Monday 31 December 2018

ముస్లిములు మక్కా లోని కాబా దగ్గిర పాటిస్తున్న వైదిక సంప్రదాయాల నిజస్వరూపం!"మేము, మా మతం విగ్రహ్హారాధనకు వ్యతిరేకం!విగ్రహ్హారాధన పాపభూయిష్ఠమైనది." అని చెప్పే వీళ్ళు మక్కా లోని కాబా దగ్గిర చేస్తున్నది ఏమిటి?

రెండు వేల యేళ్ళ క్రితం రోము నగరం చుట్టూ పెనవేసుకున్న ఆధ్యాత్మిక గందరగోళం నుంచి పుట్టిన క్రైస్తవమూ పధ్నాలుగు వందల యేళ్ళ క్రితం మక్కా పరిసర ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నుంచి పుట్టిన ఇస్లామూ వ్యవస్థీకృతం అయిన మొదటి రోజునుంచీ ఇతర మతాల్ని తమ పక్కన సమస్థాయిన కూర్చోబెట్టుకోవటం మాట పక్కన పెడితే అసలు బతకనే బతకనివ్వకూడదనే పట్టుదలతో ప్రపంచం మొత్తాన్ని ఎడతెగని మతహింసతో అతలాకుతలం చేస్తున్నాయి.

వీటికి భిన్నమైన సనాతన ధర్మం తన కిష్టమైన తన స్వజనులే బాగుండాలనే సంకుచితత్వం లేకుండా"సర్వేషాం స్వస్థిర్ భవతు, సర్వేషాం శాంతిర్ భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే భవంతు సుఖిన:, సర్వే సంతు నిరామయ:, సర్వే భద్రాణి పశ్యంతు - మాకశ్చిత్ దు:ఖ భాగ్ భవేత్" అనే వసుధైవ కుటుంబ భావనతో ప్రపంచం నలుమూలలా వ్యాపించిన నాడు కూడా వినయాన్నే ప్రదర్శించి సత్యనిష్ఠలో గానీ ఔదార్యంలో గానీ తన కాలి గోటికి కూడా సరిపోలని ఈ రెండు మతాల్నీ ఆదరించి అక్కున జేర్చుకుని అవి నిరంతరం తనను అవమానిస్తూ తనని తన మాతృభూమి నుంచి కూడా లాగిపారెయ్యాలని చూస్తున్నప్పటికీ సహించి, క్షమించి, భరించగలుగుతున్నది!

వీళ్ళిద్దరిలో క్రైస్తవ మత ప్రచారకుల పద్ధతి నయమార్గంలో ఉంటుంది.హిందువులు కొంచెం తర్కాన్ని ఉపయోగించి కీలకమైన ప్రశ్నలని సంధించితే చాలును, వాటికి జవాబు చెప్పలేక తోక ముడుస్తారు.ఈ మధ్యన దెయ్యాల సినిమాల్లో క్యామెడీని పండిస్తున్నారు.క్రైస్తవంలో అంతకు మించిన క్యామెడీ ఉంది,మచ్చుకు ఇది చూడండి:

Knock knock
"Who is it?"
"It's me, Jesus. Let me in.
"Why do you want in?"
"I want to save you."
"Save me from what?"
"From what I'll do to you if you don't let me in!"

క్రైస్తవుల గురించి ఆట్టే భయపడక్కర్లేదు గానీ ముస్లిములు అలా కాదు,సంఖ్య తగినంత పెరిగే వరకు టకియాను పాటిస్తూ అవకాశం కోసం వేచి వుండి సంఖ్య తగినంత పెరిగిందని అనిపించగానే జిహాద్ పేరుతో రాక్షసంగా విరుచుకు పడతారు.

ఒకసారి ముల్లాలు గానీ వారి నాయకులు గానీ జెహాద్ పిలుపు ఇచ్చాక అప్పటివరకు అమాయత్వాన్ని నటిస్తున్నవాళ్ళు తమ విశ్వరూపం చూపిస్తారు.అప్పుడిక మనం ఎంత ప్రాధేయపడినా జాలీ దయా ఉండవు.ఒక మామూలు ముస్లిం యువకుడు కరుడు గట్టిన తీవ్రవాదిగా మారడం అనేది సుదీర్ఘ కాలం పాటు జరిగే అతి రహస్యమైన వ్యవహారం!ముస్లిం యువకులను జెహాదీలుగా మార్చటానికి ప్రపంచ స్థాయిలో కొన్ని కోట్ల మిలియన్ల స్థాయి పెట్టుబడులతో ఒక సమాంతర ఆర్ధిక వ్యవస్థ నడుస్తున్నది. మధ్య ప్రాచ్యంలోని 14 ముస్లిం దేశాల్లో ప్రతి దేశమూ ఏదో ఒక తీవ్రవాద సంస్థకు మహారాజ పోషకురాలిగా ఉంటే కొందరు శాంతికాముక ముస్లిములు ఎంత నిజాయితీగా మత సామరస్యం గురించి అద్భుతమైన ప్రసంగాలు చేస్తే మాత్రం ఫలితం ఏమిటి? జెహాదీలు ముసుగు  తీసేసి విజృంభించినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళకే సపోర్టు చేస్తారు,లేదంటే వాళ్ళు వీళ్ళనీ చంపేస్తారు.

ఇవ్వాళ విధ్వంసం కూడా పెట్టుబడులు పెట్టి కార్మికులను ఉపయోగించుకుని లాభాల నార్జించే వీలున్న వ్యవస్థీకృతమైన పరిశ్రమ అయిపోయింది,ఇందులో గత 1400 ఏళ్ళ నుంచి ముస్లిములదే మోనాపలీ.క్రైస్తవులు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ తమ చురుకుదనాన్ని చూపిస్తున్నారు.మియన్మార్ లోని రోహింగ్యా మ్యుస్లిముల ధాటికి తట్టుకోలేక ఈ మధ్యనే బౌద్ధులు కూడా ఈ రంగంలోకి అడుగు పెట్టారు.

మనం మీడియాలో చూస్తున్న దృశ్యాల్లో కేవలం బాంబులో తుపాకులో పేలడం మాత్రమే కనబడుతుంది - ఇందులో ఖర్చు తప్ప ఆదాయం ఏముంటుందని అనిపిస్తుంది.కానీ వీళ్ళు దేశాల సరిహద్దుల్ని రహస్యంగా దాటేటప్పుడు మత్తుమందుల వ్యాపారులూ అమ్మాయిలని తార్చేవాళ్ళూ నిరుద్యోగుల్ని స్మగుల్ చేసేవాళ్ళూ వీళ్ళతో తమ సరుకుల్ని కూడా దాటించేటందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటారు - అక్కడ ఒక్కో సరుకుని దాటించడానికి మనం వూహించలేనంత స్థాయిలో డబ్బు చేతులు మారుతుంది.ఇలాంటి పాపిష్ఠి పనులకి వారి ప్రవక్త స్వయాన దోపిడీ యుద్ధాలలో తర్ఫీదు ఇచ్చి ముందుండి నడిపించి "ప్రస్తుతం కాఫిర్ల దగ్గిర ఉన్నది సైతాను మాయ వల్ల వాళ్ళ దగ్గరకి చేరింది కాబట్టి ఆ డబ్బుని ఎలా తిరిగి మన దగ్గిరకి తెచ్చుకున్నా తప్పులే"దని క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల వాళ్ళు తాము చేస్తున్నది తప్పు అని భావించడం లేదు - ఇతరులు దాన్ని తప్పనడమే వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది! అలాంటి ఘోరాలు చేస్తూ పట్టుబడిన నేరస్తులలో పశ్చాత్తాపం ఎవరయినా ఎప్పుడైనా చూడగలిగారా?లేదే!పైన, "మా ప్రవక్త మాకు చూపించిన దారిలోనే నడుస్తున్నాం" అని చెప్తుంటే మన దగ్గిర సెక్యులర్ ముస్లిములు "ఇస్లాం హింసను బోధించదు!వాళ్ళు అసలు ముస్లిములే కాదు!వాళ్ళకీ మాకూ ఏ సంబంధమూ లేదు!" అంటే ఎవరు నమ్ముతారు?

మిగిలిన ప్రపంచంలో మూడొంతులు నల్లేరు మీద బండి నడకలా ఆక్రమించేసి విర్రవీగుతున్నవాళ్ళకి తాము ఇక్కెడెందుకు వ్యాపించలేకపోతున్నామో తెలియక పిచ్చెక్కిపోతున్నారు గానీ ఈ మతాలు పుట్టిన ప్రాంతంలో ఆ కాలంలో హిందూధర్మం బలంగా ఉండి ఉంటే అవి పుట్టి ఉండేవి కావు - నిజం!క్రైస్తవం పుట్టిన నాటి రోం పరిపాలనలోనూ ఆద్యాత్మికతలోనూ వైదిక ధర్మం నుంచి తీసుకున్న సంప్రదాయాలనే అనుసరిస్తున్నప్పటికీ వాటిని అర్ధం చేసుకునే పాండిత్యం వారికి లేదు.ఇక్కడ అసదృసమైన స్థాయిలో ఉన్న తర్కం,మీమాంస వంటి సత్యనిరూపణకి పనికివచ్చే శాస్త్రాల పరిచయం వారికి లేదు.ఇస్లాం పుట్టిన నాటి అరేబియాలోనూ అదే పరిస్థితి.అదే ఇక్కడ చూస్తే హేతువులోనూ అంతశ్శక్తిలోనూ వీటికన్న గొప్పవైన జైనం,బౌద్ధం వంటి మతాలే హిందూధర్మాన్ని నాశనం చెయ్యలేకపోయాయి.తర్క మీమాంసాది వైదిక శాస్త్రాలలో పుట్టి పెరిగి విషయ నిరూపణ చెయ్యడంలో అఖండులయిన వైదిక పండితులని వాదనలో గెలవటం వీళ్ళకి సాధ్యపడేది కాదు!

అందుకే,ఈ దేశంలో వారి సంఖ్యని పెంచుకోవడం కోసం కుట్రలకీ లంచాలకీ దాడులకీ పాల్పడుతున్నారు.ముందొచ్చిన చెవుల కన్న వెనకొచ్చిన కొమ్ములు  వాడి కదా, ఒకటో శతాబ్దంలో పుట్టిన క్రైస్తవం ఎందుకో పద్ధెనిమిదో శతాబ్దం వరకు ఇటుకేసి చూడలేదు గానీ ఆరో శతాబ్దంలో పుట్టిన ఇస్లాము మాత్రం  పదో శతాబ్దం నుంచే ఎడతెగని వరస దాడులు మొదలు పెట్టింది.

కేవలం మూడు వందల యేళ్ళలో 3000 ఆలయాల్ని ధ్వంసం చేశారు!ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం ఏర్పడటంతో దాడి ఉధృతం తగింది.స్థానిక ప్రజలకి వాటిపట్ల ఉండే ఆత్మీయతని బట్టి ఏ ఒక్క ఆలయమూ అనామకమైనది కాకపోయినప్పటికీ వాటిలో పది మాత్రం అప్పటికే ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి గాంచినవి.ఆ ప్రఖ్యాతియే ముస్లిములు పగబట్టి నాశనం చెయ్యడానికి కారణం అనేది వాస్తవం. 

1.సోమనాధ ఆలయం(మొదటి దాడి సా.శ. 1026, ఆఖరి నిర్మాణం సా.శ. 1951):
"తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కోసం!" అన్నట్టు ఉంటుంది ఘజనీ మహమ్మదును సోమనాధ దేవాలయం మీద దాడికి ప్రేరేపించిన మూలకారణం! "ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు!" అని చెప్పుకుని నవ్వుకోవచ్చు కూడా వాడు కూలగొట్టింది మన దేవాలయాన్ని కాకపోతే. సా.శ632లో చచ్చిపోయే ముందర ఆఖరి రోజుల్లో మూడేళ్ళు సాము చేసి మూలనున్న ముసలమ్మని కొట్టినంత గొప్ప యుద్ధం చేసి మక్కాని పట్టుకోగలిగి ప్రపంచంలోని ముస్లిములందరికీ మక్కాయాత్రని ఇస్లాం ధర్మానికి అయిదవ మూలస్తభం చేసేసి ముస్లిములు ఆఖరి ప్రవక్త అనుకుంటున్న మహానిశానీ గారు చచ్చిపోయిన మొదటి రోజు నుంచీ మక్కా మీదా అక్కడ పోగుపడిన సంపద మీదా ఎవరికి పెత్తనం దక్కాలనే పోట్లాటలు మొదలయ్యాయి, ఆధ్యాత్మికత ఏ కోశానా లేని నైతిక పతనంలో అధమాధమ స్థాయిని కళ్ళకి కట్టినట్టు చూపించే ఆస్తుల కోసం అధికారం కోసం జరిగిన ఈ కలహాల్లో ప్రవక్త కూతురే తొలి కబళం అయ్యింది - దోపిడీల మీద పుట్టి హింసారిరింసతో  పెరిగిన విషవృక్షం కదా, దాని శాఖలు అట్లాగే ఉంటాయి మరి!
ఇవ్వాళ తమది ఎదురు లేని మతమని గర్విస్తూ  ఇతరుల ఆలయాల్ని ధ్వంసం చేస్తూ అదేమని అడిగితే వాళ్ళూ వాళ్ళ అనుంగు సహోదర వర్గాల వారూ "మీ దేవుళ్ళకి మహత్యం ఉంటే కూల్చటాన్ని ఆపగలిగేవాళ్ళు కదా!అవి కూలిపోతుంటే రక్షించలేకపోయారు గాబట్టి మీ దేవుళ్ళకి పవర్లు లేనట్టే గదా!" అని వికటాట్టహాసాలు చేస్తుంటారు గానీ సా.శ 930లో అంత గొప్ప దేవళమూ నేలమట్టమైపోయి హజ్ యాత్రికులు పవిత్రం అనుకుని సీసాల్లో పట్టుకుని దాని నీళ్ళని తీసుకుపోతున్న జంజం బావి హజ్ యాత్రకు వచ్చిన భక్తుల శవాలతో నిండిపోయి బావి మొత్తం కుళ్ళిన శవాలకి సంబంధించిన  రక్తమాంసాల బురదమయమై కొన్నేళ్ళ పాటు దాని జోలికే వెళ్ళలేదని ఎంతమందికి తెలుసు?నమ్మలేని నిజమే, కానీ జరిగింది!ఆ పని చేసినవాడు ముస్లిమేతరుడై ఉంటే కనిపించిన ప్రతివాడికీ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు గనక మనకీ తెలిసేది - అంత పని చేసింది PBUH చెప్పినదానికి చచ్చినట్టు కట్టుబడి ఉండాల్సిన ఓక ముస్లిమే!
ఎందుకు దీని గురించి దాచెయ్యడం అంటే "మాకు ఒకే దేవుడు!మాకు ఒకే ప్రవక్త!మాకు ఒకే పుస్తకం!మాది ఒకే మతం!" అని కొట్టుకునే డప్పుని తిరగేసి వాయించినట్టు అక్కడున్న వహ్హాబీ, అహ్మదీ, తొక్కా, తోలు శాఖల్లో ఒకదానికి రెండోదంటే చచ్చినా పడని సున్నీ-షియా తగాదాలు అందరికీ తెలిసిపోయి తెల్లమొహం వెయ్యాల్సొస్తుందని - ఇలాంటియి ముందే చెప్పేస్తే కొత్తోళ్ళు రారుగా పాపం దడుచుకుని!మనబోటివాళ్ళు ఒకవేళ బయటపెట్టినా ఇప్పటికే గొర్రెల సంఖ్య కావల్సినంత పెరిగిపోయింది కదా!
ఇంతకీ మక్కా లోని కాబా గుడిని పంబ రేగ్గొట్టిన వీర చూడామణి పేరు Abu Tahir al-Jannabi, క్రూరత్వంలోనూ మోసాలు చెయ్యటంలోనూ వాళ్ళ మతాన్ని కనిపెట్టిన ఆఖరి ప్రవక్తకే పాఠాలు నేర్పగలిగినవాడు!వీడి తండ్రి Abu Sa'id ఆటవిక తెగ నాయకుడు.అప్పటి తెగ పేరు తెలియదు గానీ తన తెగని సైనికశిక్షణతో పటిష్టం చేసి బలమైన  రాజ్యాన్ని స్థాపించాలని బయల్దేరాడు.తన గురువైన Hamdan Qarmat పేరుమీద తన తెగకి Qarmatian అని కొత్త పేరు పెట్టుకున్నాడు.వీళ్ళకి సున్నీ ఇస్లాం అంటే విపరీతమైన ద్వేషం.Abu Sa'id నిశానీ ప్రవక్త చూపిన దారిలోనే మక్కా యాత్రికుల మీదా వ్యాపారస్తుల క్యారవాన్ల మీదా పడి దారి దోపిడీలు చేస్తూ సంపదనీ బలాన్నీ పెంచుకుని అబ్బాసిద్ ఖలీఫా అధీనంలో ఉన్న బస్రా నగరాన్ని కూడా గెల్చుకోగలిగాడు.తండ్రి తర్వాత మొదట పెద్ద కొడుకు Abu'l-Qasim Sa'id అధికారంలోకి వచ్చాడు గానీ మనోడు Abu Tahir తిరుగుబాటు చేసేసి కుర్చీ ఎక్కాడు.ఎందుకో మరి, అన్నని కైమా కొట్టించలేదు - అంతవరకు నయమే!
వీడి మైరావణ చరిత్ర మనకెందుకు, మక్కాని మట్టగించే లోపు మనకి కడుపుబ్బ నవ్వొచ్చే ఒక సన్నివేశం గురించి చెప్పుకుని వదిలేద్దాం.తక్తు ఎక్కిన దగ్గిర్నుంచీ నిశానీ ప్రవక్తా ఆటవిక తండ్రీ చూపించిన దారిలోనే నడుస్తూ హజ్ యాత్రికుల్ని దోచుకుని సంపద పోగేసుకుంటూ తనకన్న బలమైన ఇతర తెగల ప్రభువులతో శాంతి ఒప్పందాలు చేసుకుని బుద్ధిగా ఉంటున్న రోజుల్లో ఒక ఖైదీని Abu'l-Fadl al-Isfahani అనే పర్షియన్ సస్సానిడ్ రాజవంశీయుడని గుర్తించాడు.వీళ్ళ రాజ్యం Al-Isfahani సా.శ 928లో Abu Tahir కిందకి వచ్చింది.ఏ కళనున్నాడో వాడు బతిమిలాడుకున్నాడో పెద్ద కుటుంబం వాడు గదాని జాలిపడ్డాడో Abu Tahir రాజ్యం అతనికి ఇచ్చేశాడు.అయితే ఈ Mahdi-Caliph దొరికిందే సందని తన నిజరూపం చూపించాడు.వాడు అగ్ని ఆరాధన మొదలుపెట్టి ఖురాన్ ప్రతుల్ని తగలబెట్టేస్తూ Bahraynకి సంబంధించిన ప్రముఖులని కుటుంబసమేతం ఎడాపెడా కుత్తుకలుత్తరించెయ్యటం మొదలు పెట్టాడు - మరీ ఘోరం, అందులో Abu Tahir కుటుంబం కూడా ఉంది!వాడి దెబ్బకి జడిసిపోయిన వీడు "యా అల్లా!యా ఖుదా!నాకూ హేమీ తెల్వద్!వాడూ నన్నూ మోసం చేస్నాడ్!" అని ఇతర తెగల ప్రభువుల ముందు పొర్లు దండాలు పెట్టేశాడు .లేప్పోతే వాణ్ణి అక్కడ కూచోబెట్టినందుకు వీణ్ణి ఇక్కడ ఖైమా కొట్టేస్తారు మరి:-)అలా వాళ్ళనుంచి కైమా కొట్టుడు తప్పించుకుని వీడు పోయి వాణ్ణి కైమా కొట్టేశాడు.

