Thursday 24 October 2019

కల్పవృక్షం కింద కూర్చుని ఏది అనుకుంటే అది జరిగిపోతుంది - నిజమేనా!

భౌతిక ప్రపంచంలో ఏది కావాలన్నా పని చెయ్యాలి.ఇంతవరకే తెలుసుకుంటే కల్పవృక్షం గురించి చెప్పినది అభూత కల్పన అనిపిస్తుంది.తపస్సు చేస్తే కల్పవృక్షత్వం సిద్ధిస్తుంది అనేది అర్ధం కావాలంటే తపస్సు అనే మాటకు అర్ధం తెలియాలి.కల్ప-సంకల్ప-వికల్పాలను నియంత్రించటమే తపస్సు!

మనం రోజూ చేసే పనుల్ని కొంచెం దగ్గరనుంచి గమనించితే మనకు తెలియకుండానే తపస్సు చేస్తూ తపస్సు వల్ల వచ్చే ప్రయోజనాల్ని పొందుతున్నట్టు తెలుస్తుంది.మనకు చీర కావాలి.మన దగ్గిరున్న డబ్బుల్ని చీరను తయారుచేసిన ఇంకొకరికి ఇచ్చి అతని దగ్గిరున్న చీరను తెచ్చుకునే వ్యవహారంలో జరుగుతున్నది ఏమిటి?చీర కావాలి అనేది కల్పం/అవసరం, చీరను కొనడం అనేది సంకల్పం, దానికి మనం డబ్బును ఇవ్వడం వికల్పం - ఇంతకీ చీర అనే పదం,వస్తువు మొదట ఉనికిలోకి ఎలా వచ్చాయి?అనేకమంది వ్యక్తుల సమిష్టి ఉత్పత్తి చీర - ఒక కణం తర్వాత ఒక కణం కలిసి ప్రత్తి అనేది సృష్టిలో ఆవిర్భవించడం,దాని ఉపయోగం తెలిసిన కొందరు ఒక ప్ర్ణాళిక వేసుకుని ప్రత్తి విత్తనాల్ని నాటి ఎరువులు వేసి కోసి అమ్మితే మరికొందరు దారాలు తీసి అల్లి రంగులద్ది మన ముందు ఉంచడం వెనక ఉన్నది అనేక తపశ్శక్తుల కలయిక కాక మరేమిటి?మొదట కొందరు చీర అనేది తయారయ్యాక దేనికి ఉపయోగపడుతుందో వూహించి తయారు చేసి మన ముందు ఉంచి దాని ఉపయోగం గురించి చెప్పాకనే కదా మనకు చీర అవసరం అయ్యింది!

ప్రాచీన భారతీయ ఋషులు చేసినది కూడా ఇదే - ఫలానా ఋషి ఫలానా లక్ష్యం కోసం తపస్సు చేసి దైవకృప చేత దాన్ని సాధించాడు అనటంలోని అర్ధం అతను కళ్ళు మూసుకుని కూర్చున్నాడని కాదు, ఆ లక్ష్యం కోసం తపించి శ్రమించాడు.ఎవరినీ యాచించకుండా మన కోరికల్ని ధర్మబద్ధమైన పద్ధతిలో సాధించాలంటే మనం చేరుకోవలసిన మానసిక స్థితిని సాధించడమే యమ, నియమ, ప్రాణాయామాలతో కూడుకున్న యోగప్రక్రియల ప్రయోజనం!అదే అన్నింటినీ సాధించిపెడుతుందనేది మూఢనమ్మకం మాత్రమే - ఆ రకమైన మానసిక స్థితిలో ఉండి చేసే పనులు సత్వర ఫలితాలను ఇస్తాయి కాబట్టి దుష్కరమైన లక్ష్యాలను పెట్టుకున్నవారు మొదట వాటిని సాధన చేసేవారు.

ఆయుర్వేదం లాంటి విద్యలను లోకానికి అందించిన ఋషులే కాదు హిరణ్యకశిపుడి లాంటివాళ్ళు ఆమరత్వం కోసం చేసిన తపస్సులు కూడా ఇవే కోవలోకి వస్తాయి.అయితే, వాళ్ళు చేసిన అసలు శ్రమ యేమిటో తమ లక్ష్యాలను సాధించటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏమిటో సూక్ష్మమైన వివరాలు తెలియక పోవడం చేత ఆ కృషికి సంబంధంచిన గుర్తింపుని తపస్సుకి అంటగట్టెయ్యడం వల్ల జరిగిన ప్రమాదం అది, అంతే!

ఎవరినీ యాచంచకుండా ఎవరినీ దోచుకోకుండా తను దోపిడీకి గురి కాకుండా బతకాలనే సంకల్పం ఉన్న ప్రతి మానవుడూ ఒక కల్పవృక్షమే!

Saturday 19 October 2019

సేవ్ నల్లమల అని తెలంగాణలో పెడుతున్న 23వ అటామిక్ ప్లాంటుని ఆపెయ్యడం ఎంతవరకు సబబు?

ఇప్పటికి 22 అటామిక్ ప్లాంట్లు ఉంటే తెలంగాణలో పెడుతున్న కొత్త ప్లాంటుకే ఎందుకు వివాదాలు చుట్టుకుంటున్నాయి?
2016 నాటికి దేశంలో 22 atomic reactors పని చేస్తున్నాయి.30,292.91 GWh విద్యుత్తు ఈ అన్ని రియాక్టర్స్ నుంచీ పుడుతున్నది.ప్రపంచ స్థాయిలో చూస్తే సుమారు 400 పైచిలుకు అటామిక్ ప్లాంట్స్ ఏ విధమైన సమస్యలూ లేకుండా నడుస్తున్నాయి.ఒక్క చైనాలోనే 40కి పైన అటామిక్ పాంట్స్ ఉన్నాయి, ఇంకా కొత్త వాటిని స్థాపించటానికి తహతహలాడుతున్నది.చెర్నోబిల్ ప్రమాదం గురించి నేను చదివిన అధికారిక సమాచారం ప్రకారం అక్కడ పని చేస్తున్న వాళ్ళ బయంకరమైన నిర్లక్ష్యం వల్ల సంభవించినదే తప్ప అటామిక్ ప్లాంట్ అంటేనే భయపడాల్సిన  ప్రమాదం కాదు!అక్కడ చెప్పీ చెప్పనట్టు ఉదహరించిన అదనపు వివరాల ప్రకారం బయటివాళ్ళు చేసిన కుట్ర కూడా కావచ్చు.

మన దేశంలో యురేనియం నిల్వలను వెతకడం, తగినంత యురేనియం ఉందనుకున్న చోట ప్లాంట్లను పెట్టడానికి ప్రభుత్వాలకి రికమెండ్ చెయ్యడం,ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాక ప్లాంట్లను నెలకొల్పి నడపటం అన్నీ Department of Atomic Energy అధ్వర్యంలోనే నడుస్తున్నాయి.ఇంతవరకు ఎలాంటి bad reports రాలేదు ఆ సంస్థ పని తీరు మీద.ప్లాంట్లలో పని చేసేవాళ్ళు అందరూ సైంటిస్టులే, కనీసం సైన్సులో బేసిక్స్ కూడా తెలియని వాళ్ళని అలాంటి సంస్థల్లోకి తీసుకోకూడదు కూడా!ప్లాంటు లోపల పని చేస్తూ నిత్యం ఆ యురేనియం శుద్ధిలోనూ న్యూట్రాన్ కొల్లిజనులోనూ పాలు పంచ్గుకుంటున్నవాళ్ళకి రాని రోగాలు ప్లాంటుకు బయట ఉన్నవాళ్ళకి ఎందుకు వస్తున్నాయో నాకయితే అర్ధం కావడం లేదు!అధికారికమైన నివేదికల ప్రకారమే ప్రపంచ స్థాయిలో ధెర్మల్ పవర్ ప్లాంట్లతోనూ అటామిక్ పవర్ ప్లాంట్లతోనూ ఇతరేతర ఎనర్జీ కన్జర్వేషన్ రంగాలతోనూ కలిపి లెక్కిస్తే అటామి పవర్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే ఉద్గారాల శాతం 1% మాత్రమే ఉంటున్నది.

Maharashtra లోని Tarapur Atomic Power Station నుంచి 1,400 MW,  Gujarat లోని Kakrapar Atomic Power నుంచి 440 MW, Tamil Nadu లోని Kudankulam Nuclear Power Plant నుంచి 2,000 MW, Karnataka లోని Kaiga Nuclear Power Plant నుంచి 880 MW, Tamil Nadu లోని Madras Atomic Power Station నుంచి 440 MW, Rajasthan లోని Rajasthan Atomic Power Station నుంచి 1,180 MW, Uttar Pradesh లోని Narora Atomic Power Station నుంచి 440 MW ఉత్పత్తి అవుతుంటే రాని సమస్యలు తెలంగాణలోనూ ఆంధ్రలోనూ ఎందుకు వస్తాయి!

బొగ్గును ఇంధనం కింద వాడితే దానికి అడివిని నరకాలా అక్కర్లేదా?పెట్రోలును తియ్యాలంటే దాన్ని భూమిలోపలినుంచి పైకి తెచ్చి ప్రోసెస్ చెయ్యాలా అక్కర్లేదా?నిజానికి సంప్రదాయకమైన వ్యవసాయం చెయ్యటానికి ఇంధనం అవసరం లేదు.కానీ, ఇవ్వాళ నీటి పారుదల కోసం కరెంటును వాడుతున్నారు.ఈ వ్యవసాయం దానంతటది డబ్బుని సృష్టిస్తుందా?వ్యవసాయం వల్ల తయారైన ప్రతి ఉత్పత్తీ మార్కెట్ దగ్గిర అమ్ముడు పోయాకనే గదా రైతుకు డబ్బు వచ్గ్చేది!డబ్బు అనేది చేతికి రావాలంటే వ్యాపారం వల్లనే సాధ్యం అనే కామన్ సెన్సు కూడా లేకుండా వ్యవసాయం ముద్దు వ్యాపారం వొద్దు అని  పంచ్ డయలాగులు విసిరితే ఎట్లా?ఇప్పుడు వ్యవసాయంలోనూ యంత్రాల్ని వాడుతున్నప్పుడు, ఆ యంత్రాలను నడపటానికి ఇంధనం వాడుతున్నప్పుడు మిగతా అన్నిటిలోనూ లేని ప్రమాదం అటామిక్ ఎనర్జీలో ఎట్లా ఉంటుంది?ఇదివరకు కార్తెల్ని బట్టి పంటలు వేస్తూ ఏడాదికి ఒకే రైతు ఒకే నేలలో మూడు నాలుగు పంటలు వేసి అప్పటికప్పుడు మార్కెట్ చేసుకునే పరిస్థితి ఉండేది.ఇప్పుడు ఒక వ్యవసాయ ఉత్పత్తి చేతికి రావడానికి పట్టే సమయం కన్న సబ్బులూ షేవింగ్ సెట్లూ టూత్ పేస్టులూ తయారై మార్కెట్ ముందు నిలబడి అమ్ముడు పోవడానికి అతి తక్కువ సమయం సరిపోతున్నది.ఇలాంటివి నడవాలంటే కరెంటు కావాలి. కరెంటు కోసం దేశంలో తయారవుతున్న ధెర్మల్, హైడెల్, సోలార్ ఎనర్జీ సరిపోనప్పుడు అటామిక్ ఎనర్జీని కూడా ఉపయోగించుకోవడం తప్పెట్లా అవుతుంది?

సోలార్ ఎనర్జీని వాడి 2000MW పవర్ పుట్టించాలంటే 600 km2 చోటు కావాలి ఆ ప్యానల్స్ పెట్టడానికి.అదీ 24 గంటలూ ఫెళ్ళున కాచే ఎండ ఉంటేనే దాని పెర్ఫార్మెన్స్ బావుంటుంది.ధెర్మల్, హైడెల్ ప్రాజెక్టుల గురించి మీకు తెలియనిది ఏముంది?కాళేశ్వరం గురించి ఎంతోమంది ఎన్నో విధాల విమర్శించారు, కానీ అన్ని ప్రాజెక్టుల్నీ బహుళార్ధకం చెయ్యలేనప్పుడు పవర్ కోసం ఆమాత్రం ఖర్చు చెయ్యక తప్పదు కదా అనిపిస్తుంది.ప్రపంచం మొత్తం మీద ఉన్న అటామిక్ రియాక్టర్లలో కూడా అన్నీ పూర్తిస్థాయిలో పని చేయడం లేదు.పెట్టుబడికీ లాభానికీ మంచి నిష్పత్తి ఉన్నా కూడా atomic energy sector బాలారిష్టాలు దాటని స్థితిలోనే ఉంది.మీరు గుర్తు చేసుకుంటే మానవ మనస్తత్వం కొత్తను చూసి భయపడిన గతకాలపు ఉదంతాల నుంచి ఇప్పటి అణు ఇంధనం గురించిన భయాలకు మూలం దొరుకుతుంది.ఎలెక్ట్రిక్ బల్బు కనిపెట్టినప్పుడూ రేడియో కనిపెట్టినప్పుడూ ఇలాంటి భయాలే ఎదురయ్యాయి, ఇవ్వాళ వెనక్కి తిరిగి చూస్తే అప్పటివాళ్ళు ఎంత పిచ్చివాళ్ళో అనిపిస్తుంది.రైళ్ళు నడిచిన మొదటి రోజుల్లో వాటిల్లో ఏదో దెయ్యం ఉండి నడిపిస్తున్నదని భయపడిన సంఘటనలు చరిత్రలో రికార్డ్ అయివున్నాయి!

ఒక్క అటామిక్ పవర్ ప్లాంటు పెడితే మొత్తం నల్లమల అడవే నాశనమైపోతుందా?

అటామిక్ పవర్ ప్లాంట్ పెట్టడానికీ నడపటానికీ కొన్ని విధి విధానాలు ఉన్నాయి.యురేనియం అనేది మనం వాడుకోకుండా వదిలేస్తే దానంతటది disintigrate అయ్యి సీసం కింద మారిపోతుంది.ప్లాంటులో కొన్ని చోట్ల  వ్యర్ధాలను పారబొయ్యడానికి బావులు తవ్వుతారు. అందులోకి వెళ్ళే యురేనియం చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది - అంటే తడిబట్టను మెలిపెట్టి పిండేటప్పుడు ఇంకా పిండితే బట్ట చిరగడం ఖాయం అని వొదిలేస్తే బట్టకి ఉండే తడి అంత!ప్రజలకి నష్టమో కాదో తేల్చుకోవడానికి ఇంత సమాచారం ఉండగా వీటి గురించిన ప్రస్తావనే లేకండా "సేవ్ నల్లమల!" అంటే చాలు వాళ్ళలో మానవత్వం పరిఢవిల్లిపోతున్నాట్టా?

Fukushima nuclear disater in Japan: ఈ మధ్యనే జపానులో ఒక ప్రమాదం జరిగింది.అయితే, On 5 July 2012, the National Diet of Japan Fukushima Nuclear Accident Independent Investigation Commission (NAIIC) found that the causes of the accident had been foreseeable, and that the plant operator, Tokyo Electric Power Company (TEPCO), had failed to meet basic safety requirements such as risk assessment, preparing for containing collateral damage, and developing evacuation plans. అని తేలడాన్ని బట్టి మనుషుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అర్ధం చేసుకోవాలి.అదే నిర్లక్ష్యం ధెర్మల్, హైడెల్ పవర్ ప్లాంట్లలోనూ కనిపిస్తున్నది కదా!

అటామిక్ ఎనర్జీకి సంబంధించిన భారీతనం కట్టేటప్పుడు మాత్రమే కనిపిస్తుంది.ఒకసారి కట్టి అన్ని ఏర్పాట్లూ పూర్తయిపోయి తయారీ మొదలయ్యాక దాని పని తీరు మిగిలిన అన్ని రకాల ఉత్పత్తుల కన్న మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది.ఉత్పత్తి పెరిగే కొద్దీ ధరను తగ్గించవచ్చు.మరిన్ని పరిశోధనల అనంతరం ఇప్పుడు హానికరం అవుతున్న వ్యర్ధాలని  రీప్రాసెస్ చెయ్యగలిగితే 95% వరకు ప్రమాదాన్ని నివారించవచ్చునని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం భారతదేశంలో తప్ప ఇంకెక్కడా అటామిక్ ఎనర్జీని భూతద్దంలో పెట్టి చూపించి రేడియేషన్ బూచిని చూపించి హడలగొట్టే ఉద్యమాలు నడవటం లేదు!ఇక్కడ ఆ ఉద్యమాలు చేస్తున్నవాళ్ళలో మూడోవంతుమంది మావోయిస్టు ప్రభావం ఉన్నవాళ్ళు, మరో మూడోవంతుమంది అమెరికా తదితర దేశాల తరపున పనిచేసేవాళ్ళు అయితే మిగిలిన మూడోవంతుమంది దేన్ని గురించైనా పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడే ఓపిక లేక "సేవ్!" అని కనబడితే చాలు అదేదో సమాజసేవాకార్యక్రమం అనుకుని వాళ్ళ పక్కన చేరి ఓ సెల్ఫీ తీసుకుని "నేను సైతం, నేను సైతం" అని కారు చవక మంచిపని చేసినట్టు మురిసిపోయే పాప్యులారిటీ ఫోకస్ రింగు పిచ్చోళ్ళు.

