Thursday 31 January 2019

వరమిస్తావా ఓ సుకుమారీ, నీ కళ్ళను ఎపుడూ నానుంచి మరలిపోనివ్వనని!

అబ్బాయి:
వరమిస్తావా ఓ సుకుమారీ,
నీ కళ్ళను ఎపుడూ నానుంచి మరలిపోనివ్వనని!

చరణం:
అందం చూడకనే అనుబంధం పేనవేసుకుని
బంధం వీడకనే అనుక్షణం గిరిగీసుకుని
అందరు కోరుకునే పూర్ణమిదం సాధించాలని
పిచ్చివాడిలా నీచుట్టూ తిరుగుతున్న నాకు...
||ప||

చరణం:
అహం పోవడానికి ఉపాయాలు చెప్తావని
భవం దాటడానికి సహాయాలు చేస్తావని
అభయానికి ఏకమేవాద్వితీయం నేర్పుతావని
పిల్లవాడిలా నీ కడకొంగును పట్టుకున్న నాకు...
||ప||

చరణం:
నన్ను నీతో కలుపుకుని మనం అనుకోవడానికి
మనం ఇల్లొకటి కట్టుకుని కుటుంబం అవడానికి
కుటుంబం పెరిగి బంధువులై సమాజం అవడానికి
బిచ్చగాడిలా దోసిలిపట్టి నీముందు నిలుచున్న నాకు...
||ప||

చరణం:
నువ్వు తప్ప ఇంకెవరూ నాకు అక్కరలేదని
నేను తప్ప ఇంకెవరూ నీకు ఉండకూడదని
మనకి మనం త్వమేవాహం అయిపోవాలని
భక్తిలోని సంపూర్ణశరణాగతిని అందుకున్న నాకు...
||ప||

అమ్మాయి:
వరమిస్తావా ఓ ముచికుందా,
నీ కళ్ళను ఎపుడూ నానుంచి మరలిపోనివ్వనని!

చరణం:
అందం చూడకనే అనుబంధం పేనవేసుకుని
బంధం వీడకనే అనుక్షణం గిరిగీసుకుని
అందరు కోరుకునే పూర్ణమిదం సాధించాలని
పిచ్చిదానిలా నీచుట్టూ తిరుగుతున్న నాకు...
||ప||

చరణం:
అహం పోవడానికి ఉపాయాలు చెప్తావని
భవం దాటడానికి సహాయాలు చేస్తావని
అభయానికి ఏకమేవాద్వితీయం నేర్పుతావని
చిన్నపిల్లలా నీ ఉత్తరీయం పట్టుకున్న నాకు...
||ప||

చరణం:
నన్ను నీతో కలుపుకుని మనం అనుకోవడానికి
మనం ఇల్లొకటి కట్టుకుని కుటుంబం అవడానికి
కుటుంబం పెరిగి బంధువులై సమాజం అవడానికి
బిచ్చగత్తెలా దోసిలిపట్టి నీముందు నిలుచున్న నాకు...
||ప||

చరణం:
నువ్వు తప్ప ఇంకెవరూ నాకు అక్కరలేదని
నేను తప్ప ఇంకెవరూ నీకు ఉండకూడదని
మనకి మనం త్వమేవాహం అయిపోవాలని
భక్తిలోని సంపూర్ణశరణాగతిని అందుకున్న నాకు...
||ప||

P.S:అమ్మాయిలూ అబ్బాయిలూ I LOVE YOU చెప్పుకోవడానికి ఎవరి version వాళ్ళకి రాశాను, బాగుంది కదూ!

Monday 28 January 2019

నిన్నటి రోజున శబరిమల దగ్గిర జరిగిన, ఈరోజు తిరుమల దగ్గిర జరుగుతున్న భీబత్సం రేపు శ్రీశైలం దగ్గిర జరగవచ్చు, ఎల్లుండి కాశీలో కూడా జరగవచ్చు - తిరువళ్ళువార్ బైబిలు చదివి తిరుక్కురల్ రాశాడని కూసిన మత మాఫియా మంద బలం పుంజుకుంటున్నది!

కేరళలో జరుగుతుంది రాజకీయమే, సుప్రీంకోర్టులో దేవస్థానము, హిందూ సంస్థలు కాకుండా కమ్యూనిస్టు ప్రభుత్వము వాదించడం రాజకీయమే -  గుడిలోకి అయ్యప్ప మీద నమ్మకము లేని మహిళలు ప్రవేశించడం హిందూమతద్వేషులు పట్టుబట్టి చేస్తున్న వ్యూహాత్మకమైన దాడియే!

మహిళలు గుడిలోకి వెళ్లకూడదు అన్న విషయాన్ని, అంటరానితనం తో పోల్చలేం.I don't support suprem court. దేవుడు వేరు, కులం వేరు.మహిళల్ని గుడి లోకి రాకుండా ఉండటం లింగవివక్ష కాదు.అలాగైతే కేరళలోని ఏ గుడిలోకి మహిళలు వెళ్లకూడదు అనే నిబంధన వుండేది.

.ప్రతి గుడికి కొంత చరిత్ర ఉంటుంది, పురాణం ఉంటుంది.మగవాళ్ళకి ప్రవేశం లేని ఆలయాలు కూడా ఉన్నాయి.వస్త్రధారణకి సంబంధించిన నియమాలు పెట్టిన ఆలయాలు కూడా ఉన్నాయి.హిందువులు పాటించే నియమాల్ని హైందవేతరులు విమర్శించడం మంచి పద్ధతి కాదు.మతానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కోర్టులు తీర్పులు ఇస్తూ ఉంటే మతస్వేచ్చకీ లౌకికత్వానికి అర్ధం ఏమిటి?అదీగాక, సుప్రీం కోర్టు ఒక మతానికి సంబంధించిన విషయాల్లో నాస్తికులూ హేతువాదులూ చేసిన మిధ్యాతాత్పర్యపు వాదనల్ని విశాల దృక్పధంతో చేసిన వాదనలని భ్రమించి ఇచ్చిన తన తీర్పుల్ని అన్ని మతాలకీ వర్తింపజేయగలదా?అలా చెయ్యలేనప్పుడు అది ఆ ఒక మతం పట్ల వివక్ష చూపించడం కాదా!

అసలు హిందువుల గుడిలోకి వెళ్ళమని హిందువులు కానివాళ్ళకి పర్మిషన్ ఇవ్వడానికి కోర్టుకి ఏమి అధికారం ఉంది?ఒక్క హిందూ మతం గురించి మాత్రమే అందరూ అన్ని సంస్కరణలు తీసుకురమ్మని చెప్తారు.మరి ఇదే విధంగా మిగిలిన మతాల విషయాల్లో ఎందుకు సంస్కరణలు తీసుకురమ్మని ఒత్తిడి చేయరు.ప్రతి మతంలో అంతో ఇంతో సంస్కరణలు తీసుకురావలసిన అవసరం ఉంది.కాని ప్రతి ఒక్కరు ఈ ఒక్క హిందూ మతం పైనే మాట్లాడతారు.ఒక వేళ మిగతా మతాల వారికి వ్యతిరేకంగా మాట్లాడుతే వారు తిట్టే తిట్లనీ తన్నే తన్నుల్నీ తట్టుకోలేమని కాబోలు!

పోనీ, గభాల్న న్యాయవ్యవస్థని తప్పు పట్టటం దేనికి?వాదన కోసం సుప్రీం కోర్టు అన్నిమతాలలోనూ కొన్ని అమానవీయమైన దురాచారాలు ఉన్నాయి గాబట్టి అలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని న్యాయమైన తీర్పునే ఇచ్చిందని అనుకుందాం!కానీ, శబరిమలలో జరిగింది ఏమిటి?అసలు హిందూమతంతో ఎటువంటి సంబంధమూ లేని, పైన విగ్రహారాధనని పాపభూయిష్ఠమైన చర్యగా భావించే ముస్లిం మహిళల్ని ఆలయంలోకి తీసుకెళ్ళి వాళ్ళ చేత భక్తి అనిపించని వికృతచేష్టల్ని చేయించటానికి రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం పోలీసు బలగాల్ని వినియోగించి అయ్యప్ప భక్తులలో భయాందోళనల్ని  సృష్టించడం - ఇదేనా సుప్రీం కోర్టు తన తీర్పులో ఆశించినది?

శబరిమల దగ్గిర అమాయకులైన హిందువుల మీద తన ప్రతాపం చూపించిన కమ్యునిష్టు నేతలు Malankara Syrian Churchకి చెందినవాళ్ళని Jacobite faction వాళ్ళు అడ్డుకుంటున్నప్పుడు Piravom Church దగ్గిర  చేష్టలు దక్కి దిక్కులు చూస్తూ ఎందుకు నిల్చున్నారు?హైకోర్టు "how despite an apex court order the state government was unable to ensure that a group was allowed to offer prayers at a church, when authorities had no difficulty in deploying thousands of police personnel at Sabarimala" అని అడిగిన దాని అర్ధం ఏమిటి?

"దొంగలంజకొడుకు లసలే మెసిలే ఈ ధూర్తలోకంలో.." అని శ్రీశ్రీ ఎవరి గురించి  అన్నాడో  గానీ వామపక్షభావాలతో ఉత్తేజితుడైన శ్రీశ్రీ వాడిన ఆ బూతుమాట ఇవ్వాళ కేరళలో కొలువుదీరిన వామపక్ష నేతలకే తగుల్తున్నది కదా!

అయ్యప్ప భక్తుల మొండితనం కూడా తగ్గాలి.వాళ్ళ మతము, భక్తీ ఇక్కడ అప్రస్తుతము. మన హిందూ స్త్రీలందరికీ పురుషులతో సమానంగా ఆలయ ప్రవేశం కల్పించడం మానవ ధర్మం. పురుష స్వాములు దేవుని దగ్గర ఏమి ఆశించి సాధించు కుంటారో మహిళా స్వాములు కూడా అదే దైవ కృపను పొందుతారు. దేవుడు కొందరికి కొంచం ఎక్కువ మరికొందరికి తక్కువా కాదు. దేవుడు అందరికీ సమానము.

మహిళను ఆది పరాశక్తికి ప్రతీకగా భావించి పూజించే హిందూ ధర్మంలో రుతుక్రమ వయస్సులో ఉన్న మహిళలను “మైల” అంటిన వారిగా పరిగణించి “అపవిత్రత”ను అంటగట్టి వారికి ఆలయ ప్రవేశం నిషేదించడం వినడానికి అవమాన కరంగానూ, హాస్యాస్పదంగానూ ఉంది. 

మెజారిటీ హిందూ మహిళలు ఆలయ ప్రవేశం కోరుకోవడం లేదనీ, కేవలం కొద్దిమంది (మైనారిటీ) మాత్రమే పనిగట్టుకుని హిందూమత సంస్కృతీ సాంప్రదాయాలను నాశనం చేసే కుట్రలో భాగంగానే ఆలయ ప్రవేశం కోరుకుంటున్నారనీ కొట్టిపారెయ్యడం సమంజసం కాదు. మెజారిటీ మంది చేసినంత మాత్రాన తప్పు ఒప్పుగాదు.

మనిషికి మల మూత్ర విసర్జనలు ఎంత సాధారణమైన (జీవ) ప్రక్రియలో మహిళకు రుతుక్రమం కూడా అంతే సాధారణం. రుతుక్రమం మైల అయినప్పుడు మల మూత్ర విసర్జనలు మాత్రం ఎలా మైల కాకుండా పోతాయో విజ్ఞులు ఆలోచించాలి. 

ఎంత గొప్ప సంస్కృతి అయినా దేశ కాల పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు నిరంతరం మార్పుకు లోనౌతూ ఉంటుంది. దానికి తగినట్లు మనం కూడా అందులోని మంచిని కాపాడుకుంటూనే చెడును క్రమేణా విసర్జిస్తూ కాలంతోబాటు ముందుకు సాగి పోవాలి. అలా కానిపక్షాన మనమే మన సంస్కృతీ సాంప్రదాయాల ఉనికిని చేజేతులా నాశనం చేసుకున్న వాళ్ళమౌతాము.

శబరిమల 1971 వరకు ఆడవాళ్ళు వెళ్ళేవారు మళ్లీ ఏదో కథలు చెప్పి రాకుండా చేశారు. శబరిమల అందరూ వెళ్లాల్సిందే. హిందూ మతంలో వేరు చేసి చూసే దిక్కుమాలిన పని చేయరు.  ఏదో పనికిరాని కట్టు కథలు ఆచారాలు అని చెప్పి వేరు చేసి చూడకూడదు.ఈ కట్టుబాట్లూ, నియమ నిష్టలూ, కుల మతాలూ, దేవుళ్ళూ, దెయ్యాలూ, సంస్కృతీ సంప్రదాయాలూ వగైరాలన్నీ, సమాజ శ్రేయస్సు కోసమో లేదా కొంత స్వార్థంతోనో మన పూర్వీకులు ఏర్పరచినవే. ఆ కాలానికి అవి సరిపోయాయేమో! అప్పటికీ ఇప్పటికీ మనిషి ఆలోచనా విధానంలోనూ, జీవన విధానంలోనూ, విజ్ఞాన పరంగానూ ఎంతో పురోగతి సాధించాము. ఓ వ్యకిని మరో వ్యక్తిగానీ, ఓ కులం మరో కులాన్ని కానీ, ఓ వర్గం మరో వర్గాన్ని కానీ, ఓ మతం మరో మతాన్ని కానీ అలాగే తొక్కి పట్టి ఎంతోకాలం తమ చెప్పు చేతల్లో ఉంచుకోలేవు. అణచివేత నుండి తిరుగుబాటు మొదలౌతుంది. ఎదుటి వారి నుండి మనం ఎలాంటి గౌరవ మర్యాదలను ఆశిస్తామో మనము కూడా వారి పట్ల అలాంటి గౌరవ మర్యాదలతో మెలగాలి. అప్పుడే ఆ సంస్కృతి, సంప్రదాయాలు పదికాలాలపాటు మనగలుగుతాయి.

దీనమ్మ హిందు మతం!నీళ్లు ఫ్లష్ చేసే అవసరం కూడా లేని పబ్లిక్ యూరినల్ లాంటిది అయిపోయింది హిందు మతం అంటే!యిక్కడ శిల్పి కానీ, కంసాలి కానీ, మేస్త్రీ కానీ, టైలర్ కానీ, ఒక సర్వీస్ ప్రొవైడర్ అంతే. "యిల్లుకట్టిన తరువాత నేను కట్టిన యింటిలో నాకు  ప్రవేశం ఉండదు.టాయిలెట్ వస్తే బయట రోడ్డు పక్కన పోవాలె. నేను కట్టిన ఇంట్లో నేను పరాయివాణ్ణి" అని ఏ తాపీ మస్త్రీ అయినా తను కట్టిన ఇంటి యజమాన్లతో పోరాడగలడా?మన ఇల్లు కట్టిన తాపీ మస్త్రీ మన ఇంట్లో వాటా ఇమ్మంటే ఇస్తామా - ఇవ్వం,ఎందుకంటే అది "మన" యిల్లు కదా.గుడి, హిందు మతం ఎవడిదీ కాదు.ఎవరయినా ఏమయినా అనవచ్చు.ప్రతిష్ట అయిన తరువాత పూజారికి తప్ప , బ్రహ్మడు అయినంత మాత్రాన ఏ బ్రహ్మడికి కూడా గర్భగుడిలోకి ప్రవేశం లేని విషయం అందరికి తెలుసు. కానీ కావాలని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. తెల్లారి లేచిన కాణ్నించి తొంగునే వరకు నోటికి అన్నమే తింటున్నాడో గడ్డే తింటున్నాడో అశుద్ధమే తింటున్నాడో  తెలియని ప్రతి అడ్డగాడిదా హిందు మతం మీద మాట్లాడటమే...నీళ్లు ఫ్లష్ చేసే అవసరం కూడా లేని పబ్లిక్ యూరినల్ లాంటిది అయిపోయింది హిందు మతం అంటే!

ఆలయ ధర్మకర్తలూ అయ్యప్ప భక్తులూ వివేకవంతమైన ధృఢచిత్తంతో వ్యవహరిస్తే ఇప్పటి గొడవ సమసిపోయి అక్కడ ప్రశాంతత ఏర్పడవచ్చు,కానీ దేశంలోని ప్రతి హిందూ ఆలయం చుట్టూ ఇలాంటి అరాచకాల్నే ఎంతో డబ్బునీ టైమునీ ఖర్చు చేసి జనాన్ని మొహరించి జరిపించటానికి జరుగుతున్న బృహన్నాటకంలో శబరిమల  చుట్టూ రగిల్చిన వివాదం ఒక అంకం మాత్రమే!హిందువులు శాంతస్వభావులు.వీళ్ళ నమ్మకాలు గట్టిగా ఉంటాయి. ఒక్కణ్ణి లాక్కొస్తూ ఉంటే పదిమంది జారిపోయే అబ్రహామిక్ మతాల  బాధితుల్లా గాక  "అన్నిటికీ దేవుడే ఉన్నాడు!ఆయనే చూసుకుంటాడు." అనే ధీమా ఉందటం వల్ల కిరస్తానోళ్ళలా తురకోళ్ళలా కాస్తకీ కూస్తకీ రోడ్లెక్కి అల్లరి చెయ్యరు.

హిందువులలోని ఈ సహనశీలంతో కూడిన ఉన్నతసంస్కారం హిందూమతద్వేషులకి బలహీనతలా కనిపిస్తున్నది.అందుకే,ఎన్ని సార్లు సంధి ప్రతిపాదనలతో సమస్యల్ని పరిష్కరించుకోవాలని చూసినా సూది  మొన మోపినంత భూమిని కూడా ఇవ్వనన్న దుర్యోధనుడిలా సంధికి రాకుండా కయ్యానికే కాలు దువ్వుతున్నారు.వేల సంవత్సరాల చారిత్రక ప్రాశస్త్యం గలిగిన తిరుమల అసలు హిందూ దేవాలయమే కాదనీ ఎవడో ఒక పులిరాజు అనే గొట్టాంగాడి శవం మీద వాళ్ళు చర్చి కట్టుకుంటే దాన్ని కూలగొట్టి హిందువులు గుడి కట్టారనే వాదన మొదలుపెట్టారు ఇద్దరు సుందోపసుందుల్ని పోలిన మదాంధులు!

