Saturday 26 December 2020

విశ్వతోభద్ర కార్యకర్తలకు ఆఖరి పాఠం

మనం శత్రువులని గెలవలేం అని భయపడితే స్వతంత్రం వస్తుందా?

ఇవ్వాళ భారత దేశపు రాజకీయ రంగస్థలం మీద కేంద్రప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్నీ అమరావతినీ ధ్వంసం చెయ్యడం వెనక అంతర్జాతీయ స్థాయి కుట్ర దాగి ఉంది.అయితే, ఆ కుట్ర అమలు కావడంలో పాలు పంచుకుంటున్నది మనం మానవోత్తములనీ మహనీయులనీ మనల్ని రక్షించడం కోసం కంకణం కట్టుకున్న వీరాధివీరులనీ నమ్మి వోట్లు వేసి అధికారం కట్టబెట్టిన మనవాళ్ళే కావడం వల్ల కొందరికి నమ్మబుద్ధి కావడం లేదు. దేశంలో జరిగిన జరుగుతున్న జరగబోయే అవినీతి మొత్తం కాంగ్రెసు వల్లనే అని మనం నమ్మడం వల్ల ఆ కాంగ్రెసుని భూస్థాపితం చేసిన మోదీ పవిత్రమైనవాడని  నమ్ముతున్నారు కొందరు - కానీ, అది నిజమా!

రేషను షాపుల కాడనుంచి మొదలు హాస్టళ్ళ వార్డెన్లుగ,రిజిస్ట్రేషను క్లర్కులుగ,మినిస్టర్ల ఓసీడిలుగ,నెలవారీ బేటాల పోలీసులుగ,సెక్రటేరియటు లోగిళ్ళ పండిన బ్రోకర్లుగ,మినిస్టర్ల బినామి కాంట్రాక్టుల ఎంగిలి వార్కు లక్షల కోట్ల జనండబ్బును దొడ్డిదారి పట్టించే గుంటనక్కల్ని కాంగ్రెసు తయారు చేసిందా?కలిగినోళ్ళ మోచేతి నీళు తాగుతు బనాయింపు కేసులల్ల ఇరుక్కున్న బీదోళ్ళని తప్పుడు తీర్పులిచ్చి జైళ్ళకి పంపించే బలిసిన ఎనుబోతులంటి కఠీనపు జడ్జీల్ని కాంగ్రెసు తయారు చేసిందా?చదువులు తిన్నగ జెప్పకుండ బుడ్డోళ్ళని గాడిదుల్నీ దున్నల్నీ కాయించే ఎలిమెంటరీ స్కూలు టీచర్లకి కాంగ్రెసు అవినీతి నేర్పిందా?ఏర్లన్ని ఎండిపోయి ఊళ్ళన్ని పాడుబడి పల్లెటూళ్ళు వల్లకాళ్ళై జనం మాడి చస్తంటె చూస్తా నిమ్మళంగ తొంగున్న పల్లెల సర్పంచులకి కాంగ్రెసు అవినీతి నేర్పిందా?కాష్ఠంల కాలేటి దేహపు అందాల్ని ముక్కుతో, చేతితో, మూతితో రాపాడి రొమ్ముల్నీ తొడల్నీ బొడ్డునీ చూసి సొల్లు గార్చుకుంట కడదాక నిలిచే మనసు బంధాల్ని తన్ని తగిలేసి పోయే శాడిష్టు పీనిగల్ని కాంగ్రెసు తయారు చేసిందా!

2014లో ఈవీయం ట్యాంపరింగు చేసి జాతీయ స్థాయిలో తను గెల్చి రాష్ట్ర స్థాయిలో జగన్ని గెలిపించి మొత్తం దేశాన్నీ మన రాష్ట్రాన్నీ భవిష్యత్తు తరాలకి చిల్లికానీ సంపాదించటానికి కూడా వీలివ్వని భయానక స్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగంలోకి, December 9, 2020 నాటికి ₹ 86,548,035,832,732 ఉన్న అప్పుని తీర్చడానికి వెసులుబాటే ఇవ్వని పాపంలా పెరిగిపోతున్న అప్పులోకి, వైభవాల మీద ఆశ ఉండీ ఆశల్ని నెరవేర్చుకునే చురుకుతనం ఉండీ మనమే కాదు మన పిల్లలూ మనవలూ ఏనాటికీ వదిలించుకోలేని అనంత కాలపు దరిద్రంలోకి నెట్టేస్తున్న మోదీని -  సొంతానికి సంపాదించుకోవటం లేదన్న ఒకే ఒక కారణంతో అవతార పురుషుడి కింద కొలిచే దౌర్భాగ్యులకి ఎన్నిసార్లు ఎన్ని నిష్ఠుర సత్యాలు చెప్తే అసలు కుట్ర తెలుస్తుంది?

మీరొక మర్డర్ సినిమాకి ఆట కొంత అయ్యాక వెళ్ళారు.పనివాడే హంతకుడు అని మీరు అనుకున్నారు.ఎందుకంటే డైరెక్టరు వాణ్ణి ఎప్పుడూ కత్తితోనే చూపించాడు,వాడెప్పుడూ గుడ్లు మిటకరించుకుని చూస్తున్నడు,హత్యకి గురయిన యజమాని ఫొటో వంక కోపంగా చూస్తున్నాడు.ఇంకా చెప్పాలంటే డైరెక్టరు పనివాడు మీకు నచ్చని కులాన్నికి చెందినవాడని చూపించాడు - ఇంకేం, ఆ కులంవాళ్ళంతే అని రీజనింగు చెప్పేసుకున్నారు.కానీ, చివర్లో అప్పటివరకు భర్త పోయినందుకు ఏడుస్తూ కనబడి మీనుంచి సింపతీ కొట్టేసిన ఇంటి యజమాని భార్య హంతకురాలని తేలింది - హర్రె, ఇంత తెలివైన వాణ్ణి నేనెలా మోసపోయాను అనుకున్నారు మీరు!బహుశః సినిమా మొదటినుంచీ చూస్తే డైరెక్టరు ఇచ్చిన క్లూలు మీ తెలివికి అంది వుండేవి కాబోలు!

ఇక్కడ దేశపు రాజకీయ రంగం మీద కూడా అలాంటి కధే నడుస్తున్నది.మన కళ్ళ ముందు కనపడుతున్న సమస్తం "వాళ్ళు" మనకి చూపించాలనుకున్న దృశ్యం.మనం ఏది చూస్తే "వాళ్ళ" కుట్ర తెలుస్తుందో అది కనపడకపోవటం వల్లనే అది కుట్ర అని తెలియడం లేదు.ఒక కుట్ర విజయవంతం కావాలంటే కుట్ర చేసేవాళ్ళు మొదట చేసేది తమ కుట్రకి బలయ్యేవాళ్ళకి అసలు తమమీద కుట్ర జరగడం లేదని నమ్మించాలి, నమ్మిస్తారు, నమ్మిస్తున్నారు.ఒకవేళ కుట్రకి బలయ్యేవాళ్ళకి కుట్ర జరుగుతున్నదని అనుమానం వస్తే కుట్రని వేరేవాళ్ళ మీదకి తోసెయ్యాలి, తోసేస్తారు, తోసేస్తున్నారు.వీలయితే కుట్రని బయట పెట్టాలనుకుంటున్న వాళ్ళనే కుట్రదారుల కింద కుట్రకి బలయ్యేవాళ్ళకి చూపించి భయపెట్టాలి, భయపెడతారు, భయపెడుతున్నారు.

కుట్ర అంటే అబద్ధం.దేవుడు ఉన్నాడా లేడా అని జరుగుతున్న చర్చలో ఒక సూడో రేషనలిస్ట్ ఠపీమని "పాత రాతి యుగానికి ముందు లేని దేవుడు తర్వాత వచ్చాడు" అనేశాడు.అక్కడ చర్చలో పాల్గొంటున్న మిగిలిన వాళ్ళకి అది చాలా గంభీరమైన స్టేట్మెంట్ అనిపించింది. బహుశః మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంది కాబోలు!కానీ, అతను "కొలంబస్ కనుక్కోకముందు అమెరికా లేదు" అని ఉంటే అక్కడ చర్చలో పాల్గొంటున్న మిగిలిన వాళ్ళకి అది చాలా గంభీరమైన స్టేట్మెంట్ అనిపించేదా!మీ సంగతి యేంటి?ఇట్లా ఉంటాయి కుట్రదారులు చెప్పే అబద్ధాలు.అబద్ధాలని చెప్పడం కన్న నమ్మడం పదింతలు ప్రమాదం, అది మీకు తెలుసా! మనం కూడా అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాం కదా, ఒకసారి మీరు అబద్ధాలు చెప్పిన సందర్భాల్ని గుర్తు చేసుకుని చూడండి.మనం అబద్ధం చెప్పేది కూడా ఎదటివాళ్ళని మోసం చెయ్యడానికే, నమ్ముతారని తెలిసిన పిచ్చోళ్ళకే చెప్తాం - అది వాళ్ళు తెలుసుకోవటానికి కొంత సమయం పడుతుంది.తెలుసుకున్నాక వాళ్ళు తిడితే గతిలేక చేశాను తప్పయిపోయిందని సారీ చెప్పటమో నువ్వు మోసం చెయ్యలేదా అని రెచ్చిపోవటమో జరిగే ఉంటుంది, అవునా?కానీ, ఎదటివాళ్ళు చెప్పిన అబద్ధాల్ని మనం నమ్మితే నష్టం ఎవరికి?

కేసీయార్ దగ్గిర్నుంచి గోరేటి వెనకన్న వరకు పాడిన పాట "ఆంధ్రా దోపిడీ" అనేది సర్వాబద్ధం - నిజానికి ఆంధ్రాతో కలిసింది మొదలు తెలంగాణ వాళ్ళు గయ్యాళితనంతో చేసిన దగాకోరు రాజకీయం వల్ల సర్వనాశనం అయ్యింది ఆంధ్రావాళ్ళే!కేసీయార్ చంద్రబాబుకి తెలంగాణ శత్రువు ముద్ర వెయ్యటం వ్యక్తిగత కక్ష వల్ల చేసి ఉండొచ్చు గానీ మీడియా అందిపుచ్చుకుని ప్రచారం చెయ్యడం వల్ల వీధుల్లోనూ కొందరు పిచ్చోళ్ళ మెదళ్ళలోనూ నాటుకుపోవడం వెనక ఇప్పుడు అమరావతిని ధ్వంసం చేస్తున్న అంతర్జాతీయ స్థాయి కుట్రదారుల ప్రమేయం ఉంది.

