Saturday 31 January 2015

ఇద్దరు బెమ్మచారులు పాలిస్తున్నారండయా మన దేశపు జనాల్ని?!

     "బ్రహ్మచారీ శతమర్కటః" అని యెందుకన్నారా అని చాలా కాలం నుంచి దురదగా వుందేది.మనకి వున్నయ్యి బాల్యము,యవ్వనము,కౌమారము,వార్ధక్యము అని నాలుగే గదా ఈ బ్రహ్మచర్యం అనేది యెలా వచ్చిందీ అని కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే చదువుకీ బ్రహ్మచర్యానికీ లింకు పెట్టారు.మామూలుగా రోజువారీ పన్లకి నోటిలెక్కలు సరిపోయేవి.కానీ ఇవ్వాల్టి వుద్యోగాల మాదిరి యేదయినా పెద్దయెత్తున పనికొచ్చేది నేర్చుకోవాలంటే మాత్రం యెవరో ఒక గురువుని పట్టుకుని ఆయన గారి ఆశ్రమమలో చేరి చదువుకుని ఆయనో కుర్రాడో ఇక చాలనుకునే వరకూ వుండి వెళ్ళేటప్పుడు గురుదక్షిణ చెల్లించి జనం మీదనో రాజుగారి మీదనో పడేవాళ్ళు!

మొట్టమొదట గురువుగారు చేసే పని యేమిటంటే తన దగ్గిర కొచ్చిన కుర్రాడికి జంఝప్పోగు తగిలించటం?అందుకే బ్రాహ్మలకే గాదు కంసాలులకీ,ఇంకా విశేషవృత్తుల వారికి కూడా జంధ్యం వుండేది!అ కాలంలో అది వేశారు అంటే కుర్రాడు వున్నతవిద్యలో వున్నట్టు లెఖ్ఖ!ఆ వీరతాడు వేసిన గురువుగారు పెట్టే ఆతి ముఖ్యమయిన కండిషను "బ్రహ్మచర్యం!" చదువుకునే వయస్సులో ఇప్పట్లాగ అమాయిలకి లైన్లెయ్యటం అస్సలు కుదరదన్న మాట?వేస్తే వీపు చీరేస్తారు,తన్ని తగిలేస్తారు,మధ్యలో బయటికెళ్తే యెందుకూ  కొరగాకుండా ఐపోతాడు?!అప్పటి వరకూ యెంత అందమైన ఆడపిల్ల కనపడినా మాతృభావన చేసి పక్కకి తప్పుకోవలసిందే,ఓరి దేవుడోయ్?!

ఆ చదువు కాస్తా పూర్తయ్యాక ప్రభుత్వోద్యోగిగానో సీనియర్ల దగ్గిర సహాయకుడిగానో కుదురుకుని పెళ్ళి చేసుకునే వరకూ మాత్రం కుర్రాడు అచ్చోసిన ఆంబోతు లాగా యెన్ని తిరుగుళ్ళయినా తిరచొచ్చు.ఈ దశలోనే కుదురు తక్కువ వాళ్ళు అప్పటిదాకా కట్టుకున్న కచ్చడాలు తొలిగిపోతాయి గనక మర్కటాల మాదిరి ఆవేశపడి పోయేవాళ్ళు?!వాస్తవానికి ఆ పెళ్ళికాని ప్రసాదులకి అప్పట్లో ప్రత్యేకమయిన పేరు లేకపోవటంతో ఆ బ్రహ్మచారి క్యాటగిరీలోనే లాగించేశారు.

ఈ దశలోని బ్రహ్మచారులు అత్యంత ప్రశస్తమైన వాళ్ళు.మళ్ళీ వీళ్లలో రకాలు కూడా వున్నాయి!"అస్ఖలిత బ్రహ్మచారులు","నిష్కళంక బ్రహ్మచారులు","ఘోటక బ్రహ్మచారులు" అనేవి ముఖ్యమైనవి. మొదటిది అప్పటికింకా స్త్రీ సాంగత్యం కుదరకపోయినా కుదిరితే ఆ బ్రహ్మచర్యాన్ని వొదిలేసే మామూలు రకం!రెండో రకం యెందుకనో పెళ్ళి పట్ల విముఖత వుండి దానితో పాటు ఆధ్యాత్మికత కూడా కలిసి పెళ్ళికీ స్తీ సాంగత్యానికీ దూరంగా వుండటం -  ఇప్పటికీ రా.కృ.మి లో కనపడుతున్నారు?మూడో రకం ప్రమాదకరమైనది - వాళ్ళు మాత్రమే  బ్రహ్మచర్యానికి అంకితమై పోవడంతో సరిపెట్టుకోకుండా మిగతా వాళ్లని కూడా ప్రభావితం చెయ్యాలని చూస్తారు?!

వీళ్లు కాకుండా "నాతి గల బ్రహ్మచారులు" మరో రకం?!పెళ్ళి చేసుకున్నాక కొంతకాలానికి జ్ఞానోదయమై అటు పూర్తిగా సన్యాసానికీ ఇటు పూర్తిగా సంసారానికీ కాకుండా కేవలం భార్యకి శృంగారపరంగా దూరంగా మాత్రం వుంటూ గృహస్థుగానే చెలామటీ అవుతూ వుంటారు - కత్తి మీద సామే అయినా తప్పదు మరి?!



ఈ నాతిగల బ్రహ్మచర్యం గురించి చెప్పాక మెల్లగా మీకూ లైటు వెలిందనుకుంటాను ఇదంతా అప్రస్తుత ప్రసంగం కాదని?!ఇవ్వాళ మననేలుతున్న వాడు నాతిగల బ్రహ్మచారి?ఇప్పుడు చాన్సు తప్పిపోయింది గానీ ఆ సీటు మా ఫామిలీదే అని ధీమాగా వున్న రాహు బాబు ఘోటక బ్రహ్మచారి!పైగా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకపోయినా ప్రతిపక్షంలో వున్న అతిపెద్ద పార్టీకి నాయకుడిగా వుండటం వల్ల ఇప్పుడు కూడా మనని ప్రభావితం చేస్తున్నట్టే గదా!ఇంతవరకూ తను ప్రచారం పేరుతో అడుగుపెట్టిన ప్రతి యెన్నికల్లోనూ విజయావకాశాలు వున్నచోట కూడా అపజయాన్నే తెచ్చిపెట్టటం చూసి జ్ఞాననేత్రం కొంచెం వికసించటం వల్ల కాబోలు అప్పుడప్పుడూ కాంగిరేసు వారికే ఈ బ్రహ్మచారి యేం గట్టెక్కిస్తాడు అనిపించి నాయనమ్మ పోలికల్తో వున్నఅనుంగు సోదరిని పిలుద్దామా ఆంటే ఆవిడా తన మొగుడు బంగారం మూలంగా చెడతాననో యేమో తనూ వెనకాడుతున్నాది?!ఆక్కడ మరో అసలు సిసలు నికార్సయిన మర్కటమూర్తి ఒకడున్నాడు?!అవిడ మొగుడికి నోటిదూలెక్కువై ఆత్తగారి యేలుబడిలో వున్నదని కూడా చూసుకోకుండా "ఈ దేశపు జనం అరిటి పండు రాజ్యపు వెధవలు" అనేసి అక్కడా ఒక మర్కటం వుందనిపించాడు?!పాపం భరతమాత దగ్గిరున్న ఒకే ఒక అరిటిపండు కోసం యెన్ని మర్కటాలు పోటీ పడుతున్నాయో?!



దళితేతరులు దళితులకి న్యాయం చెయ్యలేరు గాబట్టి దళిత అనుకూల ప్రభుత్వం కోరుకుంటున్నట్టు బ్రహ్మచారి సంసారులకి న్యాయం చెయ్యలేడు గాబట్టి వుద్యమం చేద్దామా అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు నాతి గల బ్రహ్మచారి నుంచి ఘోటక బ్రహ్మాచారి కిందకి వెళ్తామా అని భయంగా వుంది?!

ఆ ఘోటక బ్రహ్మచారి యేమో అమాయకంగా కాంగ్రెసుని మళ్ళీ అధికారంలోకి తెచ్చేవరకూ పెళ్ళి చేస్కోననేశాడు.ఈ లెక్కన కాంగ్రెసు మళ్ళీ లేవలెక పూర్తిగా అదృశ్యమై పోతే కాంగ్రెసుతో పాటూ గాంధీ - నెహ్రూ కుటుంబాలకి సంబంధించిన ఈ ఒకే ఒక వారసుడితో ఆ రెండు ఇంటిపేర్లూ కూడా భారత రాజకీయ రంగం నుంచి అదృశ్యమై పోతాయా?!

శుభం భూయాత్!!!
_______________________________________________________________
చిత్రములు:గూగులమ్మి!

Friday 30 January 2015

ఈ బొబ్బిలి దొర దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాల?!

దొర తలిస్తే దెబ్బల్కి కొదవా?!నేను తలిస్తె మొత్తం తెలంగాణానె అనంతగిరి మాన్యాలు పట్టిస్త?!తెలంగాణా తెచ్చింది నేను!తెలంగాణా నాది!తెలంగానా నేను!తెలంగాణాకి సలాం జెయ్యకుంటె మెదలు విరుస్తనన్న,ఆ పచ్చ బాకా మీదియా గాణ్ణి నోరు మూయించిన,లేకుంటె నా కొదుకు మీద సొల్లు కబుర్లు రాస్తడు?కేసీఆర్ కొదుకు తప్ప్పు జేస్తడా ఆ గొట్టాం గాడు రాజయ్య లెక్క?బోడి రాజయ్య యెవడయ్య నేను జేస్తె అయ్యిండు మంత్రయినా,వుపముఖ్యమంత్రయినా!?నాలాగ తెలంగాణా తెచ్చిండా,స్వయం ప్రకాశంగ యెదిగిండా?నేను మంత్రిని జేస్తె మంత్రయినప్పుదు సమ్మగుండె!పీకినప్పుడె వచ్చింద తంట?పెతిదానికీ తనే మాట్లాడ్తడు,హెల్తు యూనివర్సిటి అంటడు,అదంటడు,ఇదంటడు - అసుంటియి మాట్లాడితె నేను మాట్లాడాల,నా కూతురు మాట్లాడాల,నా కొడుకు మాట్లాడాల,నా అల్లుదు మాట్లాడాల!గది గూడ దెలియలె ఆ దిమాగు తక్కువోంకి - నేనెందుకు పీకిన్నొ?!యెవడు బడితె వాడు దేని గురించి బడితె దాని గురించి మాట్టాడితె నా ఫ్యామిలీకి మైలేజి యెట్లొస్తది?

చెష్టు ఆస్పత్రి యెక్కడ బెడితె యేంది?ఆస్పత్రి యెక్కడుంటె అక్కడికె గద పోయెడిది.రోగమొచ్చినోని ఇంటి ముంగల బెట్టాలా యేంది?నాలుగేళ్ళు ఆగినంక అందర్నీ నా లెక్క పెద్ద ఫాం హౌసు వోనర్ని జేస్త!గప్పుదు అమెరికల వున్నా పోవొచ్చు ఆస్పత్రికి.నా ఇష్తమొచ్చిన లెక్క జేస్త నన్ను మించినోడు వొచ్చెదంక!యెన్ని మాట లిచ్చినా యెన్ని సార్లు దప్పినా యెంత జబర్దస్తుగ జేసిన!యెవడన్న గదేందని యేనాడూ అడగలె?నా అంతట నేను ముఖ్యమంత్రి నయిన్నా?అందరు జేరి నీకన్న మొగోడు లేడంటెనె గదా అయ్యింది?మరింక గిప్పుడీ సణుగుదేంది!నాకన్న మొగోడు వుంటె దీస్క రాండి నేను తప్పుకుంట?!

సమజైందా?!నేనొక్కసారె జెప్త!చెప్పింది చేసుడే?!

Tuesday 27 January 2015

యెవరీ కాళిదాసు?యేమిటితని గొప్ప!

          తెలుగుని ఇటాలియన్ ఆఫ్ త ఈస్ట్ అంటారట!ప్రాచీనమైన దాన్ని నవీనమైన దానితో పోలిస్తే వాడు ఫలానా వారి మనవడు అని చెప్పడానికి బదులు ఆయన ఫలానా కుర్రాడి తాతగారు అని చెప్పడం కాదా?వాళ్ళు కొత్తగా తెలుసుకుని ఈ భాషేదో ఇటాలియన్ భాషలా వుంది కదా అని అనుకోవడం వరకూ ఓకే?!కానీ మనవాళ్ళు కూడా వొప్పేసుకుని సర్దుకు పోయారే అదే కొంచెం ఇబ్బందిగా వుంది.

          తెలుగు భాష లాంటిదే కాళిదాసు పరిస్థితీ,షేక్స్పేయర్ ఆఫ్ ది ఈస్ట్ అట!కానీ రచనా కాలాన్ని బట్టీ వస్తు విశేషాన్ని బట్టీ చూస్తే నక్కనీ నాకాన్నీ పోల్చినట్టు వుంటుంది పోలిక?షేక్స్పెయర్ నాటకాలు అన్నీ ఒకే మూసలో వుంటాయి - విక్టోరియా కాలం నాటి వాతావరణం లోనే నడుస్తాయి కింగ్ లియర్ అయినా హాంలెట్ అయినా రోమియో జూలియట్ అయినా.కానీ కాళిదాసు తన కధల్లోని వర్ణనలు అతనెక్కడి వాడో తేల్చలేనంత వాస్తవికంగా వున్నాయి.కుమార సంభవంలో హిమాలయాల్ని వర్ణించిన తీరు చూసి అక్కడి వాడేమో ననీ,మేఘదూత కావ్యంలో చేసిన వుజ్జయిని వర్ణనల్ని చూసి ఇతను ఖచ్చితంగా వుజ్జయిని వాడే ననీ,రఘువంశంలో కళింగ ప్రభువైన హేమాంగదుది రాజ్య వైభవాన్ని కీర్తించిన తీరు చూసి కళింగ ప్రాంతాని చెందిన వాడనీ దిగ్దంతులైన విమర్సక శిఖామణులే గందరగోళంలో పడిపోయారంటే ఆ వైవిధ్యం యెంతటి గొప్పదో గదా!

          ఇతని సాహిత్యమే తప్ప ఇతని గురించి వస్తవాలు యెవరికీ తెలియవు.లక్ష్మీ ధర్ కాలియా అనే పండితుదు మాత్రం యెన్నో వ్యయప్రాయాసల కోర్చి ఆధారాలతో అతను కాశ్మీరుకు చెందిన వాడనీ బహుశా రాజాశ్రయం కోసం అటు తిరిగీ ఇతు తిరిగీ వుజ్జయిని నగరం దగ్గిర ఆగి వుండొచ్చునని అభిప్రాయ పడ్డాడు! అప్పటి వాళ్ళకి ఒక రకమైన నిర్లక్ష్యం వుండేది తమ గురించి చెప్పుకోవదం పట్ల - నా కావ్యంలో సత్తా వుంటే అది నిలబడుతుంది,నేను చదువర్లకి యేమి చెప్పాలనుకున్నానో అది చెప్పగలిగితే చాలు గదా నేనెవరినో చెప్పుకోవాల్సిన అవసర మేమిటి అనే వుద్దేశం వల్ల కాబోలు ?చిన్న బొమ్మ గీసినా అందులో యేదో ఒక మూల "ఆర్టిస్ట్:ఫలానా" అని ఇరికించుకునే సరదా వున్నవాళ్ళకి దాని వెనక వున్న ధీమా అర్ధం కాదు!

              ఇతని కాలాన్ని మాత్రం మొదట క్రీ.శ 1వ శతాబ్దంగా భావించారు గానీ ఇప్పుడు మాత్రం అందరూ క్రీ.శ 5వ శతాబ్దం వాడని నమ్ముతున్నారు.చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా భావిస్తున్నారు.కవిత్వంలో తీసుకున్న వస్తువులూ వర్ణించిన పోలికలూ కూడా సామాన్యుల జీవితాల లోని అంశాలకి సంబంధించినవే అయి వుంటాయి.ఇతని నాటకాలు అన్నింటిలోకి "అభిజ్ఞాన శాకుంతలం" చాలా గొప్పది.దీని గొప్పదనాన్ని వర్ణించటానికి ఒక రమ్యమయిన శ్లోకం వుంది!అప్పటి విమర్సకులు ఇప్పటి లాగా రచన నంతా పీకి పాకం పెట్టి పేజీల కొద్దీ వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు గాదు,సింపుల్గా వున్నా మొత్తం కావ్యంలో వున్న గొప్పదనాన్ని విప్పిచెప్పిన తీరు అర్ధమయితే "మజ్జారే,యేమి చెప్పినాడురా!" అనిపిస్తుంది.
"కావ్యేషు నాటకం రమ్యం 
నాటకేషు శకుంతలా 
తత్రాపి చతుర్థాంకం 
తత్రశ్లోక చతుష్టయోః" అని ఒకే ఒక్క శ్లోకం?! 
మొత్తం శాకుంతలం చదివి ప్రతి శ్లోకాన్నీ అర్ధం చేసుకున్నా గూడా ఈ పాయింటు పట్టిన వాడిని మాత్రం "అధ్భుతః" అనుకోకుండా వుండలేము?

దుష్యంతుణ్ణి మరోసారి చూడటం కోసం ఆగి వెనక్కి తిరిగిన శకుంతల:రాజా రవి వర్మ!

       చతుర్ధాంకం శకుంతల గర్భవతి అని తెలిసి కణ్వుడు ఆమెని ఇక యెంతోకాలం పుట్టింట్లో వుంచడం మంచిది కాదని దుష్యంతుడి దగ్గిరకి పంపించే సన్నివేశంతో మొదలవుతుంది.ఆ నాలుగు శ్లోకాల లోనూ వరసగా సకుంతల గునగణాల్ని వర్ణిస్తూ ఆమె పెంచిన మొక్కల్నీ జింకల్నీ కూడా వీడుకోళ్ళు అడగటం,కేవలం పెంచిన కూతురైన శకుంతలని విడవలేక పోతున్న కణ్వుడు తన దుఃఖాన్ని సంసారుల దుఃఖంతో పోల్చుకోవడం,కణ్వుడు దుష్యంతుడికి విన్నపం చేసుకోవడం,కణ్వుడు శకుంతలకి హితవు చెప్పదం అధ్బుతమైన సంవిధానం!

శ్లో||పాతుం న ప్రధమం యవస్యతిజలా యుష్మాస్వపీ తేషుయా
నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహే నయా పల్లవం
అజ్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః
సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం!
భావం:మొక్కలకి నీళ్ళు పోయకుండా తను మంచినీళ్ళు కూడా తాగేది కాదు శకుంతల.చిగురుటాకులను అలంకరించుకోవతం యెంత ఇష్టమయినా సరే తుంచేది కాదు శకుంతల.తను పెంచిన మొక్కకి పువ్వులు పూస్తే పిలల్ పుట్టినంత సంబరపడి వుత్సవం చేసేది శకుంతల.అలాంటి శకుంతల ఇవ్వాళ అత్తారింటికి వెళ్తోంది అనుజ్ఞ ఇవ్వండి!

శ్లో||యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా
కంఠస్తంభిత భాస్పవృత్తి కలుషశ్చింతా జదం దర్శనం
వైక్లవ్యం మమతావధీ దృస మిదం స్నేహాదరణ్యౌ కసః
పీడ్యంతే గృహిణః కధమ్నుతనయా విశ్లేష దుఃఖైర్నవై!

భావం:శకుంతల అత్తవారింటి వెళుతుందంటే కంఠం పట్టేసి మాట రావటం లేదు.కంటిలో నీరు చేస్రి చూపు కనిపించతం లేదు.చుట్టూ వున్నదంతా జడంగా కనిపిస్తున్నది.యే బంధాలూ లేని నాకే ఇంత బాధగా వుంటే గ్ర్హస్థులు ఇంకెంత బాధ పదతారో గదా?

శ్లో||అస్మాన్ సాధు విచింత్య సమ్యమధనాన్ ఉచ్చై కులంచాత్మనః
త్వైయస్యా కధమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం
సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృస్యాత్వయా
భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వహూబంధుభిః

భావం:మహారాజా!మునివృత్తిలో వున్న మాకు తపస్సే ధనం- అదే ఇస్తున్నా.నీ తాహతుకు తగ్గట్టు మేము ఇవ్వలేము - సిరిసంపదలు ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించకు.మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళీ కాదు,మీకై మీరు ఇష్టపడి చేసుకున్న గాంధర్వ వివాహం.కనుక మా అమ్మాయి నచ్చలేదని అనకు.నీకు చాలా మంది భార్యలున్నా అందరితో పాటే సమానంగా చూడు.అందరికన్నా యెక్కువగానే చూసుకుంటాను అంటే అది శకుంతల అదృష్తం, కానీ నేను మాత్రం అలా చెప్పకూడదు!

శ్లో||శుశ్రూషస్వ గురూన్ ప్రీయసఖీ వృత్తిం సపత్నీజనే
భర్తుర్విప్ర కృతాపి రోషణతయా మాస్మం ప్రతి పంగమః
భూయిష్తం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః

భావం:శకుంతలా!పెద్దలకి సేవ చెయ్యి.సవతులతో స్నేహంగా వుండు.భర్త కోపించినా వెనువెంటనే రోషం తెచ్చుకోకు.సేవకుల యందు దయ గలిగి వుండు.బోగభాగ్యాలు వున్నాయి గదా అనే వుద్వేగంతో గర్వాన్ని దరిచేరనివ్వకు.ఇలా వున్నప్పుడే యువతులు గ్ర్హిణీత్వంలో శోభిల్లుతారు!

      తన నవరస భరితం బ్లాగులో ఇదివరకే రసజ్ఞ గారు కాళిదాసు కవిత్వాన్ని చాలా చక్కగా విశ్లేషించారు.సంస్కృతం నేర్చుకుని ఆ కావ్యాలని అర్ధం చేసుకుని విడమర్చి చెప్పిన రసజ్ఞ్ గారికి నా అభినందనలు!నేనూ తప్పకుండా నేర్చుకోవాలన్న హుషారు నిచ్చాయి ఆ పోష్టులు.