దీనికి ముందో వెనకో ఆ 930 సామాన్య శకం లోనే మక్కా మీదకి పోయి పడ్డాడు.మన మీద ఏ ముస్లిముకీ ఏనాడూ జాలి లేదు గానీ అక్కడ వీడు సాటి ముస్లింలు.అదీ  మక్కా యాత్రికుల మీద వీడు చేసిన భీబత్సం తెలుసుకుంటే తమ మతం ఎంతో మంచిదని నమ్మి పాటిస్తున్న అమాయక ముస్లిముల మీద మనకి చాలా జాలేస్తుంది!

మొదట కవాతు మీద వస్తున్న వీడి  సైన్యాన్ని మక్కా నగరం కాపలావాళ్ళు ఆపేసి వెళ్ళనివ్వలేదు.అప్పుడు వూరికే చూట్టానికి వచ్చామని మాట ఇచ్చి ప్రతి ముస్లిముకీ మక్కా నగర ప్రవేశం మీద ఉన్న హక్కు ప్రకారం నగరం లోపల అడుగు పెట్టాక ప్రవక్త చూపిన దారిలోనే చేసిన ప్రమాణానికి తూనా బొడ్డు చెప్పేసి కసకస నరికెయ్యడం మొదలు పెట్టాడు. కర్ణ కఠోరమైన పవిత్ర ఖుర్-ఆన్ సురాల ప్రతిధ్వనులతో హడలు పుట్టిస్తూ సుమారు ముప్పై వేలమంది హజ్ యాత్రికుల్లో ఒక్కణ్ణి కూడా ప్రాణాల్తో వదలకుండా వధించి పారేశారు Abu Tahir అనుచరులు!ఒక్కణ్ణి కూడా మిగల్చకుండా చంపెయ్యటంతో శవాల్ని తొలగించి శుభ్రం చేసే నాధుడు లేక మక్కా నగరం ముత్తం అనాధప్రేతంగా మారింది - రోడ్ల మీదా జంజం బావిలోనూ పడివున్న శవాలు కుళ్ళిపోయి నశించి వాటి మృతసంస్కారం అవే చేసుకున్నాయి!

Abū Tāhir కాబా గోడలో ఇరికించిన అశ్వేత లింగాన్ని పెకలించి తీసుకుపోయి తన సొంత Masjid al-Dirarలో పెట్టేశాడు.ఇతని ఉద్దేశం నల్ల రాయికి నిశానీ ప్రవక్త ఇచ్చిన హోదా వల్ల ముస్లిముల ఖిబ్లని మక్కా లోని కాబా వైపు నుంచి తన మసీదు వైపుకి తిప్పుకోవాలని.ఇందులో నల్లరాయి పట్ల భక్తి ప్రపత్తులూ వంకాయా గొంగూర కట్టా వంటివి ఏమీ లేవు,కేవలం నల్లరాయి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యటానికి వచ్చే యాత్రికుల నుంచి వచ్చే ఆదాయమే ముస్లిములకి పవిత్రమైన మక్కా నగరం మీద దాడి చేసిన అందరు ముస్లిములకీ ప్రేరణ నిచ్చింది!ఉన్నది కాస్తా వూడిందీ సర్వమంగళం పాడిందీ అన్నట్టుగానూ ఉన్నదీ పోయి ఉంచుకున్నదీ పోయి శనిద్రం పట్టిందనట్టుగానూ నల్లరాయి లేని మక్కా తన వైభవాన్ని కోల్పోయి శతకోటి నగరాల్లో ఒక బోడి నగరం అయిపోయింది.
ఎవరికి వాళ్ళు నల్లరాయిని స్వాధీనం చేసుకోవడం కోసం 23 యేళ్ళ పాటు జరిగిన నిరంతర యుద్ధాల తర్వాత సా.శ 952లో ఒక విచిత్రం జరిగింది - ఎవరో వ్యక్తి ఒక శుక్రవారం కుఫా మసీదులోకి ఒక గుడ్డమూటని విసిరేసి పారిపోయాడు.తెరిచి చూస్తే ఇప్పుడు యాత్రికులు ముద్దులు పెడుతున్న ముక్కలకి ముందరి రూపమైన నల్లరాయీ "By command we took it, and by command we have brought it back." అనే సందేశపత్రమూ కనిపించాయి.కానీ, ఈ రాయి ఇదివరకటి రాయి కన్న తేలికగా వుంది.నీళ్ళలో వేస్తే చక్కహా రామప్ప గుడి ఇటుకలా నీళ్ళ మీద తేల్తూ వయ్యారాలు పోతున్నది - ఇది అసలు నల్ల రాయి కాదు!అసలు నల్లరాయిని తీసుకుపోయినవాళ్ళు తమ శాడిజం కొద్దీ అసలు రాయిని ధ్వంసం చేసేసి ఈ నకలు రాయిని తమ మొహం మీద కొట్టారని అర్ధమైపోయింది. మన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్నే మళ్ళీ ఆ మక్కాలో ఆ కాబాలో ఆగోడలో ఆ మూలలో ఇరికించారు.వీళ్ళ కసి కొద్దీ వీళ్ళు, "the filthy Abu Tahir was afflicted with a gangrenous sore, his flesh was eaten away by worms, and he died a most terrible death - Qutb al-Din." అని తిట్టుకున్నారు గానీ వాడు మాత్రం మరో నలభయ్యేళ్ళు గుండ్రాయిలా బతికి సా.శ 994లో మామూలుగానే చచ్చాడు!ఆ మక్కాలో ఆ కాబాలో ఆ గోడలో ఆ మూలలో ఇరుక్కుని కూర్చుని ప్రపంచంలోని ముస్లిముల నందర్నీ తన చుట్టూ తిప్పుకుంటున్న ఆ నల్లరాయి ఏమిటో తెలుసా - మంగళ్ళు కత్తులు నూరుకోవడానికి వాడే ప్యుమిస్ స్టోన్! ఏ అగ్నిపర్వతం దగ్గిర వెతికినా ఇలాంటివి తట్టల కొద్దీ బళ్ళ కొద్దీ దొరుకుతాయి, తీసుకుపోయి వూరికో కిబ్లని పెట్టుకోవచ్చు! 
అసలు ఇన్ని పరీక్షలు అనవసరం, ఈ కనిపిస్తున్న ముక్కలని నిశితమైన దృష్టితో పరికించి సామాన్యబుద్ధివిశేషం(Common Sense)తో ఆలోచించి చూస్తే ఇవన్నీ ఎక్కణ్ణించో ఏరుకొచ్చిన గులకరాళ్ళు తప్ప ముస్లిముల ఆఖరి ప్రవక్త గారు పూర్వ ఇస్లామీయ విక్రమార్క నిర్మిత మక్కేశ్వర నిలయ గర్భగృహం నుంచి పెకలించి తీసుకొచ్చి తన రెటమతం తెలివి కొద్దీ ఆ మక్కాలో ఆ కాబాలో ఆ గోడలో ఆ మూలలో ఇరికించిన అశ్వేత లింగాన్ని పగలగొడితే వచ్చిన ముక్కలు కావని తెలిసిపోతుంది - ఒక గట్టి రాయిని పగలగొడితే అది మళ్ళీ అతికిస్తే పూర్వపు ఆకారం వచ్చే అచ్చులు పెచ్చులుగా పగుల్తుందే తప్ప నున్నని, గుండ్రని కోడిగుడ్లూ బాతుగుడ్లూ గాడిదగుడ్లూ వంటి వింత వింత ఆకారాల్లో పగుల్తుందా?

నల్లరాయి ఎప్పుడు ముక్కలైందనేది కూడా అర్ధమై చావట్లేదు - సా.శ 683లో ఉమయ్యద్ ఖలీఫా సైన్యం మక్కా మీద దాడి చేసినప్పుడు విసిరిన వడిశెల రాయి దెబ్బకి పగిలిందనీ సా.శ 930లో Abd Allah ibn al-Zubayr అనేవాడు వెండికట్లతో కలిపాడని అంటున్నారు - 683 నుంచి 930 వరకు ఏం చేశారు?ఈ వెండికట్ల గులకరాళ్ళ గిన్నె సా.శ 1850ల నుంచే ఆ మక్కాలో ఆ కాబాలో ఆ గోడలో ఆ మూలలో దర్శనమిస్తున్నదని చెబుతున్నారు!

వడిశెల రాయి దెబ్బకి ఎన్ని ముక్కలైందనే లెక్క చెప్పటంలేదు గానీ గుడ్డలమూటలో దొరికినప్పుడు మాత్రం ఏడు ముక్కలు ఉన్నాయని చెబుతున్నారు."In the 10th century, an observer described the Black Stone as being one cubit (46 cm or 18 in) long. By the early 17th century, it was recorded as measuring 1.40 by 1.22 m (4 ft 7 in by 4 ft 0 in). According to Ali Bey in the 18th century, it was described as 110 cm (3 ft 7 in) high, and Muhammad Ali Pasha reported it as being 76 cm (2 ft 6 in) long by 46 cm (1 ft 6 in) wide." - మరయితే ఈ లెక్కలన్నీ దేన్ని గురించి చెబుతున్నారు?అన్ని ముక్కలకీ కలిపి ఒకే పొడుగూ ఒకే వెడల్పూ ఏ పిచ్చి వెధవ చెప్తాడు?అది పగలకుండా ఉన్న నల్లరాయి కొలతలు అయ్యుండాలి,లేదా ముక్కల్ని వెండికట్లతో కలిపి ఉంచిన గిన్నె కొలతలు అయ్యుండాలి - ఒక వస్తువుకి ఒక్కో కాలంలో ఒక్కో సైజు ఉంటుందా?

వీటన్నింటిని బట్టి చూస్తే గుడ్డల మూటలో నల్లరాయిని ఎవరో ఫుకా మసీదు దగ్గిర విసిరేసి పోవటం నుంచి ఆ నల్లరాయిని మరొకరు పగలగొట్టటం వరకు మనకు చెప్తున్న కధ మొత్తం Abū Tāhir దగ్గిర ఉన్న నల్లరాయిని వెనక్కి తీసుకురావడం ఇక సాధ్యం కాదని తెలిశాక అల్లినదేనని తెలుస్తుంది!సామాన్య ముస్లిముల అజ్ఞానం మీద వాళ్ళకి అంత నమ్మకం - "అసలు మన మతంలో చేరడమే వాళ్ళ తెలివిలేమికి నిదర్శనం!దానికి తోడు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మడం తప్పితే ఏమిటి,ఎందుకు,ఎలా అనే ప్రశ్నలు వేస్తే నరకానికి పోతారని భయపేట్టేశాం కూడా!ఆ పిచ్చి మొహాలు నమ్మి ఇంత దూరం రావడానికి ఏదో ఒకటి చూపిస్తే చాలు!అసలు లేకపోవడం కన్న ఏదో ఒకటి ఉండటం నయమే కదా!" అని అనుకున్నారు.వాళ్ళ పధకం పారింది - మళ్ళీ మక్కా వైభవం నిలబడింది.అయినా సరే, ఎందుకైనా మంచిదని జనాలకి అనుమానం వచ్చేలోపు "As late as the 14th century, Gujarati Muslim pilgrims were noted by Amir Khusrow to stop at that temple to pay their respects before departing for the Hajj pilgrimage." అని చెప్తున్న దాన్ని బట్టి పూర్వ ఇస్లామీయ కాలపు moon god stone బదులు ఆ కాలంలో moon god stone అని పేరు పడిన సోమనాధ లింగం తీసుకొచ్చి పెడితే సరిపోతుందని వాళ్ళు అనుకోవడం వల్ల భారతదేశం ఖర్మ కాలింది గానీ సామాన్య ముస్లిములకి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అనుమానమూ రాలేదు, ఇకముందు కూడా వస్తుందని నేను అనుకోవడం లేదు!

అలా ఒకసారి చేజారిపోయిన నల్లరాయి ఏమైందో తెలీని, జరిగిన మోసాన్ని జీర్ణించుకోలేని, పెద్ద రాయి స్థానంలో చిన్న రాళ్ళని చూసి సరిపెట్టుకోలేని రంధిలో వాళ్ళ కన్ను సోమనాధ లింగం మీద పడింది - అగ్నికి వాయువు తోడైనట్టు పూర్వ ఇస్లామీయ పాత అల్లా దేవుని పుత్రికలయిన Lãt, Manãt దేవతలు ముస్లిముల కొత్త అల్లా దేవుడు పంపించిన ఆఖరి ప్రవక్త ధాటికి జడిసి అక్కణ్ణుంచి పారిపోయి సోమనాధ దేవాలయంలో తల దాచుకున్నారనే పుకారు కూడా జత కలిసింది!వీళ్ళు చెప్పకుండా దాచెయ్యటం వల్ల ఈనాటి సామాన్య ముస్లిములకూ మనబోటి ముస్లిమేతరులకూ తెలియదు గానీ ఉజ్జయిని నుంచి వెళ్ళిన విక్రమార్క ప్రభువే మక్కాలో అశ్వేత లింగాన్ని ప్రతిష్ఠించి మక్కేశ్వరుడి ఆలయాన్ని నిర్మించి కురు వంశపు పండితులకు అప్పగించి వెళ్ళాడనేది అప్పటి వాళ్ళకి స్పష్టంగా తెలుసు!

