Tuesday 10 May 2016

ఓ రామ - నీ నామ మెంతో రుచి,ఎంతో రుచి రా!

                          సీ||మోటు నిషాదుడు మౌనివరుడు పోవు
                              మార్గాన క్రూరత్వ మావహించి

                              జోడుకూడిన జంట క్రౌంచములందు పో
                              తును కూల్చగా యాడుదాని బాధ

                              మనసును కదిలించి మరిమరి వేధించి
                              శాపమై.నిందయై - కావ్యధార

                              గంగయై పొంగి - లోకాన మరల నిట్టి
                              ఘాతుకమును చేయ కుండునట్టి

                         తే||సాధు సజ్జనులను పెంచు దీక్ష తోడ
                             గిరులు ఝరులు ఉండువరకు నిలిచిపోవు
                             రామకధను తీరిచి దిద్దినాడు మౌని,
                             సాహితీమూర్తు లందు శాశ్వతుడు గాగ!
(17.07.2015)
------------------------------------------------------------------------------------------------------------------------------
          రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు. 

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం
నారదం పరిపప్రచ్చ వాల్మీకి ర్ముని పుంగవం

స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః
ఋషిభిః పూజిత స్సమ్యగ్ యథేంద్రో విజయీ పురా

విశ్వామిత్ర స్స ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవ మబ్రవీత్

తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్యస నిశాంపతేః
శయనీయం నరేంద్రస్య త దాసాద్య వ్యతిష్ఠత

వనవాసం హి సంఖ్యాయవాసాంస్యా భరణాని చ
భర్తార మనుగఛ్చంత్యై సీతాయై శ్వశురో దదౌ

రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కూలవతాం కులం
రాజా మాతా పితా చైవ రాజ అహితకరో నృణాం

నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుం
ఉటజే రామ మాసీనం జటావల్కల ధారిణం

యది బుద్ధిః కృతా ద్రష్టు మగస్త్యం తం మహామునిం
అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః

భరత స్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమచ ప్రబో
మృగరూప మిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి

గఛ్ఛ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం
వయస్యం తం కురు క్షిప్రమితో గత్వాద్య రాఘవ

దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియాప్రియే
సుఖదుఃఖ సహః కాలే సుగ్రీవ వశగో భవ

వంద్యాస్తే తు తపస్సిద్ధాః తపసా వీతకల్మషాః
స్రష్టవ్యాశ్చాపి సీతాయాః ప్రవృత్తిం వినయాన్వితై

స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీం
నిక్రమేణ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః

ధన్యా దేవా స్స గంధర్వా స్సిద్ధాశ్చ పరమర్షయః
మమ పశ్యంత యే నాధం రామం రాజీవలోచనం

మంగళాభిముఖీ తస్య సా సదాసీ న్మహాకపీః

ఉపతస్థే విశాఅక్షీ ప్రయతా హవ్యవాహనం

హితం మహార్థం మృదుపూర్వ సంహితం
వ్యతీత కాలాయతి సంప్రతి క్షమం

నిశమ్య తద్వాక్య ముపస్థిత జ్వరః
ప్రసంగ హనుత్తరమే తద బ్రవీత్

ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తోయం విభీషణః
లంకైశ్వర్యం ధృవం శ్రీమానయం ప్రాప్నోత్యకంటకం

యో వజ్రపాతాని సన్నిపాతానన చుక్షుభే వాపి చచాల రాజా
స రామబాణాభిహతో భృశార్తశ్చచాల చాపం చ చముమో చ వీరః

యస్య విక్రమ మాసాద్య రాక్షసా నిధనం గతాః
తం మన్యే రాఘవం వీరం నారాయణ మనామయం

న తే దదృశిరే రామం దహంత మరివాహినీం
మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మనా

ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ
బద్ధాంజలి పుటా చేద మువాచాగ్ని సమీపతః

చలనా త్పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపితాః
చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరం

దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాఛ్ఛాదన భాజనం
సర్వమేవావిభక్తం నో భవిష్యతి హరీశ్వర

యామేవ రాత్రిం శతృఘ్నః పర్ణశాలాం సమావిశత్
తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా దారకద్వయం


ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీ బీజసంయుతం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే

          నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు రామాయణంలో ప్రక్షిప్తాలు ఉన్నాయనీ,వాటిని తొలగించితే గానీ వాల్మీకి రామాయణం శుద్ధంగా ఉండదనీ పండితులు చాలా చర్చలు చెయ్యడం జరిగిందని విన్నాను.అప్పట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు.తర్వాత నిజం అయినా అయ్యుండొచ్చు అనిపించింది.కొన్ని తరాల పాటు చెప్పుకుంటూ వస్తున్న కధలో ఎక్కడో అక్కడ ఎవరో ఒకరికి తన పాండిత్యం కూడా అందులో ప్రదర్శించుదామనే దౌర్బల్యం ఉన్నవాళ్ళు కలిపితే కలిపి ఉండవచ్చు అనుకున్నాను.కానీ,ఈ గాయత్రీ రామాయణం గురించి తెలిశాక మాత్రం అలా జరిగి ఉందటానికి వీల్లేదు కదా అనిపిస్తున్నది.ప్రక్షిప్తాలతో సహా అందరూ కలిపి 24,000 శ్లోకాలకి అమర్చిన తర్వాత ఈ వరస రావడం తర్కానికి అందనిది - వాల్మీకి ముందుగానే అనుకుని చేస్తే తప్ప మామూలుగా అయితే ఇలా కుదరడం అసంభవం!రామాయణంలో వాడిన చందస్సు అనుష్టుప్ చందస్సు, పాత్రల పేర్లలో ఉన్న మార్మికత చూస్తే అపురూపం, యోగశక్తి జ్ఞానచక్రాల గుండా ప్రయాణం చేసేటప్పుడు సాధకుడికి కలిగే అనుభూతుల్ని కధాకధనంలో కనిపించే మలుపుల్లో వర్ణించి చెప్పటం:శివధనుర్భంగం జరిగినప్పుడు వర్ణించినది సాధకుడి మనస్సులో తొలిసారి దైవసంస్పర్శ జరిగినప్పటి అంతర్లోకపు భీబత్సాన్నే - వీటిల్లో దేనిని మనం కాకతాళీయంగా రాశాడని చెప్పగలం?ఇదీ అంతే,నిన్న గాక మొన్న చదివినవి ఇవ్వాళ్టికి మర్చిపోయేవాళ్ళు ఇంతకాలం గుర్తుంచుకునే విధంగా ఒక కధని చెప్పినవాడు మహామేధావి!అట్లాంటివాడి కవిత్వంలో తప్పులు వెదకటం,తన పైత్యం కొంత చేర్చటం కుదిరే పని కాదు!

          మంత్రాలలో గాయత్రీ మంత్రం శ్రేష్ఠమైనది అయితే ఆ గాయత్రిని ఇముడ్చుకున్న రామాయణం కూడా శ్రేష్ఠమైనదే అవుతుంది.సనాతన ధర్మంలో నిర్లక్ష్యం చెయ్యకూడని అవమానించకూడని అత్యంత మౌలికమైనవి మూడు - విశ్వామిత్ర గాయత్రి, ఈశావాస్యోపనిషత్తు ప్రధమ శ్లోకం, శ్రీ చక్ర యంత్రం!భరద్వాజ గాయత్రి,వశిష్ఠ గాయత్రి దాదాపు గాయత్రి,గణేశ గాయత్రీ మంత్రాలు అన్నీ ఒకే నిర్మాణం కలిగి ఉంటాయి.కానీ విశ్వామితుడు ప్రవచించిన సవితృ గాయత్రిలో భావం గొప్పది.వెలుగుని ఆహ్వానించటం!అంతటా నిండిపోవాలనుకోవటం!అందరికీ కోరుకోవటం - అందుకే గాధేయుడు విశ్వామిత్రు డయ్యాడు!!పశ్చిమ దేశాల వారు భౌతికమైన వాస్తవికతని గుర్తించి ప్రగతిశీలంగా ఉంటే మనవారు ఆధ్యాత్మికత పేరుతో సమాజాన్ని వెనక్కి నడిపిస్తున్నారని మేకాలే సృష్టించిన కొందరు రెటమతం చూపిస్తున్నారు గానీ వాస్తవికతని మన ప్రాచీనులు ఎప్పుడూ మరిచిపోలేదు.అలా మరిచిపోయి ఉంటే ఇలా మిగిలి ఉండేది కాదు.

