Sunday 27 May 2018

మహానటికి మరోవైపు - ఎవరినీ నొప్పించకూడదని విలన్ని హీరోని చెయ్యాలా?


        దెబ్బకి ఒకే ఒక్క సినిమాతో అంతకు ముందు ఎవరికీ తెలియని కీర్తి సురేష్ కొన్ని దశాబ్దాల పాటు ఎన్నో సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న సావిత్రి అంత పాప్యులారిటీ తెచ్చేసుకుంది!దాన్సిగదరగ తంతే గారెల బుట్టలో పడ్డం అంటే ఇదే గావాల - ఇంక తెలుగోళ్ళు ఎక్కడెక్కడి సన్నాసుల్నీ యెతికెతికి మరీ బయోపిక్కు బయస్కోపుల్తో జనాల్ని బయం పెట్టి సంపతారేమో!యెవడే కొత్తపని జేసినా ఈడేంది చేసింది,మా కులపోడు ఎప్పుడో జేసేసిండు అనేవోళ్ళు పల్నాటియుద్ధం బ్రహ్మనాయుడి బయోపిక్కని గూడా అనీగల్రు!

          గంటన్నర సినిమాకే బోరు గొట్టేసిందని మధ్యలో లేచొచ్చే కాలంలో ఈ కాలం వాళ్ళు కంటితో చూడను గూడా చూడని సావిత్రి గురించి పాత సినిమాలంత పొడుగాటి సినిమా తీసి హిట్ చెయ్యడం విచిత్రమే!ఈ సినిమా చూశాక్ బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్కుని మూలకి నెట్టేశాడని అంటున్నారు - నిజమో కాదో!నాగశ్విన్ అంత రీసెర్చి చేసి చూపించిన కధలో తేడా రానివ్వకపోయినా గుమ్మడి వెంకటేశ్వర రావు చేసిన దాన్ని యస్వీ రంగారావుకి ఫిరాయించడం లాంటివి తెలిసే చేశానంటున్నాడు గాబట్టి వదిలేసినా చూపించకుండా వదిలేసిన అతి ముఖ్యమైన భాగాల మీద వస్తున్న విమర్శల్ని చూసి బహుశా కోరి ఇలాంటి విమర్శల్ని తెచ్చుకోవటం దేనికని భావించి ఉండవచ్చు. 