ఇంటి పేరులో ఒక "రెడ్డి"నీ అసలు పేరులో ఒక "రెడ్డి"నీ పెట్టుకున్న ఒక పిచ్చిరెడ్డి వీళ్ళకి అద్భుతమైన తిరుగు లేని ఆధారాలని అందించాడట!ఈ మధ్యనే చిరంజీవి వై అనే బ్లాగరు  గోభక్షణ గురించి రాసిన పోష్టులో సూక్తం సంఖ్య గానీ మంత్రం సంఖ్య గానీ ఇవ్వకుండా జాగ్రత్త పడినట్టు వీళ్ళు ఎంతో పరిశోధించి రాసిన చారిత్రక గ్రంధం అని చెప్పే ఏ పుస్తకంలోనూ అధికారికమైన శాసనాలను గానీ ప్రాంతాల ఆనవాళ్ళను గానీ గానీ వ్యక్తుల వంశావళిని గానీ చూపించరు."ఒకండు!", "ఒకానొకనాడు!", "పుట్టెను, బతికెను, చచ్చెను, చచ్చబడెను, చూచబడెను" అని మాత్రమే ఉంటుంది.అది గాకపోతే "ఇది మహిమ గల దేవుని వాక్యం గనక నమ్ముడి లేక చచ్చుడి!" అనే బెదిరింపులు ఉంటాయి, అంతే!

వీళ్ళతో పాటు అక్కడ కాషాయం కట్టి  క్రైస్తవబోధ చేస్తున్న హేమలత అనే కూర్చుంటే లేవలేని ముసిల్దానికి తన అర్ధ పాండిత్యం మీద ఎంత నమ్మకమో - నాకూ మోడర్న్ సైన్సు తెలుసు అని చెప్పుకోవటానికి కాబోలు హోమోసెపియన్సు గురించీ 60,000 సంవత్సరాల వెనకటి జీవజాతుల్ని గురించీ మాట్లాడుతున్నది!హొమో సపియాన్శ్ 60,000 సంవత్సరాలు అన్నందుకు కృతజ్ఞతలు చెబుదామా?మరి, అదముడి వయస్సు 3,000 సంవత్సరాలే  కదా. అంటే బైబిల్ బుస్సు అనే కదా అర్దం!

అంతకన్న విచిత్రం ఏమిటంటే,ఇదే ముక్క అక్కడ ఒక హిందూ సోదరుడు అంటే,"ఆదాము వయస్సు 3000 సంవత్సరాలని బైబిల్ లో వ్రాసివుందా?" అని ఒకరూ "Do you have any idea about surviving of Homesapien.I mean any authentic evidence. If yes please share" అని ఒకరూ నిలదీస్తూ క్యామెడీని పెంచుతున్నారు!క్యామెడీ కాక ఏంటండీ?హేమలత ఉదహరించిన సైన్సు బైబిలుని బుస్సుమనిపిస్తున్నదని మనం జోకులేస్తంటే surviving of Homesapienకి దబాయించి మరీ authentic evidence కోసం మనని నిలదీస్తున్నారు - పిచ్చ మాలోకాలుఈ క్యామెడీ అంతటితో అయిపోలేదు, messi అనే శాల్తీ "If we determine age using radioactive isotopes....if their half- life is constant you can have millions  of years....if their half-life is variable....then it just stops at six to seven thousand years.....now tell me....do you think their half-life is constant??....not variable???....think off...." అని మరింత సాంకేతిక పరిజ్ఞానం ఒలకబోస్తున్నది.చూస్తున్న నేను "@messi: do you know what you have expressed in your argument? Could you change half life of elements according to your wish to claim bible is correct? Damn Bloody Idiot! Why you talk about science?all the others are not sheep like you." అని ఒక చురక తగిలించి వచ్చేశాను.అక్కడి నుంచి వచ్చేసిన కొద్ది సేపటికే నా మొబైల్లో ఎవరో నా జవాబుని లైక్ చేసిన ఇంటిమేషన్ మెసేజి వచ్చింది - మొగాంబో ఖుష్ హువా!

అయితే, ఈ messi అనే శాల్తీ కొంచెం చదువుకున్న మొండిఘటంలా వుంది.ఇప్పుడు పోష్టు రాస్తున్నపుడు రెఫరెన్సు కోసం వెళ్తే "@Haribabu Suraneni ...I'm asking you do you have any experimental evidence to show half-lives are constant thoroughout the past????...." అనీ "@Haribabu Suraneni ....first you understand what does it mean .....radioactive decay and their half lives and extrapolation.....then answer me...." అనీ నన్ను చాలెంజి చేస్తూ రెండు కామెంట్లు కనబడుతున్నాయి.ఎంత ధైర్యం?ఎంత మదం?ఎంత కొవ్వు?నేను వూరుకుంటానా!

మొదటి దానికి "@messi: ఓరి, పిచ్జ్చిపుల్లయ్యా!అవి స్థిరంగా ఉంటాయి గనకనే వాటిని ప్రమాణం చేసుకున్నారు.మిల్లీ మీటరు ఎప్పుదైనా సెంటీమీటరు అవుతుందా?అయితే,ఇంక ఇన్ని కొలతలు దేనికి?అన్నింటినీ మిల్లీమీటర్లు అనుకుంటే సరిపోదూ!టైము కూడా అంతే కదా!గొర్రెలా కాక మనిషిలా అలోచించు, సైన్సు గురించి మాట్లాడేటప్పుడు కామన్ సెన్సు కూడా లేకపోతే ఎలా!" అని ఝాడించి కొట్టాను.రెండవ దానికి మొదట "@messi: Idiot!Before asking me silly questions, You have to prove the credibility of the statement:if their half-life is variable....then it just stops at six to seven thousand years..:, and that too strong supporting proof from an authentic source!" అనీ తర్వాత రేడియోయాక్టివిటీకి సంబంధించిన అధికారికమైన సైటుకి వెళ్ళి అక్కణ్ణుంచి తీసుకున్న సమాచారంతో "@messi: The observed effect is simply too small to affect radioactive dating techniques in any significant way.While these studies don’t directly affect the validity of radioactive dating techniques, It’s quite simple. We have only been studying radioactivity for about 100 years. In order to believe radioactive dating techniques that tell us the earth is billions of years old, you have to assume that radioactive half-lives have stayed constant for billions of years. Well…now we KNOW that at least one natural process (something having to do with the sun) does affect radioactive decay rates. What we don’t know is the extent or possible magnitude of the process. We also don’t know what other surprises lie in store for us when it comes to radioactive decay. The extrapolation involved in radioactive dating techniques can only be justified if we KNOW that radioactive half-lives cannot change significantly as a result of natural processes. Since these data make it clear that we DON’T KNOW the extent to which natural processes can cause changes to radioactive half-lives, it is obvious that the extrapolation is simply not justified. When truth is like  this, you are trying to fool us that you can make bible as  truthful by concocting a lie that all those half-lifes can be condensed to 6000 years - How Idiotic it is!Learn science in it's true way,Idiot!" అనీ ఫినిషింగ్ టచ్ ఇచ్చాను.ఈ పుచ్చొంకాయలకి మోడ్రన్ సైన్సు అంతా మా వల్లనే పుట్టిందనే స్కిజోఫ్రెనియా మాయరోగం ఒకటి !

వీళ్ళ అజ్ఞానం ఎట్లా ఉంటుందో చూడండి! tarakk m అనే విజిటర్ "మేడం నేను ఒక రోజు ఈనాడు పేపర్లో చదివాను, తిరుమల అడవిలో అరుదుగా దొరికే ఒక పిల్లి ని వధించి దాని   థైలన్ని (నూనెను) వెంకటేశ్వర స్వామి అభిషేకం లో ఉపయోగిస్తారు అనే ఆచారం ఇప్పటికి ఉంది" అని చాలా నమ్మకంగా చెప్పడమూ దానికి Naresh Kumar అనే ఒక హిందువు "tarakk m గారు తిరుమల లో దొరికే ఆ పిల్లిని పునుగుపిల్లి అంటారు మీరు చెప్పినట్టు దానిని వధించి వధించి తైలం తీరు ఆ పిల్లని ఒక పంజరంలో పెట్టి పంజరానికి మధ్య ఎర్ర చందనం కర్రను పెడితే ఆ పిల్లి ఆ కర్రకు రాసుకుని దాని చర్మం లోని తైలం కర్రకు అంటుకుంటుంది ఆ కర్ర నుంచి తైలాన్ని వేరు చేసి స్వామివారికి వాడే సుగంధ ద్రవ్యాలలో దాన్ని వాడతారు" అని జవాబు చెప్పడమూ గమనించితే మనకు అర్ధం అయ్యేది ఏమిటి?

Mahadeva Mahadeva అనే హిందువు "బైబిల్ ప్రకారం భూమి వయసు 6000 కాదు బాబోయ్ అని మీరు నెత్తి నోరు కొట్టుకుంటే సరిపోతుందా! బైబిల్ పూర్తిగా చదివిన ఎవరికైనా 6000 అని సులభంగా తెలిసిపోతుంది. మీ దేవుడు యహోవా 6 రోజుల్లో సృష్టి పూర్తి చేసి 6 వ రోజు మీ ఆదామును సృష్టించాడు. ఆదాము పుట్టిన 130 సం. రాలకు సేతు పుట్టాడు. సేతు 912 సం. రాలకు చనిపోయాడు అప్పటికి సృష్టి వయసు 130+912+6=1048. తర్వాత నోవా 14 సం. రాలకు పుట్టాడు అప్పటికి 1062 అయింది. ఆదిమకాండం 7:6 ప్రకారం ప్రళయం వచ్చే సమయానికి నోవా వయసు 600 సం. అంటే క్రీ.పూ. 1662 లో ఒక మహా ప్రళయం వచ్చి జీవరాశి చాలా అంతరించిపోయింది. ఆ తర్వాత అబ్రహం క్రీ. పూ. 2300-2500 సం. రాలకు పుట్టాడు. కాబట్టి 2018(ఈ సం)+1662(ప్రళయ సమయానికి సృష్టి వయసు)+2400=6080 సం. ఇది మాకు అర్థం అయిన లెక్క. కాదు అని మీరు చెబితే మేము ఎలా ఒప్పుకునేది. అదీకాక బైబిల్ ప్రకారం భూమి ముందు పుట్టి సూర్యుడు నక్షత్రాలు తర్వాత పుట్టాయి. అంటే సూర్యుని వయసు నక్షత్రాల వయసు ఇంకా తక్కువ. ఇక కాదు బాబోయ్ అని మీరు చెబుతున్నారు కదా మీ లెక్క మాకు చూపండి." అని చేస్తున్న చాలెంజికి ఏ క్రైస్తవుడు జవాబు చెప్పగలడో ముందుకు రమ్మనండి!

నోరు తెరిస్తే మీ మతగ్రంధాల్లో తప్పులు ఉన్నాయి, మీ మతస్థులు దురాచారాలు పాటించారు,మీ మతం కన్న మా మతం చాలా మంచిది అని మనముందు డబ్బా కొట్టుకునే క్రైస్తవమతప్రచారకులైనా అసలు బైబిల్లో ఏమి ఉందో చదివి చస్తున్నారా?బైబిలుని ముట్టుకోకుండానే విమర్శిస్తావా అని నామీద ఇంతెత్తున ఎగిరిపడిన చిరంజీవి వై కనీసం సంస్కృతం నేర్చుకోవడానికి కూడా ముందుకు రాకపోవటానికి కారణం ఏమిటి?సంస్కృతం రాకుండానే వేదాల గురించి పోష్టులు రాస్తున్నప్పుడు తను చేసింది ఏమిటి?

ఏమీ తీసికెళ్లలేక పోయినా సొంతం చేసుకోవటంలో భలే మజా ఉంటుంది. నా చిన్నప్పటి గోళి కాయల కలెక్షన్ చూస్తే అనిపిస్తూ ఉంటుంది, అవి కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. వాటి కోసం నా చేతిలో దెబ్బలు తిన్న ఆ దుర్గారావు గాడికి, అంజయ్యకి కొన్ని ఇచ్చినా బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు - ఈ అన్ని గోళీకాయల్ని సొంతం చేసుకోవాలనే దురదే కొందరిలో పెరిగి పెద్దయ్యాక కూడా అంటుగట్టుకుని ఉండిపోయి ఇతరుల ధనాన్నీ ఇతరుల స్త్రీలనీ ఇతరుల మతాల్నీ సొంతం చేసుకోవాలనే దురాశగా మారుతుంది కాబోలు!

"హిందువుల దేవతల చేతుల్లో హింసకు సంకేతాలైన ఆయుధాలు ఎందుకు ఉంటాయి?" అనే ప్రశ్నకు "అవి కూడా కారుణ్యానికి సంకేతాలే. సృష్టిలో ఈశ్వర కారుణ్యం 1. రక్షా రూపంగానూ, 2. శిక్షా రూపంగానూ ఉంటుంది. ధర్మానికి రక్ష, అధర్మానికి శిక్ష ఈ రెండింటినీ నిర్వహించే ఈశ్వరశక్తి విలాసాలే ఆయుధాలు. లోక విధ్వంసకారకాలైన రాక్షసశక్తులని నాశనం చేయడానికి దైవశక్తి తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది. అహింసా స్థాపనకు చేసే హింస కూడా 'అహింస' కిందకే వస్తుంది. ప్రార్ధించేవారిలోనున్న రాక్షస ప్రవృత్తుల్ని, అజ్ఞానాన్ని నాశనం చేసే జ్ఞానశక్తి చిహ్నాలే పరమాత్ముని సగుణరూపంలో కనపడే ఆయుధాలు. వాటి స్మరణవల్ల మన సాధనలో ఆటంకంగా వచ్చే విఘ్నాలు, దుర్గుణాలు తొలగుతాయి. మనకు కానరాకుండా కలవరపెట్టే అనేక క్షుద్ర, రాక్షస శక్తులని సైతం తొలగించే శక్తి ఆయుధాలకు ఉంది." అని ఎన్నిసార్లు జవాబు చెప్పాలి?వాళ్ళు చిన్నపిల్లలు కాదే!అడుగుతున్న వాళ్ళలో వెకిలితనం కనిపిస్తున్నప్పుడు నాలుగు తన్నడం వల్ల వచ్చే నష్టం ఏమిటి?వాళ్ళని నరికి పోగులు పెట్టినా పాపం రాదు!

"ఖురాన్ పేర్కొంటున్న పిండ నిర్మాణ క్రమం! - ఆధునిక వైద్యశాస్త్ర ధృవీకరణ!"  అని తన మతం యొక్క ఆధునికతను గురించి పొగుడుకుంటున్న Md Nooruddin "మేము మానవుణ్ణి పరీక్షించటానికి అతనిని ఒక మిశ్రమ వీర్య బిందువు (a mixture sperm-drop) తో సృష్టించాము” అనే చిన్న వాక్యం మాత్రమే అక్కడ ఉంటే దానికి "వాస్తవానికి ఆధునిక జీవశాస్త్రం (Modern Biology) చెప్పేది ఏమిటంటే స్త్రీ అండాశయం (ovaries) నుండి విడుదల అయ్యే అండం ఫలదీకరణం చెందటానికి (లేదా గర్భం దాల్చటానికి) 350,000,000 పురుష వీర్యకణాలలో కేవలం ఒక్క వీర్యకణం (స్పెర్మటోజూన్/spermatozoon) సరిపోతుందన్నది. ఈ విషయాన్ని ఖురాన్ ఈ క్రింది విధంగా ముందే ప్రస్తావించిందన్నది గమనార్హం." అనే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రపు విశ్లేషణని కలిపి హడావిడి చేస్తున్నారు!

సరే, ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్టు వారి మతగ్రంధంలో ఉన్న కొంచెం సైన్సుని గురించి చెప్పుకుని "మేము ప్రాచీనతని పట్టుకుని వేళ్ళాడటం లేదు,మాలోనూ ఆధునికత పట్ల గౌరవం ఉంది!" అని చెప్పుకోవటం వరకు ఎవరూ విమర్శించాల్సిన అవసరం లేదు.

కానీ, "ఖురాన్ ను విమర్శించటమే పనిగా పెట్టుకున్న వారి కళ్ళకు ఇలాంటి జ్ఞానవంతమైన విషయాలు ఏ మాత్రం కనపడవు కదా! పైగా ఖురాన్ ను లోతుగా అవగాహన చేసుకోవటం ప్రక్కనపెడితే కనీసం ఒక్క సారి కూడా చదవకుండానే ఖురాన్ ను గ్రుడ్డిగా విమర్శిస్తూ ఉంటారు. వారి ఆందోళన ఏమిటంటే ఖురాన్ ఎక్కడ సత్య గ్రంధమని నిరూపణ జరిగిపోతుందో, అలా జరిగిపోతే తమ వర్గం ప్రజలు ఎక్కడ దాని పట్ల ఆకర్షితులు అయిపోతారో అన్నది... పైగా మా వద్ద ఉన్న గ్రంధాలే అసలైన గ్రంధాలు, మేమే పెద్ద తోపులం అని భావించుకునే ఈనాటి ఖురాన్ విమర్శకుల అమాయక ఆలోచన ఏమిటంటే- ఇస్లాం బలవంతంగా వ్యాపించింది! అబద్ధ విషయాలతో నిండిన ఖురాన్ ను సైతం ఎవరో కొందరు అమాయకులు, లోక జ్ఞానం లేనోళ్లు అనుసరిస్తూ ఉంటారు తప్ప తమ లాంటి తోపులు దానిని నమ్మరన్నది!" అనే భాగం మాత్రం విమర్శించి తీరాల్సిన విషయమే.

ఎందుకంటే, కేవలం 1400 సంవత్సరాల క్రితం ఒక నిరక్షరాస్యుడు ఈ అస్పష్టమైన వివరాలు ఇవ్వగలిగినందుకే వారు ఇంత పొంగిపోతున్నారే!పోతన తెలుగులోకి అనువదించిన  వేదవ్యాస విరచితమైన భాగవతంలో పాయింట్ల వారీ అత్యంత సూక్ష్మమైన వివరాలతో సహా మానవ పిండోత్పత్తి క్రమం వర్ణించబడి ఉంది - మీకు సందేహం ఉంటే దానికి సంబంధించిన మొత్తం పాఠాన్ని ఇక్కడ ఉంచగలను.ఇప్పటి చారిత్రక విజ్ఞానపు ఆధారాలతో చూస్తే 5,000 యేళ్ళ వెనక జరిగిన మహాభారతయుద్ధపు కాలంవాడైన వేదవ్యాసుడికి తెలిసిన విషయాలతో పోలిస్తే వారు ఇక్కడ ఉదహరించిన అస్పష్టపు వివరాలకి గొప్పతనం ఏముంటుంది?