కేసీయారు చంద్రబాబుని తిట్టింది తెలంగాణ తెచ్చుకోవడం కోసమే అయితే తెలంగాణ తెచ్చుకున్నాక తన యేడుపు తను యేడవవచ్చు కదా!అసలు చంద్రబాబుని హైదరాబాదులో కూడా ఉండనివ్వని పంతం దేనికి పట్టాడు?పోనీ గదాని హైదరాబాదు నుంచి పోయి అతని రాష్ట్రాన్ని అతను బాగు చేసుకుంటుంటే  తన రాష్ట్రాన్ని తను బాగు చేసుకుంటూ కూర్చోక చంద్రబాబుకి రిటయిర్మెంటు ఇప్పించే పనెందుకు పెట్టుకున్నాడు?పోనీ కేసీయారుకి చంద్రబాబుతో పోటీ పడలేక తరుగులో విడిపోయిన ఆంధ్ర మెరుగుతో విడిపోయిన తెలంగాణ కన్న పరుగులు పెట్టటం వల్ల కళ్ళు కుట్టి యేడ్చాడని సరిపెట్టుకోవచ్చు - మోదీ చంద్రబాబు మీద యుద్ధం ప్రకటించటానికి చంద్రబాబు మోదీకి చేసిన ద్రోహం ఏమిటి?

పాత కధలు దేనికి గానీ 2014 మొదలు 2019 వరకు చంద్రబాబు మోదీకి గానీ శీలా వారికి గానీ సోమూ వారికి గానీ ఛోటా మోటా భాజపా నాయకులకీ కార్యకర్తలకీ చేసిన ద్రోహం ఏమిటి?ఏమీ లేదు!అది వాళ్ళ అంతరాత్మలకీ తెలుసు. ఒకవైపు రాష్ట్ర స్థాయి భాజపా అధికారిక ప్రతినిధుల్లో ఎవడు అమరావతికి మనస్పూర్తిగా సపోర్టు చేసినా తెల్లారేసరికి వాణ్ణి పీకేసి ఇంకోణ్ణి పెడుతున్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రకి అన్యాయం చెయ్యడానికి ఎంత రాక్షసమైన పనులైనా చెయ్యగలదని తెలుసుకోలేకపోవటానికి ఆంధ్రా వోటర్లు చెవుల్లో పువ్వులు పెట్టుకుని కూర్చున్నారా!నిన్నటికి నిన్న ముష్టి మూడు శాతం వోట్లు కూడా లేని భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు ఎవరూ వూహించని రీతిలో అధికారంలోకి వస్తాం అంటే దాని అర్ధం ఏమిటి?ఇప్పటికీ ఎన్నికలలో ఒక్క సీటుని కూడా గెలిచే దమ్ము లేని పార్టీ 175 సీట్లు ఉన్న అసెంబ్లీలో 116 సీట్లు తెచ్చుకోవడం సాధ్యం కానప్పుడు "అనూహ్యమైన పద్ధతిలో అధికారం చేజిక్కించుకోవడం" అంటే "అసహ్యకరమైన పద్ధతిలో అధికారం చేజిక్కించుకోవడం" అనే అర్ధం ఎందుకు రాదు?

 నేను ప్రతి ఎన్నికకీ బెట్టింగు రాజాలకి పనికొచ్చే అవకాశం ఉన్న గెస్సింగులు చెయ్యలేదు గానీ ఆనాడు కేజ్రీవాల్ మొదటిసారి ఢిల్లీలో గెలిచిన ఎన్నికలకి ఒక్క రోజు ముందు "అక్కడ బీజేపీ గెలవదు!" అని చెప్పాను, ఈనాడు చంద్రబాబు గెలిచే అవకాశం లేదు గానీ గెలిస్తే రాష్ట్రం బాగుపడుతుంది,గెలవకపోతే రాష్ట్రం పాడుపడుతుంది అని చెప్పాను.అన్నింటికన్న ముఖ్యమైనది 2014లో మోదీ గెలిచిన మొదటి ఏడాదిలోనే 2019 లోపు రామాలయం కడతాడు, అదీ ఎన్నికలకి ముందు మిగిలిన అన్ని రంగాల్లో ఫెయిలయితే చచ్చినట్టు కడతాడు అని చెప్పాను.అన్నీ అచ్చు గుద్దినట్టు అలాగే జరిగాయి.బాబుకో మోదీకో బాజాలు మోగించే డప్పాసి తెలివి ఉన్నవాడు అలా చెప్పనూ లేడు, అవి నిజం కానూ కావు.అలాంటివాడు వాడికి జరిగితే బాగుండునని అనిపించినవాటినే జరుగుతాయని చెప్తాడు - నిజమయితే నా గొప్ప అంటాడు, అబద్ధమయితే పోల్ సర్వే వాళ్ళని తిడతాడు.

ఈ ఆంధ్రా బీజేపీ వాళ్ళకి రేపెప్పుడో అనూహ్యమయిన రీతిలో ఆటలాడి అధికారంలోకి వచ్చే దమ్ము ఉంటే మొన్నటి 2019 నాడు జగనుకి బదులు వాళ్ళే అధికారంలోకి వచ్చి ఉండొచ్చు కదా - ఎవడు అడ్డు పడ్డాడు! చంద్రబాబు రాష్ట్రద్రోహి అని పైకి రంకెలు వేశారు,మిత్రద్రోహి అని లోపల పళ్ళు కొరుక్కున్నారు.మోదీ వీళ్ళకి గొప్ప వక్తలా కనబడుతున్నాడు గానీ మాట్లాడేది హిందీ గాబట్టి ఉత్తరాది వాళ్ళకి కనీసం అర్ధం అవుతుంది గాబట్టి కొట్టే చప్పట్లు నిజం అనుకోవాలి, మరి ఆంధ్రాలో ఎంతమందికి హిందీ అర్ధం అవుతుంది?ఉత్తరాది నుంచి మోదీని దించనక్కరలేదు అంటే రాష్ట్ర స్థాయి నాయకుల్లో ఎన్నికల ప్రచార సభల్లో గానీ కార్యక్రమాలకి సంబంధించిన సభల్లో గానీ ప్రజల్ని మెప్పించి పార్టీకి నాలుగు వోట్లు వేయించుకోగలిగిన వక్తలు ఎంతమంది ఉన్నారు?రామారావూ చంద్రబాబూ వీళ్ళకు కేటాయించిన సీట్లలోనే ఆన్నీ గెలవలేదు, చందబాబుని వోడించింది మేమే అని గప్పాలు కొట్టుకుంటున్న మొన్నటి ఎన్నికల్లో అవతార పురుషుడు మోదీ వచ్చి ఉద్ధరించిన ఘనకార్యం ఏమిటి?

నిన్న గాక మొన్న వోటు హక్కు వచ్చిన కుర్రాడికి కూడా కామన్ సెన్సు ఉంటే 2014 నుంచి 2019 వరకు జాతీయ ప్రాంతీయ భాజపా నాయకులు చేసిన పనులు ఆంధ్రాలో వోట్లు పెంచుకుని సీట్లు గెల్చుకుని అధికారంలోకి వచ్చేటందుకు దోహాద పడేలా ఉన్నాయని అనిపిస్తుందా!2014కి ముందు రాష్ట్రాన్ని విభజిస్తే రెండు చోట్లా పార్టీ నష్తపోతుందని దాదాపు ప్రతి కాంగ్రెస్ సీనియర్ నాయకుడూ చెవినిల్లు గట్టుకుని చెప్పినప్పటికీ పార్టీకి జరిగే నష్టాన్ని పట్టించుకోని సోనియా ప్రవర్తనలానే 2014 తర్వాత మోదీ ప్రవర్తన కూడా ఆంధ్రాకి అన్యాయం చేస్తే రెండు చోట్లా పార్టీ నష్టపోతుందని తెలియనట్టు ఉండటం ఎంత విచిత్రం!

రాష్ట్ర విభజన ఆంధ్రాకి అన్యాయం జరిగేలా పరమ భయానకమైన రీతిలో జరగటానికి కాంగ్రెసుతో పాటు భాజపా కూడా కారణం అని ఆంధ్ర వోటర్లు భావిస్తున్నారని తెలిసినప్పుడు ఆంధ్రలో అధికారం కోరుకునే ఒక రాజకీయ పార్టీ యొక్క అధినాయకత్వం ఇలా ప్రవర్తించడంలో ఉన్న హేతుబద్ధత ఏమిటి?భాజపా వాళ్ళని కెలికితే అక్కసు పట్టలేక ఏదైన క్లూ వొదులుతారేమోనని ధొలేరా కోసమూ సెంట్రల్ విస్టా కోసమూ మోదీ అమరావతిని చంపేస్తున్నాడని అంటున్నాను గానీ అందులో పూర్తి నిజం ఉందని నేనూ అనుకోవటం లేదు.అది మొత్తం కుట్రలో కొంత భాగమే,అసలు "వాళ్ళు" దేశం బయట ఉన్నారు.మోదీ,జగన్,కేసీయార్ సర్వస్వతంత్రులు కారు - వీళ్ళకన్న పైన ఒక బొమ్మలో ఇంకో బొమ్మని ఇరికించి “hidden picture” గురించి హింట్ ఇవ్వని శాడిస్టు ఆర్టిస్టుల “real picture” అయిన "ముసలామె బొమ్మని తల్లకిందులు చేస్తే కనిపించే పడుచామె బొమ్మ!"యే అసలైన కళావరు రాజు/రాణి!