యురేనియం నిజంగా అంత హానికరమైనదా!

ధెర్మల్ ఎనర్జీ ప్లాంటుకీ అటామిక్ ప్లాంటుకీ ఉన్న తేడా అల్లా బొగ్గుని మండించి శక్తిని పుట్టించే చోట యురేనియం వాడటం - అయితే 5 టన్నుల బొగ్గుని మండించితే ఎంత శక్తి వస్తుందో, 900 dm3 పెట్రోలియం ఆధారిత ఇంధనాన్ని వాడితే ఎంత శక్తి వస్తుందో, 1100 m3  మీధేన్ తరహా వాయు ఇంధనాన్ని వాడితే ఎంత శక్తి పుడుతుందో కేవలం 10 గ్రాముల యురేనియాన్ని వాడితే అంత శక్తి పుడుతుంది!అన్ని రకాల ఇంధన రూపాల మాదిరే ప్రకృతిలో యురేనియం దాని స్వచ్చ రూపంలో ఉండదు.Pitchblend రూపంలో ఉన్న ఇప్పటి స్థితిలోనే చుట్టూ మొక్కలు మొలిచాయి, అవి మహావృక్షాలయ్యి నల్లమల అడివి తయారై ఉంది.ఎక్కడ ఎంతమేర యురేనియం నిక్షేపాలు వున్నాయో గుర్తించి అక్కడ ఒక ప్లాంటుపెడితే మొత్తం నల్లమల అడివి ధ్వంసం అవుతుందని అంటున్నారంటే వింతగా లేదూ!

నిజానికి ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం లోపభూయిష్టమైనది కావడం కూడా ప్రమాదాలకి ఒక కారణం, డిజైన్లు మార్చటం, పనితీరును మెరుగు పర్చటం, వ్యర్ధాలను తగ్గించటం మీద పరిశోధనలు జరుగుతున్నాయి.అసలు ప్రపంచంలో తొలి అటామిక్ రియాక్టరు మొదలైందే 1957లో, Meghnad Saha లాంటివాళ్ళు1939 నుంచీ దీనిమీద పని చేస్తూ 1957లోనే మనల్ని కూడా అణు ఇంధన దేశంగా మార్చారు.ఇంత సుదీర్ఘమైన కాలం తర్వాత లోటుపాట్లని సవరించుకుని సాంకేతికతని పెంచుకుని ముందుకెళ్ళాలి గానీ "అది నాక్కర్లేదు!ఇది నాకక్కర్లేదు!మొన్న ఎట్లా ఉన్నానో నిన్న ఎట్లా ఉన్నానో ఇవ్వాళా అట్లాగే ఉంటాను రేపూ అట్లాగే ఉంటాను!" అనడం తెలివితక్కువ తనం అవుతుందని బల్లగుద్ది మరీ చెప్తున్నాను యువరానర్!

మీకొకటి తెలుసా!మీరు టీవీ చూస్తున్నప్పుడు ఆ దృశ్యాల్ని రిలే చేసిన ట్రాన్స్మిటింగ్ టవరు నుంచి వెలువడిన తరంగాలు అక్కడి నుంచి మీ ఇంటి వరకు ఉన్న సమస్తాన్నీ ఢీకొంటూ వస్తే గానీ మీరు టీవీ చూడలేరు - అంతే కాదు, టీవీ చూస్తున్న మిమ్మల్ని కూడా అవి ఢీ కొడుతున్నాయి!అంతెందుకు, మనకి అత్యంత అవసరమైన సూర్యకాంతిలోనే పరారుణ, నీలలోహిత కిరణాలు ఉన్నాయి కదా!కొన్ని లక్షల సంవత్సరాల నుంచీ భూమిని తాకుతున్న సూర్యకాంతిలోని పరారుణ నీలలోహిత కిరణాలు చెయ్యలేని చెరుపు ఒక చోట అతి తక్కువ ప్రాంతంలో వెలువడుతున్న అటామిక్ రియాక్టర్లు వాడిపారేసిన పిప్పి చేస్తుందా?అదీ గాక, ఆ రియాక్టర్లలో పని చేసే  వాళ్ళు కూడా మనుషులే, ప్రాణాల మీద తీపి ఉన్నవాళ్ళే కదా!

తెలంగాణలో జరుగుతున్న హడావిడి ఆంధ్రలో జరగడం లేదు కాబట్టో యేమో ఆంధ్రలోని 6,000 MW ఉత్పత్తి కోసం కొవ్వూరు ప్లాంటు నిర్మాణ కార్యక్రమం మాత్రం శరవేగాన దూసుకుపోతున్నది!ఆంధ్రలో కూడా వీచాల్సిన విప్లవ పవనాలు తెలంగాణలో మాత్రమే వీచడాన్ని బట్టి సేవ్ నల్లమల రాజకీయ ప్రేరితమే అని అనుకోవాలి, కదూ!అక్కడ ఎక్కువ హడావిడి చేస్తున్నవాళ్ళు మావోఇస్టులే అని నాకు చూచాయగా అర్ధం అవుతున్నది.ఆంధ్రావాళ్ళు తెలివిగా ఉండి కొవ్వూరు ప్లాంటును రాజకీయం చెయ్యకుండా ఉంటారని ఆశిస్తాను.అది నడిచేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అధ్వర్యంలో కాబట్టి లోకల్ పాలిటిక్సుని అందులోకి యెక్కించి మన రాష్ట్రానికి మనమే హాని చేసుకోవడం దేనికి?ఇప్పటికి నడుస్తున్న గత్తర చాలదా!

ప్రజలూ మేధావులూ నిజాయితీ పరులైన అభివృద్ధి కాముకులూ అవ్వా కావాలి బువ్వా కావాలి అన్నట్టు ఆలోచించకూడదు.ఇంధన రంగం మొత్తాన్నీ సంప్రదాయకమైన బొగ్గూ, నీరూ, వేడీ అనే మూడింటి మీదనే ఆధార పడేటట్టు చేస్తే అవసరాలు పెరిగే కొద్దీ వాటిమీద ఒత్తిడి పెరగడం తప్ప ఏమి ప్రయోజనం?అణు ఇంధనంలో ప్రమాదం ఉన్న మాట నిజమే, కానీ దాన్ని తగ్గించే ఉపాయాలు కూడా ఉన్నాయి.ఇవ్వాళ పిచ్చిబ్లెండులా కనబడుతున్న యురేనియం వాడుకోకపోతే ఎలాగూ disintigrate అయ్యి ఉత్త సీసం మిగులుతుంది.అప్పుడు యేడ్చి యేమి లాభం?


సర్వే జనాః సుఖినో భవంతు!

Monday 14 October 2019

జగన్ అండ్ కో ధైర్యం ఎన్నికలు ఇంకో నాలుగేళ్ళవరకూ రావనా!తెలుగుదేశం తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నిక తెస్తే ఎలా వుంటుంది?కనీసం "23/175" అనే ఇన్సల్ట్ తప్పించుకుని "20/23" తెచ్చుకున్నా మెరుగే కదా!

తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యులకి రెండు నెలల క్రితమే వ్యక్తిగత సలహాని ఇవ్వాలనుకున్నాను.కానీ క్రియాశీల సభ్యులు ఎవరూ పరిచయం లేకపోవటంతో కుదరలేదు.ఎక్కడో దూరంగా చెన్నైలో ఉండి కేవలం పేపర్లలోని వార్తలు చదువుతున్న నాకే తెదెపాని కనుమరుగు చేసే ప్రమాదకరమైన దొంగాట కనిపిస్తుంటే పార్టీ వారు మాత్రం "ఇలాంటివి చాలా చూశాం,మా పార్టీని అంతం చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు!" అని బింకం ప్రదర్శించడం తప్ప వాస్తవాలని చూడడం లేదు.మీ పార్టీని భూస్థాపితం చెయ్యాలనే భాజపా ప్లాను తెలుసు కాబట్టే కేసీయార్ ఈసారి ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం అని కుండబద్దలు కొట్టి చెప్పగలిగాడు - మీరేమో ఎన్నికల తర్వాత కూడా "మరీ ఇరవై మూడేనా!మరీ ఇరవై మూడేనా!ఇదెలా జరిగింది?ఇదెలా జరిగింది?" అని ఆశ్చర్యపోయే అజ్ఞానంలో ఉన్నారు!వైకాపా వాళ్ళు "నువ్వు ఓడిపోవటం ఏంటయ్యా!" పేరుతో క్యామెడీలు చేస్తూ ఉన్నారు.

జగన్ చంద్రబాబు పైన చేసిన ఆరోపణలకి సానుకూలంగా స్పందించకపోవటమూ కొన్నిసార్లు భాజపా స్థానిక నాయకులు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమూ చూసి భాజపా జగన్ ప్రభుత్వంతో విసిగి పోయిందనీ త్వరలోనే జగన్ ప్రభుత్వాన్ని ఏదో చేసేస్తుందనీ ఆ వెంటనే మిమ్మల్ని మళ్ళీ ఆదరించి మిత్రపక్షం చేసుకుని అధికారంలో కూర్చోబెడుతుందనీ మీలో కొందరు భ్రమలో ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది.ఒకవేళ మీరు అంత అమాయకంగా లేకపోతే మంచిదే, కానీ ఆ విధమైన ఆశలతో ఉంటే మాత్రం మీరు ఎప్పటికీ అధికారం చేపట్టలేరు.

భాజపా ఎప్పటికీ తెదెపాని మిత్రపక్షం చేసుకునే అవకాశం లేదు. అప్పుడప్పుడూ విమర్శించడాన్ని మాత్రమే మీరు చూస్తున్నారు.కానీ పోలవరం, అమరావతి పనుల్ని ఆపెయ్యడమూ ఇసుక కొరత సృష్టించడమూ, కరెంటు కోత, ప్రభుత్వ మద్యం విక్రయాలు అన్నీ ఒక క్యాలెండరు వేసుకున్నట్టు పక్కా ప్లానుతో జరుగుతున్నాయనే అనుమానం కూడా మీకు రావడం లేదు, అంత అమాయకత్వం దేనికి?అన్ని అభివృద్ధి పనుల్నీ ఆపేసింది ఆ పనుల వల్ల లబ్ధి పొందేది చంద్రబాబు/తెదెపా అనుకూల వర్గాలు కాబట్టి కాదా?వచ్చే ఎన్నికల నాటికి తెదెపాకి ఆర్ధిక సహాయం చేస్తారని అనుకున్న ప్రతి వాళ్ళనీ వ్యాపార పారిశ్రామిక ఉత్పాదక రంగాల నుంచి వెళ్ళగొట్టి ఆయా రంగాల్లో తమవాళ్ళని మర్రిచెట్లలా పాతడం కళ్ళముందు కనబడుతున్నా మీకు భయం వెయ్యడం లేదా?

మీరు అధికారంలో ఉన్నప్పుడే  "ఈ ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద షూట్ చెయ్యాలి!" అంటే అతని వెంట్రుక కూడా పీకలేని వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి, అదీ ముష్టి 23 సీట్లతో  150+ సీట్లతో అధికారంలో ఉన్నవాణ్ణి తోక కత్తిరిస్తానంటే జనాలకి నవ్వు రాదూ!

ఇప్పుడు భాజపా వేస్తున్న వ్యూహం ఇంతవరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చరిత్రలో ఏ పార్టీ కూడా వెయ్యనిది,మీరేమో లోగడ మీరు చేసిన సాహసాల్ని చూసుకుని మురిసి ముక్కలవుతున్నారు.మొన్నటి ఎన్నికల్లో కూడా మిమ్మల్ని మీరు అతిగా వూహించుకుని దెబ్బ తిన్నారు!"చంద్రబాబు వాళ్ళనీ వీళ్ళనీ కలుపుకోకుండా ఒంటరి పోరు చేసినప్పుడల్లా ఓడిపోయాడు, ఈసారి కూడా అలాగే ఓడిపోతాడు!" అనేది మూఢనమ్మకంలా ఉన్నా సరే నిజం అయిందా లేదా?దానంతటది నిజం అయిందా?లేదు వాళ్ళు ఎంత లాఘవంగా ప్రచారం చేసి దాన్ని జనంలోకి ఎక్కించి నిజం చేశారు!

వాళ్ళేమో మీ పార్టీ గెలుపోటముల చరిత్రని మీకన్నా ఎక్కువ స్టడీ చేసి కనిపించిన ప్రతి లోపాన్నీ ఉపయోగించుకున్నారు, మీరేమో "జగన్ జైలు కెళ్తాడు!" పాటతోనే సరిపెట్టేశారు - ఎంత నిర్లక్ష్యం?ఎన్నికల తర్వాత ఆంధ్రలో జరుగుతున్న పరిపాలన మొత్తం ఆ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహం అని మీకెందుకు తెలియడం లేదు?నేను జరుగుతాయనుకున్న రెండింటిలో ఒకటి నిజం కానున్నదని వార్తలు బయల్దేరాయి.అది పోలవరాన్ని కేంద్రం చేపట్టాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.మీరు 90 శాతం చేసిన దాన్ని తను పూర్తి చేసి ఆ క్రెడిట్ పునాదితో ఆంధ్రని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనుకుంటున్న పార్టీకి మిమ్మల్ని మిత్రపక్షం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి?

భాజపా ఆంధ్రను పట్టుకోవటానికి వేసుకున్న నాలుగంచెల ప్లానులో ప్రత్యేక హోదా ఇవ్వకపోవటమూ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని అమలు చెయ్యకుండా ఏడ్పించటమూ మొదటి అంచె - అది విజయవంతం అయ్యింది కదా, మొన్నటి ఎన్నికల్లో మిమ్మల్ని దించేసింది రెండవ అంచె - మీరు మళ్ళీ గెలుస్తారనే భరోసాతో సీట్లిచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేల హైలెవెల్ కరప్షన్+బ్యాడ్ పెర్ఫార్మెన్స్ వల్ల అది కూడా విజయవంతం అయ్యింది కదా,జగన్ని ఎందుకూ పనికిరానివాణ్ణి చెయ్యటం మూడో అంచె - కేసుల భయం వల్ల జగన్ సహకరించటంతో అది కూడా విజయవంతం అవుతున్నది కదా,ఈ దశ మీకు ఎన్నికల్లో నిలబెట్టటానికి దమ్మున్న క్యాండిడేట్లు మిగలకుండా పోయి ఎన్నికల ఖర్చులు భరించలేని స్థితికి మీ పార్టీ వెళ్ళేవరకూ ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా నడుస్తుంది.ఇప్పుడు మీరు రోజువారీ నిరసనలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు.మీరిప్పుడు రోజుకోసారి ప్రస్తావిస్తున్న పనులు లేక అల్లాడుతున్న కూలీల ఆక్రందనలు జగన్ని ఏమాత్రం భయపెట్టటం లేదు, ఎందుకని?ప్రతి ఎన్న్నికల బూత్ దగ్గిరా ఓటింగ్ అనేది జరిగినట్టు హడావిడి కనిపిస్తే చాలు మొత్తం రాష్ట్ర ప్రజలు మీకే వోటు వేసినా మీరు గెలవటం అసాధ్యం - మొన్న కేసీయార్,మోదీ, జగన్ అంత భారీ మెజార్టీతో గెలిచింది ఈవీయం ట్యాంపరింగ్ ద్వారానే!ఈవీయంలు పెట్టటం కుదరని ప్రతి చోటా కేసీయారుకి ఎదురు తన్నడం మీకు తెలియదా?

మీరు ఆశిస్తున్నట్టు జగన్ని జైలుకి పంపించి మీకు అధికారం వచ్చేలా చెయ్యటానికి భాజపా తెలివితక్కువ పార్టీ కాదు.భాజపా ఫాలో అవుతున్నదని నేను వూహించిన ప్యాటర్న్ ఇది.మీ పార్టీకి బలమైన అబ్యర్ధులు మాయమైపోయి వనరులు కుంచించుకుపోయాయని తెలిసే వరకు జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చెయ్యదు - పత్రికా ప్రకటనలకి మించి క్రియాత్మక ఆందోళనలు చెయ్యటం లేదు స్థానిక భాజపా నాయకులు కూడా, లాక్కోలేకా పీక్కోలేకా అవస్థలు పడాల్సిన సన్నివేశాలు జరక్కుండా కేంద్రం ముందు జాగ్రత్త హెచ్చరికలు చేసింది కాబోలు!మీ పార్టీ పరిస్థితి/దుస్థితి వాళ్ళకి వీలిచ్చే స్థాయికి తగ్గాక అప్పుడు చిన్న చిన్న గొడవలు చేసి శాంతి భద్రతల పేరుతో రాష్ట్రపతి పాలన పెడతారు.పోలవరం ఓ నాలుగు నెలల్లో పూర్తి చేసి రిబ్బన్ కట్ చేస్తే ఆ తర్వాత ఎన్నికల్లో మీరు దాన్ని గురించి చెప్పుకునే వీలు ఉండదు.రాష్ట్రపతి పాలన కాబట్టి మీరు కూడా నోరెత్తడానికి వీల్లేదు.రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్రానికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉండి కూడా వాటిని సాధించలేని మీ అసమర్ధతనీ వైకాపా అరాచకత్వాన్నీ ఫోకస్ చేసి లాభపడుతుంది!