          రామాయణం మొత్తం ఒక ఎత్తు సుందరకాండ ఒక ఎత్తు!మిగతా కాండల్లో ప్రత్యక్షంగా కనబడే రాముడు ఈ కాండలో పరోక్షంగా కనబడతాడు.మిగతా రామాయణ కధకి రాముడు నాయకుడైతే సుందరకాండలో జరిగే కధకి వాగ్విదాంవరుడైన కపిశ్రష్ఠుడు హనుమంతుడు అనుచర స్థానం నుంచి నాయకుడై యెదిగి తన విశ్వరూపం చూపిస్తాడు.ఇక్కడి విజృంభణ అంతా ఇంత గొప్పగా చూపించినవాడు రాముణ్ణి కలవగానే మళ్ళీ అనుచర శ్రేష్ఠుడిగా ఒదిగిపోతాడు!జగత్సుందరియైన సీతకీ పుంసాం మోహనరూపుడైన రాముడికీ ఆనందం కలిగించటం కొసం కపిసుందరుదైన హనుమంతుడు ఒక దుష్కర కార్యాన్ని నెత్తిమీద వేసుకుని అపజయం అంచుల వరకూ వెళ్ళి నిరాశపడి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి మళ్ళీ కూడదీసుకుని తనకి తనే జీవితాశని రగిలించుకుని రెట్టించిన పట్టుదలతో అదృష్టం కూడా తోడై కార్యసాఫల్యత వైపుకి ప్రయాణించిన దృశ్యాలని వాల్మీకి భూతద్దంలో పెట్టి చూపించి వర్ణించాడు.మాటిమాటికీ చావుని గురించి కొటేషన్లు రాసుకుని పులకించిపోతూ నాకు ఉరితాళ్ళు కావాలి,నన్ను చంపండి,నన్ను చంపండి అని అఘోరించేవాళ్ళు ఇలాంటివి చదవనే చదవరు గానీ సుందరకాండలో తొమ్మిది అతి ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి.ఛందస్సు రీత్యా వాటిని శ్లోకాలు అని వూరుకోవచ్చును గానీ వాటిలోని భావం కూడా గొప్పదే గనక మంత్రాలే అవుతాయి.శ్రీ రామాయణ మహామాలా నవరత్న మంత్రావళి అని పిలిచే తొమ్మిది శ్లోకాల్నీ అర్ధం తెలుసుకుని ప్రతి రోజూ జపిస్తూ ఉంటే ఒక సంవత్సరం తర్వాత అంతకు ముందరి జీవితానికీ అప్పటి జీవితానికీ తేడా మీకే తెలుస్తుంది.

శ్లోకం:-తతో రావణ నీతాయా సీతాయాః శత్రుకర్షణః
       ఇయేవ పదమన్వేష్టుం చారణా చరితే పధిః
భావం:-రావణునిచే అపహరించబడిన సీతను వెదకటానికి శత్రుకర్షణుడైన హనుమంతుడు చారణులు సంచరించే ఆకాశమార్గాన్ని యెన్నుకున్నాడు.
సారం:-ఈ శ్లోకం గాయత్రీ మంత్రంలోని 12వ అక్షరంతో సంవదిస్తుంది.గాయత్రీ మంత్రంలో ప్రశంసించబడిన దైవం సూర్య భగవానుడు.సూర్యుడు ఆకాశానికి అధిపతి.సూర్యదేవుని అనుగ్రహ ప్రాప్తికి నిర్దేశించబడిన రత్నం మాణిక్యం.మాణిక్యం రామావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యధాతవ
       ధృతి ర్దృష్టి ర్మతి ర్ధాక్ష్యం స్వకర్మసు నసీదతి
భావం:-ఓ వానరేంద్రా!నీకు విజయం సాధించటానికి తోడ్పడే నాలుగు ప్రధాన లక్షణాలు - జ్ఞాపకశక్తి,మేధస్సు,పట్టుదల,నేర్పు ఉన్నాయి.అందుచేత నీవు తప్పక విజయం సాధిస్తావు.
సారం:-ఈ మంత్రంలో నిక్షిప్తమైన విజయ రహస్యం మనస్సుకు సంబంధించినది.మనస్సును ప్రభావితం చేసే గ్రహం చంద్రుడు.చంద్రునికి ప్రీతిపాత్రమైన రత్నం ముత్యం.ముత్యం కృష్ణావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖం
       అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తకః
భావం:-ఐశ్వర్యానికి మూలం ఉత్సాహం.అదే అపరిమితానందానికి హేతువు.నిజానికి అన్ని యత్నాలకూ చోదకశక్తి ఇదే.విజయరహస్యం కూడా ఇదే.
సారం:-ఈ మంత్రం హనుమంతునిలోని ఆశావాదాన్ని వివరిస్తుంది.ఋణం,ఒత్తిడి మొదలైన మానసిక వ్యధలకు అంగారక గ్రహమే కారణం.అంగారకుడు శుభకరుడైతే అన్నిరకాల వ్యధల నుండి దూరం చేసి సర్వశుభాల నిస్తాడు.అంగారకునికి ప్రీతిపాత్రమీన్ రత్నం పగడం.పగడం నృసింహావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ జనకాత్మజాయై
       నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
భావం:-రామ లక్ష్మణులకు నమస్కారం.దేవి జనకాత్మజకు నమస్కారం.ఉద్ర,ఇంద్ర,యమ,వాయు,చంద్ర,సూర్య మరుద్గణాలకు నమస్కారం
సారం:-ఈ ప్రార్ధన చేసిన మరునిముషంలోనే హనుమంతుడు అశోకవనంపై దృష్టి సారించడం జరిగింది.అందువల్లనే దీనిని పండితులు కార్యసాఫల్యమంత్రంగా గుర్తించారు.మనస్సుబు సరైన సమయంలో సరైన మార్గంలో నడిపించటానికి నిర్దిష్టమైన గ్రహం బుధుడు.బుధుడు శుభకరుడైతే సునిశిత భావాలు అవసర సమయంలో స్ఫురిస్తాయి.బుధునికి ప్రీతిపాత్రమైన రత్నం పచ్చ.పచ్చ బుద్ధావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-ప్రియాన్న సంభవేత్ దుఃఖం అప్రియాత్ అధికం భయం
       తాభ్యాం హి వియుజ్యంతే నమస్తేషాం మహాత్మానం
భావం:-మనకు కలిగే దుఃఖాలన్నింటికీ మూలకారణం - వస్తువులతో గానీ,వ్యక్తులతో గానీ,విషయాలతో గానీ మనకు గల అనుబంధాల నుండి ఎక్కడ వియోగం కలుగుతుందోనని భయపడటం.అలాంతి భయాలకూ,దుఃఖాలకూ అతీతులైన మహాత్ము లందరికీ నేను నమస్కరిస్తున్నాను.
సారం:-ఈ మంత్రం సీతాదేవి మనకు చేస్తున్న జ్ఞానోపదేశం వంతిది.వేదాంత విషయాలకు సంబంధించిన గ్రహం గురుడు.గురునికి ప్రీతిపాత్రమైన రత్నం పుష్యరాగం.పుష్యరాగం వామనావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-రామః కమల పత్రాక్షః సర్వ సత్వ మనోహరః
       రూప దాక్షిణ్య ప్రసూతో జనకాత్మజే
భావం:-ఓ జనకాత్మజా!రాముని నేత్రాలు మిక్క్లి అందమైనవి.తామర పూరేకుల వంటివి.ఏ వ్యక్తి అయ్నా,ఎ ప్రాణి అయినా మోహ పరవశుడయ్యే అద్భుత సౌందర్యవంతు డాయన.విశిష్ట లక్షణాలతో,ఉత్తమ గుణాలతో ఆయన జన్మించాడు.
సారం:-ఈ శ్లోకంలో హనుమంతుడు రాముని వ్యక్తిత్వాన్ని వర్ణించడంలో చూపించిన నిజాయితీని గమనించిన తర్వాతనే సీతాదేవికి ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగింది.అందువల్లనే పండితులు దీనిని సుందరకాండ కంతటికీ ప్రకాశవంతమైన సన్నివేశంగా తీర్మానించి ఈ శ్లోకాన్ని వజ్రంతో సంవందించారు.శుక్రునికి ప్రీతిపాత్రమైన రత్నం వజ్రం.వజ్రం పరశురామావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-జయత్పతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః
       దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః
భావం:-మహాశక్తిశాలి అయిన రాముడికి జయం.మహావీరుడైన లక్ష్మణునికి జయం.ఎవరి చేతలు సకల జనులకూ శుభాలు కలగజేస్తాయో అట్టి కోసల దేశానికి రాజయిన రాముడికి నేను దాసుణ్ణి.
సారం:-ఈ శ్లోకంలోని జయజయ ధ్వానాలు లంకానగరవాసులకు హెచ్చరిక వంటివి.అప్పటివరకు సీతాదేవి పైన తన దుష్ప్రభావాన్ని చూపించిన సని ఆమెను వదలి రావణుని పీడించటం మొదలైంది.ఈ మంత్రంతో శనీశ్వరుడు సీతారాములకు శుభకరుడుగా మారాడు.శనీశ్వరునికి ప్రీతిపాత్రమైన రత్నం నీలం.నీలం కూర్మావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం మమ
       యది రాస్త్యైక పత్నీత్వం శీతోభవ హనూమతః
భావం:-ఓ అగ్నిదేవా!నేనే గనుక నాభర్త పట్ల అనుకూలవతి నైతే,నేనే గనుక విధి ననుసరించి వివాహమైన భార్యనే అయితే హనుమంతుడికి ఏ బాధా కలిగించవద్దు.
సారం:-జానకీదేవి ప్రార్ధనాపూర్వకంగా స్మరించిన ఈ మంత్రప్రభావం వల్లనే హనుమంతుడికి అగ్నితాపం దరిచేరలేదు.కాలిన గాయాలు,కుష్ఠు మదలైన వాటినుండి ఉపశమనం కొరకు జ్యోతిష్కులు రాహుజపాన్ని సూచిస్తారు.రాహువుకు ప్రీతిపాత్రమైన రత్నం గోమేధికం.గోమేధికం వరాహావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-నివృత్త వనవాసంచ త్యయాసార్ధ మరిందమం
     అభిషిక్త మయోధ్యాయాం క్షిపుంద్రక్షసి రాఘవం
భావం:-ఓ పూజ్యమాతా!నీ భర్త అసమాన వీరుడు.శత్రువులను సంహరించగలడు.అతడు విజయాన్ని సాధిస్తాడు.నీవు తిరిగి ఆయనను కలుసుకొనగలవు.మీరు మీ రాజ్యానికి వెళ్ళి అయోధ్యా సింహాసనాన్ని అధిష్ఠిస్తారు.
సారం:-ఈ మంత్రం సీతాదేవి హృదయానికి మిక్కిలి ఆనందం కలిగించింది.దీనినే మరల రాముని ఎదట చెప్పినప్పుడు ఆయనకూ అంతటి ఆనందాన్ని కలిగించింది.భవిష్యత్తులో జరగబోయే శ్రీరామ పట్టాభిషేకాన్ని హనుమంతుదు తన మనస్సులో ముందుగానే జరుపుకున్నాడు.కారాగార వాసం,బంధనం మొదలైన వాటినుండి విముక్తి కొరకు జ్యోతిష్కులు కేతుజపాన్ని సూచిస్తారు.కేతువుకు ప్రీతిపాత్రమైన రత్నం వైడూర్యం.వైడూర్యం మత్స్యావతార సూచకమైన రత్నం.