        బయోపిక్ అంటే ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని విశేషాల్నీ చూపించాలి,ఆ లెక్క ప్రకారం చూస్తే నాగ్ అశ్విన్ ఆ కాన్సెప్టుకి అన్యాయమే చేశాడు.కేవీ రెడ్డి చాలెంజిని టేకప్ చేసి రెండే రెండు కన్నీటి చుక్కలు రాల్చిన దృశ్యం గురించి నేను చాలాకాలం క్రితమే చదివాను - అది నమ్మలేని విషయమే అయినా వాస్తవంగా జరిగిందే!అలాంటి అపురూపమైన విషయాల్ని పక్కన పెడితే ఆ తరం నటీమణులు జమున,భానుమతి,కాంచన వంటివాళ్ళు కూడా తక్కువ స్థాయిలో లేరు.కానీ కధలా చెప్పగలిగిన డ్రమెటిక్ కంటెంట్ వాళ్ళ జీవితాల్లో లేదు గనక ఇకముందు కూడా వాళ్ళ బయోపిక్స్ రావు.సావిత్రి 1936లో పుట్టింది,అంటే తెలుదు సినిమా కూడా కొత్తగా ఎదుగుతున్న రోజుల్లో ఎక్కడో తెనాలి అనే వూళ్ళే అత్యంత బీద కుటింబంలో ఉట్టి 16వ ఏటనే సినిమాల్లోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే తారాస్థాయికి చేరి ఎంత వేగంగా పైకి వెళ్ళీందో అంతే వేగంతో కిందకి వచ్చేసి 45 ఏట నేఅత్యంత విషాదకరమైన స్థితిలో చనిపోయిన సావిత్రి జీవితంలో మ్నకి కనబడుతున్న ఉత్ధానపతనాల వల్లనే కదా సావిత్రి అందరికీ అంత ప్రీతిపాత్రమైంది - అసలైఅన్ విషయాన్ని ఎందుకు వదిలివేశారు?
          మొదటి కారణం సావిత్రి బతికి ఉన్నప్పుడు ఆమెని ఏమాత్రం పట్టించుకోని విజయ చాముండేశ్వరి ఇప్పుడు కూతురు హోదాలో పెట్టిన పెట్టిన షరతులు కారణం అని తెలుస్తున్నది.మా నాన్న దేవుడు,నేనూ మా నాన్నా మా అమ్మా ఎంతో సంతోషంగా బతికాం అని తను చెబుతున్నది నిజమే అయితే కారు షెడ్దులో చూశానని అంటునన్ కె.రామలక్ష్మ్ అబద్ధాలు చెప్తున్నటు కాదూ!అనద్రితో పాటూ కూతురు కూడా సావిత్రికి అన్యాయం చేసినట్టు సావిత్రిని ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళూ తన జీవితాన్ని దగ్గిరగా చూసినవాళ్ళూ చెబుతున్నారు.ఇవన్నీ దాచేసి తియ్య్యడంతో ఇది సావిత్రి మీద తీసిన ఫాంటసెయే అవుతుంది తప్ప బయోపిక్ అని చెప్పుకునే అర్హత కోల్పోయింది!రెండవ కారణం ఈ మధ్యన తీసిన సినిమాలు తీవ్రమైన నష్టాన్ని తీసుకురావడంతో వైజయంతి మూవీస్ బ్యానరుకి చాలా పెద్ద గ్యాప్ వచ్చి ఇది కం బ్యాక్ సినిమా కాబట్టి వివాదాలతో చికాకులు తెచ్చుకోవడం ఇష్టం లేక వెనక్కి తగ్గి ఉంటారు.రాం గోపాల్ వర్మలా వివాదాలతో మార్కెట్ చేసుకునే మనస్తత్వం వీళ్ళకి లేకపోవటం వల్లనూ సావిత్రికి ద్రోహం చేసిన వ్యక్తి కూడా పరిశ్రమకి ఇన్సైడర్ కాబట్టి మొహమాటం వల్లనూ సావిత్రికి అన్యాయం చేసిన వ్యక్తికి ఇప్పటికీ అభిమానులూ సమర్ధకులూ ఉండటం వల్లనూ సావిత్రికే అతను నాకు అన్యాయం చహెశాడు అని చెప్పుకోలేని దుస్థితి దాపరించడం వల్లనూ సావిత్రికి వాస్తవ జీవితంలోనే కాదు తనమీద తీసిన సినిమాలోనూ అన్యాయమే జరిగింది - ఎంత దురదృష్టం!బయోపిక్ అని చెప్పుకోకుండా తీస్తే ఎన్నయినా చెయ్యవచ్చు!ప్రతాపరుద్రీయమే తీసుకోండి - అసలు జరిగినది ఒకటయితే అలా కాకుండా మరోలా జరిగితే బాగుండేది అని అనిపించిన భావాన్ని కధగా మలిచి వాస్తవంగా ఇలాగే జరిగిందేమో అనిపించేటంత సహజంగా ఉంటుంది  ఆ నాటకం.కధాకావ్యం చరిత్ర ఎప్పటికీ కాదు - అలాంటప్పుడు బయోపిక్ అని చెప్పి అసలు ఆమె జీవితంలో ఇతరులు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్ని వదిలెయ్యటం నాకు నచ్చలేదు!
          సావిత్రినే ఏవరో అడిగారు బయోపిక్ రాయమని.తనే వ్త్సాహం చూపించలేదు,"నేను రాయడం మొదలుపెడితే అందర్నీ తిట్టాల్సి వస్తుంది.వాళ్ళనిఈ వీళ్ళనీ తిటినా పోయిన కాలం తిరిగి రాదు.ఒకరన్ లేదు,మా అమ్మ తప్ప అందరూ నాకు ద్రోహమే చేశారు!" అని.దాదాప్ సావిత్రిని అభిమానించేవాళ్ళు అందరూ తిట్టుకుంటున్న జెమినీ గణేశన్ గురించి ఒక్క సావిత్రే కాదు,తనతో కొంతకాలం బతికి విడిపోయిన ఎవ్వరూ చెడుగా మాట్లాదటం లేదు,ఎందుకని?కోరి తెచ్చుకున్న దరిద్రానికి ఎవర్ని తిడితే ఎవరు వూరుకుంటారు?