ఇంక పూర్వ సామాన్యశకం 4,000 నాటిదని చెప్పబడుతున్న వైదికయుగం నుంచే ఇక్కడి వారు ప్రపంచంలోని అన్ని దేశాలకూ వెళ్ళి వచ్చేవారని తెలుస్తున్నది.పూర్వ ఇస్లామీయ అరబిక ప్రాంతం వైదిక సంస్కృతిని ఆదరించిన సాక్ష్యాలు ఉన్నాయి - వారికి నచ్చని ఇతరుల్ని తోపులు అంటున్న Nooruddin వంటి తోపులకు ఎందుకు కనపడలేదు? 

అన్ని సాక్ష్యాధారాలనూ పరిగణనలోకి తీసుకుంటే Amazing Science found in Quran! అని వారు గొప్పలు చెప్పుకుంటున్న వివరాలు పూర్వ ఇస్లామీయ కాలం నాటికి అనేక ప్రాంతాలలో వైదిక శ్రేష్ఠులు ప్రచారం చేసినవే! 

వైదిక విజ్ఞానంలోని కొన్ని తునకల్నే నిశానీ అయిన వారి ఆఖరి ప్రవక్త గారు వినికిడి జ్ఞానంతో ఖురానులోకి యెక్కించదం జరిగింది, అంతే!అసలు నుంచి కాపీ కొట్టినవాళ్ళే ఇంత పొంగిపోతుంటే అసలు వాళ్ళు ఇంకెంత పొంగిపోవాలి?మీరే చెప్పండి.

జకీర్ నాయక్  నుంచి మొదలుపెట్టి ప్రతి ముస్లిం మతప్రచారకుడూ "మీ వేదాల్లో కూడా మా అల్లా ఉన్నాడు - కావలిస్తే పోయి చూసుకోండి!" అని మంత్రాల నంబర్లు చెప్తూ రంకెలు వేశారు.తీరా చాగంటి వెంకటరమణ గారు ముస్లిములు వాళ్ళ దేవుణ్ణి "అల్లాహ్" అని మాత్రమే పిలవాలి అనీ వేదమంత్రాల్లో వాళ్ళు చూపిస్తున్న "అల్లా"కి అర్ధం "తల్లి" అనీ నిరూపించి దీని ప్రకారం వెళితే అల్లా గాక "తల్లియే దైవం!" అని ముస్లిములు  అంటున్నట్టు అర్ధం వస్తుందని విడమరిచి చెప్పి ముస్లిములు దాన్ని ఒప్పుకుంటారా అని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ ఒక పేద్ద జవాబు చెప్తే కుంచానికి చిల్లి పడితే చెయ్యడ్డం పెట్టి కొల్చినట్టు Syed Ellias అనే జగమొండి సాయిబు "Mana andari Srishthikarta Peru Paramatma Parameshwar Allah, Yahova, Waheguru,.Elohim, veerandaru Okkare....Veda shastras prakaram Oke okka nirakara Paramatma Parameshwarunni matarme poojinchaali, anyulanu kaadu...kabatti Peru edaina Srishthikarta andariki okkade. So, sabka malik Ek.......Ediots fight in the name of God saying their God is real....Even though there are number of names, the Creator(Srishthikarta) is one and the same...The fact is that he is one and formless as said Vead shastras by name Paramatma parameshwar, who is none other than Allah or Yahova(Elohim) or Waheguru....." అనేశాడు - ఎదవ తెలివి అని దీన్నే అంటారు! అంత కష్టపడి అల్లాహ్ అనే పదం అసలు సంస్కృతంలోనే లేదు వేదంలో ఉందనటం కుదరదు అని రుజువు చేస్తే పేరుదేముంది వేదం చెప్పిన ఏకేశ్వరుణ్నే అల్లా అని సరిపెట్టుకోమని ఉచిత బోడి సలహా ఇస్తున్నాడు! ఆ పని తనే చెయ్యొచ్చు కదా, ఎక్కడో ఉన్న మక్కాకి పోయే బదులు  పక్కనే ఉన్న బెజవాడ వెళ్ళి దుర్గమ్మ తల్లిలోనే అల్లాని చూసుకుంటే ఎవరు కాదంటారు?అబ్బే! అది కుదరదు, హిదువులే ఎర్రిపప్పల్లా దొరికారు ఈ సుత్తి వినడానికి. వేదం సృష్టికర్తకి నిరాకారం, సాకారం అనే రెండు స్థితులు ఉన్నాయని చెప్తున్నట్టు ఇతనికి తెలియదు,అయినా వేదంలో వాళ్ల ఖురాను ప్రశస్తం అని చెప్పిన నిరాకారం తప్ప ఖురానుకు విరుద్ధమైన  సాకారం లేదని వాదిస్తున్నాడు.హిందువుల వేదంలో అది ఉంది ఇది లేదు అని చెప్పే ఇతనికి అసలు తమ గ్రంధంలో ఏమి ఉందో తెలుసునా?

ఖురాన్ ప్రకారం అల్లాహ్ లక్షణాలు:
అల్లాహ్ కు రూపం ఉంది. ఆయన ఏడు ఆకాశాల మీద అర్ష్ అనే సింహాసనంపై కూర్చుని ఉంటాడు. కాకపోతే ఈ ఇస్లాం ప్రచారకులు ఆయన రూపం మానవ నేత్రాలకి అందదు, తీర్పు దినం రోజు జన్నత్ (స్వర్గంలో) అందరూ అల్లాని చూడవచ్చు అంటారు. 
ఇక అల్లాహ్ చెప్పిన నియమాలు: 
1. అల్లాహ్ ని‌ మాత్రమే దైవంగా అంగీకరించాలి. అల్లాహ్ కు ఎలాంటి సాటి కల్పించ కూడదు. అది అత్యంత ఘోరమైన‌‌‌ పాపం.
2. నమాజ్ స్థాపించాలి (రోజుకి 5 సార్లు)
3. మొహమ్మద్ ని ఆయన ప్రవక్తగా అంగీకరించి సాక్ష్యమివ్వాలి.
4. జకాత్ (దానం) ఇవ్వాలి.
5. జీవితంలో ఒక్కసారైన హజ్ చేయాలి (ఆర్దిక స్థితిని బట్టి)
పై ఐదు ఆచరించిన వాడే ముస్లిం. వానికి మాత్రమే స్వర్గం. మిగతా అందరికీ శాశ్వత నరకం. వీటిలో పాప పుణ్యాల ప్రస్తావన లేదు. మోసం, హత్య, మానభంగం, యుద్ధం - ఎటువంటి పాపం చేసినా అల్లాహ్ వద్ద క్షమాపణ ఉంటుంది. కాని అల్లాహ్ కు సాటి కల్పిస్తే మాత్రం ఘోరమైన శాశ్వత నరకమే.

ఇలాంటి బోధలని దైవబోధలుగా ప్రచారం చేయటంతో ఇస్లాం దురాక్రమణదారులు ఎన్నో రాయటానికి కూడా సరిపోనన్ని దుర్మార్గాలని ఎలాంటి పాపభీతి లేకుండా పైగా దైవకార్యాలుగా చేశారు. (అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞలలో సమస్త భూమండలం‌ అంతా ఇస్లాం రాజ్యం స్థాపించాలని ఉంది). ఇదండీ ఖురాన్ చెపుతోన్న సత్యం,  ప్రతి హిందువు (ముఖ్యంగా అన్ని మతాలు సమానమనే వాళ్ళు) తెలుసుకోవలసిన ఖురాన్ గురించిన సత్యం.

వేదాల్లోనే అల్లాహ్ గురించి ఉంటే, అన్ని మతాల్లోకంటే ఇస్లాం మతం యంగెస్ట్ రెలిజియన్ అని ఎలా చెప్పుకుంటున్నారు? వేదాలు అపౌరుషేయం సనాతనం అని నమ్ముతారా, లేదా? వేదాల్లోనే అల్లాహ్ గురించి ఉందని చెప్పటం ద్వారా వేదాలు గొప్పవని, అవి ప్రామాణికమని నమ్ముతున్నట్టే కదా! ఒక అల్పమైన వస్తువుని మరొక ఉత్కృష్టమైనదానితో పోల్చినప్పుడే ఆ అల్పమైన వస్తువు విలువ పెరుగుతుంది, గుర్తింపొస్తుందని భావించినప్పుడే ఇలాంటివి జరుగుతాయి.

"మాది తళతళలాడే నిగనిగల నూతన మతం - పాత మతాల చెడులు లేని సరి కొత్త మతం!" అని ఒకచోట "అబ్బే!మాది కేవలం నిన్న గాక మొన్న పుట్టిన మతం కాదు - మొదటి నుంచీ ఉన్నదే, బయట పడడానికి ఇంత సమయం పట్టింది." అని ఒకచోట చెప్పుకుంటారు. సరుకుల్ని అమ్ముకునే వ్యాపారస్తుల మాదిరి ఎక్కడ ఏ ముక్కలు లాభం అనుకుంటే వాటిని విసుర్తారు, గొర్రిలు వింటారు, మతంలో చేరుతారు, దశమభాగాలూ జకాత్తులూ జిజియాలూ పెరుగుతాయి!వీళ్ళు భక్తులు కోరిన కోరికలు నెరవేరాక సంతోషం కొద్దీ ఇచ్చే కానుకలని తీసుకోవడమే తప్ప వీళ్ళలా మెడమీద కత్తిపెట్టి వసూలు  చెయ్యని మన ఆలయాల మీద పడి యేడుస్తారు - సిగ్గు లేని మంద.

ఎడారి మతాలు అన్ని ఒకేచోట పుట్టాయి - వీటినే అబ్రహమీక్ మతాలు అంటారు. ముందుగా యూదు(జుడాయిజం) మతం పుట్టింది. దానితో విభేదించి క్రిస్టియానిటీ ఏర్పడింది. దానితో విభేదించి ఇస్లాం పుట్టింది , యూదులకు శనివారం, క్రిస్టియన్స్ కి ఆదివారం, ముస్లింలకు శుక్రవారం పవిత్ర దినాలు. యూదుమతం, క్రిస్టియానిటి దాదాపుగా ఒకటిగా వుంటాయి, వాళ్ళ దేవుళ్ళు వేరే - అంతే, ఇస్లాం మొత్తం వీళ్ళకి opposite.

ఎడారిలో వాళ్ళకి పంటలు పండవు కదా! వాళ్ళు కనిపించే జంతువులను, పక్షులను తింటారు. వాళ్ళ గ్రంధాల్లో తినమని రాశారు కూడా. వాళ్ళు ప్రకృతిని ప్రేమించరు. జంతువులను, పక్షులను ప్రేమించరు. కేవలం వాళ్ళ మతం వాళ్ళని మాత్రమే ప్రేమిస్తారు.  ప్రకృతినే ప్రేమించని ఎడారి మంద పక్కవాణ్ణి ప్రేమిస్తారా?

హిందూమతద్వేషులు ఇంత బరితెగించి దాడి చేస్తున్నప్పుడు కూడా హిందువులు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే, ఇంకో 5 సంవత్సరాలలో కమ్మునిస్ట్లు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ హిందువుల మీద దాడికి దిగుతారు,హిందూ దేవాలయాలని ధ్వంసం చేయడం ఖాయం - ఒకప్పటి చరిత్ర మళ్ళీ పునరావృతం కాబోతున్నది!హిందువులు శాంతిసత్యాహింసల్ని ప్రేమిస్తూ జపతపాలతో సమస్త కార్యాలు నెరవేరుతాయని భావిస్తూ ఉంటే సర్వనాశనం తప్పదు.

ఐకమత్యం గురించి కంగారు పడకండి.ఐకమత్యం లేదని అస్సలు అనుకోవద్దు!అది మీడియా చేస్తున్న గోబెల్సు తరహా ప్రచారం.ఎవరయితే బ్రాహ్మణవాదం వల్లనే తమ కులాలకి అన్యాయం జరిగిందని మీడియాలో  గత్తర చేస్తున్నారో వాళ్ళ కులాల్లోనే వాళ్ళ బంధువుల్లోనే వాళ్ళతో విభేదించి వాళ్ళని అసహ్యించుకుని "నేను హిందువుని! నా మతం గొప్పది!" అని భావించేవాళ్ళూ ఉన్నారనేది హిందూమతద్వేషుల కొమ్ము కాస్తున్న మీడియా సృష్టించే భ్రమలనుంచి బయటపడి చూస్తే ప్రతి ఒక్కరికీ కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ కనిపించే అక్షర సత్యం!ఏది సత్యమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!ఏది సుందరమైనదో అదే శివమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

Saturday 26 January 2019

ఈసారి ఆంధ్రలో ముఖ్యమంత్రి పీఠం చేతులు మారడం ఖాయమా!పరిస్థితులు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి అనుకూలంగా ఉన్నాయా?

నేను ఇంతవరకు రాజ శేఖర రెడ్డి - జగన్ మోహన్ రెడ్డి ద్వయం గురించి ప్రస్తావించలేదు! కారణం శత్రుత్వమో నిర్లక్ష్యమో కాదు,ఆ అవసరం రాలేదు. ఒకసారి చెప్పాను కదా, ఏ పోష్టునీ ఇతరుల ముచ్చట కోసమో సంచలనంతో హిట్లు పెంచుకోవడానికో రాయనని - విషయం మొదట నాకు కుతూహలం పుట్టించాలి, దానితో పరిశోధన చేస్తాను, నాకు క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని ఇతరులతో పంచుకుంటాను.అనేకమైన విషయాల గురించి రాస్తున్నప్పటికీ Political Analysis ఎక్కువమందిని ఆకర్షిస్తున్నది.మంచి Political Analyst నిష్పక్షపాతంగానే ఉండాలనేది నాకు తెలుసు, అదే సమయంలో నిష్పక్షపాతంగా ఉండటం అంటే స్వంత అభిప్రాయం చెప్పకుండా గోడమీదపిల్లివాటం కబుర్లు చెప్పడం కాదని మీరు కూడా తెలుసుకోవాలి.

ఎన్నికల తేదీలు ప్రకటించేశారు - ఏప్రిల్ ఫూల్సు ఎవరో మే నెలలో బయటపడుతుంది!ఫిబ్రవరి నెల మొత్తం నేతలకి తిరుమలై మొక్కుల విజిట్లతోనూ ప్రజలకి ప్రచార వరదలై ఇక్కట్లతోనూ గడుస్తుంది, మే నెలలో మేకపోతు గాంభీర్యాలన్నీ వదిలిపోయి గెల్చిన పార్టీ సంబరాలతో గడుస్తుంది, జులై నెల ఓడిపోయిన పార్టీల వలవలై అయిపోతుంది!CBN,JGN అనే ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయినా లండన్ బ్యాంకర్ల కీలుబొమ్మలే కాబట్టి ఎప్పుడూ ప్రజలు అసలైన ఫూల్సే!అయితే ఎంత ఏడుపులోనన్నా కుసింత వినోదం కావాలి, ఏడుపు నుంచి తెప్పరిల్లి కాలు కదల్చాలి కదా, ఒక పెద్ద అపజయం నుంచి పుట్టే నిరాశని పోగొట్టుకోవాలంటే చిన్న చిన్న విజయాలతో హుషారు తెచ్చుకోవాలి కదా - ఈ అయిదేళ్ళ కొకసారి జరిగే ఎన్నికల ప్రక్రియతో జత కలిపిన Pafliamentary Democracy కూడా లండను బ్యాంకర్ల చలవే!

దీని ఉద్దేశం కూడా ప్రజలకి తమ అనుమతి తోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయనే సంతృప్తినీ తమచేత ఎన్నుకోబడినవారు తమకి ద్రోహం చెయ్యరనే నమ్మకాన్నీ కలిగిస్తూ కాలం వెళ్ళబుచ్చడమే తప్ప ప్రజలు అనుకున్నంత ప్రయోజనం ఈ ఎన్నికల ప్రక్రియ వల్ల కలగడం లేదు. నిజమైన ప్రజాసేవకులకు ఈ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగానూ ఉపయోగపడకపోవటం అటుంచి ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా అధికారం చేపట్టినవారు నిజమైన ప్రజాసేవకులకు అడ్డంకులను కలిగించడం కూడా మనం చూస్తూనే ఉన్నాము కదా!నిండు మనస్సుతో ప్రజలకి నిజాలు చెప్పి మెప్పించి అధికారం చేపట్టటానికి ఇంత ఆర్భాటం, ఇంత వైభవం, ఇంత ఉత్కంఠ, ఇంత వాక్పారుష్య భాషా కాలుష్యం అవసరం లేదు.అయినా సరే ఇవన్నీ తప్పనిసరి కావటాన్నీ ఎన్నికల ఖర్చులు పెరిగిపోతూ ఉండటాన్నీ గమనించితే చాలు అసలు విషయం అర్ధం అవుతుంది.

విషయానికి వస్తే జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీకి శృంగభంగం తప్పదని అందరూ అనుకుంటున్నారు.నేను చాలా కాలం క్రితమే రాహుల్ గాంధీ మీద జోకులు వెయ్యడాన్ని తగ్గించి "ఎదుగుతున్నాడు!ఎదుగుతున్నాడు!రాహుల్ మేధావి అవుతున్నాడు!" అని బిల్డప్ ఇస్తున్నప్పుడే అనుమానించాను.తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంలో తప్పించుకుని తప్పించుకుని ఆఖరికి తల బాదుకుంటూ చేసిన అభినయంతో వెగటు పుట్టించి రాహుల్ గాంధీ కన్నుకొట్టిన దృశ్యానికి లైక్స్ రప్పించడంతో మీడియా ముందస్తు వాతావరణాన్ని సృష్టిస్తున్నదని తేలిపోయింది. సరిగ్గా పెద్ద నోట్ల రద్దు నుంచే మీడియా శత్రుత్వం ఎందుకు ప్రకటించిందో తెలియదు గానీ అప్పుడు సమర్ధించినవాళ్ళు కూడా దాని వల్ల వచ్చిన వ్యతిరేకతని తగ్గిస్తుందని ఆశించి ప్రకటించిన GST నుంచి శత్రువుల కింద మారిపోయారు - ఇది యేమి చిత్రమో!Economic Times వంటి కొన్ని పత్రికలు GSTని పొగుడుతున్నప్పటికీ అవి ఎంతమంది చదువుతున్నారు?