ఇప్పటికి మీకు అర్ధమై ఉండాలి జగన్ ప్రభుత్వం మీమీద చేస్తున్న రౌడీ పనులు భాజపాకి కూడా ఆనందాన్ని కలిగించేవేనని.చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం టీడీపీకి లాభం కలగడమే తప్ప భాజపాకి వీసమెత్తు లాభం కూడా ఉండదు.అలాంటప్పుడు భాజపా మీకు అనుకూలం ఎట్లా అవుతుంది?కుండెడు మట్టీ చెంబుడు నీళ్ళూ ఇచ్చిన నాటినుంచే భాజపా మీ చుట్టూ ముళ్ళకంచెలు పేర్చడం బయటివాళ్ళం మాకు తెలుస్తున్నది గానీ మీకు మాత్రం తెలియలేదు - ఇప్పటికీ అయోమయంలోనే ఉన్నారు!ఈ చక్రవ్యూహాన్ని పోలవరం పనుల్ని కేంద్రం తీసుకుంటుందనే నిర్ణయం ఖరారు అయ్యేలోపున బద్దలు కొట్టడం మీకు సాధ్యపడుతుందా!నేను మీకు ఇద్దామనుకున్న సలహా అదే, కానీ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా అని సందేహిస్తున్నాను.

తెలుగుదేశం రామారావు హయాంలో ఎన్నికల ప్రచారం ఎఫెన్సివ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది.తనకి భాష మీద వున్న పట్టు గొప్పది కాబట్టి అసభ్య పదాలు వాడాల్సిన అవసరం లేకుండానే ఎదిరి పక్షాల్ని ధాటిగా విమర్శిస్తూ ఉంటే తనతో పోలిస్తే మంచి తెలుగు అంటే ఏంటో తెలియని కాంగ్రెసువాళ్ళు అదే స్థాయిలో ప్రతిదాడి చెయ్యలేకపోయేవాళ్ళు!వూహించని ఓటములు N.T.Rకీ తప్పలేదు గానీ గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల ప్రచారంలోనూ పరిపాలనలోనూ ఉన్న స్టైల్ ఒకేలా ఉండేది. ఒకసారి గెల్చాక మాత్రం పరిపాలన డిఫెన్సివ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది.దానికి కారణం మర్యాదల పట్ల రామారావు కున్న పట్టుదల - అది పీవీ నర్సింహారావుకు పోటీ పెట్టకపోవడంలో బయటపడింది కదా!

చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి వ్యతిరేకం - ఎన్నికల ప్రచారం డిఫెన్సివ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది .ఎన్నికల ప్రచారంలో తన సమర్ధత గురించి చెప్పుకోవడం తప్ప ఇతరుల బలహీనతల్ని వాడుకోవటం CBN ఒక్కసారి కూడా చెయ్యలేదు. మోదీ, జగన్, కేసీయార్ దిగజారిన స్థాయి ఇంకెవరూ దిగజారలేనంతటిది! ఒకసారి గెల్చాక మాత్రం పరిపాలన ఎఫెన్సివ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది. దానికి కారణం ఇతరులు ఆర్ధిక వ్యవస్థని ఛిన్నాభిన్నం చేసిన తర్వాత తను రావటం - అయితే గతంలోనూ ఇప్పుడూ దాన్నొక చాలెంజిగా తీసుకుని పోరాడి అతి తక్కువ కాలంలో వ్యవస్థని అభివృద్ధి వైపుకు నడిపించటం తారీఖులూ గణాంకాలూ కూడా ఉన్న చారిత్రక సత్యం!

విచిత్రం ఏమిటంటే, CBN యొక్క పెర్ఫార్మెన్స్ రికార్డ్ కనపడినా నిన్నటి ఎన్నికల్లో "బాబు తోడు లేకుండా ఒంటరిగా పోటీ చేసినప్పుడల్లా ఓడిపోవటం!" కాక వైకాపా ప్రచారం చేసిన మూఢనమ్మకం లాంటి మరో వాస్తవం "రెండుసార్లు వరస ఎన్నికల్లో గెలవకపోవటం!" అనేది పదే పదే ఎట్లా జరుగుతున్నది? CBN నేతృత్వంలో ఓడిపోయిన అన్ని ఎన్నికల్లోనూ అలవాటైన డిఫెన్సివ్ పద్ధతికి బదులు ఎఫెన్సివ్ పద్ధతి ఫాలో అయితే తెలుగుదేశం గెలిచి ఉండేది.అప్పుడు వయ్యస్సార్ ఇప్పుడు వైయస్జే పాదయాత్రలూ బుగ్గల రుద్దుడు యాత్రలూ చేసి ఫోకస్ తమనుంచి మళ్ళిపోకుండా చూసుకున్నారు.CBN చేస్తున్న అభివృద్ధి వెనక్కి పోయి అక్కడ జరుగుతున్న హడావిడికి కవరేజి ఇచ్చిన  మీడియా వల్ల వాళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళు గెలవటం ఖాయం అనే ముద్ర జనంలో పడిపోయింది.అలా ఎఫెన్సివ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంటే అధికారంలో ఉన్నాం, అభివృద్ధి చేస్తున్నాం అనే ధీమాతో అలవాటైన డిఫెన్సివ్ పద్ధతినే ఫాలో అయ్యారు, ఓడిపోయారు!ఒకసారి CBN పాదయాత్రని గుర్తుకు తెచ్చుకోండి - అది కూడా పైన నేను చెప్పిన ప్యాటర్న్ CBNకు అనుకూలం అవడం వల్లనే దాని ఫలితాన్ని అది ఇచ్చింది!

తెదెపా క్రియాశీల సభ్యులు అందరూ ఎన్నికల స్ట్రాటజీల్ని తమ వైపునుంచి చూసి ఫాలో అవుతున్నారు.కానీ ఇటు వైపు నుంచ్బి చూస్తే ఓటర్లు తాము వోటు వేసిన పార్టీ అధికారంలోకి వస్తే పొంగిపోవడమూ రాకపోతే కుంగిపోవడమూ జరుగుతుంది - గుర్రప్పందాల్లో గెలుస్తుందనుకున్న గుర్రం మీదే అందరూ పందాలు కాస్తారు కదా!నిన్నటి ఎన్నికల్లో మోదీ, కేసీయార్, జగన్ ముగ్గురూ కలిసికట్టు దాడి చేస్తుంటే ఎఫెన్సివ్ దాడి చెయ్యాల్సింది పోయి డిఫెన్సివ్ పద్ధతిని కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకోలేదు.కేసీయార్ హైదరాబాదులో ఆస్తులున్నవాళ్ళని బెదిరించి వైకాపాలోకి పంపిస్తున్నట్టు ఆ దాడికి గురవుతున్న వ్యక్తి సాక్షాత్తూ CBN సమక్షంలోనే expose చేసినా దానికి కనీసం remidial action కూడా తీసుకోలేదు - ప్రజల్లో మీకు గెలుపు గుర్రం ఇమేజి ఎట్లా వస్తుందనుకున్నారు?

మొన్నటి ఎన్నికల్లో మోదీ మీకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం అసలు ఏమాత్రం ప్రభావం చూపించలేదు కాబట్టి దాని పట్టించుకోనక్కర లేదు.కానీ జగన్ గెలుపులో 90 శాతం కేసీయార్ ఎత్తుగడలే పని చేసాయి.అతను "బాబు వోడిపోతాడు!" అన్నది జోస్యం కాదు,"నేను బాబుని ఓడిస్తాను!" అని చేసిన హెచ్చరిక - ఎఫెన్సివ్ స్ట్రాటజీ పాటించేవాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది.జగన్ "ఈ ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద నిలబెట్టి షూట్ చెయ్యాలి!" అన్నప్పుడు నాతో సహా అందరికీ అతనొక హీరోలా కనిపించాడు, నిజం! అప్పుడు బాబు స్థానంలో మోదీ గానీ కేసీయార్ గానీ ఉండి ఉంటే తెల్లారేసరికి జగన్ చచ్చి శవమై ఉండేవాడు. CBN పిరికివాడిలా కనిపించాడు - అరెస్ట్ చెయ్యలేదు, కనీసం తత్తరపడి క్షమాపణ చెప్పేలా మోరల్ బ్లాక్ మెయిల్ చేసి కార్నర్ చెయ్యలేదు,అతన్ని అచ్చోసిన ఆంబోతులా వదిలేసింది బాబు సర్కారే!

ప్రజలు వోటు వెయ్యడం అనేది మినహాయిస్తే ఇప్పటి రాజకీయాలు కూడా చాణక్యుడి రాజనీతినే పాటిస్తున్నాయి.అప్పటి యుద్ధాల స్థానంలో ఎన్నికలు వచ్చాయి - అంతే తేడా! యుద్ధమయినా ఎన్నికైనా గెలుపుని తెచ్చిపెట్టేది వ్యూహాలే.ఎఫెన్సివ్ వాడాల్సిన చోట డిఫెన్సివ్ వాడటం ఎంత ప్రమాదకరమో డిఫెన్సివ్ వాడాల్సిన చోట ఎఫెన్సివ్ వాడటం కూడా అంతే ప్రమాదకరం.ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కేసీయార్ చేసిన అలాంటి పొరపాటే,కేసీయార్ ఇచ్చిన వార్నింగుని ఉద్యోగులు ఖాతరు చెయ్యకపోవటం అంటే సమ్మె మొదలైందే బీజేపీ ఎఫెన్సివ్ ఎటాక్ అని తెలుస్తున్నది.అన్ని లెక్కలూ వేసుకోకుండా ఎఫెన్సివ్ ఆడటానికి భాజపా తెలివితక్కువది కాదు.ఇప్పటికే కేసీయార్ పొజిషన్ వీక్ అని అందరికీ తెలుసు - దీనితో అతన్ని ఇంకొంచెం వీక్ చేసి వెన్వెంటనే ఫిరాయింపుల కౌంటర్ తెరిస్తే కేసీయార్ పని జాటర్ ఢమాలే!

మొన్నటి ఎన్నికల తర్వాత నాకో వూగిసలాట వచ్చింది - బీజేపీ మొదట జగన్ పనిపట్టి తర్వాత కేసీయార్ వైపుకి వెళ్తుందా, మొదట కేసీయార్ పనిపట్టి తర్వాత జగన్ వైపుకి వస్తుందా అని.ఇప్పుడు ఆ సందేహం తీరిపోయింది - కేసీయార్ని లేపేసి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక తర్వాత మంచి ముహూర్తం చూసుకుని జగన్ని లేపేసి ఆంధ్రలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తుంది.మరి, మీ సంగతి యేంటి?మీలో కొందరికి ఏదో ఒక రోజున భాజపా మీకు అనుకూలమై మళ్ళీ మీరు ఆంధ్రలో అధికారం చేపట్టటానికి సహాయపడుతుందనే భ్రమలో వున్నారు.అది కేవలం మూఢనమ్మకం మాత్రమే - అసలు వైకాపా ప్రచారం చేసి జ్ఞానికి ఎక్కించిన "తోడు లేకుండా ఒంటరిగా పోటీ చేసినప్పుడల్లా ఓడిపోవటం!", "రెండుసార్లు వరస ఎన్నికల్లో గెలవకపోవటం" లాంటి మూఢనమ్మకాల్నీ తొలగించుకోకపోతే CBN తర్వాత పార్టీ బతికి బట్ట కట్టటమే చాలా కష్టం.

ఒక రాజకీయ పార్టీలో సామాన్య కార్యకర్త అయినంత మాత్రాన నాయకులు ఏది చెబితే ఏది చేస్తూ పోవడం కాదు, ఇలాంటి కఠిన వాస్తవాల్ని తెలుసుకోవాలి.క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో పై స్థాయి వారికి చెప్పేటప్పుడు వాస్తవాలే చెప్పాలి.ఇప్పుడే CBN కూడా "బీజేపీకి దూరం కావడం వల్లనే నష్టపోయాం!" అనే ప్రకటన ఇవ్వడాన్ని బట్టి తెదెపా పై స్థాయి నాయకులు మళ్ళీ బీజేపీ సహాయం ఆశిస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది.కానీ మొన్నటి రోజున దూరం కావడం మీవైపునుంచి మొదలు కాలేదు.హోదా ఇవ్వకపోవడం అంటే సాంకేతికపరమైన కారణాలు ఉన్నాయి,బాబు-జైట్లీ ప్లానులో ఎలాంటి ఇబ్బందీ లేదు.కానీ దాన్ని కూడా ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టిన తర్వాతే కదా CBN బీజేపీకి దూరం జరగాలన్న నిర్ణయం తీసుకున్నది!సరిగ్గా ఎన్నికల సమయానికి దేశంలోని నాన్ బీజేపీ పార్టీల నాయకులు  ఆంధ్రలో మీరు గెలుస్తారనీ దానితో జాతీయ స్థాయిలో మోదీకి చెక్ చెప్పొచ్చుననేటంత హుషారుగా వున్నారు, అప్పుడే మర్చిపోయారా?

బీజేపీ వైపు నుంచి చూస్తే మీకు సహాయం చేసినందువల్ల బీజేపీకి వచ్చే లాభం ఏమిటి?మీకు సహాయం చేసి మిమ్మల్ని అధికారంలో ఉంచాలనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎందుకు ఏడిపిస్తారు?ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఏం జరుగుతుంది?CBN పేరు మార్మోగిపోతుంది!తెదెపాకి ఆంధ్రలో ప్రత్యామ్నాయం అంటూ లేనంత బలపడుతుంది!ఇందులో భాజపాకి లాభం ఏముంది?CBN తర్వాత లోకేశ్ ముఖ్యమంత్రి అవుతాడు - భాజపా ఎప్పటికీ మీకు పక్కతాళం వేస్తూ ఉండాల్సిందేనా?ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీకి పక్కతాళం వెయ్యడానికి ఒప్పుకోవడం అంటే ఆ జాతీయ పార్టీకి అవమానం కాదా!

చాలామంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా బీజేపీ జగన్ని జైలుకి పంపించడం ద్వారా తప్పిస్తుందని అనుకుంటున్నారు.అలా ఎప్పటికీ చెయ్యదు.ఎందుకంటే, అలా చేశాక రెడ్డి కులస్థులు బీజేపీకి వోటు వెయ్యరు - తెదెపా నాయకుల్లో కూడా రెడ్లు ఉన్నారు.కానీ, అతడు నేరాలు రుజువై వెళ్ళినా సాటి కులస్థుల్లో ప్రతి ఒక్కరికీ "అయ్యో!విజయ్ మాల్యాని పట్టుకున్నారా?నీరవ్ మోదీని జైల్లో పెట్టారా?మనోడు కదా, చూసీ చూడనట్టు పోకూడదా!" అనిపించటం సహజం.కాబట్టి బీజేపీ అంత భీబత్సం చెయ్యదు.తమకు అధికారం గ్యారెంటీ అని క్లారిటీ వచ్చేవరకు జగన్ని ఇప్పటిలాగే పరిపాలించనిస్తుంది.పనిలో పని అతడి ద్వారా మిమ్మల్ని బలహీనం చేస్తుంది.పొజిషన్ తమకు 100% అనుకూలం అనుకంటే అప్పుడే ఎన్నికలని తెస్తుంది, లేదంటే రాష్ట్రపతి పాలన పెడుతుంది.

ఇప్పుడు జగన్ పరిపాలన అస్సలు బాగోలేదు.ఒకరు చెప్పాల్సిన పని లేకుండా జనం పోల్చి చూసుకుని అర్ధం చేసుకుంటున్నారు, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో జగన్ ఫ్యాన్ల తొలినాటి హడావిడి తగ్గి మౌనం దాల్చటమే అందుకు గట్టి సాక్ష్యం.కానీ బీజేపీ తను అధికారం కోరుకుంటున్నప్పుడు ఎప్పటికీ ఇలా ఉండనిస్తుందని గ్యారెంటీ ఏమిటి?కేంద్రంలో అధికారం నడుపుతున్న పార్టీకి మీకున్న గుడ్విల్ క్యాంపెయిన్ బ్యాంకును తన ఖాతాలో వేసుకోవడం ఎంత సేపు?

నేను మీకు ఇవ్వాలనుకుంటున్న సలహా ఏమిటంటే,మీరు ఇప్పుడున్న 23 మంది ఎమ్మెల్యేలతోనూ రాజీనామా చేయించి అప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో మళ్ళీ ఆ 23 మందినీ తిరిగి గెలిపించుకోవాలి!కొంచెం షాకింగ్ అనిపించొచ్చు, మిమ్మల్ని నేను ఇంకా నష్టపెట్టటానికి అతి తెలివి చూపిస్తున్నానని కూడా అనిపించొచ్చు.యే రాజకీయ పార్టీలోనూ సభ్యుణ్ణి కాదు గాబట్టి వాస్తవ పరిస్థితిని గురించి అవగాహన లేకుండా వూహల్ని పేనుతున్నానని కూడా అనిపించొచ్చు!