          ఒకప్పుడు బీదరికంలో బతికి కాలం కలిసొచ్చి కొంత ఐకొచ్చి ఇతర్లై కొడా ఇంకా పైకొస్తారనిఒఇంచే కాలంలో హఠాత్తుగా కిందకి పడిపోయిన అందరూ చ్గేసిన "ఆ ఒక్క అత్ప్పూ చెయ్యకుండా ఉంతే ఎంత బాగుండేది!" అనిపించే సావిత్రి చేసిన ఆ ఒక్క తప్పొ జెమినీ గణేశన్ అనే కామపిశాచిని ఆదర్సప్రేమికుడని నమ్మి పెళ్ళి చేసుకోవడం.అదీ పెంచి పెదద్ చహేసి అతని ఆ స్థాయికి తీసుకొచ్చిన పెద్దమనిషి అదేమితని అడిగితే ఆడబ్బంతా నువ్వే తీస్సుకోమని అన్నింటినీ కాదనుకుని వెళ్ళాల్సీన్ ఉత్తముడా ఆత్ను?కాదే!తను రహస్యంగా పెళ్ళి చేసుకునే నాటికే ఇద్దరు అధికారికమైన భార్యలూ ఉంపుడుకత్తెలు లేక ముండలు అని మనం పిలుచుకునే ఇద్దరు అనధికారీమైన భార్యలూ ఉన్నవాడికోసం తల్లీ బంద్గువులూ మిత్రులొ శ్రేయొభిలాషులూ వద్దని మొత్తుకుంటున్నా వినకుండా వెళ్ళిన అమనిషి ఆత్ని గురించి చెడు మాట్లాడియే,"మరి,ఎందుకు వెళ్ళావు?,ముందు తెలియలేదా?" అని అడుగుతారు కదా!
          సాక్షాత్తూ విజయ చాముండేశ్వరి మీడియా సాక్షిగా తీసినంతవరకు అబద్ధాలు ఏమీ లేవు అని చెప్పిన ఈ సినిమాలోనే వేరే అమ్మాయిని తెచ్చుకుబి కులుకుతున్న సన్నివేశం ఉందిగా - అటువంటివాణ్ణి కూడా "మ నాన్న దేవుడు!" అని పొగుడుతున్న విజయ చాముండేశ్వరిని ముఖం మీదనే వుమ్మెయ్యాలి!వీళ్ళంతా పురుషాధిక్య సమాజపు పక్షపాత బుద్ధిని సమర్ధించే ముండల మిఠాకోరు వెధవల పెంపుడు చిలకలు!నిజానికి జెమినీ గణేశన్ ఇప్పటికీ ఈ ఆదవాళ్ళని కావాలనే అన్యాయం చేశాదని అనటానికి ఒక్క సాక్ష్యం కూడా కనిపించనివ్వని జిత్తులమారి! 

        జెమినీ గణేశన్ తర్వాత తన జీవితంలోకి వచ్చినవాళ్ళకి దూరం అయ్యాడు  గానీ మొదటి భార్యని మాత్రం వదల్లేదు, ఎందుకని? ఆండాళమ్మ తండ్రి బాగా దబున్నవాడు.జెమినీ గనేశన్ కడు బీదవాడు.నాకు వాళ్ళ గురించి అంత ఎక్కువ తెలియదు గాబట్టి వూహిస్తున్నాను - అతను ఆస్తిని కూతురు పేర్న ఉంచి ఉండాలి.ఆమె వరస చూస్తే పూజలూ పునస్కారాలూ తప్ప ఇంకేదీ పట్టించుకోని మనిషిలా ఉంది!కె.రామలక్ష్మి బసవరామతారకం గురించి "జీవితంలో ఆమె చేసిన పనులు నుంచొనుట,కూర్చొనుట,చీరలు ధరించుట,విప్పి మడతలు పెట్టుట,పిల్లలని కనుట" అని చెప్తుంటే నాకు నవ్వాగలేదు.ఆ రకం భార్యలు ఇప్పుడూ ఉన్నారు,ఇకముందు కూడా ఉంటారు.జెమినీ గణేశన్  ఎంత వ్యూహాత్మకమైన సన్నివేశాలని సృష్టించి మురిపించినా అతని జీవితంలోకి వచ్చిన ప్రతి ఆడదీ శలభంలా తనంతట తనే ఈ కామాగ్నిలో దూకిందనేది అందరూ ఒప్పుకోవలసిన నిజం! 