తెదెపా అభిమానులూ సీనియర్ విశ్లేషకులూ కేసుల భయంతో జగన్ భాజపాకి కాళ్ళకి మొక్కి వాళ్ళ కోరిక మేరకే రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నాడని భ్రమ పడుతున్నారు.కానీ ఎన్నికలకి నుందు తెదెపా వాళ్ళు చూపించిన ఒక వీడియోలో విజయసాయి రెడ్డి "బీజేపీ వాళ్ళని కూడా మనకి సాయం చేస్తున్నట్టు అతిగా నమ్మొద్దు మనమే వాళ్ళని ఉపయోగించుకుని అధికారంలోకి వద్దాం, ఆ తర్వాత మన దమ్ము మనం చూపిద్దాం!" అనటమూ శివాజీ చూపించిన వీడియోలో జగన్మోహన్ రెడ్డి "ఇప్పుడు కష్టపడి గెలిస్తే ఒక్కొక్కడూ 400 కోట్లు సంపాదించుకునేలా చేస్తాను!" అనటమూ నిన్నటి రోజున అమరావతి సమైక్య సమితి సభకి భాజపా అగ్రనాయకులని గాక వూరూ పేరూ లేని నాయకులని పంపించడమూ తెల్లవారే సరికి A2 రెడ్డి గారు "మేము ఎవరిని సంప్రదించాలో వారిని సంప్రదించాకనే రాజధాని తరలింపు మొదలు పెట్టాము, కాబట్టి అది ఆగుతుందని ఎవరూ ఆశలు పెట్టుకోవద్దు!" అనటమూ కలిపి చూస్తే తెర వెనక జరుగుతున్న మాయా భేతాళం రివర్సులో నడుస్తున్నదని అనిపిస్తున్నది నాకు.

ఈ యేడాదిలో ఆంధ్రాలో ఢిల్లీలో జరిగిన అన్ని ముఖ్యమైన సన్నివేశాల్నీ ఒకసారి సింహావలోకనం చేసి చూస్తే జగన్ మోదీకి గానీ  తన మీదున్న కేసులకు గానీ భయపడటం లేదని తను ఏది తల్చుకుంటే అది కనీసం ప్రజలు వోట్లు వెయ్యరేమోననే అనుమానం కూడా లేకుండా చేసుకు పోతున్నట్టు అనిపించడం లేదూ!జగన్ ప్రజల్ని వేధించడం అటుంచి బీజేపీ పరువు ప్రతిష్ఠల్ని కూడా భంగం చేస్తున్నప్పటికీ బీజేపీ అతనికి సహాయం చెయ్యడం అనే వింతకి జగను వెనక ఉండి అమరావతీ విధ్వంసాన్నీ ఆంధ్రను అధః పాతాళానికి తొక్కెయ్యడానికి అతన్ని నడిపిస్తున్నది భాజపా కూడా నిగ్రహించలేని మహాశక్తి కారణం అనుకుంటే అప్పటివరకు కనిపించని hidden picture కనిపించడం లేదూ!

భాజపా అభిమానులు కంగారు పడతారు, నాకు పచ్చ పిచ్చిని అంటగడతారు - తెలుసు.తెదెపా అనుకూల విశ్లేషకుల వెర్షన్ కనీసం మోదీకి జగను మీద పైచేయి ఉన్నట్టు చెప్పడం వల్ల పుడుతున్న ఎగో సాటిస్ఫాక్షన్ ఇందులో ఉండదు.తెదెపా అనుకూల విశ్లేషకులు కూడా కంగారు పడతారు.చంద్రబాబుని హీరోని చేసి మోదీ, జగన్, కేసీయార్ అనే ముగ్గుర్నీ దుష్టత్రయం అని వర్ణిస్తే సెంటిమెంటు పండి జనం నమ్ముతారు గానీ కనిపించని ఒక మహాశక్తి అంటే దాన్ని బయటపెట్టాలి.నిరూపించగలిగితే కొత్త శత్రువుని ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాలు పన్నడం అనే రిస్కూ నిరూపించలేకపోతే మూలిగే నక్క మీద తాటిపండులా నవ్వుల పాలు అయ్యే రిస్కూ ఉన్నాయి.కేసీయార్,మోదీ అనే ఇద్దరు బద్ధ శత్రువులు జగను అధికారంలోకి రావడానికి అంత ఐకమత్యాన్ని ప్రదర్శించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుని మాత్రం అధికారంలోకి రానివ్వకూడదని కాదూ!

జగనుకి పదవి లాభం,కేసీయారుకి కసి తీరిన సంతోషం - మరి మోదీ సంగతి యేంటి?మోదీ తనకి లాభం గూబల్లోకి వచ్చే పని చేస్తున్నాడూ అంటే తన పైన ఉన్న "వాళ్ళ" లాభం కోసం కాదూ!ఒక రాజకీయ విశ్లేషకుడి స్థానంలో తెలంగాణ ఉద్యమ కాలంలో కామెంట్లు వేస్తున్న నాటినుంచి పత్రికలూ టీవీలూ చూపిస్తున్న ప్రతి దృశ్యాన్నీ అసలు శత్రువు ఆనవాళ్ళ కోసం వెయ్యి కళ్ళతో చూస్తూనే ఉన్నాను.2014లో మోదీ చెంబుడు నీళ్ళూ కుండెడు మట్టీ ఇచ్చి పోయినప్పుడే అసలు శత్రువు భాజపా కూడా నిగ్రహించలేని మహాశక్తి అని అనుమానం వచ్చింది.ప్రణాళికా సంఘం ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందని పచ్చి అబద్ధం చెప్పినప్పుడు రూఢి అయిపోయింది.

కమ్యూనిష్టుల దగ్గిర్నుంచి వైకాపా వరకు చంద్రబాబుని పెట్టుబడి దారుల బానిస అనీ అయ్యమ్మ్మెఫ్ బంటు అనీ తిడుతుంటే నేను "వాళ్ళు" ఆంధ్రలో చంద్రబాబుని అధికారంలోకి రానివ్వటం లేదనటం చూసి చంద్రబాబుని ద్వేషించేవాళ్ళూ చంద్రబాబుని దేవుడని నమ్మేవాళ్ళూ నన్ను వెర్రివెధవ కింద జమకట్టి జోకులేసుకుంటారని తెలుసు.నేను ఇవ్వాళ రాష్ట్రంలో లేను, రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా నాకు వెంట్రుక ముక్క కూడా వూడదు.మీలో కూడా నాలా రాష్ట్రానికి బయట వుండి "రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా నాకు వెంట్రుక ముక్క కూడా వూడదు" అనుకోగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు.కానీ, రాష్ట్రం సరిహద్దుల లోపల "రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా నాకు వెంట్రుక ముక్క కూడా వూడదు" అని ఎంతమంది అనుకోగలరు? ఇవ్వాళ రాష్ట్రం సరిహద్దుల లోపల "రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా నాకు వెంట్రుక ముక్క కూడా వూడదు" అనుకునేవాళ్ళు అంత మంది ఉండటం చూస్తే భయం వెయ్యటం లేదూ మీకు!

"నాకు చాక్లెట్ ఇవ్వకపోతే అమ్మతో నువ్వు నన్ను కొట్టావని చెప్పి నిన్ను తన్నిస్తాను, ఏమనుకున్నావో!" అన్న లెవెల్లో "మా జోలికి వస్తే మీ పార్టీ ఎమ్మెల్యేల్ని లాగేసుకుంటాను!" అని కేసీయారుని బెదిరిస్తున్న బండి సంజయ గార్ని చూశాక కూడా భాజపా లోని ఏ నాయకుడికీ ప్రజలని మెప్పించి వాళ్ళ వోట్లతో అధికారంలోకి వచ్చే సదుద్దేశం లేదనీ ఆంధ్రలో కూడా బాబుని ప్రత్యేక హోదా ఇవ్వక ఏడిపించి అసమర్ధుడి/మిత్రద్రొహి/రాష్ట్రద్రోహి కింద బద్నాం చేసి ఓడగొట్టి జగన్ని గెలిపించటమూ బాబుని భూస్థాపితం చేస్తూ తనని నూరు తప్పులు చెయ్యనిచ్చి జగన్ని పడగొట్టి అన్ని రకాల నీతుల్నీ రీతుల్నీ ఉఛ్చనీచాల్నీ వొదిలేసి ప్రజలకి తాము తప్ప వేరే దిక్కు లేదనిపించే స్థితిలోకి అన్ని రంగాల్నీ భ్రష్టుపట్టించి ప్రజల మీద పెత్తనం చెయ్యటమే వాళ్ళ దురుద్దేశం అని నమ్మలేని రెండవ స్థాయిలోని భాజపా నాయకులూ క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలూ అభిమానులూ నేను చెప్పేది నమ్మరని తెలుసు గానీ రాష్ట్రం పట్ల నిజాయితీ ఉన్నవాళ్ళు నమ్ముతారు.వాళ్ళకోసం "కమ్యూనిష్టుల దగ్గిర్నుంచి వైకాపా వరకు చంద్రబాబుని పెట్టుబడి దారుల బానిస అనీ అయ్యమ్మ్మెఫ్ బంటు అనీ తిడుతుంటే నేను 'వాళ్ళు' ఆంధ్రలో చంద్రబాబుని అధికారంలోకి రానివ్వటం లేదనటం" గురించి ఉన్న సందేహాన్ని నివృత్తి చేస్తాను.

