంలో...?!" అనేది మనం వినబోయే ఆఖరి వెక్కిరింత అన్నమాట - శుభం అందామా భశుం అందామా!
కొందరు యంత్రాలకు కృత్రిమమేధ ఇవ్వడం గురించి అంత భయపడడానికి బలమైన కారణమే ఉంది.ఇప్పటివరకు తను తన ఉపయోగం కోసం తను తయారు చేసుకుంటున్న యంత్రాలని తను చెయ్యమన్న పనిని మాత్రమే చేసి ఆగిపోయేటట్టు తయారు చేస్తున్నాడు.ఇప్పుడు తను ఫలానా పని చెయ్యమని చెప్పకుండానే స్వంత బుద్ధితో పనులు చేసేటట్టు తయారు చెయ్యాలనుకుంటున్నాడు - మనిషిలో లాగే ఆ బుద్ధి పెడదార్లు పట్టితే?
వీళ్ళ భయాలతో పని లేకుండా intelligent machines కోసం ప్రయత్నాలు కూడా చాలా కాలం నుంచే జరుగుతున్నాయి.ఆధునిక కాలంలో పూర్తి వివరాలతో రికార్డ్ అయి మనకి తెలుస్తున్న తొలి రోబో క్రీ.పూ 250లో సాక్షాత్కరించింది.Ctesibius అనే ఒక గ్రీకు ఇంజనీరు తను తయారుచేసిన ఒక నీటి గడియారంలో అవసరాన్ని అబ్ట్టి తమకు తామే కదిలి నీటి గడియారం ఆగకుండా చలించే యంత్రాలను ఇమిడ్చాడు.అయితే,ఇది కేవలం ఆశను రేకెత్తించిన వింతయే తప్ప దాన్ని అందిపుచ్చుకుని ఎవరూ హడావిడి చేసిన దాఖలాలు లేవు.అన్ని లెక్కలూ వేసుకుని పనిగట్టుకుని క్రీ.శ 1954లో George Devol అనే వ్యక్తి digitally operated and programmable robot అనేదాన్ని కనుక్కోవడంతో రోబోటిక్ ఇండస్ట్రీ అనేది ఉనికిలోకి వచ్చింది.
ఇవ్వాళ మనం వాడుతున్న సెల్ ఫోన్ల లాగే రోబోట్ల గురించి సైన్స్ ఫిక్షన్ రచయితలు చాలా కాలం నుంచే కలలు కంటున్నారు - వస్తే లైఫ్ ఇలా ఉంటుందని ఆశ పడ్డారు, మరోలా అవుతుంతుందేమోనని భయపడ్డారు, దీనితో మాత్రం ఒరిగేదేముందిలే అని విరక్తితో వేదాంతం చెప్పారు,
 మనలో చాలామందికి లీలగా తెలిసిన Frankenstein అనే భూతం క్రీ.శ 1818లో Mary Shelley రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలోని పాత్ర. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిందని మనం చెప్పుకునే సామెతలా ఆ నవలలోని ప్రధానపాత్ర అయిన Dr. Frankenstein చేసిన అత్యంత బలశాలిని సృష్టించే ఒక ప్రయోగం వికటించి ఆ భూతం తయారవుతుంది!దీని తర్వాత ఒక శతాబ్దానికి,అంటే క్రీ.శ 1921లో Karel Capek తను రాసిన R.U.R - (Rossum's Universal Robots) అనే నాటకంలో రోబోట్ అనే పేరు పెట్టాడు.ఈ కధలో కూడ రోబో తనని తయారుచేసినవాణ్ణి చంపేస్తుంది.క్రీ.శ 1927లో Fritz Lang తీసిన Metropolis ఆనె సినిమాలో మోద్టిసారి Maschinenmensch ("machine-human") రూపంలో రోబోట్ కనిపించింది.
ఆఖరికి ప్రఖ్యాత రష్యన్ సైన్స్ ఫిక్షన్ రచయిత Isac Asimov క్రీ.శ 1941లో robotics అనే మాటని అది ఉత్పత్తిరంగం అవుతుందనే సూచనతో వాడి ఇప్పటి స్థితిని కూడ వూహించాడు.ఈయన మంచి ఫ్యూచరిస్టు కూడా - భవిష్యత్తులో వచ్చే మార్పుల్నీ వాడకంలోకి వచ్చే వస్తువుల్నీ చాలామటుకు కరెక్టుగానే వూహించాడు - భవిష్యత్తును తెలుసుకోవడానికి అతీతశక్తులూ, మంత్రతంత్రాలూ, జ్యోతిషశాస్త్రమూ అక్కర్లేదని నిరూపించాడు!ఈయన Runaround కదలో సూత్రీకరించిన Three Laws of Robotics అనేవాట్ని రోబోటిక్స్ పరిశ్రమలో వాడుతున్నారో తెలియదు గానీ "I,Robot"తో సహా అన్ని రోబోట్లకి సంబంధించిన సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో నవలల్లో యధాతధం వాడుతున్నారు.నేను చూసిన రోబోట్లకి సంబంధించిన సినిమాల్ల్లో I,Robot కన్న bicentennial man అన్ని విధాల ఉన్నతమైన సినిమా!సినిమాలూ నవల్లూ ఎంత భయపెట్టి వెనక్కి లాగినా క్రీ.శ 1948లో Norbert Wiener అనే పెద్దమనిషి Cybernetics అనే పుస్తకం ప్రచురించడంతో రోబోటిక్స ఒక పరిశ్రమ అయిపోయింది.అదే సంవత్సరం William Grey Walter ఆనె British robotics Engineer మొదటిసారి Elmer, Elsie ఆనె రెండు రోబొట్లని తయారు చేశాడు.పవర్ అయిపోతున్నదని తమకు తామే తెలుసుకుని చార్జింగ్ హెడ్స్ ఎక్కడున్నాయో అవే వెతుక్కుని చార్జ్ చేసుకోవటం వాటి తెలివి:-)
ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చెయ్యాల్సి వస్తూ విసుగు పుట్టించే చోట intelligent robotsని వాడటం మంచిదే కదా!ఏ కొంచెం అడుగు తడబడినా చెయ్యి వొణికినా ప్రమాదాలు జరిగే పనుల్లో వీటిని వాడటం వల్ల మనుషుల ప్రాణాలను కాపాడవచ్చును కూడా.యంత్రాల వాడకం మనుషుల నిరుద్యోగితని పెంచుతుందని కొందరు భయపెడుతున్నారు గానీ సృజనాత్మకత ఉంటే మరో పనిని నేర్చుకుని మరో చోట ఉద్యోగం వెతుక్కోవచ్చు.అదీగాక ఈ యంత్రాలని కంట్రోల్ చేసే కీలకమైన నైపుణ్యాన్ని సాధిస్తే అట్లాంటి చోట పాతుకుపోయిన వ్యక్తులకి ఆదాయమూ ఎక్కువగానే ఉంటుంది. ఒక ప్రముఖ విమానాశ్రయం తమ విమానాలని పార్కింగ్ చెయ్యడం కోసం మనుషులకి బదులు intelligent system వాడటం వల్ల మిలియన్లలో ఆదా అవుతున్నదట - మానవ తప్పిదాలు కూడా దాదాపు శూన్యం!
కాల్పనిక సాహిత్యపు మేధావులు ఎంత భయపెట్టినా సైన్స్ ఫిక్షన్ రచయితలు ధైర్యం చెప్పడంతో మనిషి రోబోలని ఉనికిలోకి తీసుకురానే వచ్చాడు - నష్టం గురించిన భయాల కన్న లాభం గురించిన ఆశలే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మనిషిని ముందుకు నడిపిస్తున్నాయి.
మొట్టమొదటి కంప్యూటరును నడిపించిన తొలి ప్రోగ్రామర్ Lady Lovelace క్రీ.శ 1842లోనే అప్పటికి కొత్తొక వింతయిన కంప్యూటరు పని తీరు గురించి సందేహపడుతున్నవారికి,"The analytical engine has no pretentions to originate anything.It can do whatever we know how to order it to perform." అమి జవాబు చెప్పింది.ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పిన ఆ జవాబులోనే కృత్రిమ మేధకి సంబంధించిన ఆశలు ఇమిడి ఉన్నాయి.తర్వాత మళ్ళీ క్రీ.శ 1960లో Marvin Minsky అనే మేధావి "Steps Toward Artificial Intelligence" రాసిన పరిశోధనాపత్రం ఈ రంగంలో ఎంతో ముఖ్యమైన మలుపు. స్వలింగసంపర్కం ఆరోపణల వల్ల ఒతిడికి గురయి ఆత్మహత్య చేసుకున్నాడు గానీ లేనట్లయితే న్యూటన్, గ్రాహం బెల్, ఐన్స్టీన్ లాంటి వాళ్ళందరికన్న ఎక్కువ పేరు ప్రతిష్ఠలు వచ్చేవి!దీని తర్వాత కొద్ది కాలానికే Jim అనే పాక్షిక అంధుడైన ఒక మేధావి సాంకేతీకంగా artificial intelligenceకి మంచి prototype అనదగిన ఒక చిన్న ప్రోగ్రాం రాశాడు.దీనితో యంత్రాలకు కృత్రిమమేధని ఇవ్వగలం అని అందరికీ నమ్మకం కలిగింది.
మానవాళి చరిత్రని భయానకమైన విధ్వంసం నుంచి రక్షించే అపురూపమైన సన్నివేశాలలో నిలిచి పోరాడినవారు గానీ మానవుల సుఖజెవనానికి దారులు వేసే గొప్ప ఆవిష్కరణలలో పాల్గొన్నవారు గానీ - అందరూ మహాబలవంతులో అఖండప్రజ్ఞానిధులో ఆగర్భశ్రీమంతులో కాదు,తమ అవకరాల్నీ బలహీనతల్నీ పరిమితుల్నీ దాటుకుని ముందుకు వచ్చి కీర్తివంతులయ్యారు!ఇవన్నీ ఈతర దేశాలలో జరుగుతున్న కధలు - మన దేశంలో మాత్రం మూడువేల యేళ్ళ క్రితం బ్రాహ్మణులు మా తాతల్ని చదువుకోనివ్వకపోవడం వల్లనే ఇవ్వాళ మేము వెనకబడిపోయామని కొందరూ రెండు వందల యేళ్ళ క్రితం ఇంగ్లీషువాళ్ళ అణిచివేత వల్లనే ఇవ్వాళ మేము వెనకబడిపోయామని కొందరూ గతాన్ని తవ్వుకుంటూ నిలబడుతున్నారే తప్ప ఇప్పటికైనా కదిలి రేపటికి తప్పకుండా ముందుకెళ్తాం అనే హుషారుని చూపించలేకపోతున్నారు.
నిన్నటి తరం గొప్పదనాన్ని చెప్పుకోవటంతో సరిపెట్టేస్తూ ఉంటే ఏ తరమూ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు.వెనకబడిన విషయాన్ని ఒప్పుకుని ముందుకు వెళ్ళటానికి తిందరపడాలి.మన దేశంలో తప్ప ప్రపంచం మొత్తం AI చుట్టూ తిరుగుతున్నది.కొందరు భయపెడుతున్నట్టు యంత్రాలు మనిషిని మించిపోయి తిరగబడే ప్రమాదం ఏమీ లేదు.వాళ్ళ పిచ్చి గానీ మనిషి ఇప్పటికే మచ్చిక చేసుకున్న కుక్కగుర్రంఏనుగు లాంటి జంతువులు జీవమూ ఆలోచనా ఉన్నవే కదా - అవే తిరగబడనప్పుడు యంత్రాలు తిరగబడటం ఎట్లా జరుగుతుంది? తిరగబడితే సాటి మనుషులన్న కనికరం కూడా లేకుండా వేలు,లక్షలు, మిలియన్ల సంఖ్యలో నిలువునా హతమార్చి మీసాలు మెలివేసిన చరిత్ర గల సామ్రాజ్యవాద సిద్ధాంతులకి యంత్రాలని అణిచివెయ్యడం ఒక లెక్కా!
అసలు artificial intelligency ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?అయితే Patrick Winston ఇస్తున్న లెక్చరు  వీడియో చూడండి.ఈ వీడియో మొత్తం చూదగలిగితే మంచిదే గానీ ప్రస్తుతం ముఖ్యమైన విషయం 1:16/49:55 నుంచి 6:42/49:55 వరకు ఉంటుంది.అక్కడ చూపిస్తున్నది తొలిదశలో రాసిన ప్రోగ్రాము.ఏం చేస్తున్నది అది?చెప్పింది చెప్పినట్టు చెయ్యడమే కాకుండా ఫలానా పని ఎందుకు చేశావు అంటే కారణం చెబుతున్నది,అదే తను చెయ్యని పనిని గురించి అడిగితే "Did I do it?" అని రెట్టిస్తున్నది - ఎవరిది ఆ ఘనత, ప్రోగ్రామరుది కాదూ!మనవాళ్ళు కూడా మరీ వెనకబడి లేరు లెండి,ఒక సిక్కు కుర్రాడు పాత Farmer-Fox-Goose-Grain పజిలుని తీసుకుని ఎంత సుదీర్ఘమైన సుత్తి వేశాడో చూదండి - ఆఖర్న artificial intelligent program కూడా రాసేశాడు.కొద్దిమంది అత్యద్భుతమైన విజయాల్ని నమోదు చెయ్యడం తప్పిస్తే ప్రపంచ ఆర్ధిక రంగంలో భారతదేశం యొక్క స్థానం చెప్పుకోదగిన స్థాయిలో లేదు.ప్రపంచ వేదిక మీద రాజకీయపరమైన దౌత్యపరమైన అంశాల్లో మన మాట చెల్లుబడి కాకపోవటానికి ప్రపంచ విపణి మీద మనకి పట్టు లేకపోవటమే అతి ముఖ్యమైన కారణం.
ఈ వెనుకబాటుకి ముఖ్యమైన కారణం మన విద్యావ్యవస్థయే!ప్రస్తుతపు విద్యావిధానం మెకాలే నాటి కాలపు మూస పద్ధతిలోనే నడుస్తూ బిళ్ళ బంట్రోతుల్నీ చిన్న గుమాస్తాల్నీ పెద్ద ఉద్యోగుల్నీ తయారు చెయ్యటానికి తప్ప ఇవ్వాళ్తి పరిశ్రమలకి పనికివచ్చే క్రియేటివ్ కుర్రాళ్ళని పుట్టించటానికి పనికిరాదు,నిజమే - అయినప్పుడు దాన్ని మార్చుకోవాలి, మార్చుకుని బాగుపడాలి!ప్రవచనకారులు ఎన్ని నీతులు చెప్పినా, శాస్త్రజ్ఞులు ఎన్ని గొప్ప వస్తువులు కనుక్కున్నా, కళాకారులు ఎంత వినోదాన్ని పంచినా మనిషి తనకు గౌరవప్రదమయిన జీవనోపాధినీ సంతృప్తికరమయిన ఆదాయాన్నీ ఎవరు ఇస్తారో వారికి మాత్రమే అధికారాన్ని కట్టబెడతాడు - వ్యాపారం,ఆధ్యాత్మికం,రాజకీయం వేరు వేరు కాదు.మనుషులు వాటిని విడివిడి అస్తిత్వాలు అని పొరబడుతున్నారు,అంతే!ధనం యొక్క సృష్టికి వ్యాపారమే మూలం.ఉద్యోగులు కూడా తమ శ్రమని యజమానికి అమ్ముతున్నారు నెలవారీగా- అందుకే ఉద్యోగాలు ఇవ్వడానికీ తెచ్చుకోవడానికీ మధ్య జరిగే వ్యవహారాల్ని కలిపి జాబ్ మార్కెట్ ఆనె పదం పుట్టింది.సంపదని సృష్టించే ప్రతి చోటా అమ్మకందారు, వస్తువు, ఖరీదు, కొనుగోలుదారు, లాభం, నష్టం, అనే అంశాలు ఉండి తీరుతాయి. కొన్నిచోట్ల ప్రస్ఫుటంగా కనబడుతూ అన్నిచోట్లా అంత స్పష్టంగా కనిపించని ఏదో సింహంలా అదనపువిలువ కూడా దాక్కుని ఉంటే ఉందవచ్చు ఆర్ధిక శాస్త్రం మొత్తం ఎవరు దేన్ని ఎంతకి అమ్ముతున్నారు, ఎవరు దేన్ని ఎక్కువ కొంటున్నారు అనే దాని చుట్టూ తిరుగుతుంది తప్ప మతాన్నీ కులాన్నీ ప్రాంతాన్నీ చూడదు.కులానికీ మతానికీ ప్రాంతానికీ అంటుకుపోయి భారతీయులు వ్యాపార సంస్కృతికి దూరం కావదం వల్లనే మన రూపాయి బలహీన పడింది.