"విగ్రహ్హారాధన మహ్హాపాపం!" అని మన దగ్గిర గంభీరమైన సుభాషితాలు చెప్పే ముసల్మాన్ సోదరులు ఏడాదికోసారి పెద్దరాయికి బదులు ఉన్న చిన్న రాళ్ళతోనే సర్దుకుపోయి ఇంత భీబత్సమయిన స్థాయిలో విగ్రహ్హారాధన అనే మహ్హాపాపం చేస్తూ రోజులు గడిపేస్తున్న కాలంలో Subuktagin అనే వాడికి పెద్ద కొడుకుగా Mahmud Ghaznavi పుట్టుకొచ్చాడు.లేత వయసులోనే జైపాల్ అనే హిందూ రాజుతో జరిగిన యుద్ధంలో తండ్రికి సహాయపడ్డాడు.అయితే,తర్వాత కాలంలో తండ్రి ఎందుకో వీణ్ణి దూరం పెట్టేసినట్టు తెలుస్తుంది.సా.శ 997లో తండ్రి చనిపోయినప్పుడు చిన్న కొడుకు Ismail రాజయ్యాడు.కానీ ఇతను ఎక్కువ కాలం రాజ్యం చెయ్యలేదు,సా.శ 971లో పుట్టిన Mahmud సా.శ 998లో అతన్ని తొలగించి తన 27వ యేట  రాజయ్యాడు.అన్నని కళ్ళు పొడిపించి జీవిత ఖైదుకి గురి చేశాడు - శేభాష్!
అతి తక్కువ కాలంలోనే అవక్ర పరాక్రమంతో బిజృంభించి దాదాపు Central Asia మొత్తాన్ని తన స్వాధీనం చేసుకుని Ghazni పట్టణాన్ని రాజధాని చేసుకుని ఇస్లామిక్ ప్రపంచ చరిత్రలో తొలి సుల్తాన్ అయ్యాడు.ఇస్లామిక్ భావజాలంలో ఖలీఫాయే ముస్లిములందరికీ రాజు అనేదాన్ని బద్దలు కొట్టి సర్వస్వతంత్రుడైన పరిపాలకుడు అని అర్ధం వచ్చే ఆ బిరుధు ధరించడానికి  చాలా దమ్ము కావాలి - ఈడు మగాడ్రా బుజ్జీ!!

అప్పుడిక సోమనాధ శివలింగాన్ని తెచ్చే ఘనకార్యం మీదకి దృష్టి మళ్ళింది.మన దేశపు మెకాలే మానసపుత్రులైన చరిత్రకారులు గజిని మతపరమైన కారణాలతోనే మన దేశం వచ్చాడనేది ఒప్పుకోవడం లేదు గానీ అదే అసలైన లక్ష్యం అని నమ్మడానికి గల రెండు ముఖ్యమైన కారణాల్లో అతని మనస్తత్వం ఒకటి.ఇతను స్వభావ రీత్యా విలాస పురుషుడని తెలుస్తున్నది.అలాంటివాడు చెయ్యాల్సిన యుద్ధాలన్నీ ముగిసిపోయి హాయిగా కాలం గడపాల్సిన వయస్సులో కొత్త యుద్ధాలకి ఎందుకు బయల్దేరతాడు? అప్పటికే Central Asia మొత్తాన్ని పట్టుకున్న వాడు ప్రతి సంవత్సరం 2500,కిలోమీటర్ల దూరం పోనూ రానూ సైన్యంతో కలిసి ప్రయాణించడానికి ఉరకలెత్తడం ఎంత పిచ్చి పని!సా.శ 1025 ఏప్రిల్ నెలలో సోమనాధ్ గుడిని పట్టాక తిరిగి గజిని ముల్తాన్ చేరుకునేసరికి నీళ్ళకి అల్లాడిపోయి చాలా గుర్రాలు చచ్చిపోయాయనీ ఇంకా 30,000 గుర్రాలు ఉన్నాయనీ అల్బెరూనీ రాశాడు.ఎక్కడో దూరాన ఉన్న సంపద కోసం అప్పటికే సంపదలో పొర్లుతున్న వాడు తన సైన్యాన్ని ఆ స్థాయిలో కష్టపెట్టటం అసాధ్యం - సోమనాధ లింగాన్ని తీసుకెళ్ళి మక్కా గుడిలో ఇరికించటమే వాడి లక్ష్యం అనేది పచ్చి నిజం!

రెండవదీ గజిని మతపరమైన కారణాలతో రాలేదని వాదించేవాళ్ళ అన్ని వాదనల్నీ తుత్తునియలు చెయ్యగలిగిన అంశం దాడులలో పాటించిన వ్యూహమే! మొత్తం పదిహేడు సార్లూ వేసవి కాలం మొదలయ్యే రోజుల్లో ఇక్కడికి చేరుకునేవాడు,మళ్ళీ వర్షాలు మొదలయ్యే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు.ఎందుకంటే వర్షాకాలంలో పంజాబ్ లోని అన్ని నదులూ మంచి పోటు మీద ఉంటాయి.వాళ్ళని మోసుకుపోయే గుర్రాలు గానీ ఒంటెలు గానీ నేల మీద పరిగెడతాయి గానీ నీళ్ళలో ఈదలేవు - ఎరక్కపోయీ వచ్చాను అబ్బ ఇరుక్కుపోయాను అన్నట్టు తయారవుతుంది గజినీ పరిస్థితి, దిక్కు లేని కుక్క చావు చస్తాడు!

నా దృష్టిలో వీడు దాడికి ఎంచుకున్న సమయం మనవాళ్ళని ఇబ్బంది పెట్టింది.చాణక్యుడు సైన్య సంచాలనానికి వసంత కాలం అనువైనదని చెప్పాడు - వేసవి ఫెళ్ళున మాడ్చేస్తుంది, చలి పులిలా చంపేస్తుంది, వర్షం నేలని చిత్తడి చేసి ముంచేస్తుంది.అదే నిత్యం ఎర్రటి ఎడారి గాలుల్లో మాడేవాళ్ళకి ఇక్కడి ఎండ చల్లగా ఉంటుంది!అది వాడికి ఎడ్వాంటేజి అయ్యింది.

మొత్తం ఎంత సంపద పట్టుకెళ్ళాడో తెలియదు గానీ 30వ యేటినుంచి 60వ యేడు వచ్చేవరకు మనిషైనవాడు ఇంటిపట్టున కూర్చుని సుఖపడాల్సిన కాలం మొత్తం వీడు 2500 కిలోమీటర్ల దూరం సైన్యంతో సహా ఆసులో కండెలా తిరగటంలో గడిపేశాడు - పిచ్చి పుల్లయ్య!

కేవలం డబ్బు కోసమే అయితే ఇంత టార్చర్ భరించలేక నాలుగైదు రౌండ్లకే ఆగిపోయి ఉండేవాడు.సోమనాధ లింగాన్ని తీసుకెళ్ళి మక్కా గోడలో ఇరికించడం కూడా తనకి పుట్టిన దురద అయ్యుండదు - ఖలీఫా హుకుం జారీ చేసి ఉంటాడు.సుల్తాన్ హోదా తెచ్చుకున్నప్పటికీ ఖలీఫా పట్ల వినయంగానే ఉండేవాడు - వీడి అమ్మా బాబు లిద్దరూ బానిసలు!

ఠంచనుగా ఇక్కడికి వేసవి మొదలయ్యేటప్పటికి చేరుకోవాలంటే ఇంత దూరప్రయాణం చాలా ముందునుంచే మొదలు పెట్టాలి!ఠంచనుగా వర్షాలు మొదలయ్యేటప్పటికి ఇక్కణ్ణుంచి బైటపడి అంత దూరం పోవడానికి చాలా సమయం పడుతుంది!ఇక్కడికి రావటం, ఇక్కడ యుద్ధం చెయ్యటం, ఇక్కడి నుంచి వెళ్ళటం అనే శ్రమనుంచి కాస్త విశ్రాంతి తీసుకోంగానే ఠంచనుగా ఇక్కడ వేసవి వచ్చేసరికి చేరుకోవడానికి ప్రయాణం మొదలు పెట్టాల్సి  రావటం అనేది మనం అనుభవించటానికే కాదు పగవాడికి కూడా కోరుకోకూడని బతుకు - ఎన్ని సార్లు గుక్కపట్టి యేడ్చి ఉంటాడో పాపం గజినీ!

మొదటి 15 దండయాత్రల్లో Kabul, Delhi, Kanauj, Mathura, Kangra, Thaneshwar, Kashmir, Gwalior, Malwa, Bundelkhand, Tripuri, Bengal, Punjabలను పట్టుకున్నది 16వ సారికి దారిని శుభ్రం చేసుకోవటం కోసమే! ఒక్కోసారి ఒక్కో రాజ్యాన్ని ఎంచుకుని వాళ్ళ సైన్యానికి పదింతల సైన్యంతో మిడతల దండులా పోయి పడేవాడు.మన దేశపు గజినీ అభిమానులు గొప్ప వ్యూహకర్త కాబట్టే గెల్చాడంటారు గానీ ఇందులో అంత జబ్బలు చరుచుకోవాల్సిన వ్యూహం ఏముంది?యుద్ధం చేసే పద్ధతిలో ఒక స్పష్టమైన తేడా వుండేది.మనవాళ్ళు వెన్ను చూపినవాణ్ణి చంపగూడదనీ పదాతి దళం పదాతి దళంతోనూ గజబలం గజబలంతోనూ యుద్ధం చేయాలనీ సామాన్య పౌరుల్ని హింసించగూడదనీ కొన్ని నియమాలతో యుద్ధం చెయ్యటానికి అలవాటు పడినవాళ్ళు కావడంతో నీతినియమాలు లేని ఎడారి తండాల పైశాచికత్వానికి తట్టుకోలేకపోవటమే మనవాళ్ళ ఓటమికి అతి ముఖ్యమైన కారణం!

భారతదేశంలోని గజినీ మహమ్మదు అభిమానులు బాకా వూదుతున్నట్టు అప్పటి హిందూరాజుల్లో ఐకమత్యం లేక వోడిపోయారనేది పచ్చి అబద్ధం!చాలా యుద్ధాలలో ఒకరికొకరు సహాయాలు చేసుకున్నారు.

1001 AD: Jaipal, Peshawar
హిందూషాహి రాజవంశానికి చెందిన జయపాలుడు ఎదిరించాడు.ఈ యుద్ధంలో 15,000 మంది జైపాల్ సైనికులు చనిపోయారు.జైపాల్ ఓడిపోయి తన 15 మంది బంధువులతో వీడి ముందు తల దించుకుని నించోవాల్సి వచ్చింది.5,00,000 మంది స్వేచ్చాజీవులైన భారతీయుల్ని బానిసల కింద తన రాజ్యానికి తీసుకుపోయాడు.జైపాల్ విడుదల కోసం 2,50,000 దీనార్లు  డిమాండు చేసి వసూలు చేసుకున్నాడు.కానీ ఆ రాజు అవమానం భరించలేక తన రాజ్యం చేరిన వెంటనే ప్రాయోపావేశం చేసి స్వర్గస్థు డయ్యాడు.ఆయన .కొడుకు ఆనంద పాలుడు రాజయ్యాడు.

1008 AD: Anandpal, Peshawar
ఇప్పుడు హిందూషాహి రాజవంశానికి చెందిన ఆనందపాలుడు ఎదిరించాడు.ఇతను మిగిలిన రాజుల్ని సహాయం కోసం పిలిస్తే Ujjain, Gwalior, Kalinjar, Kannauj, Delhi, Ajmer రాజులు ఇతని తరపున పోరాడటానికి యుద్ధరంగానికి వచ్చి నిలబడ్డారు.ఈసారి బలాబలాలు ఎంత సమానం అయ్యాయంటే గజినీకి గుండె జారిపోయి యుద్ధం మొదలుపెట్టటానికే చాలా సేపు పట్టింది!

ఈసారి Khokhar జాతికి చెందిన వీరులు కూడా కలిశారు.వీళ్ళు ధనుర్విద్యలో ఆరితేరినవాళ్ళు - గజినీ వైపున ఉన్న 6,000 మంది ఆర్చర్ల దాడిని వీళ్ళు తిప్పి కొడుతూ వీళ్ళు 5000 మంది ముస్లిములని బలి తీసుకోగలిగారు!

దురదృష్టం!ఆనందపాలుడి ఏనుగు బెదిరి యుద్ధరంగం నుంచి పారిపోయింది - హిందూ సైనికులు గందరగోళానికి గురయ్యారు.అలా పారిపోతున్న 20,000 మందిని ముస్లిములు వెంటాడి చంపేశారు!మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి ఎదురై టీము కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఇరగదీస్తాడనుకున్న సచిన్ టెండూల్కర్ డక్కౌట్ అయినట్టు జరిగిన ఆ దురదృష్టకరమైన సన్నివేశం సోమనాధ దేవాలయం చరిత్రనే మార్చేసింది.

1009: Nagarkot [Kangra]
అప్పట్లో ఈ రాజ్యం ఎన్నో  వైభవం గల ఆలయాలకు పేరు గాంచింది.దాంతో మిడతల దండు పొలం మీద పడినట్టు జనావాసాలతో సహా దారిలో ఉన్న సమస్తాన్నీ ధ్వంసం చేసుకుంటూ వచ్చి పడ్డాడు.వీడే కాదు, ముస్లిములలో ఎవడు ఏ నగరాన్ని పట్టినా ఇంతే, తిన్నదాంతో కక్కుర్తి చావక పళ్ళేన్ని నాలికతో నాకేసినట్టు తయారవుతుంది యుద్ధం పూర్తయ్యాక!

వీడి భీబత్సం చూసిన కోట లోని వాళ్ళు తలుపులు తెరిచేశారు.చాలా పెద్ద మొత్తంలోనే వెండి, బంగారం, సంపద తీసుకుపోయాడు - ఇంత సంపద వాళ్ళ జన్మకి చూడని మొహాలు గనక వేలం వెఱ్ఱి కింద తయారై చుట్టూ గుమిగూడి ఎగబడి చూసి పిచ్చెక్కిపోయారని వాళ్ళ రాతల్ని బట్టే తెలుస్తున్నది.

1018-19: Mathura and Kannauj
వీడు మధురలో అడుగుపెట్టినప్పుడు అడ్డుకునే నాధుడు లేడు.అంత చక్కని నగరాన్నీ అంత పెద్ద ఆలయాల్నీ చూసి గజినీ కళ్ళు తిరిగిపోయాయి.ఎంత దోచుకుపోయాడో తెలీదు.

1018 జనవరిలో కన్నౌజ్ మీద దాడి చేస్తే రాజ్ పాల్ ప్రతీహార్ వీణ్ణి చూసి పరుగు లంకించుకున్నాడు!దోచుకోదగిన ఆలయాల్ని కూలగొట్టేసి దొరికినవాళ్ళని దొరికినట్టు చంపేశాక రాజ్ పాల్ ప్రతీహార్ తక్కుతూ తారుతూ వచ్చి గజినీకి సామంతుడిగా ఉండటానికి ఒప్పుకున్నాడు.దాంతో గజినీ బంగారు గుడ్లు పెట్టే బాతుని పట్టేసిన ఆనందంతో వెనక్కి వెళ్ళాడు.

1021: Kalinjar
ఆ రాజ్ పాల్ అట్లా పిరికిగా ప్రవర్తించడం నచ్చని Kalinjar రాజులు మిత్రులతో కలిసి వచ్చి అతన్ని ఓడించి చంపేశారు.దాంతో ఉగ్రుడైన గజినీ వీళ్ళ మీద దాడి చేసి ఓడించేశాడు.రాజు సామంతుడిగా ఉండటానికి ఒప్పుకుని ఇచ్చిన కానుకలతో సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయాడు.

1025: Somnath, 16th Invasion
అప్పటికే గజినీ లక్ష్యం సోమనాధ దేవాలయ విధ్వంసమేనని తెలియడంతో రాజపుత్రులు ఆలయాన్నే కోటలా మార్చి అక్కడినుంచే యుద్ధం చెయ్యటం మొదలుపెట్టారు.ముస్లిముల "అల్లా హో అక్బర్!" నినాదాలకు పోటీగా "హర హర మహాదేవ!" నినాదాలు చేస్తూ తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చారు.కానీ, వాళ్ళు లోపల ఉండి బయట ఉన్న వీళ్ళతో యుద్ధం చెయ్యాల్సి రావడం కష్టమైపోయి మూడు రోజుల తర్వాత ఆగిపోయారు.
ఈ దాడి వల్ల గజినీకి దక్కింది 20 మిలియన్ దీనార్లు - మొదటి దాడిలో తీసుకుపోయిన దానికన్న 80 రెట్లు అని చెబుతున్నారు!ఇక సోమనాధ విగ్రహ విధ్వంసం విషయానికి వస్తే ప్రఖ్యాత పర్షియన్ జియాలజిస్టు Al Kazvini కధనం ఇట్లా ఉంది:“ Somnath is a celebrated city of India, situated on the shore of the sea and washed by its waves. Among the wonders of the place was the temple in which was placed the idol called Somnath. This idol was in the middle of the temple without anything to support it from below, or to suspend it from above. It was regarded with great veneration by the Hindus, and whoever beheld it floating in the air was struck with amazement, whether he was a Mussulman or an infidel. 

The Hindus used to go on pilgrimage to it whenever there was an eclipse of the moon, and would then assemble there to the number of more than a hundred thousand. They believed that the souls of men used to meet there after separation from the body, and that the idol used, at its pleasure, to incorporate them in other bodies, in accordance with their doctrine of transmigration. The ebb and flow of the tide was considered to be the worship paid to the idol by the sea. Everything that was most precious was brought there as offerings, and the temple was endowed with the taxes gathered from more than ten thousand villages. There is a river, the Ganges, which is held sacred, between which and Somnath the distance is two hundred parasangs. They used to bring the water of this river to Somnath every day, and wash the temple with it. A thousand Brahmans were employed in worshipping the idol and attending on the visitors, and five hundred damsels sang and danced at the door – all these were maintained upon the endowments of the temple. The edifice was built upon fifty-six pillars of teak, covered with lead. 