     ఆ సన్నివేశంలో,"నేను సన్యాసిని,అన్ని బంధాలూ వొదిలించుకున్నవాణ్ణి..నువ్వా నాకు పుట్టలేదు, కేవలం పెంచాను.అంత మాత్రానికే ఈరోజు నువ్వు వెళ్తుంటే నాకే ఇంత దుఃఖంగా వుందే,యుక్తవయస్సు వచ్చేవరకూ పెంచిన సంసారులకి ఇంకెంత దుఃఖంగా వుంటుందో గదా!" అంటాడు.అదీ అక్కడి విషయం!ప్రతీ తరంలోనూ ప్రతి కుటుంబంలోనూ అతి మామూలుగా జరిగిపోయే ఒక సున్నితమైన సన్నివేశానికి అంతే సరళంగా శాశ్వతత్వం కల్పించాడు!?సంసారుల దుఃఖాన్ని సన్యాసి చేత పలికించాడు!అనువాదం చదివిన గోధే లాంటి మాహాకవి మంత్రముగ్ధుడయ్యాడంటే అవడా మరి?భారతీయ సాహిత్యంలో మొట్టమొదటిగా యూరొపీయ భాషలోకి అనువదించబడిన సంస్కృత గ్రంధాల్లో "అభిజ్ఞాన శాకుంతలం" ఒకటి!

        కాళిదాసు సాహిత్యాన్ని పరిశీలించి పరిష్కరించి అనువదించిన విదేశీ పండితు డొకరు,"సంస్కృత సాహిత్యం మొత్తం లుప్తమై పోయి కేవలం కాళిదాసు కవిత్వం మాత్రం మిగిలినా చాలు భారతీయులు ప్రపంచ సాహిత్య వేదిక మీద నిలబడి ఇదీ మా సాహిత్యం అని చెప్పుకుంటే అప్పటికీ ప్రధమ స్థానమే దక్కుతుంది భారతీయులకి" అని అన్నాడు!

        మరో నాటకం "మాళవికాగ్నిమిత్రం" కధ ఇవ్వాళ్టికీ మొత్తం ప్రపంచ సినిమా రంగమంతటా ఫార్ములా ఐపోయిన "పతి పత్ని ఔర్ ఓ" కధలా వుంటుంది!కానీ అప్పుడు భారతీయ సాహిత్యంలో మిగతా వాళ్ళు ఇంకా రామాయణ మహాభారత కధల నుంచి విడిపోకపోవడాన్ని బట్టి చూస్తే మాత్రం ఆ కాలానికి కొత్తరకమైనదే?అగ్నిమిత్రుడనే రాజు ఒక చిత్రపటాన్ని మాత్రం చూసి మాళవికని "ప్రేమిస్తాడు!" తీరా ఆ అమ్మాయి దాసి అని తెలిసి మొదటి భార్యకి ఒక దాసీ సవతిగా రావడం ఇష్టం లేక మాళవికని తన అంతఃపురంలోనే బందీని చేస్తుంది.చివరాఖరికి ఆ అమ్మాయి కారణాంతరాల వల్ల దాసిగా వున్నా మరో రాజ్యానికి చెందిన  రాక్జకుమార్తె అని తెలియడంతో సుఖాంత మవుతుంది.మరో నాటకం "విక్రమోర్వశీయం" అయితే మిల్స్ అండ్ బూన్ వాళ్ళ మూస అయిన "బాయ్ మీట్స్ గర్ల్" కధ లాంటిది - కాకపోతే మనుష్య లోకానికి సంబంధించిన విక్రముడికి దేవలోకానికి సంబంధించిన వూర్వశికి లింకు కలిపాడు.ఇప్పటికీ ప్రపంచ సాహిత్యంలో పుట్టిన ప్రేమకధ లన్నింటిలో గొప్పగా నిలబడగలిగిన శక్తి వున్న కావ్యం.

        పైన ఒక మాటని అక్కర్లేకపోయినా కొటేషను మార్కుల్లో పెట్టాను,యెందుకంటే ఆ మాటతో చక్కిలిగింతలు పెట్టే ఒక చిన్నప్పటి జోకు గుర్తొచ్చింది.గోదాదేవి కధ తెలుసుగా,ఒక తెలుగు మాష్టారు ఆ కధ చెప్పి పిల్లల్ని ప్రశ్లలడుగుతున్నాడు!మళ్ళీ ఆ కధని పిల్లలతో చెప్పించాలని చూస్తే అప్పటికే మన పిల్లలకి సినిమాల వల్ల పెరిగిన లోకజ్ఞానంతో భక్తి,ఆరాధన లాంటి లాంటి గంభీరమయిన మాటలు నోరు తిరక్క ఒక కుర్రాడు "రంగనాధుడూ గోదాదేవీ పేవించుకున్నారు?!" అనే మాటని వాడేసరికి గురువుగారికి "యెందుకీ వెధవలకి ఈ కధ యెక్కించాలనుకున్నానుస్మీ?!" అనేటంత విరక్తి కలిగింది?యెంత విరక్తి పుట్టినా తనకున్న పవరు ప్రకారం కుర్రాడి వీపు విమానం మోత మోగించడం మాత్రం మర్చిపోలేదులెండి!రంగనాధుదూ గోదాదేవీ పేవించుకోవడం అనే దృశ్యం తన కళ్లముందు నుంచి మాయమయ్యేదాకా కుర్రాడి వీపు మీద తబలా వాయించేశాడు "పేవించుకున్నారు అంటావా, అంటావా, అంటావా?" అని!

  ఇతని "మేఘసందేశం","ఋతుసంహారం" అనే కావ్యాలు రెండూ మరింత ప్రత్యెకమైనవి - విషయాన్ని బట్టి చూస్తే అతి విలక్షణమైనవి.మనకి మామూలుగా యెవరయినా యేదయినా గొప్ప కావ్యం రాసినా గొప్ప సినిమా తీసినా అలాంటిదే మనమూ తీసి మనమూ అంతటివాళ్ళం అనిపించుకోవాలనే దురద వుంటుంది.ఒక వసుచరిత్ర కావ్యం మోత మోగించగానే పది పిల్ల వసుచరిత్రలు వచ్చేశాయి!ఒక సినిమాలో యేదో ఒక అంశం వల్ల హిట్టయితే అదే వరసలో పది సినిమాలు వస్తున్నాయి.కానీ ఆ రెండు కావ్యాలలో వున్న విషయాన్ని మాత్రం కాపీ కొట్టడానికి యెవరూ సాహసించలేక పోయారు!ఒకటి అందమైన విరహప్రేమతో ముడిపెట్టిన మొదటి ట్రావేలాగ్ లిటరేచర్!రెండోది కధ యేమీ లేకుండా మన చుట్టూ మనకి యెలియకుండానే మారిపోతున్న ఋతువుల్లో మనకి కనిపించే అతి మామూలు దృశ్యాల్ని కొత్తగా వర్ణించి అందంగా చెప్పడం!

        మొదట్లో వాల్మీకి రామాయణంలో కవిత్వాన్ని శేషేంద్ర గారి ద్వారా కొన్ని విని నాకు ఒక అనుమానం వచ్చింది - ఇంత గొప్పగా వుపమాలంకారాన్ని వాడిన వాల్మీకిని వొదిలేసి "వుపమా కాళిదాసస్య" అని యెందుకన్నారా అని?ఋతుసంహారం లోని కొన్ని పద్యాలు చదివాక తెలిసింది ఆ మాట అతనికే తగినదని!పత్రికల్లో ఋతుసంహారానికి అనువాదమైన పద్యాలు చదివాను.యెండాకాలంలో జంతువులు నీడకి చేరి నాలికలు చాపి రొప్పుతూ వుండటాన్ని కూడా మర్చిపోలేని విధంగా వర్ణిస్తాడు.కాళిదాసు ఋతుసంహారం పూర్తిగా చదివి అర్ధం చేసుకోగలిగితే ఆ తర్వాత రుతువులన్నీ మనకి మరింత అందంగా కనబదతాయని నా నమ్మకం.మేఘసందేశం తెలుగు అనువాదం చదివాను.నేను చెన్నపట్నంలో వున్నాను అది మాతృనగరంలో వుంది!ఈసారి వెళ్ళినప్పుదు వెతికి దొరికితే తప్పకుండా ఇక్కడ వుంచుతాను?రామగిరి నుంచి అలకాపురి వరకూ దారిని వర్ణించడం యెంత గొప్పగా చేశాడంటే ఇవ్వాళ్టి గూగుల్ మ్యాపుని పట్టుకున్నా దారి తప్పిపోవచ్చునేమో గానీ ఆ వివరాలు పట్టుకుని వెళ్తే యెంత మొద్దావతారమైనా తేలిగ్గా గమ్యాన్ని చేరుకోవచ్చుననేటంత వివరంగా చెప్తాడు!అలకాపురి అనేది కల్పిత ప్రదేశమే అయినా అదొక వాస్తవం అని భ్రమించేటంత విపులంగా వర్ణించాడు ఆ నగరాన్ని - తన ప్రియురాలు యెక్కడ వుందో ఖచ్చితంగా మనం మన బంధువుల చిరునామా చెప్పినంత స్పష్టంగా రూపు కట్టించాడు!

        ఇంతటి ప్రతిభాశాలి గనకనే ఇతన్ని పొగడటానికి కూడా విమర్శకులు అందమైన కవిత్వాన్నే వాడారు!ఒకసారి సాక్షాత్త్తూ సరస్వతీ దేవిని యెదురుగా వుంచి సాహిత్యాన్ని తూచాలనుకున్నారు పండితులు కొందరు?!ఒక వైపు దండి,భవభూతి లాంటి వాళ్ళ కావ్యాలు వుంచారు,మరొక వైపు ఒక్క కాళిదాసు కవిత్వమే వుంచారు.త్రాసు మెల్ల మెల్లగా వేరే వైపుకి దిగి కాళిదాసు కవిత్వం తేలిపోతుంటే మధ్యవర్తిగా వుండాల్సిన వాణి తన కచ్చపీ నాదపు మాధుర్యంలో వేలి కొసని ముంచి కాళిదాసు కవిత్వం మీద ఒక బొట్టుని రాల్చిందట - దాంతో త్రాసు కాళిదాసు కవిత్వం వైపుకే మొగ్గింది!అంటే కాళిదాసు కవిత్వం ఇతరుల కవిత్వం ముందు తేలిపోవడం సరస్వతీ దేవి కూడా భరించలేకపోయిందని విమర్సకుడి భావం అన్నమాట!

        కాళిదాసు అనగానే మొదట్లో కూర్చున్న కొమ్మని నరుకుతూ కనబడి అత్యంత నాటకీయంగా ఒక రాకుమారిని పెళ్ళాడి ఆవిడ ప్రోద్బలంతో నాలిక మీద కాళిక బీజాక్షరాలు రాయగానే సాహితీ విశారదుడైన కధే అన్ని భాషల్లోనూ సినిమాలు గా కూడా వొచ్చింది!కానీ అది కేవలం కల్పన!యేదో అప్పుడప్పుడూ కొంచెం చందోబద్ధమైన ఒక పదో పదిహేనో సీసపద్యాలు రాయడానికే నాకింత కష్టంగా వుంటే అంత చక్కని భాష యే గురువు దగ్గిరా యేమీ నేర్వకుండానే హఠాత్తుగా వొచ్చేస్తుందా యెవరికయినా?ఐన్ స్టీన్ అనే మహా మేధావి వుడకబెట్టటానికి గుడ్డుకి బదులుగా తన రిస్ట్ వాచీని మరిగే నీళ్ళలో వొదిలాడంటే అంత తెలివి తక్కువ పని మనం చెయ్యము గనక అతనిలా సాపేక్ష సిధ్ధాంతం లాంటివి మనం సృజించలేమని తెలిసినా సరదాగా నవ్వుకుంటాం కదా!బహుశా అలాంటి ఆప్యాయత ఇలాంటి కధలలో వుండటం వల్లనే కాబోలు మిగతా విషయాల్లో హేతువుకి ప్రాధాన్యత నిచ్చే వారు కూడా తాము అభిమానించే వారిని గురించిన అందమైన కల్పనల్ని స్వాగతిస్తారు?

     కాళిదాస కవి కూడా అందరి వలెనే విద్యాభ్యాసం ద్వారానే తన ప్రతిభని మెరుగు పర్చుకుని వుండవచ్చు.అతనికీ ఇతర కవులైన దండి,భవభూతి లాంటి వాళ్లతో ప్రజ్ఞావైరం కూడా వుండి వుండవచ్చు.ఈ ముగ్గురితో ముడిపడిన మరొక కధలో ఆ కధా రచయిత అన్యాపదేశంగా చెప్పదలచింది అదేనేమో?


        ఒకసారి తనని మిగతా కవులు సరయిన రీతిలో గుర్తించడం లేదని కాళిదాసుకే ఆగ్రహం పుట్టి అందరికీ తను వుపాసించే కాళికా దేవితోనే చెప్పిస్తానని పిల్చాడు.అందరూ వచ్చాక దేవిని ప్రార్ధించి ప్రశ్న అడిగాడు.మూలవిరాట్టు నుంచి "కవిర్దండిః కవిర్దండిః భవభూతిస్తు పండితః" అని వినపడింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం.అసలు అడిగిందే తను అయితే తన గురించి చెప్పలేదని చిరాకు పుట్టి "కోహం రండే?" అని గద్దించగానే "త్వమేవాహం త్వమేవాహం న సంశయః" అని వినబడేసరికి ఎవరికి తోచిన అర్ధం వాళ్ళు తీసుకుని దేవికి నమస్కరించారు!మిగతా వాళ్లకి నువ్వు నా అంతటివాడివి అని కాళిదాసుని పొగిడినట్టూ కాళిదాసుకి నువ్వూ నాలాగే రండవే అని అన్నట్టూ అర్ధమయింది?!



నెదర్లాండ్ లోని ఒక భవనం పైన సంస్కృత శ్లోకం?!

        యెప్పటికయినా కాళిదాసు కవిత్వాన్ని సొంతంగా చదివి అర్ధం చేసుకోవడానికయినా సంస్కృతం నేర్చుకోవాలి, కుదురుతుందో లేదో?!విదేశీయులు యెప్పుడో చదివారు,మనం ఇప్పుడైనా చదవకపోతే యెట్లా!?మన పెద్దవాళ్ళు "ఆనందో బ్రహ్మా,బ్రహ్మేతి వ్యజానాత్" అన్నారు!ఆనందమే బ్రహ్మ అయి ఆ బ్రహ్మ నుంచే సమస్తం జన్మించిందని.కాళిదాసు ఋతుసంహారం ఒక్కటి చదివి మన చుట్టూ మారుతున్న ఋతువుల్ని కొత్తగా చూస్తూ ఆనందంగా గడిపి ఆ ఆనందంలోనే అంతమై పోవడం కన్నా మనిషి కోరుకోదగిన దేమిటి?

(కొన్ని చోట్ల వస్తుగుణ సహాయం చేసిన మిత్రులకి _/\_)

Monday 26 January 2015

కట్టబ్రహ్మన మనవాడే!బోధిధర్ముడు మనవాడే!చెయ్యెత్తి జైకొట్టు ఆంధ్రుడా?!జైకొట్టి నిద్రపో అమాయకుడా!?

పాంచాల కురిచ్చి నుంచి వీరపాండ్య కట్తబ్రహ్మన "నారు పోశావా?నీరు ఇచ్చావా?యెందుకు కట్టాలిరా శిస్తు?" అని హుంకరించి తిరగబడిన పోరాటమే ఆంగ్లేయుల మీద భారతీయులు జరిపిన సమరాల్లో మొట్టమొదటిది!అయితే ఆ వీరుడి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్ల్లాలోని కందుకూరు ప్రాంతం నుంచి విజయనగర రాజ్యం కాలంలో వలస వెళ్ళిన వాళ్ళనేది కూడా తెలుసుకుంటే అతడు మనకి బంధువే కదా అని గర్వంగా వుండదా!

క్రీ.శ 440 నాటి బోధిధర్ముడు పల్లవ రాజు - ఈ పల్లవులు తెలుగు రాజులు!స్థానిక ప్రభువులుగా తమిళ నాడులో వున్న రాజ వంశాలు మూడే - పాండ్య,చేర,చోళ వంశాలు మాత్రమే ప్రాచీన తమిళ కావ్యాల్లో ప్రముఖంగా కీర్తించబడ్డాయి.బోధిధర్ముడి గురించి చెప్పే యే గ్రంధమైనా అతడు పల్లవుడే అని చెప్తున్నది!1959లో తెలుగు భాషా సమితి ప్రచురించిన విజ్ఞాన సర్వస్వంలో పల్లవులు తెలుగు వారే అని ఆధారాలను ప్రకటించారు.ఇక్ష్వాకుల తర్వాత,అంటే క్రీ.శ 300 నుంచి క్రీ.శ 600 వరకూ తొలి పల్లవులు తెలుగునేలను పరిపాలించారు.

కుమార విష్ణువు అనే అతను కాంచీనగరాన్ని గ్రహించినట్టు వేలూరుపాళెయం శిలాఫలకాలు తెలియజేస్తున్నాయి?ఆంజనేయుడికి తన శక్తి తనకి తెలియనట్టు ఆంధ్రులకి తమవన్నీ యెదటివాళ్ళకి ధారపోసి అమాయకంగా నిలబడటం అలవాటయిపోయింది గనకనే శ్రమించి పెంచిన సంపదని కూడా దోపిడీ అని వదరుబోతులు ఇల్లెక్కి కప్పెక్కి కూస్తుంటే "సాక్ష్యాలు చూపించి మాట్లాడు బే!" అని దబాయించే కన్నపు దొంగలకి వుండేపాటి కనీసపు క్షాత్రం కూడా లేకుండా నిజమే నని ఒప్పుకుని ఇవ్వాళ  వుద్యోగులకి జీతాలివ్వలేని దుస్థితిలో తమ కిచ్చిన హామీలని ఇచ్చిన వాళ్లే వెక్కిరిస్తున్నా చేతులు నలుపుకుంటూ రాజధాని కూడా లేకుండా నిలబడ్డారు?!! 

ఇవ్వాళ "వారెవ్వా!నీ సృష్టి అద్భుతం,నీ వ్యాపార దక్షత మాకు కావాలి" అని వాళ్ళ ముఖ్యమంత్రే పొగుడుతున్నవాణ్ణి కూడా దోపిడీదారుగా ముద్రవేసి లక్ష నాగళ్లతో దాన్ని దున్నిస్తుంటే చూడాలని కలలు గన్న పైశాచిక ప్రవృత్తి గలవాళ్ళు మీరు పెంచిన సంపదలో ఒక్క నయాపైసా కూడా ఇవ్వం,మీరు మాత్రం ఇక్కడ వుండటానికి వీల్లేదు అని అంటుంటే జవాబు చెప్పలేక నీళ్ళు నమిలారు.ఇవ్వాళ నిజంగా అన్యాయానికి గురయి కూడా ప్రశాంతంగా వుందగలుగుతున్నారు,యేమి సౌజన్యం?!తెలంగాణాలో ఇతరులు భూములు కొనగూదదని పెద్దమనుషుల వొప్పందంలో వుంది,కొన్నా సరే అది తప్పే అని నాతో వాదించిన మేధావులు ఆ ముక్క వాళ్ళ ముఖ్యమంత్రికి చెప్పరేమి?అబధ్ధాలతో,నాకిది ఇస్తే నీకది ఇస్తాననే పార్టీల విలీనం లాంటి నీచకృత్యాలతో చెలరేగి తమకి ద్రోహం చేసిన వాళ్ళు యేదో ఘనకార్యం సాధించినట్టు పొంగి పోతుంటే తప్పు చేసిన వాళ్లలా తలదించుకుని కుంగిపోతున్నారు,యేమి సౌమనస్యం?!కోళ్ళపందేలకి వొచ్చినవాళ్ళు "తెలంగాణా నాది,నెల్లూరు నాది,చిత్తూరు నాది" అంటుంటే "మరి హైదరాబాదు మాది కాదన్నారేం" అని అడగాలని అక్కడ లేని నాకనిపించింది గానీ అక్కడున్న వాళ్ళు మాత్రం ప్రజల్లో ఆత్మీయతలు ఇంకా మిగిలాయని చంకలు గుద్దుకున్నారు,యేమి సౌహార్ద్రం?!

ఆ అవమానాలూ ఈ దుర్భర స్థితీ చుట్టూ యేమి జరుగుతందో తెల్సుకోకుండా చరిత్రలో అసలు యేం జరిగిందో తెలుసుకోకుండా మట్టిబుర్రల్లా వుండటం వల్లనే అని ఇప్పటికయినా తెలుసుకుంటే మరోసారి - ఇక్కడ ప్రతిపక్షమే లేదు గాబట్టి మనకి తిరుగు లేదు,నెక్స్తు యెలక్షన్ల కల్లా తెలంగాణాని కూడా చంకలో ఇరికించుకుందాం అని కలలు గంటున్న రెండుకళ్ళ సిధ్ధాంతి - ముందు కేంద్రం నుంచి నిక్కచ్చిగా నిధులూ హోదా తెచ్చుకోవటం మానేసి రాజధాని కోసం అంటూ భూసమీకరణ పేరుతో రైతులకి చట్టపరమయిన రక్షణలు కూడా లేకుండా లాక్కుంటూ చేస్తున్న మోసాన్ని పసికట్టగలుగుతారు!లేదంటే మరోసారి ఇక భవిష్యత్తులో గొప్పగా చెప్పుకోవటానికి యేదీ మిగలకుండా మోసపోతారు.

వాళ్ళ దుర్మార్గం అట్లా వుంచితే,రాష్ట్రాన్ని విభజించే పని ఒక పదో తరగతి కుర్రాడికి అప్పజెప్పినా ఇంతకన్నా చక్కగా ఆ పని చేసి వుండేవాడు,ఈ అన్యాయానికి కారణం కేంద్రంలోనూ రాష్త్రంలోనూ అధికారంలో వుండి కూడా ఇంత దరిద్రంగా విదగొట్టిన తమ పార్టీయే అని తెలియకనే ఇవ్వాళ లఘుశంకవీరుడు అంత ఆవేశం ప్రదర్శిస్తున్నాడా?నిజంగానే ఆ గర్జనలకి పొంగిపోయి ప్రజలు అతనికీ అతని పార్టీకీ బ్రహ్మరధం పడతారా?చచ్చిన గాంగ్రీను పార్టీని మళ్ళీ నతికిస్తారా?దూరంగా వున్న చెత్తని మళ్ళీ తెచ్చి తల మీద రుద్దుకుంటారా?ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం విజ్ఞత యేమిటో చూడాలి?!