యంత్రాలకి కొత్త బుద్ధి వస్తుంటే భారతీయులకి ఉన్న బుద్ధి పోయింది - వీళ్ళకన్న యంత్రాలే నయం!

Thursday 15 February 2018

మోదీ అనే ఒకే ఒక వ్యక్తిని నమ్ముకుని శవాసనం వేసిన భాజపా ఇక శవప్రాయమేనా?

అధికారం వచ్చిన మరునాటి నుంచే చెయ్యాలసిన పని తీరిగ్గా ఎన్నికల ముందు మొదలుపెట్టడంలోని తెదెపా నాయుడి రాజకీయం అబ్బురపరిచేలా ఉంది!హోదా ఇవ్వలేం,ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు థాంక్సు చెప్పింది తనే కదా!అన్నిసార్లు మొండిచెయ్యి చూపిస్తున్నప్పుడు మర్యాదకి రెండుసార్లు చూసీ చూడనట్టు పోయినా మూడోసారి నుంచే చెయ్యాల్సిన గొడవ అన్ని లెక్కలూ వేసుకుని తినడానికి భాజపాతో అవసరం ఉన్నంతవరకు వూరుకుని ఇంక తినడానికేం లేదన్నట్టు ఇప్పుడు రెచ్చిపోవడం నిజంగా తినమరిగిన రాజకీయ లక్షణమే!ప్రజలకి నిబద్ధుడైనవాడు ఎవ్వడూ ఇంతకాలం కేంద్రం రాష్ట్రం మీద చూపుతున్న వివక్షని భరించడు!

తెలుగుదేశం పట్ల నాకు ఎలాంటి అనుమానమూ లేదు - అన్ని రాజకీయ పార్టీల లాగే సొంత ప్రాభవం కోసం అంగలార్చే మనుషుల గుంపు మాత్రమే.జగన్ ఒక్కడే అవినీతిపరుడని తెదెపా పులుగడిగిన ముత్యమని నేనెప్పటికీ అనుకోను - వాడు దొరికిన దొంగ వీళ్ళు దొరకని దంగలు, అంతే!నైతికత అనేది వ్యక్తిగత స్థాయిలో గౌరవాన్ని పెంచుతుంది గానీ మొత్తం సమాజానికి సంబంధించిన సంస్థల విషయంలో ఆ సంస్థ ఆదాయాన్ని పెంచే సమర్ధతయే గౌరవాన్ని తెస్తుంది.