          వీటిలోని విశేషం ఏమిటంటే ప్రతి శ్లోకమూ నవగ్రహాలలో ఒక గ్రహానికి,నవరత్నాలలోని ఒక రత్నానికి అనుసంధానించబడి ఉంటుంది.దశావతారాలలో ఇంకా రాని కల్క్యావతారాన్ని వదిలేసిన వాటిలో ఒక అవతారంతో కూడా ఆ శ్లోకాలకి సంబంధం ఏర్పరచారు పండితులు - అందులో మాయా, మోసం ఏమీ లేవు.వాటన్నిటికీ ఉన్న సారూప్యతలని బట్టే ఆ సంబంధాన్ని కల్పించారు.కాబట్టి వీటిని ప్రతిరోజూ జపిస్తే నవగ్రహ పూజా,దశావతార స్మరణా కూడా చేసినట్టే!అయితే,ప్రతి శ్లోకానికీ భావం కూడా గొప్పదే,బ్రతుకు మీద ఆశని పుట్టించే మంచిమాటలు ఇవన్నీ!ఉదాహరణకి విజయానికి అవసరమయిన నాలుగు లక్షణాలూ నీకు ఉన్నాయి కనక విజయం సాధిస్తావు అని లక్షణాల లిస్టు చెప్పి హనుమంతుణ్ణి పొగొడుతున్నప్పుడు కవి ఈ లక్షణాలు మీలో ఉంటే మీరూ విజయం సాధిస్తారు అని చెప్తున్నాడు.సీత ద్వారా వాల్మీకి ఏమి చెప్పాడో దాని విస్తృత రూపమే గౌతమ బుద్ధుడి ద్వారా ప్రచారంలోకి వచ్చిన బౌద్ధమత సారం!వీటిని నేను చాలాకలం నుంచి జపిస్తున్నాను.ఫలితం కనబడుతున్నది.అందుకే ఇక్కడ భావంతో సహా ఉంచాను.నిత్యానుష్ఠానంలో వీటిని చేర్చుకుంటే ఫలితం తప్పకుండా మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది!

          సుందరకాండలో ఉన్న అద్భుతం ఇదైతే,తర్వాత వచ్చే యుద్ధకాండలో ఆదిత్యహృదయం అనే మరొక అద్భుతం ఉంది!కొందరికి ఇవన్నీ చాద్స్తంగా అనిపించవచ్చు,ఇన్ని మంత్రాలు,ఇన్ని చోట్ల ఇంత గట్టిగా నొక్కి చెప్పటం అవసరమా అని,తప్పు లేదు!దేహం దృఢంగా ఉంచుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి.జిం నిర్వాహకులు వెళ్ళిన ప్రతివాడికీ ఒకే ఓక్ డంబెల్సో,ఒకే ఒక బుల్వర్కరో ఇచ్చి సరిపెట్టెయ్యటం లేదు గదా!వెళ్ళిన వాళ్ళు కూడా మొక్కుబడిగా ఏదో ఒకటి ట్రై చేసి వచ్చెయ్యటం లేదు - ఓ నాలుగో అయిదో రకాలు వాడుతున్నారు.ఇదీ అంతే,ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండాలన్నా నేను దృఢంగా ఉండాలి అనే సంకల్పం ఒక్కటే సరిపోదు - ప్రాక్టీసు చెయ్యాలి!లేప్పోతే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది, యావంటావ్ సెగట్రీ?

ఆదిత్య హృదయం


తతఓ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతే దృష్ట్వ అయుద్దాయ సముపస్థితం

దైవతశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణం
ఉపాగమ్య బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషిః

రామ రామ మహాబాహో శ్రుభు గుహ్యం సనాతనం
యేన సర్వా నరీన్ వత్సః సమరే విజయిష్యసి

ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శతృ వినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం

సర్వ మంగళ మంగళ్యం సర్వపాప పణాశనం
చింతాశోక ప్రశమన మాయుర్వధన ముత్తమం

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

ఏష బ్రహ్మాచ్ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్యోమో హ్యపాం పతిః

పితరో వసవ స్సాధ్యాః హ్యశ్విన్యౌ మరుతో మమః
వాయు ర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః

ఆదిత్య స్సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణ సదృశో భాను ర్హిరణ్యరేతా దివాకరః

సూర్యారాధన ప్రారంభం

హరిదశ్వ స్సహస్రార్చి స్సప్త స్సప్తి మరీచిమాన్
తిమిరోర్మధన శ్శంభు స్త్వష్టా మార్తాండ అంశుమాన్

హిరణ్యగర్భ శ్శిశిర స్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భో అదీతే పుత్ర శ్శంఖ శ్శిశిర నాశనః

వ్యొమనాధ స్తమోభేదీ ఋగ్యజుస్సామ పారగః
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీధీ ప్లవంగమః

అతపీమండలీ మృత్యుః పింగళ స్సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తస్సర్వ భవోద్భవః

నక్షత్ర గ్రహతారాణా మధిపో విశ్వభావనః
తేజసామపితేజస్వీ ద్వాదశాత్మ న్నమోస్తుతే

నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దివాధిపతయే నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః
నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః

నమ ఉగ్రాయ వీరాయ పాండురాయ నమోనమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమోనమః

బ్రహ్మేశానచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నా యామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమ స్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే

నాసయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరివిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః

సూర్యారాధన సమాప్తం

ఏవ మాపత్సు కృచ్చేషు  కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నో వసీదతి రాఘవ

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పితం
ఏత త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవ ముక్త్వా తధాగస్త్యో జగామచ యధాగతం

ఏతఛ్చృత్వా మహాతేజా నష్టశోకో భవత్తధా
ధారయమాన్ సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్ష మవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్నేన మహతాం వధే తస్య ధృతో భవత్

అధ రవిరవద న్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహ్ర్ష్యమాణ!హ్
నిసిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్య గతో వచస్త్వరేతి

          సూర్యారాధన ప్రారంభం,సూర్యారాధన సమాప్తం అనేవాటికి మధ్యలో ఉన్న పధ్నాలుగు శ్లోకాలూ మూడుసార్లు చదవాలి.ఇది పని చేస్తుందా లేదా అనే సందేహం అక్కర్లేదు,నాకు పని చేస్తున్నది.ఇదివరలో బ్లాగుల్లో హిందూమతం మీద జరుగుతున్న చర్చల్లో అంత దూకుడుగా వెళ్ళేవాణ్ణి కాదు.సరదాగా కప్లెట్ కామెంట్లతో సరిపుచ్చేవాణ్ణి,అన్యాపదేశంగా జోకులు వెయ్యటంతో సరిపెట్టేవాణ్ణి,విసుగుపుట్టి మధ్యలో ఆపేసేవాణ్ణి!గట్టిగా నిలబడి వాదించినవి చాలా తక్కువ!కానీ ఇప్పుడిప్పుడు గట్టిగా నిలబడుతున్నాను, ఎక్కడ నిలబడినా నేనే గెలుస్తున్నాను, అది ఆదిత్యహృదయం నిత్యానుష్ఠానంలో చేర్చిన తర్వాతనే జరుగుతున్నది.వ్యక్తిగత జీవితంలో కూడా విజయాల శాతం పెరిగింది.ఇక్కడ వ్యక్తిగత జీవితంలో విజయం ఎంతశాతం అవసరం అనే దాని గురించి ఒక మాట!అప్పు అనేది లేకుండా,చెయ్యకుండా,చెయ్యాల్సిన అవస్రం లేకుండా బతకగలిగితే చాలు.బడుగు జీవులైనా,మధ్యతరగతి జీవులైనా,కోట్లకి పడగేత్తిన వాళ్లయినా సరే - శ్రీరస్తు,శుభమస్తు,ఐశ్వర్యమస్తు!