        అయితే వాళ్ళంతట వాళ్లే వచ్చారు,కొంతకాలం ఇతని రొమాంటిక్ సెన్సుని తనివితీరా అనుభవించారు, రొమాన్సు మత్తు దిగాక వదిలేసిపోతే ఇతన్ని వాళ్ళు దుర్మార్గుణ్ణీ చెయ్యడం ఎంతవరకు న్యాయం అని సరిపెట్టుకుందామా?సావిత్రి కష్టాలకి స్వయంకృతమే కారణమా?ఇతని ప్రమేయం ఏమీ లేదా?ఉంది!సావిత్రి పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి చూస్తే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడి ఉండేది లేకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఉండేది కానీ తాగుడుకి బానిసై ఉండేది కాదు.అయితే తాగుడు అలవాటు చేసినవాడు పిల్లతో మాత్రం జాలికబుర్లు చెబుతూ వాళ్ళు దేవుడని భ్రమించేలా నటించి ఉంటాడు.ఒక్క సావిత్రి తప్ప మిగిలిన ఆడవాళ్ళు అతనికన్న తక్కువ స్థాయిలో ఉండబట్టి సుఖపడి వదిలేశాడు.కానీ సావిత్రి అతనికన్న పైకి ఎదుగుతున్నది - !సావిత్రి స్వయంగా అతని ప్రవర్తనలోని వింత లక్షణాన్ని గురించి చెప్పింది.తను డైరెక్షన్ చేస్తానన్నప్పుడు చాలా గట్టిగా వద్దన్నాడట.అయినా పట్టించుకోకుండా తను మొదలుపెడితే ఆ తర్వాత అతని ప్రవర్తన చూసి సావిత్రికే వింతగా అనిపించిందట.తను వద్దన్నాడు - ఓకే!కానీ భార్య కదా,తను వద్దన్నా చేస్తున్నదంటే ముచ్చట పడుతున్నదని సర్దుకుపోవాలా!ఆ సినిమా పనులన్నీ తనకి తెలిసినవే గదా,తనూ సాయం చెయ్యవచ్చు గదా!అబ్బే,ఆ వంకకే రాకుండా దూరంగా తిరిగాడట!గాజుపెంకుని పిడికిట పట్టినట్టు ఇలాంటి సన్నివేశాలు ఎన్ని జరిగితే సావిత్రికి ఇంత నీచుడి మొహం జన్మలో మళ్ళీ చూడకూడదన్నంతగా మనసు విరిగిపోయి ఉండాలి! 