అధికారంలో ఉన్నవాడు పవిత్రంగా ఉండాలనేదిది ఆదర్శం అయితే సమర్ధత అనేది వాస్తవంలో అవసరమైనది.చిన్నప్పుడు చదివిన చందమామ కధలోనే ఆ రచయిత పెద్దయ్యాక కూడా పనికొచ్చే ఒక ఉదాహరణని కధలో చెప్పాడు.ఒక కుటుంబపెద్ద చనిపోయాక పెద్దకొడుకు కుటుంబం మొత్తానికి చెందాల్సిన ఆస్తుల్లో సొంతానికి దాచుకోవడం మొదలుపెట్టాడు.ఒక పదేళ్ళు చూశాక చిన్నకొడుకు తిరగబడి తను పెత్తనం తీసుకున్నాడు.రెండేళ్ళు కూడా గడవకముందే మిగిలినవాళ్ళు ఇతనిమీద తిరబడి పెద్దకొడుకునే మళ్ళీ రమ్మని అతని పెత్తనం కిందకి వెళ్ళిపోయారు.కీలకం ఎక్కడుంది?పెద్దకొడుకు కుటంబానికి ఆదాయం రప్పించడంలో సమర్ధుడు - పది రూపాయలు తెప్పించి నాలుగు రూపాయలు సొంతానికి దాచుకున్నా మిగిలిన వాళ్ళకి ఆరు రూపాయలు వస్తాయి గదా!చిన్నకొడుకు అన్నగారి అన్యాయం మీద తిరగబడినా కుటుంబానికి ఆదాయం పెంచడంలో అసమర్ధుడు.అసలు ఆదాయమే అయిదు రూపాయలు అయినప్పుడు తను ఎంత నీతిగా ఉండి అందరికీ పంచినా ఇదివరకటితో పోలిస్తే తక్కువే వస్తుందిగా!

ఈ రకమైన లెక్కలు మిగిలినవాళ్ళకన్న చంద్రబాబుకి ఎక్కువ తెలుసు - అందుకే అతని ఎత్తుగడలన్నీ మంచి ఫలితాల్ని ఇస్తున్నాయి!ప్రత్యేకహోదా వస్తే ఇన్‌కం టాక్స్ కట్టక్కర్లేదని అనే జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, స్టాంపు పేపరు మీద రాసిమ్మన్నా రాసిస్తా - అజ్ఞానముతో కూడుకొన్న అహంకారము శ్రీవారిది, అతని కంటె ఘనులు అతని అభిమానులు!విభజనలో అన్యాయం చేశారని కాంగ్రెసువాళ్ళని ఇరుకున పెట్టడంతో ప్రతిపక్షం ఆనేది లేకుండా ఆడుతూ పాడుతూ నెట్టుకొచ్చేసిన చంద్రబాబుకి ఎన్నికలు దగ్గిర కొచ్చాక గానీ తను ఈ ఎన్నికల లోపు పూర్తి చేస్తానన్న వాటిలో ఏదీ పూర్తి కాలేదని తెలిసింది.విభజన సమయపు అన్యాయానికి కాంగ్రెసుని బలి తీసుకున్న తెలివితోనే విభజన తర్వాత జరిగిన అన్యాయానికి బాజపాని బలి పెడుతున్నాడు - రెండింటిలోనూ తన ప్రమేయం ఉంది,కానీ బ్లేం తన మెదకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు!

జనంలో మతావేశం రగిల్చే తక్కువరకం ఎత్తుగడలు మాత్రమే తెలిసిన భాజపా వాళ్ళు క్రౌచింగ్ టైగర్ లాంటి చంద్రబాబు మొదట్లోనే ఎందుకు రెచ్చిపోలేదో అర్ధం చేసుకోలేకపోయారు - అది వాళ్ళ అజ్ఞానముతో కూడిన అహంకారము!ఒకప్పుడు కాంగ్రెసువాళ్ళు నెహ్రూనీ ఇందిరనీ చూపించి పబ్బం గడుపుకున్నట్టు ఇప్పుడు మోదీని చూపించి పబ్బం గడుపుకుందామనే సత్రకాయలే బీజేపీ నిండా ఉన్నారు తెప్పలుగ నిండిన చెరువున చేరిన కప్పల వలె- దీనివల్ల ఇవ్వాళ కాంగ్రెసుకి పట్టిన గతియే రేపటి రోజున భాజపాకీ పడుతుంది,అది ఇప్పటికే కనబడుతూనే ఉంది,అయినా వాళ్ళకి తెలియడం లేదు!అసెంబ్లీకీ పార్లమెంటుకీ తమకి కేటాయించిన నియోజకవర్గంలో తమ సత్తాను చూపించి గెలవాల్సిన చోట కూడా పైవాళ్ళ మీద ఆధారపడితే కింది స్థాయి జనంతో టచ్ పోతుంది - అన్నీ అనుకూలించి సాగినంత కాలం బాగానే ఉంటుంది గానీ ఒకవేళ హఠాత్తు పరిణామం వల్ల జనం మారిపోతే తెలుసుకోవడం కష్టమవుతుంది.కళ్ళు తెరిచి నిజం తెలుసుకునేసరికి కాళ్ళ కింద నేల కదిలిపోయి కూలిపోవడమే మిగులుతుంది.ఇవ్వాళ ఆంధ్రా నుంచి ఎంతమంది భాజపా వాళ్ళు తెదెపా బాబు పేరు తీసెయ్యండి,మోదీ పేరు చెప్పకుండా పార్లమెంటుకి సొంత బలంతో వెళ్ళగలరు?

మిగిలిన అన్ని పార్టీలకీ వాళ్ళు ఎందుకు అట్లా చేశారనే విషయంలో క్లారిటీ ఉంది.ఆఖరికి ఎందుకు అంత చెత్తగా విడగొట్టారు అనే ప్రశ్నకి కాంగ్రెసు కూడా ఎన్నికల లోపు తెలంగాణ ఇచ్చేసి ఆ గుడ్విల్ హుషారుతో రాహుల్ బుజ్జాయిని ప్రధానమంత్రిని చేసెయ్యాలనే జవాబు ఉంది,కానీ ఆంధ్రాకి అన్యాయం జరిగందని ఒప్పుకుని కూడా అదీ ఇక్కడ అధికారంలో ఉన్నది మిత్రపక్షం అని తెలిసి కూడా భాజపా ఆంధ్రాకి ఇంత అన్యాయం ఎందుకు చేసింది అనే ప్రశ్నకి మాత్రం జవాబు లేదు!

"ఒళ్ళు బలిసి!" అని తప్ప నాకైతే తిన్ననైన జవాబు కనిపించటం లేదు.బీజేపీ అనే రాజకీయ పార్టీకి ఆంధ్రాలో ఓట్లు అక్కరలేదు కాబోలు!అధికారంలో ఉన్న తెదెపాని కాదని ప్రజలు తమకి ఓటు వెయ్యాలంటే ఏం చెయ్యాలి?బుర్రలో గుజ్జున్న మనుషులైతే తాము చెయ్యాల్సింది చేసి చూపించి బాబు సొంతానికి తంటున్నాడనో,మేమయితే అంతకన్న ఎక్కువే చేస్తామనో చెప్పుకోవాలి - అది తిన్ననైన రాజకీయం!చూడబోతే మోదీ దగ్గిర్నుంచి ఆంధ్రాలో గల్లీ స్థాయి కార్యకర్తల వరకు అధికారంలోకి రావడానికి పనికొచ్చే తిన్ననైన రాజకీయం అంటే ఏమిటో తెలిసినవాడు ఎవడూ లేనట్టుంది.ఇప్పుడు చూడండి, నిన్నటివరకు గమ్మునున్న అన్ని మిత్రపక్షాలూ బాబు వెనక చేరి గొంతు పెంచాయి!సందట్లో సడేమియా అన్నట్టు దక్షిణాది రాష్ట్రాలు అన్నీ బీమారీ రాష్ట్రాల పేరుతో మా పీక నొక్కితే వూరుకోం అని ఆల్టిమేటం కూడా ఇచ్చాయి.కన్నడ ముఖ్యమంత్రి లింగాయతుల గోలని రేపెట్టింది బీజేపీకి చుక్కలు చూపించడానికే.తమిళనాడులో ఇప్పటికే ఉత్తరాది పార్టీ పేరుతో బ్యానర్లు కట్టి తిడుతున్నారు.ప్రస్తుతానికి దక్షిణాదిలో గట్టి స్నేహితుడు చంద్రబాబు ఒక్కడే.అపారమైన రాజకీయ పరిజ్ఞానం ఉన్న అతన్ని భాజపా తక్కువ అంచనా వేసి ఇప్పటికే పీకలోతున ముణిగిపోయింది.ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని అతన్ని సంతృప్తి పరచకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారం కష్టమే!