చంద్రబాబు కూడా మోదీ,జగన్,కేసీయార్ లాంటి రాజకీయ నాయకుడే - అతనొక్కడూ నిస్వార్ధపరుడు మిగిలిన అందరూ స్వార్ధపరులు అనే భ్రమ లేదు నాకు.అతనూ ఎన్నికల్లో గెలవటానికి డబ్బు మీదనే ఎక్కువ ఆధార పడతాడు,తక్కువ స్థాయిలోనే అయినప్పటికీ ఫ్యాక్సహ్నిస్టుల్ని చేరదీస్తాడు,తను నిప్పు అని చెప్పుకుంటూనే తన పార్టీలోని అవినీతి పరుల్ని చూసీ చూడనట్టు వొదిలేస్తాడు.కానీ తేడా తెలుసుకోవాలంటేనూ అసలు "వాళ్ళ"కి ఇతని మీద పగకి కారణం తెలుసుకోవాలంటేనూ పరిపాలనా శైలిని చూడాలి.అది నేను చెబితే భజంత్రీ అని అనడం ఖాయం కాబట్టి రాయలసీమకే చెందిన భాజపా అభిమాని అయిన ఒక రెడ్డి గారి జ్ఞాపకాల నుంచి ఎత్తి చూపిస్తాను:"1994ల నాడు NTR రెండో సారి అధికారంలోకి వచ్చేటప్పటికి రాజశేఖరరెడ్డి కొంచెం మెత్తబడిపోయాడు.నలభయిల్లోకి వచ్చి పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళని సెటిల్ చెయ్యటం, నిత్య అసమ్మతి గోల మాని ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు పెంచుకోవటం, పొలిటికల్ ఇమేజి కోసం ఫ్యాక్షనిజానికి దూరం కావడం - రాజశేఖరరెడ్డిలో ఒకలాంటి ట్రాన్సిషన్ నడుస్తుంది.అటు రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక రకమైన ట్రాన్సిషన్ నడుస్తుంది.IT మోజు సీమలోకి కూడా పాకింది.రాజశేఖరరెడ్డికి తెలిసిన చాలామంది లాయలిస్టులు తమ పిల్లల్ని IT jobs వైపుకి తరుముతున్నారు.ఒక పెళ్ళికి కడప వెళ్ళి నేనూ local factionist politicians బదులు NRI Reddy boys హీరో వర్షిప్ తెచ్చుకుంటూ అదర గొట్టెయ్యటం చూశాను.చంద్రబాబు రామారావును పడగొట్టి ముఖ్యమంత్రి కావడంతో సినిమా నటుడిగా NTR మీద ఉన్న అభిమానంతోనూ చంద్రబాబు పాతుకు పోతే తను ఇక జన్మలో ముఖ్యమంత్రి కావడం కల్ల అనే భయంతోనూ చురుకు తెచ్చుకున్నాడు." అనేది రాజశేఖరరెడ్డి గారిని చాలా దగ్గర్నుంచి చూసిన ఒక Reddy BJP fan చెప్పిన కధ.

అప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయి ఉండకపోతే అంతమైపోవాల్సిన ఫ్యాక్షనిజం చంద్రబాబు వోడిపోవడం వల్ల పునరుద్ధరించబడింది, అవునా?ఇప్పుడు చంద్రబాబు ఓడిపోయి ఉండకపోతే కాలు మీద కాలేసుకుని కూర్చోవాల్సిన 25,000 మంది అమరావతి జిల్లాలోని రైతులు చంద్రబాబు వోడిపోవడం వల్ల రోడ్డున పడి ఏడుస్తున్నారు, అవునా?మిగిలిన వాళ్ళు, అంటే మోదీ,జగన్, కేసీయార్ తదితరులు చేతకాకనో శ్రద్ధ లేకనో ప్రజలకి ఎంతో కొంత అభివృద్ధిని చూపించి దోచుకోవడం కన్న కబుర్లతో సరిపెట్టేద్దామని చూస్తే చంద్రబాబు ఎంతో కొంత అభివృద్ధిని ప్రజలకి చూపించాలని అనుకుంటాడు.చంద్రబాబు పరిపాలన ఎక్కువ కాలం సాగితే ఉపాధి కల్పన పెరిగి ఒకనాటికి ప్రజలు నిలవలోకి వచ్చి రాష్ట్రం కూడా తన అప్పుల్ని తీర్చేసుకుని కాలరెత్తుకు నిలబడడం వల్ల బ్యాంకింగ్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది!

2050 నాటికి ప్రపంచం మొత్తాన్ని తమ పీట కిందకి తెచ్చేసుకోవాలనుకుంటున్న “వాళ్ళు” ఆంధ్ర రాష్ట్రం ఒక్కటీ తమ దగ్గిర అప్పు చెయ్యాల్సిన అవసరం లేని ఒక ద్వీపకల్పంలా నిలబడటాన్ని ఎట్లా సహిస్తారు?బహుశః మోదీ,కేసీయార్ తదితరులు ఇది తెలుసుకుని నిజమైన అభివృద్ధిని చెయ్యకపోవటం వల్లనే మళ్ళీ మళ్ళీ గెలుస్తున్నారు కాబోలు! నలభయ్యేళ్ళ అనుభవం అంటారు గానీ చంద్రబాబు ఉన్నచోట నేనుంటే వీళ్ళనీ "వాళ్ళ"నీ కూడా గుడుగుడుగుంచం ఆడించగలిగిన సమర్ధత ఉంది నాకు.మచ్చుకి మొన్నటి GHMC ఎన్నికల గురించి ఇతర విశ్లేషకులు ఎవరూ చెప్పని రెండు టుమ్రీలు చెప్పనా?భాజపా ఆంధ్రలో ఈ తొండాటలు ఆడకపోయింటే కార్పొరేషన్ భాజపాకే దక్కి వుండేది.ఎందుకంటే, తెలంగాణలోనూ హైదరాబాదులోనూ సెటిలర్లు అనబడే ఆంధ్ర మూలాలు వుండి ఆంధ్రప్రాంత వాసుల పట్ల ఆప్యాయతలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు.వాళ్ళలోనూ ఇతర తెలంగాణ వాసుల్లోనూ తెదెపా అభిమానులు చాలామంది ఉన్నారు.భాజపా ఆంధ్రలో అమరావతి విధ్వంసాన్ని ఆపితే వాళ్ళు బీజేపీకి వేసి ఉండేవాళ్ళు.ఎన్నికల గెలుపోటముల్ని నిర్ణయించటానికి నాలుగు శాతం వోట్లు చాలు.ఆ నాలుగు శాతం వోట్లలో సెటిలర్లు ఇరుక్కున్నారు.అందువల్లనే, భాజపాకి కార్పొరేషన్ దూరమైంది - మోరేల్ బూస్టర్ మాత్రం దక్కింది!అదే చంద్రబాబు బలమైన క్యాండిడేట్లని నిలబెట్టి కొంచెం హడావిడి చేసి ఉంటే బీజేపీ వెనక్కి తగ్గి కేసీయారు మీద దాడి తగ్గించి అతనికి సహాయం చేసి ఉండేది,అవునా కాదా?

భాజపా నాయకులు తమ పార్టీకి ప్రజల్లో అభిమానం పెంచుకునే పనులు మానేసి తమ పార్టీకి నష్టం కలిగించే పన్లు చేస్తున్నారంటే అది మరొకరికి లాభం చెయ్యడం కోసం కాదూ!చల్ల కొచ్చి ముంత దాచడం దేనికి ఆ ఒకరే నేను "వాళ్ళు" అని అంటున్న మన అసలైన శత్రువులు.మతపరమైన అనుకూలత వల్ల భాజపా నాయకులు నిలువరించలేని మహాశక్తితో వ్యక్తిగత పరిచయాలు కూడా A1కు ఉన్నాయనేది A2 రెడ్డి గారు "మేము ఎవరిని సంప్రదించాలో వారిని సంప్రదించాకనే రాజధాని తరలింపు మొదలు పెట్టాము, కాబట్టి అది ఆగుతుందని ఎవరూ ఆశలు పెట్టుకోవద్దు!" అన్న వెంఠనే  ఠంగుమని గంట కొట్టినట్టు తెలిసింది నాకు!

CRDA నిబంధనలను బట్టి చూస్తే 151/175 కాదు, 175/175 స్థానాలు వచ్చినప్పటికీ జగన్ అమరావతిని కదిలించడం రాజ్యాంగ బద్ధమైన ప్రయత్నాలతో జరిగే పని కాదు.ఒక వ్యక్తికి నోటు రాసి అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు తీర్చకుండా నోటును రద్దు చెయ్యడం ఎంత అసాధ్యమో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు గత ప్రభుత్వంతో బిజినెస్ పార్టనర్ స్థాయిలో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఏకపక్షం రద్దు చెయ్యడం అంతటి అసాధ్యం!అది అయిదేళ్ళలోనే 46,000 కోట్లు సంపాదించలిగిన పారిశ్రామిక వేత్త జగన్మోహాన్ రెడ్డికి తెలియదా?అన్ని ప్రముఖ కంపెనీలకి ఆర్ధిక సలహాదారు పనిచేసిన చార్తర్డ్ అక్కవుంటెంటు విజయ సాయి రెడ్డికి వ్యాపార ఒప్పందాల చట్టబద్ధత గురించి తెలియదా! తెలుసు, అమరావతి విధ్వంసం అనేది ఒక డైవర్షన్ ట్రిక్, అసలు యుద్ధం ఎక్కడ చెయ్యాలో తెలియక శత్రువుని తికమక పెట్టడం కోసం తెరిచిన రెండవ రంగమే అమరావతి!వాళ్ళ వ్యూహం పని చేస్తున్నది, "వాళ్ళ"ను గెలవగలిగిన బలమైన యోధులు పిచ్చివాళ్ళలా నీడలతో యుద్ధం చేస్తున్నారు.

"వాళ్ళు" ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూపిస్తున్న దృశ్యం కొత్తది కాదు, "Supreme excellence in warfare lies in the destruction of your enemy's will to resist in advance of perceptible hostilities." అన్న రాచరికాల కాలం నాటి యుద్ధనీతి.వైకాపా నాయకులూ పోలీసులూ ఇంతవరకు కమ్మ కులస్థులలో ఏ ఒక్కరినీ దెబ్బతియ్యలేదు."వాళ్ళు" కొడుతున్నది వెనకబడిన మరియు కింది కులాల వాళ్ళనే. చంద్రబాబుతో సహా తెదెపా అభిమానులు అది అనుకోకుండా జరుగుతున్నదనో జగన్ పైవాళ్ళని టచ్ చెయ్యడానికి భయపడుతున్నాడనో అనుకుంటున్నారు గానీ అది చాలా ప్రమాదకరమైన వ్యూహం.ఇప్పుడు జరుగుతున్న నిరంతర దాడుల వల్ల బీసీ నాయకులూ వోటర్లూ తెదెపాలో ఉంటే రక్షణ ఉండదని యుశ్రారై వైపుకు జరుగుతారు.ఒకవేళ బీసీ నాయకుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మిన్నకుండిపోయి కమ్మ కులస్థుల్ని టచ్ చేసినప్పుడు ప్రతీకార దాడులు చేస్తే అప్పుడు తెదెపా కమ్మకులస్థుల మీద దాడి జరిగితే తప్ప ఇతర కులస్థుల మీద దాడి జరిగితే ప్రతీకారం తీర్చుకోదు అనే ముద్ర వేస్తారు - దాంతో అసలే తుమ్మితే వూడిపోయేట్టు ఉన్న బీసీ కులాల సపోర్టు జాటర్ ఢమాల్ అయిపోద్ది!