వైకాపా జగనూ జన్సేనా పవనూ ప్రత్యేకహోదా తెచ్చుకోలేని అసమర్ధుడని బాబుని రెచ్చగొట్టి తెదెపా భాజపా మిత్రత్వాన్ని చెడగొట్టేసిన మొదట్లో తెదెపాకి ప్రతికూలత అనుకున్నది కాస్తా ఇప్పుడు అనుకూలత అయ్యింది!దూరమైన కొత్తల్లో తప్పనిసరై పొమ్మనకుండా పొగ పెట్టించుకుని వచ్చినందుకు బిక్కమొగం వేసిన చంద్రబాబు ఇప్పుడు ఒక జాతీయ స్థాయి పార్టీకి మిత్రపక్షం అనే ఇల్లరికపు మజాని అనుభవిస్తూ చూరు పట్టుకుని వేళ్ళాడకుండా తెగదెంపులు చేసుకుని వచ్చేసినందుకు "అంతా మన మంచికే, అధికారం ఇక మనకే - ఇక మనకే!" అని సంబరపడుతూ ఉండి ఉండాలి.

జగన్ దురదృష్టం ఏమిటో గానీ అతను ఎంత పోరాటతత్వంతో విజృంభించి ఎంత నిశితమైన బుద్ధితో ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ గురి తప్పదని అనుకుని పన్నిన వ్యూహం సైతం అతనికే నష్టాన్ని కలిగిస్తున్నది కానీ శత్రువుని దెబ్బ తియ్యలేకపోతున్నది - బాబుని భాజపా నుంచి దూరం చేసి తను భాజపా సాయంతో అధికారంలోకి రావాలని వేసిన మాస్టర్ ప్లాన్ మొదటి దశ పూర్తయిందని సంతోషించడానికి ఆస్కారం లేకుండా రెండో దశ ఇట్లా తయారయ్యింది!

అదృష్ట దురదృష్టాలతో సంబంధం లేకుండా మొదటి సన్నివేశం నుంచీ వేస్తున్న తప్పటడుగులు జగన్ యొక్క అసలైన ప్రత్యర్ధులు!తండ్రిని ప్రశంసించుకుంటూ అనుకరిస్తూ తండ్రికి తగ్గ తనయుడనే పేరుకోసం వువ్విళ్ళూరుతున్న జగన్ అసలు తన మీదకి కేసులు ఎందుకు వచ్చాయో అర్ధం చేసుకోవడం లేదు!మొత్తం భారతదేశపు రాజకీయ రంగం మీద ఇప్పటివరకు మనం చూసిన రాజకీయ నాయకులలో అత్యంత సమర్ధుడైన వ్యక్తి ఒక్క రాజశేఖర రెడ్డి మాత్రమే!ఒక జాతీయ స్థాయి పార్టీలో స్థానిక నేత ఒక స్థాయిని దాటి పెరిగితే కేంద్ర నాయకత్వాన్ని ధిక్కరించే అవకాశం ఉంది, ఇటీవల భాజపాలోనూ ఇది మనం చూశాం కదా!ఆ తిరుగుబాట్లని అడ్డుకోవడానికే ఆ పార్టీలు రాష్ట్ర స్థాయి నాయకుల్ని స్వంత ప్రాభవం పెంచుకునే దిశలో ప్రోత్సహించరు - అసమ్మతి నేతలకు అధిష్ఠానమే ఆశలు కల్పించి ఎగదోస్రుంది, నిజమైన ప్రజాసేవకులకి ఈ వ్యవస్థ ఉపయోగపడదని నేను అన్నది అందుకే!కానీ రాజశేఖర రెడ్డి మాత్రం మొదటి దశలో నిత్య అసమ్మతివాది పాత్రలో ఒదిగిపోయి అధిష్ఠానానికి ఉపయోగపడి తను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అసమ్మతి లేకుండా జాగ్రత్తలు తీసుకుని అధిష్ఠానం మీద పెత్తనం చేసిన ఒకే ఒక మగాడు!అతని ధాటికే బిక్క చచ్చిపోయి ఉంటే ఇతన్ని కూడా మోస్తారని ఎట్లా అనుకున్నాడు జగన్?అందుకే, మళ్ళీ ఆ పదవి కోసం పోటీ పడనివ్వనంత బలమైన దెబ్బ కొట్టారు - అవి తప్పుడు కేసులని జగన్ వర్గం వాదిస్తూ ఉండవచ్చును గానీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని వాటినుంచి బైట పడకుండా జగన్ ముఖ్యమంత్రి కాలేడు!

జగన్ బుర్రలో తండ్రి తెలివి ఉండి ఉంటే తండ్రికి ఆప్తుడైన ఒక పెద్దమనిషిని తనే ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించి కొంతకాలం పాటు అణకువగా ఉండి తండ్రిలాగే మతకలహాలు సృష్టిస్తూ మిగిలినవాళ్ళని అసమర్ధులని చేసి అదును చూసుకుని పైకి వచ్చేవాడు - ఆనాటినుంచీ ఈనాటివరకూ అన్నీ తప్పటడుగులే తప్ప ఒక్క మెప్పుటడుగు వెయ్యలేని నిత్య అపరిణిత మనస్కుడు ముఖ్యమంత్రి కావడం అసంభవం!

అపర చాణక్యుడనీ The Greatest Manipulator of Indian Politics అనీ అనుకుంటున్న చంద్రబాబు కూడా కొన్నిసార్లు తడబాటు పడుతున్నాడు, కానీ జగన్ వాటిని పసిగట్టలేక పోవటం చేత చంద్రబాబుని ఇబ్బంది పెట్టి పైచేయి సాధించే ఎన్నో సువర్ణావకాశాల్ని వదిలేసుకున్నాడు - నాకయితే అలాంటప్పుడల్లా జగన్ మీద జాలితో ప్రాణం ఉసూరు మనిపించేది!

2014 ఎన్నికల్లో తను సాధించలేమని చెప్పిన ఋణమాఫీ విషయంలో చంద్రబాబు వైఫల్యం కళ్ళ ముందు కనబడుతుంటే ఎందుకు ఉపయోగించుకోలేకపోయాడో నాకిప్పటికీ అర్ధం కాదు. అమరావతి కోసం రైతుల నుంచి చంద్రబాబు భూమిని తీసుకున్న పద్ధతిని మొదట్లోనే వ్యతిరేకించి కట్టడి చేసి ఉండాల్సింది!ఎందుకంటే, ప్రభుత్వం ప్రజల నుంచి భూమిని తీసుకోవడానికి ఒక చట్టం ఉన్నప్పుడు దానిని ప్రభుత్వమే పాటించకపోతే ఎట్లా?అప్పుడు వూరుకుని రైతులు భూముల్ని ఇవ్వడం పూర్తయ్యాక "నేను అధికారంలోకి వస్తే మీ భూముల్ని మీకు ఇచ్చేస్తాను!" అనడం ఎంత పిచ్చితనం?వూరికే ఇచ్చారా రైతులు భూముల్ని - చంద్రబాబు చూపించిన ప్రయోజనాలకి ఆశపడి ఇచ్చారు!నువ్వు అధికారంలోకి వచ్చాక భూముల్ని తిరిగి ఇచ్చెయ్యడం అంటే వాళ్ళకి చంద్రబాబు ఇస్తానన్న ప్రయోజనాల్ని వెనక్కి తీసుకోవడం అని అర్ధం కాదా?జనం ఇచ్చేవాడికి వోటు వేస్తారా, లాక్కునే వాడికి వోటు వేస్తారా!

గొంగళిలో కూర్చుని వెంట్రుకలు ఏరుకోవడం దేనికన్నట్టు జనం "లక్ష కోట్ల అవినీతి!","అనువంశిక కుటుంబపాలన!","ప్రజాస్వామ్యబద్ధమైన నియంతృత్వం!" అనే మూస పదాల్ని పట్టించుకోవటం మానేసి చాలా కాలమైంది.భారతదేశంలో గత కొన్ని యేళ్ల నుంచి ప్రజలు, అనగా వోటర్లు మ్యానిఫెస్టోలనీ తాయిలానీ వాగ్దానాలనీ పట్టించుకోవటం లేదు, ముఖ్యమంత్రి స్థానంలో గానీ ప్రధానమంత్రి స్థానంలో గానీ అప్పుడు వున్న సమస్యలని పరిష్కరించి తమకు భద్రతని ప్రసాదించి తమని అభివృద్ధి పధంలోకి నడిపించగలడని నమ్మకం కలిగించే వ్యక్తి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వోటు వేస్తున్నారు, ఆ అవకాశం లేనప్పుడే ఇతరమైన అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు!

మొదటిసారి అధికారం కోసం పోటీ పడుతున్నవాడు అంతకు ముందు అధికారంలో ఉన్నవాడి కంటే తను సమర్ధుణ్ణని చెప్పుకోవాల్సి ఉంటుంది, అది చాలా కష్టమైన వ్యవహారం!కేసీయారుకి తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం ఆ అవకాశాన్ని ఇచ్చింది.ఆ వెసులుబాటు జగనుకి లేదే! అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి స్థానానికే న్యాయం చెయ్యలేనివాడు ముఖ్యమంత్రి పదవికి యెట్లా న్యాయం చేస్తాడు?

ఒకసారి అధికారంలోకి వచ్చాక అతని పెర్ఫార్మెన్సుని చూస్తారు - కేసీయార్ ఓడిపోతే బాగుండునని కోరుకున్నానే తప్ప వోడిపోతాడని చెప్ప్పటానికి నేను ధైర్యం చెయ్యనిది ఎందుకు?కేసీయార్ తెలంగాణని ఒక్కసారి శిఖరాగ్రం చేర్చలేదు గానీ తెలంగాణ అభివృద్ధి పధంలోకి నడుస్తున్నదనే గ్యారెంటీ ఇచ్చాడు కాబట్టి ప్రజలు అతన్ని గెలిపించారు, అదే అనుకూలత చంద్రబాబుకీ ఉంది - అందుకే "తెలంగాణలో కేసీయార్ గెలిచినప్పుదు ఆంధ్రలో నేనెందుకు వోడిపోతాను!" అని ధీమాని చూపించాడు.

ఋణమాఫీ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో చంద్రబాబు పనితీరు ప్రజలు "ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతనికి మళ్ళీ అధికారం కట్టబెట్టకూడదు!" అని భావించేటంత దయనీయంగా లేదు.అధికారంలో ఉన్నది సాక్షాత్తూ శ్రీరామచంద్రుదే అయినా సరే ప్రతిపక్షం విమర్శించాల్సిందే,అతను చెయ్యాలనుకుంటున్న మంచిపనులకి అడ్డు తగలటం కూడా సరైనదే - అతన్ని మంచిపనులు చెయ్యనిస్తూ పొగుడుతూ ధర్మరాజులా ఉంటే అయిదేళ్ళ తర్వాత తమకి అధికారం దక్కదు కదా!అయితే, జగన్ నాయకత్వంలోని వైకాపా, మోదీ నాయకత్వంలోని భాజపా, పవన్ నాయకత్వంలోని జన్సేనా దీన్ని సమర్ధవంతంగా చెయ్యలేకపోయాయి. అది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, ప్రతిరోజూ టీవీల్లో వార్తల్ని చూసేవాళ్ళకీ వార్తాపత్రికల్ని చదివేవాళ్ళకీ తెలిసిన విషయమే!

ఇన్నేళ్ళ పాటు విడివిడిగా ఫెయిలైనవాళ్ళు ఎన్నికల ముందు గబుక్కున కల్సిపోగానే భూమ్యాకాశాలు దద్దరిల్లిపోవు - రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో భాగస్వాములైన పొరుగురాష్ట్రం వాళ్ళతో కలిసినందువల్ల కీడు తప్ప మేలు రాదు. జగన్ పోరాటపటిమ చాలా గొప్పది. ఇన్ని ఎదురుదెబ్బల్ని తట్టుకుని నిలబడగలగటమే గొప్ప - వివేకానందుడు ప్రశంసించిన Milton విరచిత Paradise Lost కావ్యంలోని ప్రతినాయకుడైన saitan పాత్రకు దీటైన పోరాటపటిమను ప్రదర్శిస్తున్న జగన్ ఆ ఒక్క విషయంలో మాత్రం నాకు కూడా ముచ్చట గొలుపుతున్నాడు, కానీ ఈసారి కూడా అతనికి ముఖ్యమంత్రిత్వం దక్కే అవకాశం లేదు - NTBL!


(Next Time Better Luck)!

Wednesday 16 January 2019

అసలు మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తెదెపా పోటీ చెయ్యడాన్నే సహించలేక "పొరుగు రాష్ట్రం వాడికి ఇక్కడ పనేమిటి?" అని చంద్రబాబుని ప్రశ్నించిన వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రలో రాజకీయం చేద్దామనుకుంటున్నారు?

మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కేసీయార్ గెలవటమే ఒక అద్భుతం - తెలంగాణ ప్రజా సమూహం మధ్యలోకి వెళ్ళి పరీశీలించిన వారితో సహా ప్రతి ఒక్కరూ ఈసారి ఫలితం కేసీయారుకి వ్యతిరేకం కావచ్చుననే చెప్పారు.అట్లాంటిది, అదృష్టం కొద్దీ వచ్చిన గెలుపే అవుతుంది కదా!

కానీ, అహంభావి కేసీయార్ అది తెలుసుకుని వినయం చూపించకుండా సహజ ధోరణిలో వాళ్ళనీ వీళ్ళనీ నోటికొచ్చినట్టు తిట్టేసి స్వయంతృప్తిని పొందాడు!అసలు ఆ ఎన్నికల్లో తెదెపా పోటీ చెయ్యడాన్నే సహించలేక "పొరుగు రాష్ట్రం వాడికి ఇక్కడ పనేమిటి?" అని చంద్రబాబుని ప్రశ్నించిన వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రలో  రాజకీయం చేద్దామనుకుంటున్నారు?

విభజన హామీల్ని కేంద్రం నుచి రప్పించలేకపోయిందని అధికార పక్షాన్ని విమర్శిస్తున్న జగన్ పార్టీ నేతలకి విభజన బిల్లు పూర్తి రూపంలో ఆమలు జరగనివ్వకుండా అడ్డుకుంటూ ఆంధ్రాకి రావలసిన నిధుల్ని తెరాసా తొక్కిపట్టేస్తున్నదని తెలియదా?

ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పత్రికా ప్రకటనల ద్వారా విజ్ఞప్తులు చేసినా వాటికి మర్యాదా పూర్వకమైన జవాబు కూడా ఇవ్వలేదే తెలంగాణ ముఖ్యమంత్రి!ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న తను తెరాసాతో జరిగే చర్చల్లో వాటికి సంబంధించిన హామీల్ని పొందగలడా ఆ పార్టీ అధ్యక్షుడు?సాక్షాత్తూ ఇప్పుడు తెరాస తరపున చర్చల్లో పాలు పంచుకుంటున్న కేటీయార్ ఆంధ్రకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణకి అన్యాయం అని అన్నాడే,అటువంటివాడితో స్నేహం చేస్తూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎట్లా తీసుకురాగలడు జగన్?

ఒకనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి అయ్యే సందర్భంలో తను ప్రమాణం చేసినప్పుడు ఈ రాష్ట్రప్రజలు తనవాళ్ళని భావించిన కేసీయార్ ఇవ్వాళ విభజన బిల్లుని పూర్తి రూపంలో అమలులోకి రానివ్వకుండా తొక్కేసి అన్యాయం చేస్తున్నది ఎవరికి?

ఒకప్పుడు తను పరిపాలించి ఇప్పుడు పొరుగురాష్ట్రంలో ఉన్న ప్రజలకే న్యాయం చెయ్యలేని వాడు, పైన పనిగట్టుకుని అన్యాయం చేస్తున్న ప్రజాద్రోహి మొత్తం భారత దేశ ప్రజలకి న్యాయం చేస్తానని ఏ ముఖం పెట్టుకుని చెబుతున్నాడు - అతను చేస్తాడని ప్రజలు ఎలానమ్మాలి?

అధికారం కోసం ఎంత నీచానికి పాల్పడటానికైనా తెగించే జగన్ వంటి రాజకీయ నాయకులు వీటిని పట్టించుకోకపోవచ్చు, ప్రజలు పట్టించుకుంటారు - పట్టించుకోవాలి!

ఈ దేశంలో జరిగిన, జరుగుతున్న అన్ని రాజకీయపరమైన సంచలనాలకీ లండన్ బ్యాంకర్ల నుంచి వస్తున్న సంకేతాలే కారణం అని నాకు చాలా కాలం నుంచే అనుమానంగా ఉండేది.ఈ మధ్యన చేసిన పరిశోధనతో అది వాస్తవం అని తెలిసింది.

ఇప్పుడు నా అనుమానం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ విభజన ఉద్యమం మొత్తం చంద్రబాబు ద్వేషంతో పెరిగింది,తన పాటికి తను అందరిలానే విభజనకి అనుకూలం అని లెటర్లు ఇచ్చినా సరే అతన్నే బూచిగా చూపించి హడావిడి చేశారు,విభజన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ అనేది  ఉంటుందని కూడా వాళ్ళు అనుకోలేదు, కొన్ని విషయాల్లో కొంత లోతుకు వెళ్ళి చూస్తే అసలు ఉండనివ్వకూడదనే ధృఢనిశ్చయంతోనే రాష్ట్ర విభజన ఇంత నికృష్టంగా జరిగినట్టు తెలుస్తుంది - మాతృరాష్ట్రం అని అనాటానికి కూడా నోరు రాక అవశేషం అని అవమానించారు!

NTR మీద అతను తిరగబడిన నాడు జరిగినవి కూడా ఇప్పుడు తవ్వుతున్నారు - ఆఖరికి నాదెండ్ల కూడా నోరు విప్పాడు, ఏమిటి కారణం?ఒకటి మాత్రం నిజం! పరిపాలనా దక్షతలో నందమూరి తారక రామారావు కన్న నారా చంద్రబాబు నాయుడు పదిరెట్లు మెరుగు. రామారావుకి తను సినిమాల్లో కష్టపడినట్టు అందరూ కష్టపడి పనిచేస్తే చాలు రాష్ట్రం దానంతటదే అభివృద్ధిలోకి వస్తుందనే మూఢనమ్మకం ఉండేది.కానీ, చంద్రబాబు మొత్తం రాష్ట్రాన్ని ముందుకు నడిపించటానికి అవసరమైన infrastucture ఏర్పాటు చెయ్యటంలో అఖండుడు!