ఇప్పుడిక అతన్ని తప్పులు పట్తడం లాంటి చెత్తపనులు కూడా మరింత ప్రమాదం.ఏ విధమైన బేరసారాలూ లేకుండా చంద్రబాబు అడిగినవన్నీ ఇవ్వడం వల్లనే ఇప్పుడు బీజేపీ ముప్పుని తప్పించుకోగలదు.ప్రస్తుతానికి గండం గడిచి గట్టెక్కినాక భాజపా అధిష్ఠానం చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఆంధ్రా భాజపాలో ఉన్నవాళ్లని మెడపట్టి వేరే పార్టీల్లోకి పోయినా పర్లేదని నిర్ణయం తీసుకుని గెంటెయ్యాలి - సొంత ప్రతిభ మీద గెలవలేక మోదీ జపం చేసే ఈ దద్దమ్మలు పార్టీలో ఉండటం వల్ల నష్టమే తప్ప లాభం లేదు.రెండు స్థానాల నుంచి రెండు వందల పైచిలుకు స్థానాలు తెచ్చుకున్నప్పుడు పనిచేసిన అంకితభావం ఉన్నవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి.క్షేత్రస్థాయిలో తిరిగి పని చేస్తే మంచి ఫలితం ఉండేచోట ఈ దద్దమ్మ మీద ఆధారపడటమే ఆంధ్రాకి సంబంధించి భాజపా అధిష్ఠానం చేస్తున్న అతి పెద్ద తప్పు!

"కారే రాజులు?రాజ్యముల్ గలుగవే?వారేరీ?సిరి మూటగట్టుకు పోవంజాలిరే!" అన్న కవివాక్యం హిందూత్వం రంగరించుకున బాహజపాకి తెలియకపోవడమే విచిత్రం!మోదీ చరిష్మా తగ్గిపోయింది,అతను ముళ్యమంత్రి స్థానానికి తప్ప ప్రధానమంత్రి స్థానానికి తగడని తెలిసిపోయేలోపు భాజపా తన తప్పుల్ని తను తెలుసుకుని సరిదిద్దుకోకపోతే కాలం కొట్టే దెబ్బకి గింగిరాలు రిరిగి మళ్ళీ రెండు సీట్లకి పరిమితం కావాల్సి ఉంటుంది - కాలం ఎవరికీ రెండు అవకాశాలు ఇవ్వదు


ఆంధ్రాకి అన్యాయం చెయ్యాలనుకున్నవాడు ఎవ్వడూ బతికి బట్ట కట్టడు!

Saturday 10 February 2018

జంబూ ద్వీప రహస్యం అను ప్రాచీన భారతీయ భూభౌతికశాస్త్ర పాఠము!