The shrine of the idol was dark, but was lighted by jewelled chandeliers of great value. Near it was a chain of gold weighing two hundred mans. When a portion, or watch, of the night closed, this chain used to be shaken like bells to rouse a fresh lot of Brahmans to perform worship. When Sultan Mahmud, the son of Sabuktagin, went to wage religious war against India, he made great efforts to capture and destroy Somnath, in the hope that the Hindus would then become Mohammedans. He arrived there in the middle of Zu-l-ka’da, 416 A. H. (December, 1025 A.D.). The Indians made a desperate resistance. They kept going in to the temple weeping and crying for help; and then they issued forth to battle and kept fighting till all were killed. The number of the slain exceeded fifty thousand. The king looked upon the idol with wonder, and gave orders for the seizing of the spoil and the appropriation of the treasures. There were many idols of gold and silver, and countless vessels set with jewels, all of which had been sent there by the greatest personages in India. The value of the things found in the temples of the idols exceeded twenty thousand thousand dinars.

When the king asked his companions what they had to say about the marvel of the idol, and of its staying in the air without prop or support, several maintained that it was upheld by some hidden support. The king directed a person to go and feel all around and above and below it with a spear, which he did, but met with no obstacle. One of the attendants then stated his opinion that the canopy was made of loadstone, and the idol of iron, and that the ingenious builder had skillfully contrived that the magnet should not exercise a greater force on any one side – hence the idol was suspended in the middle. Some inclined toward this explanation, others differed from it. Permission was obtained from the Sultan to remove some stones from the top of the canopy to settle the point. When two stones were removed from the summit, the idol swerved on one side; when more were taken away, it inclined still further, until at last it rested on the ground."

ఆధునిక అయస్కాంత శక్తి/క్షేత్ర పరిశోధకులు కూడా అసాధ్యం అని తేల్చిన ఈ అద్భుతాన్ని మనవాళ్ళు అంత ప్రాచీన కాలంలోనే సుసాధ్యం చెయ్యడం నిజమే! మొదట నేనూ నమ్మలేదు,నమ్మకం లేకనే అబద్ధాలు రాయాల్సి వస్తుందేమోనని భయపడి సాటి బ్లాగర్లని కూడా అడిగి చూశాను.ఒక్కోసారి నిజమే చెప్పాలి అనే పట్టుదలతో నిజానిజాలు తేల్చుకోవడానికి నేను పడుతున్న శ్రమ చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది – మొత్తానికి నా శ్రమ ఫలించి సొమనాధ లింగం గాలిలో తేలడం నిజమేనని నిరూపించే ఆధారాలు దొరికాయి!

Pargiter అనే ప్రముఖ చారిత్రక పరిశోధకుడు పూ.సా 950 నాటిదని నిర్ధారించిన మహాభారత కావ్యంలో ప్రభాస క్షేత్రం గురించి ఇక్కడ చంద్రుడు శివుణ్ణి పూజించిన ప్రస్తావన ఉంది.ఆలయం ఉన్నట్టు చెప్పలేదు గానీ యాత్రాస్థలం అని పేర్కొన్నది.సా.శ 11వ శతాబ్దికి చెందినట్టు చెప్పబడుతున్న శివపురాణంలో బ్రహ్మ, విష్ణువు సృష్టికార్యం నిర్వహించే అవకాశం/అధికారం కోసం కలహిస్తుంటే శివుడు త్రిత్వ రూపమైన సమస్త విశ్వాన్నీ కుదించి ఒక జ్వాలాస్తంభం చేసి నిలబెట్టిన కధ ఉన్నది.ఆద్యంతాలు లేని ఈ జ్వాలాస్తంభం ప్రసన్నమైన వామన రూపం దాల్చితే శివలింగం అవుతుంది.జ్యోతిర్లింగాల వెనక ఉన్న సాంకేతికపరమైన విషయం ఏమిటంటే అవి రోదసి నుంచి భూమిపైకి జారిపడిన ఉల్కలు - అవి జారిపడేటప్పుడు శివపురాణంలో చెప్పబడిన జ్వాలాస్తంభం వలెనే గోచరిస్తాయి కదా!

సా.శ 10వ శాతాబ్ది నాటిదని భావిస్తున్న పద్మపురాణం సోమనాధ లింగం గురించి కొంత విస్తరించి చెప్పింది.కోడిగుడ్డు పరిమాణంలో ఉండి సూర్యకాంతితో పోటీపడి వెలుగులు విరజిమ్ముతూ ఉండేదని వర్ణించింది.భూమి లోపల ఉన్నట్టు చెప్తూ స్పర్శలింగం అని వ్యవహరించింది. శివలింగం గాలిలో తేల్తున్నదని చెప్తున్నవారు పరిమాణం కొంచెం ఎక్కవ అని చెప్తున్నారు.ఇది ఎలా జరిగి ఉంటుందో వూహించడం కష్టమే,అయినా పరిమాణపు లెక్కలు  దూరం నుంచి చూసి చెప్తున్నప్పుడు మనిషి మనిషికీ మారుతూ ఉండటం సహజమే కదా!

పూ.సా 900 నాటి తొలినాళ్ళలో భూమిలోపల ఉన్న సోమనాధ లింగం తర్వాత కాలంలో ఆనాటి భారతీయ విజ్ఞానుల మేధోశక్తి వల్ల సుదీర్ఘ కాలం పాటు గాలిలో తేలియాడుతూ నిలబడి దాని వెనక ఉన్న సాంకేతికత యేమిటో తెలిసినవారిని కూడా ముఖమంటపం దాటి లోపలకు అడుగుపెట్టగానే సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది!

సోమనాధ విధ్వంసం గురించి మరింత వివరమైన నివేదిక ఇచ్చిన ఆరబ్ చరిత్రకారుడు Abulfeda కూడా గజినీకి సోమనాధ లింగాన్ని పగాలగొట్టడం సాధ్యం కాక మంటలతో కాల్చి కరిగించాల్సి వచ్చిందని చెప్పాడు.Iron-Nickel meteorites చాలా గట్టి పిండాలు, అయస్కాంత శక్తిని కూడా కలిగి ఉంటాయి కానీ ఆ ఒక్క పాయింటు తెలిసినంత మాత్రాన దాన్ని అలా గాలిలో నిలబెట్టెయ్యడం అంత తేలిక కాదు - మెటలర్జీలో అపారమైన పరిజ్ఞానం ఉండాలి,తిమ్మిని బమ్మిని చేసే స్థాయిలో క్రియేటివిటీ ఉండాలి!
ఒక వస్తువును ఏ ఆధారమూ లేకుండా గాలిలో నిలబెట్టడానికి ప్రాచీనులు చేసినదీ ఆంధునికులు చేస్తున్నదీ ఒకటే - magnetic levitation mechanism అంటారు దాన్ని!అయస్కాంత ధర్మాలు అనగానే మనకి సజాతి ధృవాలు వికర్షించుకోవడం,విజాతి ధృవాలు ఆకర్షించుకోవడం మాత్రమే తెలుసు.ఈ కాస్త తెలియగానే ఉబ్బిపోయి "ఓహ్హో!అన్ని వైపుల నుంచీ సమానమైన బలంతో లింగాన్ని లాగే అయస్కాంతాల్ని పెట్టి శివలింగానికి విజాతి ధృవాల్ని లింగం వైపుకి తిప్పేసి ఉంటారు, వెరీ సింపులూ!" అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.Earnshaw’s theorem అనేది "So if one tries to make one magnet ‘hover’ using the magnetic attraction of another, the ‘hover’ magnet either sits limply on the tabletop or snaps quickly to the other one. It is not possible to make a bar magnet levitate in a stable position only through the use of other bar magnets as stipulated" అని కుండబద్దలు కొట్టి మరీ చెప్తుంది.

If we pretend we have a collection of bar magnets arranged in a square, another bar magnet placed in the center of the square will not be in a stable position, and will be pulled (and twisted around) out of the center, and likely towards one of the other magnets:

(It would be best to imagine the bar magnets standing up, i.e. the north pole of the magnet pointing out of the paper/monitor). Using vector calculus, one can show that a levitation device composed of any set of point charges/fixed magnets will have a ‘leak’ and the magnetic levitation will be unstable.

Because of this instability when using static fields, one can only create magnetic levitation with permanent magnets if the magnetic fields are time-varying or the levitating magnet is spinning. This latter possibility is used in the modern toy called the Levitron.అయితే, ఈ లెవిట్రాన్ ఆటబొమ్మలో గాలిలో ఉన్న వస్తువు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది,అది అలా తిరుగుతూ ఉండటం తప్పనిసరి.మరి, మనవాళ్ళు అలా గిర్రున తిరక్కుండానే నిలబెట్టారు కదా!

దీనికి కొన్ని మూలకాలకి ఉన్న diamagnetic propertyని వాడుకున్నారు.వీటి లక్షణం సజాతి,విజాతి అనే తేడా లేకుండా అయస్కాంత లక్షణం ఉన్న వస్తువుల్ని దూరం తోసేస్తూ ఉంటాయి.Diamagnets can be levitated in stable equilibrium in a magnetic field, with no power consumption. As to how use of diamagnets allowed the artisans of Somnath to violate the Earnshaw’s theorem , the following points are illustrative. Returning to our square arrangement of magnets, let us now replace the bar magnets in the corners with diamagnets. When the permanent magnet is right in the center of the square, the diamagnets all have ‘effective bar magnets’ of equal strength induced by it:

(Remember: the bar magnets are still pointing out of the paper/monitor) .When we move the bar magnet from the center, its magnetic field will be weaker in the diamagnets it moves away from and stronger in the diamagnets it moves towards. For instance:

The net result is that the diamagnets closest to the bar magnet push it away very strongly, while the diamagnets far away push it very weakly. This increasing and slackening of force keeps the magnet stably near the center of the system. The ‘leak’ that we had found earlier in our four point charge/bar magnet system has been ‘sealed’ by the varying strength of the diamagnetic response.The diamagnetic plates act very much like a pair of fellows escorting a drunk friend home: whenever their friend ‘wobbles’ in their direction, they apply some gentle pressure to direct him back upright!

బిస్మత్ అనే diamagnetic elementని వాడి మనవాళ్ళు ఈ ట్రిక్ సాధించగలిగారు.Al-Kazvini చాలా స్పష్టంగా చెప్పాడు “The edifice was built upon fifty-six pillars of teak, covered with lead” అని.చూడటానికి రెండూ ఒక్కలాగే ఉంటాయి గనక అతను పొరపాటు పడ్డాడు.Crude lead can contain up to 10% of bismuth. Lead has been smelted and used by Indian metallurgists since times immemorial. The open cast lead mine at Rampura-Agucha in Bhilwara district in Rajasthan which are geographically near to Somnath, and remaining picture you can draw yourself in your mind!

ఎంత అద్భుతం!మనకేంటి,బద్దలు కొట్టడానికి వచ్చిన గజినీకి కూడా దిమ్మ దిరిగి మైండు బ్లాంకయ్యి ఉంటుంది!ఈర్ష్యతో మరింత కసిపుట్టి నాశనం చేసి ఉంటాడు.ఈ పధ్నాలుగు వందల యేళ్ళ నుంచి ఇస్లామిక్ సమాజం ఇతరులు కట్టినవాటిని కూల్చటం, ఇతరుల కష్టార్జితాన్ని దోచుకోవటం, ఇతరుల ప్రాణాల్ని హరించటం తప్ప ప్రపంచానికి శాంతినీ ఆనందాన్నీ వృద్ధినీ కలిగించే ఒక్క వస్తువును కనిపెట్టలేదు,ఒక్క పుస్తకాన్ని రాయలేదు,ఒక్క కళారూపాన్ని సృజించలేదు,ఒక్క కన్నీటి చుక్కని తుడవలేదు, ఒక్క మంచిపని చెయ్యలేదు - అయినా మాదే గొప్పమతం అనే విరగబాటు, ఎందుకో!

ఇన్నేళ్ళపాటు కాలు గాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగిన గజినీ సాధించింది శూన్యం - ఈ కోడిగుడ్డంత సోమనాధ లింగాన్ని తీసుకెళ్తే ఆ మక్కాలో ఆ కాబాలో ఆ మూలలో ఆ గోడలో ఇరికించటం కుదరదు గాబట్టి నాశనం చేసి కసి తీర్చుకోవటం ఒకటే సంతృప్తి, అల్లా గారి కూతుళ్ళు ఇక్కడ దొరకలేదు గాబట్టి నిరాశతో కూడిన దుఃఖం ఒకటే మిగిలింది,దూరాభారం వొచ్చినందుకు డబ్బు కూడా  హుషారు పుట్టించే స్థాయిలో దొరకలేదు.ఏడుపొకటే తక్కువైన కసితో ఆడా మగా అని చూడకుండా దొరికిన వాళని దొరికినట్టు వూచకోత కోసేశాడు.మిగిలిన చోట్ల ఓడిపోయిన వాళ్ళు ధనం ఇస్తే తీసుకుని వెళ్ళినవాడు ఇక్కడ కూడా చాలినంత దొరికితే అట్లా ఎందుకు చేస్తాడు?

ఇక్కణ్ణుంచి దోచుకెళ్ళాడని చెప్తున్న సంపద విషయంలో కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి."అంత దూరం పోయి ఏం పీకుతున్నాడు వీడు?" అని సాటివాళ్ళు అనుకోకుండా ఉండటానికి ఎక్కువ చేసి చెప్పుకుని వుండవచ్చు కదా!మనవాళ్ళు కూడా, "అబ్బో!మా ఆలయాల్లోనే ఎంత సంపద వుందో చూడండి!" అనే ఫాల్స్ ప్రిస్టేజి కొద్దీ ఒప్పుకుని ఉండవచ్చు కదా!Third Party Assessment లేకుండా ఇలాంటి కాకిలెక్కల్ని నమ్మడం  నాకు నచ్చదు.అలెగ్జాండర్ - పోరస్ మధ్య జరిగిన యుద్ధం విషయంలో మార్షల్ జుఖోవ్ అనే రష్యన్ సైనిక నిపుణుడి సాక్ష్యం ఉంది కాబట్టే నేను అలెగ్జాండరు వోడిపోయి దారి ఖర్చులకి పురుషోత్తముణ్ణి అడుక్కుని ఆయన దయదల్చి ఇస్తే తీసుకుపోయాడని బల్ల గుద్ది చెప్పగలిగాను.ఇలాంటి బలమైన సాక్ష్యాలు లేనప్పుడు సూత్రీకరణలు గానో విశ్లేషణలు గానో చెప్పి వదిలెయ్యాలే తప్ప వాస్తవాల కింద నిర్ధారించి చెప్పకూడదు.

నిన్నటి రోజున కమ్యునిష్టులు చరిత్రని మార్చి రాశారని ఆరోపిస్తున్న ఇవ్వాళ్టి అతి హిందూత్వవాదులు కూడా కొన్ని విషయాలలో అదే పనిని చేస్తున్నారు!సరైన ఆధారాలు లేని సూత్రీకరణలనే నమ్మాల్సి వస్తే "Suppose, if there are fighters in a temple who use it as shield and inflict losses upon your army, what will you do? Will you wait or will you raid it?" అని అమాయకపు ప్రశ్నలు వేస్తూ గజినీ మహమ్మదును సమర్ధిస్తున్న వారి సూత్రీకరణల్నే నమ్మితే సరిపోతుంది గద!

మిగిలిన ఆలయాల మీద జరిగిన దాడుల్లో చెయ్యని రెండు పిచ్చిపనుల్ని గజినీ సోమనాధ విధ్వంసం అప్పుడు చేశాడు.అందులో మొదటిది మహాదేవుడికి తమ కళల్ని సమర్పించిన 400 మంది నర్తకీమణుల్ని బానిసల కింద తీసుకుపోవటం.వీళ్ళు మామూలు డ్యాన్సర్లు కాదు ఆయుర్వేదం, నిగమ సంగీతం, వైదిక విద్యలు తెలిసిన అఖండ ప్రజ్ఞాధురీణులైన మహిళామణులు!అయితే,వీళ్ళని తన రాజ్యం వరకు తీసుకు వెళ్ళలేకపోయాడు - .మధ్యలో చీకటి మాటున వీరి స్నేహితుల సహాయంతో తప్పించుకున్నారు.అప్పటికి తప్పించుకున్న వాళ్ళు తర్వాత క్రైస్తవ క్రూసేడర్ల చేతుల్లో మంత్రగత్తెల పేరున చంపబడ్డారు! బానిసల మార్కెట్టులో అమ్ముకోవడానికి తప్ప గజినీకి వీళ్ళెవ్వరూ ఇంకెందుకూ ఉపయోగపడే చాన్సు లేదు - వాడు నపుంసకుడు కాదు గానీ స్వలింగసంపర్కుడు.According to Tarikh-e-Ferishta, Sultan Mahmud had an obsession with buying the most beautiful slave boys wherever he could find them. He needed a new boy everyday.గుర్రాలూ గాడిదలూ ఖాళీగా ఉంటే తప్ప మోసుకెళ్ళడానికి తగిన సంపదే అక్కడ దొరికితే వీళ్ళ నెందుకు తీసుకెళ్తాడు?
Mahmud's companion was a Georgian slave Malik Ayaz, and his love for him inspired poems and stories.