Sunday 25 January 2015

ఈ ముక్క చెప్పడానికి వంకయ్యకి ఇంతకాలం పట్టిందా?అసలు హోదా కోసం పోట్లాడిందే తను అనైనా గుర్తుందా!

     మొదట్లో కొత్త మీడియా వందిమాగధుడైన మీసాల సుహాసిని ఈరకమైన వార్తల్ని వడ్డిస్తుంటే బహుశా డిల్లీలో నిధుల కోసం బేలమొహం పెడుతున్నాడేమో అనుకున్నా!విభజన యెన్నికల ముందు జరిగింది,ఆ విభజన తను కూడా వొప్పుకోవటం వల్లనే జరిగింది కదా?తను మద్దతు ఇవ్వకుండా కాంగ్రెసు ప్రతిపాదించిన విభజన బిల్లు సభలో నెగ్గే పరిస్థితి వుందా!ఇప్పుడు కాంగెసుని చూపించి తప్పుకోవడం అంటే ఆంధ్రా వాళ్ళకి చెవిలో పువ్వులు పెట్టటమే - ఈసారి ఆంధ్రావాళ్లకి కాలితే కాంగ్రెసు ప్రేరిత అసమైక్య వుద్యమం లాగా వుండదు.పొట్టి శ్రీరాములు కీర్తిశేషుడైనప్పుడు జరిగిన దానికి పదింతలు జరుగుతుంది?!భాజపా కూడా సమర్ధించడం వల్లనే విభజన ఇలా జరిగిందనేది అందరికీ తెలుసు.అయినా ఆంధ్రాలో ఆ కొన్ని సీట్లయినా వచ్చాయంటే కారణం యేమిటో ఆంధ్రులు యేమి ఆశించి ఆమాత్రం బలమయినా ఇచ్చారో తెలియనంత అమాయకుడా తను?

     అడిగి సాధించానంటున్న తనే ఇప్పుడు నాచెయ్యి దాటిపోయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముష్టి చిప్ప పట్టుకుని అందరు ముఖ్యమంత్రుల్నీ మోకాళ్ళు నిమరాల్సిందే అనే మాటని ఆంధ్రా నడిబొడ్దున అంటుంటే విన్నవాళ్ళు అంత మౌనంగా యెందుకు వున్నారో నాకర్ధం కావడం లేదు.ఆంధ్రులు పౌరుష ప్రతాపాలు గలవాళ్ళు అనే మాట అబధ్ధం కాగూడదు.ఆ పెంకయ్య మాటకి రావాల్సిన స్పందన ఇది కాదు?మాట తేడా రానేవొచ్చింది సోదరు లారా!రూటు మార్చి చెలరేగి కార్యం సాధించుకోకపోతే మానుషం మిగలదు!

     కేంద్రం సాయం చెయ్యనిదే వుద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వుండి ప్రపంచంలోనే అతి విశాలమైన రాజధాని కడతానంటే విన్నవాల్ళు నవ్వరా అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా నాకంతటి అనుభవం వుంది,హైదరాబాదుని నేనే పెంచాను అనే ప్రబుధ్ధుడికి?ప్రజలు అంతటి రాజధాని మాకు కావాలి అని అడిగారా?ఒకవేళ అడిగినా వాస్తవ పరిస్థితిని చెప్పి ఇప్పుడు మన వల్ల కాదు అని నిజాయితీగా చెప్పాల్సిన సమయంలో యెందుకీ వేలాంవెర్రిని పెంచాడు?పైగా అటువంటి పనులకి భూసేకరణకి చట్టం ఒకటి వుంది,అందులో భూమి ఇచ్చిన రైతులకి నష్టం జరగకుండా యెన్నో చట్టపరమైన రక్షణలు వున్నాయి.ఇప్పుడు హైదారాబాదుని వొదులుకోవదం వల్ల మనసు గాయపడింది దాని బాబు లాంటి రాజధాని కడదాం మీరు భూములివ్వండి - కేంద్రం కూడా సాయం చేస్తానన్నది,మోదీ మంచివాడు మనకి యెంత కావాలంటే అంతా ఇస్తాడు అనే అబధ్ధాలతో "ల్యాండ్ పూలింగ్" అనే కొత్త చట్టాన్ని తెచ్చి మరీ చెయ్యడం దేనికి?లేదు, ఇది సరైన పధ్ధతి కాదు - ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పై స్థాయిలో బడాబాబుల్నీ కాంట్రాక్టర్లనీ పెంచడానికి భూముల రేట్లు పెరగడం అనే తాయిలం చూపించి రైతుల్ని మోసం చెయ్యాలనుకోవడమే నిస్సందేహంగా!భూముల రేట్లు పెరగడం,కొంత కాలం తర్వాత లాభసాటిగా మార్చి మీకే ఇస్తానంటే మంచివాడని నమ్మి ఒపుకోవడం తప్ప ఈరకమైన భూసేకరణలో రైతులకి చట్టబధ్ధమైన హక్కులు చాలా తక్కువ - ఈ అబధ్ధీకుణ్ణి మమ్మి అధ్భుతాలు జరుగుతాయని ఆశించడం శుధ్ధ దండగ?!పైగా ప్రభుత్వం ప్రజల నుంచి భూమిని తీసుకోవడానికి వుపయోగిస్తున్న భూసమీకరణ డాక్యుమెంట్లు కూడా ప్రభుత్వం అడిగితే ఇచ్చినట్టు కాకుండా వాళ్ళంతట వాళ్ళే మా భూములు తీసుకోండని ప్రభుత్వాన్ని అడిగినట్టు వున్నాయట!అంటే యేమిటి?స్వచ్చందంగా నువ్వు యెవడికయినా పూర్తి ఆరోగ్యకరమైన మనస్థితిలో వుండి ప్రభుత్వం గుర్తించిన పత్రాల ద్వారా ఒకసారి ఇస్తే తర్వాత దానినుంచి వెనక్కి వెళ్ళాలనుకుంటే యే కోర్టూ నీకు అనుకూలంగా తీర్పు ఇవ్వదు, తెలుసా!ఇంకా భూసేకరణ అధికారికంగా మొదలయినట్టు లేదు, ఒకవేళ మొదలైనా పర్లేదు - ఇప్ప్పటికే ఇవ్వడానికి ఒప్పుకున్న రైతులంతా మంచి లాయర్లని సంప్రదించుకుంటే మంచిది.ఒకసారి చెయ్యి దాటిపోయాక యేదీ అంత తొందరగా తిరిగి రాదు!


     యేం ఫర్వాలేదు,యేరు దాటి తెప్ప తగలేసే రాజకీయాలు యెన్నయినా చెయ్యొచ్చునన్న ధీమాలో వున్నట్టున్నారు - ఆ నాయుడూ ఈ నాయుడూ!ఆ కలలే కంటూ రెచ్చిపోండి,కళ్ళు తెరిచి చూసేసరికి జగన్ ముఖ్యమంత్రి అయి కనబడతాడు?!తమాషా అనుకుంటున్నారా 13 జిల్లాల ప్రజల జీవితాలతో ఆడుకోవటం?యెన్నికల తర్వాత అక్కడ మీ ప్రభుత్వం నిలదొక్కుకున్నాక ఇక్కడ  కొత్త రాష్ట్రం యేర్పడినాక తమరు చేసిన వాగ్దానాలే అవి!మీరిచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చనంత అసమర్ధులు తట్టా బుట్టా సర్ధుకుని అధికార నివాసాలు ఖాళీ చేసి ఇంట్లో కూర్చోండి.సమర్ధుడేవడో వాడే వచ్చి మాకు కావలసినవి సాధించి పెడతాడు!?ఇది కష్ట కాలం అనుభవజ్ఞుడు అధికారంలో వుంటే మంచిదన్న ఒకే ఒక్క కారణం వల్లనే యెన్నికల తులాభారంలో త్రాసు తెదెపాకి మొగ్గిందని ఫలితాల లెక్కలు చెప్తున్నాయిగా?!ఇప్పుడీ కాకిలెక్కలూ గాలికబుర్లూ యెవరికి చెప్తారు?చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడీ సొల్లు కబుర్లు పట్టించుకోరు!యెలా చేస్తావన్నది మాట ఇచ్చిన వాడివి అన్నిసార్లు మాట్లాడిన వాడివి నువ్వు తేల్చుకోవాలి.మాకు ఫలితం మాత్రమే కావాలి,తెలిసిందా?లాజిక్కులతో మేజిక్కులు చెయ్యాలనుకుంటే మేము మా మేజిక్కు చూపిస్తాం,ఖబడ్దార్! డిల్లీలో గెలవడానికి నిన్నటి రోజున మోదీని తిట్టిన బేదీని తెచ్చిన పతనం కళ్ళముందు కనపడుతూనే వుంది - హస్తినలో శృంగభంగం తప్పదు?ఇప్పుడు భాజపా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేసినట్టుగా నెరవేర్చలేని వాగ్దానాలు చేసి ఆనక చేతులెత్తెయ్యడమూ కంటితుదుపు ఆశ్వాసనలతో సరిపెట్టెయ్యడమూ చెయ్యడం వల్లనే కాంగ్రెసు ఖర్మ అలా కాలింది!ఆ పార్టీ మీద క్రోధం - అంటే అటువంటి రాజకీయం మాకు నచ్చదు అని ప్రజలు తెగేసి చెప్పడమే ఇప్పటివరకూ భాజపా అప్రతిహత విజయ పరంపరకి కారణం.ఆ దారినుంచి తప్పి కాంగ్రెసుకి మల్లే వంకర టికర పనులు చేస్తే భాజపాకీ అదే గతి పడుతుంది.తమని తాము అతిగా వూహించుకున్న వాళ్లే రావణుడూ,దుర్యోధనుడూ,హిట్లరూ - మరొకడూ మరొకడూ - ఆ లిస్టులో చేరాలని ఉషారుగా వుందేమో పాపం పెంకు నాయుడికీ మోదీకీ?!

     అంధ్రప్రదేశ్ విభజన యెంత భయానకంగా జరిగిందో దేశమంతటికీ తెలుసు?అది తమకూ జరుగుతుందేమో నన్న భయం తోనే అదివరకు తెలంగాణా ఇచ్చాక మాకూ కొత్త రాష్ట్రం కావాలి అని సన్నాయి నొక్కులు నొక్కిన వాళ్ళంతా మూతికాలిన తెనాలి రామలింగడి పిల్లుల్లాగా చడీ చప్పుడు లేకుండానిశ్శబ్దమై పోయారు?అయినా 30 సీట్లు గట్టిగా వస్తాయో లేదో తెలియని తెలంగాణా వాళ్ళకి మేలు జరగడం గురించి వుత్తర ప్రదేశ్ వోటరూ,హిమాచల్ ప్రదెశ్ వోటరూ పట్టించుకుంటాడా - యే తెలివితో థెలంగాణా ఇచ్చేసి ఆ వూపుతో దేశప్రజలందర్నీ మెప్పించగలననుకున్నదో ఆ పిచ్చిపుల్లమ్మ పార్టీ?!కానీ చట్టసభల సాక్షిగా జరిగిన గందరగోళాన్ని చూశారు,దానికి కారణ మెవరో గూడా తెలుసుకున్నారు - తడాఖా చూపించారు!అట్లాంటి ఫలితమే తమకూ కావాలని కోరుకుంటున్నారా కమలమే సకలం కావాలి అని కలల్లో విహరిస్తున్న భాజపేయులు?

మాట తప్పితే మోడీ అయినా తల దించుకోక తప్పదురా?
అవమానకరమైన ముగింపుతో అంతమైన వాళ్ళు కాకండి!

Friday 23 January 2015

నేను లేస్తే మనిషిని కాను!కానీ ఇప్పుడప్పుడే లేవను?నువ్వు వందసార్లు చెప్పినా నాకు అసలు చెప్పనట్టే?!

ఒకప్పుడు పెళ్ళిళ్లలో కలిసిన చుట్టాలు పాత సంగతుల్ని నెమరేసుకోవటానికి "క్రిష్ణా పుష్కరా లప్పుడు","గోవర్ధనం పెళ్ళప్పుడు","అచ్యుతరావు వాళ్లబ్బాయి బారసాలప్పుడు", అని పుష్కరాల లెక్కనో బారసాలనో పెళ్ళినో కలిపి అప్పుడు జరిగింది అని చెప్పుకునేవాళ్ళు!ఇవ్వాళ రోజులు మారాయి గదా - "చికెన్ గన్యా రోజుల్లో","స్వైన్ ఫ్లూ మొదటిసారి వొచ్చినప్పుదు","లైలా తుఫాను ఇరగదీసినప్పుడు" అని రోగాలూ,గొడవలూ,భీభత్సాలతో కలిపి చెప్పుకుంటున్నాం?

పాతకాలం వాళ్ళు తుఫాన్లూ వరదలూ మన దురదృష్టం కొద్దీ దేవుడే మనమీదకి రప్పిస్తాడని సరిపెట్టుకునే వాళ్ళు.నిన్నటి దాకా కరువుల గురించి కూడా అలాగే అనుకునే వాల్ళు, కానీ కొత్తగా ఎకనమిక్సు లో DRAUGHT ECNOMY| అనేది ఒకటి మొదలయింది!దాని ప్రకారం అంతకు క్రితం ప్రభుత్వాల దుర్మారమయిన ఆర్ధిక నిర్వహణయే కరువులకి కారణమని బలమయిన ఆధారాలు కనిపిస్తున్నాయట! ఈ నాలెడ్జి యేమీ లేకుండానే ప్రపంచంలోని అతి ఘోరమయిన కరుల్లో ఒకటైన బెంగాలు కరువు "కర్జను" అనే ఒక్కడి వల్ల వొచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే గదా!

ఇదివరలో కరువంటే అందరూ భయపడి చచ్చే వాళ్ళు!ఈ రోజుల్లో కరువు కూడా కొందరికి లాభసాటి వ్యాపారమైపోయింది.అనంతపురం కరువు జిల్లా అని అందరికీ తెలుసు,కానీ ప్రపంచ మార్కెట్టులో కొత్త మోడలు కారు యేది రిలీజయినా తెల్లారేసరికల్లా ఆనంతపురం రోడ్ల మీద కూడా తిరుగుతుందట?అదెట్లా అంటే కరువు సహాయక నిధుల మీదా పశుగ్రాసం వాటాల మీదా పెరిగిన కొందరు "గుద్ విల్ కాలనీ" దొరల వైభోగ మది!మనం రోడ్దు మీద వెళ్తుంటే శవాల మీద వేసిన రూపాయీ అర్ధ రూపాయీ యేరుకునే వాళ్లని ఈసడించుకుంటాం,కానీ అదే పని భారీ యెత్తున చేసిన వాళ్ళు "శుభకామన విలాసు" లయ్యారు.చేస్తే శుధ్ధ క్షవరమే చెయ్యమన్న పెద్దల మాటని బహుచక్కగా పాటించారు గదా మరి!

ఇత్లాంటిదే ఒక పాతముచ్చట గుర్తుకొస్తున్నది - రీడర్స్ దైజస్ట్ లో చదివాను.ఒకానొక చిన్న నగరంలో ఒక వీధిలో ఒక ఫొటోగ్రాఫరు తన భార్యయే మోడల్ అవటానికి సిధ్ధపడితే ఆమె నగ్నచిత్రాలే అవుగాక సౌందర్యభరితంగా తీసి వాటిమీద వచ్చే ఆదాయంతో బతుకుదామనుకున్నాడు?చుట్టుపక్కల వున్న సంసారు లంతా అతన్ని వెంటాడి వేధించి ఆ చండాలాన్ని అపేయించారు.అతను అక్కణ్ణుంచి మరోచోటికి వెళ్ళిపోయాడు.అదే పని "ప్లే బాయ్" అనే పత్రిక చేస్తే ఆ పత్రికాధిపతి ప్రపంచ ప్రసిధ్ధి గాంచిన ప్రముఖుల్లో ఒకడయ్యాడు,తేడా యెక్కడుంది?స్థాయీ భేదంలో వుంది!

మనని నష్టపెట్టి తను లాభం గుంజే పని ఇంటి పక్కవాడో,దగ్గిర్లో వున్న ఫ్యాన్సీ షాపు వాడో చేస్తే యేమయినా చెయ్యగలం, కానీ ప్రభుత్వంలో వున్నవాళ్ళు చేస్తే యేవరేమి చెయ్యగలరు?స్వైన్ ఫ్లూ బాధితులూ,చికెన్ గన్యా పీడితులూ వీళ్ళందరి దుస్థితీ ఇదే!చాలాకాలం క్రితం నుంచే డాక్టర్లంతా చాలా రోగాలకి మన చుట్టూ వున్న అపరిశుభ్రతే కారణం అని చెవినిల్ల్లు గట్టుకుని చెప్తున్నా చెప్పింది తమకు కాదన్నట్టు పన్నులు కడుతున్న ప్రజలకి పరిశుభ్రమైన పరిసరాలను సమకూర్చితే చాలు వాళ్ళు ఆయురారోగ్యాలతో వుంటారు,అరోగ్యంగా వున్నవాళ్ళు మరింత హుషారుగా వుత్పాదన పెంచుతారు అనే చిన్న విషయం కూడా వాళ్లకి యెవరయినా అరటి పండు వొలిచి పెట్టినట్టు చెబితే గానీ తెలియదా?నిజంగా తెలియకనే పారిశుధ్య శాఖకి అంత తక్కువ నిధులు కేటాయిస్తున్నారా!

అమితాబ్బచనుకి ఒక్కసారి గాజుపెంకు గుచ్చుకుందని ట్వీటు చేస్తే ఆయన అభిమానులు యెంతమంది అయ్యో అనుకున్నారో కుయ్యోమని మూలిగారో గానీ మనం నిర్లక్ష్యంగా గాజుపెంకుల కన్నా ప్రమాదకరమైన వాట్ని చెత్తకింద విసిరేస్తుంటే కొంతమది ప్రతిరోజూ వుత్తచేతుల తోనే వాట్ని యెత్తుతున్నారు గదా?స్వచ్చభారత్ పేరుతో మోదీ గారూ,రాష్త్రం మొత్తాన్న్నే సింగపూరులా చేస్తాననే బాబు గారూ,మొత్తం హైదరాబాదుని టాంకుబండుతో సహా బహుళ అంతస్తుల భవనాలు లేపి మురికివాడలు లేని నగరంగా చేస్తాననే రావు గారూ పారిశుధ్య శాఖ అనే ప్రభుత్వ శాకహ ఒకటి వున్నదనీ దాన్ని నిక్కచ్చిగా పని చేయించడానికి వీళ్ళు చెప్తున్న వాటికయ్యే  డాబుసరి ఖర్చుల కన్నా చాలా తక్కువ ఖర్చుతోనే ఆ పని చెయ్యవచ్చునని తెలియనంత అమాయకులా?!నమ్మి చెడిన వారు లేరు అని చాదస్తంగా నమ్మేవాళ్ళు వున్నారేమో గానీ నేను మాత్రం నమ్మను!?

ఆ మురికి నలాగే వుంచేసి ఈ వాటా కింద కొత్తగా నిధులు కేటాయించి అందులో కూడా సొంతానికి నొక్కేసి చేసే జబర్దస్త్ దోపిడీ కాదా ఇది?మన పన్లు మనం చేసుకోలేని రోజుల్లో మన మలమూత్రాలు కడిగి మనల్ని శుభ్రం చేసిన తల్లికి దణ్నం పెట్టటం వరకూ మనం మంచివాళ్ళమే గానీ అదే పని మొత్తం సమాజాని కంతా చేస్తున్న పారిశుధ్యపు పనివాళ్లని గురించి న్యాయంగా ఆలోచించకపోవడం వల్ల మనం కూడా ద్రోహులమేనా అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు నాకు?!

ప్రతి పారిశుధ్య కార్మికుడికీ చేతులకి గ్లవుజులూ,కాళ్ళకి బూట్లూ,వొంటికి యెంత మురికి కూపం లో దిగినా ఆ మురికి అంటని యూనిఫారం - ఇవ్వలేరా?జీతాలు పెంచి వాళ్లది కూడా గౌరవనీయమైన పనియే అనే గుర్తింపుని ఇవ్వలేరా?ఇప్పుడు ఆ శాఖలో పనిచేస్తున్న కార్మికులకే వాళ్ళు సంతోషంగా వాళ్ళ పని చెయ్యగలిగే యేర్పాట్లు చేస్తే ఇఇప్పుడున్న మురికి కన్నా రెండింతలు యెక్కువ మురికినైనా వొదిలించగలరు!

చెయ్యాల్సింది చెయ్యకుండా ఫొటోలకి పోజులిచ్చి పత్రికల్లో బొమ్మలు వేయించుకుంటే ఆ పేరున మరింత చెత్త పెరగడం తప్ప వుపయోగం యేమయినా వుందా?!లోపలా బయటా ఇంత మురికి పేరుకుపోయినా దాన్ని తొలగించుకుందామనే తొందర పుట్టటం లేదేమిటి?లోపలా బయటా ఇంత మురికి పేరుకుపోయినా దాన్ని తొలగించుకుందామనే తొందర పుట్టటం లేదేమిటి?ఈ పారిశుధ్య కార్మికుల దగ్గిర్నుంచీ అల్పాదాయ వర్గాలు యెవ్వరూ తమ పిల్లల్ని ఖరీదయిన స్కూళ్ళలో చదివించుకోలేరు!ప్రభుత్వ పాఠశాలల్ని వుద్దేశపూర్వకంగా నీరుగార్చి అస్మదీయుల స్కూళ్ళకి గిరాకీ పెంచుతున్నారు!పరిశుభ్రమైన దేహాలతో ఆరోగ్యాన్నీ వాళ్ళకున్న తక్కువ ఆదాయంలోనే విద్యనీ అందిస్తే యే రిజర్వేషన్లూ అక్కర్లేకుండానే కోట్లలో సంక్షేమ పధకాల తాయిలాలూ పంచనక్కర్లేకుండానే వాళ్ళకేమి కావాలో వాళ్ళే సాధించుకోగలుగుతారు గదా?!వాట్ని పనిగట్టుకుని దూరం చేసి యెప్పటికీ తమ మీదనే ఆధార పడి ఆ కృతజ్ఞతతో మళ్ళీ మళ్ళీ తమకే వోట్లు వేసే వ్యూహమే ఇది?!ఆకబారు వూళ్ళోకి తెచ్చినందుకు కూడా జనాన్ని చంపేసిన నిజాము కాలానికీ ఇప్పటి ప్రజాస్వామిక ప్రభుత్వాధినేతలకీ తేడా యేమయినా వుందా?