సనాతన ధార్మికులు దృశ్యమాన ప్రపంచంలోని సమస్తాన్నీ గణితశాస్త్రం యొక్క సహాయంతోనే ఎక్కువ అర్ధం చేసుకున్నారు.దైవాన్నీ ప్రకృతినీ జీవాన్నీ దైవానికీ జీవునికీ మధ్య ఉండే అనుబంధాన్ని కూడా గణితశాస్త్రం సహాయంతోనే నిర్వచించారు.దైవాన్ని స్తుతించే ప్రార్ధనల్లో కూడా వైజ్ఞానిక విషయాలు,ముఖ్యంగా గణితశాస్త్రపరమయిన విషయాలు స్ఫురణకి రావడం చాలా మామూలు విషయం!ప్రాచీన భారతీయ ఋషులు గణితశాస్త్రానికి "1" నుంచి "9" వరకు అంకెలనీ వాటికి "0" అనే శూన్యాంకం/పూర్ణాంకం అనే మరొకదాన్ని కలిపి విడదీసి చూసి వాటి వల్ల వచ్చే అన్ని రకాల సంభావ్యతలనీ కలిపి కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగహారాలు, వర్గాలు, వర్గమూలాలు, జ్యామితి వంటి విషయాలను ఎట్లా ప్రతిపాదించగలిగారో తల్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది!
ఎందుకంటే, ఒక విషయానికి శాస్త్రం హోదా ఇవ్వాలంటే ఆ విషయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఇతరులు ఆ విషయాన్ని గురించి అడిగే "1.దీనితో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యని ఎలా పరిష్కరించగలవు?2.నువ్వు చెప్పే విషయం సమస్యని పరిష్కరిస్తుందనే నమ్మకం ఏమిటి?3.మేము దీనిని ఎందుకు నమ్మాలి?" వంటి ప్రశ్నలకి జవాబు చెప్పాలి.శాస్త్రం అని చెబుతున్న దేనికైనా ప్రయోజనమే పరమార్ధం కాబట్టి శాస్త్రసంబంధమయిన విషయాల్లో నేను చెప్పాను గాబట్టి మీరు నమ్మితీరాలనే అనవసరమయిన సుత్తిని ఎవరూ ఒప్పుకోరు - "అసందర్భం వచనం బృహస్పతి రపి బ్రువన్ విద్వజ్జన మవమానం లభతే,తధ్యం" అని మన పెద్దలు కుండ బద్దలు కొట్టి చేప్పేశారు!
"1" అని మనం చూసేది కేవలం గుర్తు మాత్రమే - దాని వెనక ఉన్న భావానికి ఇది రూపం. ఈ భావం ప్రకృతిలో ఉన్నదాన్ని చూసి వర్ణించటం కాదు,వ్యక్తం నుంచి అవ్యక్తం వరకు ఎంత వెతికినా ఒకటి అనేదానికి అస్తిత్వం లేదు!మరి ఏమిటి దీని స్వరూపం?నేను మిమల్ని గందరగోళానికి గురి చెయ్యడం లేదు - తొలినాడు ఓక ఋషి గానీ కొందరు ఋషులు గానీ అంతకుముందు లేనిదీ ఇప్పుడు అది లేకపోతే మనం ఇక్క క్షణం కూడా బతకలేనిదీ అయిన ఒకటి అనేదాన్ని కనుక్కోవడం ఎట్లా సాధ్యపడిందో అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను!ఈ ఒకటి అనేది మన చుట్టూ ఉన్న ప్రకృతిని అర్ధం చేసుకుని దానినుంచ్గి ప్రయోజనం పొందటానికి ప్రాచీన భారతీయ విజ్ఞానుల మేధస్సు నుంచి పుట్టిన జ్ఞానరాశికి సంకేతమే తప్ప భౌతిక ప్రపంచంలో గానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో గానీ దీనికి అస్తిత్వం లేదు - అర్ధమైందా! ప్రాచీన భారతీయ విజ్ఞానులు సిద్ధాంతీకరించిన ఈ ఒకటి అనే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, దానిని ఉపయోగించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఉపయోగించితే కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి - అన్నింటి కన్న విచిత్రం ఏమిటో తెలుసా, వారు ప్రతిపాదించిన తర్వాతనే ఇది ఉనికిలోకి వచ్చింది తప్ప అంతకు ముందు దీనికి అస్తిత్వమే లేదు!అంతకు ముందు ఎలా బతికారో తెలియదు గానీ ఇప్పుడు మాత్రం దీన్ని తల్చుకోకుండా ఒక్క క్షణం కూడా బతకలేం:-)
"2" నుంచి "9" వరకు ఉన్న అంకెలు "1"కి బహువులే గానీ ప్రతి అంకెకీ దేనికి ఉండే ప్రాధాన్యత దానికి ంది.సప్తమం అనే "7" గుర్తుకు రాగానే మొదట సప్తస్వరాలు గుర్తుకు వస్తాయి,ఇంకొంచెం ముందుకు వెళితే గంగ. యమున, సరస్వతి, గోదావరి, నర్మద, సింధు, కావేరి అనే సప్తనదులూ రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర అనే సప్త ధాతువులూ సువర్ణ, రజత, కాంస్య, తామ్ర, సీస/నాగ, వంగ, లోహ అనే సప్త లోహాలూ బ్రాహ్మి, మహేశ్వరి, కుమారి, వైష్ణవి, వారాహి, ఐంద్రీ, చాముండి అనే సప్త మాతృకలూ జంబూ, ప్లక్ష ,శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపాలూ వస్తాయి.సంధ్యావందనం చేసే ప్రతి బ్రాహ్మణుడూ జంబూద్వీపే భరతవర్షే అని మొదలుపెట్టి తను ఉన్న ప్రాంతం అడ్రసు చెప్పి ఇక్కణ్ణించి నేను ఈ సంకల్పం చెబుతున్నాను అని తన రెక్వెస్టుని పోష్తు చేస్తాడు.
అదేమిటో గానీప్రకృతి మొత్తం లెక్కల మయమే - ఎక్కడ చూస్తే అక్కడ జామెట్రీ రఫ్ఫాడించేస్తంది దాన్సిగదరగ!అంతకి ముందు ఎట్టా బతికారో తెలీదు గానీ ఈ దిక్కుమాలిన హిండియా గడ్డాల వెధవలు కనిపెట్టాక మోనాలిసా చిరుబవ్వు యెనకాతల సెక్రెట్టుకీ ట్రయాంగిల్సూ, గోల్డెన్ రేషియోలూ, ఫ్రాక్టల్ మేధమేటిక్సూ కారణం అనేస్తన్నారు - ఎదవ గోల! "తొక్కలో సైన్సు!" అనీ "తొక్కలో హిందూత్వం!" అనీ "తొక్కలో కమ్యూనిజం!" అనీ "తొక్కలో క్యాపిటలిజం!" అనీ అనగలిగిన వాళ్ళు కూడా "తొక్కలో డబ్బు!" అని అనలేరు గదా!అలా అనగలిగినవాళ్ళు కూడా "తొక్కలో సున్నా!" అనీ "తొక్కలో ఒకటి!" అనీ ఆనలేరు గదా!అదీ ఇండియన్ బ్రామిన్స్ పవర్!మెళ్ళో వేసుకునే జంఝప్పోగుకి కూడా అనేకానేక రకాలైన లెక్కలు వేసి భక్తినీ ,లెక్క తప్పావో చస్తావనే భయాన్నీ మేళవించి సాటి బ్రాహ్మల్నే బెదరగొట్టి అదుపులో ఉంచగలిగిన ఘనాపాటీలకి మి=గతా కులాల వాళ్లని భయపెట్టటం ఒక లెక్కా!భయపెట్టడంలో గూడ ఒక లెక్కుంది,నువ్వంటే భయమో భక్తో లేంది ఏడేళ్ళ పిల్లాడు కూడా నీ మాట వినడు:-P)భక్తి ఉండాలంటే నువ్వు వాడికి మేలు చెయ్యాలి దానికి రాజ్యం చేతులో ఉండాలి!ఎదటివాళ్ళకి మేలు చెయ్యకుండా వాళ్ళని నీకు గులామును చేసుకోవాలంటే భయపెట్టటం ఒక్కటే దారి - నీకు తెలియనిది నాకు తెలుసు, దానితో నీకు ప్రమాదం కలిగించగలను అని చెప్పటం!అందరూ సమానమే అంటారు, కొందరు మాత్రమే అందలాలు ఎక్కుతారు.అందరిలోనూ దేవుడు ఉన్నాడంటారు,కొందరు మాత్రమే ఐశ్వర్యాలను పొందుతారు.వాడు గతజన్మలో పుణ్యం చేశాడు గాబట్టి ఈ జన్మలో భోగాలు అనుభవిస్తున్నాడు అంటారే గానీ వాడు ఈ జన్మలో పాపాలు చేస్తూ డబ్బు సంపాదించడం తప్పని చెప్పరు!వాళ్ళు తప్పులు చేస్తున్నారని తెలిసి కూడా తప్పులు చెయ్యొద్దని చెప్పకుండా శిక్షను మాత్రం తగ్గించడానికి వీళ్ళు పూజలు చెస్తారు - ఔరా బ్రాహ్మణు లెంతటి డాష్ డాష్ డాష్ గాళ్ళు!ఏడేళ్ళ పిల్లాడికి వచ్చే అనుమానాల్ని కూడా తీర్చలేనివాళ్ళు మాకు అన్నీ తెలుసునంటారు - హ్హేవిటో!సాఖ్యం సాప్తపదీనం అని ఏడుని శుభప్రదం చేశారా!మరిరైతులు ధాన్యం కొలిచేటప్పుడు మాత్రం "ఆరున్నొకటి!" అంటారు.ఎందుకయ్యా అంటే "ఏడుస్తూ ఏడు అనటం దేనికి?" అంటారు - ఎవరు చెప్పారు వాళ్లకి ఏడులో ఏడుపు ఉందని!రైతులు వాళ్ళకి వాళ్ళు అనుకున్నారా?అది కూడా బ్రాహ్మలే చెప్పారా?మిగిలిన అన్ని నంబర్లకీ లేని వివక్ష ఏడుకే ఎందుకు తగులుకుందో పాపం - దాని ఖర్మ అట్లా కాలింది కాబోలు!
చెప్పినపుడు ఒక్కొక్క అంకెకీ ఎంత గంభీరమైన అర్ధం చెప్పినా ఇవ్వాళ ఎవడిక్కావాలి?ఉచ్చకి "ఒకటికి పోవాలి సారూ!" అని ఒకవేలు చూపించడం ఇంకోదానికి రెండువేళ్ళు చూపించడం పిలగాయలకి ఎవరు నేర్పుతున్నారో!ముడుచుకు పడుకుంటే "మూడంకె వేశావేం?" అంటారు."నాలుగో ఎక్కం రాదు గానీ నా అంత పండితుడు లేడన్నట్టు!" అని వెక్కిరిస్తారు."అయిదు వేళ్ళూ నోట్లోకి పోతున్నాయా లేదా?" అని ఆరా తియ్యకపోతే సంపాదన సరిపోతున్నదా లేదా అని సూటిగానే అడగొచ్చుగా!పనీ పాటా లేకపోయినా హదావిడి చేస్తూ మిగిలినవాళ్లకి అడ్డమొచ్చేవాళ్ళని "వీడో ఆరో వేలు గాడు!" అని విసుక్కుంటారు.
అంకెల్ని గురించి తెలుసుకోవటం విసుగు పుట్టకుండా ఉండాలంటే, లెక్కలు హుషారుషారుగా చెయ్యగలగాలంటే వైదికగణితం చదవడం/నేర్చుకోవడం తప్పనిసరి - స్కూళ్ళలో కాలేజీల్లో ఎలాగొ చెప్పరు,హిందూ ప్రార్ధనే బూతు లెక్కన మారిపోయింది,సొంతంగా చదువుకోవడమే మంచిది!ఒకసారి దానికి అలవాటు పడితే క్యాలిక్యులేటర్లూ కంప్యూటర్లూ వాటి మూలాన జరిగే వ్యాపారాలూ ఢమాల్ - మరి ప్రభుత్వం వారు ఎట్లా సపోర్టిస్తారు?
అన్నీ వేదాల్లో ఉన్నాయిష గాళ్ళు అని వెక్కిరిస్తారు గానీ రైలూ,బస్సూ,పిజ్జా లాంటి సమస్తమూ ఉంటేనే అన్నీ ఉన్నట్టా?ఏది తెలుసుకుంటే మనిషి సుఖంగా బతకగలడో అది తెలిస్తే చాలదా?తీరిక ఉండి తెలుసుకోవాలని అనిపిస్తే అన్నీ తెలుసుకోవచ్చు!కానీ తీరిక ఎప్పుడు వస్తుంది?అప్పటికప్పుడు నువ్వొక పని చెయ్యకపోతే చస్తావు అని తెలిస్తే మొదట ఆ పని పూర్తి చేశాకనే తీరిక వస్తుంది - అవునా?మాతలు నేర్చిన వెంటనే చదువు మొదలుపెట్టాలి.చదువు పూర్తవగానే ఉద్యోగం తెచ్చుకోవాలి.ఉద్యోగజీవితం ఎపుడు ముగిసిపోతుందో అని భయపడినప్పుడు కూడా తీరిక రాదు.ఉద్యోగజీవితం భద్రమైనది అయితే అపుడు మిగిలిన విషయాల గురించి పట్టించుకోవచ్చు!ఇంతవరకు మనం సంపాదించే జ్ఞానం సమస్తం ధనం చుట్టూరానే తిరుగుతుంది,తిరగాలి,తిరకపోతే కుదరదు.ఇది చతురాశ్రమాల్లో మొదటి రెండూ అయిన ధర్మార్ధ సాధన,ఇది పూర్తి కాకుండా మిగిలిన విషయాలని గురించి ఆలోచిస్తే వీటికి చిల్లు పడుద్ది - పంబ రేగిపోద్ది!
సనాతన ధర్మానికి ఆదికాలంలో తీరికెక్కువ - సోమరితనం కాదండోయ్!పని ఉన్నప్పుడు రాక్షసంగా చేసేసి పనయ్యాక తీరికసమయంలో కళాత్మకతని పోషించారు - లెక్కల్ని కూడా చందస్సులో ఇరికించేటంత తీరిక దొరికేది.ఇప్పటివాళ్ళకి తామెందుకు పరిగెడుతున్నారో కూడా తెలుసుకోలేనంత మూర్ఖపు పరుగులో ఉన్న మతి కూడా పోయి చస్తంది,ఇంక అప్పటివాళ్ళ స్థాయిలో ఆలోచించడం కుదిరేనా పెట్టేనా?
గంగా సింధు సరస్వతీ ప్రాంతం ప్రపంచంలోని అత్యనత్ సారవంతమైన భూముల్లోకలా అతి శ్రేష్ఠమైనది!మనుషులు చూస్తే పాత రాతి యుగం నుంచే మిగిలిన అన్ని చోట్ల కన్న అన్ని పనుల్లోనూ ఆరితేరిపోయిన వాళ్ళు!సారవంతమయిన భూమిని రియల్ ఎస్టేట్/సెజ్/ఎకనమిక్ కారిడార్ పేరుతో ధ్వంసం చేయడం తప్పు అనేది ఇప్పటివాళ్ళకి చెవినిల్లు గట్టుకు పోరినా ఆర్ధం కాదు గానీ అప్పటివాళ్ళు మాత్రం ఏ భూమి ఏ రకమయిన ఉత్పత్తికి శ్రేష్ఠమో దానికే ఉపయోగించేవాళ్ళు!ఏ పని చేసినా తెలిసి చేసేవాళ్ళు గాబట్టి కష్టమో అయోమయమో అనిపించేది కాదు,పూర్తయ్యాక కలిగే గర్వాన్ని ఇతర్లతో పంచుకోవాలని అనిపిస్తుంది కదా - అందుకోసమయినా తీరిక కల్పించుకునే వాళ్ళు!"చూశావా,ఎంత ఘనకార్యం చేశానో!" అని ఒకడంటే "దీనికేనా?నేను చేసింది చూశావా!" అని మరొకడు అంటాడు.ఎవరు తక్కువ?అందరూ అందరే!
యుద్ధం మొదలవటానికి ముందు నిద్రపట్టక సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు చాలా విషయాలు అడుగుతాడు - వాటిల్లో ఒకటి ఈ రాజులందరూ ఇలా కొట్టుకు చచ్చే భూమి గురించి చెప్పే భూమిపర్వం.ఆ సమయంలో సంజయుడు రోదసి నుంచి చూస్తే భూమి ఎల అకనబడుతుందో వివరించాడు ఒక శ్లోకంలో:
यथा हि पुरुषः पश्येदादर्- शे मुखमात्मनः- ।
एवं सुदर्शनद्व- ीपो दृश्यते चन्द्रमण्ड- ले॥
द्विरंश- े पिप्पलस्तत- ्र द्विरंशे च शशो महान्।।-
(भी- ्म पर्व, महाभारत)
Meaning:-
अर्थ- जैसे पुरुष दर्पण में अपना मुख देखता है, उसी प्रकार यह द्वीप (पृथ्वी) चन्द्रमण्ड- ल में दिखाई देता है। इसके दो अंशों में पिप्पल (पीपल के पत्ते) और दो अंशों में महान शश (खरगोश) दिखाई देता है।
Just like a man sees his face in the mirror, so does the Earth appears in the Universe. In the first phase, you see Peepal leaves and the next phase you see a rabbit.