        ఆఖరికి సావిత్రికే విసుగుపుట్టి "నా ఇంట్లో నుంచీ నా జీవితం నుంచీ ఫో!" అన్నాక ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టు మళ్ళీ ఆండాళ్ళమ్మ గూటికే చేరాడు.ఆ తరంలో ఆండాళ్ళమ్మా సమాజమూ జెమినీ గణేశన్  ఎంతమంది ఆడవాళ్ళ బతుకుల్తో ఆడుకున్నా క్షమించింది గనకనే ఈ తరంలో కమలహాసన్,పవన్ కళ్యాణ్ కూడా జెమినీ గణేశన్ దారిలో నడుస్తున్నారు.పేర్లూ మొహాలూ మార్పు తప్ప అవే సన్నివేశాలూ అవే కబుర్లూ అవే మోహాలూ అవే అహంకారాలూ అవే విషాదాలు రిపీట్ అవుతున్నాయి.ఈ కధలు అన్నింటిలోనూ మగవాళ్ళకి మళ్ళీ ఆడవాళ్ళు దొరుకుతున్నారు గానీ ఆడవాళ్ళకి మాత్రం మిగులుతున్నది జీవితకాలపు ఒంటరి బతుకే!మరో పెళ్ళి చేసుకునే ఉద్దేశం వెలిబుచ్చినందుకే కాపు క్షత్రియ వీరులు ప్రకృతి విరుద్ధమైన పాపకార్యం యేదో జరిపోతున్నంత ఆవేశపడిపోయి పవన్ ఆనే తమ గాడ్ తరపున భీబత్సప్రదర్శనలతో పవన్ కళ్యాణ్ పక్కలో పడుకున్న ఆదది మరో మగాడి పక్కలో పడుకోకుండా నిగ్రహించి దైవద్రోహం జరక్కుండా ఆపారు.
          ఆడవాళ్ళు సెలెబ్రిటీ మొగుళ్ళ కోసం యెగేసుకుపోయే ముందు ఒక్కసారి సావిత్రిని గుర్తు చేసుకుంటే కమలహాసన్,పవన్ కళ్యాణ్ లాంటివాళ్ళకి అంతమంది పెళ్ళాలు దొరికేవాళ్ళు కాదు గదా!


అదీ మనం సావిత్రి జీవితం నుంచి నేర్చుకోవలసిన పాఠం - పురుషుల్లారా వర్ధిల్లండి!

Thursday 24 May 2018

చంద్రబాబు ప్రభుత్వం తిరుమల ఆలయంలో జరుగుతున్నవాటి పట్ల స్పందిస్తున్న తీరు అసలుకే మోసం తెచ్చి వచ్చే ఎన్నికల్లో ఓటమిని చూపించవచ్చు!

"ఈడి కొడుకు ఇలాగే గోరోజనం చూపీస్తే బ్రహ్మోత్సవాల టైంలో మంగాపురం ట్రాన్స్ఫర్ చేసారు"
hari.S.babu
హిందూ పుటక పుట్టి మతం మీద గౌరవం ఉన్నవాడు మాట్లాడాల్సిన భాష ఇదేనా?వీళ్ళా హిందూమతానికి ప్రతినిధులు?క్రైస్తవుల్నీ,హిందూమతద్వేషుల్నీ TTD బోర్డులో సభ్యులుగా, చైర్మన్లుగా పెట్టి అది తప్పు అంటుంటే వేదం చదివిన బ్రాహణులని గురించి ఇలా మాట్లాడేవాళ్ళు హిందువులా?"దేవుడికి కోపం వస్తుందా?కోపం వస్తే దేవుడా?" అని అంటున్నవాళ్ళకి మతంలో బేసిక్స్ అయినా తెలుసా?అధర్మం జరిగితే దేవుడికి కోపం రాదా?దేవుడు మీ చప్రాసీయా?యెహోవా రోషము గల దేవుడు అని క్రైస్తవులు చెప్పడం లేదా?ఖురాను ధర్మం పాటించకపోతే అల్లా కోపిస్తాడు అని ముల్లాలు చెప్పడం లేదా?అధర్మం పెరిగినప్పుడు దేవుడు అవతరించి అధర్మ నిధనం చేస్తాడని చెబుతున్న భగవద్గీత చదవలేదా వీళ్ళు?