          వాల్మీకి ద్వారా మనకి తెలిసిన రామాయణం అనే ఒక కధ గురించి ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా "మరల నిదేల రామాయణంబనగ..." అన్నట్టు ఇంకా చెప్పటానికి ఎంతో మిగిలి వుందనిపిస్తుంది!కవిత్వం,నాటకం,యక్షగాం,హరికధ,బుర్రకధ,సినిమా,టెలివిజన్ - అన్నిరకాల కళారూపాలూ శ్రీరామకధను స్పర్శించి పరు గడించి పులకించాయి.రామాయణాన్ని తిట్టినా పేరొస్తుందనేదానికి అప్పటివరకూ స్వీట్ హోం లాంటి సంసారపక్షపు నవల్లు రాసుకునే ఒక అనామక రచయిత్రి రామాయణ విషవృక్షంతో ఒక్కసారిగా అంత పేరు తెచ్చుకోవడమే నిదర్శనం:-(

ఈ వాట్సప్ సింగిల్ పేరాగ్రాఫ్ రామాయణం కూడా అలాంటిదే:
Student:Please tell us something about raaamaayanam in the simplest way!
Teacher:It is said that the Raamaayanam is happening in your body.Your soul is Rama,Your mind is Seeta,Your breath or lefe-force is hanumaan,Your awareness is lakshmana and Your ego is Raavana. When Seeta(Mind) was stolen by Raavana(Ego), then Raama(Soul) got restless. Now the soul(Raama) cannot reach the mind(Seeta) on its own, It has to take the help of the praana(Hanumaan).When the mind(Seeta) got reunited with the soul(Raama) and the ego(Raavana) vanished - everything goes healthy to the Body!This is the real significance of the story of raama.

          ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే రామాయణానికి ఉన్న సార్వజనీనతని నాస్తికులూ కమ్యునిష్టులకి కూడా వర్తించేటంత basic levelకి కుదించి చెప్పటం!నువ్వు నాస్తికుడివైనా,కమ్యునిష్టువైనా - ఒక లక్ష్యం పెట్టుకుని నిజాయితీగా దాన్ని సాధించటానికి పోరాడుతుంటే నీ మనస్సులో ఈ రామాయణం జరిగి తీరాల్సిందే!నువ్వు రామద్వేషివైనా సరే అబద్ధాలూ,పులుముడులూ లేకుండా నువ్వు గనక సత్యానికి కట్టుబడితే నీ జీవితప్రయాణం కూడా రామాయణమే అవుతుంది.

రామాయణం నచ్చినవాళ్ళు చచ్చినా చావనట్టే!
రామాయణం నచ్చనివాళ్ళు పుట్టినా పుట్టనట్టే!
జై శ్రీరాం!

Thursday 5 May 2016

సంప్రదాయబద్ధంగా కనబడే నిత్యా మీనన్ సంప్రదాయం మీద విసురుతున్న సవాళ్ళు?!

     నేను పాతివ్రత్యం,ఏకపత్నీవ్రతం అనే కాన్సెప్టుల్ని గుడ్డిగా నమ్మను!ప్రాక్టికల్ ఆలోచనా ధోరణి ఉన్నవాళ్ళు ఎవరయినా సరే - నూటికి నూరుపాళ్ళు పాతివ్రత్యం ప్రదర్శించే ఆడదీ,నూటికి నూరుపాళ్ళు ఏకపత్నీవ్రతం పాటించే మగాడూ వాస్తవంగా ఉండరని ఒప్పుకోవాలి."నీతి కట్టె లాంటిది,కోర్కె మంట లాంటిది - అందుకే రాజరాజు కొంపకి నిప్పంటుకుంది!" అన్నాడు కవిత్వంతో అమృతం కురిపించిన కవి బాలగంగాధర తిలక్,నూటికి నూరుపాళ్ళు నిజమే!

     "గంగ నిజాంగ దీప్తులెగయంగ" వచ్చి సుతీక్ష్ణుడి వొళ్ళో కూచుని మోహం చూపించడం అనే దృశ్యాన్ని మనకి చూపించేటప్పుడు సంస్కృతంలో వ్యాసుడు గానీ తెనిగించిన కవిత్రయపు కవి గానీ కంగారు పడలేదు,ఎందుకని?అష్టవసువుల శాపవిమోచనం అనేది అర్ధవంతమైన కారణమే కావచ్చు,కానీ నిజాంగదీప్తులతో వచ్చి మోహం ప్రదర్శించింది అని రాస్తున్నప్పుడు,"ఛా!కల్మషహారిణి చేత వ్యామోహపు భాష మాట్లాడించటమా?" అని ఇద్దరిలో ఎవరూ సందేహపడలేదు - వింతగా లేదూ!

     పంచమహాపతివ్రతల్లో ఒకరిగా నిలబెట్టాలని పవిత్రతకి మారుపేరుగా చూపించాలనుకున్న తన కధానాయిక సీత యొక్క అంగాంగ సౌందర్యాన్ని వర్ణిస్తున్నప్పుడు వాల్మీకి ఎందుకు సిగ్గుపడలేదు?కాళిదాసు కూడా శ్యామలాదండకంలో శ్రీమాతని నఖశిఖపర్యంతం అణువణువునీ వర్ణించుతూ "హేమకుంభోపమోత్తుంగ వక్షోజ భరావనమ్రే","లసద్వృత్త గంభీర నాభీ సరిత్తీర..." లాంటి పదాలతో ఎందుకు అంత భీబత్సంగా విజృంభించాడు?

     మహామేధావి అంబేద్కర్ గారు ఒకేఒక పొరపాటు పని చేశాడు,ఆ ఒక్కపనీ చెయ్యకుండా ఉంటే ఎంత బాగుండేది!"రిడ్డిల్స్ ఆఫ్ రామ" అనే పుస్తకం రాశాడు.అందులో రాముడు అక్రమసంతానం అని నిరూపించాలని ఎంతో శ్రమించాడు - ప్రమాదో ధీమతామపి అని ఇన్నాళ్ళూ దీన్ని గురించి ప్రస్తావించకూడదనుకున్నాను,కానీ ఇప్పుడు తప్పటం లేదు.మహాభారతంలో పాండవుల జననమూ రాముడి జననం లాంటిదే.పాండురాజుకి సంతాన యోగ్యత లేదు,కానీ సంతానం కావాలి!వరాలూ,దేవతలూ,సద్యోగర్భాలూ అందమైన కల్పనలుగా తీసుకుంటే పాండురాజు అనుమతితో వేరెవరితోనో సంతానాన్ని కన్నది.అనుమతి అనగానే పురుషుడు అధికుడు గాబట్టే అనుమతి తీసుకున్నాది అని అర్ధం పీకితే ఒక దణ్ణం పెట్టి వూరుకోవడం తప్ప నేను చెయ్యగలిగినది లేదు. సంప్రదాయ ప్రకారం వివాహం యొక్క ముఖ్యమైన ఉద్దేశం సంతానం.ఆ అసంతానలేమిని పోగొట్టుకోవడానికి ఇవ్వాళ్తి వాళ్ళు సంతాన సాఫల్యతా కేంద్రాల చుట్టూ తిరుగుతూ లక్షలకి లక్షలు తగలెయ్యడం దగ్గిర్నుంచీ సర్రోగేట్ మదర్సుని వెతుక్కోవడం వరకూ పడరాని పాట్లు పడుతున్నట్టే వాళ్ళు కూడా కొన్ని ఎడ్జస్టుమెంట్లు చేసుకున్నారు. మాంసం తింటున్నామని ఎముకలు మెదలో వేసుకు తిరగనట్టే సాహిత్యరూపం కాబట్టి కొన్ని కల్పనల్ని చేశారు.ఇవ్వాళ వేరే విధంగా పిల్లల్ని కన్నవాళ్ళు మేము ఫలానా సర్రోగేట్ మదర్ని వాడుకుని పిల్లల్ని కన్నాం అని డప్పు వేసుకోవటం లేదు,అవునా?ఇదంతా స్త్రీకి గర్భధారణ మీద ఉన్న అధికారానికి గౌరవం ఇవ్వటమే కదా!ఎవరితో కన్నా వాళ్ళు కౌంతేయులు అయ్యారు,పాండురాజ నందనులు అయ్యారు.ఇక్కడే బ్లాగుల్లో మరొకచోట ఒకాయన క్షేతర బీజ ప్రాధాన్యం అనే మాట వాడగానే బూతులకి కూడా లంకించుకున్నారు - హైందవద్వేషం వాళ్ళలో మినిమం సంస్కారాన్ని కూడా పోగొట్టేసింది కాబోలు!ధర్మ,అర్ధ,కామ,మోక్షములకు సంబంధిన యే కార్యాన్ని అయినా నా భాగస్వామితోనే చేస్తాను అనేది వివాహంలో స్త్రీ పురుషులిద్దరూ చెయ్యాల్సిన ప్రమాణం.అది వివాహ జీవితంలో ఉండాల్సిన పవిత్రతకి సంబంధించిన ముఖ్యమైన సూత్రం.ఎవరు తప్పినా తప్పే!సడలింపు కావాలంటే రెండవ భాగస్వామి అనుమతి తప్పనిసరి!సంతానానికి క్షేత్రమే ప్రధానం అంటే తల్లికే ప్రాధాన్యత ఇచ్చారు!పిల్లలు లేనివాళ్ళు పిలల్ల కోసం పదే తాపత్రయాన్ని మనచుట్టూ చూస్తూ కూడా అలాంటి సన్నివేశాల చుట్టూ ద్వేషపాండిత్యాన్ని ప్రదర్శించటం నిజంగా క్రూరత్వమే!"పాతివ్రత్యం గురించి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళకు,ఇద్దరు ముగ్గురితో సంబంధం కలిగి ఉండేవాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ సాంప్రదాయబద్ధంగా పెరిగినవాళ్ళకు అదో ఘోరమైన నేరం!"మూడు పెళ్ళిళ్ళు చెసుకుని గాంధీ అనే పెట్టమారి మొగుడితో పాలేరు పని చేయించుకున్న రంగికి సీత యొక్క పాతివ్రత్యం అర్ధం కాలేదంటే ఆశ్చర్యం లేదు,కానీ అంబేద్కర్ గారు కూడా ఇలా బొక్కబోర్లా పడ్డాడంటే ఇబ్బందిగా అనిపిస్తున్నది.