సీ || పోయెన్ కుసుమ కోమలోజ్వల సౌరభ
     ములు భూమిపై నుండి - మూక పెరిగి,

     ఇరుకుతనము పెరిగి,మురికియును, మరి
     కిలుము జిడ్డు ముదిరి, కర్బన ద్వ

     యాంలజని విషపదార్ధమై , కరగని
     ధూళులు నీటి యందమితమై పె

     రుగుచు ధరణి పెద్ద రొచ్చుగుంటై పోయె!
     మనుషుల ఆంతర్యములును సరిగ

తే || లేవు - పరధనాసక్తియు, లోభము, మర
     సూయలున్ మస్తుగా మనసులకు పట్టి
     వేసెను, మనిషి నుండి వివేకము తొల
     గంగ - ముక్కులు బద్దలౌ కంపు మిగిలె!
(27/08/1996)

ఇవ్వాళ జరగాల్సింది స్వచ్చభారత్ హడావిడి కాదు,ఘర్ వాపసీ గందరగోళం కాదు - మురికిని ద్వేషంచే మనస్తత్వం పెరగాలి,ప్రజలూ ప్రభుత్వం రెండూ కేవలం నినాదాలతో సరిపెట్టకుండా యుధ్ధమే చెయ్యాలి!బయటి మురికికీ లోపలి మురికికీ అవినాభావ సంబంధం ఖచ్చితంగా వుంది - క్షాళన రెండు చోట్లా జరగాలి!?మురికి,దుర్గంధం,అజ్ఞానం,అలసత్వం యెక్కడ కనిపించినా సహించకూడదు.దోపిడీకి అసలైన పునాది దోపిడీకి గురయ్యే వాడి అమాయకత్వం అని తెలిస్తే విద్య నేర్పి అజ్ఞానాన్ని తొలగించదం యెంత అవసరమో తెలుస్తుంది?!కులపిచ్చి,మతపిచ్చి ప్రాంతం పిచ్చి ఇవన్నీ అమాయకమైనవి కావు - తమాషాకి చెయ్యడం లేదు వాళ్ళు!శ్రీశ్రీ చెప్పినట్టు న్యాయంగా ఆడితే పాయింట్లు యెదటివాడికే పోతాయని తెలిసి రిఫరీని "నువ్వూ నేనూ ఒక్కలాంటివాళ్ళం,వాడు వేరే కాబట్టి నాకు పాయింట్లు వెయ్యి" అనే విధంగా బెల్లించి గెలవటం!అలాంటివాళ్ళు నీతిసూత్రాలకి లొంగరు.ఆ లాభాన్ని వాళ్ళకి దక్కకుండా చేస్తేనే తిక్క కుదురుతుంది!కానీ అలా చెయ్యగలమా?ఈ ట్రిక్కు నంతా యెన్నికల రోజున జరిగే తంతుకి అప్లై చేసి అక్కద రిఫరీలం మనమే అని తెలుసుకుంటే కాస్త వివేకం పెరుగుతుందేమో?!

నీతిసూత్రాలు యెక్కువగా దంచడం నాకూ ఇష్టం లేదు గాబట్టి ఒక సినిమా కధ చెప్తాను.బాటసారి అక్కినేని నాగేశ్వర రావు నటించిన సినిమాల్లో కల్లా అత్యధ్బుతంగా నటించిన సినిమా.అన్ని సినిమాల్లోనూ చేసిన నటన కన్నా ప్రత్యేకంగా ఇష్టపడి చేశాడు.మీ సినిమాల్లోకల్లా మీకిష్తమైన సినిమా యేది అని యెప్పుడు యెవరడిగినా ఆ పాత్ర గురించే చెప్పేవాడు!సినిమా లో తనది హీరోఇజం అస్సలు లేని పాత్ర.ఒక రకంగా భానుమతి హీరోయినుగా వున్న సినిమాలో తను సైడు క్యారెక్టరు చేసినట్టు లెఖ్ఖ!ఇవ్వాళ శ్రీయ నేర్చుకుని చేస్తున్నానని చెప్పే మెథడ్ యాక్టింగ్ ఆ రోజుల్లోనే వుపయోగించాడు ఆపాత్రలో.సినిమా అంతా ఒక బాల వితంతువు చుట్టూ తిరుగుతుంది.దేవదాసులో కొంత రొమాన్సూ,భగవాన్లు పాత్రతో చేసే క్యామిడీ అన్నా వుంది,ఇందులో అస్సలు అవేమీ లేవు.మామ్మూలు ప్రేక్షకు డెవ్వడూ వోపిగ్గా చూదలేడు.కానీ అందులో ఒక డైలాగు వుంటుంది అది తను యెలా చెప్పాడు అనే కుతూహలంతో చూద్దామని నా బెజవాడ లయోలా కాలేజి న్యూ హాస్టలు రోజుల్లో విశ్వప్రయత్నం చేశాను!కుదర లేదు.సినిమా హాలు గేటు దాకా వెళ్ళి వెనక్కి తిరగాల్సొచ్చింది - టిక్కెట్లు దొరక్క కాదు?మా ఫ్రెండ్సులో ఒకడు "ఇందులో కామిడీ లేదు బోరుగా వుంటుందిరా" అని వినపడీ వినపడనట్టు నసిగేసరికే బృందంలో మిగిలిన వాళ్లంతా భయపడి వెనక్కి తిప్పేశారు.ఆ ఒక్క ముక్కకే వాళ్ళలా యెందుకు భయపడ్డారో తెలుసా - ఆ ముక్క అన్నవాడు ప్రేమాభిషేకం పదిహేను రోజుల్లోనే ముఫ్ఫయ్ సార్లు చూసిన ఏన్నార్ పంఖా?!పోనీ నేనొక్కణ్నే చూద్దామా అంటే సెకండు షో తర్వాత బెంజి కంపెనీ నుంచి పోస్టలు కాలనీ దాకా ఒక్కణ్నే నడుచుకుంటూ రావాలి!అంత దృశ్యం లేదు నాకు:-<>)

అప్పుడు కుదరనిది యూట్యూబు పుణ్యమా అని ఈమధ్యనే చూశాను.ఆ డైలాగు పట్ల నాకంత పిచ్చ యెందుకు పట్టిందీ అంటే మా మామయ్యల్లో ఒక చాదస్తుడు అది చదివి ఆ సన్నివేశాన్ని పైకి వాగి నా బుర్రలోకి యెక్కించాడు!ఈయనా నేనూ మిగతా విషయాల్లో గజకచ్చపాల్లాగా పోట్లాడుకునే వాళ్ళం గానీ పుస్తకాల విషయంలో మా ఇద్దరి టేష్టూ ఒకటే!ఆ డయలాగ్ నాకు యెక్కినట్టు మీకూ యెక్కాలంటే కధ కొంచెంగానన్నా మీకూ తెలియాలి.భానుమతి క్యారెక్టరు పేరు మాధవి.బాల్య వివాహం జరగడమూ ముసలి భర్త తొందరగా పోవడంతో పిల్లలు లేకుండానే వితంతువు ఐపోయింది.కానీ యేడుస్తూ కూర్చునే మనిషీ కాదు.జమీందార్లు కావడంతో అన్నీ తనే చూసుకుంటూ వుండేది."భూమి జనించీ భుక్తి కొసగనీ ఫలము లున్నవీ కొన్ని" అని తన స్నేహితురాలే అన్యాపదేశంగా దేవుణ్ణి తిడుతుంటే "వేదశాస్త్రములు చదివిన వారే యెరుగరు సృష్తి విలాసం" అని జవాబిచ్చేసి సరిపెట్టుకునే మనస్తత్వంలో వుంది!చెల్లెలికి చదువు చెప్పించి పెళ్ళి చేసి పంపించడం ఒక్కటే తన పని ఆ వాతావరణంలోకి హీరో వొచ్చి పడతాడు.

వీళ్ళు వుండేది కలకత్తాలో.అతను కూడా జమీందారే.సవతి తల్లి మొదట్లో గారాబంగా పెంచి తర్వాత మరీ దద్దమ్మ లాగా తయారవుతున్నాడని కొంచెం ఈసడిస్తున్నట్టు ఒక మాటతో పొడుస్తుంది.అంతే!ట్రంకు పెట్టెలో బట్టలు సర్దుకుని కొంప నుంచి బయట పడి పోలీసు స్టేషను వరకూ వెళ్ళి అక్కణ్ణించి ఈమె ఇంటికి తన చెల్లెలికి లెక్కలు నేర్పే ట్యూటరుగా అడుగు పెడతాడు.కళ్ళజోడు పగిలిపోతే అది బాగు చేయించుకోవడం కూడా తెలీక పోగా బడదీదీ అని అందరూ పిల్చే హీరోయిను బాగు చేయించి పెడితే కనీసం యెవరు బాగు చేయించారు అని అడగటం గానీ థాంక్సు చెప్పటం గానీ తెలియని మొద్దావతారం అతను!యెంత హఠాత్తుగా వచ్చాడో అంత హఠాత్తుగా మాయమైపోతాడు?ట్యూషను చెప్పడం తప్ప మిగిలిన సమయాల్లో ఇతని యవ్వారమంతా కలకత్తా వీధుల్లో చక్కర్లు కొట్టటం.అలా చక్కర్లు కొడుతుండగా ఇతని కోసం వెతుకుతున్న మనిషొకడు అమ్మగారు మీకోసం బెంగెట్టుకున్నారు పదండి వెళ్దాం అనగానే అట్నించటే రైలెక్కేశాడు!వీళ్ళ పనివాడొకడు యెవర్నో రైలెక్కించడానికొచ్చి చూసి చెప్పాడు గాబట్టి తెలిసి ఒక నిట్టూర్పుతో సరిపెట్టుకుంటుంది.కానీ తన జమీకి తిరిగి వెళ్ళాక మాత్రం తెలివిగా వుండి జమీందారీని చూసుకుంటుంటాడు.అప్పుడొస్తుంది ఈ మాట.దివాను డబ్బు దాని యొక్క ప్రాముఖ్యత గురించి తనకి లెక్చరు ఇస్తుంటే నెమ్మదిగానే అన్నా స్థిరంగా "డబ్బుతో కొనలేనివి కూడా వున్నాయి ఆళ్వార్!" అంటాడు?!మా మామయ్య నా చెవుల్లోకి ఇది యెక్కించిన రోజుల్లోనే మరో మంచి కొటేషను ఆంధ్రజ్యొతి దినపత్రికలో ఎడిటోరియల్ పైన ఇచ్చే బాక్సులో చదివాను,"డబ్బుతో దేన్నయినా సాధించగలను అనుకున్న వాడే డబ్బు కోసం యే గడ్డయినా కరవడానికి సిధ్ధ పడతాడు?" అని!ఈ రెండూ నన్ను అతాలాకుతలం చేసేసి ఆఖరికి యెముకల్లోకంటా ఇంకిపోయాయి.ఒకటి గుండెకి పట్టే ఆర్ద్రత నిండినది.ఒకటి కొరకంచు లాగా కాల్చే వ్యంగ్యం నిండినది.మిత్రులంతా ఇవ్వాళ నా భాషని మెచ్చుకుంటున్నది ఆ రెండూ 50-50 లాగా కలిసి పోవటం వల్లనే!


ఆ అరెండు ముక్కలూ యెవరికి యెక్కినా డబ్బు పిచ్చి తప్పకుండా వొదుల్తుంది.అది వొదిల్తే మిగతావీ వొదుల్తాయి,అవునా కాదా?!మురికి,దుర్గంధం,అజ్ఞానం,అలసత్వం - వీట్ని వొదిలించుకోకుండా యెవ్వడూ బాగుపద లేడు?!

Tuesday 20 January 2015

యెవరు నేను?యెవరు మీరు!అధికారం ముందా,అభివృధ్ధి ముందా?ఈ హరిబాబు యేమి చెప్తాడు?!

"నువ్వు భారతీయుడవైతేనే నువ్వు బ్రిటిష్ వారి (నీ పైన ఉన్నవారిపైన నీ హక్కులకు) పైన పొరాడెదవు అందుకే అస్తిత్వం అవసరం
ఇది మీకు అర్ధం కాదు ఎందుకంటే మీరు సమస్య కు పరిష్కారం చూపలేరు ,చూపించిన పరిష్కారం తప్పు అని ఎలా చెప్పగలరు..?

బ్రితిష్ వాడి లాగే హిందు ముస్లిం మధ్య అంతరాలను ఉపయొగించి దివిజన్ చెసినట్టే మాల మాదిగ అనే దివిజన్ ను మీరు బలపరుస్తున్నారు..ఒక్క విషయం గుర్తుంచుకోండి అన్నేళ్ళు పై వర్ణాలు ఉన్నారు వాళ్ళు కింది వర్ణాలకు ఏం చేశారు..?దోచుకొవడం తప్ప?

కాని పూర్తిగా సమస్యను సాధించే పరిష్కారం లేనప్పుడు సమస్యను కొంతైనా పరిష్కరించేది మెలు ..?కాని అది కూడ వద్దు అనే మీబొటి వాళ్ళు ..?సమస్యకు పరిష్కారం చూపెట్టరు,ఉన్న పరిష్కారాన్ని ఉపయోగించి మీరు మీబోటి వాళ్ళు పరిస్థితులను వాడుకుంటారు.

కులవ్యవస్థను నేను అట్టి పెట్టుకొకుండా ఎలా ఉండాలి అన్నది మీరు చెప్పడం లేదు. 
అది వదిలేసి మళ్ళీ పిట్ట కథలు చెప్తున్నారు.
ఊరికే ఉపన్యాసాలు ఆదర్శాలు చెప్పకూడదు. 
ఇంత రాసినా నాకు తెల్సు మీకు అర్ధం కాదు అని.
ఎందుకంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దెన్ని అంగీకరిస్తున్నారో దెన్ని అంగీకరించడం లేదో మీరు కంఫ్యూజన్ గా ఉన్నారు. 
కామెంట్ కి రెప్లై ఇచ్చే ముందు కామెంట్ ను పూర్థిగా చదవండి .

నేను చెప్పేది నా కింది కులం వాళ్ళు నా కింద ఉండాలని కాదు దీనిని మీరు ఇలా రాసే మెధవులు. 
కాబట్టి నేను నా పైన మరియు నా కింద యే కులం ఉండకూడదు. 
దీనికి యేదైన పరిష్కారం చూపెట్టగలరు. 
లేక పొతే ఇప్పుడు జరుగుతున్నది కచ్చితంగా వర్కౌట్ ఔతుంది.

చూశారుగా ప్రతి ఒక్కరు తమ అస్తిత్వానికి పోరాటం చెస్తున్నారు..
అంతకు ముందు పైన ఉండే వాళ్ళే తమ అస్తిత్వానికై పోరాడేవాళ్ళు.
ఇప్పుడు కింది అట్టడుగు వాళ్ళు తమ అస్తిత్వానికి పోరాడుతారు.

కనీసం ఇప్పుడు కింది వారు పోరాదే హక్కు తమకూ ఉందని తెలుసుకుంటున్నారు ..
అప్పుడు లేదు ..మీరు ముందు కులవ్యవస్థ ను గూర్చి పూర్తి గా అధ్యయనం చెసి రాయండి, లేదు నాకు అంతా తెలుసు అని రాస్తే మీ ఇష్టం -  ఆల్ దె బెస్ట్"
----------------who am i16 January 2015 at 08:07



        ఇది నా గత పోష్టు "ఇదండీ కమ్యునిజం చరిత్ర" పోష్టులోని విషయం గురించి దళితవాదపు సమర్ధకులలో ఒకరి సుదీర్ఘమయిన విమర్శ నాపైన!మరొకరు కూడా దాదాపు ఇలాంటి ఆరోపణలే చేశారు,ఆరోపణలు అనకూడదేమో?పోష్టులోని విషయం అర్ధాంతరంగా ముగియడం వల్ల కూడా ఈ రకమయిన  రెస్పాన్స్ వచ్చి వుండవచ్చు.విషయం చాలా విస్తృతమైనది,పైగా యే కొంచెం మాట పొల్లయినా విపరీతార్ధాలు వస్తాయి!అవగాహన స్పష్తంగానే వున్నా దాన్ని యెలా చెప్పాలా ఈ పోష్టుని యెలా ముగించాలా అని ఆలోచిస్తూ చాలా రోజులు గడిపాను.ఆఖరికి మొత్తం అంతా ఇక్కడే చెప్పడం కుదిరేది కాదని అంతవరకూ పబ్లిష్ చేశాను. అడిగిన ప్రశ్నలన్నిటికీ లెక్క ప్రకారం కిందనుంచి పైకి జవాబులు చెప్తూ వెళ్తే వరస బాగుంటుంది,యెందుకంటే నాకసలు కులవ్యవస్థ గురించి సరైన అవగాహనే లేకుండా నోటికొచ్చిన పిట్టకధలు చెప్తున్నానని అంటున్నారు గదా - ముందు దాంతోనే మొదలు పెడతాను.


        ఇప్పటివరకూ మన దేశం యొక్క గతం గురించి మనకి సాధికారికంగా తెలిసిన నాగరికత సింధు లోయ నాగరికత. ప్రపంచంలోని అతి ప్రాచీనమైన మూడు నాగరికతలలో ఇది ఒకటి! హరప్పా నగరానికి సంబంధించిన తవ్వకాల్లోనే యెక్కువ విశేషాలు తెలియడం వల్లా మిగిలిన చోట్ల బయటపడిన విషయాలు కూడా దాదాపు ఇలాగే వుండటం వల్లా హరప్పా నాగరికత అని కూడా పిలుస్తున్నారు.తన వుచ్చదశలో 5 మిలియన్ల జన సమూహం ఈ సంస్కృతిలో జీవించారు!ఈ జనసమూహం అంతకు ముందు వేట ప్రధానంగా జీవికగా వున్న ఒక తల్లి నుంచి పుట్టిన కుదురు గణం అని పిలవబడే సమూహంగా కదుల్తూ వుండే సంచార జీవనం నుంచి కొత్తగా నేర్చిన వ్యవసాయం మూలంగా స్థిరజీవనాన్ని యేర్పరచుకుంటున్న తొలి దశ!ఇప్పటి మన దేశపు సంస్కృతిలో కూడా ఈ సంస్కృతి చాయలు పరుచుకుని వున్నాయి కాబట్టి దీన్ని గురించి కొంచెం వివరంగా చెప్తాను.

        వేట జీవన విధానంగా వున్న కాలంలోనే ఇక్కడ ఇవ్వాళ కమ్యునిష్టులు చెప్తున్న "అదనపు వులువని సమాజపరం చెయ్యడం" అనే ఆదర్శానికి సమానమైన "దేవీ భాగం" అనే  సాంప్రదాయాన్ని పాటించారని ఈ సంగచ్చధ్వం సంవదధ్వం అనే ఋగ్వేద మంత్రం ద్వారా తెలుస్తుంది!దేవీభాగం అంటే - పసిపిల్లలకూ, దంతాలు లేని వృద్ధులకూ మెత్తని మాంసం మొదట ఇవ్వాలి.తర్వాత దౌహృదులకి - రెందు హృదయాలు ఉండే గర్భవతులకి రెట్టింపు మాంసం ఇవ్వాలి.అలా వారందరికీ పంచగా మిగిలిన మాంసాన్ని యువతీ యువకులకీ, జవసత్వాలు గలిగి సంపద పెంచే ఇతరులకీ పెట్టాలి.ఆ మంత్రంలోనే "పూర్వులు యెలా చేసేవారో" అనడం ద్వారా అప్పటికే దానికి దూరమయ్యారని కూడా తెలుస్తుంది!ఆదర్శం గొప్పదే గనక కొంత శ్రధ్ధ చూపించి కృషి చేస్తే ఇప్పటికీ మరో రూపంలో దాన్ని సాధించి నిలబెట్టుకోవచ్చు!

        ఒక దేశపు చరిత్ర ఆ దేశప్రజల సమిష్టి బాల్యస్మృతుల్ని తట్టిలేపే తేనెతుట్టె!నాకు మా తాతగారి ఇంట్లో గడిచిన బాల్యం చాలా అపురూపంగా వుంటుంది.అయితే ఆ ఇల్లు ఇప్పుడు లేదు.జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ ప్రతి అంగుళాన్నీ గుర్తుకు తెస్తాయి.కానీ జ్ఞాపకాల కోసమని ఇప్పుడు సౌకర్యం కోసం కట్టిన భవంతిని కూల్చేసి మళ్ళీ ఆ పూరింటిని కట్టడం అనే పిచ్చిపని నేను చెయ్యను?దేశపు చరిత్ర కూడా అంతే!అప్పుడు మనం చేసిన తప్పుడు పనులు కూడా ఇప్పుడు మనకి తియ్యగా వున్నట్టే అప్పటి వాళ్ళు చేసిన తప్పొప్పుల్నీ చూడాలి - వాళ్ళు చేసిన తప్పుల్ని మనం చెయ్యకూడదనే వివేకాన్ని పెంచుకోవడమూ వాళ్ళు చేసిన గొప్పపనుల్ని తలుచుకుని వుత్తేజితులు కావడమే చరిత్ర పఠనానికి లక్ష్యంగా వుండాలి తప్ప ఒకవైపు నుంచే చూసి ఆయనెవరో చెప్పినట్టు యేనుగుని చేతికందినంతమేర తడిమి అదే సమస్తం అని వర్ణించే గుడ్డివాళ్ళ మాదిరి భాష్యాలు చెప్పే యేకపక్షపు సిధ్ధాంతుల్ని అమాయకంగా నమ్మితే మనకి కనబడేవి అర్ధసత్యాలే!