ఈ శ్లోకంలోని భావాన్ని గ్రహించి రామానుజాచార్యులు ఒక బొమ్మని గీస్తే చూసీన్వాళ్ళు నవ్వారు.కానీ ఇందులో ఉన్న నిజం తెలియాలంటే ఈ బొమ్మని పైకీ కిందకీ తిరగేసి చూడాలి - చూస్తున్నది రోదసి నుంచి గనక కుడి,ఎడమ,పైన,కినద్ అనేవి తారుమారు కావచ్చు ఒకోసారి!
ఎంత తీరిక దొరికితే మాత్రం ఇంత విచిత్రమా?ఒకాయన భూమిని రోదసి నుంచి చూస్తే ఎట్లా ఉంటుందయ్యా అని అడిగితే తడుముకోకుండా ఇట్లా ఉంటుందయ్యా అని చెప్పినవాడు అప్పటికే రోదసి నుంచి భూమిని చూశాడనే అనుకోవాలి గదా!ఆధునిక విజ్ఞానశాస్త్ర పారంగతులూ గతితార్కికభౌతికవాద సిద్ధాంతుల ప్రకారం యూరోపియన్లు జెట్లూ జాకెట్లూ రాకెట్లూ కనుక్కున్నాకనే రోదసియాత్రలు మొదలైనాయి కదా - మరి, మహాభారత రచన ఎప్పుడు జరిగింది?
అప్పటికే భూమి మీద ఏడు ఖండాలు ఉన్నాయనీ వాటి ఆకారాలు ఇలా ఉంటాయనీ తెలియడమే కాకుండా తన కావ్యంలో పొడుపుకధలా ఒక రచయిత వాడుకున్నాడంటే ఏమిటి అర్ధం?రామాయణ,భారత,భాగవత కధల్లో ప్రస్తావనకి వచ్చే ఇలాంటి ఖగోళ భూగోళ అసంబంధమైన విషయాలు రచయిత తనకి తెలిసిన మొత్తం విషయంలో అక్కడక్కడా ఏరుకుని చెబుతున్న టిట్ బిట్స్ మాత్రమే!వాల్మీకి కానివ్వండి,వ్యాసుడు కానివండి,భాసుడు కానివ్వండి - వీళ్ళ ప్రధానమైన వ్యాపకం రచన,వీళ్ళని శాస్త్రకర్తలు అని యెవరూ అనలేదు!తనలోనూ తనచుట్టూ అసలు జ్ఞానం చాలా ఉంటే ఇవ్వాళ్టి డాన్ బ్రౌన్ మాదిరి కధలో ఇరికిస్తే బాగుంటుందని చెప్పినవి కూడా మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయంటే అప్పటికి తెలిసిన మొత్తం విషయం ఎంత ఉంటుందో ఆలోచించండి!
ఇప్పుడు మనం చూస్తున్న ఖండాలు ఏడూ అప్పటి వాళ్ళు చెప్తున్న ద్వీపాలు ఏడూ వేరు వేరు , కొందరు పొరబడుతున్నట్టు ఈ రెండింటికీ ఎలాంటి సంబంధమూ లేదు!పోతన గారు తెనిగించిన వ్యాసప్రోక్తమైన బాగవత పురాణం యొక్క పంచమస్కంధంలో ప్రియవ్రతుడనే గొప్ప రాజు ఈ సప్తద్వీపాలు ఏర్పదటానికి కారణం అని చెప్తున్న కధ ఉంది.ఈ ప్రియవ్రతుడు స్వాయంభువ మనువు కుమారుడు.
5.1-13-ఆ.
సత్యసంధుఁడైన స్వాయంభువుం డను
మనువు బ్రహ్మచేత మన్ననఁ దగ
నంది యంత నారదానుమతంబునఁ
దనదు సుతుని రాజ్యమునను నిలిపె.
రాజైన ప్రియవ్రతుడు భగవంతుని ఆదేశంతో కర్మతంత్రపరుడైనా శ్రీహరి పాదపద్మాలను స్మరిస్తూ, రాగద్వేషాలను వదలిపెట్టి అనుదినం నిత్యానందాన్ని అనుభవిస్తూ ప్రజలను గొప్పగా పరిపాలించాడు.విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతి అనే యువతిని పెళ్ళాడి ఆమెవల్ల శీలంలోను, ప్రవర్తనలోను, గుణంలోను, రూపంలోను, పరాక్రమంలోను, ఔదార్యంలోను తనతో సమానులైన ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనే పదిమంది కొడుకులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. వారిలో కవి, మహావీరుడు, సవనుడు అనేవారు చిన్నవారైనా బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మవిద్యా నిష్ణాతులై శాంతమే స్వభావంగా గలవారై పరమహంస యోగాన్ని పొందినారు. సమస్త జీవులకు ఆవాసమైనవాడు, సంసార భయ భ్రాంతులకు శరణ్యమైనవాడు, సర్వాంతర్యామి, భగవంతుడు అయిన వాసుదేవుని పాదపద్మాలను సర్వదా స్మరించడం వల్ల లభించిన భక్తియోగం ప్రభావంతో మనస్సు మరింత పరిశుద్ధం కాగా ఈశ్వర తాదాత్మ్యం పొందారు.
ఆ ప్రియవ్రతుడు మరొక భార్యవల్ల ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే ముగ్గురు కుమారులను కన్నాడు. వారు చాలా గొప్పవారు. మనువులై మన్వంతరాలకు అధిపతులయ్యారు. ముందు పుట్టిన కవి, మహావీరుడు, సవనుడు నాశనం లేని మోక్షపదాన్ని అందుకున్నారు. తరువాత ప్రియవ్రతుడు తన బాహుబలంతో సమస్త శత్రుసమూహాన్ని ఓడించాడు. బర్హిష్మతి మీద అతిశయించిన అనురాగంతో యౌవన వికాసాలైన హాసలీలావిలాసాలలో మనస్సును లగ్నం చేసి వివేకం కోల్పోయిన వానివలె అఖండ భోగాలను అనుభవించాడు.ఈ విధంగా ప్రియవ్రతుడు పదకొండు అర్బుద సంవత్సరాలు రాజ్యం చేశాడు. 
ఒకనాడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్న సూర్యునికి ఆవలి భాగంలో కనిపించే చీకటిని రూపుమాపాలని అనుకున్నాడు. భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించడం వల్ల కలిగిన శక్తితో సూర్యుని రథంతో సమానమై తేజోమయమైన రథం ఎక్కి రాత్రులను పగళ్ళుగా మారుస్తానంటూ రెండవ సూర్యునిలాగా వెలిగిపోతూ ఏడుమార్లు సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. అప్పుడు ప్రియవ్రతుని రథచక్రాలు గాళ్ళ వలన పడిన దారులు సప్త సముద్రా లయ్యాయి. ఆ గాళ్ళకు నడుమ ఉన్న భూమిపై సప్తద్వీపాలు ఏర్పడ్డాయి.
జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మలీద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాకద్వీపం, పుష్కరద్వీపం అనేవి సప్తద్వీపాలు. వాటిలో జంబూద్వీపం ఒక లక్ష యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇలాగే ఒకదాని కొకటి రెట్టింపు వైశాల్యం కలిగి వరుసగా ఏడు ద్వీపాలు ఉన్నాయి. వాటి నడుమ ఉప్పు సముద్రం, చెరకు సముద్రం, మద్యసముద్రం, ఘృతసముద్రం, పాల సముద్రం, పెరుగు సముద్రం, మంచినీటి సముద్రం ఏడు సముద్రాలు ఉన్నాయి. ఒక ద్వీపంతో మరొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. అవి ద్వీపాల చుట్టూ అగడ్తల లాగా ఉన్నాయి. ఈ ద్వీప సముద్ర నిర్మాణాలు సకల జీవులకు ఆశ్చర్య జనకాలు.అటువంటి ద్వీపాలలో ప్రియవ్రతుడు తనంతటివారైన ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, మేధాతిథి, వీతిహోత్రుడు అనే కుమారులకు పట్టం కట్టించాడు.
ఒక్క జంబూద్వీపమే లక్ష యోజనాలు,వరస ప్రకారం ప్లక్షద్వీపం రెండు లక్షల యోజనాలు ఉంటుంది,శాల్మలిద్వీపం నాలుగు లక్షల యోజనాలు - అంత ఏరియాను కలిగియుండే సీను మనం ఉంటున్న భూమికి ఉందా?లేదు గాక లేదు!సనాతన ధార్మిక సాహిత్యంలోని ప్రతి ముక్కనీ ఆధునిక విజ్ఞానశాస్త్రం యొక్క గీటురాయితో పరీక్షించి చూసి దాని ప్రకారం నిజమని తెలిస్తేనే ఒప్పుకోవాలనే దురద నాకు లేదు - మీకు ఆ దురద ఉంటే వొదిలించుకోవడం తప్ప మరో మార్గం లేదు.