     రామాయణంలో వాల్మీకి సీతని అలా వర్ణించడానికి చాలా లెక్క ఉంది."మాలిని 22" సినిమాలో నిత్యా మీనన్ బదులు పీటీ ఉష లాంటి ఫిగర్ని పెట్టి ఉంటే రాంగు క్యాస్టింగు కింద డైరెక్తర్ ముక్కచివాట్లు తిని ఉండేవాడు! విలన్ అన్నిసార్లు రేప్ చెయ్యడు,చేసినా మనకి విలన్ మీద జాలివేస్తూ క్యామెడీ సినిమా అయి ఉండేది:-)సినిమా అట్టర్ ఫ్లాపు అయ్యి ఉండేది.రామాయణంలో సీత అందం కూడా అంతే."సీతే జగత్సుందరీ!" అని వూరికే చెప్పి వూరుకోలేదు.రాముడు శివధనుస్సు విరవటానికి ముందు సీతకోసం చాలా యుద్ధాలు జరిగినాయి!మీరు సినిమాల్లో చూసినట్టు ఒక హాలూ,జరీ బుటేదారీ అల్లికల డ్రస్సుల్లో రాజులూ కనక సింహాసనాలూ లాంటి హడావిడితో అంతా ఒకే సీనులో జరిగిపోలేదు సీతా స్వయంవరం!శివధనుస్సుని ఒక బహిరంగ స్థలంలో పెట్టి చాటింపు వేశాడు.ఎవరయినా ఎప్పుదయినా వచ్చి అ చాలెంజిని టేకప్ చెయ్యవచ్చు.అది ఎత్తలేకపోతేనేం సీత లాంటి అందగత్తెని వదులుకుంటామా అని విదేహ మీదకి సైన్యసమేతంగా యుద్ధాలకే వచ్చారు.దణ్ణం పెట్టి తప్పుకోవాలనిపించే చప్పచప్పటి అందం కాదు సీతది,మగాళ్లని పిచ్చెక్కించే అందమే!సీత అట్లా లేకపోతే రావణాసురుడు అంతగా పిచ్చెక్కిపోడు గదా!

     కధ చదివిన మగ పాఠకుల మీదకి వాల్మీకి ఒక చాలెంజిని విసురుతున్నాడు!ఫర్ సప్పోజ్,మిల్కీ వైట్ తమన్నా రేపో మాపో పెళ్ళి చేసుకోబోతున్నదట!పెళ్ళి చేసుకున్న సంవత్సరంలోనే భర్త వ్యాపారంలో ఆస్తినంతా పోగొట్టుకుని ఒక మధ్యతరగతి ఇల్లాలిగా మీ ఇంటిపక్కనే కాపరం పెట్టిందనుకోండి.సంవత్సరం లోపే ముసలిదైపోదు,అదే అందం.మీరు బాగా డబ్బున్నవాళ్ళు - అనుకోండి!మీరేం చేస్తారు?నిన్నటి దాకా బట్టలిప్పి చూపించింది గాబట్టి తప్పు లేదనుకుని ఆ బుక్కా పకీరు వెధవతో ఏం సుఖపడతావు నా దగ్గిరకి రా  అని ప్రపోజ్ చేస్తారా? ఆమె ఒప్పుకోకపోయినా కిడ్నాప్ చేసి మీ కోరిక తీర్చుకుంటారా!వాల్మీకి సీతని అలా వర్ణించటం వెనక ఉన్న లెక్క ది.అందులో తిక్క ఎంతమాత్రమూ లేదు:-)

     సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్ళకి ఏ సందేహమూ రాదు,అక్కడ అన్నీ స్పష్టంగానే ఉంటాయి.పూర్తిగా ఆధునికంగా ఆలోచించేవాళ్ళకీ గందరగోళం ఉండదు - వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు స్పష్టంగా నిర్వచించుకుని ఉంటారు.ఎటొచ్చీ ఆధునికత పేరుతో "నేను రంకు చేస్తాను,కానీ నన్ను స్వైరిణి అనరాదు" అని సంప్రదాయవాదుల నుంచి తమకు మినహాయింపులు కోరుకునేవాళ్ళకి మాత్రమే ముతప్పాళ కురంగీన్యాకమ్మ తరహా సాహిత్యం నచ్చుతుంది!ఈ సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నామంటూనే మళ్ళీ ఈ సంప్రదాయవాదుల నుంచి మెచ్చుకోళ్ళు కోరుకోవడమనే గందరగోళం వాళ్ళలో ఉంది.తమలోకి తాము చూసుకుని తమ గందరగోళాన్ని తగ్గించుకుని అటోఇటో జరిగితే గొడవే ఉండదు కదా,ఎందుకీ దిక్కుమాలిన యేడుపు?

     నేనింతవరకూ చదవలేదు గానీ "సామాన్య" అనే ఒక విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివిన, ఓ IAS Officerగారి సతీమణి, దేశంలోని అనేక ముఖ్యమైన పట్టణాలలో నివాసం ఉన్న రచయిత్రి ఆంధ్రజ్యోతిలో "కమలిని" అని ఒక కధ రాశారు.దానిమీద లెఫ్టిస్టుల రంగసాని సారంగలో కల్పన అనే ఆవిడ భోరున ఏడ్చెసింది ఖదలో కమలిని రంకు చేసి మొగుడికి సారీ చెప్పటం ఆవిడకి నచ్చలేదట!అందుకని "సారీ సామాన్య, నేనే కాదు తమ మీద తమకు గౌరవం ఉన్న ఏ ఆడపిల్లా నీ కమలిని మాటలను క్షమిస్తుందనుకోను" అంటూ ఆక్రోశిస్తున్నది.ఇక్కడ వింతేమిటంటే నా బ్లాగులో "లాడెనుకి నేనూ,నాకు లాడెనూ" అని దీర్ఘాలు తీసిన నీహారిక "పాతివ్రత్యం,నైతికం,కట్టుబాటు అనేవి ఏ యుగంలోనైనా తప్పనిసరి.సమాజం మనుగడే వాటిపై ఆధారపడి నడుస్తున్నపుడు ఆధునిక మహిళల ఆత్మగౌరవం దెబ్బతిన్నంతమాత్రాన వాటివిలువ తగ్గిపోదు" లాంటి ఆణిముత్యాల్ని వెదజల్లటం!