        సరిగ్గా హరప్పా కాలం నాటి వాతావరణమే కలిగిన మాయా నాగరికత లాంటివి అక్కడి ప్రాంతాల నైసర్గిక స్వరూపం వల్ల ఇతర జాతుల దాడిలో చాలా త్వరగా రూపాన్ని మార్చుకున్నాయి,కానీ హిమాలయ శ్రేణులు మిగతా ప్రపంచం నించి ఈ భూభాగాన్ని వేరు చెయ్యడం వల్ల బ్రిటిషర్లు శిధిలం చేసే వరకూ కొనసాగిన "స్వయం పూర్ణ గ్రామ వ్యవస్థ" హరప్పా సంస్కృతి మూలాల్ని పదిలంగా పట్టి వుంచగలిగింది!కొందరు ఈ శీతనగాన్ని దాటి వచ్చి తాము దోచుకుని తమ దేశాలకి తరలించుకుపోయినా బాబరు లాంటి వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చేసరికే అక్కడి నిరంతర యుధ్ధాలకి విసుగెత్తి వుండటంతో ఇక్కడే తమ సామ్రాజ్యాల్ని స్థాపించుకున్నారు!మొగలు వంశ స్థాపకుడైన బాబరే కాదు షేర్షా సూరి లాంటి వాళ్ళు కూడా అదే పని చేసినా వారి లక్ష్యం రాజ్యస్థాపన కాబట్టి ప్రజల సంస్కృతిని కదిలించక పోవడం వల్లనే పై స్థాయిలో రాజు యెవరయినా ప్రజలకి యే విధమయిన తేడా తెలియ లేదు.

        కొత్తగా కట్టిన ఆధునిక నగరాల్ని కాకుండా ప్రాచీన నగరాల్నీ చరిత్ర పూర్వకాలం నుంచీ వున్న పల్లెల్నీ చూస్తే వారి జీవనకేంద్రంలో ఒక దేవాలయం వుండటమూమళ్ళీ  ఆ కోవెలకి తప్పనిసరిగా ఒక పుష్కరిణీ లేదా స్నానఘట్టం వుండటమూ గమనించవచ్చు.అది సింధులోయ నాగరికతకి రూపు మారిన కొనసాగింపు!మూలాలు తెలియకుండానే వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నా ఆ మూలాల గురించి వాస్తవంగా తెలిసింది క్రీ.శ 1842లో చార్లెస్ మాస్సన్ ద్వారానే.తర్వాత 1856లో జనరల్ కన్నింగ్ హాం కరాచీ లాహోరులను కలుపుతూ ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ తరపున జరిగే పనిలో భాగంగా దీన్ని గురించి ప్రముఖంగా పట్టించుకుని ప్రపంచానికి తెలియజేశాడు!రాజ్యం అనేది ప్రాధమిక స్థాయిలో వున్న అప్పటి నగరంలో రెండు ప్రధానమైనవి - ఒకటి ధాన్యపు రాశి,రెండు బహిరంగ స్నానఘట్టం.స్నానఘట్టం కేవలం స్నానానికి వుద్దేశించింది అనుకుంటే పొరపాటు!ప్రతి ఇంటిలోనూ స్నానాల గదీ మురుగునీటి సౌకర్యమూ వుండగా మళ్ళీ దీన్ని యెందుకు యేర్పాటు చేశారో తెలుసా?ఇవ్వాళ్టికీ దైవ ప్రార్ధనకి ముందు దేహాన్ని స్నానం ద్వారా శుభ్రపరచడం అనేది జరుగుతున్నదే గదా - ఆ అవసరం కోసమే ఈ బహిరంగ స్నానఘట్టం!దానికి నిదర్శనం అక్కడ వున్న దుస్తులు మార్చుకోవడానికి వున్న గదులు!ఇప్పటి ఆధునిక కాలంలోని స్విమ్మింగ్ పూల్స్ మాదిరి విలాసానికీ ప్రత్యేక తిధుల్లో మతాచారాల కవసరమయిన శౌచానికీ వుపయోగించేవారని మనం భావించవచ్చు!అందువల్లనే కాబోలు తర్వాతి దశ ఆయిన రాజరిక వ్యవస్థలో స్నానఘట్టాలు దేవాలయం - రాజప్రాసాదం అనే రెండు చోట్లనే కనిపిస్తున్నాయి?

        తర్వాత యేర్పడిన రాజ్యాలు కూడా ఓకే నగరాన్ని ఆధారం చేసుకుని వుందటం వల్ల అదే సామాజిక నిర్మాణం కొన్ని మార్పులతో కొనసాగింది.ధాన్యాగారం ధనాగార మయింది.స్నానఘట్టం పూర్తి హంగులతో దేవాలయం అయ్యింది!మరోసారి వెనక్కి వెళ్ళి నగర క్రమబధ్ధీకరణ గురించి తెలుసుకుంటే కళ్ళు చేదిరే దృశ్యం కనబడుతుంది.నగర నిర్మాణంలో ఆ కాలపు భారతీయులు వుపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం మధ్యప్రాచ్యంలోని సమకాలీన నాగరికతల కన్నా సరిపోల్చలేనంత గొప్పగా వుంది!అది మన వారసత్వం,అది మన ప్రాచీనుల మహత్వం!దాదాపు నాగరికులంతా అయితే చేతివృత్తులతో కళాఖండాల్ని సృష్టించగలిగిన వారూ లేదంటే వారు సృజించిన వాట్ని సుదూరతీరాలకు కూడా తీసుకెళ్ళి అక్కడి విపణివీధుల్లో అమ్మగలిగి సంపదని సృష్టించే రహస్యం తెలిసిన వ్యాపారస్తులూ ఐవున్నారు.దానికి సాక్ష్యం వారు నగరనిర్మాణంలో వాడిన కొన్ని వస్తువులు ఆ దరిదాపుల్లో యెక్కడా దొరకనివి కావటం.

        ఈ జనసమూహాలు అంతకుముందు వేట ప్రధానమైన జీవికగా వుండి ఒక తల్లి సంతానం అంతా ఆమె పేరుతోనే పిలవబడే ఒక గణంగా కలిసి ఒకచోట ఆహారం పలచబడగానె మరొకచోటికి కదులుతూ సంచారజీవనం సాగిస్తూ వుండేవి!తర్వాతి కాలంలో జన్యురోగాలకి కారణమవుతున్నాయని తెలిసిన నిషిధ్ధ శ్రంగారం కూడా అప్పుడు సహజంగా అనిపించేది!ఒక తల్లి నుంచి పుట్టిన సంతానం, ఆ సంతానంలోని ఆడవాళ్ళ నుంచి పుట్టిన సంతానం అంతా ఒకటే కుదురు అయ్యేది!ఇవ్వాల్టి మాదిరి ఒక స్త్రీ ఒక పురుషుడు ఆజీవపర్యంతం కలిస్ బతికే వివాహం అనేది గణసాంప్రదాయాన్ని ధిక్కరించటం కింద పరిగణించే వావివరుసలు లేని  కాలమది!ఇవ్వాల్టి మేనరికాల లాగే ఒకే గణానికి చెందిన స్రీ పురుషులు కొన్ని తరాల పాటు కలవడం వల్ల వచ్చి పడుతున్న కారణం తెలియని రోగాలకి భయపడి ఒకే గణానికి చెందిన స్త్రీ పురుషుల కలయికని నిషేధించి గణ సమూహాల మధ్య ఆదాన ప్రదానాలతో కూడిన బాంధవ్యాల్ని పెంచుకున్నారు.పుట్టుక తోనే వచ్చే ఆ  రోగాలకి కారణం స్త్రీ గర్భం అనే అపోహ వల్లనో యేమో తమ ఆడవాళ్ళని వేరే గణానికి పంపుతూ వరే గణానికి చెందిన స్త్రీలని తాము తెచ్చుకుంటూ కుండమార్పిడి పధ్ధతిని పాటించారు.అసలు కారణమేమిటో తెలియక చేసినా అసలు సమస్య పరిష్కారమవడంతో పాటు సొంత గణంలో పట్టుని కోల్పోయి కొత్త గణంలో పట్టును సాధించలేక ఆదపెత్తనం అంతమైపోయి మగపెత్తనం మొదలయింది!మొదటి దశలో ఇలా గణాల మధ్యన ఆడవాళ్ళ మార్పిడి జరిగినా శృంగారం మాత్రం సామూహికమే సాంప్రదాయంగా వుండేది.ఇవ్వాళ మనం పెళ్ళిలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి కారణం మొట్టమొదటి సారిగా ఆ ఆలోచన చేసి దానికి కట్టుబడి వశిష్టుణ్ణి కూడా ఒప్పించడమే!కులాల్ని వేరు చేసేది వివాహమే కాబట్టి ఇవ్వాళ్టి కులవారసత్వాలకి సంబంధించిన వివాహ సాంప్రదాయాలు యెట్లా యేర్పడినాయో తెలియడం కోసమే ఇంత విస్తారంగా చెప్పాను.ఇప్పటికీ అనుకోకుండానే యెవరినైనా మామగారింటిని "మీ అత్తవారిల్లు" అని ప్రస్తావించడంలోనూ ఆడపిల్ల తలిదండ్రుల్ని "మీ అమ్మాయిని యే వూరిచ్చారు?" అని అడగటంలోనూ ఏనాడో కాలగర్భంలో కలిసిపోయిన మాతృస్వామ్యపు  ఆనవాళ్ళూ సామూహిక వివాహపు అలవాట్లూ వున్నాయనేది తెలిస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం విషయాల పట్ల కూడా మనం యెంత ఆప్యాయంగా వున్నామో అర్ధమవుతుంది!

        హరప్పన్ ఇంజనీర్లు వాడిన దంతం మీద గాట్లతో యేర్పరచిన స్కేలు మీది అతి చిన్న ప్రమాణం ఇప్పటి 1.7 మిల్లీమీటరుకి సరితూగుతుంది!ఇళ్ళ నిర్మానంలో సైజుల వారీ తేడాలు వున్నా అన్ని ఇళ్ళూ ఒకేరకంగా వుండటం వల్ల అప్పటివాళ్ళు సమానత్వాన్ని పాటించేవారని తెలియజేస్తున్నాయి.నగరం నలుమూలలకీ వీధులూ ఇళ్ళూ ఒక గ్రిడ్ మాదిరి విస్తరించి వున్నాయి.మొత్తం నగరం రెండు భాగాలుగా వుంది.ధాన్యాగారానికి దగ్గిరగా వున్న ప్రాంతం యెగువనగరం గానూ దూరంగా వున్న జనావాసాలతో కూడినది దిగువ నగరం గానూ వుండేవి.ఇంకొక విశేషం యుధ్ధానికి సంబంధించిన జాడలూ అమరవీరుల స్మారకస్థూపాలూ లేకపోవటం - ఆదినుంచీ మనం శాంతికాముకులమే నన్నమాట?!

        సరిగ్గా ఇవే మౌలికాంశాలు తర్వాతి కాలంలోని నగర రాజ్యాలలోనూ స్వయంపూర్ణ గ్రామాలలోనూ మరింత స్పష్టమై కనబడతాయి.ఇవ్వాళ్టి రాకీయ నాయకులంతా స్మార్ట్ సిటీలూ స్మార్ట్ విలేజిలూ అని పేర్లు మాత్రమే లీకు చేసి హడావిడి చేస్తున్నారే గానీ వాటి స్వరూపం యెలా వుంటుందో మాత్రం ఒక్కముక్క కూడా చెప్పటం లేదు!కానీ స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థ అంటే తనకి కావలసిన వాటి నన్నిట్నీ దానికదే సమకూర్చుకోగలిగిన సామాజిక భౌగోళిక ఆర్ధిక నిర్మితి!సింధులోయ నాటి వృత్తులన్నీ కులవృత్తులుగా స్థిరపడిపోయి "కులవృత్తికి సాటిలేదు గువ్వలచెన్నా!" అని పాడేసుకుంటున్నారు! ఒకే వృత్తికి సంబంధించిన వారంతా ఒకే వీధిలో సర్దుకుని "కోమట్ల బజారు", "కంసాళ్ళ వీధి","చాకలి పేట"లుగా స్థిరపడిపోయినాయి.కులవృత్తిని తమలోనే పదిలంగా వుంచుకోవటానికి స్వకులంలోని వివాహాలకే మొగ్గు చూపించే వారు?!వ్యవసాయం పశుపోషణ అంతా రైతులది కాగా దానికి అనుబంధమైన ఈ వృత్తిపని వారందరినీ పోషించే బాధ్యత రైతులది!పంట రాగానే అందరికీ దామాషా పధ్ధతిలో వాటాలు వేసి ధాన్యం పంచేసే వాళ్ళు!అది ఇవ్వననడానికి వీల్లేని హక్కుగా వచ్చిపడే ఆదాయం కావడంతో ధీమాగా సామేతల్నీ ఆమెతల్నీ పుట్టిస్తూ ఒక కులం మీద మరో కులం వాళ్ళు జోకు లేసుకుంటూ గడిపేవాళ్ళు!కరువొచ్చినా వరదొచ్చినా ప్లేగులాంటి మహమ్మారి విరుచుకుపడినా వూళ్ళకి వూళ్ళు ఖాళీ అయ్యేవి గాబట్టి ప్రాణం విలువ తెలిసి బాంధవ్యాలకు ప్రాధాన్యత నిచ్చి అమాయకంగా బతీకేశారు "ఫరంగీలు" అనీ "కుంఫిణి దొరలు" అని తొలిరోజుల్లో అబ్బురంగా చూసి మురిసిన ఇంగ్లీషువాళ్ళు వచ్చేవరకూ?!అంతటా వ్యవసాయమే ప్రధానం కావటం వల్ల మొత్తం భరత ఖందమంతా ఒకే రకమయిన సంస్కృతిలో ఒదిగిపోయింది!యేనుగుల వీరాస్వామయ్య గారి "కాశీయాత్ర చరిత్ర" ప్రకారం అన్నం అమ్మడం తప్పుగా భావించేవాళ్ళు!రూపాయికి బస్తా బియ్యం అనే లెక్కల్ని మన పెద్దలు చెప్పగా విన్నాము కదా,డబ్బుతో అవసరం లేని జీవితం వాళ్ళ చుట్టూ పరుచుకుని వండటం వల్ల దేన్నీ కొనాల్సిన అవసరం లేకుండా పంచుకుంటూ బతకటం వల్లనే అది సాధ్యపడింది!ఆ మనస్తత్వం నుంచి బయట పడ్డాకనే ప్రతిదాన్నీ కొనాల్సిన అవసరం యేర్పడి వస్తువులకి ధరలు పెరిగాయి!

        ఈ మొత్తం సంస్కృతినంతా నిజాయితీగా రికార్డ్ చేసిన కన్నింగ్ హాం లాంటి వాళ్ళకి మనం దురుద్దేశాలు అంటగట్టలేము గానీ రొమిల్లా థాపర్ మొదలుకుని కమ్యునిష్టు సిధ్ధాంతులంతా ప్రమాదవశాత్తూ హిందువైన నెహ్రూ గారి సంపూర్ణ సహాయ సహకారాలతో అత్యుత్సాహంగా పని చేసి అన్ని శతాబ్దాల పాటు ఈ వ్యవస్థ ప్రశాంతంగా నడవటానికి "బ్రాహ్మణాధిక్యత" మాత్రమే కారణం అని తేల్చడం వెనక 50% అజ్ఞానం 50% దుర్మార్గం వుంది.అజ్ఞానం యెందుకంటే భూమి మీద అధిపత్యమంతా రైతులకే వుండటం వల్ల ఆ వ్యవస్థ బద్దలయిన ఇప్పటి కాలంలో కిందికులాల వారితో పాటు వాళ్ళు కూడా దెబ్బతినడం యేకొంచెం నిష్పాక్షిక దృష్టితో చూసినా కళ్లముందు కనపడే వాస్తవం!పెట్టుబడిదారీ వ్యవస్థని బద్దలు కొట్టడానికి అది బలహీనంగా వున్నచోట కొట్టమన్న మార్క్సు గారి బొధన ప్రకారం మతపరమయిన కర్మకాణ్దలు చేస్తూ సంభావనలతో సరిపెట్టుకుని అన్ని కులాల మధ్యనా లింక్ క్లాస్ గా వున్న బ్రాహ్మల్ని బద్నాం చెయ్యడం ద్వారా అన్ని కులాల్నీ ఒకేసారి విడగొట్టవచ్చనేది వాళ్ళ దుర్మార్గం?!పెతీదానికీ ఫ్రేం వర్కు వుండాలనే వాళ్ళకి వాళ్ళు చెప్పేదానికన్నా గట్టి ఫ్రేం వర్క్ వున్న హిందూ ధర్మాన్ని బద్దలు కొట్టడానికి వాళ్ళకి కనబడిన బలహీనత అది. వాళ్ళ పేర సొంత ఆస్తి సెంటు కూడా లేకుండా కేవలం దానాల మీదా సంభావనల మీదా ఆధారపడి బతికిన వాళ్ళూ ఆ వ్యవస్థ బద్దలవగానే అందరితో పాటూ వీధినపడ్డవాళ్ళూ  దుర్మార్గులా?బ్రాహ్మల్ని వెక్కిరించటానికి గురజాడకి కన్యాశుల్కంలో భాషా బలిపీఠంలో రంగనాయకమ్మకి తిండీ దొరికాయి,యింత నీచపు విమర్శలు చేసిన వాళ్ళు వున్నతులా! 

        ఇంగ్లీషు వాళ్ళ ప్రమేయంతో ఆ వ్యవస్థ బద్దలయ్యే క్షణం వరకూ దాన్ని పట్టి వుంచటానికి బ్రాహ్మణులతో పాటూ అన్ని కులాల వాళ్ళూ తమ వంతు సాయం చేసి తీసుకోవలసిన ఆదాయాన్ని తీసుకుని అది బద్దలయ్యాక ఇప్పుడు పడుతున్న కష్టాలకి అప్పటి వాళ్ళని తిట్టి యేమి ప్రయోజనం?తండ్రి హయాంలో కట్టిన పూరిపాకని కూల్చిన కొడుకు భవంతిని కడితే ప్రయోజకత్వం అంటాం,దేన్నీ కట్టకుండా వొదిలేస్తే అప్రయోజకు డంటాం!అదే దేశం విషయంలో అయితే ఇంగ్లీషువాళ్ళు కూల్చిన వ్యవస్థ స్థానంలో అంతకన్నా గొప్పదాన్ని నిర్మించి వుంటే అభివృధ్ధి జరీగేది,దాని స్థానంలో మరింత చెత్త నింపడం వల్లనే ఈ అధోగతి!ఈ మధ్యనే వరూధిని బ్లాగరు  ఇంగ్లీషు వాళ్ళు రాకపోయి వుంటే దేశమంతా ముస్లిము మతం వ్యాపించి వుండేది,వీళ్ళు రావడం వల్ల అది జరగలేదు అనే భావంతో ఒక పోష్టు వేశారు.కానీ అది సరి కాదు.మాలిక్ ఇబ్రహీం మల్కింభరాముడు అని కీర్తించబడే విధంగా పరిపాలించాడు!హిందూ ధర్మం యే పునాది మీద గట్టిగా నిలబడిందో ఆ స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థని వాళ్ళు కదిలించలేదు.ఇంగ్లీషు వాళ్ళు కూడా  ఆ అపని చెయ్యకుండా వుంటే ఇప్పటికీ ముస్లిము ప్రభువుల మాదిరే వాళ్ళూ మనకు ఆదర్శ పభువులుగానే వుండి వుండేవాళ్ళేమో?!


        వాళ్ళు రాకుండా వుండి వుంటే నిలవనీరులాగా మార్పు లేకుండా వుండటం అనే అవలక్షణాన్ని ప్రపంచం నలుమూలలకీ వ్యాపార పరిధిని విస్తరించిన మన వణిక్ప్రముఖుల ద్వారా యెక్కడేం జరుగుతుందో తెలుసుకుని రావలసిన మార్పుని శాంతియుతంగానే సాధించుకునే వాళ్ళమేమో?!

        నా ఇంటిపేరుకో చరిత్ర వుంది.తమ దేశం మీదకి దండెత్తి వస్తున్న అపారమయిన శత్రుసైన్యాన్ని కేవలం నలుగురు వీరయువకులు వేనకనుంచి తమ సైన్యం వస్తున్న దాఖలా వినిపించేవరకూ అంటే కొన్ని గంటల సేపు నిలబెట్టి వెనకనించి బేరీనాదం విన్న తర్వాతనే కూలారు!అప్పటి వరకూ "బతకాలి,పోరాడాలి,శత్రువుని ముందుకు రానివ్వకూడదు" అనే సంకల్పం మాత్రమే వాళ్ళని నిలబెట్టింది.అప్పటి వాళ్ళ శౌర్యంతో పోలిస్తే "ఒక్కొక్కణ్ణి కాదు షేర్  ఖాన్ వందమందిని ఒకేసారి పంపించు" అనే ఇవ్వాల్టి సినిమా డైలాగు జోకులాగా వుంటుంది!ఆ నలుగురి పెర్లకి "నేని" కలిపి పెట్టిన పేర్లు నాలుగే వున్నాయి వెలమల్లో!నా పేరులో వున్న సూరన్నని తల్చుకుని వుత్తేజం పొందే నేను కురుమ గొల్లలు కొమరం భీం శౌర్యాన్ని తలుచుకోవడాన్ని యెందుకు వ్యతిరేకిస్తాను?మీలో వున్న గందరగోళం యేమిటో మీకు చూపించటానికే అన్నిసార్లు రెట్టించాను.అన్ని సార్లు రెట్టించినా మీరు మీ కులవారసత్వానికి అంత గట్టిగా అంటిపెట్టుకోవాలనుకునది బ్రాహ్మణులు బోధించడం వల్ల కాదు - మీ తాత ముత్తతల గొప్పదనం పట్ల మీకున్న మమకారానికీ బ్రాహ్మణులకీ యే సంబంధమూ లేదు,అవునా కాదా?గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి! అప్రస్తుత వీరవరేణ్యులూ ప్రాతస్మరణీయులూ కొన్ని కులాలకే పరిమితం కాలేదు,అన్ని కులాల్లోనూ పుట్టారు.ప్రాచీనతనీ సాంస్కృతిక నేపధ్యాన్నీ,మొత్తం సామాజిక జీవనంలో వాటికున్న ప్రాధాన్యతనీ లెక్కిస్తే అన్ని కులాలూ గొప్పవే!ఇప్పుడు మీరు పొరబడుతున్న యెక్కువ తక్కువలు సంస్కృతికి సంబంధించినవి కావు ఆర్ధికానికి సంబంధించినవి."కులములోన ఒక్క గుణవంతు డుండెనేని కులము వెలుగు" ననీ "కలిమి లేనివాని కులము దిగు" ననీ చెప్పిన వేమన్న యెప్పటివాడు?