ప్రియవ్రతుడు తన కొడుకులను ఈ ద్వీపాలకు అధిపతులను చేశాడని చెప్పటాన్ని బట్టి భూమి కాక మానవులు నివసించదగిన గ్రహాలు విశ్వంలో మరొక ఆరు ఉన్నాయనీ వీటి మధ్యన రాకపొర్కల సంబంధాలు కూడా ఉండేవనీ లెక్కవేసి చెబుతున్నట్టు అర్ధం కావడం లేదూ!
సనాతనధార్మికసాహిత్యంలో భూమిని గురించిన పదజాలంలో బూమండలం, భూగోళం, భూలోకం, భూఖండం అని రకరకాల వర్ణనాత్మకమైన వైవిధ్యం కనబడుతుంది.వీటిమధ్యన తేడా తెలిస్తే ప్రాచీనులు చెప్పిన సప్తద్వీపాలకీ ఆధునికులు చూస్తున్న సప్తఖండాలకీ ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది.ఆధునిక విజ్ఞానశాస్త్రం ఇప్పటికీ భూకేంద్రక సూర్యకేంద్రక సిద్ధాంతాలను రెంటినీ వాడుతున్నట్టే ప్రాచీన భారతీయ మేధావులు కూడా విశ్వనిర్మాణానికి రెండు విధాలైన విశ్లేషణలు చేశారు.దేవీభాగవతం మొదలుకుని దాదాపు అన్ని పురాణాల్లోనూ అనంతకోటి విశ్వాలలోని అని విశ్వాలకు వలెనే మన విశ్వానికి కూడా పధ్నాలుగు లోకాల విరాట్పురుష నిర్మాణానికి భూమియే కేంద్రం! బీరువా అరల్లా కనిపించే బ్రహ్మాందభాండపు నిర్మితిలో ఈ భూమి ఉన్న అరను భూలోకం అంటారు.ఈ నిర్మితి ప్రకార్మ్ సూర్యుడు,చంద్రుడు,ఇతర గ్రహతారకలూ పైన ఉన్న అరలో ఉంటాయి - విశవ్సృష్టి రహస్యం గురించి చెప్పిన చోట విస్తరించి చెప్పాను కదా!అంటే,ఈ భూలోకంలోని విశ్వసాగరంలో వలయాల అమరిక ఉంది,ఒకో వలయంలో ఒక్కో ద్వీపం ఉన్నది,లేదా వలయమే ద్వీపం కూడా కావచ్చు!
వీటిని విదియ్యటం కోసం విశ్వద్రవ్యం సప్త సాగరాల రూపం దాల్చింది - ఇది బ్రహ్మాండంలోని భూలోక వర్ణన.ఈ విశ్వనిర్మాణం ప్రకారం భూమియే విశ్వానికి కేంద్రంలో ఉండి తన చుట్టూ తాను కూడా తిరగకుండా అచలమై ఉంటే సూర్యుడు భూమికి నిలువునా సాగుతున్న విశ్వాక్షం చుట్టూ పెద్ద వలయ మార్గంలో అక్షానికి కట్టివేయబడిన గానుగెద్దు వలె ఏకచక్రరధంతో తిరుగుతూ ఉంటాడు.చంద్రుడు మరొక అంతరువులో చిన్న వలయంలో విశ్వాక్షం చుట్టూ తిరుగుతూ ఉంటాడు.అయితే,సూర్య సిద్ధాంతిక వంటి శాస్త్ర సంబంధమయిన గ్రంధాలు మాత్రం సూర్యుడు స్థిరంగా ఉండి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్న నమూనాని స్వీకరించి గణితశాస్త్రపరమైన విషయాలతో నిండి ఉన్నాయి.అంత మాత్రాన పురాణకధల్లో బ్రహ్మాండవర్ణన చేసినవాళ్ళకి  శాస్త్రజ్ఞానం లేదని కాదు - పురాణ కధలు స్థితిజ రూపాన్ని వర్ణిస్తే శాస్త్రచర్చలు గతిజ వేగాన్ని విశ్లేషిస్తునాయి
"ఇంతకీ ఇప్పుడు మనం చూస్తున్న భూఖండాల సంగతి ఏమిటి?కేవలం తిరగేసిన మ్యాపును పొడుపుకధలా చెప్పేసి వదిలేస్తే యెట్లా?చల్లకొచ్చి ముంత దాచినట్టు అవీ ఇవీ ఒకటి కాదోచ్, ఇంక ఇంట్టికెళ్ళిపోండి - తూచ్!" అనిగాని హరిబాబు ఇంతటితో వొదిలేస్తాడేమోనని మీరు బెంగ పెట్టుకోకండి.నేను నాగ సినిమాలో కుర్ర యంటీయార్ లాంటోణ్ణి - "నేను ఏదీ ఒకంతట మొదలెట్టను, మొదలెడితే కంపుకంపు చేసేవరకు ఆగను!"
నిజానికి ప్రాచీన భారతీయ మేధావులు భూమిపైన తొమ్మిది భూఖండాలు ఉన్నాయని చెప్పారు.దాదాపు అన్ని పురాణ కధల్లోనూ చిన్న చిన్న తేడాలతో ఒకే రకమైన విశ్లేషణలు కనబడుతున్నాయి.మొదట ఈ ముఖ్యమైన సారూప్యతలని గురించి తెలుసుకుంటే తర్వాత చెప్పబోయే విషయాలని అర్ధం చేసుకోవడం తేలికౌతుంది - అప్పుడు భరతవర్షం అన్నది గంగ, సింధు, బ్రహ్మపుత్ర, నర్మద, కావేరి, గోదావరి వంటి స్వాదుజలనదీప్రవాహాల మధ్యన కొలువై ఇప్పుడు మనం నివసిస్తున్న భారతదేశం,ఉత్తరధృవం నుంచి పైకి సాగి బ్రహ్మలోకం వరకు విస్తరించి మేరు శిఖరం ఉన్నది,ఇప్పుడు కనిపిస్తున్న భూఖండాలు కూడా మేరుశిఖరం మొదలవుతున్న చోట ఉన్న ఉత్తరధృవం మందారకేసరసదృశమై ఉంటే నాలుగు వైపులకీ విస్తరించిన సముద్రం మీద తేలియాడుతున్నట్టు కనిపించే భూఖండాలు కుసుమదళాల వలె అమరి ఉన్నాయి.
రెండు మూడు వరసల వలయాల ఈ అమరికలో భరత,కేతుమల,భద్రాశ్వ,కురు అనేవి ముఖ్యమైనవివ్.దక్షిణదిశకు సాగితే మొదట కింపురుషవర్షం,దాని తర్వాత హరివర్షం,ఆఖరున భరతవర్షం వస్తాయి.ఇక మేరుశిఖరబీజస్థానం నుంచి ఉత్తరానికి సాగితే మొదట రమ్యకవర్షం వస్తుంది, దాని తర్వాత హిరణ్మయవర్షం,దాని తర్వాత ఉత్తరకురువర్షం వస్తుంది. అప్పుడు  తూర్పుకు సాగితే భద్రాశ్వవర్షం ఉంటుందని చెబుతున్న చోట ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం, అప్పుడు పడమరకు సాగితే కేతుమలవర్షం ఉంటుందని చెబుతున్న చోట ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి.తర్వాత కాలంలో జరిగిన భూఖండాల స్థానచలనం వల్ల ఇవి మనం గుర్తించలేని మార్పులకి లోనై ఉండవచ్చు, లేదా సముద్రగర్భంలో మునిగిపోయి ఉండవచ్చును.
జంబూద్వీపం గురించి మార్కండేయ పురాణం పైనా కిందా కొంచెం నొక్కబడి మధ్యన వెడల్పుగా ఉన్నట్టు వర్ణించింది.భాగవాత్ పురాణంలో భొమికి ఒకవైపున పగలు అయితే రెండో వైపున రాత్రి రాత్రి అవుతుందని చెబుతున్నది.జైన,బౌద్ధ మత సాహిత్యాలలో కూడా జంబూద్వీపమే విశ్వంలో స్వర్గనరకాలకు మధ్యన ఉన్న మధ్యమండలానికి కేంద్రస్థానంలో ఉన్నదని చెబుతున్నాయి.
ఒకప్పుడు పర్వతాలకి రెక్కలు ఉండేవనీ అవి అలా ఏగురుతూ ఎక్కద పడితే అకక్ద వాలుతూ ప్రజల్ని భయపెడుతుంటే ఇంద్రుడు వాటి రెక్కలు నరికేశాడనీ అప్పట్నుంచీ ఎక్కడి పర్వతాలు అక్కదే ఉండిపోయాయనీ వర్ణిస్తే నవ్వడం చాలా తేలిక,మన జ్ఞానానికి అతీతమైనది సమస్తం హేతువిరుద్ధమే అని అనుకోగలిగిన అహంకారం ఉంటే దేనినైనా అవమానించవచ్చును.ఒకప్పుడు భూమి మొత్తం ఏకఖండంగా ఉండేదనీ సూర్యకానితి మొత్తం భూమికి ఓకవైపునే పడుతూ ఉండేదనీ ప్రియవ్రతుని రధచక్రాల ధాటికి పగిలి ముక్కలైందనీ చెబితే నవ్వే వస్తుంది, నిజమే!కానీ అది సాహిత్యరూపం - ఇవ్వాళ సైన్స్ ఫిక్షన్ పేరుతో కార్ల్ సగన్,అసిమోవ్ లాంటివాళ్ళు రాసింది కూడా నిజమైన సైన్సు కాదు, అవునా?