     రాముణ్ణీ సీతనీ వెక్కిరిస్తూ శూర్పణఖని ప్రశంసించడమా,ఇక్కడిలా పాతివత్యాన్ని సమర్ధించడమా - ఏది నీహారిక యొక్క అసలు రూపం?వీటిల్లో ఏదీ కాకుండా నరసింహకిలా ఆరు రూపాలు ఉన్నాయా!ఈ ఆధునికంగా ఉంటూ సంప్రదాయంతో ఘర్షణపడెవాళ్ళలో ఉండే గందరగోళం అంతాఇంతా కాదు.శివ బాహుబలి అవంతికని రేప్ చేసేశాడని గోలపెట్టింది తెలుగావిడే!ఆవిడ మరి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చూడలేదా?ఆ సినిమాలో నిత్యామీనన్ "లడ్డూ కావాలా!" అని అడగటంలో చూపించిన రెచ్చగొట్టుడం గురించి గొడవచేయ్యలేదెందుకు?పట్టపగలు అందరూ అటూఇటూ తిరిగే వరండాలోనే ఒక ఆడది మగాణ్ణి రొమ్ముల్ని గట్టిగా అతనికేసీ అదుముతూ కావిలించుకుని కుర్రాడే కంగారుపడి కాఫీగ్లాసుని వొదిలేసేలా చెయ్యడం తప్పని అనిపించలేదా?ఇదివర్లో మగాడు ఏమయినా చెయ్యొచ్చు గానీ ఆడది సంసారపక్షంగా ఉండాలి అనేది తప్పు,ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం ఆడది ఏమయినా చెయ్యొచ్చు గానీ మగాడు సంసారపక్షంగా ఉండాలి అనెది ఒప్పు - గొప్ప చదువులు చదివి  ఈ ఆడవాళ్ళు నేర్చుకున్నది ఇది!

     సహజీవనం గురించి మణిరత్నం తీసిన ఓకే బంగారం సినిమాలో నిత్యామీనన్ క్యారెక్తర్ ఏంటి?మొదట్లో వీరవనితలా "ఆ పెళ్లొకటి చేసుకుంటే ఆ తాడొకటి వేసుకుంటే అన్నీ చేసేసుకోవచ్చా..దాంతో లైసెన్స్‌ వస్తుందా, లేకపోతే రాదా?" అనే ఒక్క డైలాగు గొప్పగా చెప్పడం సరే,తర్వాత చేసిన గొప్ప నటన ఏంటి?నేను చూసిన ట్రైలర్స్ మరియూ పాటలు అన్నింటిలోనూ చేసిన గొప్ప నటన ఏమిటి?దుప్పటిలో హీరోకి అతి దగ్గిరగా ఉండి హస్కీగా మూలగడం,చెంపలు చెంపలకి రాస్తూ పరవశించి పోతూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమసీని అత్యంత వాస్తవికంగా ప్రదర్శించటం!ఆ సీన్లని బట్టే, తెర మీద చూపించకపోయినా వాళ్ళ సహజీవనం పూర్తయ్యేసరికి జరగాల్సినవి అన్నీ చాలాసార్లు జరిగిపోయే ఉంటాయని నేను బల్లగుద్ది చెప్పగలను!లడ్డులాంటి పిల్ల అంత దగ్గిరగా కదుల్తూ దుప్పట్లో దూరి హస్కీగా మూలుగుతుంటే అస్ఖలితంగా ఎవడు ఉండగలడు?మణిరత్నం వాళ్ళని పెళ్ళి పేరుతో కలిపాడు గాబట్టి సరిపోయింది,లేకుంటే?ఒక విశృంఖలతని చాలాకాలం చూసి మొదట అరుంధతి తర్వాత వశిష్ఠుడు ఏర్పరచినది వివాహ వ్యవస్థ!దీన్ని కాదంటే ఒకప్పటి గుంపులో గోవిందా వాతావరణమె గతి – ఎందుకొచ్చిన గోల?వెనక్కి నడిచి మళ్ళీ అరుంధతికి ముందరి కాలానికి వెళ్ళి చేసేది ఏముంటుంది?మళ్ళీ అది బాగా లేదనుకుని ఇటే రావాలిగా!తాళి,కట్టుబాటు,సింబల్స్ లేకుండా వాళ్ళు చేసిన దేమిటి?దాంపత్యమూ సహజీవనమే కదా!సహజీవనం నుంచి దాంపత్యం లోకి ప్రయాణించారు వాళ్ళు – ఇందులో విప్లవాత్మకత యేముంది?

     ఈ నిత్యా మీనన్ అరిచి గింజుకున్నా ఎక్స్పోజింగు చెయ్యను,ఖాళీగా ఉంటాను గానీ అసభ్యతకి చోటివ్వను అని మొండిగా చెప్పేసి ఒళ్ళు చూపించకండా ఉండటం వల్ల కాబోలు ఎంత పొగిడినా అదోరకంగా అనుకోరులే అని ఒక సేఫ్ జోన్ ఏర్పడిపోయినట్టుంది చాలామంది మగాళ్ళకి.కానీ నిత్యా మీనన్ నటన ద్వారా చూపించే అసభ్యత చాలా డేంజరస్!ఓకే బంగారం దగ్గిర్నుంచీ సన్నాఫ్ సత్యమూర్తి వరకూ ఆపాత్రలన్నీ నెగిటివ్ టోన్ ఉన్నవే,కానీ మనకి వాటిల్లో పాజిటివ్ టోన్ ఉన్నట్టు అనిపిస్తుంది,ఎందుకని?ఈ రెండు సినిమాలే కాదు,మాలిని22లో అయితే నిజంగా నరేష్ అనే నటుడు నిత్యా మీనన్ అనే నటిని రేప్ చేస్తున్నాడేమో అనిపించేతంత సహజంగా ఉంది తన నటన – బాబోయ్!ఇంక నరేష్ పాత్ర మీద పగ తీర్చుకునే సీన్లలో అయితే ఆ కళ్ళు హర్రర్ మూవీ చూపించేశాయి:-(

     సరే,అది రేపిస్టుల్ని భయపెట్టే ఎఫేక్టు అని సర్దుకుపోవచ్చు,సన్నాఫ్ సత్యమూర్తిలో ఈ అమ్మాయి చేసిన పాత్ర ఏంటి?అప్పటికే తను ఒక మగాదితో ఉడాయించాలనేటంతగా ప్రేమలో ఇరుక్కుని హీరోని “లడ్డూ కావాలా?” అని రెచ్చగొడుతూ బిగియార కౌగలించుకోవడం అనే విచ్చలవిడితనం కూడా సంసారపక్షంగా ఉండే ఈ నిత్యా మీనన్ చెయ్యడం వల్ల ఏమాత్రం ఎబ్బెట్టుగా కనిపించలేదు – బాహుబలిలోని హీరో హీరొయిన్ల మధ్యన జరిగిన రొమాన్సు కూడా రేప్ మాదిరి ఫీలయిన ఆధునిక మహిళలకి కూడా!!ఓకే,సత్యమూర్తి సినిమా ధీం అంతా కొంచెం సీరియస్ టోనులో నడుస్తుంది గాబట్టి రిలీఫ్ కోసం దైరెక్టర్ చేసిన జిమ్మిక్కు లెమ్మనుజుందామా?కానీ నాకెందుకో ఇక్కడ సంసారపక్షంగా కనిపిస్తూ పరాయి మొగాణ్ణి ఒక ఆడది గట్టిగా కావిలించుకుంటే కిక్కురుమనకుండా వూర్కుని శివ బాహుబలి తనకి నచ్చి పెళ్ళి చేసుందామనుకున్న అమ్మాయితో కొంచెం దురుసుగా ఉండటానికి రేప్ అని పేరుపెట్టి హడావిడి చెయ్యటం వెనక ఒక ప్లాన్/ఎజెండా ఉన్నట్టు రూఢిగా తెలుస్తున్నది.

     అప్పటికాలంలో ఆడాళ్ళు అందరూ పవిత్రంగా ఉంటే తప్పు చెయ్యాలనుకున్న ఒక్క మగాడికీ,ఇప్పటికాలంలో మగాళ్ళు అందరూ సంసారపక్షంగా ఉంటే తప్పు చెయ్యాలనుకున్న ఒక్క ఆడదానికీ సహచరులు యెట్లా దొరుకుతారో!మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయినట్టు అంతరించిపోయిన జీవజాతుల్ని వదిలేస్తే విజయవంతంగా మనుగడ సాగిస్తున్న ప్రతి జీవజాతిలోనూ లైంగిక ద్వైరూపకత(Sexual Dimorphism) ప్రస్ఫుటంగా ఉన్నది.కొన్నింటిలో మగవి అందమైన ఆలంకారాల్ని సమకూర్చుకుని హొయలు చూపిస్తే కొన్నింటిలో ఆడవి సొబగుల్ని సమకూర్చుకుని బులిపిస్తున్నాయి - ఎవరు ఎన్ని పాట్లు పడినా ఒళ్ళో పెట్టనా దళ్ళో పెట్టనా అన్నట్టు కంగారు పడకుండా జతగూడాల్సినవి జతగూడి పిల్లల్నికని జాతిని పెంపొందించుకోవటానికి పడుతున్న తంటాలు!మనుషుళ్లో అది ఆడవాళ్ళు అందంగా ఉండటం,మగవాళ్ళు ధృఢంగా ఉండటం అనేలాగ కుదిరింది!అన్ని జీవజాతుల్లోనూ ఉన్నదే జరిగితే ఈ కొత్తరకం ఆడవాళ్ళు మాకన్యాయం జరిగినదని యేడవటం దేనికి?అయితే,ఇదంతా ఏకపక్షమా అంటే బాక్సింగు నేర్చుకున్న వీరనారులూ ఉన్నారు,మొహమాటంగా ఉండే హరిబాబులూ ఉన్నారు:-)