        మిమ్మల్ని గట్టిగా కులాన్ని వొదులుకోమని రెట్టించినందుకో యేమో "పరిస్థితిని తమకనుకూలంగా వాడుకునే వాళ్లు,ఆదర్శాలు దంచేవాళ్ళు" అనే గుంపులో నన్నూ కలిపేశారు!మావాళ్ళు సముద్రంలో కాకిరెట్టల్లాగా అక్కడొకడూ ఇక్కడొకడూ వున్నారు.వున్న కొద్దిమంది కూడా కులం పేరుతో ముఠా రాజకీయాలు నడపకుండా కొంచెం సంసార పక్షంగానే వండిపోయారు,నేను మిమ్మల్నీ మీ పరిస్థితుల్నీ సొంతానికి వుపయోగించుకుని  బాగుపడటం కుదిరేనా పెట్టేనా?ముసుగులో గుద్దులాట లెందుకు,మీరు వర్కౌట్ అవుతుంది అంటున్న ప్లాను - ముందు దళితవాద అనుకూల ప్రభుత్వాన్ని సాధించుకుని ఆ ప్రభుత్వం సాయంతో అగ్రకుల పెత్తందార్లని కట్టడి చేస్తేనే కింది కులాలు పైకి రాగలుగుతాయని,అంతేనా?అదే మీ ప్లాను అయితే మావోఇష్టుల వల్లనే తప్ప మరోవిధంగా జరగదు!యెందుకంటే ఇలాంటి వ్యవహారం యేది నిక్కచ్చిగా జరగాలన్నా దానికి తగ్గట్టు మంచి ఫ్రెం వర్క్ వుండాలి,కదా?ఇప్పుడున్న ప్రభుత్వం నడిచే తీరు యెట్లా వుంది?ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్నే వుద్యోగుల జీతాలకీ,అభివ్ర్ధ్ధి ప్రణాళికలకీ,సంక్షేమ పధకాలకీ ఖర్చు చేస్తుంది.అందులో యెక్కువ వాటా ఇచ్చే వ్యాపారస్తులు యే కులం వాళ్లయినా యే ప్రాంతం వాళ్లయినా యే మతం వాళ్లయినా వాళ్ళకి యెటువంటి ఇబ్బందిని కలిగించడాని కయినా సాహసించదు!దానికి గొప్ప సాక్ష్యం తెలంగాణా చక్రవర్తి - రాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయ గంద గందరగంద - శ్రీశ్రీశ్రీ చంద్రశేకర వర్మ మహారాజులుం గారు చూపిస్తారు?! వారొకప్పుడు రామోజీ ఫిలిం సిటీని లచ్చ నాగళ్ళతో దున్నిస్తానని గర్జించేసరికి అక్కడున్న చదువుకున్న దద్దమ్మలు కొందరు పులకించిపోయారు. ఇప్పుడు ఆయన ఆ తావుకే వెళ్ళి ప్రశంసల వర్షం కురిపించేసరికి కక్కలేకా మింగలేకా సతమతమయ్యారు.ఆఖరికి కొంటె జర్నలిష్టు ఒకడు అడిగీతే తన్నినంత పని చేశాడు నేనెప్పుడన్నానని!అన్నవాడు మాటలో దొరుకుతాడు గానీ కరణం రాతలో దొరకడన్నంత తెలివైన మనిషి గాబట్టి "అదియును నీ పతిప్రాణంబు దక్క" అన్నంత నిక్కచ్చిగా "అది కబ్జా అయితేనే" అని మెలిక పెట్టి అని వుంటాడేమో గానీ నిజంగా దున్నితే చూద్దామని అనుకున్న వాణ్ణి యేవిధంగా అంచనా కట్టాలి?!విభజన ద్వారా వెనకటి రాష్ట్రం నుంచి యెంత రెవెన్యూ వస్తుంది,అది యెన్నేళ్ళ బద్జెట్టుకి సరిపోతుంది,ఫిలిం సిటీని దున్నించాక రెవెన్యూలో పడే బొక్కని యెట్లా యెక్కణ్ణించి తెచ్చుకోవాలి అనే ప్రశ్నలు వచ్చి వుండవు ఆ మదురదృశ్యం మనసులో పైశాచికానందాన్ని నింపుతున్నప్పుడు?!కేసీఆర్ మొహమాటం లేని నిక్కచ్చి మనిషి గాబట్టి ఫెదీమని తేల్చేశాడు గానీ లేకపోతే యెంతకాలం ఆ ఫాంటసీలో వుండిపోయేవాళ్ళో!దళిత అనుకూల ప్రభుత్వం కూడా అలాంటి ఫాంటసీయే అనిపిస్తుంది నాకు?!

        ఆ ఫాంటసీ మీకు రావడానికి నేను వూహిస్తున్న కారణం కమ్యునిజంలో వున్న వర్గ దోపిడీ అనే ముక్క మాత్రమె నచ్చడమూ,పూర్తిగా సాయుధపోరాటాన్ని కూడా ఒప్పేసుకుందామా అంటే రక్తపాతం పట్ల విముఖత్వం వుండటం వల్ల కావచ్చు!కానీ అదనపు విలువ నుంచి సొంత ఆస్తి రద్దు ,దాని నుంచి సాయుధ పోరాటం,దానితో వర్గరహిత సమాజం అనేవి ఒకదానితో ఒకటి లింకప్ అయి వున్నాయి గాబట్టి ఒక సహాన్ని మాత్రమే అక్కణ్ణించి తీసుకుని మిగతా సహాన్ని కులసమీకరణల పైరవీలతోనూ కలిపేస్తే కాళిదాసు కవిత్వం కొంత నా సొంత పైత్యం కొంత అన్నట్టు తయారవుతుందే తప్ప అందులో ఒరిజినాలిటీ లేదు!అసలు ఇవ్వాల్టి పరిస్థితికి ముఖ్యమయిన కారణాలు రెందు:ఇంగ్లీషు వాళ్ల ద్వారా బద్దలైన ఒక ఫ్రేం వర్కుకి సరైన ప్రత్యామ్నాయాన్ని తయారు చెయ్యటంలో ప్రభుత్వాలు ఫెయిలవ్వటం,కులవృత్తులు పోయి అన్ని కులాల వాళ్ళూ ఒకే పనికి పోటీ పడటం?!

        మీరు అనుకుంటున్నట్టుగా ఇప్పుదు అధికారంలో వున్న సొంతకులంవాళ్ళ అండతోనే వ్యాపారం విస్తరిస్తుందనేది నిజమేనా?స్మిత్తుగారు ఆర్ధికశాస్త్రం వ్యాపారం అనేదాన్ని యెట్లా నియంత్రించాలి అని  గవర్నమేంటులో వున్నవాళ్ళకి సలహా లివ్వడానికి రాశాడు!మార్క్సుగారు డబ్బు ఇటువైపునుంచి అటువైపుకి వెళ్ళడాన్ని మాత్రమే చూపించి భయపెట్టాడు గానీ వ్యాపారి వైపు నుంచి కస్టమరుకి వచ్చే సౌకర్యం గురించి అసలు ప్రస్తావించాడా?ఇవ్వాళ మార్కెట్లో వున్న ప్రతి వస్తువు వెనకా కొనుగోలు దారుకు ఒక సౌకర్యం తప్పకుండా వుంది - టూత్ పేష్టు,సబ్బు,ఫ్యాను,ప్రెషర్ కుక్కర్,మైరోవేవ్ ఓవెన్ - ఈ లిష్టు అనంతం!గ్రాహం బెల్ సరాసరి టెలిఫోను కనిపెట్టేద్దాం డబ్బుతో పొంగి పొర్లుదాం అనుకుని బయల్దేరలేదు,బధిరులకి సహాయంగా వుండాలనే సేవా దృక్పధంతో సొంత చిలుమే వొదిలించుకుంటున్న దశలో కాబోయే మామగారు వ్యాపారి బుర్రతో ఆలోచించి తను అన్నీ సమకూర్చి విషయం మార్కెట్టుని కుదిపేదిగా వుందని తెలియగానే పేటెంటుకి పరిగెత్తించి హడావిడి చేస్తే తన ఆవిష్కరనతో తను ప్రయోఅనం పొందగలిగాడు.తనొక్కడేనా,యే వ్యాపారి అయినా మనకి కొంత సౌకర్యం అందించి మనని సంతృప్తి పరచినాకనే దానికి ప్రతిగా తను లాభం తీసుకుంటున్నాడు గదా!దాన్ని పట్టించుకోకపోతేనే ఇప్పుడు వ్యాపారం చేసి పైకెళ్ళిన వాళ్లంతా దుర్మార్గులనీ వాళ్లని అణిచెయ్యదం తప్పు కాదనీ అనిపిస్తుంది?!

        శ్రామికులు రంగంలోకి దిగే ముందుగానే పెట్టుబడితో వ్యాపారి బయల్దేరతాడు.పెట్టుబడి సమకూర్చుకునే ముందుగానే అతను ఇవ్వాళ ప్రజలకి యే సౌకర్యం తక్కువగా వుందో చూసి దాన్ని తను మాత్రమే ఇవ్వగలడని నమ్మకం కలిగించుకుంటాడు!తను మార్కెట్లో యెక్కడ ప్రవెశించినా అక్కడ వున్న పోటీని తట్టుకుని తనకి చోటు దక్కించుకోవాలంటే తప్పనిసరిగా మిగతా వాళ్లకన్నా తను ప్రత్యెకమయిన సౌకర్యాన్నే కొనుగోలు దారుకి ఇవ్వాలి!వీటిల్లో యేవయినా ఒక కులం వాళ్ళు మాత్రమే చెయ్యగలిగిన పనులు వున్నాయా?ఒక పెద్ద కంపెనీలో రిస్కు లేకుండా బతుకుతున్న నలుగురు వుద్యోగులు "యెంతకాలం చేస్తాం ఇట్లా,వీళ్ళు చేస్తున్నది మనం చెయ్యలేమా" అని వుద్యోగాలకి రాజీనామా ఇచ్చి రేకుల షెడ్డులో మొదలు పెట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్తించారే వాళ్ళ దగ్గిర మొదట్లో వున్న పెట్టుబడి యెంత?

సీ||     తిండి తినుట, తిని పండుకొనుట, బోరు 
          కొడితె సైన్మలు షికార్ల కేగు

          ట - ఇవి కావు పనులంటే; బతుకు గడిచేందు
          కవసరమయిన పైకమును దెచ్చు

          పనులె పనులు ధరపైన మనుషులకు.
          తగు లాభ ఇచ్చెడి పనులు తప్ప

          ని సరిగ చేయాలి - హుషారైన 
          పనిని లాభకరంగ మల్చగలిగి


తే||    తే బహు శభాషు! ఒక్కడివే మరెవరి
       తోడు లేక ఏ పని చేయబోకు - నలుగు
       రి కుపయోగ పడ్తు నలుగురి నుపయుక్త
       పరుచుకుంటు బతకడమే మనిషికి విధి!

        తోపుడుబండి మీద బజ్జీలమ్ముకునే వాణ్ణి బీటు కానిస్టేబులు కూడా భయపెట్టగలడు,కానీ ఖండాంతరాలకు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యాధిపతి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా లెక్క చెయ్యడు!మీకూ మీ కులానికీ ఆ దమ్ము కావాలంటే వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ప్రవేశించి సత్తా చూపిస్తే మీరు ముందుకెళ్ళటానికి పదేళ్ళు చాలు!దళిత అనుకూల ప్రభుత్వం వచ్చాక గూడా అది చెయ్యకుండా మీ కులం పైకి లేవడం జరగదని స్టాంపు పేపరు మీద రాసివ్వడానికయినా నేను సిధ్ధం,జరుగుతుందని రాసివ్వడానికి మీరు సిధ్ధమా?!మీరు కూడా ఆ తెలంగాణా మేధావుల దోరణిలో వుంటే నా మాటలు ఖచ్చితంగా పిట్టకధల లాగానే అనిపిస్తాయి!


చెప్పండి,ఇవికూడా పిట్టకధలేనా?!

Wednesday 14 January 2015

బ్లాగ్మిత్రు లందరికీ సంక్రాంతి శుభాకాక్షలు!

           సంక్రాంతి అంటే చెరుగ్గడలు,భోగిపళ్ళు,గంగిరెద్దులు,గొబ్బెమ్మలు,కోడిపందాలు - అన్నిట్నినీ మించి హుషారు!!వీటిల్లో ఇవ్వాళ చాలామటుకు కనపడకుండా పోయినాయి.కానీ హుషారు మాత్రం అలాగే వుండటం మాత్రం బాగుంది.కోడిపందాల్ని కూడా నిషేదించేసి వుంటే ఆ కాస్త హుషారు కూడా వుండేది కాదు!

         యెక్కడ లేదు హింస!రోజూ తెగే కోళ్ళ సంగతేంటి?బాక్సింగు పోటీలు వుండొచ్చా,గుర్రప్పందాలు వుండొచ్చా,కోడిపందాలు వుండకూడదా?హఠాత్తుగా మనోళ్ళకి ఇప్పుడే భూతదయ గుర్తుకొచ్చిందేంటో?కోడిపందేలు లేని సంక్రాంతి కూడా ఒక సంక్రాంతేనా?కత్తిగట్టని కోడిపందెమూ ఒక కోడిపందెమేనా?మనం కావాలని ట్రయినింగిచ్చి చంపుతున్నామా, రేసుల్లో పరిగెత్తలేని గుర్రాల్ని యజమానులే చంపడం కన్నా ఘోరమైనదేదయినా ఇక్కడ జరుగుతుందా?ఈ కాలానికి ప్రకృతి సిధ్ధంగా వాటిలో వచ్చే మార్పు అది - దాన్ని యెటూ నిషేధించలేం గదా!మిగతా రోజుల్లో అప్పటిదాకా మనం యెదుర్కొన్న గెలుపోటములకి సంబంధించిన వూద్రేకాల్ని బయటికి రప్పించి అంతటితో వొదిలెయ్యటానికి పెట్టిన వినోదం,దాన్ని కూడా భూతద్దం లోంచి చూసి అనవసరమయిన హడావిడి దేనికి!



               చిన్నప్పుడు నేనూ ఆ కోడిపందేల హడావిడి మధ్య పెరిగినవాణ్ణే!నేనూ ఒక పుంజుని పెంచాను.మా పెదనాన్న గారికి బాగా సరదా వుండతంతో వాళ్ళింట్లొనే చాలా కోళ్లని తెప్పించి కట్టేసి వుంచారు యెవరి కిష్తమైన దాన్న్ని వాళ్ళు కొనుక్కోవడానికి వీఎలుగా.వూరకే చూద్దామని వెళ్ళినా అందర్లోకి చిన్నవాణ్ణి గదా అని మొదటి సెలక్షన్ నాకే ఇచ్చారు.అన్నిట్నీ ఒకసారి అలా చూసేసి ఒక పుంజు వైపు వేలు చూపించగానే ఫక్కున నవ్వేస్తూ "బలే సెలక్షనురా నీది,దానికో కన్ను లేదు" అనేశారు!నేను "అది నాకెలా తెలుస్తుంది,కన్ను లేనిదాన్ని ఇక్కడెందుకుంచారు మరి" అని నసిగేసి ఇంకోదాన్ని యెన్నుకోబఓయేసరికి మళ్ళీ వాళ్ళే గుడ్డిదే అయినా ఇది కూడా పందేలు గెల్చిందే లెమ్మని సర్దేశారు.అప్పట్నించీ ఇక దాన్ని మేపడం అనే సరదా పని మొదలయింది.కొంతమంది సీరియస్ పందెగాళ్ళు భీభత్సమయిన మేతల్ని కూడా వేస్తారు.యమగోల గుర్తుందిగా!మా నాన్నగారికి అసలు ఆ పందేలంటేనే ఇష్తముండకపోవటం అది గుడ్డిదని తెలియటం - అటువైపు నుంచి యెంకరేజిమెంటు లేదు.కానీ దాన్ని కట్టెయ్యటానికి తాదు మాత్రం సంపాదించా స్పెషలైనది.దాని రకం  "కెక్క్కిరాయి", కన్ను లేదు గాబట్టి మానోట్లో పడి "గుడ్డి కెక్కిరాయి" అయింది.మొత్తం జాతులైతే చాలా వున్నాయి - "పూలా","నెమిలి","డేగ","కాకిడేగ" అని!

               అసలు పందెం జరిగింది మా నాయనమ్మ గారి పేరు మీదున్న మా మామిడి తోటలొనే.నాలుగు చెట్ల మధ్యన చాలా ఖాళీ వుంటుంది కదా,అక్కడ మాంచి జబర్దస్తుగా దడి కట్టారు నాలుగు వైపులా దార్లు వొద్లి.అన్ని కోళ్ళనీ ఒకే వైపు నుంచి దించరు - కోళ్ళ జంటని బట్టి దిక్కుని మారుస్తారు.యెన్ని వొళ్ళ వాళ్ళు చేరినా ఆటోమాటిగ్గా రెండు పక్షాలుగా విడిపోతారు.మొదటి కోడిని యెవరు దించాలి,ఆ కోడికి దీటుగా లెక్క ప్రకారం యే జాతిని దించాలి అనే ప్రతి దానికీ లెక్కలుంటాయి.నాకు అన్నయ్య వరస అయ్యే పెద్దమనిషికి అన్ని వూళ్లలోనూ అందరూ మధ్యవర్తిగా వొప్పుకునేటంత నాలెడ్జి వుంది కుక్కుటశాస్త్రంలో!పెద్దమనుషులు కూర్చోవడానికి చాపలు యేర్పాటు చేశారు,మిగిలిన వాళ్ళు నించోవడమే!అసలు హుషారు పెరిగితే కూర్చోవడమే కష్తం గదా - అందుకే వాళ్ళూ చాపల కోసం పట్టించుకోలేదు.ఆ పై పందేల భాష నాకస్సలు అర్ధం కాలేదు - "కాకిడేగ అయిదెచ్చు,కాకి నెమిలి పదెచ్చు" అనే మాటలు వింతగా వుందటం వాల్ల గుర్తున్నాయి గానీ.మా పనికుర్రాడికీ సరదాగానే వుంది గాబట్టి మా పుంజుని వాడే తీసుకొచ్చాడు!మేమంతా వేరే వూళ్ల నుంచి కూడా వచ్చిన చుట్టపక్కాల జనంతో కలిసి బండిలో వెళ్తే తను సైకిలు మీద అతి జాగ్రత్తగా ఇంకో మనిషిని పట్టుకోమని వెనక కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడు.అతి జాగ్రత్తగా యెందుకంటే పుంజు బెదరకూదదు మూడ్ డిస్టర్బ్ అవ్వకూదదు మరి!

                  ఈ హడావిడి అంతా మధ్యాన్నం వరకూ బాగానే జరిగింది గానీ ఇప్పట్లాగే పర్మిషన్లు లేని యవ్వారం కావడంతో పోలీసులు వొచ్చిపడ్డారు!అప్పటిదాకా కోలాహలంగా వున్న వాతావరణం కాస్తా గందరగోళంగా మారింది.అంతమంది జనం చేరితే చిన్నా చితకా వ్యాపారాలు కూడా వుంటాయిగా - మొత్తం కకావికలై పోయారు.కుర్రాళ్ళం మేము ముళ్ళకంచెల్ని కూడా చెంగున దూకటం ఆశ్చర్యం లేదు గానీ పెద్దవాళ్ళు గూడా మాతోపాటుగా దూకేశారు ముళ్ళకంచెల్ని!ఇంతకీ వడ్లగింజలో బియ్యపు గింజలాగా పట్టుకున్న వాళ్లనీ పోలీసులు యేమీ చెయ్యలేదు.అక్కడ పట్టుబడిన వాళ్ళంతా పెద్ద పెద్ద గండభేరుండాలు గదా ఓ గంట వుంచి డబ్బు కట్టించుకుని వొదిలేశారు.ఈ సందట్లో ముందే ఫలానా కోడి గట్టిది అని తెలియడంతో మంచి కోళ్ళని చంకనెత్తుకు పోయే సీన్లు కూడా జరిగినయ్.మా పని కుర్రాడు యెలర్టుగా వుండి ముందు అటే పోయి దాన్ని చంకనేసుకునాకనే బయట పడ్డాడు గాబట్టి నా పుంజు దక్కింది,తను వెళ్తుండగానే యెవడో తాడు విప్పేస్తున్నాడంట!

                డబ్బు కట్టేటప్పుడే ఒప్పందం కుదుర్చుకున్నారు గాబోలు తర్వాత పోలీసుల భయం లేకుండా జరిగినాయి గానీ నాకు మాత్రం పర్మిషను ఇవ్వలేదు ఇంట్లో!మా పనికుర్రాడే తీసుకెళ్ళి వేశాడు.ఒక కన్ను లేకపోయినా మా "గుడ్డి కెక్కిరాయి" తనకన్నా భారీగా వున్న పుంజునే గెలుకొచ్చేసింది!అప్పట్నించీ చాలా పందేలు గెల్చింది,కొంతమంది వాళ్ళు ఆ నెలరఓజులూ వాళ్ళే పెంచి పందెంలో దించి పందగైపోయాక మళ్ళీ తిరిగి ఇచ్చేసే పధ్ధతి కూడా నడిచింది!దానిమీద కాసిన పందేలతో చాలా మందికి వుపయోగపడింది.కానీ మొదటి పందెం రోజున మాత్రం మా ఇంట్లోనే చనువుగా తిరిగే ఒకతను "దాని మీద పందెం కాయొద్దు,దానికో కన్ను లేదు,మా చిన్నబాబు సరదా పడుతున్నాదని దించాం" అని చెప్పి ఆపితే అది కాస్తా గెల్చాక యమతిట్లు తిట్టారంట.

                   నేను కొంచెం పెద్దయి వాటికి దూరంగా వుండిపోవటంతో వేరేవాళ్ళకి అమ్మేశారు కూడా.నాకూ దానికీ వున్న విచిత్రమయిన అనుబంధం యేమిటో తెలుసా - అది గెల్చిన పందేలు యేవీ నేను చూడలేదు,నేను చూసిన పందెంలో అది వోడిపోయింది!చాలా కాలం తర్వాత మళ్ళీ కొత్తగా ఒకసారి కోడిపందేలకి వెళ్తే అక్కడ మేయిన్ డేరాలో కాకుండా బయట వేసే పక్క పందేల్లో వొదిలారు.అనుకోకుండా వేళ్ళి నేనూ మా పనికుర్రాడూ ఇద్దరం గుర్తు పట్టాం.నేను చూడ్డం వల్లనే అది ఓడిందా,అది గెల్చుకొచ్చిన పుంజుల్లాగే ఇవ్వళ్టితో దీని బతుకూ ముగిసిపోతుంది గదా అని కొంచెం సేపు మనసు పీకింది గానీ అప్పటికే అది ముసలిదయింది గదా యెంతకాలం పోట్లాడగలుగుతుంది లెమ్మని సరిపెట్టుకున్నా!