కానీ, మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఆ 23 మందితో ఏమి సాధించగలిగారు?మున్ముందు అసెంబ్లీ సమావేశాల్లో ఆ 23 మందితో ఏమి సాధించగలుగుతారు?CBN అంతటి సీనియర్ నాయకుణ్ణి మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎట్లా అవమానిస్తున్నారో చూశారు కదా!స్పీకర్ ఒకప్పుడు మీ పార్టీ వాడే కదా, అయినా మీకు గౌరవం, మర్యాద లేవు.మీరివ్వాళ చేస్తున్న ఆందోళనలకి వాళ్ళు ఈషణ్మాత్రం భయపడటం లేదు.మీరేమో మీ డిఫెన్సివ్ మెంటాలిటీలో ప్రజల ముందు ఇవన్నీ ఏకరువు పెట్టి వాళ్ళని మెప్పించితే చాలునని అనుకుంటున్నారు.ఎన్నికలు మామూలుగా రావడానికి ఇంకా నాలుగేళ్ళ పైనే ఉంది.బీజేపీ పెట్టబోయే ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా దాని వెసులుబాటును బట్టి పెడితే రెండేళ్ళకిపైనే పడుతుంది.

ఏది ఏమైనా వాళ్ళు తెస్తే వచ్చే ఎన్నికల వల్ల వాళ్ళకే లాభం!వాళ్ళు మీమీద చేస్తున్న భౌతిక దాడులు ఆగాలంటే వాళ్ళు మీకు భయపడటం తప్ప మరో దారి లేదు.ఈవీయం ట్యాంపరింగ్ ద్వారా 175 సీట్లకీ 151 తెచ్చుకున్న వాళ్ళకన్న కన్న పేపరు బ్యాలెట్లతో 23 సీట్లకి 20 తెచ్చుకున్నా మీరే గొప్ప అవుతారు కదా!ఇదివరకే చెప్పాను కదా పేపర్ బ్యాలెట్ కోసం ఒక్కో సీటుకీ ఓ వందమంది చేత డమీ నామినేషన్లు వేయించితే సరిపోతుందని.మీకు కొంత డబ్బు కర్చు కావచ్చు, ఎన్నికల వ్యయం ఉంటుంది. కానీ 175 సీట్లని గెలవటానికి పెట్టే ఖర్చుతో పోలిస్తే 23 సీట్ల కోసం పెట్టేది నామమత్రమే, అవునా?కానీ, లాభాలు చాలా ఎక్కువ. మరీ 175కి 23 తెచ్చుకున్న ఆత్మన్యూనత పోతుంది కదా, ఆ ఒక్కటి చాలదా!అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికలకి పనిచేసే టీం లాగా ప్రశాంత్ కిశోర్  ఉన్నప్ప్పటికీ జగన్ గెలుపులో కేసీయార్ ప్రమేయమే ఎక్కువ.అందుకే జగన్ అంతగా అంటకాగుతున్నాడు. ఇప్పుడు కేసీయారూ బీజేపీ రెండూ కూడా ఆర్టీసీ సమ్మెని ఉపయోగించుకునే రంధిలో ఉన్నాయి.సలహా నచ్చితే వెంటనే పాటించండి!

నచ్చకపోతే?ప్రాక్టికాలిటీ ఉన్న పాయింట్లని గుర్తుంచుకుంటే చాలు.

Thursday 10 October 2019

ఎడం చెయ్యి తీసి పుర్ర చెయ్యిని పెట్టినట్టు నిన్నటి చరిత్రకారుల్ని అబద్ధాలు రాశారని తిట్టిన ఇప్పటి చరిత్రకారులు చేస్తున్నది యేంటి?


Devarakonda Murali
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం బోస్ ని యుద్ధనేరస్తునిగా(war criminal) గా డిక్లేర్ చేసింది.స్వాతంత్య్రం రాకముందే.."బోస్ ఆచూకీ తెలిసినా లేక అతడు మాకు పట్టుబడినా యుద్ధ ఖైదీ గా మీకు అప్పచెపుతాం.." అని నెహ్రూ స్వయం గా అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కి రాసిన లేఖ బయటపడి 1945లో టైమ్స్ ఆఫ్ ఇండియా డైలీ లో న్యూస్ ఐటమ్ కింద వచ్చింది. ఆ పేపర్ కటింగ్ కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియా లో చాలా రోజులు హల్ చల్ చేసింది. నేను కూడా ఆ పేపర్ కటింగ్ నా ఫేస్ బుక్ వాల్ మీద పోస్ట్ చేశాను! ఈ ఉదంతం లో మనకి అర్థం కాని విషయమేమంటే...1945 లో నెహ్రూ pm కాలేదు..అసలు స్వతంత్రమే రాలేదు! మరి ఏ హోదాలో నెహ్రూ ఆ లేఖ రాసాడో తెలీదు! దీని అర్ధం ఏమిటంటే..మొదటినుంచి గాంధీ, నెహ్రూ లు పక్కా బ్రిటిష్ ఏజెంట్లు అని!
ఇది నాకెలా వచ్చిందో గుర్తు లేదు గానీ సహజంగా జరగని దాన్ని జరిగినట్టు వర్ణించే కుట్ర సిద్ధాంతం అల్లటానికి పూనుకున్నప్పుడు ఆ కట్టుకధలని వాస్తవాల కింద భ్రమింపజెయ్యటానికి పూనుకున్నవాళ్ళు ఎంతటి మేధావులైనా ఎంత సిల్లీగా బయటపడిపోతారో కళ్ళకి కట్టినట్టు ఈ కధనం చూపిస్తుంది.నిన్నటి రోజున కమ్యునిష్టులు చరిత్రని వక్రీకరించారని చెప్తున్న అతి హిందూత్వ వాదులు ఇప్పుడు చేస్తున్నది కూడా అదే!
గాంధీనీ నెహ్రూనీ పోస్టర్ బాయ్స్ కింద వాడేసుకున్న కాంగ్రెసును దెబ్బ కొట్టటానికి వాళ్ళతో విభేదించిన కాంగ్రెసువాళ్ళని హీరోల్ని చేస్తూ ఎన్ని కట్టుకధలు అల్లుతున్నారో!"నెహ్రూకీ పటేలుకీ అధ్యక్ష పదవికి వోట్లని లెక్కిస్తే 15 వోట్లకి 13 పటేలుకీ 2 నెహ్రూకీ వచ్చాయట!నెహ్రూ కుతకుత లాడుతూ మొహం మాడ్చుకుని కూర్చున్నాట్ట!పట్టాభి గారు గాంధీ వైపుకి చూశాట్ట!గాంధీ నెహ్రూయే గెలవాలని సైగ చేశాట్ట!పట్టాభి తనకు ఉన్న రెండు వోట్లనీ నెహ్రూకి వేశాట్ట!పటేల్ తనకి వచ్చిన వోట్లని చూసి నెహ్రూ తనను డిక్లేర్ చేస్తాడని ఎదురు చ్గూస్తున్నాట్ట!క్షణాలు గడుస్తున్నాయట!గాంధీ అభిప్రాయం కూడా నెహ్రూకే అనుకూలంగా ఉందని గ్రహించిన పటేల్ తన వోట్లని కూడా నెహ్రూకే ఇచ్చేశాట్ట!" - ఇదీ నిన్న గాక మొన్న పుట్టిన ఒక కుర్ర వెధవ కధనం.ఏమిటండీ ఇది?ఇతనెవరు?ఎప్పుడు పుట్టాడు?ఆ సన్నివేశాన్ని అంతలా ఎలా వర్ణించగలుగుతున్నాడు!
అక్టోబర్ రెండు రావటం ఆలశ్యం - "ఆహా గాంధీ!ఓహో గాంధీ!" అని కొందరూ "ప్చ్!ప్చ్!గాంధీమార్గాన్ని మనం ఫాలో అవలేదు - అందుకే ఇంత అశాంతి!ప్చ్!ప్చ్!ప్చ్!ప్చ్!" అని కొందరూ "గాంధీని మాత్రమే పొగిడి శాస్త్రిని నిర్లక్షయం చేస్తారా?బోసుని నెహ్రూయే చంపేశాడు,నాకు తెలుసు, చాన్సిస్తే నిరూపిస్తా!" అని కొందరూ బయలుదేరుతారు.దీని బాబు జనవరి ఇరవయ్యారు - అది డబల్ ధమాకా వాయింపుడు.ఆగస్టు పదిహేను వచ్చిందా ఇంక చచ్చామే.ఎవడికి నచ్చినవాణ్ణి వాడు భుజానేసుకుని "మా హీరో గనక ప్రధాని అయి వుంటే దేశం ఇట్లా ఉండేది కాదు - ఎక్కడికో వెళిపోయేది!" అని పగలంతా భజన చేసి అలిసిపోయి రాత్రికి ముసుగు దన్ని పడుకోవటం.తేదీ మారిందా ఒక్కడు మళ్ళీ ఆ హీరోల్ని తలవడు - ఏక్ దిన్ కా దేశ్ప్రేమియోం!
ఇప్పుడు గాంధీ-బోస్-నెహ్రూ కధలోకి ఒక కొత్త నెరేషన్ వచ్చేసింది.బోసు అసలు శత్రువు నెహ్రూ కాదట!వ్హాట్!మరే, బోసు మెయిన్ టార్గెట్ గాంధీ అట!వ్హాట్ వ్హాట్!!మరే, మరే.1938 వరకు ఎదురు లేని గాంధీని జెల్ల కొట్టేసీన మహావీరుడట బోస్!ఎందుకీ మలుపు అంటే కాంగ్రెసు చరిత్రని నిశితంగా పరిశీలిస్తే ఇవ్వాళ ఎవరికైతే బోసు హత్యానేరాన్ని రుద్దాలని చూస్తున్నారో ఆ నెహ్రూ అతని చేతిలో హత్య గావించబడ్డాడని చెప్తున్న బోసుతో కలిసి పని చేసిన ఉదంతాలు వున్నాయి.నెహ్రూ కొన్నింటిలో ఫెయిలై ఉండొచ్చు,అవి వ్యక్తిగతమైన పొరపాటు అవగాహన వల్లనే అతని నిర్ణయాలు వికటించి ఉండొచ్చు - వాటిని విమర్శించితే సరిపోయేదానికి ఈ హత్యానేరాలు అంటగట్టటం దేనికి?బోసు ఏమైనా నిష్కళంక చరిత్రుడా?ఎవరికి ఉండే బలహీనతలు వాళ్ళకి ఉన్నాయి!
నెహ్రూకి అంటగడుతున్న తప్పిదాలు కూడా నెహ్రూ ఒక్కడు తీసుకున్న నిర్ణయాలు అనే సాక్ష్యం ఉందా?మంత్రివర్గం ఉంది, అధికారులు ఉన్నారు, విధానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది - ఇంతమంది ఇన్ని రకాల వెసులుబాట్లని ఉపయోగించుకున్నాక కదా ఒక నిర్ణయం తీసుకోవలసిన ఫైలు ప్రధాని ముందుకు వచ్చేది!ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ఫలితం వస్తుందో మదింపు చేసి అధికారులు ఇచ్చిన నివేదికలను బట్టే గదా ప్రధాని నిర్ణయం తీసుకునేది, మంత్రివర్గం అనేది ఉన్నదే ప్రతి విషయాన్నీ చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకోవటానికి కదా - అలాంటప్పుడు నెహ్రూ అనే ఒక్క వ్యక్తిని బలిపెట్టేస్తూ శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు మాట్లాడటం దేనికి?నెహ్రూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే వ్యతిరేకించటమే కదా వారి బాధ్యత - నెహ్రూ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న పటేలును ఆ తప్పుల నుంచి విడదియ్యటానికి ఈ కహానీలు చెప్తున్నారు.ఆ నిర్ణయాల వల్ల జరిగిన తప్పులు ఇవ్వాళ కనబడుతున్నాయి గాబట్టి మరోసారి ఆ తప్పులు జరక్కుండా ఉండాలంటే ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం మీద సమీక్షలూ విమర్శలూ అవసరమే గానీ మరీ ఇంత తారాస్థాయిలో వ్యక్తిత్వహననం అక్కరలేదు - అసలు అక్కడ అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలనే జిజ్ఞాస కన్న మా హీరో అయితే ఆ తప్పును చేసి ఉండేవాడు కాదని చెప్పుకోవడానికే ఈ హడావిడి పనికొస్తుంది, పారా హుషార్!
"మంత్రివర్గంలో ఉన్న ఒకే ఒక ముస్లిం నెహ్రూ!" అని పటేల్ అన్నట్టు ఒక కధనం విన్నాను.పటేల్ నిజంగా అలా అన్నాడా?అని ఉంటే అది ఎంత తప్పుడు మాట!తను సభ్యుడిగా ఉన్న మంత్రివర్గానికి నాయకుణ్ణి అలా కించపరచటం సంస్కారహీనం కాదూ!రాస్వసే భాజపా ద్వయం తమ సొంత హీరోలు హెగ్డెవార్, గోల్వాల్కర్ వంటివాళ్ళని వదిలేసి పటేల్, బోసు వంటి కాంగ్రెసు వాళ్ళ వెనకాల ఎందుకు పడుతున్నారు?వాళ్ళకి కావలసింది హిందూత్వం, జాతీయత కాదు వ్యాపారం, అధికారం - అది హెగ్డెవార్, గోల్వాల్కర్ పేర్లు చెప్తే రాదు గనక వాళ్ళ పేర్లు ఎత్తరు, పోనీ అలవాటు చెయ్యొచ్చ్గు గదా అంటే వీళ్ళందరి మొగుళ్ళు Rothschilds, Illuminati ద్వయం ఒప్పుకోదు!అందువల్ల కాంగ్రెసు పార్టీని నాశనం చెయ్యటానికి తీసుకోవాల్సిన హీరోని కాంగ్రెసు నుంచే తీసుకోవాల్సిన దుస్థితిలో ఉన్న రాస్వసే, భాజపా ద్వయం ఒకసారి బోసునూ ఒకసారి పటేలునూ ఉపయోగించుకోవాలని ఈ తరహా కధనాల్ని సృష్టిస్తున్నది - చరిత్ర పట్ల నిజాయితీ ఉన్నవాళ్ళు ఎవరూ వీటిని నమ్మకండి!
పక్కా కమ్యునిష్టు అయిన భగత్సింగుని కూడా పొగడాల్సిన అవసరం ఒక హిందూత్వ పార్టీకి ఉందా?అవసరం లేదు. దేశభక్తిని రగుల్కొల్పటానికి గానీ హిందూమత పరిరక్షణకు గానీ ప్రజాసేవకు గానీ సంఘసంస్కరణకు గానీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు - ఉన్నతమైన ప్రతిదీ సత్యం పునాదుల మీదనే నిలబడాలి!
అలా చూస్తే గాంధీ నుంచి గాడ్సే వరకు ప్రతి వ్యక్తీ కొన్ని నిజాలు చెప్పాడు, కొన్ని అబద్ధాలు చెప్పాడు.నెహ్రూ నూటికి నూరు శాతం అసమర్ధుడూ అవివేకీ కాదు, బోసు నూటికి నూరు శాతం సమర్ధుడూ వివేకీ కాదు.ఈనాటి కేసీయార్, చంద్రబాబు, నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, ములాయం సింగ్ యాదవ్, మాయావతి వంటివారే ఆనాటి నాయకులు కూడా - వేదికల మీద చప్పట్లు కొట్టించుకునే పంచ్ మార్క్ ప్రసంగాలు దంచటంలోనూ తాము సభ్యులుగా ఉన్న పార్టీలో సంస్థాగతబలాన్ని పెంచుకోవటంలోనూ ప్రాభవం కోసం జరిగే పోటీలో ఇతర్లని తొక్కెయ్యటంలోనూ అందరూ ఒకటే!గాంధీ చేసిన నిరాహార దీక్షలు తను చెప్పింది చెప్పినట్టు ఇతర్ల చేత ఒప్పించుకోవడానికి వేసిన ట్రిక్కు కాదూ?కాదనే దమ్ము ఏ గాంధీ భక్తుడికి ఉందో నా ముందుకి రమ్మనండి!రాగద్వేషాలు లేనివాడికి తొడగాల్సిన మహాత్ముడు అనే బిరుదుని తగిలించిన గాంధీయే అట్లా తన మాట నెగ్గించుకోవడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేసినట్టు కనబడుతుంటే మిగిలినవాళ్ళు మడిగట్టుకున్న మహాత్ములని ఎట్లా నమ్మాలి?
అప్పటి నాయకుల్లో నూటికి 99% లాయర్లే - జడ్జీల ముందు అబద్ధాలు చెప్పి కేసులు గెల్చిన అనుభవం ఉన్న ఆ లాయర్ల మందకి అధికారం కోసం ప్రజలకి అబద్ధాలు చెప్పటం పెద్ద కష్టమా?గోడ కట్టినట్టు అబద్ధాలు చెప్పగలిగినవాడు సమర్ధుడై ముందుకొచ్చాడు, అతని కన్న సిగ్గు విడిచి అంత కన్న పెద్ద స్థాయిలో అబద్ధాలు చెప్పలేనివాడు అసమర్ధుడై వెనక్కెళ్ళాడు, అంతే!భవిష్యత్తు తరాలకి ద్రోహం చెయ్యడం అనే భయంకరమైన నేరాన్ని ఆపాదించటం కోసం గురువుగారు పాపాత్ముల కోసం వెతకమని చెప్పిన ధర్మరాజూ పుణ్యాత్ముల కోసం వెతకమని చెప్పిన దుర్యోధనుడూ వెతికినంత నిజాయితీగా వెతికితే ఒక్క నెహ్రూయే కాదు అంబేద్కరుతో సహా ప్రతి ఒక్కడూ అర్హుడిగానే కనబడతాడు.
స్వతంత్రం రాకముందు ఏ రకమైన పరిపాలనను అణువణువునా ద్వేషించి పోరాడి గెలిచామో ఆ రకమైన పరిపాలనకు నకలునే మన మీద రుద్దిన అంబేద్కర్ చుట్టూ ఎన్ని అబద్ధాలు పేరుకుపోయాయో మీకు తెలుసా?అత్యంత ఉన్నతమైన భావాలతో అలరారే సనాతన ధర్మాన్ని బ్రాహ్మణ మతం అని అవమానిస్తూ రోజుకోసారి ఎవరో ఒక బ్రాహ్మణ్ణి బూతులు తిట్టందే నిద్రపోని "జై భీం" గాళ్ళు ఆయన రాసిన The Buddha And His Dharma అనే పుస్తకానికి రాసిన పరిచయాన్ని బైటికి రానివ్వకుండా తొక్కెయ్యటానికి కారణం ఏమిటో చెప్పగలరా?ఆఖరికి Bhagwan Das అనే ఒక Punjabi Buddhist 1980లో పబ్లిష్ చేసిన ఆ పరిచయంలో అంబేద్కర్ అభిమానులు ప్రచురించటానికి తిరస్కరించేటంత భయంకరమైన విషయం ఏమిటి?తనకు ఎంతో సేవ చేసిన తన రెండవ భార్య పట్ల వాళ్ళ అభిమాన నాయకుడు రాసిన నాలుగు మంచి మాటల్ని బైటికి రానివ్వని వాళ్ళకి కులాతీత సమాజం గురించి మాట్లాడటానికి ఎంత ధైర్యం?చెప్పి తీరాల్సిన నిజాన్ని దాచెయ్యడం కూడా అబద్ధం చెప్పటంతో సమానమే కదా!
మిగిలిన వాళ్లని గురించిన నిజాలు చాలామంది చెప్తూనే ఉన్నారు, నేనిప్పుడు అంబేద్కర్ చుట్టూ పేరుకున్న దుమ్మును దులపడం కోసమే ఈ పోష్టు రాస్తున్నాను.నిజానికి అంబేద్కర్ అనేది అతనికి జన్మతః తన కులాన్ని బట్టి వచ్చిన ఇంటిపేరు కాదు,అది ఆనాటి ఆ కాలపు అస్పృశ్య మెహర్ కులస్థులకి ఉండటానికి వీల్లేని ఇంటిపేరు, SavarKAR, GolwalKAR, TendulKAR, DhabolKAR అనే పేర్ల మాదిరి ఉన్న AmbedKAR అనేది కూడా బ్రాహ్మణ కులస్థుల ఇంటి పేరు!