     సనాతన ధర్మంలో ప్రాచీన సాహిత్యాన్ని చూస్తే ఈ పవిత్రంగా ఉండటం గురించిన నిషేధాలు తక్కువే!జుదాయిజం నుంచి పుట్టిన అబ్రహామిక్ మతాల మాదిరి ఇక్కడ "ఇది పవిత్ర వాక్యం,దీన్ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే" అని ఒత్తిడి పెట్టే యేకైక గ్రంధం అంటూ ఏదీ లేదు.శృతి,స్మృతి - ఈ రెండూ కూడా ఒకే విషయానికి సంబంధించి ప్రాంతాని కొకరీతిగా చెప్పే పాఠాంతరాలతో ఉన్నాయి.అంటే,ఒక ప్రాంతంలో యేదయినా సమస్య వస్తే అక్కడి పెద్దలు సమయానికి తగిన పరిష్కారాన్ని చెప్పేవారు!పరిష్కారం సమస్యని రద్దు చేస్తేనే గదా అందర్నీ మెప్పించగలిగేది,అప్పుడు "మాకూ ఇలాంటి తవ్వాయి వొస్తే?" అని గుంజాటన పడేవాళ్ళ కోసం దాన్ని కూడా గ్రంధస్తం చేసేవాళ్ళు.అందుకే,ఇక్కడ దేన్ని గురించి కూలంకషంగా తెలుసుకోవాలన్నా ఆచార్యుడు/భాష్యకారుడు అనే మధ్యవర్తి అవసరం తప్పనిసరి.స్త్రీ పురుషుల మధ్యన ఉండాల్సిన నిబద్ధత గురించి బలంగా చెప్పిన మొదటి ఆఖరి గ్రంధం రామాయణమే!అంతకు ముందరి సాహిత్యం - వైదిక మంత్రాలలో గానీ,తర్వాతి కాలపు భారతేతిహాసం లాంటివాటిల్లో గానీ ఒకరికొకరు నిబద్ధంగా ఉన్న సీతారాముల వంటి జంట మరొకటి లేనే లేదు!ఆయా పాత్రల్లో బహుపత్నీత్వం,బహుపతీత్వం,స్వేచ్చా శృంగారం అనేవి యే దాపరికమూ లేకుండా కనబడతాయి.ఆయా పాత్రల్ని వర్ణించే రచయితలు కూడా అలాంటి ప్రస్తావనలు చేసేటప్పుడు సహజంగా జరుగుతున్నవాటిని వర్ణించే మామూలు వర్ణనలే చేశారు తప్ప నిషేధించబడినవాటిని చెప్తున్నట్టు అనిపించదు,మరి ఈ ఆధునిక మదనికా రదనికల "నొక్కేశారు,తొక్కేశారు,నీతుల్ని రుద్దేశారు" అనే గొడవకి కారణ మేమిటి?

     మతపెద్దలు ఆమోదించి సర్వులూ పాటించినట్టు కనబడే రామాయణ మహాభారతాల వంటి కధాత్మక సాహిత్యరూపాల తర్వాత మనుస్మృతి,కామసూత్రం,అర్ధశాస్త్రం వంటి తార్కిక గ్రంధాలలో కూడా వివాహం - పవిత్రత వంటివి నిషేధాజ్ఞల రూపంలో లేవు!మనుస్మృతి అనగానే "నస్రీ స్వాతంత్ర మర్హతి" అన్నాడని గోల చేసేవాళ్ళు మొత్తం శ్లోకంలో ఉన్న అర్ధాన్ని చెప్పడం లేదు."చినప్పుడు తండ్రి,యుక్త వయస్సులో సెదరులు,పెళ్ళయ్యాక భర్త,వృద్ధాప్యంలో కొడుకులూ స్త్రీకి రక్షణ ఇచ్చి తన కోరికల్ని తీర్చాలి - వొదిలెయ్యకూడదు" అని మగాళ్ళకి చెప్పడంలో తప్పేముంది?వాత్స్యయనుడైతే "పారదారికం","వేశ్యాధికరణం" అని రెండు అధ్యాయాలు రాశాడు - వాటిలోని ప్రతిపాదనలు ఇప్పటి ఆధునికులకి కూడా చెమట్లు పట్టించేటంత విప్లవాత్మకమైనవి!పారదారికం అంటే,ఒక స్త్రీకి భర్త ద్వారా సంతృప్తి లేకపోతే మరొక పురుషుడు ఆమెని సంతృప్తి పరచవచ్చును అంటున్నాడు!సింగిల్ పన్నా దైలాగు చెప్పి వూరుకోలేదు,ఒక అధ్యాయమే రాశాడంటున్నాను గదా!అందులో ఉన్నదంతా మొగుడికి తెలియకుండా దాన్ని సాగించుకోవడం కోసం ఉపాయాలూ,మధ్యవర్తులూ,రాయబారాలూ - అబ్బో, ఎందుకు లెండి మిమ్మల్ని చెడగొట్టటం:-)

     చాణక్యుడు యేకంగా విడాకుల ప్రస్తావన స్త్రీ వైపునుంచి వస్తే వెంటనే ఇచ్చెయ్యమన్నాడు,ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి.మొదటిది వివాహక్రతువు యొక్క ఉద్దేశం స్త్రీకి రక్షణా,సౌకర్యమూ,సంతోషమూ ఇవ్వటానికి కాబట్టి స్త్రీ సంతోషపడని వివాహం  వివాహమే కాదనేది,రెండవది,ఒకసారి విడాకుల ప్రస్తావన వచ్చాక వాళ్ళిద్దర్నీ కలిపి ఉంచితే బలవంతుడైన మగవాడు భార్య విడాకులు కోరుకోవటం అవమానంగా భావిస్తే ఆడదాని ప్రాణానికి ప్రమాదం తలపెట్టవచ్చును అనేది - ఇట్లా ప్రాచీన ధార్మిక సాహిత్యమంతా ఆడవాళ్ళకే సౌకర్యాలు అమర్చారు.ఇంక గాధాప్తశతి,శుకసప్తతి లాంటివి కట్టుతప్పిన శృంగారాన్ని కూడా రొమాంటిసైజ్ చేసి వర్ణిస్తాయి.ఈ రకమైన వాటిననిట్నీ కలిపి చూస్తే మొత్తం సాహిత్యంలో వీళ్ళు హైలైట్ చేసి చెప్పే పతివ్రతల కధలు చాలా తక్కువ శాతాన్ని ఆక్రమిస్తాయి.కోర్కెకి ప్రాధాన్యత ఇచ్చి నీతిని పట్టించుకోనివాళ్ళు,నీతికి ప్రాధాన్యత ఇచ్చి కోర్కెల్ని అణుచుకునేవాళ్ళు అప్పుడూ ఉన్నారు,ఇప్పుడూ ఉన్నారు,ఎప్పుడూ ఉంటారు!

     అయితే ధర్మంలో తప్పు లేనప్పుడు సమాజంలో కనపడుతున్న అసమానతలు ఎందుకు ఉన్నాయి?అసమానతలకి ఆస్కారమిస్తున్న ధర్మాన్ని విమర్శిస్తే తప్పేమిటి?ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు!వీటిని తప్పించుకుని తిరగడం ఇంకెంతో కాలం సాధ్యపడదు.ఒక మనిషిలో స్వార్ధం ముదిరితే అతను నీతుల్ని లెక్క చెయ్యడు,ఇతరుల్ని మోసం చెయ్యడానికి తప్పుడు సమర్ధనలు కనిపెట్టి అయినా తన కోరికల్ని తీర్చుకుంటాడు.ఒకప్పుడు అసలెవరికీ విధించని అపవిత్రతకి సంబంధించిన శిక్షలు ఇప్పుడు ఆడవాళ్ళకే విధించడం ఎప్పుడు మొదలైంది?బ్రాహ్మణుల వల్లనే వచ్చిందనడానికీ ఆధారాలు లేవు,బ్రాహ్మణుల పొడయే తగలని ఆదివాసుల సంస్కృతిలోనూ పురుషాధిక్యత ఉంది కదా!ఇంటిపెద్దగా పురుషుడు మాత్రమే ఉండి అతని కష్టార్జితమైన ఆస్తి వారసత్వంగా సంక్రమించేటప్పుడు ఏర్పడే గందరగోళాలకి తరుణోపాయంగా పురుషుడు ఎన్ని సానివాడల్ని సందర్శించినా పర్లేదు గానీ స్త్రీలు మాత్రం భర్తతో తప్ప పరపురుషుడితో సంగమించరాదనే నియమం పెట్టారు.కానీ ఇవ్వాళ స్త్రీలు కూడా ఆర్జనపరులుగా ఉన్నారు.దానిమూలంగా ఆస్తి మీద స్త్రీలకు కూడా వాటా వస్తున్నది!ఎప్ప్పుడైతే స్త్రీలు ఇల్లు దాటి సమాజంలోకి వచ్చి కలివిడిగా తిరగడం మొదలుపెట్టారో ఇన్నాళ్ళూ మంగవాళ్ళు తమ స్ఖాలిత్యాలకి చెప్పుకునే కలివిడితనం వీళ్ళకీ వచ్చింది.చెడిపోయే అవకాశాలు ఇద్దరికీ సమానంగా ఉన్నప్పుడు క్షమించడం అనేది యేకపక్షంగా ఎందుకు ఉండాలి అనే ప్రశ్నని సామాన్యగారు మగవాళ్ళకి వేస్తున్నారు!అందులో తప్పేమీ లేదు.మరొక కోణంలో ఆమె స్వేచ్చని కావాలని తప్పు చెయ్యటానికి వెసులుబాటుగా ఉపయోగించుకోవడం గురించి ఆడవాళ్ళకి హెచ్చరిక కూడా చేస్తున్నారు,ఇందులోనూ తప్పు లేదు!