రహస్య కుట్రల వల్ల జరిగే విధ్వంసం నుంచి ప్రజల్ని రక్షించాలనుకున్న ప్రతి ఒక్కడూ కుట్ర గురించి తెలుసుకుని ప్రజలకి నిజాలు చెప్పడం తప్ప మరో మార్గం లేదు.ప్రజలు నిజాలు తెలుసుకుని స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధపడితే ఎన్నికలలో అక్రమాలు చెయ్యడం కూడా సాధ్యపడదు.

మనకు శత్రువు భయపడినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు - విజయోస్తు!

Wednesday 23 December 2020

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యొక్క నిజమైన చరిత్ర - ఒక ఆంధ్రుడి కన్నీటి కధ!

1952 ఏప్రిల్ 10 మొదలు 1954 ఏప్రిల్ 13 వరకు చక్రవర్తి రాజగోపాలాచారి గారు మద్రాసు రాష్ట్రానికి రెండవ విడత ముఖ్యమంత్రి అయ్యారు.రాజాజీ గారి మొదటి విడత ముఖ్యమంత్రిత్వం కొందరు తమిళ రాజకీయ నాయకుల్లోనూ కొందరు తమిళ విద్యాధికుల్లోనూ హిందీ పట్ల వ్యతిరేకతను పెంచి ద్రవిడ జాత్యహంకారాన్ని పెంచితే రాజాజీ గారి రెండవ విడత ముఖ్యమంత్రిత్వం కొందరు తెలుగు రాజకీయ నాయకుల్లోనూ కొందరు తెలుగు విద్యాధికుల్లోనూ తమిళం పట్ల వ్యతిరేకతను పెంచి తెలుగు భాషాభిమానాన్ని పెంచింది.కోస్తా తీర ప్రాంతం వారూ రాయలసీమ వారూ భాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదం ప్రకారం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించుకోవటం కోసం ఆందోళన మొదలు పెట్టారు.

ఉద్యమకారులు అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ రాజాజీ ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన రాలేదు.ఒకవైపున తమిళులు తెలుగువాళ్ళు మెజార్టీ అయిన వూళ్ళ పేర్లని కూడా తమిళంలో బోర్డులు పెట్టి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెలుగు భాషనీ జాతినీ నేతల్నీ అవమానిస్తూ సామాన్య ప్రజలు సైతం ఆంధ్ర రాష్ట్ర వాంచతో రగిలిపోతున్న కాలంలో ఆంధ్రకి చెందిన నలుగురు దొంగలు మాత్రం రాజాజీ నాడారు లాంటివాళ్ళతో తిరుగుతూ ఉద్యమాన్ని నీరుగార్చటానికి కుట్రలు చేశారు.

చివరి ప్రయత్నం కింద పొట్టి శ్రీరాములు గారు మద్రాసులోని మహర్షి బులుసు సాంబమూర్తి గారి స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.1952 డిసెంబర్ 16 తెల్లవారు ఝామున పొట్టి శ్రీరాములు  గారి మరణంతో  ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికి చీరాల,విజయనగరం,విశాఖపట్నం,విజయవాడ,రాజమండ్రి,ఏలూరు,భీమవరం,గుంటూరు,తెనాలి,ఒంగోలు,నెల్లూరు వంటి అనేక ప్రముఖ నగరాలలో పెద్ద ఎత్తున విధ్వంసకరమైన సంఘటనలు జరిగాయి.నాలుగు రోజుల పాటు ఆంధ్ర ప్రాంతం అట్టుడికి పోయి మద్రాసు నగరం కూడా స్తంభించి పోయింది.ఆఖరికి 1952 డిసెంబర్ 19 తేదీన దేశ ప్రధాని నెహ్రూ మద్రాసు నుంచి విడదీసి ఒక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రజలతో మమేకమై ప్రజల కోసమే అధికారం కోరుకునే పూసపాటి రాజావారూ ప్రకాశం పంతులుగారూ పాలితులు ఎవరనేది చూడకుండా అందరికీ న్యాయం చేసి అందరి అభిమానం పొందగలిగారు.కాబట్టి తమిళుల నుంచి విడిపోతే తప్ప తెలుగువాళ్ళు బాగుపడరు అనేది అబద్ధం - అని నా వూహ.ఎవరి వూహలు ఎట్లా వుంటేనేమి వాదం మొగ్గ తొడిగింది, వికసించింది, నలుదిశలా ప్రబలింది, ప్రకాశం వంటివారు కూడా ప్రవాహం వెంట నడిచారు, అవతరించిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రకాశం పంతులు గారు కాంగ్రెసు పార్టీ తరపున 1953 అక్టోబర్ 01 మొదలు 1954 నవంబర్ 15 వరకు ముఖ్యమంత్రి అయ్యారు.

కర్నూలు రాజధానిగా తొలి ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే ప్రకాశం తనదైన శైలిలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ఆదర్శప్రాయం. రాష్ట్ర అవతరణ మొదటి వార్షికోత్సవం సందర్భంగా రెండు వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టులకు రూపకల్పన, వాటి నిర్మాణానికి ప్రణాళిక, విజయవాడ కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణం ప్రకటన - ఇలా ఎన్నోముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

అయితే కమ్యూనిస్టులు టంగుటూరు ప్రకాశం పాలనను వ్యతిరేకించి మద్దతును ఉపసంహరించుకుంటూ పధ్నాలుగు నెలలకే అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ప్రకాశం గారి ప్రభుత్వం కూలిపోయాక రాష్ట్రంలో కొన్ని నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగిన తర్వాత 1955 ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. సర్వేపల్లి నుంచి పోటీ చేసి గెలిచిన (10)బెజవాడ గోపాల రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.

నిజానికి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల పదవీకాలం 1960 వరకే కొనసాగాలి.కానీ, 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల పదవీ కాలం 1962 వరకు ఉండడంతో ఆంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేల పదవీకాలం రెండేళ్లు పొడిగించారు.1953లో మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయేనాటికి నిజాం సంస్థానంలో ఉన్న తెలుగు ప్రజలు 1948 సెప్టెంబర్ 17 నాటికే తన పరిపాలనలో ఉన్న ప్రాంతాన్ని అయితే పాకిస్తానులో కలపాలనీ లేదంటే స్వతంత్రదేశంగా ఉండాలనీ అనుకుంటున్న నిజాము పరిపాలన నుంచి విడివడి స్వతంత్ర భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పరచుకుని ఉన్నారు.

సెప్టెంబర్ 1948 జరిగిన సైనిక చర్య విజయవంతమైన తర్వాత 1950 జనవరి  26 నిజాముకు ఇచ్చిన రాజ్ ప్రముఖ్ హోదా 1956 అక్టోబర్  31 వరకు కొనసాగింది.హైద్రాబాద్ సంస్థానం స్వాధీనం కాగానే మొదట 1950 జనవరి 26 M.K.Vellodiని ముఖ్యమంత్రిగా నియమించారు.అయితే, 1952 ఎన్నికల్లో కాంగ్రెసు నెగ్గి బూర్గుల రామకృష్ణా రావు గారు ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి అయ్యారు.ఇదే 1952లో ఇతర ప్రాంతాల వారికే కీలకమైన ఉద్యోగాలు దక్కడం మీద వ్యతిరేకత పెరిగి ముల్కి ఉద్యమం ఉధృతమైంది.అయితే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన Reorganisation of the Indian States కమిటీ 1956లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోనూ కలపాలని సూచించింది.

2014 నాటి తెలంగాణ ఉద్యమ వీరులు ఆనాటి తెలంగాణ యొక్క రెండు విలీనాలకీ భారత దేశపు ప్రభుత్వానికీ ఆంధ్ర ప్రాంతపు నాయకులకీ దురుద్దేశాలు అంటగడుతున్నారు గానీ జరిగిన చరిత్రని జరిగినట్టు చూస్తూ రెండు సన్నివేశాల్లోని తెలంగాణ నాయకులు ఆనాడు ఎలా ప్రవర్తించారు అని చూస్తే చాలు ఈనాటి తెలంగాణ నాయకులు చేస్తున్న ఆరోపణలు అబద్ధం అని తెలుస్తుంది.ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి చెప్పాలంటే, ఈనాటి తెలంగాణ ఉద్యమ వీరులు ఆనాటి తెలంగాణ యొక్క రెండు విలీనాలకీ భారత ప్రభుత్వానికీ ఆంధ్ర ప్రాంతపు నాయకులకీ దురుద్దేశాలు అంటగట్టడం తమ వెనకటి తరం తెలంగాణ ప్రాంతపు నాయకుల్ని అవమానించడమే అవుతుంది.

ఇక్కడ మనం పట్టించుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది.వ్రాసిన తేదీ, సమయం తెలియడం లేదు గానీ బూర్గుల రామకృష్ణా రావు గారు అప్పటి భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షుడైన U N Dhebar గారికి "I may however, add one thing that in case Telangana is kept a separate unit there is no harm in having common aspects of the administration common" అని తెలంగాణను అంటే అప్పటి హైదరాబాదు రాష్ట్రాన్ని ఆంధ్రతో కలపకపోయినప్పటికీ కలిపితే ఒనగూరుతాయని అంటున్న ప్రయోజనాలను సాధించవచ్చనే తన సొంత అభిప్రాయాన్ని చెప్తూ ఒక ఉత్తరం వ్రాశారు.ఇందులో మళ్ళీ ఇరు వర్గాల వాదనలనూ ఎందుకు ఉటంకించారో అర్ధం కావడం లేదు నాకు.ఆయనకి కలయిక పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు తన వాదనకి సమర్ధనలను మాత్రం చెప్తే సరిపోతుంది.మరి, కలయికకు అనుకూలమైన వాదనలను కూడా ఇక్కడ ప్రస్తావించడం దేనికి?