తండ్రి పేరు Ramji Maloji Sakpal అయితే ఇతని పేరు Bhimrao Ramji Sakpal అని ఉండాలి కదా!ఉత్తర దేశంలో అధికంగా వినపడే SavarKAR, GolwalKAR, TendulKAR, DhabolKAR వంటి బ్రాహ్మణుల ఇంటిపేరు అస్పృశుడైన ఇతనికి ఎలా వచ్చింది?నోరు తెరిస్తే "జై భీం!" అని గర్జిస్తూ బ్రాహ్మణుల మీద నోరు పారేసుకునేవాళ్ళు అమాయకులూ కాదు, అణిచివేతకు గురైన అసహాయులూ కాదు, కులనిర్మూలన కోసం అహరహం తపించేవాళ్ళూ కాదు - వీళ్ళే ఇవ్వాళ నిలువెల్లా కులపిచ్చితో దహించుకుపోయే కాలాంతక నరాంతక దేవాంతకులైన దేశ విఛ్ఛిన్నం కోసం కంకణం కట్టుకున్న అసత్యవాదులు!ఇంటిపేరు బ్రాహణులది అయినప్పుడు ముక్కూ మొహం తెలియని వాడు Bhimrao Ramji అనే వ్యక్తి దళితుడని తెలుసుకోగలగడం సాధ్యమేనా?అదీ ఆ వ్యక్తి "నా పేరు Bhimrao Ramji Ambedkar!" అని చెప్తున్నప్పుడు, అతని స్కూల్ సర్టిఫికెట్లలో కూడా అలాగే ఉన్నప్పుడు!
ద్వితీయ స్వాతంత్ర సంగ్రామం అని మనం ఇవ్వాళ స్కూల్ పుస్తకాల్లో చదువుకున్న చరిత్రలో చాలా అబద్ధాలు ఉన్నాయి - అందులో భీంరావ్ రాంజీ అనుభవించిన అస్పృశ్యత కూడా ఒకటి!నిజానికి ఇతన్ని స్కూల్లో చేర్చేటప్పుడు తండ్రి తమ ఇంటిపేరైన Sakpal ఇవ్వకుండా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన Mandangad తాలూకాలో ఉన్న  Ambadawe గ్రామం నుంచి వచ్చినవాళ్ళమని చెప్పి Ambadawekar అనే ఇంటిపేరును ఇస్తే Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చి నమోదు చేశాడు. ఒక బ్రాహ్మణుడు అతను అస్పృశ్యుడని తెలిసే ఏమాత్రం అసహ్యం చూపించకుండా తన ఇంటిపేరునే ఇచ్చి ఆదరించడం దేన్ని సూచిస్తుంది?ఇప్పటివరకు ఈ విషయం జై భీం గాళ్ళు ఎందుకు చెప్పలేదు, నిజాన్ని దాచిపెట్టడం కూడా అబద్ధం చెప్పటమే కదా!తండ్రి వైపునా తల్లి వైపునా మూడు తరాలనుంచి బ్రిటిష్ సైన్యంలో ఉండి Subedar Major హోదాలో ఉన్న వ్యక్తికి పుట్టినవాడికి బీదరికమూ అస్ఫృశ్యతా ఆత్మన్యూనతా అంటగట్టటం ఏమిటి?అసలు భీంరావ్ రాంజీ పుట్టింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న Mhow అనే military cantonment town అయితే అతని తండ్రి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు సహజమైన Sakpal ఇంటిపేరుకు బదులు మహారాష్ట్ర లోని Ambadaweతో లింకు కలిపి ఇంటిపేరును Ambadawekar అని మార్చాల్సిన అవసరం ఏమిటి?
Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి నమోదు చేసి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చడం వరకు తెలిసినందుకే ఇంత ఆశ్చర్యం కలుగుతుంటే Balaram Ramji Ambedkar (brother), GangabaiLakgawadeKAR (sister), Ramabai MalvanaKAR(sister), Anandrao Ramji Ambedkar (brother), Manjulabai Yesu PandirKAR (sister), TulsabaiDharma KanteKAR (sister)ల పేర్లు మార్చడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే, Bhimrao Ramji Sakpal తన తండ్రి సంతానంలో 14వ వాడు! Bhimrao Ramji Sakpal కన్న పెద్దవాళ్ళైన అన్నలకూ అక్కలకూ అతన్ని స్కూల్లో చేర్చకముందే పేర్లు మారి ఉంటే అది ప్రపంచంలో మిస్టరీలు అని చెప్తున్న అన్ని మిస్టరీలనీ మించిన పెద్ద మిస్టరీ అవుతుంది!Bhimrao Ramji Sakpal కన్న పెద్దవాళ్ళైన అన్నలకూ అక్కలకూ అతన్ని స్కూల్లో చేర్చిన తర్వాత పేర్లు మారి ఉంటే అలాంటివి రెండు మిస్టరీలు రంగంలో ఉంటాయి - "Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి నమోదు చేసి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చడం!", "Balaram Ramji Ambedkar (brother), GangabaiLakgawadeKAR (sister), Ramabai MalvanaKAR(sister), Anandrao Ramji Ambedkar (brother), Manjulabai Yesu PandirKAR (sister), TulsabaiDharma KanteKAR (sister)ల పేర్లు మార్చడం!" అనేవి.
ఇవన్నీ నిజాయితీ గల చరిత్రకారులు పరిశోధించి నిగ్గు తేల్చాల్సిన వివాదాస్పదమైన విషయాలు కాబట్టి ఇక్కడ ముందుకు వెళ్ళిపోదాం.అంబేద్కర్ పుట్టుక వల్ల మాత్రమే అస్పృశ్యుడు.అతని ఇంటిపేరులో బ్రాహ్మణత్వం ఉంది.స్కూల్లో చేరినప్పుడు ఇంటిపేరును ఇచ్చిన Krishnaji Keshav AmbedKAR మాత్రమే కాదు, హైస్కూలు దశలోనూ ఎంతోమంది బ్రాహ్మణ గురువులు చురుకైన ఈ కుర్రాణ్ణి అభిమానించి అక్కున జేర్చుకున్నారు.తనకు ఇంటిపేరును ఇచ్చిన ఉపాధ్యాయుడు అప్పుడపుడు తనకు ఇంటినుంచి వచ్చిన క్యారియరు నుంచి తనకూ కొంత పెట్టేవాడని స్వయంగా అంబేద్కరు గుర్తు చేసుకున్నాడు. ఇప్పటి ఆరవ తరగతికి సమానమైన అప్పటి రెండవ తరగతిలో ఉన్నప్పుడు ఒకసారి వర్షంలో తడిసి స్కూలుకు వెళ్తే Pendse అనే ఉపాధ్యాయుడు కొడుకును తోడిచ్చి తన ఇంటికి పంపించి వేణ్ణీళ్ళ స్నానం చేసి దుస్తులు మార్చుకునే అవకాశం కల్పించాడు - ఆ ఉపాధ్యాయుడు కూడా బ్రాహ్మణుడే!
మనకి తెలిసిన బ్లాక్ బోర్డు సన్నివేశం Elphinstone High School నాటిది.అక్కడ పిల్లల్ని గద్దించిన mathematics teacher కూడా బ్రాహ్మణుడే.మనకి చెప్పేటప్పుడు పిల్లలు చేసిన అల్లరిని హైలైట్ చేసి దాన్ని తప్పు పట్టిన వ్యక్తి పేరును గానీ కులాన్ని గానీ ప్రస్తావించకుండా అనామకుడి కింద తీసెయ్యటం అనుకోకుండా జరిగినది కాదు. భీంరావ్ రాంజీ తరచు ఇప్పుడు S.K. Patil Udyan అని పేరు మార్చిన అప్పటి Charni Road Garden చెట్ల నీడన కూర్చుని చదువుకునేవాడు.అదే తోటకి Wilson High Schoolకి Headmaster అయిన Krishnaji Arjun Keluskar అప్పుడప్పుడూ వస్తూ బుద్ధిమంతుడైన ఈ కుర్రాడితో ఆదరంగా మాట్లాడేవాడు.1907లో Mahar కులం నుంచి first Matriculate అయిన భీంరావ్ రాంజీని గొప్ప సభ దీర్చి సన్మానంచినప్పుడు వక్తలలో ఈయన కూడా ఉన్నాడు.అప్పుడే Keluskar ఇచ్చిన బుద్ధ చరిత్ర భీంరావ్ రాంజీకి కొత్త ఆధ్యాత్మిక బీజాలను వేసింది!Keluskar అనే బ్రాహ్మణుడు ఈ అస్పృశ్య బాలుణ్ణి అంతటితో వదిలెయ్యలేదు - బరోడా మహారాజు నుంచి భీంరావ్ పై చదువులకు ధనసహాయం అందేటట్టు చేశాడు.
Shrimant Gopalrao Gaekwad అన్న పేరుతో Kashirao Bhikajirao Dada Sahib Gaekwadకి రెండో కొడుకుగా పుట్టి అప్పటి బరోడా మహారాజు పిల్లలు లేకుండా చనిపోయినప్పుడు వారసత్వపు గొడవల్లో బరోడా మహారాణి దత్తత తీసుకుంటే పేరు మార్చుకుని బరోడాకి మహారాజైన Saiyyaji Rao Gaekwad ఒకవైపునుంచీ Rajarshi Shahu Maharaj అని అందరూ పిలిచే శివాజీ వంశీయుడైన కొల్హాపూర్ హమారాజు ఒకవైపునుంచీ కేవలం చదువు ధనసహాయం చెయ్యటమే కాదు, పెంపుడు కొడుకులా ఆదరించారు.
ఇతను చదివిన కొలంబియా యూనివర్సిటీ చరిత్ర ఇది: అప్పటికే Freemason అయిన King George II మన దేశాన్ని దోచుకున్న BritishEast India Company చేసిన నల్లమందు వ్యాపారపు లాభాలతో కట్టారు.దీని ఉద్దేశం రవి అస్తమించని స్థాయిలో విస్తరించిన బ్రిటిష్ సామ్రాజానికి కొత్త తరం ప్రభువుల్ని తయారు చెయ్యటం.1754లో King's College అనే పేరుతో మొదలై 1776లో అమెరీకన్ సాంస్కృతిక విప్లవం అప్పుడు దాదాపు రద్దైపోయి 1784లో పేరు మార్చుకుని మొదలైన Columbia University మీద ఆది నుంచీ ఇల్యూమినాటీ, ఫ్రీమాసన్రీ భావజాలపు ప్రభావం ఉండేది.United Stateకి మొదటి chief justice అయిన John Jay,U.S. Constitutionకి final draft రాసిన AlexanderHamilton, Declaration ofIndependenceని తయారు చేసిన five-man-committeeలో ఒక సభ్యుడైన Robert. R. Livingston వంటివాళ్ళు ఈ విద్యాసంస్థ కానుకలే!
ఆ యూనివర్సిటీ పేరు వెనక ఉన్న కధ చూస్తే తమ ప్రమేయం గల ప్రతి చిన్న విషయంలోనూ తమ సంప్రదాయ చిహ్నాలను ఉంచే ఇల్యూమినాటీల పట్టుదలను చూసి ఆశ్చర్యం వేస్తుంది.యూరోపియన్ సంస్కృతులలో కనిపించే దేవతాస్త్రీలకి Virgo(కన్య) రాశితో సంబంధం ఉంటుంది.తల మీద ఈకలను ధరించిన పూర్వ క్రైస్తవీయ మయన్ ప్రభావిత ప్రాచీన జాతుల వస్త్రధారణతో ఉన్న ఈమెను క్యాధలిక్, ప్రొటెస్టేంట్ తదాది క్రైస్తవ మతస్థులు పొరపాటున కూడా ఇంత గౌరవాన్ని కల్పించేవారు కాదు, కానీ అక్కడున్నది New World Order పేరున ప్రపంచాధిపత్యం కోసం కలలు కంటున్న ఇల్యూమినాటీలు కదా!Nancy Jo Fox అనే folk-art historian ఒకచోట By the late 1790s, it was not clear whether a feathered Indian Princess had changed into a Greek goddess or whether a Greek goddess had placed feathers or plumes in her hair. అని ప్రస్తావించాడు.

మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను, ఏసు కన్య గర్భంలో పుట్టటం, అతను చనిపోయి తిరిగి లేవటం అనే కధల్ని పుట్టించి క్రైస్తవ మత సాహిత్యంలోకి ఎక్కించినది ఇల్యూమినాటీలే!హిందూ పండగలకి మల్లేనే ఆ కధలకి కన్యరాశికి సంబంధించిన ఖగోళ సంబంధం ఉంది:"The Virgin, Virgo was impregnated by God on the Spring Equinox as the Sun passed into Virgo on March 21st. Nine months later the Son of God is born on the Winter Solstice.God's sun/son is born or rather re-born every year after the Sun stops on the Tropic of Capricorn for 2 days and on the third day rises from death and is re-incarnated into the world.It then proceeds to come back towards the Northern Hemisphere as the 'light of the world.' The New World Virgin Goddess Columbia was just a new manifestation of the ancient consort and virgin mother of god." - ఇప్పుడు క్రైస్తవులు ఏసు కన్యాగర్భంలో జన్మించడం అనే విషయాన్ని అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నారో అర్ధం అవుతుంది కదూ!
నిజానికి మొదటి తరం క్రీస్తు అనుచరులు తమని తాము "యహోవా వార్తాహరులు" అని చెప్పుకుంటారు.వారిదే అసలైన క్రైస్తవం, కానీ ఈనాటి చర్చి వాళ్ళని అంటరాని వాళ్ళకన్న హీనంగా చూస్తుంది - నేను "యహోవా వార్తాహరుణ్ణి!" అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు వాళ్ళు.ఇప్పుడు మనం చూస్తున్న అంశాలు యేవీ వాళ్ళు పాటిస్తున్న మతంలో ఉండవు. Ashkanazi Jews యూదుమతంలోకి మారాక Rothschilds పెట్టిన ఖర్చుతో అన్ని మతాల్నీ వెతికి వాటిలో ప్రజల్ని బానిసల్ని చేసుకోగలిగిన బలమైన కధల్నీ తంతుల్నీ బోధనల్నీ రూపాలు మార్చి ఇరికిస్తే ఇప్పటి క్రైస్తవం తయారైంది.క్రైస్తవంలోని త్రిత్వం Isis, Osiris, Horus అనే ఈజిప్టు త్రిత్వమే - అందులోని Isis అనేక సంస్కృతులలో కనిపించే ఆదిమాతయే. ఆమెకున్న అనేక నామాల్లో కొన్ని Aphrodite, Ishtar, Black Madonna, Mary/Maya, Goddess Athena, Goddess Astarte, Anunit, Astarte, Atarsamain అనేవి.కాగడాను పట్టుకున్న లిబర్టీ కూడా కొలంబియా దేవత కున్న రూపాల్లో ఒకటి.అలా ఫ్రీమాసన్రీ, ఇల్యూమినాటీల అధికారిక స్థావరమైన కొలంబియా యూనివర్సిటీలో చదివిన భీంరావ్ రాంజీని ఆ భావజాలం ఉత్సాహపరచటం సహజమే కదా - "The best friends I have had in life were some of my classmates at Columbia and my great professors, John Dewey, James Shotwell, Edwin Seligman, and James Harvey Robinson" అని అన్నాడు.
వాళ్ళందరిలోనూ భీంరావ్ రాంజీ ఎక్కువ ఇష్టపడిన JOHN DEWEY అనే ప్రొఫెసర్ Father of Modern Progressive American Education కూడా, మీదు మిక్కిలి అసలు సిసలైన మాసొనిక్ భావజాల ప్రచారకర్తయే! ఈ John Dewey క్రైస్తవాన్ని మూలఛ్చేదం చేసిన, చేస్తున్న Pragmatism అనే ఆధ్యాత్మిక కిచిడీని వండివార్చిన ఘనుడు - సత్యం అనేది సన్నివేశాన్ని బట్టి మారిపోయే సాపేక్షమైనది కాబట్టి ప్రపంచ శాంతిని సాధించడానికి విధ్వంసాన్ని వాడటం తప్పు లేదనిపించేటట్టు ఉంటుంది ఈయనగారి విశ్లేషణ. ఇంగ్లీషు సినిమాల్లో తరచు వినబడే "గ్రేటరు గుడ్డు కోసం చేసే స్మాలరు సిన్ను" అనే చెత్త కొటేషను ఈ Pragmatism సిద్ధాంతుల పుణ్యమే.John MacArthur అనే మేధావి క్రైస్తవం బలహీన పడడానికి మొదటి ఆఖరి కారణం  Pragmatism అని తేల్చి చెప్పాడు. ఇది ఒక్క క్రైస్తవాన్ని మాత్రమే కాదు ఏ మతస్థులు దీన్ని ఆదర్శం అని ఒప్పుకుంటే ఆ మతం బలహీన పడటం ఖాయం. 
John Dewey వస్తుతః సైకాలజిస్ట్, అందులోనూ functional psychology అనే శాఖను ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చాడు.రాజకీయ భావాల పరంగా ఇతను Unitarian Universalist, అంటే ఏకీకృత ప్రపంచాధిపత్యం అనే New World Order ఇతని ఆదర్శం అని తెలుస్తున్నది కదా!1933లో ఇతను అన్ని మతాల సారాన్నీ వడకట్టి "socialized and cooperative economic order"ను ఏర్పరచటం కోసం పిలుపు ఇచ్చాడు.అంటే మతాన్ని వ్యాపారం కోసం వాడుకునే ప్రణాళిక వేసి సమాజాన్ని ఆ ప్రణాళికని ఆమోదించే గొర్రెల సమూహంలా తయారు చెయ్యటం!ఇతని మహారాజ పోషకులు Skull and Bones Society సభ్యులే. అప్పట్లో స్కూళ్ళూ కాలేజీలూ యూనివర్సిటీలూ Rockefeller లాంటివాళ్ళు నల్లడబ్బుని తెలుపు చేసుకుంటూ పన్లోపని తమ దోపిడీ యంత్రాన్ని నడపటానికి కావలసిన వైట్ కాలర్ కూలీల్ని తయారు చేసుకోవటం కోసం స్థాపించినవే. "Our schools are performing an infinitely significant religious work.They are promoting social unity out of which in the end genuine religious unity must grow." - ఇదీ విద్య గురించి ఇతని అవగాహన!
John Dewey భీంరావ్ రాంజీ కేవలం మెచ్చుకుని సరిపెట్టేసిన అందరు గురువుల్లో ఒకడు కాదు - “I am so sorry. I owe all my intellectual life to him. He was a wonderful man.” అని భార్యతో చెప్పడమూ నిజమే, భీంరావ్ రాంజీ ప్రవచించిన నవయాన బౌద్ధంలో Deweyian Influence ఉండటమూ నిజమే.అసలు క్యామెడీ యేమిటంటే, John Dewey యొక్క భావాలు బౌద్ధం నుంచి కాపీ కొట్టినవే!బుద్ధుడి పేరు చెప్పకుండా బుద్ధుడి బోధనల్ని సొంత భాషలో చిలకపలుకులు పలికిన John Deweyని ఒరిజినల్ అనుకుని భీంరావ్ తన నవయాన బౌద్ధంలోకి దించేశాడు.Meera Nanda found in Buddhism traces of Deweyian influence on the Buddha and His Dhamma written by Babasaheb Ambedkar . She even declared that the Buddha as narrated by Babasaheb Ambedkar was the Deweyian Buddha. But it can be equally true that many of the ideas in the philosophy of John Dewey look like a direct borrowing from the teachings of the Buddha, particularly, the concept of democracy.Reading about democracy in the philosophy of John Dewey is just like reading Pali texts and just the conceptual translation of Buddhism into modern language. - ఇవ్వాళ జై భీం గాళ్ళు బుద్దుడి కళ్ళు తెరిపించేసి బుద్ధుణ్ణి కూడా సరిదిద్దిన ఖ్యాతిని అంటగట్టి బుద్ధుడి కన్న ఒక మెట్టు పైన నిలబెడుతున్నారు భీంరావ్ రాంజీని, శేషం కోపేన పూరయత్!
1913లో తన 22వ యేట బరోడా మహారాజు ఏర్పాటు చేసిన £11.50 (Sterling) per month for three years సౌకర్యంతో అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ Livingston Hall హాస్టల్లో Naval Bhathena ఆనె పార్సీతో కలిసి ఉన్నాడు, 1915కల్లా Sociology, History, Philosophy, Anthropologyలతో కలిపి ఎకనామిక్సులో ఎమ్మ్యే పూర్తి చేశాడు. Ancient Indian Commerce మీద ఒక ధీసిస్ రాసి సమర్పించాడు. 1916లో ఇంకో ఎమ్మ్యే డిగ్రీ కోసం National Dividend of India – A Historic and Analytical Study అనే ధీసిస్ రాసి సమర్పించాడు.  Castes in India: Their Mechanism, Genesis and Development అన్న పేరుతో ఒక సెమినారు ఇచ్చి అక్టోబర్ 1916లో లండన్ చేరుకుని London School of Economicsలో ఇంకొక doctoral thesis కోసం పని చేస్తూ ఉన్న సమయంలో June 1917తో స్కాలర్షిప్పు కాలావధి ముగిసిపోవడంతో ఇండియ వచ్చేశాడు.ఇతని పుస్తకాలు వస్తున మరొక ఓడని జర్మన్లు ముంచేశారు.మళ్ళీ నాలుగేళ్ళలో పూర్తి చెయ్యడానికి అనుమతి తీసుకుని వెనక్కి వెళ్ళి "Provincial Decentralization of Imperial Finance in British India" అనే ధీసిస్ సబ్మిట్ చేసి 1921లో M.Sc డిగ్రీ తెచ్చుకున్నాడు.1922లో Gray's Innలో చేరి 1923లో "The problem of the rupee: Its origin and its solution" అనే ధీసిస్ సమర్పించాడు.
భీంరావ్ రాంజీ అమెరికా చదువు ప్రజలకి ప్రాగ్మటిస్టు సొల్లు చెప్తూ దొడ్డి దారిన ప్రపంచాధిపత్యాన్ని రుద్దే దోపిడీదారులతో చెట్టాపట్టాలేసుకుని మమేకం అయిపోయినట్టు గడిస్తే లా డిగ్రీ కోసం లండనులో చేరిన Gray’s Inn బ్రిటిషు సామ్రాజ్యవాదుల ఆంతరింగికులకి తప్ప ఇతరులకి ప్రవేశం లేని విద్యాసంస్థ! ఈ డిగ్రీలు సాధించటం ఇలా ఉండగానే 1920లో Mumbai నుంచి Shahu of Kolhapur సహాయంతో Mooknayak (Leader of the Silent) వారపత్రికని ప్రారంభించాడు. బరోడా మహారాజు ధనసహాయంతో చదువుకున్నాడు గాబట్టి చదువు పూర్తి కాగానే అతని సంస్థానంలోనే ఉద్యోగం చెయ్యాల్సి వచ్చింది గానీ వివక్షని భరించలేక తిరిగి బొంబాయి చేరుకున్నాడు. చదువు విషయంలో అంత ప్రోత్సహించిన రాజు ఉద్యోగ సమయంలో ఎందుకు పట్టించుకోలేదు?ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ రాజు గురించి చదివితే అభివృద్ధికాముకుడూ సంస్కర్తా అని వూదర గొట్టేస్తున్నారు!మరి అంత సంస్కరణ శీలి రాజ్యంలో భీంరావ్ అంత భయంకరమైన వివక్షని ఎదుర్కోవడం నాకు నమ్మదగ్గదిగా అనిపించడం లేదు."Another popular social revolution he supported was the abolishment of caste differences amongst his subjects. In 1925, he famously held a banquet at the Laxmi Vilas Palace, where men from all castes dined together. He was also a great votary of allowing Dalits to enter temples, a movement the likes of Ambedkar would push vigorously from 1927 onwards." అని రాజు గురించి చెప్తున్నది అబద్ధమా? అది అబద్ధం అయినప్పుడు మాత్రమే Waiting for a Visa కధనం యదార్ధం అవుతుంది!ఒకే కాలంలో ఒకే ప్రాంతం ఇద్దరు వ్యక్తులకి ఎవరి దృక్కోణానికి తగ్గ్గట్టు వారికి కనిపించడం అంటే ఇద్దరూ గానీ ఎవరో ఒకరు కానీ ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారనేది నా లెక్క!ఆ రాజు కూడా అంత గంభీరమైన వ్యక్తిత్వం గలవాడిలా కనపడటం లేదు - విశృంఖలత్వాన్నీ భోగలాలసత్వాన్నీ ప్రదర్శించే సన్నివేశాలు ఎక్కువగానూ ప్రజల పట్ల నిబద్ధతను గురించి చెప్పే సన్నివేశాలు తక్కువగానూ కనబడుతున్నాయి ఇతని జీవిత కధనంలో. సత్యం పట్ల నిబద్ధత గల చరిత్రకారులు పరిశోధించాల్సిన విషయాల్లో భీంరావ్ రాంజీ బరోడా ఉద్యోగకాలంలో ఎదుర్కొన్న అస్పృశ్యత/వివక్ష కూడా ఒకటి.