మరొక పిచ్చిపని, అంత పెద్ద సైన్యంతో వచ్చి కూడా లోపలి వాళ్ళు తీస్తే తప్ప తెరుచుకోని ధృఢమైన ముఖద్వారపు తలుపుల్ని పట్టుకుపోవడం:సుందరీమణుల్ని బానిసల మార్కెట్టు కోసం కొట్టుకుపోయాడంటే అర్ధం చేసుకోవచ్చు,వీటికేం విలువ ఉంది?మోతబరువు తప్పిస్తే వీటివల్ల దమ్మిడీ ఆదాయం రాదు - ఆఖరికి అవి వాడి సమాధికి ఉపయోగపడ్డాయి, వాటి ఖర్మ అట్లా కాలింది!
తనకి మౌనభంగం కలగగానే చెట్టెక్కేసిన భేతాళుణ్ణి తీసుకెళ్ళటానికి మళ్ళీ చెట్టెక్కిన పట్టు వదలని విక్రమార్కుడిలా గజినీ సా.శ 1024 అక్టోబర్ 17న తన రాజ్యం నుంచి బయల్దేరి సా.శ 1024 నవంబర్ 20 నాటికి ముల్తాన్ చేరుకుని అక్కణ్ణించి సా.శ 1025 జనవరి 16 నాటికి సోమనాధ ఆలయం చేరుకునేవరకు మనవాళ్ళు ఏమీ చెయ్యలేనంత అజ్ఞానంలో ఉన్నారంటే నమ్మడం కష్టమే!ఇక్కడ పెద్ద సామ్రాజ్యం ఉండి ఉంటేనో అందరూ కలిసి పోరాడితేనో గెలిచి ఉండేవాళ్ళనీ ఐకమత్యం లేకపోవడం వల్లనే మనవాళ్ళు ఓడిపోయారనీ అంటున్న చరిత్రకారులకి మహాశక్తివంతుడైన ఔరంగజేబుని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన శివాజీ ఎందుకు గుర్తుకు రావడం లేదు?ఈ కారణాలు అన్నీ గజినీని ఎక్కువ చేసి మనవాళ్ళని తక్కువ చెయ్యడం కోసం ఆంగ్లేయ, కమ్యునిష్ట్,  ముస్లిం చరిత్రకారులు చెప్తున్న కుంటిసాకులు - వీటిని నమ్మాల్సిన పని లేదు.దాన్ని పగలగొట్టటమే వాడి జీవితలక్ష్యం అని అక్కడి చరిత్రకారులే సాక్ష్యం చెప్తున్నారు కదా, అంతటి స్థాయిలో ద్వేషం ఉన్నవాడు ఇక్కడ మహా సామ్రాజ్యాలు ఉన్నా ఆగడు. మక్కా లోని moon god temple కన్న గొప్పదైన మరొక moon god temple ఉండకూడదనుకున్నవాళ్ళు  కూల్చకుండా ఉండలేరు
"Days before the arrival of Mahmud of Ghazni, the ruler had transferred part of the wealth in Somnath Temple to a fortified offshore island Gundevi.   Another part was transported by Bhimdeva Solanki, to an impenetrable  area by horses at Mount Abu – the fortified castle of Achal Gadh.  Ships were used by sea routes via Bhadreshwar and then land route to Kanthkot at Kuchha, though the Pancheshwar route.

Some fixtures in gold , like the heavy gold chain for the bell and the embedded jewels of the main Someshwara idol were left as it is . Thinking that the treasure was hidden in some vault, Mahmud got enraged and broke open the whole temple.  He tried his best to get information and killed thousands of unarmed pilgrims inside the temple, a massacre of mad frenzy.

It was a sorry sight to see Mahmud of Ghazni finally leave with some girls , the broken Shiva idol ( 4 pieces to be wieldy ) and the dismantled pieces of the huge sandalwood doors.

He did NOT even get the magnificient Moonstone  inset as Shiva’s third eye on the forehead which would wax and wane in brilliance along with the light of the moon, like magic , even in the dark.

Within a few weeks the construction of a brand new Surya temple at Modhera took place, and the treasures shifted here." అనే కధనం నాకు హేతుబద్ధంగానే ఉన్నది, కానీ నిరూపించలేని దాన్ని వదిలేసి ప్రస్తుతం వాళ్ళు చెప్తున్న కధనం ప్రకారమే చూసినా తగినంత సంపదని దోచుకెళ్ళే అవకాశం ఉంటే ఆడవాళ్ళనీ తలుపుల్నీ మోసుకెళ్ళి ఉండేవాడు కాదనేది నిజం!

ఆంగ్ల ప్రభువుల కాలంలో ఈ తలుపుల చుట్టూ చాలా పెద్ద క్యామెడీ నడిచింది.మనవాళ్ళు అడిగారో వాళ్ళకే పుట్టిందో సా.శ 1843లో House of Commonsలో వీటి గురించి ఒక ఉత్తుత్తి చర్చ పెట్టేసుకుని హడావిడి చేసి గజినీ ఎత్తుకెళ్ళిన తలుపుల్ని వెనక్కి తెచ్చి సోమనాధ ఆలయానికి సమర్పించాలని ఒక గంభీరమైన నిర్ణయం తీసుకున్నారు.అప్పటి British East India Company యజమాని స్వంత బాధ్యతతో వాటిని గజినీ సమాధి నంచి వూడబెరికి తీసుకొచ్చి దేవాలయం ముందు నిలబెట్టాడు.ఆలయ ప్రధాన పూజారి చూసీ చూడగానే అవి నకిలీవని గుర్తుపట్టి అక్కర్లేదని తిరక్కొట్టేశాడు!మధ్యలో జరిగిన దొంగాటకం ఏంటంటే వూడబెరికిన అసలు తలుపుల్ని చారిత్రక ప్రాధాన్యత గలిగిన ప్రాచీన వస్తువుల వేలంపాటకి తరలించి డూప్లికేటు తలుపుల్ని మన మొహాన కొడదామనుకున్నారు. గుడిని కూల్చి సంబరపడేవాడు ఒకడు,తలుపుల్ని అమ్ముకుని బాగుపడేవాడు ఒకడు - దొందూ దొందే!

1026: The 17th and Last Invasion
ఈ దాడిలో ఏ ఆలయాన్నీ ధ్వంసం చెయ్యలేదు,ఏ రాజ్యాన్నీ కొల్లగొట్టలేదు.మరి, ఎందుకొచ్చాడంటే 16వ దాడిలో సోమనాధ దేవాలయం తలుపులూ గట్రా మోసుకుపోతుంటే జాట్లు వెనకనుంచి కొట్టి ఏడిపించారు.వాళ్ళ మీద పడి పగ తీర్చుకుని పోయాడు, అంతే!
1030లో మలేరియా వచ్చి చచ్చిపోయేముందు అప్పటికి మిగిలున్న తన కష్టార్జితాన్ని తెచ్చి తన యెదర పెట్టి చూపించమని అడిగి చుట్టూ పేర్పించుకుని చూశాక తన ముప్పయ్యేళ్ళ గాడిద చాకిరీని వొదిలేసి పోతున్నందుకు కుళ్ళి కుళ్ళి యేడ్చాడంట!ఎలాగూ చచ్చిపోతున్నానని తెలిసి కూడా ఎవరికీ ఇవ్వలేదంట! అంత పిసనారోడు గాబట్టే ఫిర్దౌసీకి ఇవ్వాల్సిన 60,000 దీనార్లు ఎగ్గొట్టాడు, ఆ కవిగారు కూడా రాజుగారు అక్షర లక్షలిస్తానన్నాడని రెచ్చిపోయి ఒక వాక్యంతో సరిపోయేదాన్ని పది వాక్యాలకి సాగదీసుంటాడు - దొందూ దొందే!
2.జామి మసీదు(సా.శ 1140/1296):
ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని Mehsana జిల్లాకు చెందిన Siddhpur నగరంలో ఉంది.ఈ నగరానికి ఆ పేరు ఇప్పుడు ఇక్కడ ఉన్న జామి మసీదు స్థానంలో ఉండవలసిన రుద్రమహాలయాన్ని సా.శ 12వ శతాబ్దంలో నిర్మించిన సిద్ధరాజ్ జైసింహ అనే రాజు పేరు మీద వచ్చింది.

ఈ ఆలయం మొత్తాన్ని ఈయన కట్టలేదు,సా.శ 943లో అప్పటి సోలంకి మహారాజు మొదలుపెట్టిన రుద్రమహాలయం సా.శ 1140లో సిద్ధరాజ్ జైసింహ చేత పూర్తి చెయ్యబడింది.మొదట సా.శ 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ కొంత కూల్చితే తర్వాత అహ్మద్ షా - I ఇంకొంత కూల్చి పడమటి దిక్కున ఇప్పుడున్న జామి మసీదును కట్టాడు.

సా.శ 1983 ఏప్రిల్ 19న Minorities Commission రాష్ట్రపతికి సమర్పించే 4వ వార్షిక నివేదికలో గుజరాత్ రాష్ట్రంలోని Mehsana జిల్లాలో ఉన్న Sidhpur నగరంలో ఉన్న Jãmi Masjid గురించిన ఒక వివాదాన్ని ప్రస్తావించింది.ఆ మొత్తం విషయం మధ్య యుగాల నాటి ముస్లిం పాలకుల చర్యల వల్ల ఆధునిక కాలంలో ఏర్పడుతున్న సమస్యల పట్ల కొన్ని సందేహాలను రేకెత్తిస్తున్నది.

దేశానికి ఆంగ్లేయుల నుంచి స్వతంత్రం వచ్చిన నాటినుంచే ఈ సమస్య రాజుకోవడం మొదలుపెట్టింది.అప్పటి బరోడా సంస్థానపు మహారాజు మసీదునీ ఆలయ శిధిలాల్నీ కలిపి చారిత్రక ప్రాధాన్యత కలిగిన కట్టడం కింద గుర్తించాలని డిమాండు చేశాడు.అది నెరవేరింది.సా.శ 1954 మార్చ్ 31న మసీదు ట్రస్టీలకీ ASIకీ మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల మసీదు ASI అధీనంలోకి వచ్చింది.

ఆ ఒప్పందంలో ప్రార్ధనని ఆపటానికి వీల్లేదని ముస్లిములు పెట్టిన ఒక కండిషన్ ఉంది."అంతే నాకు చాలు,తమలపాకు తొడిమే పది వేలు!" అన్నట్టు ప్రార్ధనకి ఇబ్బంది కలిగించకుండా  మసీదుని కదల్చకుండా మిగతా ప్రదేశం మీ ఇష్టం అనటంలోని ప్రమాదం ముస్లిములకి అప్పుడు తెలియలేదు!

మసీదుకి చిన్న చిన్న రిపేర్లు కూడా ఇప్పుడు వాళ్ళు సొంతంగా చేసుకోవటానికి వీల్లేదు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రభుత్వ సంస్థ - వీళ్ళు చెయ్యమన్న ప్రతి పనీ వాళ్ళెందుకు చేస్తారు?ముస్లింలు దీనిమీద హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు.అయితే,ASI వాళ్ళు రాజీకి రావటంతో ముస్లింలు కేసు ఉపసంహరించుకున్నారు.కానీ,ఈ రాజీ ప్రతిపాదనల్ని ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలి అన్న చర్చలు జరిగి అవి కార్యరూపం దాల్చే లోపునే కొత్త లిటిగేషన్ పుట్టుకొచ్చింది.మళ్ళీ ముస్లిములు హైకోర్టు గడప ఎక్కారు.మళ్ళీ ASI వాళ్ళు దీనికి కూడా రాజీ ప్రతిపాదన పంపించి పరిష్కారం కుదుర్చుకున్నారు.కానీ,ఈ రాజీ ప్రతిపాదనల్ని ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలి అన్న చర్చలు జరిగి అవి కార్యరూపం దాల్చే లోపునే కొత్త లిటిగేషన్ పుట్టుకొచ్చింది.మళ్ళీ ముస్లిములు హైకోర్టు గడప ఎక్కారు.మళ్ళీ ASI వాళ్ళు దీనికి కూడా రాజీ ప్రతిపాదన పంపించి పరిష్కారం కుదుర్చుకున్నారు.కానీ,ఈ రాజీ ప్రతిపాదనల్ని ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలి అన్న చర్చలు జరిగి అవి కార్యరూపం దాల్చే లోపునే కొత్త లిటిగేషన్ పుట్టుకొచ్చింది.మళ్ళీ ముస్లిములు హైకోర్టు గడప ఎక్కారు.మళ్ళీ ASI వాళ్ళు దీనికి కూడా రాజీ ప్రతిపాదన పంపించి పరిష్కారం కుదుర్చుకున్నారు.కానీ,ఈ రాజీ ప్రతిపాదనల్ని ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలి అన్న చర్చలు జరిగి అవి కార్యరూపం దాల్చే లోపునే కొత్త లిటిగేషన్ పుట్టుకొచ్చింది.మళ్ళీ ముస్లిములు హైకోర్టు గడప ఎక్కారు.

ఇల్లు ఇరకటం ఆలి మరకటం అన్నట్టు అసలు సమస్య వేరే ఉంది.ముస్లిముల ఫిర్యాదు యేమిటంటే,Archaeological Survey of India రిపేర్లు చెయ్యటానికి బదులు ఎక్కడ బడితే అక్కడ తవ్వేస్తూ ఉంటే తవ్విన చోటల్లా రుద్రమహాలయం శిధిలాలు బయట పడుతున్నాయి - ఇవి కాస్తా హిందువుల కళ్ళలో పడి వాళ్ళు వీటిని రక్షించడంతో పాటు ముస్లిముల్ని ప్రార్ధన చెయ్యనివ్వకూడదనీ అలా కాని పక్షంలో త్రవ్వకాల్లో బయటపడిన శివలింగానికి పూజలు చేసుకోవడానికి తమనీ అనుమతించాలని పట్టుపట్టటం మొదలుపెట్టారు!

మసీదు ట్రస్టీలు రాసిన అర్జీని పట్టుకుని సా.శ 1979 అక్టోబర్ 4 నుంచి Minorities Commission రంగంలోకి వచ్చింది.ట్రస్టీలు కమిషన్ సభ్యులకు చేసిన విన్నపం ప్రకారం సా.శ 1979 సెప్టెంబర్ 6న యోగేశ్వర్ దత్ అనే వ్యక్తి పెద్ద గుంపును వెంటబెట్టుకుని వచ్చి మసీదును అప్పగించమని గొడవ చేశాడు.అప్పటినుంచి అతను పదే పదే ఆ వొత్తిడిని కొనసాగిస్తూనే ఉన్నాడు.సహజంగానే కమిషన్ ఆర్కియలాజికల్ సర్వేని ఒక రిపోర్టు ఇమ్మని అడిగింది.ఈ రిపోర్టు వచ్చేలోపు ముస్లిం ఎమ్మెల్యే Begum Ayesha Sheikh ఇది ఆరెస్సెస్ శక్తుల పని అంటూ విమర్శలు మొదలుపెట్టి మైనారిటీ కమిషన్ ముందుకి వచ్చారు.హిందువుల వైపునుంచి చట్టవిరుద్ధమైన ప్రయత్నాలు మొదలు కావడంతో జటిలమైన సమస్య ముస్లిముల వైపునుంచి రాజకీయపరమైన ప్రతిఘటన మొదలు కావడంతో ఇక సామరస్యంగా పరిష్కారం కావడం అసంభవం అనిపించే పరిస్థితి నెలకొన్నది.

ASI ఎంత జాగ్రత్తగా వ్యవహరించి ఏ చిన్న పని చెయ్యడానికి పూనుకున్నా అనుకోకుండానే రుద్రమహాలయం అవశేషాలు బయటపడటం, ముస్లిములే పనులు ఆపెయ్యమని బతిమిలాడుకోవటం జరుగుతూ వస్తున్నది -  ముస్లిముల పరిస్థితి ముందుకెళ్తే నుయ్యి వెనక్కెళ్తే గొయ్యి అన్నట్టు తయారైంది.
3.కుతుబ్ మినార్(మొదటి నిర్మాణం సా.శ. 1191, ఆఖరి నిర్మాణం సా.శ. 1315):
దీన్ని గురించి నేను ఇదివరకే ఒక పోష్టు వేశాను.మళ్ళీ చెప్పడం అనవసరం.కానీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే ఇస్లామిక్ పండితుడు వెళ్ళి పరిశీలించి చూసి ఇది ఎట్టి పరిస్థితిలోనూ ముస్లిం కట్టడం అయ్యే అవకాశం లేదనీ హిందువుల దేవాలయం అనడానికి ఎలాంటి సందేహమూ అక్కర్లేదని తీర్మానించాకనే ఇది భారత దేశంలో తొలి ఇస్లామిక్ కట్టడం అనే గుర్తింపుని పొందిందంటే హిందువులలో అజ్ఞానం, అసమర్ధత, అవివేకం ఏ స్థాయిలో బలిసిపోయాయో అర్ధం చేసుకోవచ్చు - ఇవన్నీ అమాయకత్వం వల్ల అలవాటైన బలహీనతలు కావు,అవినీతి నుంచి పుట్టిన విషవృక్షపు శాఖలు!