బహుశా, చంద్రబాబు Deelopment Based Administration వల్ల ప్రజలు IMF పట్టునుంచి బయటపదే అవకాశం ఉందటం వల్లనే మోదీ, కేసీయార్, జగన్ కలిసి చంద్రబాబు మీద దాడి చేస్తున్నారా?ఆంధ్ర ప్రజలు కొంచెం తెలివితేటలు చూపించాలి - అడిగి తీరాల్సిన ప్రశ్నలలో ఒక్కదాన్ని కూడా వదలకుండా అడిగి తీరాలి.

ఇప్పుడు చంద్రబాబుని ఓడించటానికి ఉరకలు వేస్తున్నవాళ్ళలో ఏ ఒక్కడూ ఈ నాలుగేళ్ళ కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం గురించి ఒక్క న్యాయమైన ఆలోచన కూడా చెయ్యలేదన్నది మాత్రం మర్చిపోకండి!

లోటుతో వచ్చిన రాష్ట్రాన్ని చంద్రబాబు ఎక్కడికి తీసుకెళ్ళాడో మిగులుతో వచ్చిన రాష్ట్రాన్ని కేసీయార్ ఎక్కడికి తీసుకెళ్ళాడో ఆంధ్ర,తెలంగాణ లోని ప్రతి తెలుగువాడూ తెలుసుకోవాలి.ఎన్నికల్లో ఎవడు గెల్చాడు, ఎవడికి ఎన్ని వోట్లు వచ్చాయి అన్నది ముఖ్యం కాదు - గెలిచాక వ్యక్తి యొక్క స్వభావం ఏమిటి, అతని పరిపాలన ఎట్లా ఉన్నదనేది చూడాలి ఓటర్లు!

Thursday 10 January 2019

దేశం చాలా కిష్ట పరిస్తితుల్లో ఉందిప్పుడు - దేవుడా, రక్షించు నా దేశాన్ని!

మనకి నల్లజాతి వాళ్ళని తల్చుకోగానే అమెరికాలో వాళ్ళు పడుతున్న అగచాట్లు గుర్తుకొచ్చి దుఃఖం పొంగుకొస్తుంది,కానీ యూరోపులోని నల్లజాతివాళ్ళు రాజ్యాలేలుతూ వంశపారంపర్య రాజరికాన్ని అనుభవిస్తూ ఉండేవారు venitian Black Regality పేరుతో! అధికారం తమ కుటుంబాల వద్దనే ఆచంద్రతారార్కం నిలిచిఉండటం కోసం కొన్ని వందల యేళ్ళ క్రిందటి నుంచి అఖండమైన వ్యూహనిర్మాణ చాతుర్యంతో ఒక్కొక్క అడుగూ వేస్తూ వచ్చారు - ఈనాటికి లండను నగరం నుంచి illumimatti bankers పేరుతో మృత్యుబేహారుల కింద మార్పు చెంది ప్రపంచ దేశాలన్నిటినీ తమకు వూడిగం చేయించుకోగలుగుతున్నారు!Babylon, Mesopotamia పేర్లు వినగానే మనకి కధావశిష్టమై అంతరించిపోయిన మహోన్నతమైన నాగరికత గుర్తుకొచ్చి మళ్ళీ దుఃఖం పొంగుకొస్తుంది, కానీ మొదట venitian Black Regalityని ఏర్పాటు చేసుకుని తర్వాత Illuminati Bankers రూపంలోకి మారినది వారే!మనకి Aristotle అనగానే అలెగ్జాండరు వంటి  గొప్ప శిష్యుడికి గురువైన తత్త్వవేత్త గుర్తుకొచ్చి చాలా గౌరవభావం కలుగుతుంది, కానీ "certain families are born to rule as an arbitrary elite, while the vast majority of any given population is condemned to oppression, serfdom, or slavery" అనే కులీనవాదపు దురహంకార పూరితమైన సిద్ధాంతానికి సృష్టికర్త అతడే!

1063 CE
Venetian Black Nobility అంతకుముందు ముస్లిముల జెహాదిక్ దాడుల వల్ల కోల్పోయిన ప్రాంతాలను పొందడానికి 1063 నుంచి 1123 సంవత్సరాల మధ్య చేసిన మొదటి మూడు క్రూసేడ్లు సంపదనీ అధికారాన్నీ ఇబ్బడి ముబ్బడి చేశాయి. ఈ oligarchic families క్రమేణ బలం పుంజుకుని 1204 నుంచి అసంఖ్యాక ప్రజానీకానికి శాంతిభద్రతలను ప్రసాదిస్తూ వారి సౌభాగ్యానికి బాటలు వేయాల్సిన ప్రభుత్వాన్ని తమకు మాత్రమే వైభవాలను దఖలు పర్చే జేబు సంస్థ కింద మార్చివేశాయి. అంతటితో ఆగక European Black Nobility  విశేష స్థాయిలో ధనసంపత్తిని సమకూర్చి విస్తృత స్థాయిలో రాజకీయ మద్దతును కూడగట్టి రహస్య సంఘాలను స్థాపించి వాటిని ఉపయోగించుకుని పధకం ప్రకారం కరువులు, వరదలు, తుఫాన్లు, రోగాలు, తిరుగుబాట్లు, యుద్ధాలు వంటివాటిని సృష్టించి ఎంత ఎక్కువ మంది మనుషుల్ని చంపగలిగితే అంత ఎక్కువ స్థాయిలో లాభాల్ని పిండుకోవటం మొదలుపెట్టాయి.

పూర్వ క్రైస్తవీయ కాలంలోని Mediterranean ప్రాంతపు oligarchical political forcesలో Mesopotamiaకి చెందిన Babylon కూడా ఒకటి! The Hiram of Tyre, the Phoenicians, The Persian Empire కూడా ఇలాంటివే.  “whore of Babylon” అని St. John the Divine విమర్శించినది ఎవరినో కాదు, ఈ oligarchical familiesనే అలా తిట్టాడు.  ఇంక గ్రీకో రోమన్ ప్రపంచం మొత్తానికి Delphi నగరంలోని Temple of Apollo ఆర్ధికపరమైన లావాదేవీలకీ సైనికపరమైన గూడుపుఠాణీలకీ కేంద్రంగా ఉండేది - మొదటి రోజుల్లో Lycurgus వంటివాళ్ళు తర్వాతి రోజుల్లో Aristotle వంటివాళ్ళు అక్కడ ఏజెంట్లుగా పనిచేస్తూ ఉండేవాళ్ళు!

Venice నగరంలో చూస్తే Venetian state treasuryకి అనుబంధమై ఉండి పిల్లలు లేకుండా చచ్చిపోయిన Venice Noble Families యొక్క ఆస్తుల్ని పీల్చుకుంటూ పెరుగుతున్న Basilica of St. Mark అతి పెద్ద పునాది క్షేత్రం. ఇది St. Mark తరిఫీదును అందుకున్న సహాయకుల బృందం పర్యవేక్షణలో నడుస్తూ Venetian Economic Systemలోకల్లా అత్యంత ప్రధానమైన స్థానం ఆక్రమించింది.

The Mocenigo, the Cornaro, the Dandolo, the Contarini, the Morosini, the Zorzi, and the Tron వంటి గొప్ప గొప్ప కుటుంబాల సంపద మీద అజమాయిషీ ఇక్కడినుంచే జరుగుతూ ఉండేది. Venetian oligarchy తమ ఆస్తుల్ని ఉత్తర యూరపుకు తరలించాలని అనుకున్నప్పుడు పదిహేడవ శతాబ్దపు యూరపును ప్రభావితం చేసిన Bank of Amsterdam, పద్ధెనిమిదవ శతాబ్దపు యూరపును ప్రభావితం చేసిన Bank of England వంటివాటికి దీనినుంచే ఆస్తుల బదలాయింపు జరిగింది.

1082 నాటికి, Venetians తమ శక్తి సామర్ధ్యాల్ని ప్రదర్శించి Byzantine Empire నుంచి tax-free trading rightsని పట్టేశారు. ఆ తర్వాత Byzantine Dynastiesతో పెళ్ళి సంబంధాలు కలుపుకునీ Holy Roman Empireతో గొడవలు పెట్టుకునీ ఎదిగి ఎదిగి  Byzantine Empireకి రెండవ రాజధాని అయ్యింది Venice. Venetian Economy మొత్తం వడ్డీ వ్యాపారం,బానిసల వ్యాపారం మీద ఎదిగిందే!

Freemasonsకి ముందరి రూపమైన Knights Templar బృందమే ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థకి రూపు ఇచ్చి "bond market" అనే ఏర్పాటును కూడా ఒక భాగం చేసి మూర్ఖపు European Nobles మధ్య కలహాలను రగిల్చి వాళ్ళను యుద్ధాలకు పురి కొల్పి యుద్ధరుణాలు ఇచ్చి తమ బానిసల్ని చేసుకుని ఆడించటం మొదలుపెట్టారు. ఒకసారి Crusader Knights Templar ఆశపోతు తనం పెరిగిపోయి Jerusalem నగరంలో యూదు మతస్థులు ఇతరులు కూలగొట్టిన ప్రతిసారీ మళ్ళీ కట్టుకుంటూ వస్తున్న Solomon Temple మీద దాడి చేసి అక్కడ పెద్ద మొత్తంలో పోగైన బంగారపు నిల్వల్నీ ఎన్నెన్నో విలువైన పురాతన వస్తువుల్నీ కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారు - తాము House of Davidకి సంబంధంచినవారు కాబట్టి అది దొంగతనం కాదనీ వారి పూర్వీకుల ఆస్తిని స్వాధీనం చేసుకోవడమనీ సమర్ధించుకున్నారు.

వాస్తవ ప్రపంచంలో అద్భుత విజయాలను సాధించిన  చారిత్రక వ్యక్తులతో గాక దైవాంశ సంభూతులని మతసాహిత్యం వర్ణించిన కల్పిత పాత్రలతో తమకు వారసత్వాన్ని ఆపాదించుకున్న విపరీత ప్రవృత్తియే వారిని ప్రపంచాధిపత్యం కోసం అమానవీయమైన నీచ కార్యాలను చేయటానికి సైతం వెనుకాడని మనస్తత్వానికి అలవాటు చేసి ఉత్సాహవంతులను చేస్తున్నది!

ఈ oligarchical system యొక్క మనుగడలోని మూలస్తంభం ఏమిటో తెలుసా!ఒక కుటుంబం పరిపాలిస్తున్న ప్రాంతంలోని ఇతరులకి స్వంత ఆస్తియే కాదు,అసలు స్వంత అస్తిత్వమే ఉండదు - ఈనాటి మన అవగాహన ప్రకారం పాలితులు, ప్రజలు, పౌరులు వంటి పదాలు వర్తించని కట్టుబానిసత్వం తప్ప స్వేచ్చ ఒక శాతం కూడా ఉండదు. రాజ్యం యొక్క సంపద మొత్తం ఒకే ఓక్క కుటుంబానికి దఖలు పడుతుంది, వంశ పారంపర్యపు దానధర్మాది హక్కులతో సహా! ఈ వారసత్వంలో కూడా లైంగికపరమైన నిషేధాలతో కూడిన జైవిక పవిత్రత ఉండాల్సిన పని లేదు - దాదాపు అన్ని కులీన కుటుంబాల లోనూ వ్యభిచారం, అక్రమ సంబంధాలు, వావి వరసలను అతిక్రమించడం వంటివి సర్వ సాధారణమే, కుటుంబం యొక్క ఉమ్మడి ఆస్తి మాత్రం కుటుంబం యొక్క అజమాయిషీలో ఉంటే చాలు.

oligarchs ఈ వ్యవస్థ పుట్టిన తర్వాత గడిచిన 2,500 సంవత్సరాల నుంచి  "an elite identifying itself as a master race rules over a degraded mass of slaves or other oppressed victims" అని చెప్తున్న Aristotle యొక్క ఎప్పుడు తల్చుకుంటే అప్పుడు సాంస్కృతిక విభేదాలు,కులమత భేదాలు, ప్రాంతీయ తత్వాలు, భాషా ద్వేషాలు, ఆర్ధిక మాంద్యం, కరువు, రోగాలు, యుద్ధం, తీవ్రవాదం, విధ్వంసం వంటివాటిని సృష్టించి ప్రజల్ని భీతావహుల్ని చేసి చంపటానికి మాత్రమే పనికొచ్చే క్రూరమైన సిద్ధాంతాన్న్ని పాటిస్తున్నారే తప్ప దీనికి భిన్నమైన Plato యొక్క epistemology(theory f kbiwkedge) అనే సౌమ్యమైన పద్ధతిని చెత్త కింద తిరస్కరించి పారేస్తున్నారు!

Aristotle బానిసల వ్యవస్థ తప్పనిసరి అని వాదించాడు, కొందరు పుట్టుకతోనే పాలించడానికీ మరికొందరు పుట్టుకతోనే బానిసత్వానికీ విభజించబడ్డారు గనక. విద్యా జ్ఞానమూ తర్కమూ మేధస్సూ శాస్త్రీయతా వంటివి ఆ ఒక్క కుటుంబానికి తప్ప ఇతరులకి అనవసరం అనే పచ్చి నిజాన్ని కూడా నొక్కి చెప్పాడు. Aristotle అనే ఒక వడ్డీ వ్యాపారి తత్వవేత్త వేషం కట్టి ప్రవచించిన దళారీ సిద్ధాంతం మానవ సహజమైన సృజనాత్మకతని చంపేసి oligarchsకి తాము తప్ప ఇతరులు అసలు మనుషులే కాదని నమ్మి తమ బానిసల చేత నమ్మించే స్థాయిలో పొగరుని ఎక్కించింది!

1527 CE
సుమారు 500 సంవత్సరాల వెనక, Renaissance period అని చెప్పబడిన కాలంలో పుట్టిన Niccolo Machiavelli(3 May 1469 to 21 June 1527) అనే Italian diplomat, politician, historian, philosopher, humanist, writer, playwright మరియు poet చెప్పిన రాజనీతి శాస్త్రం పశ్చిమ దేశాల వారికి మహాసామ్రాజ్యాలను నిర్మించటానికి కావలసిన సాధన సంపత్తిని అందించింది. ఇతని సూత్రీకరణలు చాలా క్రూరంగా ఉంటాయి, అధికారం కోరుకున్నవాడు మానవ నిర్మితమైన మరియు దైవప్రచోదితమైన నీతి నియమాల్ని మర్చిపోవాలని చెప్పాడు; వాగ్దానాలు తమ ప్రయోజనాలను త్యాగం చేసి మనకి ప్రయోజనం చేకూర్చేలా ఇతర్లని మోసం చెయ్యటానికి మాత్రమే చెయ్యాలి, మన ప్రయోజనం కోసం ఎంత దుర్మార్గం చెయ్యటానికైనా సరే వెనుకాడ కూడదు, శత్రువులనే కాదు స్నేహితులను కూడా మన అవసరం గడిచేటంత వరకు నమ్మినట్టు నటించాలి తప్ప నిజమైన అభిమాన దురభిమానాల్ని ప్రదర్శించ కూడదు. కానీ, ఇలాంటి వ్యవహారాల్ని సామాన్య ప్రజలకి తెలియనివ్వకూడదు - శత్రువులను కానీ ప్రజలను కానీ భయపెట్టి మనపట్ల విధేయతని తెచ్చుకోవడం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని బహిరంగ పరచాలి!

ఇతన్ని మన చాణక్యుడితో పోలుస్తారు గానీ చాణక్యుడు ఇంత నీచత్వాన్ని బోధించలేదు.ఇతని సిద్ధాంతం ప్రభావం వల్ల కాబోలు 1512లో రాజు తన మీద కుట్ర పన్నుతున్నాడని అనుమానించి పదవి నుంచి పీకేసి మూడు వారాల పాటు కఠిన శిక్షకి గురి చేశాడు - తర్వాత నాటకాలు రాసుకుంటూ  చనిపోయే వరకు మళ్ళీ వెలుగు లోకి వద్దామని అవకాశం కోసం ఎదురు చూస్తూ కాలం గడిపాడు.

1694 CE
1684లో House of Orangeకి సంబంధించిన King William III ఇదివరకు the City of London చేత స్థాపించబడిన Bank of England అనే ప్రభుత్వ బ్యాంకును, అంటే England యొక్క ఆస్తిని ఒక international bankers బృందం చేతికి అప్పగించాడు. Vatican City వలెనే, the City of London కూడా సామాన్యులకు వర్తించే legal constraints బెడద లేని ఒక సొంత రాజ్యాంగం ఉన్న 100% స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. అక్కడ కొలువు దీరిన international bankersకి మన పురాణ కధలోని హిరణ్యకశిపుడు సాధించి, కొంతకాలం పాటు సాగించి స్తంభజుని విజృంభణతో అంతమైపోవడానికి కారణమైన త్రిలోకాధిపత్యం అనే లక్ష్యాన్ని పోలిన ప్రపంచ ప్రభుత్వం అనే ఆర్ధిక స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అవకాశం కల్పించడం కోసమే బ్రిటిష్ ప్రభువు ఈ ఏర్పాటు చేశాడు.

సామాన్యులకీ అజ్ఞానులకీ "The Crown" అనగానే రాజుగారో రాణిగారో గుర్తుకొస్తారు.అలాగే, "London" అని గానీ "The City" అని గానీ అంటే రాజు లేక రాణి యొక్క అధికారిక నివాసం గుర్తుకొస్తుంది.కానీ అది నిజం కాదు.సుమారు 610 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్న "Greater London" ప్రాంతం నడిబొడ్డున కుడివైపుకి జరిగినట్టు ఉండే 677 ఎకరాల స్థలాన్ని "London" అని గానీ "The City" అని గానీ పిలుస్తారు. ఇక "Crown" అని ఈ సర్వ స్వతంత్ర మహా సామ్రాజ్యాన్ని పరిపాలించే పన్నెండు లేక పద్గ్నాలుగు మంది సభ్యులు కలిగిన ఒక కమిటీని పిలుస్తారు - ఇలా ఏర్పడిన The Cityని the wealthiest square mile on earth అని కూడా పిలుస్తారు, దీని మీద సర్వాధికారాలు Lord Mayorకు మాత్రమే  ఉంటాయి!