నేను అసలు ఈ వివాదం గురించి పోష్టు రాయాలని మొదట్లో అనుకోలేదు.దానికి కారణం నా వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక చింతనలో ఆలయసందర్శనం అంత ముఖ్యమైనది కాదు.అసలు నియమం ప్రకారం వేళలు పెట్టుక్కుని పూజ చెయ్యాలని కూడా అనిపించదు.అయితే,ధ్యానం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.ఒక చర్చలో నీహారిక మీకు మోక్షం అక్కర్లేదా అనే అర్ధంతో ప్రశ్న వేస్తే అక్కర్లేదనే చెప్పాను.అంతకు ముందే నా బ్లాగు దగ్గిరే చంద్రిక గారు నేను సనాతనుణ్ణి అని చెప్పుకోవడం గురించి అధిక్షేపం లాంటి సందేహం వెలిబుచ్చితే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే ఏదో ఒక నాటికి "అహం బ్రహ్మాస్మి!" అనుకోగలగడం సాధ్యమే కదా, నేను అలా అనుకోగలుగుతున్నాను కాబట్టి చెప్పుకుంటున్నాను, అందులో తప్పేమీ లేదని చెప్పాను.చాలా కాలం క్రితమే నా గురించి "నేను ద్విబాహు రపరో హరిని!" అని కూడా చెప్పుకున్నాను.

మన చుట్టూ ఉన్న విశ్వంలోని ప్రతి వ్యవస్థలోనూ అంతరువులు ఉన్నాయి, ఉంటాయి, ఉండాలి కూడా!నేను చదివిన బయాలజీలో ఎకాలజీ చాలా ముఖ్యమైన భాగం.అందులో దాదాపు నాలుగు రకాల పిరమిడికల్ ఓరియంటేషన్ గురించిన సూత్రీకరణలు ఉంటాయి.వాటిలో ముఖ్యమైనది ఫుడ్ పిరమిడ్ - స్వయంపోషకాలైన మొక్కలు 100 ఉంటే వాటిని తిని బతికే శాకాహారులు 10, శాకాహారులు 100 ఉంటే మొక్కల్ని తినలేక శాకాహారుల్ని తినే మాంసాహారులు 10 అన్నట్టు ఉంటుంది ఈ ఆమరిక.అయితే,ఇవి స్థిరమైన అంతరువులు కాదు.వీటన్నిటిని చచ్చిపోయాక కుళ్ళబెట్టే సూక్ష్మజీవులూ,సొతంగా ఆహారసంపాదన చెయ్యకుండా బతికే పరాన్న జీవులూ, ఒకరు లేకుండా మరొకరు జీవించలేని Symbionts కొన్నీ కలిసి చాలా సంక్లిష్టమైన జీవవైవిధ్యం ఉంది ఇక్కడ. సంక్లిష్టమైన విషయాల్ని అర్ధం చేసుకోవడానికి మొదటి దశలో వాటిని విడి అస్తిత్వంలో చూసి అక్కడే ఆగిపోయేవాళ్ళు కొందరయితే,కొంత జ్ఞానం పెరిగాక ప్రతి అస్తిత్వాన్నీ దాని పితృసోదరసంతాన సంబంధంతో కలిపి చూడగలిగిన నా ఆలోచనా స్థాయి మిగిలిన వాళ్ళకన్న ప్రత్యేకంగానే ఉంటుంది.కానీ కమ్యునిష్టుల మాదిరి అందరూ నా స్థాయిలోనే ఆలొచిస్తే చాలు వర్గరహితసమాజం ఏర్పడిపోతుంది అనుకునే మూర్ఖత్వం నాకు లేదు.

నాకు ఆలయాలతో పనిలేదు కాబట్టి తిరుమలలో ఏం జరిగితే నాకేమిటి అని అనుకోలేక కొంత కుతూహలం చూపించి వాదనల్లో నా అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టాను.తీరా చూస్తే ప్రతి ఒక్కరూ గందరగోళంలో ఉన్నట్టు నాకు అర్ధం అయ్యింది.ఇప్పుడున్న గందరగోళం వల్ల పరిస్థితి ఎలా తయారయ్యిందంటే త్వరగా సమస్యకి పరిష్కారం కనుక్కుని గొడవల్ని చల్లార్చకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజకీయ అస్తిత్వమే పునాదులతో సహా కదిలిపోతందేమోనని అనిపిస్తున్నది!