మొదలు పెట్టటమే తెలంగాణలో చాలామంది హైదరాబాదును యధాతధం కొనసాగించాలని బలంగా కోరుకుంటున్నారు అంటూ మొదలుపెట్టి "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలిపేశారు కాబట్టి ఒప్పుకోవలసి వస్తుందని అనేశారు. "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలపడానికి లేని విముఖత "హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో" కలపడానికి ఎందుకు వచ్చింది? "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలిపేశాక "హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో" మాత్రం కలపొద్దు అనడం న్యాయమేనా!

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక సూత్రమైన Cultural Integration అనేదాన్ని కూడా emotional approach మాత్రమే అని తీసి పారేస్తున్న బూర్గుల రామకృష్ణారావు గారు విలీనాన్ని వ్యతిరేకిస్తే సరిపోయేదానికి I shall now briefly summarise the pros and cons of the situation అని ఉత్తరం వ్రాయడం అనవసరం అనిపిస్తున్నది నాకు.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక సూత్రమైన Cultural Integration అనేదాన్ని కూడా emotional approach మాత్రమే అని తీసి పారేస్తున్న బూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణ వారికున్న ఆంధ్రలో విలీనం పట్ల వ్యతిరేకత దగ్గిర కొచ్చేసరికి There is no agitation of a strong character in Andhra on this subject while there is a strong agitation in Telangana not to merge with Andhra అనటం చాలా దుర్మార్గం అనిపించింది నాకు.ఆంధ్ర ప్రాంతపు నాయకులు ప్రతిపాదించిన తెలుగువాళ్ళు ఒక్కటిగా ఉండటం అనేది మాత్రమే ఆయనకివూహల్లో బాగుండి వాస్తవంలో సాధ్యం కానిదిగానూ తెలంగాణ ప్రాంతపు నాయకులు ప్రతిపాదించిన ఉర్దూ సానుకూలతతో కూడిన మాతృభాష పట్ల వ్యతిరేకత ఏమోబౌతిక పునాది ఉన్న శాస్త్రీయమైనదిగానూ కనపడటంలో కేవలం 175 ఏళ్ళ కింద మొదలైన తమ పరాయీకరణను ప్రేమించుకునే మితిమీరిన స్వానురాగం తప్ప ఎటువంటి ఆదర్శమూ లేదని అనిపిస్తున్నది నాకు. ఇతరుల ఆదర్శాల్ని అసంబద్ధం, అశాస్త్రీయం అనేసి తమ పరాయీకరణను మాత్రం ఆదర్శం, ఔన్నత్యం అని చెప్పుకోవడం ఎంత విచిత్రం!

1955 డిశెంబర్ 03 హైదరాబాద్ శాసనసభలో ఆంధ్రతో కలయిక గురించి వోటింగు పెట్టినప్పుడు మొత్తం 174 మంది శాసనసభ్యులలో 147 మంది వోటింగులో పాల్గొన్నారు.వీరిలో 103 మంది కలయికకు అనుకూలం, 16 మంది తటస్థం, 29 మంది వ్యతిరేకం అయ్యారు.మొత్తం తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు 94 మంది - వీరిలో 36 మంది కమ్యూనిష్టులు, 40 మంది కాంగెసు వాళ్ళు, 11 మంది సొషలిష్టులు.వీళ్ళందరిలో ఆంధ్రలో తెలంగాణ విలీనానికి 59 మంది అనుకూలం 25 మంది ప్రతికూలం.ఇందులో ఆంధ్ర ప్రాంతపు నాయకుల ప్రమేయం గానీ ప్రభావం గానీ ఏమీ లేదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేరుతో ప్రజల్ని ఉత్తేజపరిచి నిజామును బలహీనం చేసిన కమ్యూనిష్టులకే తెలంగాణ ప్రజల్లో  పలుకుబడి ఎక్కువ గనక హైదరాబాద్ శాసనసభలో వారి మాటయే నెగ్గింది!

ఆనాటి తెలంగాణ నాయకులూ ఈనాటి తెలంగాణ ఉద్యమ వీరులూ ఇంతవరకు నేను చూపించిన చరిత్రలో ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంతానికి చేసిన ద్రోహం  ఏమిటో చెప్పగలరా?దీనికి బదులు తెలంగాణ ప్రాంతపు నాయకులు ఆంధ్ర ప్రాంతానికి ద్రోహం చేస్తున్న నిజమైన చరిత్ర ఇక్కడినుంచే మొదలవుతున్నది.ఆంధ్ర ప్రాంతపు నాయకులు అదగలేదు తెలంగాణని కలిపి మమ్మల్ని ఉద్ధరించమని.ముల్కీ ఉద్యమం వల్ల ఏర్పడిన పీటముడికి పరిష్కారం కోసమే తెలంగాణను భాషప్రయుక్త రాష్ట్రాల చట్టం కింద విడగొట్టాలని నిర్ణయించింది.వాళ్ళ పరిపాలనలో వచ్చిన సమస్యకి కేంద్రం పరిష్కారం కింద ఆంధ్రతో కలపాలని నిర్ణయిస్తే ఆంధ్ర వైపునుంచి మమ్మల్ని కలుపుకోమని ఉద్యమాలు లేవు కాబట్టి కలపొద్దని బ్లాక్ మెయిలింగు చేసి వాళ్ళు దేశం నడిబొడ్డున కాశ్మీరుకు ఇచ్చిన స్వయంప్రపత్తిని సాధించుకున్నారు.ఆనాటి ఆంధ్రా నాయకులకి తెలంగాణ నాయకులతో పెద్దమనుషుల ఒప్పందం చేసుకోవాల్సిన అవసరమే లేదు.అయినప్పటికీ తెలంగాణ నాయకులు అమాయకత్వం వల్ల తమను అనుమానిస్తున్నారని అక్కరలేని ఆందోళన పడిపోయి కుదుర్చుకున్న పెద్దమనుషుల ఒప్పందం ఎంత దుర్మార్గమైనదో తెలుసుకోవటానికి తెలంగాణ ప్రాంతంలో మద్యనిషేధాన్ని విజయవంతం చెయ్యడాన్ని కూడా ఒప్పందంలోకి చేర్చడాన్ని చూస్తే చాలదా!

2014లో ఆంధ్రా దోపిడీని తిట్టి ఏదో పరాయివాళ్ళైన ఇంగ్లీషువాళ్ళ మీద న్యాయపోరాటం చేసినంత బిల్డప్ ఇచ్చి స్వరాష్ట్రం తెచ్చుకున్నాక కూడా స్వయాన నవ తెలంగాణ భగీరధుడు అని పొగిడించుకుంటున్న ముఖ్యమంత్రి దొంగసారా మానిపించటానికి కల్తీకల్లును అలవాటు చెయ్యాలనుకున్నంత పచ్చి తాగుబోతుల్ని సంస్కరించడం కూడా ఆంధ్రావాళ్ళ నెత్తిమీదే పెట్టారు.పోనీ అంత ఝమాయించి అడిగి అన్ని సౌకర్యాలు అప్పనం పప్పనం కొట్టేసినవాళ్ళు వాటిని ఉపయోగించుకుని బాగుపడి చావొచ్చు కదా!

ఎదటివాళ్ళ మెతకదనం మీద పెత్తనం చెయ్యాలనుకున్న గయ్యాళితనం ఒకసారితో పోతుందా 56లో కలిసినవాళ్ళు 1969 నాటికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం - I అని గొడవ మొదలుపెట్టారు.మర్రి చెన్నారెడ్డి గారు 1956లో పెద్దమనుషుల ఒప్పందంలో తనూ భాగస్వామి అయ్యారు.తన డిమాండ్లు చెప్పారు.వికారాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై 1957–62 మధ్యన Public Accounts Committeeలో పనిచేశారు.రెండుసార్లు Estimates Committeeకి చైర్మనుగా పనిచేశారు.Andhra Pradesh Regional (Telangana) Development Committeeకి చైర్మనుగా పని చేశారు.1962లో తండూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యాక మొదట Planning, Panchayat Raj శాఖలతోనూ పిదప Finance, Commercial Taxes, Industries శాఖలతోనూ మంత్రి పదవిని అలంకరించారు.మళ్ళీ 1967 నాడు కూడా శాసనసభకు ఎన్నికై Finance, Education, Commercial Taxes శాఖలతో మంత్రిత్వం అనుభవించారు.అప్పుడు రాష్ట్ర మంత్రిత్వం నుంచి తప్పుకుని కేంద్రంలో 1967–68 మధ్యన Steel, Mines, Metals శాఖలతో మంత్రిత్వం సంపాదించాడు. అన్నీ చేసి తీరా ఏప్రిల్ 1968 రాజీనామా చేసి వెంటనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు!

మహా ఘనత వహించిన మర్రి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమపు నీచత్వాన్ని తెలుసుకోవటానికి కొంచెం చరిత్ర చాలదూ!తను మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద తనే తిరగబడటం ఏమిటో 60 ఏళ్ళు పోరాటం చేసి ఆంధ్ర దోపిడీ నుంచి విముక్తం అయ్యామని రొమ్ములు విరుచుకు తిరుగుతున్న ఈనాటి ఉద్యమనేతలు చెప్పగలరా?

ఆంధ్రదేశం ఏర్పడిన కొత్తలో తెలంగాణా ప్రాంతంలో విద్యా సౌకర్యాలు ఇప్పుడున్నంత బాగా లేవు. ఉపాధ్యాయుల్ని తరిఫీదు చేసే సంస్థలు కూడా చాలా తక్కువ. ఒకవైపున పాఠశాలల సంఖ్య అభివృద్ధి అవుతోంటే ఉపాధ్యాయుల కొరత ఏర్పడినది.1956లో తెలంగాణా ఆసుపత్రులలో పడకల సంఖ్య 5000. 1966లో 10,000. పడకలు పెరిగిన కొద్దీ నర్సుల, మంత్రసానుల అవసరం కూడా కలుగుతుంది. తెలంగాణా అభివృద్ధికీ ఆరోగ్యానికీ అవసరమైన ఉపాధ్యాయుల్నీ, నర్సుల్నీ, మంత్రసానుల్నీ తీసేస్తే, మిగిలేవి 1100 మంది బంట్రోతు, డ్రైవర్లు ఉద్యోగాలలో వున్నవారు, ఒక లక్షా ఏడువేల ఉద్యోగాలలో 1100, పోనీ 4500 ఎన్నో వంతు? వీటి కోసం రాష్ట్ర విచ్ఛిన్న కార్యక్రమం తలపెట్టినారంటే విన్నవారు నవ్వరా?ఆచార్య దేవో భవ, వైద్యో నారాయణో హరి అంటూ అప్పుడు విద్యకోసం ఆరోగ్యం కోసం అవసర మయి ఆంధ్రా నుంచి టీచర్లనీ నర్సుల్నీ కోరి పని చేయించుకున్నారు.ఇవ్వాళ వాళ్ళు రిటయిర్మెంటుకు దగ్గరయ్యాక వారికి పెన్షన్ ఇవ్వటానికి కూడా బాధ పడిపోయి తన్ని తగిలేస్తున్నారు!