1744 CE
మొదటి తరం హిరణ్యకశిపుడు dynasty founder Mayer Amshel Rothschild (1744-1812) పుట్టాడు! వీళ్ళ కుటుంబం యొక్క చరిత్ర 1577 నాటి Izaak Elchanan Rothschild అనే అతని కాలం నుంచీ ప్రముఖమైనదే!Rothschild అనే ఇంటి పేరు zum rothen Schild (with the old spelling "th") అనే జర్మన్ పదం నుంచి వచ్చింది - "with the red shield" అని అర్ధం.అప్పటి సంప్రదాయం ప్రకారం ఇళ్ళని డోర్ నంబర్ చూసి కాక అక్కడ చెక్కిన రంగు రంగుల డిజైన్లని బట్టి గుర్తు పట్టేవారు.Rothschild అంటే Yiddish భాషలో "Red Coat" అని అర్ధం.అతని మనమల తరమైన 1664లో ఇల్లు మారుతున్నప్పుడు వాళ్ళు దీన్నే ఇంటి పేరు కింద ఖాయం చేసుకున్నారు - అప్పుడు మారిన కొత్త ఇల్లే ఎన్నెన్నో వ్యాపార వ్యూహాలతో చరిత్రను  తమ ఇష్టం వచ్చినట్టు నడిపించగలిగిన కొన్ని తరాల మృత్యు బేహారుల శరీరాలకి రక్షణ కల్పించింది, కల్పిస్తున్నది, కల్పిస్తుంది!

Amschel తండ్రికి goods-trading, currency exchange వ్యాపారాలు ఉండేవి. Prince of Hesseకి అతను వ్యక్తిగత నాణేల సప్లైదారుడు.దగ్గరి బంధువుల సహాయంతో Amshel Rothschild అప్పటికే బ్యాంకింగ్ రంగంలో పేరున్న Hanover లోని Simon Wolf Oppenheimer Banking Firmకి వ్యవస్థాపకుడైన Samuel Oppenheimer మనుమడు Jacob Wolf Oppenheimer దగ్గిర apprenticeship మొదలు పెట్టాడు. 1757 నుంచి Jacob శిక్షణలో foreign trade, currency exchange వంటి కీలకమైన విషయాలలో మంచి అవగాహన కలిగించుకుని 1763లో అన్నకి సహాయం చెయ్యటానికి Frankfurt నగరానికి వచ్చాడు. నాణేల వ్యాపారం మొదలుపెట్టి తండ్రిని ప్రోత్సహించిన Wilhelm of Hesse ప్రాపకం  సంపాదించాడు - త్వరలోనే రాజైన Wilhelm IXకి నమ్మకస్తుడైన బ్యాంకరు కావడంతో ఎదుగుదల మరింత వేగం పుంజుకుంది! సమయానికి వచ్చి పడిన French Revolution హడావిడిలో పారిస్ నుంచి పారిపోయి వచ్చిన కులీన కుటుంబాల వారికి లండన్ నుంచి నిధుల బదలాయింపుతో నక్కని తొక్కి వచ్చినట్టు వ్యాపారం పదింతలు పెరిగింది! 

Wilhelm తన శత్రువైన Prussiaకి సాయం చేస్తున్నందుకు Napoleon కోపగించుకుని 1806లో  Hesse మీద యుద్ధానికి వచ్చాడు. Landgrave భయపడి Holstein వెళ్ళి తల దాచుకున్నాడు - ప్రవాసంలో ఉన్న Wilhelm యొక్క లావాదేవీలను Rothschild చక్కబెడుతూ తన ఆర్జనకి లోటు లేకుండా చూసుకున్నాడు.యుద్ధ సమయంలోనూ ఇతర సమయాల్లోనూ సరుకుల రవాణాకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ Napoleon దగ్గిర నుంచి కూడా ఆదాయం కిట్టించుకున్నాడు!

యుద్ధాలని సృష్టించటానికి వీళ్ళు చేసే గారడీ చాలా నిక్కచ్చి లెక్కలతో కూడిన చిక్కురొక్కురు మలుపులతో నిండిన వైకుంఠపాళి ఆటలా తెలుసుకుంటున్నవాళ్ళకే సంభ్రమాశ్చర్యానందవిషాదక్రోధనిర్వేదాలను ప్రతి సన్నివేశంలోనూ కలిగించేటంత గొప్ప నవరసాత్మకమైన దృశ్యకావ్యంలా గోచరిస్తుంది! మొదట ప్రభువుల స్థానంలో ఉన్న తమ అవసరం కోసం ఇదివరకే అక్కడ నిలబెట్టిన పావుల అహంకారమమకారవ్యామోహాదులనే మెట్ల మీద వాక్యకోవిదుల వలె యుద్దవీణాతంత్రులను కొనగోట మీటుతూ వారు ప్రజల ముందు నిలబడి కలహం తప్ప్పనిసరి అని ప్రజలను ఒప్పించి సమరశంఖం పూరించేలా చేస్తారు!   ఒకసారి రణభేరి మ్రోగాక కొందరు తెలివైనవాళ్ళు యుద్ధాన్ని నివారించటానికి ప్రయత్నిస్తే వారికి ప్రజాద్రోహుల ముద్ర వేసి చెఱసాలకు తరలించడానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యే ఉంటాయి!యుద్ధం మొదలయ్యాక తమ గోదాముల్లో అమ్ముడు పోకుండా పడి ఉన్న పాత సరుకులతో సహా అన్నింటినీ బైటికి తీసి రాజే కింకరుడవటం వల్ల పోటీదారులు లేని అవకాశాన్ని వినియోగించుకుని రూపాయి సరుకుని వంద రూపాయలకి అమ్మి లాభసాగర తరంగాల మీద తేలియాడుతూ ఉంటారు!యుద్ధం ఎంత కాలం కొనసాగాలి,ఎవరు ఓడిపోవాలి,ఎవరు గెలవాలి అనేవి కూడా ముందే నిర్ణయించుకుని ఉంటారు కాబట్టి వారికి సంతృప్తి కలిగిన తర్వాత యుద్ధ విరమణ ప్రకటిస్తారు!అప్పుడు రెండు వైపులా యుద్ధానంతర పునరావాస పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతాయి - ఇప్పుడు ద్వితీయ శ్రేణి మృత్యుబేహారులు రంగంలోకి దిగి తమ లాభకండూతిని సంతృప్తి పరుచుకుంటారు!ఏ రెండు కల్పిత కధలూ ఒక్కలా ఉండవు గానీ అన్ని యుద్ధాలూ ఒక్కలానే ఉంటాయి - ఇలాగే మొదలవుతాయి, నడుస్తాయి, ఆగుతాయి!

మొదటి తరం హిరణ్యకశిపుడు తను చెయ్యగలిగినంత వ్యాపారం చేశాక మొదటి కొడుకు Amschel Mayerని Frankfurt bankకీ రెండవ కొడుకు Salomonని Vienna bankకీ మూడవ కొడుకు Nathanని turned the London bankకీ నాల్గవ కొడుకు Calmannని Naples bankకీ ఐదవ కొడుకు Jacobని Paris bankకీ అధిపతుల్ని చేసి కన్ను మూశాడు.

ఓం నమో హిరణ్యకశిపాయ నమః

1810 CE
ఆధునిక హిరణ్యకశిప Rothschilds 1810లో యూదుల కోసం ప్రత్యేక దేశం సాధించి పెట్టాలని అనుకుంది.దాంతో పాత జుదాయిజం మతానికి రూపురేఖలు మార్చి కొత్త జుదాయిజం మతాన్ని తయారు చేసింది.వాళ్ళకి కర్తవ్యబోధ చేసి,సాధన సంపత్తిని సమకూర్చి వ్యూహ నిర్మాణ దక్షులైన నేతలను కూడా తయారు చేసి ఇచ్చి అనేక విధాల సహాయ పడింది.

ఎట్టకేలకు యూదుల సుదీర్ఘ కాలపు కలల రూపం Israel అవతరించింది - ఇది Rothschilds మాత్రమే సాధించగలిగిన అద్భుతం, అనితర సాధ్యం!

1815 CE
Rothschilds నడిపిస్తున్న Barings Bank చైనావాళ్ళ నల్లమందు వ్యాపారాన్నీ ఆఫ్రికన్ బానిసల వ్యాపారాన్నీ తన అధీనం లోకి తెచ్చుకుంది.Prussian War, the Crimean War అనే రెండు లాభసాటి యుద్ధాలకి finance చేసింది.బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచివాళ్ళ నుంచి సూయజ్ కెనాల్ స్వాధీనం చేసుకోవటానికి సహాయపడింది.

1823 CE
సుమారు 19వ శతాబ్దపు తొలినాళ్ళలో Pope అప్పు కోసం Rothschilds ముంగిట వాలాడు.అప్పటి నుంచి Vatican ఆర్ధిక వ్యవహారాలను కూడా తనే చూడటం మొదలుపెట్టారు. 1823 నుంచి అధికారికమైన గుర్తింపు పత్రం తీసుకుని worldwide Catholic Church యొక్క అన్ని లావాదేవీలను Rothschilds పర్యవేక్షించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం financial business రంగంలో Catholic Church వాటా చాలా చాలా చాలా ఎక్కువ!

1831 CE
Freidrich Hegel(1770-1831) సమాజం యొక్క చలనం గురించి కొన్ని విషయాలను పరిశీలించి కొన్ని విశ్లేషణలను చేసి కొన్ని సూత్రీకరణలు చేస్తూ గతి తార్కిక భావ వాదం అనే సిద్ధాంతం చెప్పాడు.దీని ప్రకారం మానవాళి యొక్క పురోగమనం "thesis", "antithesis" అనే ద్వంద్వాలు సంఘర్షించుకుని వాటి మేలు కలయిక అనిపించే "synthesis" పుట్టుకొస్తూ నడుస్తున్నదని చెప్పాడు.ఇతన్ని sponsor చేసిన Rothschild Business Roundtable వారికి ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది!

అదేమిటంటే, capitalism  అనే thesisకి తామే communism అనే antithesisని సృష్టించితే ఈ రెంటి సంఘర్షణ వల్ల తాము కోరుకుంటున్న New World Order ఆవిర్భవిస్తుందని అంచనా కట్టారు!పేరు గంభీరంగానే ఉంది గానీ దీని తీరు monopoly capitalism మాత్రమే!అప్పుడున్న liberal capitalist econimy అనే thesis నుంచి మొదట Prolitariat Dictatorship అనే antithesisని ఫెయిలవుతుందని తెలిసే సృష్టించారు, దానంతటది ఫెయిలయ్యిందో మరి చరిత్ర గమనాన్ని వేగవంతం చెయ్యడానికి వారే ఫెయిల్ చేశారో తెలియదు గానీ - అది ఫెయిల్ కాగానే restricted capitalist economy అనే synthesని కూడా ఉనికిలోకి తీసుకొచ్చారు!

ఉలిక్కి పడకండి - మనమిప్పుడు New World Order యొక్క మొదటి దశలోనే ఉన్నాం, రెండవ దశలోకి ఇంకా అడుగు పెట్టలేదు.రెండవ దశలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న Illuminati banking familiesకి చెందినవారూ Black Nobility monarchsకి చెందినవారూ 300 మంది కలిసి ఏర్పడిన సంఘానికి మాత్రమే ఈ భూమి మీద ఉన్న వనరుల మీద నిజమైన  అధికారం ఉంటుంది.

ప్రపంచ జనాభాని 1 బిలియన్ దగ్గిర స్థిరపరచగలిగినప్పుడు రెండవ దశలోకి వెళ్ళినట్టు అర్ధం చేసుకోవాలి.ఆ లక్ష్యానికి చేరుకోవటానికీ చేరుకున్నాక దాన్ని నిలబెట్టి ఉంచటానికీ సంతాన పరిమితిని విధించడం, రోగాల్ని వ్యాపింపజేయ్యడం,యుద్ధాల్నీ కరువుల్నీ సృష్టించడం లాంటి సృజనాత్మకమైన ప్రక్రియలను వాడుకుంటారు.

New World Order యొక్క ముఖ్యమైన లక్షణాలు ఇలా ఉంటాయి:ఎన్నికలు ఉండవు - ఆ ప్రాచీన యూరొపీయ రాజవంశాల వారి అనువంశిక పాలన నడుస్తూ ఉంటుంది, మధ్య తరగతి ఉండదు - పాలకులు,పాలితులు మాత్రమే ఉంటారు, వీదేశీ మారక ద్రవ్యం ఉండదు - ఒకే కరెన్సీ ప్రపంచం మొత్తానికి చెల్లుతుంది, మత విద్వేషాలు ఉండవు - క్రైస్తవమే పాలకులకీ పాలితులకీ కూడా ఆమోదయోగ్యం అవుతుంది, నేరాలు చాలా తక్కువ - పాలితులకి నేరాలు చేసే అవకాశం ఇవ్వరు, ప్రభువులకి సేవలు చెయ్యడమే వారి ఏకైక లక్ష్యం, జన్మకారణం కూడాను.నేరాలూ, ఘోరాలూ పాపాలూ అన్నీ ప్రభువులే చేస్తారు. తిరగబడిన వాళ్ళని కడుపు మాడ్చి చంపెయ్యటమో సమాజం నుంచి బహిష్కరించటమో చేస్తారు. ఒకే ప్రభుత్వం,ఒకే చట్టం,ఒకే సైన్యం,ఒకే సంస్కృతి - విధేయత ఉంటే అంగరంగవైభోగమే, వైవిధ్యం లేకపోవటం ఒకటే లోపం!

"The Party seeks power entirely for its own sake. We are not interested in the good of others; we are interested solely in power. Not wealth or luxury or long life or happiness: only power, pure power. 

We are different from all the oligarchies of the past, in that we know what we are doing. All the others, even those who resembled ourselves, were cowards and hypocrites. The German Nazis and the Russian Communists came very close to us in their methods, but they never had the courage to recognize their own motives. They pretended, perhaps they even believed, that they had seized power unwillingly and for a limited time, and that just round the corner there lay a paradise where human beings would be free and equal. 

We are not like that. We know that no one ever seizes power with the intention of relinquishing it. Power is not a means; it is an end. One does not establish a dictatorship in order to safeguard a revolution; one makes the revolution in order to establish the dictatorship. The object of persecution is persecution. The object of torture is torture. The object of power is power." అని జార్జి ఆర్వెల్ పెద్దన్న నోట చెప్పినది అతని స్వకపోలకల్పితం కాదు - New World Order గురించి తెలిశాక చూపించిన కఠిన వాస్తవం.

1833 CE
Yale Universityలోని విద్యార్ధి సంఘాలలో Yale Senior society system  చాలా ప్రత్యేకమైనది మొత్తం United Statesలోనే కాదు ప్రపంచంలోనే అలాంటి మరొక సంస్థ లేదు.మొదట్లో దీనికి Brotherhood of Death అనే గంభీరమైన నామధేయం ఉండేది,తర్వాత హాస్యదృష్టి కొంచెం పెరిగి Skull & Bones కింద మార్చి Bones అని పిలుస్తున్నారు.1833లో మొదట స్థాపించినప్పటి నంచి సంవత్సరానికి 15 మందిని initiate చేసుకుంటున్నది.

ప్రతి సంవత్సరం commencement week రాగానే 15 మంది జూనియర్ స్టూడెంట్లు "Skull & Bones. Accept or reject?" అనే invitation అందుకుంటారు.పరపతినీ ధనసంపత్తినీ పెంచుతున్న ఆహ్వానాన్ని తిరస్కరించే ప్రశ్నయే ఉండదు.అయితే, ఆహ్వానం డిగ్రీని బట్టి గానీ  మార్కులను బట్టి గానీ రాదు.1600కి ముందు East coast చేరుకున్న American కుటుంబాల లోని మగపిల్లలకి మాత్రమే ఆహ్వానం వస్తుంది.1783 నుంచి లెక్కపెట్టి వంద సంవత్సరాల లోపు  ఎదిగి  సరైన సమయానికి వాళ్ళ పిల్లల్ని Yale Universityలో చేర్చటం వల్ల old line families గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళకి కూడా అవకాశం వస్తుంది.

Initiate అయిన 15 మందినీ మొదటి సంవత్సరం Knights అనీ తర్వాత నుంచి Patriarchs అనీ పిలుస్తారు.non-Yale-talented కుర్రాళ్ళని అధికారం దరిదాపుల్లోకి రాకుండా చెయ్యటానికే దీన్ని ఏర్పాటు చేశారు.

ఇలాంటివి ప్రపంచం మొత్తం మీద మూడు సంస్థలు ఉన్నాయి:Illuminati అనేది Germanyలోని University of Ingolstadt నుంచి పుట్టింది, Skull and Bones అనేది United Statesలోని University of Yale నుంచి పుట్టింది - ఇక్కణ్ణుంచి బయటికి వెళ్ళిన కుర్రాళ్ళు Guggenheim రక్షణకవచం లోకి వెళ్తారు, The Group అనేది Oxford Universityలోని All Souls College నుంచి పుట్టింది - ఇక్కణ్ణుంచి బయటికి వెళ్ళిన కుర్రాళ్ళు Rothschilds రక్షణకవచం లోకి వెళ్తారు.

United Statesలోని The Orderకీ Englandలోని The Groupకీ Germanyలోని Illuminatiకీ Russiaలోని Politburoకీ ఒకటే లక్ష్యం - అతి తక్కువ మంది self-appointed ప్రభువర్గానికి అపరిమితమైన అధికారాలను కట్టబెట్టి మిగిలిన వారిని స్వచ్చంద బానిసలను చేసే దుర్మార్గమైన  విధానానికి పురోగామి దృక్పధం అనే ముసుగు తొడగటం.

అందరూ రాజ్యం ప్రజలకి ఎక్కువ స్వేచ్చ ఇవ్వాలని కోరుకుంటే వీరు ప్రజలు రాజ్యానికి ఎక్కువ స్వేచ్చ ఇవ్వాలని కోరుకుంటారు.ప్రజల్లో వామపక్ష భావాలను సహించరు గానీ తమలో కొందరిని పని గట్టుకుని వామపక్ష భావజాలం తరపున వాదించమని ప్రోత్సహిస్తారు.తమ లోపలే కాదు, రచనాదృశ్యశ్రవణ మాధ్యమాలలోని వామపక్ష మేధావులకు నిధుల్నీ సమాచారాన్నీ ఇచ్చి ప్రోత్సహిస్తారు - స్వేచ్చా సమాజం ముసుగు కోసమో వ్యతిరేకతను సహించే ప్రజాస్వామిక దృక్పధం ఉన్నదని చెప్పుకోవటానికో కాదు, హెగెల్ conflict is essential అని చెప్పాడు కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేసేశారు!Russian Communism పరిధికి మించి హడావిడి చెయ్యకుండా ఉండటానికిChina Communism అనేది ఉనికిలోకి వచ్చింది - దానికి కూడా వీరే finance చేశారు.