Waiting for a Visa కధనం పట్ల రెండు బలమైన అభ్యంతరాలు వున్నాయి నాకు.మొదటిది, రాజు అంత వుదారవాది అయినప్పుడు అసలు వివక్ష చూపించటానికే భయపడతారు ప్రజలు, ముఖ్యంగా భీంరావ్ రాంజీ వర్ణించిన సత్రం యజమాని లాంటివాళ్ళు ఇతను గనక రాజు గారి పేరు చెప్తే భయపడటానికే ఎక్కువ ఆస్కారం ఉంది - మరి భీమ్రావ్ రాజు పేరుని ఎందుకు ఉపయోగించుకోలేదు.ఇంక రాజు వైపు నుంచి చూస్తే తనే ధనసహాయం చేసి చదివించిన వ్యక్తి, అదీ అప్పటికే Mooknayak పత్రికతో సంఘసంస్కరణ చేస్తున్న రాంజీ పట్ల ఇతరులు వివక్ష చూపుతున్నారని తెలిస్తే ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు?ఇది కూడా జై భీం గాళ్ళు జవాబు చెప్పి తీరాల్సిన ముఖ్యమైన ప్రశ్న.
భీమ్రావ్ రాంజీ రాజకీయ రంగ ప్రవేశం 1924లో మార్చి 9న బొంబాయిలోని Damodar Hall నుంచి చేసిన ప్రసంగంతో జరిగింది,1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చేసింది.అంటే, ఆయన 23 సంవత్సరాలలో ఏమి చేశాడో చూస్తే మొత్తం ఆనాటి రాజకీయాల తీరుతెన్నులు కూడా తెలుస్తాయి."స్వరాజ్యం నా జన్మహక్కు!" అని గర్జించిన అతివాదుల నాయకుడు లోకమాన్య తిలక్ 1920లో అస్తమించాడు.కాంగ్రెసు నాయకత్వం మితవాదుల గ్రూపుకు నాయకుడైన గోఖలే శిష్యుడు గాంధీని వరించింది.అప్పటికే చంపారన్, ఖిలాఫత్, రౌలట్ నిరసన,జలియన్ వాలా బాగ్ ఉదంతం వంటివి జరిగిపోయి ప్రజల్ని ఉద్రేక పరుస్తున్నాయి.తొలినాటి మితవాద కాంగ్రెసు వాదులు "స్వతంత్రం" అనే మాటను కలలో కూడా తలచకుండా మహజర్లు సమర్పించడం "మాకివి ఇస్తే మీకింకా ఎక్కువ సేవ చేస్తాం!" అనే కబుర్లు చెప్తే మధ్యలో అతివాదుల వల్ల జాతీయత, దేశభక్తి, స్వతంత్రత పెల్లుబికి వందే మాతరం అనేది జాతి జీవన మంత్రమై మలినాటి మితవాదులు స్వయంపాలన కోసం ఉద్యమిస్తున్న తరుణమది!అయినప్పటికీ భీంరావ్ రాంజీ నోటినుంచి స్వాతంత్య్ర సాధన కోసం ఒక్కటంటే ఒక్క మాట కూడా రాలేదు, ఎందుకు?
అది అనుకోకుండా జరిగిన స్ఖాలిత్యం కాదు, ద్వితీయ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని చెప్తున్న గాంధీ అధ్వర్యంలో జరిగిన కాంగ్రెసు చెసిన ప్రతి కార్యక్రమాన్నీ విమర్శించాడు - అయినా కాంగ్రెసు ఇతన్ని తన ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిని చేసింది, అదెట్లా సాధ్యం!అతను కాంగ్రెసుని విమర్శించకపోతేనే ఆశ్చర్య పడాలి, ఎందుకంటే 1926 నుంచి అతను బ్రిటిష్ ప్రభుత్వ యంత్రాంగంలో అనేక హోదాలలో పని చేశాడు.డిసెంబర్ 1926లో బొంబే గవర్నరు అతనికి Bombay Legislative Council సభ్యత్వం ఇచ్చాడు.1936 వరకు ఆ సభ్యత్వంలో కొనసాగాడు.అప్పుడు కూడా Independent Labour Party పెట్టి ఎన్నికల్లో నిలబడటం కోసం బయటికి వచ్చాడు.13 రిజర్వుడు 4 జనరల్ స్థానాలకు పోటీ చేసి 11 రిజర్వుడు 3 జనరల్ స్థానాల్ని గెల్చుకుని 1942 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు.బొంబాయి లా కాలేజీకి ప్రిన్సిపాల్ వంటి అనేక పదవుల్ని చేపట్టి ఆంగ్లప్రభుత్వంతో మమేకమైనవాడు దేశానికి స్వాతంత్య్రాన్ని ఎట్లా కోరుకుంటాడు?అయితే, ఒక విషయాన్ని గమనించాలి - గాంధీతో సహా ఏ కాంగ్రెసు వాదీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ద్వేషించలేదు,పైన అత్యంత న్యాయవంతమైన పరిపాలన అని కీర్తించారు, అదెట్లా సాధ్యం!
ఈ రెండు అసాధ్యాలూ సుసాధ్యం ఎట్లా అయ్యాయో తెలుసుకోవాలంటే ఇంగ్లీషువాళ్ళు అడుగుపెట్టిన తొలినాళ్ళనుంచి జరిగిన చరిత్రను మన రాగద్వేషాలను పక్కనపెట్టి చూడాలి.స్వతంత్రం రాకముందు ఇంగ్లీషువాళ్ళు వాళ్ళకి అనుకూలంగా రాసుకుని, స్వాతంత్రం వచ్చాక కాంగ్రెసువాళ్ళు వాళ్ళకి అనుకూలంగా రాసుకుని, అతి హిందూత్వ వాదులు వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటున్న చరిత్ర నుంచి వాస్తవాల్ని బైటికి లాగితే గానీ ఆనాటి నాయకుల నిజస్వరూపం అర్ధం కాదు.శకుని దుర్యోధనుడికి చెప్పిన కూటనీతినే ఇంగ్లీషువాళ్ళు తొలినాళ్ళలో భారతీయ ప్రభువుల మీద ప్రయోగించారు - కాకపోతే పాండవులు ధర్మాత్ములు గనక దైవసహాయంతో గెలిచారు, ఆ ధార్మికతా ఆ దైవకృపా లేని మదమాత్సర్యపూరితులు పరస్పర హననంతో బలహీనులై ఆంగ్లేయులకి తలవంచారు, స్వాభిమానం గలవాళ్ళు పోరాడి నశించారు!మన చరిత్ర కారులు చెప్తున్న చిన్న చిన్న రాజ్యాలు ఉండటమూ అప్పటి రాజులలో ఐకమత్యం లేకపోవటమూ లాంటి కారణాలు నాణేనికి ఒక వైపునే చూపిస్తున్నాయి.మనం చదివిన చరిత్రలో గానీ మన నాయకుల మాటల్లో గానీ Rothschilds పేరు వినపడకపోవటం వల్ల నేను చెప్పేది కొందరు నమ్మలేకపోవచ్చు గానీ రాజుల బలహీనతల్ని రెచ్చగొట్టి యుద్ధాలను రప్పించి ఇరు పక్షాలకీ యుద్ధ రుణాలు ఇచ్చి ఎవరు ఓడినా గెల్చిన వాళ్ళని తమ చెప్పు కింద తేళ్ళలా వాడుకునే Rothschilds కుట్రని ఆనాటి రాజులు కనుక్కోలేకపోయారు.ఆ రకంగా చూస్తే మన దేశపు రాజుల్ని చాణక్యుడి అర్ధశాస్త్రాన్ని మర్చిపోయిన కుక్షింభరులైన నిరర్ధక జీవనుల కింద లెక్కించితే సరిపోతుంది.
అయితే, వాళ్ళ దోపిడీని కనుక్కోగలిగిన అవకాశం ఉన్న భీంరావ్ రాంజీ ఏం చేశాడు? అదే దోపిడీని మరింత పెద్ద ఎత్తున చేసుకునేటందుకు సహకరించాడు!అప్పటి నాయకుల్లో ఎవరికీ ఆర్ధికశాస్త్రంలో ఓనమాలు కూడా రావు.ఇవ్వాళా ఆంధ్రాలో "రావాలి జగన్ టటం! కావాలి జగన్ టటం!" పాటలు పాడిన జఫాగాళ్ళలాగే అందరూ స్వతంత్రం వచ్చేస్తే చాలు అద్భుతాలు చేస్తామని వూదర గొట్టడం తప్పిస్తే స్వతంత్రం వచ్చాక ఎలా పరిపాలించాలనే స్పష్టత లేదు. ఆర్ధిక శాస్త్రంలో మంచి పట్టున్న భీంరావ్ రాంజీ ఏమో బ్రిటిష్ ప్రభుత్వం తరపున పని చేస్తున్నాడు. పోనీ ఇతరులు ఏమన్నా పత్తిత్తులా అంటే గాంధీ అధ్యక్షతన కాంగ్రెసు చేసిన అన్ని ఉద్యమాలకీ ధనసంపత్తిని కూర్చింది టాటా బిర్లాలు - వీళ్ళు ఈస్టిండియా కంపెనీ వాళ్ళ అన్ని రకాల దోపిడీ వ్యాపారాల్లోనూ వాటాలు ఉన్న భాగస్వాములు. ఈ నిజమైన చరిత్రని బైటికి తీస్తే తమకీ దెబ్బ గనకనే భాజపా వాళ్ళు కాంగ్రెసు పార్టీకి చెందిన నెహ్రూనీ గాంధీనీ విలన్లని చేసి తిరిగి అదే కాంగ్రెసు నుంచి కొత్త హీరోల్ని తెచ్చుకోవాలని చూస్తున్నారు.
ఇప్పటికి మహారాష్ట్ర ప్రభుత్వం భీంరావ్ రాంజీ రచనల 14 సమగ్ర సంపుటాల్ని ప్రచురించితే 1946కు ముందరివైన మొదటి 12 సంపుటాల  7,371 పేజీల్లో ఒక్క వాక్యం కూడా అతను భారతదేశానికి స్వతంత్రాన్ని కోరుకున్న దాఖలాల్ని చూపించటం లేదు - బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక భాగమైన వ్యక్తి స్వాతంత్య్రోద్యమాన్ని వ్యతిరేకించడంలో ఆశ్చర్యం ఏముంది?తమనూ తమ ఉద్యమాన్నీ వ్యతిరేకించి తమ నాయకుడి మీద ఎక్కడ బడితే అక్కడ ద్వేషం వెళ్ళగక్కినవాణ్ణి తమ మంత్రివర్గంలోకి తీసుకున్నందుకు కాంగ్రెసువాళ్ళు ఆనాడూ సిగ్గు పడలేదు, ఈనాడూ సిగ్గు పడరు, రేపెప్పుడో సిగ్గు పడటానికి అవకాశమూ లేదు!
వాళ్ళలా ఎందుకు తీసుకున్నారో తెలుసా!భారతీయుల కష్టార్జితాన్ని భారత ప్రభుత్వం చేతనే లండను బ్యాంకర్ల నేల మాళిగల్లోకి పంపించటానికి కనిపెట్టిన సక్షన్ పైపు లాంటి రిజర్వ్ బ్యాంకుని మన నెత్తిన రుద్దడంలో అంబేద్కర్ మాత్రమే సమర్ధుడు గనక వాళ్ళు తీసుకోమని ఆజ్ఞాపించారు, వీళ్ళు తమనూ తమ ఉద్యమాన్నీ వ్యతిరేకించి తమ నాయకుడి మీద ఎక్కడ బడితే అక్కడ ద్వేషం వెళ్ళగక్కినవాణ్ణి తమ మంత్రివర్గంలోకి తీసుకున్నారురాజ్యాంగ రచన గురించి ఇవాళ చెప్తున్న కధలు కూడా అంతే.1947 ఆగస్టు 29Dr. B.R. Ambedkar అధ్యక్షతన C Rajagopalachari, Rajendra Prasad, Jawaharlal Nehru, Vallabhbhai Patel, Kanaiyalal Maneklal Munshi, Ganesh Vasudev Mavalankar, Abul Kalam Azad, Shyama Prasad Mukherjee, Balwantrai Mehta వంటి ఉద్దండుల్ని కూడా సభ్యుల్ని చేసిన కమిటీ మూడేళ్ళ పాటు కష్టపడి తయారు చేసిన రాజ్యాంగ రచనకి ఒకే ఒక వ్యక్తిని కర్తని చెయ్యడం ఎంతవరకు న్యాయం?అదీ గాక, సభలో ప్రవేశపెట్టిన ప్రతిని యధాతధం ఆమోదించలేదు, "While deliberating upon the draft Constitution, the Assembly moved, discussed and disposed of as many as 2,473 amendments out of a total of 7,635 tabled. While deliberating upon the draft Constitution, the assembly moved, discussed and disposed of as many as 2,473 amendments" అనేది వాస్తవం అయినప్పుడు ఒకే ఒక వ్యక్తిని కర్తని చెయ్యడం మొత్తం సభని అవమానించినట్లు కాదా!
నిజానికి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వతంత్రం ఇచ్చెయ్యడానికి నిశ్చయించుకున్న 1935ల నాటి తొలి రోజుల్లోనే రాజ్యాంగ రచనా రిజర్వ బ్యాంకు నిర్మితీ మొదలు పెట్టేశారు.రాజ్యాంగ రచన పేరుతో జరిగిన హడావిడి అంతా అనేక దేశాల రాజ్యాంగాలని పరిశీలించి తయారు చేశారనే బిల్డప్ ఇవ్వటం కోసం చేసిన కవరప్ - ఇవ్వాళ కమిటీ తిరిగిందని చెప్తున్న దేశాలు కూడా బ్రిటిష్ వలసలే కదా!Indian Constitution was prepared by illuminati freemasons. It is just a copy paste from constitutions and other documents of different nation states which in turn are prepared by illuminati freemasons.మీకింకా రాజ్యాంగం స్వాతంత్రం వచ్చాక ఏర్పడిన కమిటీ తయారు చేసిందనే భ్రమ ఉంటే మూడే మూడు సార్లు జరిగిన రవుండ్ టేబుల్ కాన్ఫరెన్సుల చరిత్రనీ సైమన్ కమిషన్ వంటి వాటి సారాంశాన్నీ ఒకసారి శ్రద్ధగా చదవండి - ఆయా కమిషన్ల ఏర్పాటులో భీంరావ్ రాంజీ కూడా ఉన్నాడు.అవన్నీ స్వతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం అనుసరించటం కోసం రాసినవి కావు, అప్పుడు అధికారం వెలగబెడుతున్న బ్రిటిషర్లకి సౌకర్యంగా ఉండటం కోసం చేసుకున్న చట్టాలు.