2014 నాటి విభజన ఏర్పాట్ల కోసం కేంద్రం నుంచి ఉద్యోగుల విభజనకి వచ్చిన కమిటీ పరిశీలనకు ఉంచబడిన మొత్తం ఉద్యోగాలు 50, 000 రమారమి అంటున్నారు.మొదట 10,000 అని కనబడింది, వారికే సిగ్గేసి ఇంకా ఘట్టిగా ఫిల్టర్ చేశారేమో ఆఖరికి 50,000 దగ్గిర ఆగింది.వారి తీర్పు నచ్చలేదని గొడవలు రేగటంతో ప్రస్తుతానికి మమ్మల్ని ఇలా వొదిలెయ్యండి, పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు యేర్పడ్డాక మీరూ మీరూ చూసుకోండని వారు దణ్ణం పెట్టేశారు.మరి ఆంధ్రా వాళ్ళు దోచుకున్న లక్షల ఉద్యోగాలు యేమయిపోయినాయో, రేపటి రోజున వారే ప్రభుత్వంలో ఉండి లెక్కలు తీసినప్పుడు గానీ లెక్క నిక్కచ్చిగా తేలదు.అయినా బతక లేని బడి పంతుళ్ళూ సిరెంజిలు కడుక్కునే నర్సులూ యాభయ్యేళ్ళ పాటు మొత్తం పది జిల్లాల తెలంగాణా మేధావుల్నీ వెనుకబాటు తనానికి గురి చేశారంటే ఆశ్చర్యంగా లేదూ!

చెన్నారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి జరిగిన ఘోరమైన అన్యాయాన్ని సరిదిద్దాలంటూ సమయంలో ప్రభుత్వంలోనే ఉండి అదీ అత్యంత కీలకమైన శాఖలను నిర్వహిస్తూ అన్యాయంలో భాగస్వామియైన చెన్నారెడ్డియే ఉద్యమించడం ఏమిటో, ఆనాటి డొంకతిరుగుడు బెదిరింపు తతంగాన్ని పట్టుకుని ఇవ్వాళ కొందరు తెలంగాణ ప్రజలూ మేధావులూ మాది 1968 నాటి నుంచి రగులుతున్న స్వాతంత్య్ర కాంక్ష అని బట్టలు చింపుకోవడం ఏమిటో - అస్సలు కామన్ సెన్సు కూడా ఉండదా!

అయిదేళ్ళ ఆర్భాటం తర్వాత 1973 నాటికి అనవసరపు విభజన ఇష్టం లేని శ్రీమతి ఇందిరా గాంధీ కలగజేసుకుని ఆరు సూత్రాల ఫార్ములా ప్రకటించి రాజీ చేశాక జరిగిన లోపాయకారీ ఒప్పందం ప్రకారం మర్రి చెన్నారెడ్డి గారు మొదట ఉత్తర ప్రదేశ్ గవర్నర్ పదవినీ వెంగళ రావు గారి తర్వాత 1978 నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిత్వాన్నీ దక్కించుకున్నారు.

1973 డిసెంబర్ 10 మొదలు 1978 మార్చి 06 వరకు ముఖ్యమంత్రిత్వం నిర్వహించిన (16)జలగం వెంగళ రావు గారు తెలంగాణ ప్రాంతానికి కాకతీయ యూనివర్సిటీ, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి నాగార్జున యూనివర్సిటీ, రాయలసీమ ప్రాంతానికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సాధించి తీసుకొచ్చి 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేసి 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నీ 1972 నాటి జై ఆంధ్ర ఉద్యమాన్నీ కొంత చల్లబరిచారు.

రెండు ఉద్యమాల వెనక ఉన్నది పేరులో రెడ్డి తోక ఉన్నవాళ్ళు తప్ప ఇంకెవరూ ప్రభుత్వంలో ఉండకూడదన్న రాజకీయ వ్యాపార దురంధరులైన రాయలసీమ ఫ్యాక్షనిష్టు రెడ్లు.నరసింహా రావు గారు వ్రాసిన Insider అనే పేర్లు మార్చిన ఆత్మకధలోని Mahendranath అనే పాత్ర నీలం సంజీవరెడ్డి గారిదీ అతని శత్రువైన Chaudhury అనే పాత్ర కాసు బ్రహ్మానంద రెడ్డి గారిదీ అని జరిగిన చరిత్రనీ కధలోని సంఘటనల్నీ పోల్చి చూసిన ప్రతి ఒక్కరికీ తెలిసిపోతూనే ఉంటుంది.నవలలో నరసింహా రావు గారు ప్రత్యేకించి ప్రస్తావించనప్పటికీ ఆయన్ని పదవినించి తప్పించడానికి ఉపయోగపడిన ఆనాటి జై ఆంధ్ర ఉద్యమానికి ఇద్దరు రెడ్ల ఆధిపత్య రాజకీయాలు కారణం.

తెలంగాణకి ఆంధ్రావాళ్ళు అన్యాయం చేసేస్తున్నారని అంత భీకరమైన ఉద్యమం చేసిన మర్రి చెన్నారెడ్డి గారు ఉద్ధరించిన ఘనకార్యం ఏంటి?ఏమీ లేదు!రెండేళ్ళలో సొంత పార్టీ వాళ్ళే అవినీతిపరుడనే ముద్ర వేసి గెంటిపారేస్తే అందులో ఆంధ్రావాళ్ళ ప్రమేయం ఏముంది!

1956లో పెద్దమనుషుల ఒప్పందంతో ఆంధ్రావాళ్ళనుంచి భారీ తాయిలాలు అందుకుని కూడా 1969 నాటికే బెదిరింపు రాజకీయం చేసిన తెలంగాణ ప్రాంతపు నాయకులు 2014 వచ్చేసరికి మరింత గయ్యాళితనం పెంచుకుని తెలంగాణ ఉద్యమం - II అని గొడవ మొదలుపెట్టారుఅప్పటివరకు  ఆంధ్రావాళ్ళు చేసిన అభివృద్ధిని మాత్రం ఉంచుకుని ఆంధ్రావాళ్ళని దొంగలని తిట్టి వెళ్ళగొట్టారు!చాలామందికి తెలియదు గానీ వాళ్ళ కోపం "ఆంధ్రావాళ్ళు" అనే బహువచనంలో ఉన్న ఆంధ్ర ప్రాంతపు ప్రజల మీద కాదు, చంద్రబాబు మీదనే!అది వాళ్ళే ఒప్పుకున్నారు గానీ ఇవ్వాళ్టికీ తెలంగాణలో ఉన్న చంద్రబాబుని పొగిడిన ప్రతి ఒక్కడినీ పచ్చ బానిస పేరు పెట్టి తిడుతూ తెలంగాణ ద్రోహి కింద లెక్కగట్టి రెచ్చిపోయేవాళ్ళు చంద్రబాబు తెలంగాణ ప్రాంతానికి చేసిన అన్యాయం ఏమిటో చెప్పగలరా?

1995 సెప్టెంబర్ 01 మొదలు 2004 మే 13 వరకు (28)నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.ప్రకాశం పంతులు గారి తర్వాత ఆర్ధిక శాస్త్రం యొక్క శక్తిని తెలుసుకున్నది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే!ప్రకాశం పంతులు గారిలా స్వయాన ఆర్ధికశాస్త్రం చదవలేదు గానీ విషయ పరిజ్ఞానం ఉన్న అధికారులను ఉపయోగించుకుని సరైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చి రామారావు తెలివి తక్కువ నిర్ణయాల వల్ల కుదేలయిన ఆర్ధిక రంగం కొంత తెరిపిన పడింది.

1996 ఫిబ్రవరిలో మొదలు పెట్టిన "జన్మభూమి" మంచి కార్యక్రమమే.ఇందులో స్థానిక పరిపాలనకు సంబంధించిన అంశాలలో ప్రజలని ఇన్వాల్వ్ చెయ్యడం చక్కటి ఆలోచన.1997 సంవత్సరంలో మొదలు పెట్టిన "పచ్చదనం-పరిశుభ్రత" కూడా మంచి కార్యక్రమమే.ముఖ్యమైన అన్ని ఉత్పత్తి రంగాలకీ "self help groups(SHG)" ఏర్పాటు చేసి ప్రోత్సహించడం కూడా బాగుంది.రైతు బజారు, డ్వాక్రా అనేవి కూడా మంచి ఐడియాలే.1995-1996 నాడు మూసివేతకి దగ్గరైన సింగరేణి కాలరీస్ సంస్థని లాభాల బాట పట్టించి దాని పరువు నిలబెట్టాడు!స్వర్ణాంధ్ర ప్రదేశ్ అన్నాడు!మొట్ట మొదటి సారి తన స్వంత ప్రజ్ఞని మాత్రమే చూపించి కేంద్రం పూచీకత్తు లేని Rs 2,200 Cr ఋణాన్ని World Bank నుంచి తెచ్చాడు!1992-1994 నాటికి నష్టాల్లోనూ లోటులోనూ ప్రావీణ్యాత్లోనూ అధమ స్థాయికి చేరి కునారిల్లుతున్న Andhra Pradesh State Electricity Board (APSEB) సంస్థని కేవలం అయిదేళ్ళు గడిచేసరికి cost and quality విషయాల్లో world class స్థాయికి చేర్చాడు!1998 నవంబర్ నాడు అటల్ బిహారీ వాజపేయి చేతుల మీద HITEC Cityకి అంకురార్పణ చేసి పెంచి పెద్ద చేసి ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి సాటిలేని landmark కింద నిలబెట్టాడు!1999లో హైదరాబాదు నగరానికి Pharma City/Genome Valley అనే మరొక అద్భుతాన్ని అందించాడు!2001లో "ఈసేవ-మీసేవ" అన్నాడు!2003లో అప్పటి వరకు విడి విడి రవాణా వ్యవస్థలైన రైళ్ళనీ బస్సుల్నీ కలుపుతూ హైదరాబాదు నగరానికి multi-modal transport system (MMTS) విధానం ఏర్పాటు చేశాడు.