Conflict పోటీ తత్వాన్ని పెంచి ధనసృష్టి ఎక్కువ జరుగుతుందనే ప్రాక్టికాలిటీ కూడా ఉంది.Korean War, Vietnamese War వంటి యుద్ధాల్లో American corporations లాభాల కోసం శత్రుపక్షం వాళ్ళతో కూడా వ్యాపారం చేశారు!

వీళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ మొత్తం ఆర్ధిక పరిస్థితిని వెయ్యి కళ్ళతో గమనిస్తూ thesis బలహీన పడుతుందని తెలియగానే ఎలాంటి antithesis సృష్టిస్తే తమకు కావలసిన synthesis వస్తుందో దానికి తగ్గట్టు పధకాలు రచించి చరిత్రని తాము కోరుకున్న బాట నుంచి ఒక్క అంగుళం కూడా పక్కదారికి పోనివ్వని సరైన దారిలో నడిపించటానికి పనికి వచ్చేటట్టు ఉంటుంది!

1836 CE
"సామ్రాజ్యాన్ని పరిపాలించటానికి సింహాసనం మీద ఏ తోలుబొమ్మ కూర్చుంది అనేది అనవసరం నాకు. ప్రజలకి అత్యవసరం అయిన money supplyని నియంత్రించగలిగిన వాడు మాత్రమే British Empireని నియంత్రించగలుగుతాడు - డబ్బుని సృష్టించుతున్నది నేను!" 
 - Nathan Mayer Rothschild(16 September 1777 to 28 July 1836)

1871 CE
John Ruskin అనే విద్యావేత్త Oxford Universityకి వచ్చి  inaugural lecture ఇస్తూ "You were the possessors of a magnificent tradition of education, beauty, rule of law, freedom, decency, and self-discipline! But that tradition could not be saved, and did not deserve to be saved, unless it could be extended to the lower classes in England itself and to the non-English masses throughout the world. 

If this precious tradition were not extended to these two great majorities, the minority of upper-class Englishmen would ultimately be submerged by these majorities and the tradition lost. To prevent this, the tradition must be extended to the masses and to the empire."అనే చిన్న ముక్కని చెప్పాడు. ఆ ప్రసంగం వింటున్న వాళ్ళలో ఉన్న Cecil Rhodes అనే ఒక undergraduate కుర్రాడు అప్పటికి తనకి తెలిసిన longhand పరిజ్ఞానంతో మక్కీకి మక్కీ కాగితం మీదకి దించేశాడు!ఆ కాగితాన్ని ముప్పయ్యేళ్ళ పాటు  నిరంతరం తనకి అత్యంత సమీపంలో ఉండేటట్టు చూసుకున్న్నాడు.

1880 CE
దాదాపు 1880ల నుంచి ఆమెరికా లోనిRockefellera మరియు Rothschilds కలిసి పనిచెయ్యటం మొదలుపెట్టారు.

John D. Rockefeller Ill స్థాపించిన Rockefeller Foundation గత ఇరవయ్యేళ్ళ నుంచి  Population Council, the World Bank, the UN Development Program, the Ford Foundation వంటి సంస్థలతో సమన్వయం కలిగించుకుని anti-fertility vaccine కనిపెట్టడం కోసం కృషి చేస్తున్నది.

1891 CE
Cecil Rhodes ఒక్కడే కాదు, John Ruskin ప్రసంగం చాలామందిని ఉత్సాహం ఉరకలెత్తేటట్టు చేసింది!Arnold Toynbee, Alfred Milner వంటివాళ్ళ ఆప్తమిత్రబృందం తమ జీవితాల్ని British Empire యొక్క అభ్యున్నతి కోసం వినియోగించాలని నిశ్చయించుకున్నారు.

"మిమ్మల్ని మేము ఆ ఇరవై కుటుంబాలకి బానిసల్ని చెయ్యాలనుకుంటున్నాం,మా లక్ష్యానికి సహకరించండి!" అని బహిరంగ వేదికల మీద చెప్పి ప్రజల నుంచి మద్దతు కూడగట్టటం అసాధ్యం గనక రహస్య సంస్థలను ఏర్పాటు చేసి వాటితో ప్రజలని తమకు తెలియకుండానే వీరికి అనుకూలమైన దారిలోకి నడిపించవచ్చునని ప్రణాళికలు వేశారు.

అలా Cecil Rhodes యొక్క పదహారు సంవత్సరాల నిరీక్షణ అనంతరం February 5, 1891న అతని నాయకత్వంలో ఒక రహస్య సంస్థ ఆవిర్భవించింది.Arthur (Lord) Balfour, (Sir) Harry Johnston, Lord Rothschild, Albert (Lord) Grey వంటివాళ్ళు 'Circle of Initiates' లోనూ ఇతరులు 'Association of Helpers' లోనూ ఉండటానికి నిశ్చయించుకుని కార్యరంగంలోకి దిగారు.

1892 CE
"ప్రజలని ఎప్పటి కప్పుడు ఒకరి కొకర్ని ప్రత్యర్ధులను చేస్తూ ఉండాలి, ఓటర్లని విడగొట్టి ఉంచాలి, వాళ్ళ తెలివితేటల్నీ శక్తియుక్తుల్నీ  ప్రయోజనం లేని విషయాల కోసం వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చావటానికే ఉపయోగించుకునేలా చెయ్యాలి, కోర్టుల్ని ఉపయోగించుకుని... చట్టాల్ని అతిక్రమించినట్టు తెలియనివ్వని పద్ధతిలో, సామాన్యులని నిర్వాసితులనీ నిస్సహాయుల్నీ చెయ్యాలి. అప్పుడే వాళ్ళని control చెయ్యటం సాధ్యం అవుతుంది, అప్పుడే financial leadersకి  ప్రయోజనం కలిగించటం కోసం ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకున్నప్పుడు సంఘర్షించకుండా ఉంటారు"
United States Bankers magazine, 1892

"debt-based monetary system అనేది econimicsని control చెయ్యటానికి ఉపయోగిస్తున్న పద్ధతి, డబ్బు చేతులు మారుతున్న ప్రతిచోట credit అనేది capitalకి ప్రత్యామ్నాయం కావడం వల్ల ప్రభుత్వాలు సైతం దాని పరిధిలోకి వచ్చేశాయి. రాజకీయ నాయకులు కూడా కొనగలిగే,అమ్మగలిగే,ఎన్నుకోబడే,తొలగించబడే,అవసరమైనప్పుడు చంపబడే పనిముట్ల కింద మారిపోయారు. Global Monetary System అనేది ప్రపంచంలోని అతి కొద్ది మంది అత్యంత ధనవంతుల కోసం పనిచేసే central banks యాజమాన్యం చేత అల్లబడిన చిక్కురొక్కురు అల్లిక - దాని పరిధి నుంచి తప్పుకోవడం అసాధ్యం!"
Andrew Gavin Marshall, Global Research

1900 CE
"House of Rothschild యొక్క సంపద, అధికారం, వైభవం, ప్రాభవం ఎంత మేరకు పెరిగాయంటే, 1900 నాటికి భూమి మీద సృష్టించబడిన సంపదలో సగం వారి  అధీనంలో ఉంది."
Des Griffin in his book "Descent Into Slavery?"

1910 CE
1890లలో Oxford, Cambridge వంటి ప్రముఖ విద్యాసంస్థలకి చెందిన కొంతమంది British elites ఒక రహస్య సంస్థని ఏర్పాటు చేశారు, కానీ 1910లో Round Table అనే పేరుతో ఒక కొత్త journal of empire ఏర్పాటు చేసిన తర్వాతనే దాని అడుగుజాడలు కనపడటం మొదలైంది. 

ఈ గ్రూపు వలస రాజ్యాల్ని మరింత సమర్ధవంతంగా నిర్వహించటానికి ఒక అద్భుతమైన ప్రణాళికని తయారు చేసింది. మొదట వలస రాజ్యాల ప్రజలకి స్వతంత్రం ఇస్తున్నట్టు భ్రమ పుట్టిస్తారు, తర్వాత central reserve banks ద్వారానూ puppet leaders ద్వారానూ "informal empire" పేరుతో తమ పరిపాలన యధాతధం కొనసాగిస్తారు.

అప్పటికే చుట్టూ ఉన్న అన్ని అరబ్ దేశాల మధ్య పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసిన అనుభవం ఉంది - వొప్పుకోవాల్సిన వాళ్ళకి కొత్త ఆలోచన పిచ్చపిచ్చగా నచ్చేసింది! 

1913 CE
దాదాపు 19వ శతాబ్దపు చివరి దశకంలో Rothschilds అత్యంత ధనిక దేశమైన అమెరికాని తన పట్టులోకి తెచ్చుకోవాలని అనుకుంది. 1900 దరిదాపుల Paul Warburg అనే సమర్ధుణ్ణి Kuhn Loeb & Co అనే banking firmతో కలిసి పనిచెయ్యమని U.Sకి పంపించింది.  మొదట Jacob Schiff, Paul Warburg కలిసి FEDERAL RESERVE BANK పేరుతో ఒక private central bank స్థాపించటం కోసం ప్రచారం మొదలుపెట్టారు.

1907లో New York Chamber of Commerce ముందు Jacob Schiff గంభీరంగా “If we don’t get a central bank with sufficient credit control, this country will experience the most severe and far-reaching financial panic in its history!” అని ప్రకటించాడు.

వాళ్ళు ఇలా చెప్పారు, అది అలా జరిగింది! monetary crisis మొదలైంది, financial market అల్లకల్లోలమైంది, దేశం మొత్తంలో పదిల వేల సంఖ్యలో జనం సర్వనాశనమైపోయారు - ఒక్క దెబ్బకి రెండు పెట్టలు, ఇక్కడి నష్టం లాభం రూపంలో Rothschildsకి వెళ్ళడమూ central bank  ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలియజెయ్యడమూ వెంటవెంటనే జరిగిపోయాయి. 

FEDERAL RESERVE SYSTEM (the private central bank of the U.S.) యొక్క విధి విధానాలకి సంబంధించిన final version మొత్తం Georgiaలోని Jekyll Islandలో ఉన్న Morgan Estateలోనే రూపు దిద్దుకుంది.

A. Piatt Andrew, Senator Nelson Aldrich, Frank Vanderlip (president of Kuhn Loeb & Co.), Henry Davidson (senior partner in the J.P. Morgan Bank), Charles Norton (president of Morgan’s First National Bank), Paul Warburg మరియు Benjamin Strong (president of Morgan’s Bankers Trust Co.) కలిసి కూర్చుని చర్చించి అమెరికాతో వ్యాపార వ్యవహారాలు జరపాలని కోరుకునే వారంతా తమ లావాదేవీల కోసం సంప్రదించాల్సిన  Federal Reserve Systemని ఏర్పాటు చేసేశారు - Paul Warburg మొదటి chairman అయ్యాడు.

…AND THUS ENDETH FREEDOM IN AMERICA.

1915 CE
"For even our own Gandhi was a Rothschild stooge, imported in 1915 from South Africa by a Chitpavan Jew—nay- Brahmin Gopal Krishna Gokhale to scuttle our freedom struggle and to recruit Indian soldiers for both world wars to kill Germans." అనేది నమ్మడం కష్టమే!

కానీ, చౌరీ చౌరాలో నలుగురు తెల్లవాళ్ళ కోసం అంత హడావిడి చేసి ఉద్యమాన్ని ఆపేసిన  వాడు మోప్లా వూచకోతలో చచ్చిపోయిన హిందువుల కోసం ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చలేదు,హిందువులూ ముస్లిములూ ముక్తకంఠంతో పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించాక జిన్నాను కలిసి ప్లెబిసైట్ గురించి మాట్లాడి ఇక జరగదనుకున్న పాకిస్తాన్ ఏర్పాటును సుసాధ్యం చేశాడు - అన్నింటికన్న ముఖ్యమైనది:ఎవర్ని మనకి అన్యాయం చేస్తున్నారని ప్రకటించి వాళ్ళ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుని పోరాడుతున్నాడో వాళ్ళ తరపున మన దేశస్థుల్ని యుద్ధం చెయ్యమని పంపించడం ఏమిటి?

అప్పటివాళ్ళలో illuminati bankers నీడన చేరని నిజమైన నేత అంబేద్కర్ ఒక్కడే కనపడుతున్నాడు నాకు!illuminatti bankers గురించి ఆయనకీ తెలిసి ఉండదు - తెలిస్తే భారతదేశపు చరిత్ర మరోలా కదిలేది కాబోలు!

1917 CE
ఈ పెట్టుబడి దారీ విధానం చాలా భయంకరమైనదని తేల్చి చెప్పి దీన్ని అంతం చేసే రహస్యం తనకి తెలుసునని గతి తార్కిక భౌతికవాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రపంచంలోని స్వాప్నికులందర్నీ ఉర్రూత లూగించిన మార్క్సిజం  రష్యాలో సాకారం కావటానికి కూడా Lord Alfred Milner, Kuhn Loeb అనే ఇద్దరు finance చేశారంటే అంతకన్న విచిత్రమైన విషయం ఇంకొకటి లేదు, కానీ అది అలానే జరిగింది!Rockefellers తరపున పనిచేస్తున్న వీళ్ళే తోలుబొమ్మ ప్రెసిడెంట్ Woodrow Wilson గారిని ఉపయోగించుకుని అంత అసాధ్యం అనిపించే పనిని కూడా సుసాధ్యం చేసేశారు.

Bolshevik Revolution తమ పునాదుల్ని కూల్చివేయటానికి పుట్టినప్పుడు Rockefellers, Schiffs, Warburgs, Morgans, Harrimans, Milners వంటి పెట్టుబడిదారులు finance చేశారు - ఎందుకు?వాళ్ళకి International Communism అంటే భయం లేదా!లేదు, కారణం తెలిస్తే పగలబడి నవ్వుకుంటారు మీరు - "If we financed it and do not fear it, it must be because we control it." అనిట!

1924 CE
"డబ్బుని సృష్టించేది బ్యాంకులేననీ,అవే దేశపు creditsని control చేస్తాయనీ,Governments పనిచేస్తున్నది బ్యాంకు యజమానులకే తప్ప తమకోసం కాదనీ తెలిస్తే ప్రజలు తట్టుకోలేరనుకుంటాను!"
Reginald McKenna, as Chairman of the Midland Bank, addressing stockholders in 1924

"మన దేశప్రజలకి బ్యాంకుల గురించీ money system గురించీ తెలియకపోవటం మంచిదే అయ్యింది! ఒకవేళ తెలిస్తే గనక, రేపటికల్లా విప్లవం వచ్చెయ్యడం ఖాయం."
Henry Ford, founder of the Ford Motor Company

1929 CE
ఈ Depression ప్రమాదవశాత్తు వచ్చినది కాదు.తమ క్రూరమైన తెలివితేటల్ని ఉపయోగించి రప్పించినదే - international bankers ప్రజల్ని మొదట భయభ్రాంతుల్బి చేసి తర్వాత దాన్ని పోగొట్టిన రక్షకుల అవతార మెత్తి ప్రజల్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికే చేశారు.

World War Iలో పాల్గొన్న చాలా దేశాలు పెద్ద స్థాయిలో అప్పుల పాలయ్యాయి.యుద్ధానికి బీజం వేసి, పోషించిన international bankersకి అవి మొండిబాకీల కింద తయారయ్యాయి.ఈ మొండిబాకీల నష్టాన్ని పూడ్చుకోవటానికి వేసిన ఎత్తుగడ తర్వాత World War IIకి దారి తీసింది.వీళ్ళు చేసినది యేమిటంటే, అస్మదీయులు తమ షేర్లని అమ్మేశాక artificial inflation వచ్చేలా చేసి stock marketలో ఉత్తుత్తి boom సృష్టించారు.అలా చేస్తే తర్వాత ఏమౌతుందో షేర్ మార్కెట్ గురించి పరిజ్ఞానం వున్నవాళ్ళకి తెలుస్తుంది.అందరూ ఎగబడి కొన్నాక షేర్ల విలువలు వాటంతటవే పడిపోతాయి.ఇలా సృష్టించబడిన Great Depression ఒక్క అమెరికానే కాదు,అమెరికాతో వ్యాపార సంబంధాలు ఉన్న అన్ని దేశాలలో ఒకేసారి భూకంపం వచ్చినంత పనయ్యింది.శ్రీశ్రీ లాంటివాళ్ళు తమ జ్ఞాపకాల్లో దీన్ని ప్రస్తావించారు.

ఇది అమాయకులైన చిన్న investersని దెబ్బ తీసింది కానీ insiders క్షేమంగానే ఉన్నారు. Paul Warburg 1929 మార్చిలోనే  Crash రాబోతుందని tip అందించడంతో John D. Rockefeller, Bernard Baruch, Joseph P. Kennedy వంటి money barons ముందుగానే అమ్మేసుకున్నారు కదా!

ముందుగానే బైటికి వెళ్ళిన ఈ మహరాజులు ఆ దెబ్బని తప్పుకోవటమే కాకుండా Crashకి గురై మూతబడిన కంపెనీల్ని చవక ధరకి కొనేసి మొండి బాకీల నష్టాన్ని పూడ్చుకుని ఆనందించారు!

1950 CE
"ఎట్టి పరిస్థితుల్లోనూ World Government సాధించే ప్రయత్నాలని ఆపేది లేదు - అది మా ఏకైక లక్ష్యం! అది conquestతోనా, consentతోనా అన్నది మాకు ముఖ్యం కాదు."
James Warburg on Feb. 7, 1950

2017 CE
"హెచ్చరికలు వచ్చాయి: నీ తెలివిని తీసుకెళ్ళి freezerలో పెట్టినట్టు చెయ్యకు అన్నారు. నాలో నేను నవ్వుకున్నాను, కానీ అది నేననుకున్నంత జోకు కాదు... psychopathనవ్వటానికి ట్రైనింగు తీసుకున్నాను నేను.

జనాన్ని నీచంగా చూశాం,వెక్కిరించాం. అంతా పనికిరాని చెత్త - ప్రకృతి, భూమి, మొత్తం తగలబడి పోతుంది. మా లక్ష్యాలను చేరుకునే కొద్దీ,మేము బలపడుతున్న కొద్దీ.

Circles (Illuminati)తో నాకున్న contact, వాళ్ళు నా clients. Churches of Satan లాంటివి చాలా వాటికి వెళ్ళాను. ఆడవాళ్ళని నగ్నం చేసి Holy Mass చేస్తున్న చోట్లకి కూడా వెళ్ళాను. నాకు తమాషాగా అనిపించింది. నాకు వాటిమీద నమ్మకం లేదు - నిజంగా జరుగుతాయని కూడా అనుకోలేదు. 