         మాకోడి నాకు చాలా జీబితసత్యాల్ని చెప్పింది.మనుషుల్లో అయినా అంతే గదా,సినిమా ఫీల్డులో,రాజకీయాల్లో,క్రీడల్లో,వ్యాపారంలో - యెక్కడయినా గెల్చినంత వరకే నెత్తిన పెట్టుకుంటారు, ఓడిపోయిన వాణ్ణి వేష్టు క్యాందిడేటు కింద పక్కకి పెట్టేస్తారు!గెల్చామా ఓడామా అన్నది కాదు కొశ్చెను ఫీల్డులో నిలబడ్డామా లేదా అనేది పాయింటు!చేస్తున్నది కరెక్టా కాదా అన్నది తేల్చుకుని కరెక్టనిపిస్తే ఆ "పందెంకోడి" లాగే చావుకైనా తెగించి పోరాడు!


అదే సంక్రాంతి స్పూర్తి!!

Tuesday 13 January 2015

ఇదండీ కమ్యునిజం చరిత్ర!

          ఈ మధ్యనే కమ్యునిష్టు పార్టీలో కాస్త నోరున్న ఒక ముగ్గుబుట్ట ముసిల్ది బోరు కొట్టి "ఇదండీ భారతం" అని హిందూత్వాన్ని వెక్కిరిస్తూ ఒక పుస్తకం రాసిందంట - యెవడు కొంటాట్ట!"బలే మంచి చౌకబేరము" అని యెగురుకుంటూ కొనుక్కెళ్తారనో యేమో జేవలం వంద రూపయలేనట పుస్తకం ఖరీదు?మరి "ధర తక్కువ బంగారానికి" అని నవ్వుకుంటూ కొనకుండా వెళ్ళిపోతేనో!లోయరు క్లాసు వాళ్ళు కూడా యేదైనా హోటల్లో వుండాలనుకుంటే డీలక్సు రూము లడిగే రోజుల్లో ఈ చీపు ట్రిక్కు నిజంగా పనిచేస్తుందా?భారతం చదివి అర్ధం చేసుకోగలిగిన హిందువుకి "ఇదండీ భారతం" అని ఈవిడ చెప్తే తప్ప తెలియదా?కాకపోతే అటూ ఇటూ వూగిసలాడేవాళ్ళు, సరే అంత నమ్మబుధ్ధయ్యేటట్టు చెప్తుంది గదా అనే లాజికల్ అమాయకత్వం వున్నవాళ్ళు నమ్ముతారేమో?అదీ యెంత కాలం!అసలు తను తన సిధ్ధాంతం గురించి మా కమ్యునిజంలో వున్న మంచి ఇది అని చెప్పి జనాలని మెప్పిస్తూ పాజిటివ్ ప్రచారం చేసుకోవాలి గానీ వాళ్లలోనూ వీళ్ళలోనూ తప్పులు పట్టే నెగిటివ్ ప్రచారం దేనికి? అంతగా కావాలనుకుంటే మన ముసలాళ్ళు కృష్ణా రామా అనుకున్నట్ట్టు - మరీ దురద పుడీతే మార్క్సు సహస్ర నామావళి.లెనిన్ అష్టోతరం,యెంగెల్సు దీక్షలతో కాలం గదపక భారతం మీదకి వెళ్ళిందేమిటో ఈ వయస్సులో?అదీ వీళ్ళ యాభయ్యేళ్ళ నిర్వాకం వల్లా తమ అతి మంచితనం వల్లా జరిగిన నష్టమేమిటో తెలిసి హిందువులు కళ్ళు తెరిచాక ఇప్పుడు అసలు ఆ పుస్తకం యెంత మంది కొంటారో గూడా తెలియదు.ఒక సంవత్సరం తర్వాత ఆ పుస్తకం "వేణువు" బ్లాగులో పాత పోష్టులో వార్తగా తప్ప ఇంకెక్కడా కనపడదు,పాపం యెంత కష్టపడి రాసిందో?!

          నేనయితే అస్సలు కొనను,చదవను,పట్టించుకోను - విషవృక్షం కొన్ని పార్టులు అదీ నాస్తికుడిగా వున్నప్పుడే అసహ్యించుకున్నాను.అసలు ఇట్టా రామాయణాన్ని విమర్సిస్తూ ఒక పుస్తకం రాస్తున్నానని చెప్తే ఈ శీలమూ లైంగిక స్వచ్చతా లాంటి వాటికి దూరంగా వున్న శ్రీశ్రీయే అనవసరంగా రామాయణాన్నెందుకు కెలకడం అన్నా వినలేదట!ఇప్పటి దాకా నేహ్రూ మార్కు సెక్యులరిజాన్ని పైన చెప్పిన కమ్యునిష్టోళ్లతో సహా ముల్లాలు చెప్పింది చచ్చినట్టు వినే సాయిబులు పట్టించుకోకపోయినా పోనీలెమ్మని హిందువులే ఆ పుచ్చొంకాయ్ సెక్యులరిజానికి కూసింత విలువిచ్చారు!ఇన్నాళ్ళూ ఆ సెక్యులరిజం ఇట్టా ఆన్నా బతికి వుందంటే హిందువుల పుణ్యమే!కానీ తిరిగే కాలూ తిట్టే నోరూ వూరుకోవుగా?!

          తను రాసిన పుస్తకం మనం చదివే బదులు తను "ఇదండీ భారతం" అని రాసినట్టు మనం "ఇదండీ కమ్యునిజం" అని నీవు నేర్పిన విద్యయే నీరజాక్షీ అంటే యెష్లా వుంచుంది?మనము కూడా మార్క్సిష్టు సిధ్ధాంతాన్ని హిందూ ధర్మం ప్రకారం విమర్శించి వెక్కిరించ వచ్చునా?చూద్దాం, మన సత్తా యేంటో చూపిద్దాం!చిన్నప్పుడు మాఫ్రెండు వాళ్ళింట్లో క్రీస్టియన్లు బైబులు పుస్తకాల్ని ఫ్రీగా పంచిపెట్టేటట్టు రాదుగ వాళ్ళు  ప్రచురించి వొదిలినటువంటి "గతి తార్కిక భౌతిక వాదం","లెనిన్ కావ్యం","నీలం నోటు బుక్కు" లాంటి ధర తక్కువ బంగారాల్ని చాలా కక్కుర్తిగా చదివాను.ఇప్పటికీ చాలా భాగాలు గట్టిగానే గుర్తున్నాయి.అన్నట్టు "మార్కుసు మతం మానవాళికి మత్తుమందన్నాడు" - కాబట్టి మతాన్ని ఈ భూమ్మీద నించి తరిమెయ్యనిదే జనం బాగుపడరు(మన్లో మన మాట ఒక్క హిందూ మతం మీదనే వీళ్ళ యేడుపుగొట్టు వులిపికట్టె దాడి అంతా? మిగతా మతాల్ని గురించి చాలా ప్రేమగా మాట్లాదతారు!) అని వీరంగాలు వేస్తున్నారే ఆ కొటేషను ఫుల్లుగా చదివా!

          మార్క్సు మొత్తంగా అన్న మాటలివి,"మతం అణగారిన ప్రజల నిట్టూర్పు.ఈ నిర్దాక్షిణ్య ప్రపంచానికి అది హృదయం.ఆత్మలేని ప్రపంచంలో అది ఆత్మ.ప్రజల పాలిటి అది మత్తుమందు." ఇందులో మతం యెందువల్ల మనిషికి అనుసరణీయమవుతున్నదో తెలిసిన మనిషికి వుండే సహృదయత వుందే తప్ప మతాన్ని ఈ ప్రపంచం నుంచి తుదిచిపెట్టేదామనే వెర్ర్రి ఆవేశం వుందా!చాలా కాలం నుంచీ చివరి వాక్యాన్ని మాత్రమే జనానికి చెప్తున్న వాళ్ళు మొత్తం కొటేషను యే అర్ధాన్నిస్తున్నదో తెలియకే అట్లా చేశారా?కాదు, అందులో కమ్యునిష్తుల్లో వున్న నాస్తికులు ప్రపంచాన్నంతా గానీ కుదరకపోతే పార్టీ సభ్యుల్నయినా గానీ తమలాగే తయారు చేసి చూసుకోవాలనే దుగ్ధతో చేశారు!విప్లవాన్ని రహస్యకుట్రల్తో విజయవంతం చెయ్యాలనే వాళ్ళ దురాశే వాళ్ళని ఈ భూమ్మీద నుంచి ఖాళీ చెయ్యబోతున్నది.యేవరి ఖర్మ కెవరు బాధ్యులు?!

          అసలు మతాన్ని గుడ్డిగా నమ్ముతున్న జనాన్ని మతం నుంచి దూరంగా నడిపించాలంటే యేమి చెయ్యాలి?మార్క్సు గారి కొటేషను మొత్తం సరిగ్గా అర్ధమయితే వాళ్ళ మీద అనుకంప చూపించాలి.తమ ప్రాబల్యం లేని చోట వున్నాం గాబట్టి సున్నితంగానే చెప్పి నయగారంగా వొప్పించాలి,క్రీస్తియన్లని చూడండి, తిట్టినా సరే వుడుక్కోరు - మా యేసు క్షమించమన్నాడు అనే పాయింటు మీద గట్టిగా నిలబడి మన్ని క్షమించేస్తారు? అదే వాళ్ళకి ప్లస్ పాయింటు!అదే కమ్యునిష్టులు - ముఖ్యంగా ఈ మురంనా లాంటివాళ్ళు రివర్సు గేర్లో వెళ్ళి మీరు వెధవలు,దద్దమ్మలు,మీకేమీ తెలీదు అనే టైపులో రెచ్చిపోతే ఇలాగే యెదురు తంతుంది రిజల్టు!సముద్రంలో కాకిరెట్ట లాగా అక్కడో వోటూ ఇక్కడో వోటుతో దేశమంతటా వుండి కూడా ఆ కాంగ్రెసు లాంటి బూర్జువా పార్టీని అంటకాగుతూ తుమ్మితే వూడే ముక్కు పరిస్థితిలో యెలాగో ఒకలా నెట్టుకొస్తుంటే ఈ రాంగు టైములో ఆ పుస్తకం రాసి పబ్లిష్ చెయ్యడం దేనికి - మూలిగే నక్కమీద తాటిపండు వేసినట్టు!


          ఇవ్వాళ దేశంలో వీస్తున్న మోదీ హవా కాకతాళీయమూ కాదు పాలపొంగూ కాదు!"వేలాది మందిలో ఒక్క రుద్యమింతురు,వుద్యమించిన వేలాదిమందిలో ఒక్కడు శ్రధ్ధాళు వగును,వేలాదిమంది శ్రధ్ధాళువులలో ఒక్కనికి జ్ఞానం వికసించును,అట్ట్టి వేలాది మంది జ్ఞానులలో ఒక్కడు నన్ను చూడగలడు" అనే పధ్ధతిలో యేర్పడిన పిరమిడ్ అది - శిఖరాన కనబడే మోదీ కేవలం ఆ ఆవేశానికి మూర్తిమత్వం మాత్రమే. యాభయ్యేళ్ళుగా నెహ్రూ మార్కు సెక్యులరిజం ఈ మాత్రమయినా బతికి బట్ట గట్టిందంటే అది హిందువులు ఆచరించడం వల్లనే అని తెలుసుకోకుండా వాళ్లనే మతతత్వవాదులు అనే పేరుతో మళ్ళీ మళ్ళీ చీకాకు పరుస్తుంటే ఇంత కాలానికి సహనం నశించి హిందువుల్లో వుదారులైన వాళ్ళు కూడా మోదీని సమర్ధించడం తమ నిర్వాకం వల్లనే నని వాళ్ళెప్పటికీ తెలుసుకోలేరు!యెందుకంటే దశాబ్దాని కొకసారి "చారిత్రక తప్పిదాల క్షమాపణ తీర్మానాల"తో కాలక్షేపమూ పుస్తకావిషరణ మీటింగులూ ఇక ముందు పనిచెయ్యకపోవచ్చు, ఒకేసారి యెలిజీలు సిధ్ధం చేసుకోవాల్సిన సమయం వచ్చింది?

          మోదీ హవానే కాదు భాజపా వుత్ధానాన్ని కూడా యెవ్వరూ తక్కువ అంచనా వెయ్యడానికి వీల్లేదు.విశ్వ హిందూ పరిషత్ ద్వారా గానీ ఆర్.యెస్.యెస్. కార్యకర్తల ద్వారా గానీ,భజరంగ్ దళ్ ద్వారా గానీ లేక అన్నిటితో క్షేత్రస్థాయిలో గాలి తమ కనుకూలంగా వుందనే విషయం గట్టిగా తెలిశాకనే "కమలమే సకలం కావాలి" అనే మాట అంత ధీమాగా చెప్తూ వుండీ వుండవచ్చు!ఇదంతా కాంగెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ పెద్ద పుడింగిల్లాగా తమ కంటే ఈ దేశప్రజల గురించి మరెవరికీ తెలియదనే కన్నూ మిన్నూ గానని అహంతో చెలరేగిపోవదం వల్ల హిందువులకి కాలగూడని చోట కాలిపోవడం వల్ల జరిగింది?!అటు చూస్తే వీళ్ళు నెత్తిన పెట్టుకు వూరేగిన సూడోసెక్యులరిజము యొక్క అసలు స్వరూపం ముస్లిములలో సంసారపక్షంగా వుంటూ సుఖంగా బతకాలనుకున్న వాళ్ళందరికీ కుంకుడు కాయ రసం లాగా కళ్ళు తెరిపించింది.ఒకసారి కళ్ళు తెరిచిన వాళ్ళు మళ్ళీ కళ్ళు మూస్తే అది వాళ్ళ ఖర్మ గానీ ఇప్పట్లో ఆ పరిస్థితి రాదనే అనిపిస్తుంది!వాళ్ళకీ బాగా కాలిందనేది యే మోదీని యెక్కడయితే గోద్రా అల్లర్ల పేరుతో చిల్లర వేషాలు వేసి దెబ్బ తీద్దామనుకున్నారో అక్కడే ముస్లిములు కూడా మోదీనే గెలిపించినప్పుడే తెలుసుకుని జాగ్రత్త పడివుంటే గుడ్డిలోమెల్లగానన్నా వుండేది కాంగ్రెసు పరిస్థితి.

          1818 మే 5న పుట్టి 1883 మార్చి 14న గిట్టిన కార్ల్ మార్క్స్ అనే పేరు గల ఈ జర్మన్ మేధావి రాసిన రెండు పుస్తకాలు -  1848లొ రాసిన కమ్యునిష్టు మానిఫెస్టో,1867లో మొదలు పెట్టి 1894లో పూర్తి చేసిన బృహద్గ్రంధం దాస్ క్యాపిటల్ -  ప్రపంచంలో వున్న ప్రతి మేధావీ తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన ఒక విప్లవాత్మమైన సిధ్ధాంతాన్ని పరిచయం చేశాయి.నేను మొదట్లో "మార్క్సిస్ట్ యెకానమీ" అనే మాటని చూసి తను ఒక కొత్త ఆర్ధికశాస్త్రాన్ని రాశాడని అనుకున్నాను,కానీ స్మిత్సోనియన్ ఆర్ధిక విధానాలని వొప్పుకుంటూనే అందులో వున్న లోపాల్ని సరిచేయ్యడానికి కొన్ని సూత్రీకరణలు మాత్రమే చేశాడు!ఆర్ధికశాస్త్రానికి సంబంధించి ఇతను కొత్తగా కనిపెట్టిన విషయం "అదనపు విలువ" మాత్రమే.ఆర్ధికాంశాలలో అదనపు విలువ అనేది కార్మికుల శ్రమతోనే సాధ్యం గాబట్టి అది కార్మికులకే చెందాలని ఇతడి వాదన.ఇతని అసలైన ప్రతిభ చరిత్రని వ్యాఖ్యానించడం.యేది చరిత్ర గమనాన్ని నిర్దేశిస్తుంది?సామ్రాజ్యాల వుత్ధాన పతనాలకి కారణ మేమిటి?అవి హఠాత్తుగా జరిగినవా లేక వాటి వెనుక యేదయినా చైన్ రియాక్షను లాంటిది యేదయినా వుందా?ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యే వారికి ఇతని విశ్లేషణలు కొత్తదారులు చూపించాయి.ఆర్ధికశాస్త్ర విశ్లేషణ అంతా స్మిత్సోనియన్ భావజాలానికి భిన్నంగా లేదు గాబట్టి మనం వుపేక్షించవచ్చు గానీ చరిత్రని అర్ధం చేసుకోవడానికి ఇతను ఇచ్చిన పనిముట్లు మాత్రం ఇప్పటికీ నిక్కచ్చిగానే వున్నాయి!

          ఇక్కడ ఒక విశేషం వుంది! యే హెగేలియన్ భావవాదాన్ని తిరగేసి మార్క్సు చారిత్రక భౌతిక వాదాన్ని  నిర్వచించాడో ఆ భావజాలాన్ని పోలిన సాంఖ్యవాదం హెగెల్ కన్నా చాలా ముందే భారత దేశపు తాత్విక చింతనలో ప్రముఖ స్థానంలో వుంది!హెగెలియన్ భావవాదం లోనూ సాంఖ్యవాదం లోనూ చాలా దగ్గిర పోలికలు వున్నాయి.హెగెల్ చరిత్రలో వచ్చే దశల్ని మూడు అంశాలతో వర్ణించాడు - మొదట ఒక థీసిస్ వుంటుంది,ప్రతి థీసిస్ కీ  కాలక్రమంలో ఆంటిథీసిస్ యేర్పడి ఈ రెంటి సంఘర్షణ వల్ల ఒక సింథీసిస్ యేర్పడుతుంది.ఈ సింథీసిస్ అనుకోకుండా మళ్ళీ థీసిస్ గా మారుతుంది.సరిగ్గా ఇలాంటి పోలికనే గుర్తు చేస్తూ మొదట ఈ ప్రపంచగమనం ప్రకృతి పురుషుల మధ్య జరిగే సంయోగం వల్ల జరుగుతుందనే నిరీశ్వర సాంఖ్యం భారత దేశంలో వచ్చింది.అక్కడ మార్క్సు భావవాదం పునాదితో వున్న దాన్ని తిరగేసి భౌతికవాదానికి మళ్ళిస్తే ఇక్కడ నిరీశ్వర సాంఖ్యంలోని పురుషుణ్ణి కాస్తా పరమ పురుషుడు అని తిప్పేసి సేశ్వర సాంఖ్యంగా మార్చారు!

          తీరా చూస్తే ప్రపంచ చరిత్రలో ఇదివరకే జరిగిన విషయాల్ని యెందుకు జరిగాయో చెప్పడం వరకూ బాగానే వుంది కానీ అత్యుత్సాహంతో కొన్ని ప్రిడిక్షన్స్ కూడా చేశాడు - మొట్టమొదట కమ్యూనిజం అమేరికా లాంటి పారిశ్రామికంగా వ్యాపారపరంగా యెదిగి తను దోపిడీ అని నిర్వచించిన వ్యవహారం దిట్టంగా నడుస్తున్న చోట వచ్చే అవకాశం వందన్నాడు.రష్యా లాంటి పారిశ్రామికంగా వెనకబడీనవి అంటే దోపిడీ అనేది ప్రజలకి అనుభవంలోకి రాని దేశాల్లో వచ్చే అవకాశం లేదన్నాడు.తను రాదు అని చెప్పిన చోట రానూ వచ్చింది కరిమింగిన వెలగపండు మాదిరి పోనూ పోయింది!తను వస్తుంది అని చెప్పిన చోట ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు కూడా కనపడటం లేదు?పైగా నిన్నటి రోజున చార్లీ చాప్లిన్ అనే హాస్యగాడు పొరపాటున "కామ్రేడ్" అనే మాటని వాడినందుకు నానా యాగీ చేసి అమరికా నుంచి గెంటేస్తే స్విట్జర్లాండులో బతకాల్సి వచ్చింది!వారు అశాస్త్రీయమైనవి అని వెక్కిరించే నోస్త్రదామస్ జోస్యాలూ బ్రహ్మంగారి కాలజ్ఞానాలూ కూడా నిజమవుతూ పూర్తి శాస్త్రీయమైన మార్క్సు గారి ప్రిడిక్షన్లు యెందుకు అబధ్ధాలైనాయి?

          అసలు సిధ్ధాంతం లోని మొట్టమొదటి మెలిక మానవుడు వస్తుగత వాది కాబట్టి తన ప్రయోజనాన్నే ఆశిస్తాడు అనేది ఒప్పుకుని స్మిత్తు గారి ఆర్ధిక శాస్త్రాన్ని కూడా కాదనకుండా వొప్పేసుకుని కూడా దానికి విరుధ్ధమయిన వర్గరహిత సమాజాన్ని సాధించడం కోసం "స్వంత ఆస్తి రద్దు" అనేదాన్ని ప్రతిపాదించటం!వస్తుగత వాది అయిన మనిషి ఆ స్వంత ఆస్తి రద్దుకి తనంతట తను వొప్పుకోడు,వొదులుకున్న దానికి అధికంగా ప్రయోజనం వుంటుందంటేనే తప్ప అరిచి గింజుకున్నా వొప్పుకోడు.దానికి విరుగుడుగానే "సాయుధ పోరాటం" అనేదాన్ని ప్రతిపాదించాడు?దాని ఫలితమే మీరు ఇక్కడ చూస్తున్న చార్టు!