ఆధునిక విజ్ఞానశాస్త్రం 250 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉతరధృవం ఉన్నచోట Pangea Proxima అనే పేరుతో ఆదిమ భూఖండం ఉండేదని చెబుతున్నారు.ఈ ఆదిమ భూఖండం Continental drift వల్ల జరుగుతూ వచ్చి ఇప్పుడు మనం చూస్తున్న అమరిక ఏర్పడిందనీ చెబుతున్నది నిజమే అయితే పురాన కధల్లో పోలికలుగా చెబుతున్నవాళ్ళకి అవి యెట్లా తెలిసాయనేది ఆలోచిస్తే మనిషైనవాడికి నవ్వు రాదు!మానవ్జాతి ఆఫ్రికా ఖండంలో ఆవిర్భవించిందని ఇప్పుడు అనుకుంటున్నది కూడా నిజం కాదోమో!భూమి ఏకఖండంగా ఉన్నప్పుడే ఆవిర్భవించి ప్రకృతిలో జరుగుతున్న ప్రతి మార్పునీ చూసి గుర్తు పెట్టుకుంటూ తర్వాతి తర్లకి అందిస్తూ వచ్చినప్పుడే వాటిని గురినంచి చెప్పగలగడం సాధ్యపడుతుంది - మరో విధమైన విశ్లేషణతో వీటిని అర్ధం చేసుకోవడం అసాధ్యం!
నిజానికి Continental drift theoryని కూడా అందరూ ఒప్పుకోవట్లేదు.ఈ సైంటిఫిక్ ధియరీ ప్రతిపాదనలే కొన్ని అసంగతమైనవిగా ఉంటున్నాయి,అన్ని రకాల సంభావ్యతలనీ విశ్లేషించలేకపోతున్నది. హిందువులు అటు సైన్సు గురించి గానీ ఇటు మతం గురించి గానీ ఏమీ తెలుసుకోకుండా ఎర్రిపపల్లా జకీరు నాయక్కూలకీ కంచె ఐలయ్యలకీ గోగినేని బాబులకీ జడిసిపోతూ ఉలిక్కిపడుతూ పిడుక్కీ బియ్యానికీ తేలుమంత్రమే అన్నట్టు "వీళ్ళ వల్ల ఏమీ కాదులే!సనాతనధర్మం మహత్తరమైనది!!" అని వీపులు చరుచుకుంటూ ఉంటే మట్టానికి మునిగిపోవడం ఖాయం.
క్రీ.శ 1990లో ఆగస్టు 10వ తేదీన Idaho Air National Guard సభుయ్డైన Bill Miller అనే పైలెట్ Oregon ప్రాంతపు గగనతలంలో గస్తీ విమానం నడుపుతూ ఒక ఎండిపోయిన సరస్సు మధ్యన నేలమీద ఒక విచిత్రమైన మరికని చూశాడు.పొడవూ వెడల్పూ కూడా మైలులో నాలుగోవంతు ఉండి 13 మైళ్ళ పొదవున్న గీతలతో ఏర్పడిన ఆకారం అది.విచిత్రం ఏమిటంటేఅరగంటకు ముందు ఆ ప్రాంతం మీద ఎగురుతున్నప్పుడు కనిపించని అంత పెద్ద ఆకారం అరగంటలోనే స్పష్టమై రూపు దాల్చింది!
Miller వెంటనే సమాచారం పై అధికారులకి తెలియజేశాడు.అయితే సుమారు 30 రోజుల పాటు జనానికి తెలియలేదు.సెప్టెంబర్ 12Boise TV station ఒక ప్రత్యేక కధనాన్ని పర్సారం చెయ్యడంతో అది హిందువులకి సంబంధించిన శ్రీచక్రయంత్రం అని అందరూ గుర్తు పట్టేశారు - అయితే,అంత సంక్లిష్టమైన హిందూమతానికి అసంబంధించిన నిర్మాణం అమెరికాలో ఎందుకు కనబడిందనేది ఎవరికీ అర్ధం కాలేదు!సెప్టెంబర్ 14కల్లా Associated Press, Bend Bulletin, the Oregonian లాంటి ప్రముఖ పత్రికలు వార్తలను ప్రచురించి మరింత దానికి ప్రచారం కల్పించాయి.
శ్రీచక్ర నిర్మాణం ఎంత సంక్లిష్టమైనదంటే ఒక రష్యన్ మేధావి దాన్న్ని అర్ధం చేసుకుని ఒక పుస్తకం రాయటానికి జీవితకాలం పాటు శ్రమించాడు!మధ్యభాగం పైకి చూస్తున్నట్టు అనిపించే ఒకదానిలో ఒకటి అమిరి ఉన్నట్టు కనిపించే నాలుగు త్రికోణాలు(శివ రూపం) ,అదే మాదిరి అమరికతో కొందకి చూస్తున్న అయిదు త్రికోణాలు(శక్తి రూపం) ఒకదాని నొకటి ఖండించుకుంటున్న గీతలతో కనిపించే చిక్కురొక్కురు రూఅపం - ఈ త్రికోణాల అమరిక చుట్టూ ఒక వృత్తం ఉంటుంది,ఈ వృత్తం పరిధి మీద పద్మదళాలు ఉంటాయి.సృష్టిలోని సమస్త విజ్ఞాన సారమూ శ్రీయంత్రంలో ఇమిడి ఉంది. దృశ్యమాన ప్రపంచంలోని ప్రతి అంశమూ ఒక్కొక్క చోట ఏర్పడిన చిన్న పెద్ద త్రికోణాలకు మధ్య ఉన్న పరస్పర సంబంధాల్ని విశ్లేషించి తెలుసుకోవచ్చు! సనాతన ధార్మిక సాహిత్యం మీద మంచి పట్టున్న ఘనాపాటీలే "నాకు దాని గురించి పూర్తిగా తెలుసు!" అని చెప్పలేని సంక్లిష్టమైన నిర్మాణాన్ని ఒక గొట్టంగాడు నెలరోజులు గూగులించి ఒక ట్రాక్టర్నీ,కొన్ని తాడు ముక్కల్నీ, కొందరు పిలకాయల్నీ తీసుకెళ్ళి గీసేశానని చెప్పేశాడు - అంతటితో సంతృప్తిపడిపోయి పరిశోధన ఆపేశారు, తమ పొట్టల కోసం డాల్ర్లు సంపాదించుకోవడానికీ తానా తందానా గన బజానాలకీ తప్ప ఎందుకూ పనికిరారు అమరికన్ హిందువులు!
సెప్టెంబర్ 15Don Newman, Alan Decker అనే ఇద్దరు UFOల మీద పరిశోధన చేస్తున్న మేధావులు ఆ ప్రాంతం కలయదిరిగి మనుషుల పాదముద్రలు గానీ వాహనాల టైర్ల గుర్తులు గానీ కనిపించడం లేదని నిర్ధారించారు.వీళ్ళిద్దరూ చేసిన పరిశోధనల్ని Oregon State Universityకి చెందిన Atmospheric Science Departmentలో పనిచేస్తున్న Dr. James Deardorff సంకలించి UFO magazine వాళ్ళకి పంపించాడు - అది ప్రచురించబడింది."అహో! అదరహో!!హిందూమతం గొప్పదనం అందరికీ తెలిసిపోయిందహో!!!" అనుకుంటున్నారు గదూ - ఆస,దోశ,అప్పడం.సరిగ్గ అ40వ రోజుకల్లా Bill Witherspoon అనే పెద్దమనిషి కల్టివేతరూ,తాళ్లూ,కుర్రాళ్ళూ వంటి గహ్నమైన పనిముట్లని ఊపయోగించి పది రోజులు కష్తపడి తనే గీశానని చెప్పాడు.సైంటిస్టులూ ప్రభుత్వమూ అది నమ్మేసి జనాన్ని కూడా నమ్మమని చెప్పేసి గెన్నె బోర్లించేసారు - కధ కంచికి,మనమింటికి."హాచ్!తూచ్!వూచ్!" అని ఎన్ని మూలుగులు మూలిగినా ఏమీ లభం లేదు.చచ్చిన సవమైనా లేస్తుంది గానీ కావాలని మొదునిద్ర పోయేవాణ్ణి ఎవరు లేపగలరు?
మొదటిసారి చూసి రిపోర్టు చేసినవాడు అరగంట క్రితం లేదని బల్లగుద్ది చెప్పాడు.ఆ పది రోజుల్లో ఈ పెద్దమనిషి కొందరు కుర్రాళ్ళని వెంటేసుకుని తిరుగుతుంటే మిగిలిన గస్తీ పైలెట్లు కూడా ఎవరూ రిపోర్టు చెయ్యలేదు.నమ్మేవాడు ఉంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అని కూడా అనొచ్చు.గవర్నమెంటూ సైంటిస్టులూ వొదిలేసినా మీడియా వదల్లేదు.Bill Witherspoon గార్ని మీడియా సాక్షిగా UFO పరిశోధకులు కుళ్ళబొడిచేశారు,లోపాయకారీ విచారణలో శ్రీవారికి శ్రెచక్రయంత్రాన్ని అర్ధం చేసుకోగలిగిన పాండిత్యం లేదని తేల్చిపారేశారు!
జనాన్ని చీల్చడానికి పనికొచ్చే రాజకీయ దృక్కోణం లేకుండా సనాతనధార్మికసాహిత్యాన్ని పరిశీలిస్తే ఒక్క భారతదేశపు చరిత్రనే కాదు ప్రపంచ చరిత్రను పునాదులతో సహా పెకలించి కొత్త చరిత్రలని రాసుకోవాల్సిన బాస్తవాలు ఎన్నో బయటపడతాయి!అయితే, ఆ పని ఎవరు చెయ్యాలి?హిందువులే చెయ్యాలి.
మరి  హిందువులకి ఎవరు చురుకు పుట్టించాలి?దేవుడే దిగి రావాలి!

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...