Circlesలో చాలా కాలం వరకు guestగానే తిరిగాను. నాకు life బాగానే ఉండేది. కాని ఒకసారి, sacrificesలో participate చెయ్యమని పిల్చారు. చిన్నపిల్లల్ని ... చెయ్యలేకపోయాను.

మెల్లమెల్లగా దూరం కావడం మొదలుపెట్టాను. మొత్తం మారిపోయింది, నా ఉద్యోగం పనులు కూడా చెయ్యటం మానేశాను. ఎంతో కాలం చెయ్యలేను కూడా, నేను వాళ్ళకి రెబెల్ అయిపోయాను.

ఆ ప్రపంచంలో ప్రతివాడూ వాళ్ళ జేబులోనే ఉన్నాడు. ఏం చెయ్యడానికీ వెనుకాడరు వాళ్ళు, blackmailing దెబ్బ బాగా తగిలింది నాకు. పిల్లల మీద వాళ్ళు చేస్తున్న పనులే నన్ను చాలా బాధ పెట్టాయి.

మీరు గనక సెర్చి చేస్తే ఇదంతా Walt Disney fairytale కాదని witness accounts చెప్తాయి. దురదృష్ట వశాత్తు ఇది వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 

అసలు Israelలోని మొదటి 10 జాతుల్ని Babyloniaకి రాకుండా నిషేధించినది చినపిల్లల్ని క్రతువుల్లో ఉపయోగించటం వల్లనే, అదీ బలి ఇచ్చినందుకే. 

The Illuminati అనేది నిజంగా ఉంది. బైబిల్లోనూ ఇంకా చాలా పుస్తకాల్లోనూ నేను చదివినది అక్కడ చూశాను - ఒక గ్రూపు తీవ్రమైన ద్వేషాన్ని మోసుకుంటూ తన సొంత దారిలో వెళ్తుందని అక్కడ చెప్పారు.

ఇది మన శరీరాల్ని ద్వేషించే ఒక హంతక శక్తి; ఇది సృష్టిని ద్వేషిస్తుంది; ఇది జీవాన్ని ద్వేషిస్తుంది. ఇది మనల్ని నాశనం చెయ్యటానికి ఏదైనా చేస్తుంది.

అలా చెయ్యాలంటే మనుషుల్ని విడగొట్టాలి.విభజించి పాలించటమనేది వాళ్ళ పద్ధతి." అని Ronald Bernard అనే ఒక Dutch banker తనకి Illuminati Bankersతో కలిగిన ప్రత్యక్ష అనుభవాలను వివరించాడు.

British financial oligarchy యొక్క స్వభావం కొన్ని వందల యేళ్ళ పాటు నక్కలో ఉండే జిత్తులమారి తనాన్నీ, ఎలుగుబంటిలో ఉండే మొండితనాన్నీ, తోడేలులో ఉండే క్రూరత్వాన్నీ, వేటకుక్కలో ఉండే తెగింపునీ, పులిలో ఉండే ఓపికనీ, కోతిలో ఉండే వెకిలితనాన్నీ, ఒంటెలో ఉండే సోమరితనాన్నీ, ఏనుగులో ఉండే భారీతనాన్నీ, సింహంలో ఉండే గర్వాన్నీ అలవాటు చేసుకునే ప్రయత్నంలో మానవత్వాన్ని పోగొట్టుకోవడం వల్ల అలా తయారైంది - సుభాషితాలతోనూ సంధి ప్రతిపాదనలతోనూ మార్చడం గానీ ఏమార్చడం గానీ సాధ్యం అయ్యే పని కాదు. మానవమాత్రులకి వాళ్ళని గెలవటమే కాదు, వాళ్ళకి ఎదురు నిలబడటం కూడా సాధ్యం కాదు. Europeలో,Britainలో కూడా కొందరు ప్రయత్నించారు. కానీ, సమయం చాలకనూ వనరులు లేకనూ విరమించుకున్నారు.అసలు ఎదిరించాలని అనుకోని బుద్ధిమంతులు మాత్రం చాలా సౌకర్యాలు పొందారు!

Rockefeller ఒకసారి "Competition is a sin." అని విసుక్కున్నాడు.ఇప్పటికీ మనకి అర్ధం కాని ఇంత గందరగోళంతో కూడిన సుదీర్ఘకాలపు వ్యూహాలు అన్నీ కూడా పోటీ లేని వ్యాపారం కోసమే!ఏ రంగంలోకి వెళ్ళి ఏ వస్తుసేవల వ్యాపారం చేసినా వీళ్ళే ఉండాలి,సరుకులో మరింత నాణ్యత చూపించి కాకుండా కొనుగోలుదార్లకి తమకన్న ఎక్కవ నాణ్యాతని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నవాళ్ళని తుదముట్టించి శిఖరాగ్రం చేరుకోవాలి, తమకి శిఖరాగ్రం ఇచ్చేవాళ్ళు తమవాళ్ళు, తమకి శిఖరాగ్రం ఇవ్వనివాళ్ళు పరాయివాళ్ళు అనే వీళ్ళ లక్ష్యాలనే వీళ్ళు తయారు చేసి జనం మీదకి వదిలిన క్రైస్తవ, మహమ్మదీయ మతాల సారం పుణికి పుచ్చుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?

క్రైస్తవుల కోసం బైబిలునీ ముస్లిముల కోసం ఖురానునీ తయారు చేసినది illuminatti bankers అనటానికి ఎలాంటి సందేహమూ అక్కరలేదు, వీళ్ళు ఏ కుటుంబాల కోసం వంశపారంపర్యాన్ని సాధించిపెట్టాలని అనుకున్నారో ఆ House of DaviD ఈ రెండింటిలోనూ fundamental acceptable truth కావడానికి అదే ముఖ్యకారణం!

యేసు పునరుత్ధానం అనేది క్రైస్తవులు ఇస్లామిక్ జెహాదీల చేతుల్లో ఓడిపోయి తిరిగి వాళ్ళ మీద గెలవటాన్ని సూచిస్తుంది.ఓటమి చావుతోనూ గెలుపు జీవంతోనూ సమానం అనుకుంటే గానీ అది అర్ధం కాదు!ఒక hipnotist తన subjectని transలోకి పంపించటానికి వాడే suggestions పక్కనున్నవాళ్ళకి అర్ధం కాకపోవచ్చు,అర్ధం కావల్సిన అవసరం లేదు కదా!వీళ్ళు కూడా ఈ రెండింటినీ military code వంటివాటిల్లో ఉండే encryption method వాడి తయారు చేశారు.

బైబిలు వీళ్ళు శిక్షించితే ప్రజలు తిరగబడకుండా తమను శిక్షించిన వారిని క్షమించటమే కాకుండా తమను శిక్షించిన పాపం అంటకుండా వీళ్ళకోసం దేవుణ్ణి ప్రార్ధించేలా తయారు చేస్తుంది!అంటే, రాజు ప్రజల్ని శిక్షించితే ప్రజలు తమ జన్మపాపం వల్లనే శిక్షించబడ్డామని ఓదార్చుకుని తమని శిక్షించిన పాపం తగలకుండా దేవుణ్ణి ప్రార్ధించి  రాజుకి పాపం నుంచి రక్షణ కల్పించాలి - ఇది New World Orderలో క్షేమంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా బతకాలనుకునే క్రైస్తవులు పాటించాల్సిన మొదటి నిబంధన,

మిగిలిన వాటిని కూడా దాదాపు ఇలాగే అర్ధం చేసుకోవాలి. నిత్యజీవం అంటే నిత్యవిజయం - ఇస్లామిక్ జెహాదీల మీద గెల్చినప్పటి నుంచి తిరుగులేని వరస విజయాలతో దూసుకుపోతూనే ఉన్నారు కదా! ఏసు రెండవ రాకడ అంటే జనాభాని 1 బిలియన్ సంఖ్యకి తగ్గించాక క్రైస్తవేతరుల ఏరివేత+తుదముట్టించుట+మతమార్పిడికి సంబంధించి వీళ్ళు చెయ్యబోయే భీబత్సాలకి సూచన!

ఖురానులోనూ బైబిలులోని అన్ని అంశాలూ కొన్ని భాషాంతరీకరణల భేదాలతో ఇలాగే ఉంటాయి కదా, అదనంగా చేర్చబడిన జెహాదిక్ హింస సైనికావసరాల కోసం చెప్పారు.బైబిలు మరియు ఖురానులోని మక్కన్ సురాలని మాత్రం follow అయ్యేవాళ్ళు సామాన్య పౌరులు అవుతారు, మనస్తత్వంలో Jehadic Inclination ఉన్నవారు సైన్యంలోకి వెళ్తారు.

John Ruskin ఏ సంస్కృతిని పొగిడి illuminatti bankersని inspire చేశాడో ఆ సంస్కృతియే ప్రపంచ సంస్కృతి అవుతుంది.మిగిలిన వాట్ని నిర్ధూమధామం చేసేస్తారు.చరిత్ర లేక ప్రపంచం New World Order యొక్క రెండవ దశలోకి వెళ్ళాక హిందువులు ఉనికిలో ఉండటం అసాధ్యం!హిందువులు కనీసం బేరమాడటానికి కూడా ముఖం చెల్లని స్థితిలో ఉన్నారిప్పుడు!తమ సంస్కృతి పట్ల శ్రద్ధ లేదు, నైతిక ధృఢత్వం లేదు, అవకాశవాదం పెరిగిపోయింది, ఇహాన్ని వదిలి పరాన్ని నెత్తిన పెట్టుకున్నారు, పోరాట పటిమ లేదు, స్వాభిమానం లేదు - ఇప్పటికే ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించి తమని కూడా పరిపాలిస్తున్న బలమైన శత్రువు మీద పోరాడటానికి కావలసిన ఏ ఒక్క లక్షణమూ లేకుండా తమని తాము ఎలా రక్షించుకోగలుగుతారు?

మనస్సు మీద పనిచెయ్యటం కోసం illumintti gang ఎన్ని tricks వేసినా అక్కడ జరుగుతున్నది డబ్బు చేతులు మారేచోట వాళ్ళు చేస్తున్న చేతివాటపు పని - అర్ధశాస్త్రం కరతలామలకం అయినవాళ్ళకి మాత్రమే దానికి ప్రతిక్రియ ఏమిటో తెలుస్తుంది!మన దేశంలో economics చదివేవాళ్ళు C.A చేసి ఏదో ఒక కంపెనీకి అకవుంటెంట్ అయ్యి పొట్ట పోసుకుంటే చాలుననే ధోరణిలో ఉన్నారు గానీ ఇలాంటి creativity చూపించటం లేదు - దీన్ని ఇలా తగలెట్టింది కూడా వాళ్ళే కదా!ఆర్ధికశాస్త్రంలో దీనికి విరుగుడు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించటం ఖర్చూ శ్రమా కలిసిన దీర్ఘకాలిక వ్యవహారం!మనకి పట్టిన బద్ధకపు దెయ్యం వదిలి, నిద్ర లేచి, ఆవలించి, వొళ్ళు విరుచుకుని, మొహం కడుక్కుని, మీనమేషాలు లెక్కపెట్టి, శుభముహూర్తం చూసుకుని, సకల దేవతలకీ మొక్కుకుని మొదటి అడుగు వెయ్యకముందే అక్కడ ఏసు రెండవ రాకడ వచ్చేస్తుంది!

దీర్ఘకాలిక ప్రయత్నాలు జరిగే లోపు మనుషులు వ్యక్తిగత స్థాయిలో చేసుకోవాల్సిన రక్షణ ఏర్పాట్లు,కొన్ని నేను కూడా చేస్తున్నవి చెబుతాను:

1.సూర్యుడు ఉదయించే సమయానికి మంచం మీద ఉండకూడదు.నేను 04:30 AM నుంచి 05:00 AM మధ్య నిద్ర లేచి స్నానం చేసి 05:45 AM దరిదాపుల మా అపార్టుమెంటు డాబా మీదకి వెళ్ళి ఉదయించే సూర్యుణ్ణి చూస్తూ 06:15 AM వరకు గడుపుతున్నాను.

2.నేను రోజూ వాడే tooth paste,soap,hair oil,shampoo పతంజలి స్టోర్సు నుంచే తెచ్చుకుంటున్నాను.

3.ఉదయం పూట చన్నీళ్ళ స్నానమే చెయ్యాలి - చలికాలం తప్ప.తలనూనె స్నానానికి ముందు పట్టిస్తే మంచిది.సబ్బుతో రుద్దినప్పుడు చేతుల మీద జిడ్డు పోతుంది.

4.సాయంకాలపు స్నానం సూర్యాస్తమయానికి ముందు చేస్తే మంచిది.లేదంటే 07:00 PMకి ముందు చేసినా పర్వాలేదు.కానీ అందరికీ కుదిరి చావదు కదా!

5.తలస్నానం సాయకాలం రోజూ చేస్తే మంచిది. తలకి నూనె రాస్తున్నప్పుడు ఏ రోజు అంటుకున్న దుమ్ముని ఆ రోజే కడిగేస్తే నయం కదా!

6.వీలున్నంతవరకు 10:30 PM లోపు అన్ని పనులూ ముగించుకుని నిద్రకి సిద్ధం కండి.ఒకట్రెండు రోజులు నిద్ర పట్టనంత మాత్రాన జబ్బేమోనని కంగారు పడక మంచి పుస్తకం చదువుతూనో ఇంటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను గురించి ఆలోచిస్తూనో గడిపెయ్యాలి.నిద్ర అనేది అలసటను బట్టి శరీరం తీసుకునేది - మీ బ్రెయినుకీ నరాలకీ తెలుసు, కంగారు పడకండి!

ఇవన్నీ వాళ్ళు రోగాలతో దాడి చేస్తారు గాబట్టి ఆ వైపు నుంచి వచ్చే దాడిని ఆపుతాయి. ఇంక లోతైన ఆర్ధిక శాస్త్ర విషయాలు మనకి తెలియవు గాబట్టి మనం చెయ్యగలిగింది ఒకే ఒక్కటి - వాళ్ళు అప్పు ఇవ్వడాన్ని కత్తిలా వాడుతున్నారు గాబట్టి మనం అప్పు చెయ్యకపోవడాన్ని డాలులా వాడుకోవాలి.EMIల వెసులుబాటు ఉంది కదాని వస్తువుల్ని కొనడానికి అప్పు చెయ్యకూడదు.ఎక్కువమంది సొంత ఇంటి కల విషయంలో వ్యామోహానికి గురై Real Estate మోసాలకి బలైపోతున్నారు.


అప్పు కోసం బ్యాంకు గడప ఎక్కని జీవుడు - వీరుడు, ధీరుడు, ధన్యుడు సుమతీ!

Saturday 5 January 2019

వూరవతల ఏటి గట్టున చుక్కల చూరు కింద పొదరిల్లు కడదామా?ఓ గజ్జెల గుర్రమంటి సినదానా!

అబ్బాయి:వూరవతల  ఏటి గట్టున చుక్కల చూరు కింద పొదరిల్లు కడదామా?
ఓ గజ్జెల గుర్రమంటి సినదానా!

అమ్మాయి:ఒంటికి చెమట పట్టని మారాజులకి 
ఏసీలూ డబల్ కాటు బెడ్డులూ నిదర మాత్రలూ 
ఇవ్వలేని నిద్రని - 
పొద్దున్న తిన్న చద్దన్నం,ఎండల్ల పడ్డ కాయకష్టం,
సంజేళ ఏణ్ణీళ్ళ స్నానం,రెల్లుగడ్డి పరుపు, 
సందిట్ల కదిలేటి పక్కతోడు,  కన్నిప్పితే తొంగిచూసేటి 
కుందేలు కూన ఇస్తాయి!

అబ్బాయి:ఉరుకుల పరుగుల బతుకుల లంచ్ బాక్సులో 
కుక్కిన గ్యాస్ స్టవ్వు మీద వండిన కుక్కరు వంటలూ,
కేయ్యఫ్సీ చికెన్లూ,మెక్డోనాల్డు పిజ్జాలూ, లాట్వినా బర్గర్లూ
ఇవ్వలేని రుచిని 
మిగలపండి చెట్టునుంచి రాలిపడి 
జన్మనేస్తం కాకెంగిలి చేసిన జాంపండు ఇస్తుంది!

అమ్మాయి:ఇంటిపక్క సినిమాహాళ్ళూ, రోడ్డుకవతలి వాల్మార్టులూ,
వీధి మొగదల బారండ్రెస్టారెంట్లూ,ట్రాఫిక్ జాముల హారన్మోతలూ
ఇవ్వలేని పరవశాన్ని 
చెట్లగుబురుల్లో దాక్కున్న పాటకత్తెల లాంటి కోయిలలూ,
జాంపండ్లని రుచి చూసి కిందకి వదిలే రామచిలకలూ,
మనం చూరులో కట్టిన వరికంకుల్ని కడుపారగ తిని
కిచకిచలతో దీవించే పిచ్చుకలూ ఇచ్చేవి - ఒకప్పుడు!

అబ్బాయి:డబ్బుని కరెన్సీ రూపంలో చూడకముందు
కొనడం, అమ్మడం అంటే తెలియని అమాయకత్వం పోయి
అమ్మకాలూ కొనుగోళ్ళూ లాభమూ అనే వెంపర్లాట పెరిగి
డబ్బుని కరెన్సీ రూపంలో చూపిస్తున్న చెట్టుని మర్చిపోయిన మనిషి
చెట్టుకి క్షమాపణ చెప్పాల్సిందే!
తనని తను రక్షించుకోవటానికైనా 
చెట్టు నీడకి చేరాల్సిందే!

అమ్మాయి:వూపిరిలో,కనుపాపలో,చెవి గూబలో,కాలిపిక్కలో,
పొత్తికడుపులో,పాలిండ్లలో,తలలో చేరిన కాలుష్యవిషాన్ని
కాంక్రీటూ,ప్లాస్టిక్కూ,గ్యాడ్జెట్లూ,ఫ్యాషన్లూ,ప్యాషన్లూ
తప్ప ఇంకేమీ లేని మోడ్రన్ స్టైల్ అనే డెడ్ ఎండ్
విరిచెయ్యలేదు గనక - 
నా మాటిను. 

అమ్మాయి:వూరవతల ఏటిగట్టున చుక్కల చూరు కింద 
పొదరిల్లు కట్టాలిసిందే! ఇంకా చూస్తావేంటి మావా?

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...