     హిందూ సమాజం సంస్కరణకి వ్యతిరేకం కాదు.అందుకు సాక్ష్యం సంస్కరణ కోసం ఉద్యమించిన  యే సంస్కర్తా చంపబడకపోవటం,తన జీవితకాలంలోనే విజయం సాధించటం!నిత్యనైమిత్తికాలతో సతమతమయ్యే సామాన్యులు అజ్ఞానంతోనో వ్యామోహంతోనో  దురాచారాల్ని కొంతకాలం పాటించినా సంస్కర్తలు ఎప్పుడైతే అసలు ధర్మసూత్రాలలో ఉన్నదేమిటో చెప్పినప్పుడు బుద్ధిగా విని తమను తాము సంస్కరించుకున్నారు.స్వార్ధంతో ఆ నియమాల్ని పెట్టినవాళ్ళు,వాటివల్ల వెసులుబట్లు పొందుతున్నవాళ్ళు తప్పకుండా వ్యతిరేకిస్తారు,వ్యతిరేకించారు కూడా!కానీ సంస్కరణ ప్రయత్నాలు ఫలవంతమయ్యాయనేది వాస్తవం.ఈరోజు రెండు అతిచిన్న ఇబ్బందికరమైన అవశేషాలకి గురికావడం తప్పిస్తే హిందూ మహిళల పరిస్థితి మెరుగ్గానే ఉంది.ఆ రెండు ఇబ్బందులనే సామాన్య గారు తన కధలో ప్రస్తావించారు.ఆ దోషాలు కూడా తొలగించాల్సిందే.మరి,గొడవ ఎందుకొచ్చింది?ప్రత్యేకించి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చినా ఆగకుండా ఆమెమీద వ్యక్తిగతమైన దాడికి తెగబడటానికి వెనక ఉన్న రహస్యమేమిటి?

     మనుషుల ప్రవర్తనని శాసించే విషయంలో ఆధ్యాత్మికం వేరు,సామాజికం వేరు!సామాజికస్థాయిలో గౌరవం పొందాలన్నా అవమానించబడాలన్నా రాజ్యాంగమూ ప్రభుత్వమూ లాంటివాటితో సంబంధం ఉంటుంది.అక్కడ మైనార్టీలకి ప్రత్యేక హక్కులూ అవీ ఉంటాయి.అయితే,ఈ మైనార్టీలకి ఇచ్చే రిజర్వేషన్లు ఎక్కడ ఇస్తున్నారు,ప్రత్యేక సదుపాయాలు ఎక్కడ చేస్తున్నారు?ఉపాధి,సంపాదన,ప్రాతినిధ్యం,అధికారం వంటివాటికి కొన్ని పరిమితుల్లోనే ఇస్తున్నారు తప్ప  నేరాలు చేసి శిక్షనుంచి తప్పించుకునే వెసులుబాట్లని కల్పించడం లేదు - నూటికి లక్షమంది అడిగినా అలా ఎవరూ కల్పించరు!ఆధ్యాత్మికానికి ఈ ఉపాధి అవకాశాలతో సంబంధం లేదు కాబట్టి మైనార్టీల గురించి ఆలోచించాల్సిన ఆవసరం దానికి లేదు.ఈ తేడాలు ఒక ధర్మాన్ని సమాజంలోని ప్రజలతో పాటించేటట్లు చెయ్యడానికి సంబంధించినవి,కానీ అసలు యేది ధర్మం అనేది తేల్చాలి అంటే మాత్రం రెండు చోట్లా మెజార్టీ ప్రజలు దేన్ని సమర్ధిస్తే అదే ధర్మం!ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య గారి కమలిని కధని చదివితే అందులో ఇంత గొడవ చెయ్యాల్సిన అంశం యేదీ లేదు, మరెందుకు వీళ్ళు సామాన్య గార్ని క్షమించడం లేదు?

     ఇలా గందరగోళంలో చిక్కుకున్న రచయిత్రికీ,అదేరకం అయోమయంతో ఉన్న వనజ గారికీ నేను చెప్పేది ఒక్కటే - ఆవిడ కధలో మహాభారతం నుంచి ఒక కొటేషన్ వాడారు!ఈ దేశంలో కొందరికి ఎర్రకామెర్ల రోగం పట్టింది.వాళ్ళు హిందూమతంలో మంచి ఉందంటే చచ్చినా ఒప్పుకోరు.ఇదే సారంగలో అర్జున విషాదయోగానికీ ట్రోజన్ల కధకీ ఒకాయన పోలిక తీసుకురాబోయినందుకే ఇంకొకాయన "వీళ్ళనందుకు ప్రస్తావిస్తున్నారు!వీళ్ళు యే ఉత్పత్తి శక్తులకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?" అని వాంతులు చేసుకున్నాడు.నేను కమ్యునిజం గురించి నాలుగు ప్రశ్నలు వేసేసరికి అబ్బెబ్బెబ్బె నేను కమ్యునిష్టుని కాదు, జాతస్యహిందువుని అని మరోసారి మరోరకంగా వాంతులు చేసుకున్నాడు.అక్కడ ఇలాంటివాళ్ళ కామెంట్లే పడతాయి!ఇంక రచయిత్రి సంస్కారవంతులని భావించి విజ్ఞప్తులు చేసిన సారంగ ఎడిటర్లూ ఎడ్మిన్లూ ఆమెరికాలో ఉండి రెండు చేతులా ఆర్జిస్తూ దేశానికి సంబంధించిన విషయాల్లో మాత్రం హిందూమతాన్ని విమర్శించే కమ్యునిష్టులకి పక్కలేసే గాండ్లసంగులు!హిందూమతాన్ని విమర్శించే వ్యాసాలూ,కామెంట్లనే వారు ప్రచురిస్తారు.మరీ బాగుండదని కల్లూరి భాస్కరం గారిలాంటి వాళ్ళని ఆదరిస్తారు గుడ్విల్ కోసం కాబోలు!వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలిసింది గాబట్టి మీరు కంగారు పడకుండా మీ సాహితీసృజనని ఎప్పట్లాగే కొనసాగించండి.

     వీళ్ళంతా ఈ రాజ్యాలూ,యుద్ధాలూ,నీతులూ బ్రాహ్మలే పెట్టారు అని అంటున్నది మాటవరసకి నిజమే అని ఒప్పుకున్నా వాటిని అందరూ ఒప్పుకుని పాటించడం వల్లనే సంప్రదాయంగా స్థిరపడినాయి.ఆ ధర్మాలు అట్లా ఉన్నాయి గాబట్టి మాకు స్వైరిణులు అనే పేరు వస్తున్నది ,కనక ఆ ధర్మమే చెడ్దది అనే హక్కు వీళ్ళకి లేదు గాక లేదు!అసలు ధర్మాన్నే తప్పు పట్టేవాళ్ళని తలమీద చెయ్యేసి నొక్కేసినా తప్పు లేదు!


వెసులుబాటు కోసం వేసే ఎత్తులు విప్లవమూ కాదు,కట్టుబాటు కోసం పెట్టే ఒత్తిడి నియంతృత్వమూ కాదు!

Wednesday 4 May 2016

అనేక విధాలుగా తనను తనే అర్చించుకంటాడు మానవుడు,అతని ఆత్మపూజకు నామాంతరమే అతను పూజించే దేవుడు!

సీ||యోగీంద్ర మానసాంభోరుహ ప్రాణనా
       యక!భోగీంద్ర శయన!సహేంద్ర

       వాశిష్ఠ సహృదవారిజ లోచనా
       నందకారక!శార్జ నందక ఘన

       పాంచజన్య ఢమరుకా శూలపాణీంద్ర!
       మాల్యాద్రి గరుడాద్రి మలయ వింధ్య

       సాహ్యాద్రి కాశీ ప్రయాగ క్షేత్ర
       భూజేంద్ర శక్తి సంపూరకాయ!

తే.గీ||కమల సంభవ గౌరీంద్ర పర్యవేష్ఠి
          త ప్రళయకాల వటపత్ర డోల లోల
          నాయ!భోగ యాత్రాను సంధాయక!ద్వి
          బాహు రపరో హరి!సమర బ్రాహ్మణాయ!
(01/05/2016)
-----------------------------------------------------------------------------------------------------------------
అహం బ్రహ్మాస్మి!
-----------------------------------------------------------------------------------------------------------------

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...