Members of the Simon Commission:
Sir John Simon, MP forSpen Valley (Liberal, chairman)
Clement Attlee, MP forLimehouse (Labour )
Harry Levy-Lawson, 1st Viscount Burnham 
Edward Cadogan, MP forFinchley (Conservative)
Vernon Hartshorn, MP for  Ogmore (Labour )
George Lane-Fox, MP forBarkston Ash (Conservative)
Donald Howard, 3rd Baron Strathcona and Mount Royal 
ALL FREEMASONS / ROTHSCHILD PUPPETS

From 1927 to 1931 Simon chaired the Indian Constitutional Development Committee, known as the Simon Commission on India's constitution.In 1929, Ambedkar made the controversial decision to co-operate with the all-British Simon Commission which was to look into setting up a responsible Indian Government in India.
Round Table Conference, (1930 – 32), in Indian history, a series of meetings in three sessions called by the British government to consider the future constitution of India. The conference resulted from a review of the Government of India Act of 1919, undertaken in 1927 by the Simon Commission, whose report was published in 1930. The conference was held in London.అంటే, రాజ్యాంగ నిర్మాణం కోసం కమిటీ ఏర్పాటు చెయ్యకముందే రాజ్యాంగం దాదాపు తయారైపోయింది - సైమన్ గో బ్యాక్ అని మనవాళ్ళు అరిచిన అరుపులు ఏమైపోయాయి?ఈ దేశభక్తులు దేన్నయితే గో బ్యాక్ అన్నారో ఆ కమిటీలో ఒక సభ్యుడైన భీంరావ్ రాంజీ దాన్నే ముందుకు తెచ్చి మన నెత్తిన రుద్దాడు, ఎంత తెలివైనవాళ్ళు కాంగ్రెసువాళ్ళు!
భీంరావ్ రాంజీ కమ్యునిష్టుల ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది తన దళిత రాజకీయాల ఎజెండాకు వ్యతిరేకం గనకనే, ఆర్య దోపిడీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించకపోతే దళిత ఉద్యమానికి పునాది అయిన మూలవాసీ వాదం ఉనికి అసాధ్యం!అయితే కమ్యూనిష్టుల ఆర్యద్రవిడ సిద్ధాంతంలో తను పట్టిన తప్పులు బలమైనవే, ఇవ్వాళ అది అబద్ధమై తేలిపోయింది. కానీ తను తయారు చేసింది కూడా కుట్రపూరితమైన రాజకీయమే - దీనికి బైటినుంచి సాక్ష్యాలు చూపించి సొంత విశ్లేషణలు చెయ్యనక్కర్లేదు, భీంరావ్ రాంజీ అధ్వర్యంలో జరిగిన ఉద్యమాలని దగ్గరనుంచి చూస్తే చాలు.సొంత పార్టీ పెట్టే వరకూ బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి ఇవ్వాళ భీంరావ్ రాంజీ నడిపించాడని చెబుతున్న హరిజనుల ఆలయ ప్రవేశం మొక్కుబడి తంతులు ఏవీ తను దగ్గరుండి పాల్గొనలేదు.డబ్బు సమకూర్చి B.K.Gaikwad లాంటి కెప్టెన్లకి పురమాయించేవాడు.
1934 మార్చి 5న తన కెప్టెనుకి రాసిన ఉత్తరంలో ఈ సత్యాగ్రహాలు అన్నీ తను మతంలో నమ్మకం ఉండి చేస్తున్నవి కావనీ, కేవలం వీటి వల్ల అస్పృశ్యులు ఆలయాలోకి ప్రవేశపెట్టగలిగితే వాళ్ళు హిందూసమాజంలో సమాన స్థానాన్ని పొందగలుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్ని సమర్ధిస్తున్నాననీ అన్నాడు.వ్హాట్!అస్పృశ్యులు ఆలయాల్లోకి వెళ్ళగలిగితే చాలు, సమస్య పరిష్కారం అయిపోతుందా?వ్హాట్, వ్హాట్!!మరి, అస్పృశ్యుల ఆలయ ప్రవెశం అనేది ఆధ్యాత్మిక సమస్య మాత్రమే అయితే దాన్ని మొత్తం రాజకీయ సామాజిక ఆర్ధిక సమస్యగా ఎందుకు సాగదీసినట్టు?కాంగ్రెసు పార్టీ అప్పటికే స్వతంత్రం కోసం పోరాడుతూ దాదాపు గెలిచే దశలో రాజకీయాల్లో అడుగుపెట్టి సాగినంతవరకు బ్రిటిష్ వాళ్ళతో అంటకాగి తన పార్టీకి కావలసిన ప్రత్యేక పునాది కోసం తన ఇల్యూమినాటీ ఫ్రీమాసన్ మేధస్సుతో కేవలం మతానికి సంబంధించిన సమస్యని అన్ని రంగాలకీ అంటించటం ఎంత దారుణం!తను మతం మార్చుకోవటం కూడా నిజాయితీగా చెయ్యలేదు - Religious conversion is not inspired by any material motive. There is hardly anything, which I cannot achieve even while remaining an untouchable. అని కుండబద్దలు కొట్టేశాడు!వ్హాట్?అవును!My philosophy of liberty, equality and fraternity were not borrowed from the French Revolution but were derived from the teachings of the Buddha అని కూడా అన్నాడు. హ్హో మై గ్గాడ్డ్! ఏ బుద్ధుడు liberty, equality and fraternity గురించి చెప్పాడండీ - బహుశా ఫ్రెంచ్ రివల్యూషనును సృష్టించిన మాసన్రీ మతానికి చెందిన Deweyian బుద్ధుడు చెప్పి ఉంటాడు!
పోనీ తను మతం పట్ల నిర్లక్ష్యం ఉన్నవాడు గాబట్టి అందరికీ హేతువాదం గురించీ చెప్పలేదు,"some people think that religion is not essential to society. I not hold this view. I consider the foundation of religion to be essential to life and practices of society." అని మతాన్ని అనుసరించమనే చెప్తున్నాడు - తను మతాన్ని నమ్మట్టకానీ జనాలు మాత్రం నమ్మాల్ట!హుమ్మ్!ఆరు నెల్ల క్రితం ఈయనొక్కడే ప్యూర్, మిగిలిన వాళ్ళు ఎవిల్ అనుకుని మాన్యశ్రీ అంబేద్కర్ గారు అని పిలుద్దామని డిసైడ్ అయ్యాను.దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇన్నాళ్ళూ దూరం నుంచి చూసిన మోనాలిసా పిక్చర్ కొంచెం దగ్గిరకెళ్ళి చూసేసరికి గైర్నికా ఆయ్యింది - బాప్ రే!
ఇప్పుడు "ద్వితీయ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని చెప్తున్న గాంధీ అధ్వర్యంలో జరిగిన కాంగ్రెసు చెసిన ప్రతి కార్యక్రమాన్నీ విమర్శించాడు - అయినా కాంగ్రెసు ఇతన్ని తన ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిని చేసింది, అదెట్లా సాధ్యం!" అనే చిక్కుముడిని విప్పుదాం.భీంరావ్ రాంజీ తను చెప్పుకున్నదీ జై భీం గాళ్ళు చెప్తున్నదీ కాంగ్రెసు పిలిస్తేనే దయదల్చి చేరాడని. ఆ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చేటప్పుడు "It is now 4 years, 1 month and 26 days since I was called by the prime minister to accept the office of the law minister in the Cabinet. The offer came as a great surprise to me. I was in the opposite camp and had already been condemned as unworthy of association when the interim government was formed in August 1946. I was left to speculate as to what could have happened to bring about this change in the attitude of the prime minister. I had my doubts. I did not know how I could carry on with those who had never been my friends. I had doubts as to whether I could, as a law member, maintain the standard of legal knowledge and acumen which had been maintained by those who had preceded me as law ministers of the government of India. But I kept my doubts at rest and accepted the offer of the prime minister on the ground that I should not deny my co-operation when it was asked for in the building up of our nation..." అంటూ చాలా చెప్పుకొచ్చాడు.ఒకసారి చదివేసి వూరుకోవడం కాదు, ఒకటికి పదిసార్లు నిదానించి చదివితే ఆ మాటల్లో ఎంత అహంభావం కనిపిస్తుందో చూడండి!కాంగ్రెసువాళ్ళు కూడా మరీ అమాయకులేం కాదు గానీ ఉద్యమం చేసింది వాళ్ళు, దెబ్బలు తిన్నది వాళ్ళు, జైళ్ళకి వెళ్ళింది వాళ్ళు,వాళ్ళని అడుగడుగునా అని తిట్లు తిట్టిన తనని మంత్రివర్గంలోకి తీసుకోవడం ఎట్లా సంభవించింది?దానికి సంబంధించి ఒక్క మంచి మాట లేదేంటి!
నిజానికి మంత్రివర్గంలో స్థానం కోసం దేబిరింపు ఇతని వైపునుంచే వెళ్ళింది - జగజ్జీవన్ రాం గారి భార్య ఇంద్రాణి దేవి తన డైరీలో Ambedkar ki sifaarish అనే తలకట్టు పెట్టి "And on this side Ambedkar had started coming over to our house. One day he (Ambedkar) told him to put in a word with Gandhiji to have him (Ambedkar) included in the Cabinet. Before talking to Gandhiji he (Jagjivan Ram) talked to Sardar Patel. Sardar Patel said, do what you think is appropriate. He (Jagjivan Ram) got into quite a quandary — that Ambedkar had always opposed Gandhiji and the Congress, how could he now recommend his case to Gandhiji? Even so, given his large-heartedness, he pleaded with Gandhiji on behalf of Ambedkar, and told him that as he has surrendered in front of you please request Nehruji so that he may be taken into the first Cabinet." అని రాసుకున్నారు.ఇది ఏమి వింత?అసలు జగజ్జీవన్ రాం గానీ గాంధీ గానీ నెహ్రూ గానీ ఒక పట్టాన ఒప్పుకునేవాళ్ళు కాదు, వాళ్ళు మాత్రం ఉప్పూ కారం తింటం లేదా?తిట్టిన తిట్లు మామూలువా!మొదట ఇంగ్లీషువాళ్ళ దగ్గిర మొర్ర పెట్టుకున్నాడు, అన్నాళ్ళు చాకిరీ చేశాడు గదాని జాలిపడి వాళ్ళు మాటసాయం చేశారు, వాళ్ళ మాట కాదన్లేక వీళ్ళు మొహమాట పడ్డారు.
అలా తెగదెంపులు  చేసుకుని 1952లో సోషలిస్టులతో సర్దుబాటు చేసుకుని కాంగ్రెసుకు వ్యతిరేక కూటమి పెట్టి పోటీ చేస్తే 489 లోక్సభ స్థానాల్లో కాంగ్రెసు 364 సీట్లు గెల్చుకుని నాల్గింట మూడొంతుల మెజారిటీని సాధించడంతో రిక్తహస్తాలతో నిలబడ్డాడు.అతన్ని అభిమానించి జీవిత చరిత్ర రాసిన Dhananjay Keer సైతం "It was a colossal failure, and Ambedkar fell like a rocket," అని ఒప్పుకుని "It proved once again that there is no gratitude in politics. The nation which had conferred so much glory on him seemed now unwilling to show him gratitude..." అని నిట్టూర్చాడు!
The nation which had conferred so much glory on him అనే స్థాయి ఫోకస్ కూడా ఇంగ్లీషువాళ్ళు తమకి పనికొస్తాడని చేసిపెట్టిన ప్రచారం వల్ల వచ్చిందే - 1937 ఎన్నికల నాడు వచ్చిన ఫలితాలతో అధికారంలో కూర్చోబెట్టి ఆడించుకోవడానికి పనికిరాడని తెలియగానే ఇల్యూమినాటీ సంప్రదాయం ప్రకారం వాళ్ళు వదిలెయ్యబట్టే మంత్రివర్గంలో చేరడానికి అంత దేబిరించాల్సి వచ్చింది.ఎవరు ఎవరికి కృతజ్ఞత చూపించాలి!నిన్నటి వరకు స్వతంత్రం రాకూడదని కోరుకోవడమే కాకుండా ఇవ్వొద్దని బ్రిటిషర్లకి పదే పదే బహిరంగ విజ్ఞప్తులు చేస్తూ స్వతంత్రం కోసం పోరాడుతున్న పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా గడిపేసి నవ్విన నాపచేను పండినట్టు స్వతంత్రం తెచ్చుకుని అధికారం చేపట్టిన అదే పార్టీని రహస్యంగా బతిమాలుకుని మంత్రి పదవిని చేపట్టినవాడికి తనకు మంత్రి పదవిని ఇచ్చినవాళ్ళ పట్ల లేని కృతజ్ఞత  ఇతరులకి అతని పట్ల ఎందుకు ఉండాలి?
కాంగ్రెసు పార్టీ అంబేద్కరుకు కృతజ్ఞత ఎందుకు చూపించాలి!కాంగ్రెసు పార్టీ కాదు, ఈ దేశ ప్రజలు మాత్రం భీంరావ్ రాంజీని ఎందుకు గౌరవించాలి?హిందూ ధర్మాన్ని అవమానించేలా బ్రాహ్మణ ద్వేషాన్ని తన అనుచరులకి యెక్కించి స్వాతంత్రం వచ్చాక కూడా కులద్వేషాలను రగిలించే మందని అచ్చోసిన ఆంబోతుల్లా వదిలినందుకు శిక్ష వెయ్యాలి!ఇవ్వాళ జై భీం గాళ్ళు అసలు పేరును వదిలేసి దేన్నయితే ఆ వ్యక్తికి పర్యాయపదంగా చెప్పుకుంటున్నారో ఆ ఇంటిపేరును ఇచ్చింది బ్రాహ్మణుడు, తనకి గొప్ప సత్కారం జరుగుతుంటే ప్రశంసించి బుద్ధుణ్ణి పరిచయం చేసింది బ్రాహ్మణుడు, తన పై చదువులకి ధనసహాయం అందేటట్టు చేసింది బ్రాహ్మణుడు - అయినా జై భీం గాళ్ళు బ్రాహ్మణుల్ని తిడతారు.దీనికి బీజాలు పడింది ఎప్పుడు?మహద్ సత్యాగ్రహం నాడు అగ్రవర్ణాల వారు అస్పృశులు దిగడం వల్ల మలినపడిన చెరువును శుద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మైల సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తూ చెరువులో దిగిన Bapurao Joshi కూడా బ్రాహ్మణుడే, కాదా?అయినా సరే సంఘరక్షిత ఉటంకించిన బ్రాహ్మణులు, అస్పృశ్యతను వ్యతిరేకించినప్పటికీ ఉద్యమంలోకి రావడానికి వీల్లేదని అన్న సన్నివేశం ఎందుకు జరిగింది?నిన్నటి రోజున మీ వెనకటి తరాల్ని పుట్టుకను బట్టి చిన్నబుచ్చినందుకు ఆవేశపడుతున్న కదిరి కృష్ణ లాంటివాళ్ళు ఇప్పటి రోజున సంస్కారవంతులైన బ్రాహ్మణుల్ని కూడా ఎందుకు అవమానిస్తున్నారు?ఆనాడు వీళ్ళని వేరేవాళ్ళు పుట్టుకని బట్టి అవమానించడం తప్పైతే ఈనాడు వీళ్ళు ఇతరుల్ని పుట్టుకని బట్టి అవమానించటం కూడా తప్పే కదా!దీనికి శుభం పలికేది ఎప్పుడు?
కదిరి కృష్ణ లాంటివాళ్ళకి "ఆనాడు వీళ్ళని వేరేవాళ్ళు పుట్టుకని బట్టి అవమానించడం తప్పైతే ఈనాడు వీళ్ళు ఇతరుల్ని పుట్టుకని బట్టి అవమానించటం కూడా తప్పే కదా!" అనే చిన్న పాయింటు తట్టక కాదు అలా ప్రవర్తిస్తున్నది - తను చెప్తున్నది అబద్ధం అని అబద్ధం చెప్పే ప్రతివాడికీ తెలుసు, తన అబద్ధాలతో ఇతరుల్ని నమ్మిస్తాడే తప్ప తను నమ్మడు!కొందరుంటారు, జై గొట్టిముక్కలనే చూడండి - లోకంలోని ఎన్నో విషయాలను గురించి ఎంతో నిష్పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తాడు, కానీ చంద్రబాబు దగ్గిర కొచ్చేసరికి వెర్రెత్తి పోతాడు!చంద్రబాబునే కాదు, చంద్రబాబుని ప్రశంసించే వాళ్ళని కూడా "పచ్చ" లేబుల్ తగిలించి ద్వేషిస్తాడు.కోడెల శివప్రసాద్ మృతి సందర్భంలో వైకాపా బ్లాగు దగ్గిర అతను వేసిన కామెంట్లు ఏ స్థాయిలో ఉన్నాయి!
మొత్తం రాష్ట్రపు ఆదాయంలో సింహభాగం తీసుకొస్తున్న హైటెక్ సిటీని హైదరాబాదులో నిలబెట్టింది ఎవరు?ఇవ్వాళ్టి TSRTC మాదిరి 1200 కోట్ల నష్టాలలో మూసివేతకు దగ్గరైన సింగరేణిని నాలుగేళ్ళలో లాభాల బాట పట్టించినది ఎవరు?హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ముచ్చటపడి ప్రచురించిన కేస్ స్టడీని అబద్ధం అనగలడా?ఆర్రూపాయల కరెంటును ఎక్కువెక్కువని యేడ్చిన కూల్చివేతన్ ఇవ్వాళ ఏం చేశాడు?అలాంటివాణ్ణి ముఖ్యమంత్రిని చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుందని ఆంధ్రావాళ్ళకి ఎదవ సలహా ఎలా ఇవ్వగలిగాడు? ఇవ్వాళ మా ఎదవ ఆ ఎదవ నుంచి బొగ్గు కొంటున్నాడంటే సింగరేణిని లాభాల్లో నడిపించటం వల్ల కాదా?ఆత్మవిమర్శ చేసుకునే స్థితి కూడా దాటిపోయిన మనిషికి ఎన్నిసార్లు చెప్పి ఉపయోగం ఏమిటి?అతను ఆత్మవిమర్శ చేసుకుంటే ఎవడిక్కావాలి?ఆత్మహననం చేసుకుంటే ఎవడిక్కావాలి?ఇక్కడ ఎందుకు అతన్ని ప్రస్తావిస్తున్నానంటే, కేసీయారు నుంచి కదిరి కృష్ణ వరకు గల వేర్పాటు వాదులకి ఇటువంటివాళ్ళే బలమైన పునాది.
ఇవ్వాళ ఈ దేశానికి పట్టిన ఖర్మ యేమిటంటే ఇటువంటివాళ్ళు ఒకప్పుడు తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా ఉన్నారు,మున్ముందు ఇంకా పెరుగుతారు, ఈ పెరుగుదల ఆగే సూచనలు కూడా లేవు!జాతీయ స్థాయిలో చూస్తే మోదీ అధికారం మొదలైనప్పటినుంచీ అబ్జివృద్ధికి అతి ముఖ్యమైన ఉపాధి కల్పన శాతం శరవేగాన తగ్గుతున్నప్పటికీ అతనికి మరింత మెజారిటీని ఇచ్చారు.ఇప్పుడు కాఫీడే యజమాని ఒక్కడే కాదు, చాలామంది  వ్యాపారస్తులు అప్పులు పుట్టని పరిస్థితుల్లో ఆల్లాడిపోతున్నారు, కార్ల పరిశ్రమ లాంటి అనేక రంగాలు సంక్షోభంలోకి వెళ్తున్నప్పటికీ ఆందోళన లేదు.ఆర్ధికశాస్త్రంలో ఓనమాలు తెలియని జర్నలిస్టు సాయి లాంటివాళ్ళు కూడా "ఒకటి రెండు పరిశ్రమలు మూలపడితే నష్టమేంటి, జనం కార్లు కొనడం మానేస్తారుపెట్రోలు వాడడం మానేస్తారు -  మంచిదే కదా!" అని భరోసాలు ఇచ్చేస్తున్నారు!కరెంటు విషయంలో జగన్ ఫెయిలవడం అనుభవం లేని వ్యక్తిని వ్యవస్థ మోసం చెయ్యడం కింద చిత్రీకరిస్తున్నారు, ఏ వ్యవస్థ ఎవర్ని మోసం చేస్తున్నది?ముఖ్యమంత్రి తనే ఏరి కోరి సలహాదారుల్ని ఎంచుకుంటుంటే వ్యవస్థ అతన్ని మోసం చెయ్యడం సాధ్యమా!పోలవరంలో జరిగిందంటున్న అవినీతి, అమరావతిని ఏటీయంలా వాడుకున్న చాణక్యం,కరెంటును నిలవలోకి తేవటంలోని మోసం - అధికారంలోకి వచ్చాక కూడా రుజువు చెయ్యలేకపోతున్నారు, ఎందుకని?10 రూపాయల ఇసకని 100 రూపాయలకి అమ్మటం, ప్రభుత్వమే మద్యాన్ని అమ్మడం,పదివేలు అక్కవుంటులో వేస్తామని ఆటోవాళ్ళకి చెప్పి ఒక్క రూపాయి మాత్రమే వెయ్యడం - ఇదంతా సమర్ధతే!
చరిత్రని అబద్ధాలతో నింపడం వల్ల అసలు జరిగినది తెలియకనే ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారు.మొన్నటి పార్లమెంటు ఎన్నికలకి సంబంధించిన సమాచారాన్ని తన వెబ్సైటులో ఉంచే ధైర్యం ఇప్పటికీ ఎలెక్షన్ కమిషనుకి రావడం లేదు!ఇప్పటికీ అక్కడ ఉన్న సమాచారం అధికారికమైనది కాదు, కౌంటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ఆఖరు ఫలితం రాక ఇంకా లెక్కిస్తున్న స్థితిలోనే ఎలెక్షన్ కమిషన్ యొక్క వెబ్సైటు నిద్ర పోతున్నది - ఇది దేనికి సంకేతం?అయినా, కమిషనర్లను నియమించడానికి గానీ తొలగించడానికి గానీ ప్రభుత్వానికి గానీ అధికారాలు ఉన్నప్పుడు ఎలెక్షన్ కమిషన్ సర్వ స్వతంత్ర సంస్థ ఎలా అవుతుంది!ఎలెక్షన్ కమిషనరు ఒక్కరో లేక కొద్ది మంది ఉద్యోగులో పెంపుడు కుక్కలు అయితే చాలు సగం గెలుపు ఖాయం - అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈవీయం టెక్నాలజీ తోడైంది!జనం వోట్లు వేసినా వెయ్యకపోయినా మళ్ళీ మళ్ళీ మోదీ, జగన్, కేసీయార్ గెలుస్తూనే ఉంటారు.
ఈ నియంతల దుర్నీతి అంతమయ్యేది ఎప్పుడు? ప్రజలు అబద్ధాల్ని అసహ్యించుకుని నిజాన్ని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు!ఈ సంస్కృతికి ఐహికం,ఆముష్మికం వేరువేరు కాదు - "ఏ వేదంబు పఠియించె లూత?భుజగంబే శాస్త్రము ల్చూచె?దానే విద్యాభ్యసనం బొనర్చె కరి?చెంచే మంత్ర మూహించె?బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా?కావు, నీ పాదసంసేవాసక్తియె కాక జంతుతతికి శ్రీకాళహస్తీశ్వరా!" అని భక్తిపాఠం చెప్పిన ధూర్జటి మహకవియే "జాతుల్సెప్పుట, సేవసేయుట, మృషల్ సంధించు, టన్యాయ విఖ్యాతిం బొందుట, కొండెకాడవుట, హింసారంభకుండౌట, మిధ్యాతాత్పర్యము లాడుటన్నియు బరద్రవ్యంబు నాశించి - యీ శ్రీ తానెన్ని యుగంబు లుండగలడో, శ్రీకాళహస్తీశ్వరా!" అని లోకజ్ఞానం గుప్పించి చెప్పాడు.
సత్యం పునాదుల మీద నిలబడినప్పుడు ప్రపంచానికి సంపదని సృష్టించడం నేర్పిన సనాతన ధర్మం అసత్యం అండన చేరడం వల్లనే అంతు లేని దరిద్రాన్ని అనుభవిస్తున్నదనేది రాగద్వేషరహితులైన చరిత్రకారులు పదే పదే నిరూపించి చెప్తున్న శాశ్వత సత్యం!ఏది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...