అవినీతి స్వచ్చతని సహించలేదు.ఒక జాతిలో సాంస్కృతిక విధ్వంసం జరిగితే దానికి ఇతరులు ఎప్పటికీ కారణం కాదు - ఆ జాతిలోని అవినీతిపరులే సాటివారిలోనూ నైతిక భ్రష్టత్వాన్ని పోత్సహించి మొత్తం జాతియొక్క సంస్కృతిని శిధిలం చేస్తారు!కుతుబ్ మీనార్ ముస్లిం కట్టడం హోదాని పొందుతునప్పుడు అధికారంలో ముస్లిములు లేరు,అప్పుడు అధికారంలో ఉన్నది హిందువులే -  వారిని అధికారంలో కూర్చోబెట్టి పరవశించిపోయినది కూడా హిందువులే, కదా!
4.కమాల్ మౌలా మసీదు(సా.శ 1269/1305:
భోజశాల అనేది పేరు ప్రఖ్యాతులు కలిగిన సరస్వతీ మాత ఆలయం.రాజస్థాన్ నుంచి ఒదిషా వరకు, మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు సామ్రాజ్యాన్ని విస్తరించిన భోజరాజు సా.శ 1034లో నిర్మించిన ఆలయం ఇది.

మిగిలిన ఆలయాలను సుల్తానులో వాళ్ళ దగ్గిర పనిచేస్తున్న సైన్యాధిపతులో కూల్చితే దీన్ని కూల్చడం వెనక ఉన్నది ఒక ముస్లిం పకీరు - కమాల్ మౌలానా అనే మతప్రచారకుడు సా.శ 1269లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచీ సత్ప్రవర్తనతో గాక ఎత్తులు జిత్తులతో కూడిన మోసకారి తనం చూపించి అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మంది హిందువుల్ని ముస్లిం మతంలోకి లాక్కోగలిగాడు!ఒక దేశపు గూఢచారి శత్రుదేశంలో పని చేసినట్టు మాల్వా ప్రాంతపు వివరాల్ని సేకరించి అల్లావుద్దీన్ ఖిల్జీకి సమర్పించాడు.

ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని అప్పటికి పెద్ద పేరు లేని ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ సా.శ 1305లో మొదటిసారి ఈ ప్రాంతం మీద దాడి చేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు.తర్వాత దిలావర్ ఖాన్ ఈ సరస్వతీ ఆలయ సముదాయంలోని విజయ్ మందిర్ అనే ఆలయాన్ని దర్గా కింద మార్చటానికి ప్రయత్నించాడు.ఇప్పుడు ముస్లిములు ఇక్కడే నమాజు చేసుకుంటున్నారు.అసలైన దుర్మార్గం యేమిటంటే, అసలు ఇది ఏనాడూ హిందూ ఆలయం కాదనీ ఆది నుంచీ ఇది లాత్ మసీదు అనే ఇస్లామిక్ కట్టడమేననీ నిరూపించాలనే కొత్త సిద్ధాంతాల్ని తయారు చేస్తున్నారు!

మళ్ళీ మహమ్మద్ షా సరస్వతీ ఆలయం మీద దాడి చేసి దాన్ని దర్గా కింద మార్చాలని ప్రయత్నించాడు.అతను ఆలయం బయట ఉన్న స్థలాన్ని ఆక్రమించి కమాల్ మౌలానా చచ్చిపోయిన 204 యేళ్ళ తర్వాత "కమాల్ మౌలానా ముక్బారా" కట్టాడు.దీన్ని ఆధారం చేసుకుని దీన్ని హిందూ దేవాలయం కాక ముస్లిముల దర్గా అని నిరూపించాలనే ప్రయత్నాలు మొదలైనాయి.

సా.శ 1997 మార్చి 12 ముందు వరకు హిందువులకి బోజశాల లోపలికి వెళ్ళి రావడానికి అనుమతి వుండేది,కానీ పూజలు చెయ్యకూడదనే నిషేధం మాత్రం వుండేది.సరిగ్గా ఆ మరుసటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ముస్లిములకి శుక్రవారం ప్రార్ధనలకి కూడా అనుమతి ఇస్తూ అదే సమయంలో హిందువులకి అసలు ప్రవేశాన్నే నిషేధిస్తూ ఒక చట్టాన్ని తీసుకోచ్చాడు.

ప్రస్తుతం ఒక్క వసంత పంచమి రోజున మాత్రం హిందువులకి భోజశాలలో పూజలు చేసుకోవటానికి అనుమతి దక్కింది!
5.అదీనా మసీదు(సా.శ 1390:
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పాండువా దగ్గిర ఉన్న ఈ అదీనా మసీదుని సా.శ 1358-80 మధ్యన సికందర్ షా కట్టించాడు.ఈ మసీదు ద్వారం హిందువుల ఆలయాలకి ఉండే ద్వారంలానే ఉంటుంది.అది అలా ఎందుకు ఉందీ అంటే, దాన్ని అలాగే వాడుకున్నారు కాబట్టి!ఇప్పటికీ మసీదు గోడలు చెడగొట్టటానికి శక్యం కాక వదిలేసిన దేవతా ప్రతిమలతో నిండి వున్నాయి.మసీదు లోపల కూడా స్తంభాలూ మంటపాలూ అన్నీ గణేశ నటరాజ  ప్రతిమలతో అలంకరించబడి ఉన్నాయి!ఈ మసీదుకి పెట్టిన "అదీనా" అనే పేరు కూడా "ఆదినాధ్" యొక్క అపభ్రంశ రూపమే!
6.జామా మసీదు(సా.శ 1424):
ఇది కర్ణావతి అని పాత పేరు కలిగిన నేటి అహ్మదాబాద్ నగరంలో అహ్మద్ షా I కూలగొట్టిన భద్రకాళి ఆలయం శిధిలాల మీద నిర్మించబడిన మసీదు.

మొదటి భద్రకాళి ఆలయాన్ని నిర్మించినది ఈ ప్రాంతాన్ని సా.శ 9వ శతాబ్ది నుంచి 14వ శతాబ్ది వరకు పరిపాలించిన  పారమార్ వంశానికి చెందిన రాజపుత్రులు.

ఇప్పటికీ ఇస్లామిక్ సాహిత్యం నిషేధించిన పద్మాలు,లతలు,గంటలు,ఏనుగులే కాక కుండలినిని సూచించే ఒకదానినొకటి పెనవెసుకున్న జంట సర్పాలు కుడ్యాల మీదా స్తంభాల మీదా కనిపిస్తూనే ఉంటాయి.

నమాజులో మెడ అటూ ఇటూ తిప్పడం ఒక భాగం కదా, ఎటు తిప్పినా ఖుర్-ఆన్ సూక్తులు కాక రామాయణ శ్లోకమో వేదమంత్రమో కనబడేటట్టు ఏ ముస్లిం మసీదు కడతాడండీ!
7.బాబ్రీ మసీదు(సా.శ 1528):
హిందువుల నమ్మకాల ప్రకారం ఇప్పుడు మసీదు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు అయోధ్య రాముడి జన్మస్థలం అని సూచించే ఆలయం ఉండేది.బాబర్ సైన్యాధిపతుల్లో ఒకడైన మీర్ బక్వి సా.శ 1528లో దాన్ని కూల్చి బాబరు పేరు మీద ఒక మసీదు కట్టేశాడు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భజ్రంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ రంగప్రవేశం చేసి సాధు సంతులను రెచ్చగొట్టి దానినొక జాతీయ సమస్య కింద మార్చేవరకూ అయోధ్య చాలా ప్రశాంతంగా ఉండేది.లోపల ముస్లిములు నమాజు చేసుకుంటూ హాల్లో రాం లల్లా విగ్రహానికి హిందువులు పూజలు చేసుకుంటూ సర్దుకుపోయి బతుకుతున్నారు.రామాలయ నిర్మాణం కోసం కంకణం కట్టుకున్నామని చెప్పి అలాంటి సఖ్యతని చెడగొట్టిన భాజపా శ్రేణులు రామభక్తుల్ని ఎంత మోసం చేశాయో తల్చుకుంటే అద్వానీని ఉరి తియ్యడం న్యాయమేనని అనిపిస్తుంది!

ఆలయ నిర్మాణం కోసం సరయూ నదిలో ప్రమాణం చేసినవాళ్ళలో ఎంతమంది బతికి ఉన్నారో!కరసేవకులు మసీదు కూలగొట్టినప్పుడు అదే వూపులో రామాలయం కూడా కట్టేస్తారని ఎన్ని కోట్లామంది అమాయక భక్తులు ఆశలు పెట్టుకున్నారో!నమ్మించి మోసం చేసినందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భజ్రంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి రామభక్తుల ఉసురు తగలకపోతుందా?
8.జ్ఞాన్ వాపి మసీదు(సా.శ 1669):
“The Lord Cherisher of the Faith learnt that in the provinces of Thatta, Multan and especially at Benaras, the Brahmin misbelievers used to teach their false books in their established schools, and their admirers and students, both Hindu and Muslim, used to come from great distances to these misguided men in order to acquire their vile learning. His Majesty, eager to establish Islam, issued orders to the governors of all the provinces to demolish the schools and temples of the infidels, and, with the utmost urgency, put down the teaching and the public practice of the religion of these unbelievers” - ఇది మహా ఘనత వహించిన ఔరంగజేబ్ స్వయాన జారీ చేసిన హుకుం!

“according to the Emperor’s command, his officers had demolished the temple of Viswanath at Kashi”. (Maasiri-‘ Alamgiri, 88) అనేది కూడా అధికారికమైన మొఘల్ రికార్డుల నుంచి సేకరించిన సమాచారమే,అయినప్పటికీ ఔరంగజేబుని ఆలయ ప్రేమికుడిగా గోసంరక్షకుడిగా మనముందు నిలబెట్టడానికి రాం పునియాని,B.N.Pande వంటివారు ఎంతో శ్రమకోర్చి పరిశోధనలు చేసి ఎన్నో ఉద్గ్రంధాలను జనం మీదకి వదుల్తున్నారు.వీళ్ళ నీచత్వాన్ని చూసి వీదేశీయులైన Koenraad Elst వంటివాళ్ళే నిశ్చేష్టులౌతున్నారు - బహుశా, ఇలాంటివాళ్ళు తమ జాతిలో పుట్టనందుకు గర్విస్తూ ఉండి ఉండవచ్చు కూడా!

దారా షికోఒక ఆలయానికి కానుక ఇస్తేనే సహించలేని ఔరంగజేబు యొక్క స్వగతం ఇది:“In the religion of the Musalmans it is improper even to look at a temple” and therefore, presentation of a stone railing to Keshava Rai temple by Dara was “totally unbecoming of a Musalman”. చావటానికి రెండేళ్ళ ముందు, అంటే 1705 జనవరి 1న ఔరంగజేబు నుంచి వెలువడిన “demolish the temple of Pandharpur and to take the butchers of the camp there and slaughter cows in the temple … It was done”. Akhbarat, 49-7, cited in J.N. Sarkar, Aurangzeb, Vol.III, 189) అనే ఆజ్ఞాపత్రం  ఏమి చెబుతుంది మనకి?

కాశీ విశ్వనాధ ఆలయ ధ్వంసానికి మూలకారణం అని వీళ్ళు ప్రచారం చేసిన పిట్టకధ వింటే అసహ్యంతో ఒళ్ళు జలదరిస్తుంది - while Aurangzeb was passing near Varanasi on his way to Bengal, the Hindu Rajas in his retinue requested that if the halt was made for a day, their Ranis may go to Varanasi, have a dip in the Ganges and pay their homage to Lord Vishwanath. Aurangzeb readily agreed. The Ranis made a journey on the Palkis. They took their dip in the Ganges and went to the Jagganath temple to pay their homage. After offering Puja all the Ranis returned except one, the Maharani of Kutch.

“A thorough search was made of the temple precincts but the Rani was to be found nowhere. When Aurangzeb came to know of it, he was very much enraged. He sent his senior officers to search for the Rani. To their horror, they found the missing Rani dishonoured and crying, deprived of all her ornaments. The basement was just beneath Lord Jagannath’s seat. The Rajas expressed their vociferous protests. As the crime was heinous, the Rajas demanded exemplary action. Aurangzeb ordered that as the sacred precincts have been despoiled, Lord Vishvanath may be moved to some other place, the temple be razed to the ground and the Mahant be arrested and punished.అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు పెద్దలు - ఈ కధని అల్లినవాడికి అసలు కామన్ సెన్స్ అనేది ఉందా అని అనుమానం రావటం లేదూ!

నాకు సరిగ్గా గుర్తు లేదు,మనం చిన్నప్పుడు చరిత్ర పుస్తకంలో ఇదే చదివి ఉంటాం కదూ!మనం ప్రత్యేకించి దీని నిజానిజాలని గురించి బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు, Koenrad Elst వీళ్ళందరికీ ఎప్పుడో గడ్డి పెట్టేశాడు The story is very bizarre, to say the least. First of all, it has Aurangzeb go to Bengal. There are fairly complete chronicles of his doings, day by day; could B.N. Pande or any of his quoters give the date or even the year of this remarkable episode?Neither was Aurangzeb known to surround himself with Hindu courtiers. And did these Rajas take their wives along on military expeditions? Or was it some holiday picnic? How could the Mahant kidnap a Rani who was there in the company of other Ranis, as well as the appropriate courtiers and bodyguards? Why did he take such risk? Why did the “Rajas” wait for Aurangzeb to take “exemplary action”: did they fear his anger if they punished the priests or destroyed the temple themselves? And since when is demolition the approved method of purifying a defiled temple, an eventuality for which the Shastras have laid down due ritual procedures? అని!

Koenraad Elst అనే పెద్దమనిషి సాక్షాత్తూ మొఘల్ రికార్డుల నుంచి తీసుకుని ఇది తప్పని నిరూపించాడు గాబట్టి నోరు మూసుకున్నారు.మరి ఈ హిస్టొరీని మనకి చెప్పిన ఎమినెంట్ హిస్టోరియన్స్ ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పక్కన పెట్టుకుని ఆనాడు జరిగిన కధని కళ్ళకి కట్టినట్టు చెప్పగలిగారు?

సత్యాగ్రహ మతప్రవక్త గాంధీ మహాత్మా గారి సైన్యంలో అత్యంత ప్రముఖుడైన భోగరాహు పట్టాభి సీతారామయ్య గారు "The Feathers and the Stones" అనే పుస్తకంలో ఉటంకించార్ట!అయ్ బాబోయ్ అంత గొప్పోరు అబద్ధం చెప్తారా అనుకుని నమ్మేశార్ట!ఆయనగారు దాని గురించి ఇలా రాసుకున్నార్ట:“This story of the Benares Musjid was given in a rare manuscript in Lucknow which was in the possession of a respected Mulla who had read it in the Ms. and who though he promised to look it up and give the Ms. to a friend, to whom he had narrated the story, died without fulfilling his promise. The story is little known and the prejudice, we are told, against Aurangazeb persists.”అసలు మాన్యుస్క్రిప్టుని ఎవరో గుర్తు తెలియని ఒక ముల్లా దొరకబుచ్చుకున్నాట్ట!అతని నుంచి సీతారామయ్య గారి ఫ్రెండ్సులో గుర్తు తెలియని ఒక వ్యక్తి విన్నాట్ట!అతను సీతారామయ్య గారికి చెప్పాట్ట!సీతారామయ్య గారు పుస్తకంలోకి ఎక్కించాట్ట!పాపం, అసలు మాన్యుస్క్రిప్టును వీరికి ఇచ్చేలోపునే ఆ ఎవరో తెలియని ముల్లా గారు గుర్తు తెలియని శవం కింద మారిపోయాట్ట!ఇవన్నీ మనం నమ్మాల్ట!