1999లో ఇరవయ్యేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలబెట్టే ఉద్దేశంతో విజన్ 2020 ప్రతిపాదించిన చందబాబు వీళ్ళకి పనికిరాలేదు గానీ ఆరోగ్యశ్రీ తప్ప  ఇంకొక్కటి సక్సెస్ చెయ్యలేని రాజశేఖర రెడ్డి దేవుడిలా కనిపించాడా!

ఎవరి పరిపాలనలో ఎన్నిసార్లు ఆమెరికా అధ్యక్షుడూ బిటన్ ప్రధానమంత్రీ వాళ్ళ దేశాలు దాటి ఇంకో దేశంలో అడుగుపెట్టి ఆయా దేశాల రాష్ట్రాల ప్రభుత్వాధినేతల్ని పొగిడారో లెక్కలు తియ్యండి.సా. 2000 నాడు Bill Clinton, Tony Blair చంద్రబాబును కలవడానికి హైదరాబాదు వచ్చారు - ప్రపంచ స్థాయి సర్క్యులేషన్ ఉన్న Time పత్రిక "In just five years, he has turned an impoverished, rural backwater place into India's new information-technology hub" అని మెచ్చుకుని South Asian of the Year అని ప్రశంసించింది.

అదివరకు దేశంలో టూరిజం అంటే పాత కాలంలో గుడి గోపురాలు తిరగటానికి చేసే తీర్ధయాత్రల లాంటి యవ్వారం అనుకునేవాళ్ళు తప్ప అందులో సంపాదన ఏముంటుందీ అనుకునే స్థితి నుంచి దేశంలోకి వచ్చే విదేశీ యాత్రికుల్లో 24 శాతం మంది ఆంధ్రాకి వచ్చేలా చేశాడు.అలాంటివి నేను గానీ ఈల గానీ వేస్తే అన్నట్టు సొల్లు కబుర్లు చెప్పే జగనూ కేసీయారూ మోదీ చెయ్యలేరు, చెయ్యరు, చెయ్యాలని అనుకోరు కూడా!ఈలలు వేస్తే రావడానికి ఫారిన్ టూరిస్టులూ అమెరికన్ ప్రెసిడెంటూ బ్రిటన్ ప్రధానీ పిచ్చోళ్ళా - విమాన ప్రయాణం దగ్గిర్నుంచి బస్సు ప్రయాణం వరకు గల అన్ని సౌకర్యాల్నీ మెరుగు పర్చాకనే అది సాధ్యపడింది! 20002 నాటికి ఆంధ్రా వైపుకి వచ్చేవీ ఆంధ్రా నుంచి వెళ్ళేవీ అయిన విమాన సర్వీసుల్లో 100% ఆక్యుపెన్సీ నమోదైంది.హోటళ్ళూ తదితర సౌకర్యాలతో కలుపుకున్న ఇండైరెక్ట్ మరియు డైరెక్ట్ ఎంప్లాయిమెంటు యొక్క రేంజి 37.7 లక్షలు.అప్పుడు వచ్చిన best tourism performing state అవార్డు ఇప్పుడు తెలంగాణ అధీనంలోనే ఉండి ఉండాలి!

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ టూరిజం అనేది మెయిన్ స్ట్రీం పరిశ్రమ కాదు.టూరిజం అనేదాంట్లో ఇంత హడావిడి పెరగటానికి ముందే అన్ని మెయిన్ స్ట్రీం వ్యాపార పారిశ్రామిక రంగాల్లో పెరుగుదల కనిపించాకనే వేరేవాళ్ళు ఇటువైపుకు రావటం మొదలై టూరిజం పెరుగుతుంది అనేది తెలిస్తే చాలు చంద్రబాబు తెలంగాణకి ద్రోహం చేశాడు అనేది అబద్ధం అని తెలుస్తుంది.బహుశః మాటలు తక్కువ చెప్పి పనులు ఎక్కువ చేసి ఇప్పుడున్న వాళ్ళకే కాక పుట్టబోయేవాళ్ళకి కూడా ఉపాదులు దొరికేలా పరిపాలించటమే చంద్రబాబు చేసిన ద్రోహం కాబోలు!

2001 ఏప్రిల్ 27 కేసీయార్ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత అతను తన వ్యక్తిగత శత్రువైన చంద్రబాబుని తెలంగాణ శత్రువు కింద ఫిరాయించాకనే కదా వీళ్ళకీ చంద్రబాబు తెలంగాణకి ద్రోహం చేసినట్టు తెలిసింది - మరి చంద్రబాబు తెలంగాణకి ద్రోహం చేశాడని చెప్తున్న కాలంలో కేసీయార్ ఎక్కడ వున్నాడు?కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి రాజకీయ ప్రయాణం కాంగ్రెసులోనే మొదలైంది.మెదక్కు శాఖలో చేరారు.ఎప్పుడు చేరారో కూడా తెలియడం లేదు. కాంగ్రెసులో ఉండి 1983 వరకు ఏమి గోగునార కట్టలు పీకినారో తెలియడం లేదు గానీ 1983లో రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరి అనంతుల మదన్ మోహన్ మీద పోటీ చేసి ఓడిపోయారు.అయితే, తర్వాత కొంచెం కష్టపడి పార్టీలో ముందుకెళ్ళి 1987 మొదలు 1988 వరకు రామారావు మంత్రివర్గంలో Drought & Relief శాఖతో మంత్రి అయ్యారు.1990లో Medak, Nizamabad, Adilabad జిల్లాలకు తెలుగుదేశం పార్టీకి కన్వీనర్ అయ్యారు.1996లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో Transport minister అయ్యారు.2000 మొదలు 2001 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకి deputy speaker అయ్యారు.2001 April 27 Deputy Speaker స్థానానికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి Telangana Rashtra Samithi (TRS) అనే సంస్థని స్థాపించారు.

మహా ఘనత వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమపు నీచత్వాన్ని తెలుసుకోవటానికి కొంచెం చరిత్ర చాలదూ!తను మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద తనే తిరగబడటం ఏమిటో 60 ఏళ్ళు పోరాటం చేసి ఆంధ్ర దోపిడీ నుంచి విముక్తం అయ్యామని రొమ్ములు విరుచుకు తిరుగుతున్న ఈనాటి ఉద్యమనేతలు చెప్పగలరా?

అసలు ఆంధ్రా నాయకులు తెలంగాణ వాళ్ళని దోచుకోవడం ఎలా కుదురుతుంది?దేశం మొత్తం మీద ఎలా ఎన్నికలు జరుగుతాయో తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ అలాగే జరుగుతాయి కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యుల్ని తెలంగాణ వోటర్లే ఎన్నుకుంటారు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యుల్ని ఆంధ్రా వోటర్లే ఎన్నుకుంటారు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!బుద్ధీ జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా నమ్ముతాడా పాస్ పోర్టులు అమ్ముకుని బాగుపడ్డ ఒక నోటిదూల తాగుబోతు వెధవ చెప్పిన గాలికబుర్లు?

1968 నాటి చెన్నారెడ్డి గారూ 2001 నాటి కేసీయార్ గారూ ఒకేలాంటి కబుర్లు చెప్పారు, రెండుసార్లూ తెలంగాణ ప్రజలూ మేధావులూ ఒకే రకం పిచ్చితనాన్ని ప్రదర్శించారు,పైన ఆంధ్ర ప్రాంతపు నాయకుల్ని దొంగలనీ దోపిడీదార్లనీ తిడుతున్నారు.వాళ్ళ ఆజ్ఞానంతో ఇన్నేళ్ళూ వాళ్ళని వాళ్ళు సర్వనాశనం చేసుకున్నది చాలక వాళ్ళకన్న పదింతలు తెలివైనవాళ్ళైన ఆంధ్ర ప్రాంతపు ప్రజల్ని కూడా సర్వనాశనం చేశారు!

కేసీయార్ చంద్రబాబుకి తెలంగాణ శత్రువు ముద్ర వెయ్యటం వ్యక్తిగత కక్ష వల్ల చేసి ఉండొచ్చు గానీ మీడియా అందిపుచ్చుకుని ప్రచారం చెయ్యడం వల్ల వీధుల్లోనూ కొందరు పిచ్చోళ్ళ మెదళ్ళలోనూ నాటుకుపోవడం వెనక ఇప్పుడు అమరావతిని ధ్వంసం చేస్తున్న అంతర్జాతీయ స్థాయి కుట్రదారుల ప్రమేయం ఉంది.

కేసీయార్ దగ్గిర్నుంచి గోరేటి వెనకన్న వరకు పాడిన పాట "ఆంధ్రా దోపిడీ" అనేది సర్వాబద్ధం - నిజానికి ఆంధ్రాతో కలిసింది మొదలు తెలంగాణ వాళ్ళు గయ్యాళితనంతో చేసిన దగాకోరు రాజకీయం వల్ల సర్వనాశనం అయ్యింది ఆంధ్రావాళ్ళే!

తెలంగాణ మేధావి ఆంధ్రావాళ్ళకి అన్యాయం చేసి బలిసిన తమ దోపిడీ చరిత్రని చూసుకుని గర్వపడుతున్నాడు? తెలంగాణ మేధావి ఆంధ్రావాళ్ళకి తమ ముఖ్యమంత్రి చేసిన చేస్తున్న చెయ్యబోతున్న అన్యాయం గురించి తెలుసుకుని సిగ్గుపడుతున్నాడు!

ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి. 

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...