          ఒక్కొక్క నెత్తురు బొట్టూ ఆ పెద్దమనిషి పాదాల కింద పడి నలిగి చచ్చిన మిలియన్ మందికి సమానం!ఇప్పటి వరకూ మనం హిట్లరే మహా క్రూరుడు అనే భ్రమలో వున్నాం.ఇవన్నీ కమ్యునిష్టులు కూడా కాదనలేని ఖచ్చితమైన లెక్కలు!ఆ వర్గ రహిత సమాజ స్రష్టలు చంపింది యుధ్ధాలు చేసి విదేశీయుల్ని కాదు స్వదేశీయుల్నే అని అర్ధం చేసుకుంటే వారు చెప్పే భవిష్యదుజ్వల సువర్లోకం యెలా వుంటుందో ఇక్కడ దానికోసం ఆశపడుతున్నవారు తెలుసుకోగలుతారు!వారంతా పెట్టుబడి దారులూ సమసమాజాన్ని వ్యతిరేకించిన ద్రోహులు అని అంటే అనవచ్చు గాక అక్కడ అంతమంది చావడానికి కూడా సిధ్ధపడి వ్యతిరేకించిన వ్యవస్థని ఇక్కడ మనం ఆహ్వానించడంలో అర్ధమేమయినా వుందా?కొందరు శాడిష్టులు మేం పుణ్యాత్ములం, "మా నాన్న చచ్చే వాడిగా కాకుండా చంపేవాడుగా వుండాలని నాకీ పేరు పెట్టాడు" అని టెక్కు చూపించి చచ్చేవాళ్ళలో వుండము గదా అని సంబరపడి సమర్ధించవచ్చు!కానీ భీభత్సం మొదలయిన తర్వాత ఆ గ్యారెంటీ వుండదు.స్టాలిను గారి విజృంభణకి జడిసి దేశం వొదిలిపోయిన ట్రాట్స్కీ గారు కూడా మొదట్లో ఆయనకి అనుంగు సహచరుడే - అతను అధ్యక్ష పదవికి యెదగడానికి సహాయ పడ్డవాడే?

          స్మిత్తుగారి లాగానే మానవుడు వస్తుగత వాది అని తను కూడా వొప్పుకున్నాడు.అయితే, ఆ స్మిత్తుగారి ఆర్ధిక సూత్రాలు చలనంలో "అదనపు విలువ"ని పుట్టిస్తున్నాయని కనుక్కున్నాడు - అంతవరకూ బాగానే వుంది!కానీ దాన్ని పరిహరించే కొత్త ఆర్ధిక శాస్త్రాన్ని రచించలేదు?పైగా ఈ అదనపు విలువ కార్మికుడు రంగప్రవేశం చేసాకనే వొచ్చింది గాబట్టి దీనిమీద సర్వహక్కులూ కార్మికులవే అని తీర్మానించాడు.ఈ అదనపు విలువని శ్రామికులకి మాత్రమే దఖలు పర్చే "శ్రామిక వర్గ నియంతృత్వం" అనే మరో జీడిపాకాన్ని మొదటి సూత్రం నుంచి లాగాడు.వస్తుగత వాది అయిన పెట్టుబడిదారు నయానా భాయానా లొంగి తనంతట తను ఈ అదనపు విలువని కార్మికులకి ఇవ్వడు గాబట్టి "సాయుధ పోరాటం" ద్వారానే ప్రపంచ కార్మికు లంతా యేకమై సాధించాలని నువ్వులద్ది మనం చిన్నప్పుడు ఇష్టంగా తిన్న పాకంజీడి లాంటి ఒక ఆకర్షణీయమైన వంటకాన్ని తయారు చేశాడు.ఈ వంకం తింటే యేమొస్తుంది అనేదానికి అందరు వంటవాళ్ళ లాగే "వర్గ రహిత సమాజం" అని దాని గురించి చవులూరించేలా యెన్నో పిట్టకధలు చెప్పాడు.

          వెక్కిరింతగా అనలేదు నేను పిట్టకధలని,నిజంగానే వర్గరహిత సమాజం గురించి ఆయనా మిగతా మార్క్సిష్టులూ చెప్పే ప్రతి మాటా మిగతా మతాలకి సంబంధించిన పూజారి వర్గం చెప్పే "స్వర్గం" అనే అందమయిన ప్రాక్కల్పన లాగే వుంటుంది తప్ప శాస్త్రీయమయిన మాట ఒక్కటి లేదు?! పెట్టుబడి శ్రమా రెంటికీ 50-50 ప్రాధాన్యత ఇస్తే కొంత న్యాయంగా వుండేది కానీ పెట్టుబడి నథింగ్ శ్రమే యెవ్విరీథింగ్ అనడం ముఖ్యమయిన లోపం!వర్గరహిత సమాజం యేర్పడినాక రాజ్యం అంతరించి పోతుందనే కంటి తుడుపు వ్యాఖ్యతో శ్రామిక వర్గ నియంతృత్వం నిక్కచ్చిగా అమలవుతూ శాశ్వతంగా కొనసాగే విధంగా రాజ్యం యేమి చేయాలనేది చెప్పకపోవటం అసలైన మూర్ఖత్వం?!వస్తుగత వాది అయిన మనిషిని వర్గరహిత సమాజపు నియమాలకి పట్టి వుంచాల్సిన అవసరం లేదనుకున్నాడా?హెగెల్ చెప్పిన దాన్ని తిరగేసినా యెలా చేసినా మార్క్సిష్టు కార్యాచరణ అంటే గతితార్కికంగా పుట్టుకొచ్చే వైరుధ్యాల్ని మనం కోరుకున్న దిశకి నదిచేలా సమన్వయం చెయ్యడం అయినప్పుడు వర్గ రహిత సమాజంలో కూడా మిత్రవైరుధ్యాల విషయంలో నైనా ఆ అవసరం వుంటుంది కదా?వర్గరహిత సమాజం ఆవిర్భవించెయ్యగానే మానవుడిలోని వస్తుగత వాంఛ హఠాత్తుగా అదృశ్యమైపోతుందా?అసలు ఒక ప్రాంతంలో వర్గరహిత సమాజం ఆవిర్భవించిందని యెలా గుర్తు పట్టాలి?అసలు లక్ష్యాన్ని సరిగా నిర్వచించకుండా పిట్టకధలతో సరిపెట్టేస్తే కొత్తగా ఈ సిధ్ధాంతాన్ని ఆచరించాలనుకునే తెలివైన వాళ్ళకి లక్ష్యం గందరగోళంగా వుండదా!అసలు సిధ్ధాంతంలోనే ఇన్ని గందరగోళాలు వుంటే వాటిని అనుసరించేవాళ్ళు మరింత అయోమయాన్ని సృష్టిస్తున్నారు!సాయుధపోరాటమే శ్రామికవర్గనియంతృత్వానికి వున్న ఒకేఒక్క దారి అని మార్క్సు గారు అంత తెగేసి చెప్పినాక కమునిష్టులు యెన్నికల్లో నిలబడ్డం యెందుకు?నిలబడిరిపో, ఒక బూర్జువా వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ వాడయిన నెహ్ర్రూని "అభివృధ్ధికాముకుడు,శాంతికాముకుడు" అని పొగిడి ఆ పెద్దమనిషి వోట్లకోసం వాడుకున్న కుహనా సెక్యులరిజాన్నే తామూ భుజాన వేసుకోవటం దేనికి?తమకంటూ సొంతంగా సెక్యులరిజం అంటే యెమిటో తేల్చుకోలేని వాళ్ళు ఈ పైలాపచ్చీసు యెన్నికల వ్యవస్థలో వీళ్ళు యెవరినుంచి వోట్లు ఆశిస్తున్నారో వాళ్ళకెవరికీ అర్ధం కాని సిధ్ధాంతాన్ని వూదరగొడుతూ యేమి పీకగలుగుతారు?

          గాంధీ జయంతి రోజున మాంసం తిన్నందుకు లెంపలేసుకున్న కమ్యునిష్టు నాయకులు బౌతిక వాదులా?హవ్వ!ఇంకా నయం గాంధీ జయంతి రోజున యేదయినా గుడి కెళ్ళి గాంధీ గారి పేరున అర్చన చేయించి పూజారి గారిచ్చిన పువ్వుని రొజంతా చేవిలో పెట్టుకు తిరగాలంటే అది కూడా చేసేవాడా!ఇలాంటి కేతిగాళ్ళు శ్రామిక వర్గ నియంతృత్వాన్ని సాధించటం కోసం వర్గపోరాటం చేసి గెలుస్తారంటే నమ్మేవాడిని చూసి నవ్వాలి?!ఒకప్పుడు కమ్యునిష్టులు వస్తున్నారంటే గ్రామదేవతలని వూరేగించినట్టు ప్రభలు కట్టి వూరేగిస్తూ వూళ్ళలోకి తీసుకెళ్ళిన జగజ్జేగీయమానమయిన స్థితి నుంచి బూర్జువా పార్టీల్ని ఆ సీటు మాకొదులు ఈ సీటు మాకొదులు అని దేబిరిస్తూ యెంత  అంటకాగినా తగుమాత్రపు వోట్లని కూడా నిక్కచ్చిగా తెచ్చుకోలేని దుస్థ్తితికి దిగజారడానికి కారణాలు వెతుక్కుంటే నిర్మాణాత్మకంగా యెదగటానికి పనికొస్తుంది గానీ రామాయణాన్నీ మహాభారతాన్నీ తిడీతే యేమొస్తుంది?

          ఈ నాస్తికులంతా యింత గట్టిగా మతాల మీద దాడి చెయ్యాలని చూస్తున్నారు గానీ వీళ్ళు యెదటివాళ్ళని అన్నీ వేదాల్లో వున్నాయిష గాళ్ళు అని వెక్కిరించడం నుంచి ఇన్స్పైర్ అయ్యారో యేమో గానీ కొందరు బుధ్ధిమంతులు అసలు కమ్యునిజంలో కూడా ఒక మతానికి వుండే లక్షణాలన్నీ వున్నాయని ఢంకా బఝాయించి చెప్తున్నారు?దైవం స్థానంలో చరిత్రని చూపించాడు.దోపిడీకి మార్క్స్ ఇచ్చిన నిర్వచనాలన్నీ మతాల్లో పాపకర్మకి ఇచ్చిన నిర్వచనాలతో సరిపోలి వున్నాయి.శ్రామికవర్గనియంతృత్వం అనే సాధనని మోక్షసాధనకి ప్రత్యామ్నాయంగా తీసుకున్నాడు.మనిషి యొక్క అంతిమ గమ్యం విషయంలో మతం స్వర్గాన్నీ భగవంతుణ్ణి చేరడాన్నీ చెప్తే మార్క్సిజం వర్గరహిత సమాజాన్ని గురించి చెప్తుంది.అంటే యేమిటన్నమాట, తొందర్లోనే నేను మొదట్లో చెప్పినట్టు "కొత్తా దేముడండీ కొంగొత్తా దేముడండీ" అనే పధ్ధతికి దిగిపోతే తప్ప రోజురోజుకీ మతానికి ఇంకా గట్టిగా దగ్గిరవుతున్న ఈ కాలం ప్రజలు వీళ్ళని దగ్గిరకి రాబివ్వని కాలం వచ్చింది?!

          తల్లివేరుకి చెదలు పట్టి కొమ్మలన్నీ తెగుళ్ళతో యెండిపోయి అసలు కమ్యునిజమే ఇట్లా అఘోరిస్తుంటే దీని నుంచి సైడుపక్కకి పెరుగుతూ పుట్టిన పిలకల పరిస్థితి ఇంకా గందరగోళంగా వుంది!మార్క్సు "శ్రామికులు" అని చెప్పిన చోటల్లా "మానవుడు" అని రీప్లేస్ చేస్తే మానవవాదం తయారయింది,"స్త్రీలు" అని రీప్లేస్ చేస్తే స్త్రీవాదం అయ్యింది,"దళితులు" అని రీప్లేస్ చేస్తే దళితవాదం అయింది!

          మానవేంద్ర రాయ్ పేరుతో ఇంగ్లీషులో రాయిజం అనీ తెలుగులో మానవవాదం అనీ పిలుచుకునే ఒక పట్టాన కొరుకుడు పడని  రాయిలాంటి సిధ్ధాంతానికి తెలుగు బ్లాగుల్లో ఇన్నయ్య అనే మేధావి మాత్రమే ఆలంబనగా కనబడుతున్నాడు.ఈ మానవేంద్రుడు మొదట్లో మార్క్సు గారితో కొంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఆ శ్రామికవర్గనియంతృత్వం - సాయుధ పోరాటం అనేవాటికి కాస్త దడుచుకునో యేమో మార్క్సు గారి సిధ్ధాంతాన్ని 45 డిగ్రీలు పక్కకి తిప్పేసి "నేను శ్రామికుడి బదులు మానవుణ్ణి కేంద్రంగా నిలబెడుతున్నాను,అయితే నేను కూడా సమసమాజాన్నే ఆశిస్తున్నాను, కానీ యే ఫ్రేం వర్కూ వుండకూడదు" అనే హడావిడి మొదలెట్టాడు!నాకు సహజంగా జ్ఞాపకశక్తి యెక్కువ,యేళ్ళ క్రితం చదిబినవి కూడా గుర్తుంటాయి!కానీ ఈ పెద్దమనిషి రాసిన "ఒక పిల్లి ఆత్మకధ" ఈ మధ్యనే చదివినా మొదలూ చివరా తప్ప మిగిలిందంతా మర్చిపోయాను?మొదలవడం అద్భుతమయిన వ్యంగ్యంతో మొదలయింది గాబట్టి గుర్తుంది.ముగింపు గొప్ప తాత్విక చింతనతో వుంది కాబట్టి అదీ గుర్తుంది.కానీ మధ్యలో ఆ పిల్లి గారి బాధేమిటో ఈ రాయి దేన్ని బద్దలు కొట్టాలనుకుందో మాత్రం నాకర్ధం కాలేదు,అందుకే మర్చిపోయాను! యే ఫ్రేం వర్కూ వుండకూడదంటున్నారు గదా అని మీరు అరాచకవాదులా అని పృశ్నించకండి, చాలా అరాచకంగా రెచ్చిపోతారు.స్వేచ్చ,స్వేచ్చ,స్వేచ్చ - యే నియమ నిబంధనలూ లేని యే ఫ్రేం వర్కుకీ కట్టుబడని స్వేచ్చ కావాలి,అంతే!కాకపోతే వీరికీ కమ్యునిష్టులకీ వున్న సారూప్యం హిందూమతాన్ని విమర్శించటం.హిందూ యోగులు గాలిలో తేలతారంటే నమ్మరు గానీ తమ సిధ్ధాంతమే యే ఆధారమూ లేకుండా గాలిలో తేలుతున్నదని మాత్రం ఒప్పుకోరు.వీరు చేప్పే క్యాపిటలిష్టా  శ్రామికుడా అనేది పట్టించుకోకుండా మానవుణ్ణి కేంద్రంలో నిలబెట్టడం అనే వ్యవహారమూ,యే ఫ్రేం వర్కూ వుపయోగించకుండా సర్వమానవసమానత్వాన్ని సాధించటం అనే తతంగమూ ఒక్క శ్మశానంలోనే సాధ్యపడుతుంది - గరిమనాభి సూత్రం ప్రకారం శవం పాడెకి కేంద్రం లోనే వుండితీరుతుంది కాబట్టీ అన్ని శవాలూ ఒక్కలాగే కాల్తాయి గాబట్టీ?!

          స్త్రీవాదం అనే మరో పిలక తొందర్లోనే మాయమైపోయింది యెందుకనో!అప్పట్లో వొల్గా అనే పేరు చాలా యెక్కువగా వినబడుతూ వుందేది.కానీ ఇవ్వాళ మాత్రం స్త్రీవాదం అనేది బలహీన పడిపోయినట్టే లెఖ్ఖ!ఆడవాళ్ళు సహజంగా మగవాళ్ళ కన్నా తెలివైన వాళ్ళు కావడం వల్లనో యేమో వోల్గా గొంతు వినబడే కాలంలో కూడా ఆడవాళ్లలోనే పెద్ద స్థాయిలో కదలిక పుట్టించలేకపోయింది.సౌజన్యారావుని చూసే వరకూ ప్రోనాచ్చి గా వున్న గిరీశం హఠాత్తుగా యాంటీనాచ్చి అయిపోయినట్టు మిత్రులు శ్రీకాంత్ గారు ఒకప్పుడు ప్రోఫెమినిష్టుగా వుండి ఇప్పుదు యాంటీ ఫెమినిష్టుగా మారిపోయి రఘునందన్ లాంటి వారికోసం గృహహింస చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు తన బ్లాగులో.అటు వెళ్ళి ఇటు వచ్చిన తనలాంటి వారికి తప్ప నాకంతగా తెలియని దాన్ని నేను పరామర్సించలేను గాబట్టి దీన్ని వదిలేస్తున్నాను.

          ఇక దళితవాదం పిలకకి ఇప్పుడున్న పెద్ద గొంతు కంచె ఐలయ్య గారిది!ఈయన గారిది నిజంగా మైరావణ చరిత్రే?ఆఖరికి అన్ని కులాల వాళ్ల కోసం పోరాడే మావోయిష్టు నేతకి కూడా పొరపాట్న "గణపతి" అనే గుప్తనామం పెట్టుకున్నందుకే బ్రాహ్మణీయ ఆధిపత్య సంస్కృతిని అంటగట్టేసిన దళితవాదపు మగ ముప్పాళ రంగనాయకమ్మ!మొదటిసారి నేను ఈయన పేరు ప్రముఖంగా విన్నది పౌలస్త్యబ్రహ్మ ముని మనవడయిన రావణుడు కూడా దళితుడే అని వింత ప్రకటన చేసినప్పుడు!ఈయనే కాదు ఇలా సంచలనం కోసం యేదో ఒకటి మట్లాడే వాళ్లంతా "నైబర్స్ ఎన్వీ వోనర్స్ ప్రైడ్" అని ఝమ్మున సేల్స్ పెంచుకున్న వ్యాపార ప్రకటన నుంచి స్పూర్తి పొందిన వాళ్ళే!అప్పటి నుంచీ ఈయన పేరుతో వచ్చిన వ్యాసాలలో కుదిరిన ప్రతిదీ చదివాను.పైకి దళితవాదం అని పేరు పెట్టుకున్నా అసలు రంగు చూస్తే కులవాదం అని స్పష్టంగా తెలుస్తుంది.ఈ మధ్యనే కులపరమయిన రిజర్వేషన్లని సర్ధుబాటు చెయ్యటం గురించి ఒక రచయిత మాదిగలలో వుండే వుపకులాల గురించి చాలా కొత్త విషయాలు చెప్పి వారికి కూడా న్యాయం జరగాలనే విధంగా వాదించారు.ఈ మొత్తం మేధావుల్లో యెవ్వరూ కులాల మధ్య అసమానతలు తొలగాలని నిజంగా కోరుకోవటం లేదు!మందకృష్ణ మాదిగ మరియూ మాలమహా నాడు నేతలు తమలో తమకున్న అధిపత్యాల్ని వొదులుకోకుండా తమ కులప్రయోజనాల కోసమే పోట్లాడటానికి కూడా బ్రాహ్మణాధిపత్యమే కారణమని వారంతా నిజంగా నమ్ముతున్నారా?ఒకవేళ అదే కారణమైతే ఐలయ్య గారు బ్రాహ్మణులు చెప్పడం వల్ల యేర్పడిన తన కులవారసత్వం పట్ల అంత వ్యామోహం చూపిస్తున్నాడేమిటి?బ్రాహ్మణులు అంత దుర్మార్గంగా యేర్పాటు చేసిన కులవ్యవస్థని ధిక్కరించి పారేసి - తను కులరహితుడిగా నిలబడితే గదా బ్రాహ్మణ్యాన్ని ధిక్కరించినట్టు?!

          మీరిలాంటి మహా ధైర్యమయిన మరియూ గంభీరమయిన కులరాహిత్యాన్ని యే దళితవాది నుంచీ ఆశించలేరు!ఈ అసమానతలన్నీ ఇలాగే వుండి లటక్కన తమ కులం మాత్రం అధికారంలోకి రావాలి అనే గొంతెమ్మ కోరిక తప్ప కనీసం దోపిడీకి గురవుతున్న కులాల నన్నిట్నీ ఐక్యం చేసి ఆ పీడిత కులాల మధ్యనైనా సమానత్వాన్ని సాధించే వుద్దేశమూ లేదు?!యెందుకంటే వారి లక్ష్యం కులరహిత సమాజం కాదు,కేవలం అధికారం ఇప్పుడు అనుభవిస్తున్న కులాల నుంచి తమ కులానికీ తమ మిత్రుల కులాలకీ దఖలు పడటం మాత్రమే వీరు కోరుకుంటున్నది!అందుకోసం వీరు కనుక్కున్న మహత్తరమయిన పరిష్కారం యెన్నికల్లో కేవలం తమ కులపు వాణ్నే గెలిపిస్తూ సంఖ్యాబలాన్ని పెంచుకోవటం!అందుకోసం ఇప్పుడు పైనున్న కులాల వాళ్లలో వున్న మంచివాళ్లకి గూడా అణిచివేతయే ఆనందంగా వున్నదని రుజువు చేసే విషయాలని పరిశోధించి తెలుసుకోవటం తమ కులపు వాళ్లందర్నీ తమ కులంలోని దొంగవెధవలకి గూడా సంతోషంగా వోట్లు వేసేలా సంఘటిత పరచటం లాంటి ఘనకార్యాలు చేస్తూ వుంటారు!?కానీ ఈ మేధావులకి తెలియని బేసిక్ విషయం యేమిటంటే మందబలాన్ని పెంచుకోవాలనే వ్యూహంతో తాము పైకి పంపించే తమ కులంలోని దొంగ వెధవలు ఇప్పుడు పైనున్న కులాల్లోని దొంగవెధవల్తో కలిసిపోవడానికే నూటికి తొంభైతొమ్మిది శాతం ఆస్కార ముందనేది?!వాళ్లకి తెలిసినా మనలాంటి వాళ్ళకి చెవిలో పెట్టడానికి వుపయోగించుకున్నా ఈ స్వైరకల్పనల్ని యెన్నేళ్ళపాటు పోషించినా వాళ్ళు ముందు కెళ్లలేరు.

          అసలు ఈ పిలకలన్నీ మొలిచింది కమ్యునిష్టులు దారి తప్పడం వల్లనే గదా!ఆత్మవిమర్శ చేసుకుని తప్పుల్ని సరిదిద్దుకుని అందర్నీ కలుపుకుని తమ లక్ష్యం కోసం పాజిటీవ్ ప్రయాణం చెయ్యాల్సిన సమయంలో ఈ నిగిటివ్ నిర్వాకం దేనికి?అంతమై పోయే కాలం సమీపించినా ఈ దిక్కుమాలిన పన్లతో కాలం గడిపితే యెవరికి నష్టం?

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...