అవును, ఇవన్నీ నమ్మితేనే మనం సెక్యులర్ హిందువులం,లేకపోతే హిందూ మతతత్వ వాదులం.విశ్వవీక్షణం నమ్మొచ్చు. కేయస్సీ నమ్మొచ్చు, చిరంజీవి వై నమ్మొచ్చు - నేను మాత్రం నమ్మట్లేదహో!
9.షాహీ ఈద్గాహ్ మసీదు(సా.శ 1669):
ఈ మసీదు అంతకు ముందున్న శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయాన్ని కూల్చి ఔరంగజేబు కట్టినది.ఆలయం అనామకమైనది కూడా కాదు,అక్కడ ఆలయం ఉండేదా లేదా అన్న అనుమానాలకి తావు లేదు,అన్ని ఆధారాలూ ఉన్నాయి.కాకపోతే ఔరంగజేబును సెక్యులర్ చింతన కలిగిన పరమత సహిష్ణువు అని నిరూపించాలని శతవిధాల ప్రయత్నిస్తున్న్న కమ్యునిష్టు,ముస్లిం చరిత్రకారులు ప్రయత్నిస్తుండటం వల్ల హిందువుల వాదన నిలబడటం లేదు, అంతే!
10.బిజా మండల్ మసీదు(సా.శ 1707):
విదిషా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని భోపాల్ తర్వాత మరో ముఖ్యమైన నగరం.ఇక్కడున్న బిజామండల్ మసీదు కూడా అంతకు ముందున్న హిందూ దేవాలయాన్ని కూలగొట్టి కట్టినట్టు తెలిసిపోతూనే ఉంటుంది.చర్చిక అనే చతుష్షష్టి యోగినీ గణంలోని ఒక శక్తిరూపిణికి నిర్మించిన ఆలయాన్ని తమకి చేతనైనంతవరకు రూపం మార్చి బిజామండల్ మసీదు అని పేరు పెట్టేసి వాడుకుంటున్నారు.విజయాన్ని ప్రసాదించే ఈ దేవత ఆలయాన్ని పారమార వంశానికి చెందిన నరవర్మ మహారాజు నిర్మించినట్లు ASI నిర్ధారణ కూడా చేసేసింది.

సా.శ 1679-1808 మధ్యన ఔరంగజేబు ఈ ఆలయం మీద దాడి చేసి సంపదని దోచుకుని విగ్రహాలని గుడిలో ఉత్తరం వైపున పాతిపెట్టించేసి ఆలయాన్ని మసీదు కింద మార్చేశాడు.బిజా మండల్ అనే పేరు కూడా విజయ్ మందిర్ అనే పదానికి భ్రష్ట రూపమే!

కొన్ని ఆలయాల్ని ధనం ఇచ్చి కాపాడుకోవాలని ప్రతిపాదనలు చేసినప్పటికీ ముస్లిములు వాటిని తిరస్కరించి కూలగొట్టేయ్యడానికే ప్రాధాన్యత ఇచ్చారు - వారి ప్రవక్త ప్రత్యేకించి నిషేధించినవాటిని కూలగొట్టకపోతే వారు నరకానికి పోరూ!ఇక్కడ అధికారం స్థాపించుకున్నాక కూడా ప్రజలు తిరగబడే ప్రమాదం వుందనుకోవడం వల్లనే వదిలేశారు గానీ లేకపోతే ఒక్క ఆలయం కూడా నిలిచేది కాదు!

ఇంత రాక్షసంగా వైదిక సంప్రదాయాన్ని ద్వేషించే వీళ్ళు మక్కా లోని కాబా దగ్గిర అదే సంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారు?

ముప్పయ్యేళ్ళ పాటు సనాతనధర్మం మీద పగబట్టి ఇల్లు దాటి, వూరు దాటి, నగరాల్ని దాటి, రాజ్యం దాటి, ఎడారి దాటి, నదుల్ని దాటి, సైన్యాన్ని చంపుకుని, గుర్రాల్ని చంపుకుని  సోమనాధ విగ్రహ విధ్వంసకుడని ఇస్లామిక్ ప్రపంచం మొత్తం చేత కీర్తించబడిన గజినీ మహమ్మదు కూడబెట్టిన సంపద ఆఖరి దాడి చేసి వెనక్కి వెళ్తున్నప్పుడు క్రిమియుద్ధం తరహాలో జాట్లు అంటించిన మలేరియా రోగం నుంచి కాపాడలేకపోయింది - కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు మలేరియాకి చేసిన వైద్యం వికటించి క్షయరోగం కింద మారి అలమటించి అలమటించి చచ్చాడు! సనాతన ధర్మం మాత్రం తన మీద దాడి జరుగుతుందని తెలిసినపుడూ దాడి జరుగుతున్న సమయంలోనూ దాడి ముగిసిన తర్వాత కాలంలోనూ ఒక్కలాగే చెక్కు చెదరని చిరునవ్వుతో నిలిచి ఉంది!

ఇంతకీ అసలు నల్లరాయి ఏమై ఉంటుంది?ఆ మక్కాలో ఆ కాబాలో ఆమూలలో ఆగోడలో నిశానీ ప్రవక్త గారు ఇరికించినది ఉజ్జయిని పరిపాలకుడు విక్రమార్క మహారాజు నిర్మంచిన శివాలయంలోని మూలవిరాట్టు అనేది పూర్వ ఇస్లామీయ అరబిక్ చరిత్ర చెప్తున్న సత్యం.ఒకసారి వడిసెల దెబ్బకి గురయి ముక్కలైందనీ ఒకసారి అపహరణకి గురయిందనీ ఇస్లామిక్ చరిత్ర చెప్తున్న సత్యం - అపహరించినవాడు తిరిగి ఇవ్వలేదనేది కూడా వారే చెప్తున్న సత్యం!గుడ్డలమూటని అక్కద విసిరేసినది ఎవరు?అందులో ఉన్న ప్రకటనని బట్టి మక్కా గుడికి సంబంధించినవారే తస్కరించియో లేక ఏ విధంగానైనా కొందరిని "ఆ మక్కాలో ఆ కాబాలో ఆమూలలో ఆగోడలో నిశానీ ప్రవక్త గారు ఇరికించిన  నల్లరాయి"ని సాధించి తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చారు అని తెలుస్తున్నది.అయితే,ఆ కార్యం సాధించగలిగిన వ్యక్తి తన వీరత్వాన్ని చాటుకుని ప్రశంసలు అందుకోకుండా అనామకంగా ఉండిపోవాల్సిన అవసరం ఏమిటి?నీళ్ళలో వేస్తే మునక్కుండా తేలడానికి జవాబు చెప్పుకోవలసి వస్తుందని కాదూ?నీటిలో వేస్తే తేలిన ఈ వెండి కట్ల యోని ఆకారపు గిన్నెలోని గులకరాళ్ళు అంతటి కఠినశిల పగిలితే వచ్చిన ముక్కలు అనడానికి కామన్ సెన్సే కాదు,షాక్ అబ్సార్ప్షన్ ఫిజిక్స్ కూడా వొప్పుకోదు - మరి అసలు ప్రవక్త స్వహస్తాలతో ఆ మక్కాలో ఆకాబాలో ఆ మూలలో ఆగోడలో ఇరికించిన నల్లరాయి ఏమైనట్టు?ఏమైందో నాకు తెలుసు గానీ నేను చెప్పను - ముస్లిములు చెబితే వినాలని ఆశ! క్రైస్తవంలోని త్రిత్వం గురించీ హిందువుల వేదాల్లోని సుర గురించీ కూడా చెప్పగలిగిన M.A.Abhilash/K.S.Chaudari/Ahmed Chaudari త్రయం ఏమి చెబుతారో వినాలని ఉంది.వారికి తెలియకపోతే వారికన్న మహ్హాపండితుడైన జకీర్ నాయక్ ఉన్నారు కదా!

శతకోటి లింగాల్లో ఒక బోడిలింగం ఏమైతేనం అని సరిపెట్టుకోవటానికి అది మామూలు నల్లరాయి కాదే!The Black Stone is attached to the east corner of the Kaaba, known as al-Rukn al-Aswad (the Corner of the Black Stone). The choice of the east corner may have had ritual significance; it faces the rain-bringing east wind (al-qabul) and the direction from which Canopus rises.Another stone, known as the Hajar as-Sa’adah (Stone of Felicity) is set into the Kaaba's opposite corner, al-Rukn al-Yamani (the Yemeni Corner), at a somewhat lower height than the Black Stone.According to a prophetic tradition, "Touching them both (the Black Stone and al-Rukn al-Yamani) is an expiation for sins." - అల్లాహ్ గారి ఎడంచేయి అని చెబుతున్న నల్లరాయి అక్కద లేనప్పుడు గులాకరాళ్ళ చుట్టూ హజ్ యాత్ర చేసి ఉపయోగం ఏమిటి?

విగ్రహ్హారాధన మహ్హాపాపం అని హిందువుల్ని బెదిరిస్తున్న ముస్లిం మతస్థులు మక్కాయాత్రలో చేస్తున్నది ఏమిటి?small brain వాళ్ళు మాత్రమే విగ్రహ్హారాధన అనే మహ్హాపాపం చేస్తారంటూ రంకెలేస్తున్నారే అక్కడ లేని నల్లరాయిని ఉన్న వెండికట్ల గులకరాళ్ళ గిన్నెలో చూసుకుని దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు వాళ్ళ large brain ఏమైంది?
ఈ నల్లరాయిని ముద్దు పెట్టుకోవడం పెద్ద ఆనందకరమైన అనుభవం కూడా కాదు - నీ భక్తి పారవశ్యం కొద్దీ ఎక్కువ సేపు నువ్వు ముద్దులు పెట్టేస్తూ ఉంటే గార్డు వాడి ఉద్యోగ ధర్మం కొద్దీ ఎడాపెడా లాఠీతో నీ పిర్రల మీద పెటాపెటా మద్దెల వాయించేస్తూ ఉంటాడు!ఇదింకా నయం, ఇదివరలో కొరడాలు వాడిన కాలంలో తోలు వూడొస్తూ ఉండేది, పాపం!

ఇవ్వాళ ముస్లిములు సంవత్సరాని కొకసారి చేస్తున్న మక్కా యాత్రలోని ప్రతి అంశమూ పూర్వ ఇస్లామీయ మక్కేశ్వర నిలయ పూజారివర్గం నిర్దేశించిన వైదిక సంప్రదాయం కాదూ!

నిత్య కలహాలతో అతలాకుతలమౌతున్న పూర్వ ఇస్లామీయ అరేబియన్ తెగలను పూర్వ సామాన్య శకం 100వ సంవత్సరంలో ఉజ్జయిని పరిపాలకుడు విక్రమార్క మహారాజు జయించి సనాతన ధార్మిక సంస్కృతిని పరిచయం చేశాడు.వారిలో సఖ్యతను నిలబెట్టటానికి అతడు చేసిన ముఖ్యమైన ఏర్పాటు మక్కాలో కాబా గుడిని నిర్మించి వైదిక చాతుర్మాస్యపు నిబంధనని పోలిన పవిత్ర మాసపు నిబంధన పెట్టటం - ఆ పవిత్ర మాసంలో ఇతరులతో కలహాలు మానివెయ్యటమే కాక పాత కలహాలను మర్చిపోయి మక్కా లోని కాబా గుడి వద్ద జరిగే ఆరాధనోత్సవాల్లో పాలు పంచుకుంటూ ఉండేవాళ్ళు!దీనికి సంబంధించిన ప్రస్తావనలు ఖురానులోనూ వున్నాయి.ఆనాటి పూర్వ ఇస్లామీయ మక్కా యాత్ర లోని విగ్రహారాధన పద్ధతులనే ఇప్పటికీ పాటిస్తున్నారు విగ్రహారాధన మహాపాపం అని అంటున్న ముస్లిములు!

"Mohammad's grandfather and uncles were hereditary priests of the Kaaba Temple which housed 360 Vedic Idols!" అని Encyclopedia Islamia ఎప్పుడో ఒప్పుకున్నది.మొదట్లో ఆ మక్కాలో ఆ కాబాలో ఆ మూలలో ఆ గోడలో ఇరికించిన నల్లరాయి చుట్టూ ముస్లిములు చేస్తున్న అపసవ్య ప్రదక్షిణలను గురించి తెలుసుకున్నప్పుడు ఇతర మతాల నుంచి కాపీ కొట్టినవాటిని అసలు మతం వాళ్ళు గుర్తుపట్టి పోట్లాడి పరువు తియ్యకుండా ఉండటానికి లేబుల్స్ మార్చటమో రివర్సు చెయ్యటమో చేసిన అలవాటు చొప్పున చేశాడనుకున్నాను గానీ కాదు,అది శివుడికి సహజమైన చండీ ప్రదక్షిణయే!

ఆలయాలకి, గిరులకి,తరువులకు, ప్రదక్షిణంచేయడం సనాతన ధర్మంలో భాగమే! ప్రదక్షిణం అంటే మన కుడి భుజం ఆలయం వైపు లేదా గిరివైపుగా ఉండగా చుట్టూ తిరగడమే ప్రదక్షిణం, ఎడమవైపుగా ఉండడం అప్రదక్షిణం. అన్ని ఆలయాల్లోనూ  ప్రదక్షిణం మూడు సార్లు చేస్తాం. శివాలయంలోనూ ప్రదక్షిణం  మూడు సార్లే చేస్తాం. కాని అన్ని గుడులలోనూ చేసినట్టు కాదు. శివాలయాన్ని పరిశీలిస్తే, వెళ్ళగానే కనపడేది ద్వజస్థంభం. దీనికి సరళ రేఖలో నంది, నందికి సరళ రేఖలో శివలింగం కనపడతాయి. 

శివ ప్రదక్షిణం  చేయాలంటే ధ్వజస్థంభం ఈవలినుంచి కుడి వైపుగా అనగా అప్రదక్షిణంగా బయలుదేరి సోమ సూత్రం దాకా వెళ్ళి అక్కడనుంచి వెనక్కి వచ్చి ధ్వజస్థంభం ఈవలినుంచే కుడి వైపుగా సోమ సూత్రం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి మళ్ళీ ధ్వజస్థంభం మీదుగా సోమ సూత్రాని జేరి వెనక్కి బయలుదేరిన చోటికి వచ్చి మూడుప్రదక్షిణలు పూర్తి చేయాలంటే అప్రదక్షిణంగా సోమ సూత్రం దగ్గరకు మూడు సార్లు, ప్రదక్షిణంగా రెండు సార్లు వెళ్ళి బయలుదేరిన చోటికి అనగా ధ్వజస్థంభం దగ్గరకు జేరితే మూడు ప్రదక్షిణలు పూర్తయినట్టు. ఏ ప్రదక్షిణం  లోనూ సోమ సూత్రం దాటడం జరగదని గుర్తించాలి.

సోమ సూత్రమనగా, లింగానికి కింద ఉండేది పానవట్టం. అభిషేకం చేసిన ద్రవ్యాలు బయటికి వచ్చేమార్గమే సోమ సూత్రం. శివాలయాలు తూర్పు ముఖంగానూ, పశ్చిమ ముఖంగానూ ఉంటాయి. ఏముఖంగా ఉన్నా సోమ సూత్రం మాత్రం ఉత్తరం వైపే ఉంటుందని గుర్తించాలి.

ఆ తరవాత నంది పృష్టాన్ని తడిమి కొమ్ముల మధ్యగా శివుని దర్శించాలి.ఏ సమయంలోనూ ధ్వజస్థంభం,నంది మధ్యగాని,నందికి శివునికి మధ్యగాని దాటకూడదంటారు.అనుమానం తీర్చుకోడానికి బొమ్మలో చూడండి.
మక్కాలో అభిషేకాదులు చెయ్యకపోవటం చేత సోమసూత్రం లేదు,కాబట్టి వెనక్కి తిరగడం లేదు.మిగిలిన పద్ధతి మొత్తం వైదిక విధి నిర్ణయించిన శివుడికి సంబంధించిన మూర్త్యారాధన లోని ప్రదక్షిణ విధానమే కదా!శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సమయం అని భావించే ప్రదోష కాలం చాంద్రమానంలో రెండు నెలలకొకసారి వస్తుంది,పక్షంలోని 13వ రోజు సాయంసంధ్యని ప్రదోషవేళ అంటారు.మక్కాలోని కాబాను తెరిచే సమయం కూడా ప్రదోషవేళ, సాయంకాలం 04:30కి 05:30కి మధ్యనే!

శివాలయంలో అభిషేకాదుల అనంతరం పట్టువస్త్రంతో తుడిచినట్టు మక్కాలో కూడా Hajar-E-Aswadని పట్టు రుమాలుతో తుడుస్తారు.వైదిక గ్రంధాలు ఆలయానికి వెళ్ళేటప్పుడు ధరించాల్సిన దుస్తులకి సంబంధించిన నిబంధననే ముస్లిములు కాబా యాత్రలో పాటిస్తున్నారు.ఈశ్వరార్చన చేసేటప్పుడు సూదితో కుట్టని పట్టు వస్త్రాన్ని మాత్రమే ధరించాలని చెప్పిన ప్రకారమే ఆలయ పూజార్లూ ధర్మకర్తలూ ధోవతి,ఉత్తరీయం ధరించి కనబడుతున్నారు.మక్కా యాత్రలో కూడా ఇది తప్పనిసరి నిబంధన కావడం అనుకోకుండా జరిగినది కాదు - పూర్వ ఇస్లామీయ విగ్రహారాధకుల మక్కా యాత్రనే మూర్త్యారాధన వ్యతిరేకులైన ముస్లిములు కొనసాగిస్తున్నారు!విగ్రహారాధన మహాపాపం అని నొక్కి వక్కాణించిన ప్రవక్త మహమ్మదు గారు విగ్రహారాధనతో కూడిన మక్కా యాత్రని ఎందుకు పెట్టాడో నాకు తెలుసు గానీ నేను చెప్పను - ముస్లిములు చెబితే వినాలని ఆశ. క్రైస్తవంలోని త్రిత్వం గురించీ హిందువుల వేదాల్లోని సుర గురించీ కూడా చెప్పగలిగిన M.A.Abhilash/K.S.Chaudari/Ahmed Chaudari త్రయం ఏమి చెబుతారో వినాలని ఉంది.వారికి తెలియకపోతే వారికన్న మహ్హాపండితుడైన జకీర్ నాయక్ ఉన్నారు కదా!

"సుమారు 15 ఏళ్ల క్రితం దివ్యఖురాను తెలుగులో వచ్చిన కొత్తలో చదివాను, ఇప్పటికీ ఆ గ్రంధం నాదగ్గర పుస్తకాల్లో భద్రంగానే ఉంది. జన్మలో మోక్షం పొందాలంటే జీవితంలో ఒకసారైనా మక్కా వెళ్లి సాంప్రదాయికంగా తల వెంట్రుకలు, గడ్డలు, మీసాలు తీసుకుని తెల్లని లుంగీ కట్టుకుని, తెల్లని ఉత్తరీయం పైన కప్పుకుని అక్కడి నల్లరాతి గృహమైన కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేయాల్సిందే కదా? మహమ్మద్ ప్రవక్త కాబాలో విగ్రహాలు తొలగించేవరకూ అక్కడ విగ్రహారాదన జరిగిన మాట వాస్తవం కాదా? దేవుడు అంతటా ఉన్నపుడు మక్కా వెళ్లి అక్కడి కాబా గడపను తాకి ప్రదక్షిణాలు చేసి ప్రార్థన చేస్తేనే కాని ఎందుకు మోక్షం లభించటంలేదు? ఎక్కడా లేని మహిమ అక్కడ ఉన్నదనే విశ్వాసంతోనే కదా అందరూ వెళుతుంది. గుడిలోని విగ్రహారాదన కూడా అలాంటి విశ్వాసమే. ఎవరి విశ్వాసం వారిది." అని మఠం మల్లిఖార్జున స్వామి గారు వారి బ్లాగు లోనే చెప్పారు కదా, తెల్లటి దుస్తులు ధరించటం, తలనీలాలు ఇవ్వటం, ప్రదక్షిణ చెయ్యటం, అక్కడి బావితీర్థం వెంట తీసుకురావటం అన్నవి ధార్మిక గ్రంధమైన దివ్య ఖురాను (సురాహ్ ఆల్ బఖరహ్, భాగం-2, పేజీ-31) గ్రంధమునుండే చెప్పటం జరిగింది. ఆన్ లైన్ లోగల దివ్య ఖురాన్ లో ఈ విషయాలు చూడవచ్చు, బహుళ ప్రాచుర్యం పొందిన Lapidus రచించిన ఇస్లామిక్ చరిత్రలో ఈ అన్ని విషయాలు చర్చించబడినవి. 

ముస్లిములు నమాజు చేసే భంగిమ హిందువుల సాష్టాంగ ప్రణామం యొక్క మరో రూపమే - స్త్రీలకూ వృద్ధులకూ రోగులకూ ప్రత్యామ్నాయం అని సనాతనధర్మం చూపించిన దానినే వారి ప్రవక్త ముస్లిములకి సార్వజనీనం చేశాడు,అంతే!సనాతనధర్మం దైవప్రార్ధన ముందు "శరీర శుధ్యర్ధం పంచాంగ న్యాసం!" అని చెప్పి ముఖం,అరిచేతులు,మోచేతులు,పాదాలను నీటితో కడుక్కోమని సూచించిన దానిని ముస్లిములు తు.చ తప్పకుండా పాటిస్తూనే ఉన్నారు.ఇస్లామిక్ సంప్రదాయంలో సంవత్సరానికి నాలుగు నెలలు అత్యంత విశిష్టమైనవి.ఆ కాలంలో వారు ఎలాంటి యుద్ధాలు.దోపిడీలు,హత్యలు చెయ్యరు.ఇది అనాది కాలం నుండి హిందువులు పాటిస్తున్న చాతుర్మాస్య వ్రతం నుంచి తీసుకున్నదే!Shab-E-Barat అనే పదం కూడా Shiva Vrat అనే పదం యొక్క అపభ్రంశ రూపమే.పితరులను స్మరించడానికి హిందువులు ఆచరిస్తున్న పితృపక్షం అనే 15 రోజుల సమయాన్ని ఇస్లామిక్ సంప్రదాయం Eid-ul-Fitr పేరున వ్యవహరిస్తున్నది.పేర్లు వేరైనప్పటికీ తీరు ఒక్కటే.

ఇవన్నీ వైదిక సాహిత్యం,ఇస్లామిక్ సాహిత్యం క్షుణ్ణంగా తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలిసే ప్రాధమిక సత్యాలు.మరీ మూలలకి పోయి శోధించాల్సిన పని లేకుండా రేఖామాత్రం తరచి చూసినవాళ్ళకి కూడా తెలిసే సత్యాలను దాచిపెట్టి కొందరు ముస్లిం మత ప్రచారకులు కేవలం హిందువుల్ని విగ్రహారాధన పాపం అనే పేరుతో భయపెట్టి తమ మతంలోకి లాక్కోవటానికి ప్రయత్నిస్తూ వారి ప్రయత్నాలని వ్యతిరేకించే హిందువులకి మతతత్వవాదులని ముద్ర వేసి అల్లరి పెడుతున్నారు.


సోషల్ మీడియా అనేది కొన్ని నెగటివ్ అంశాల్ని కలిగి ఉన్నప్పటికీ ఇస్లాం మతం యొక్క నిజమైన చరిత్ర,ఇస్లామిక్ మతోన్మాదం,న్యూ వరల్డ్ ఆర్డర్ పేరుతో ఇల్యూమినాట్టి వంటి రహస్య క్రైస్తవ సంఘాల గురించీ క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నకాలంలో ఈ వెసులుబాటు లేని కాలంలో పనిచేసిన పాత చింతకాయ పచ్చడి రాతల వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదని గ్రహించలేకపోతున్నారు, పాపం!

ఈ పోలికలు ఏవీ కాకతాళీయం కాదని గ్రహిస్తే కేవలం పధ్నాలుగు వందల యేళ్ళ క్రితం పుట్టిన ఇస్లాం నుంచి ఆంతకు నుందునుంచే ఉన్న హిందూమతం స్వీకరించటం అనేది అసంభవం గనక ఇస్లాం ధర్మమే హిందూమతం నుంచి వీటిని స్వీకరించిందనేది స్పష్టం. భారతదేశంలో పుట్టిన బౌద్ధమతం, శైవ మతం, రామానుజ మతం, మధ్వ మతం వంటి వైదిక సాహిత్యం నుంచి కొన్ని భావాల్ని తీసుకున్న శాఖలు ఏనాడూ తమకి మూలమైన సనాతన ధర్మం పట్ల శత్రుభావం చూపించ లేదు, ఇదే సనాతన ధర్మం నుంచి భారత దేశానికి బైట పుట్టిన యూదుమతం ఏనాడూ శత్రుభావం చూపించనప్పుడు మరి, ఆ మతం నుంచి పుట్టిన క్రైస్తవ, ముస్లిం మతస్థులు ఎందుకు శత్రుభావం  చూపిస్తున్నారు?


నాకు తోచినంతవరకు ఇలాంటి ప్రయత్నాల వెనక తమ మతం యొక్క గొప్పదనాన్ని చెప్పుకోవాలన్న ఆధ్యాత్మికమైన కారణాలు ఉండవు.తమ మతం గురించి చెప్పుకోవడానికి ఇతర మతగ్రంధాల లోటుపాట్ల చర్చలు అనవసరం కదా!ఇతర మతాల నుంచి కూడా వీరు చెప్పే అబద్ధాల్ని నమ్మి వచ్చే అమాయకుల్ని వీలయినంత ఎక్కువ మందిని లాక్కుని విధేయులైన భక్తుల/అనుచరుల/బానిసల సంఖ్యని పెంచుకుని ఈ విధేయుల మీద తమకున్న అధికారం నుంచి స్వలాభం పొందాలన్న ఆకాంక్షయే వీరిచేత తమకు అబద్ధాలని తెలిసిన వాటినే అంత ధీమాగా అక్షరసత్యాల కింద ప్రకటించటానికి వారిని ప్రేరేపిస్తుంది. సుర అంటే కల్లు అని వైదిక మంత్రాలకి తప్పుడు అర్ధం చెప్పటం  తెలియక చేసిన పొరపాటు కాదు, తెలిసి చేసిన దుర్మార్గమే - హిందువులలోని బక్రాల కోసం గత 1000 యేళ్ళ క్రితం నుంచి జరుగుతున్న దాడికి కొనసాగింపు తప్ప మరొకటి కాదు.ఇలాంటి చవకబారు పనులతో తాము హిందువులలో కలిగిస్తున్న సంచలనాన్ని చూపించి కొన్ని సంస్థల నుంచి ముందస్తు నిధులు సమకూర్చుకోవడం కూడా వీరికి ఆదాయమార్గమే.ఈ లాభమే వారికి తాము చెప్పేవి అబద్ధాలని తెలిసి కూడా వాటిని పదే పదే చెప్పటానికి ఆంత మొండితనం చూపించేలా వారిని ప్రోత్సహిస్తున్నది.ఇదే ఆర్ధికసూత్రం  అతి హిందూత్వ వాదులకి కూడా వర్తిస్తుంది!

ఇలాంటివి ఇతర దేశాల్లో పనిచేశాయి గానీ భారతదేశంలో పనిచెయ్యవు.అందుకు వెయ్యేళ్ళ నుంచి ఒక సమూహం వందేళ్ళ నుంచి ఒక సమూహం నిరంతరం ఇదే లక్ష్యంతో పని చేస్తున్నప్పటికీ ఒకరు 15 శాతం మించి ఒకరు 5 శాతం మించి లేకపోవటమే దీనికి బలమైన సాక్ష్యం.ఇది పెరిగి వారు ముందుముందు బలపడతారనే ఆశలు కూడా పెట్టుకోనక్కర లేదు.ఇప్పటికీ 80-70 శాతం ఉన్న హిందువులు క్రమేణ సంఘటితం అవుతున్నారనేది గమనిస్తే ముందుముందు ఈపాటి స్వేచ్చ కూడా ఉండదనేది నేను అటువంటివాళ్ళకి చెబుతున్న ఆఖరి హితోక్తి!

పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడలేదనుకున్నట్టు ఇస్లాం మతాన్ని పొగుడుతూ హిందూమతాన్ని విమర్శిస్తున్న సాక్ష్యంమూర్ఖత్రయానికి నేను ముందే చెప్పాను.మీరు హిందూమతాన్ని గురించి కనీసం ప్రశంసిస్తూ కూడా పోష్టులు వెయ్యవద్దని,చాలా కాలం పాటు నిగ్రహించుకుని ఈ మధ్యనే సుర అంటే కల్లు అని తీర్మానించి వేదమంత్రాలకి తప్పుడు అర్ధాలు చెప్తూ మళ్ళీ తోక ఝాడించటం మొదలుపెట్టారు. 18 పోష్టులు వెయ్యకముందు, వేస్తున్నప్పుడు,వే శాక అన్నిసార్లు ఇవన్నీ అబద్ధాలని రుజువు చెయ్యమని చాలెంజి చేస్తే ఒక్కదానికీ రెస్పాండ్ అవకుండా అక్కడా ఇక్కడా "హ్హెహ్హెహ్హేహ్హేమిటండీ ఆ నిరాధారమైన ఆరోపణలు!" అని వాడితోనూ వీడితోనూ సొల్లు చెప్పటం ఈసారి కుదరదు.KSC ఒకసారి తను తల్చుకుంటే చెన్నై వరకు వచ్చి నా భరతం పడతానని అన్నాడు.నేను గాజులు తొడుక్కుని కూర్చోలేదు.ఇప్పటి ప్రశ్నలకి సాక్ష్యం నుంచి జవాబులు రాకపోతే నేనే తన ముందుకి వచ్చి నుంచంటాను - ఏం చేస్తాడో చూస్తాను!

హిందువులకి విగ్రహ్హారాధన మహ్హాపాపం అని నీతులు చెబుతున్న ఇస్లామిక్ మత ప్రచారకులు మొదట మక్కాయాత్రని మహ్హాపాపం అని ప్రకటించి సాటి ముస్లిములు మక్కా యాత్రకు వెళ్ళడాన్ని నిరోధించాలనీ లేని పక్షంలో హిందువులే మక్కా లోని కాబా గుడిని స్వాధీనం చేసుకుని ముస్లిములని విగ్రహ్హారాధన అనే మహ్హాపాపం నుంచి రక్షిస్తారనీ వ్యాసపరాశరాది షిర్డిసాయినాధపర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి నేను చెప్తున్న ప్రతిజ్ఞాపూర్వకమైన చారిత్రక సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

Thursday 27 December 2018

ఆడదాని ఓరచూపుతో తూలిపడని మొనగాడు ఎవ్వడోయ్!

నందమూరి తారక రామారావు మీద భక్తితో కొడుక్కి ఆ పేరు పెట్టుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీలో చేరి ఏమి చేశాడు?రాజకీయాలకి కొత్త అయిన పార్టీ కార్యకర్తలకి రాజకీయాల గురించి శిక్షణా తరగతులు నిర్వహించి ఇప్పటికీ తెదెపాకి బలమైన కార్యకర్తల పార్టీ అన్న గుర్తింపుని తెచ్చిపెట్టాడు!
చంద్రబాబుతో విభేదాలు వచ్చి మంత్రిపదవికి దూరమై నక్సలైట్లు మొదలుపెట్టిన ఉద్యమాన్ని హైజాక్ చేసి తనే ముఖ్యామంత్రి కాగల అవకాశం కన్నెపిల్లలా కన్ను కొడితే ఒళ్ళుమరిచి ఆంధ్రోళ్ళని అమ్మానా బూతులు తిట్టి అదికారం తెచ్చుకున్నాక ఇప్పుడేమి చేస్తున్నాడు?తను ఆచార్యత్వం నెరపి బలం పెంచి తనకి పునాది నిచ్చిన పార్టీని భూస్థాపితం చెయ్యాలని చూస్తున్నాడు!

అంత నాడు లేదు,ఇంత నాడు లేదు, ముసలి మంధర జానెడు జడకి మూరెడు మల్లెప్పూలు అన్నట్టు తెచ్చాను తెచ్చాను అని తను డప్పు కొట్టుకెవడమే గానీ జనం మెచ్చి మేకతోలు కప్పలేదు,బంగారు తెలంగాణ జపం నాలుగేళ్ళు చేసి చేసి  మూఢం వొచ్చే ముందు తాళి కడితే చాలు నడిచే బిడ్డలు పుడతారని ముందస్తుకు వెళితేనూ ఫుల్మెజార్టీ రాలేదు - ఇంతకన్న ఎందులోనన్న దూకి చావడం మేలు అందామంటే ముఖాన ఉమ్మేస్తే తుడుచు తిరిగే సిగ్గూ శరం లేని రకమాయె!

మళ్ళీ ఎమ్మెల్యేల కొనుగోళ్ళు మొదలు పెట్టిండంట - సొంత రాష్ట్రంల మస్తు మెజారిటున్న లాలూ ములాయం పీకలేంది ఈ కాళ్ళల పట్టు లేని గప్పలమారి పిట్టలదొర జాతీయంల ఏం వూడబొడుస్తడో!

ఏం జూసి గెలిపిచ్చిర్రో యీణ్ణి తెలంగాణోళ్ళు నాకస్సలు సమజైతలె?

Wednesday 12 December 2018

అంచె పడవల మీద జంపె దరువుల తోడ హంసలదీవికి వెళదామా, ఓ హంసనడల వయ్యారీ!

పల్లవి:అంచె పడవల మీద జంపె దరువుల తోడ
          హంసలదీవికి వెళదామా, ఓ హంసనడల వయ్యారీ!

చరణం:వూట చెలమలు మనవే!
             రామ చిలకలు మనవే!
             మాట కులుకులు మనవే!
             ప్రేమ మొలకలు మనవే!
||పల్లవి||
చరణం:ఆట ఉరుకుళ్ళు మనవే!
             మట్టి పిచిగూళ్ళు మనవే!
             చూపు కొడవళ్ళు మనవే!
             జామ కొరుకుళ్ళు మనవే!
||పల్లవి||
చరణం:బండ జారుళ్ళు మనవే!
             జంట ఎత్తుళ్ళు మనవే!
             బిగి కౌగిళ్ళు మనవే!
             మరు లోగిళ్ళు మనవే!
||పల్లవి||
చరణం:కేరు కేరింతలు మనవే!
             పొర్లు పొర్లింతలు మనవే!
             సౌరు సోకంతయు మనదే!
             మేలు మేల్బంతులు మనమే!
||పల్లవి||
చరణం:పొర పొచ్చెములు లేని జంట మనదే!
             మని కగ్గములు లేని జంట మనదే!
             వయ సెచ్చుటలు లేని జంట మనదే!
||పల్లవి||

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...