అతిగా స్పందిస్తున్నాననో,భయపెట్టడానికి చెబుతున్నాననో అనుకోకండి - ప్రస్తుతం తిరుమల చుట్టూ నడుస్తున్న జగన్నాటకం ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక జాతీయపార్టీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ. మున్ముందు రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న ఒక ప్రాంతీయ పార్టీ మధ్య నడుస్తున్నది.వాళ్ళలో ఎవరో ఒకరు తగ్గనంతవరకు ఈ వివాదం చల్లారదు.ఈ మూడు పార్టీలలో వయ్యస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్ది క్రైస్తవుడని అంటారు.అయితే,పుష్కరాల సమయంలో తండ్రికి హిందూ విధిలో శ్రాధకర్మలు చేశాడు,తరచు తిరుమలకి వస్తాడు - వాదన కోసం ఇవన్నీ ప్రజల్లో అధిక శాతం హిందువుల్ని బుజ్జగించటానికో ఈ దేవుడి కటాక్షం వల్లనైనా అధికారంలోకి వస్తాననే ఆశతోనో చేస్తున్నాడని అనుకుంటే అతనికి తిరుమల పవిత్రతని చెడగొట్టడం అనేది పెద్ద తప్పు అనిపించకపోవచ్చు.కానీ అప్పుడప్పుడూ మసీదుకు వెళ్ళి ముస్లిములతో కలిసి మోకాటి తండా వేసినా చంద్రబాబు నికార్సైన హిందువే కదా!ఇక భాజపా వాళ్ళు పదహారణాల హిందూత్వ వాదులు!మరి ఈ రెండు పార్టీల్లోనూ ఉన్న హిందువులు ఆలయం చుట్టూ ఇంత నీచమయిన వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు?

ఒక ముస్లిం రాజకీయ వేత్త తన రాజకీయ ప్రయోజనాల కోసం తన మతానికి ద్రోహం చెయ్యడు,ఒక క్రైస్తవ రాజకీయ వేత్త తన రాజకీయ ప్రయోజనాల కోసం తన మతానికి ద్రోహం చెయ్యడు - మరి,హిందూ రాజకీయ వేత్తలు మాత్రమే ఎందుకు చేస్తున్నారు?ఇప్పుడే కాదు, రాజకీయ రంగంలో ఆధిక్యతని సాధించాలనుకుని, సాధించిన దాన్ని నిలబెట్టుకోవాలని ఆశించే రాజకీయ హిందువులు ఏనాడూ మతం పట్ల నిబద్ధతని చూపించలేదు.ముస్లిములకి ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించడమే కాకుండా ఇతర చోట్ల కూడా ముస్లిం అబ్యర్ధుల్ని నిలబెట్టి కాంగ్రెసు అంత సహకరించినా ఆ ఎన్నికల ఫలితాలు సామాన్య ప్రజలలో హిందువులే కాదు ముస్లిములు కూడా విభజనని వ్యతిరేకిస్తున్నారని తెలియజెప్పిన తర్వాత కూడా ఈ దేశం మత ప్రాతిపదికన చీలడానికి అతి ముఖ్యమైన మలుపు గాంధీ జిన్నాని కలవటం!ఇప్పుడు మనకి చెబుతున్న గాంధీ చేసిన ప్లెబిసైట్ ప్రపోజల్ నాకు నమ్మదగ్గదిగా లేదునిన్నటికి నిన్న అత్యంత పారదర్శకంగా జరిగిన ఎన్నికలు పాకిస్తాన్ ఏర్పాటుకి ముస్లిములు కూడా విముఖమే అని తేల్చి చెప్పేశాక అంత కాలం రాజకీయాల్లో గడిపిన మనిషి ప్లెబిసైటుతో అద్భుతాలు జరుగుతాయనుకోవటం ఎలా సాధ్యం?నా విశ్లేషణ ఏమిటంటే, అప్పటి హిందూ రాజకీయ నాయకులు కూడా అప్పటికే పాకిస్తాన్ ఏర్పాటుని ఆమోదించేశారు.ప్రజలు దానికి వ్యతిరేకమైన ఫలితం ఇవ్వడం వారికీ మింగుడు పడలేదు,గాంధీ అక్కడ జిన్నాకి "విభజనకి మేము కూడా అనుకూలమే,నువ్వు పాకిస్తాన్ ఏలా సాధించుకున్నా మాకు అభ్యంతరం లేదు సుమా!" అనే సూచన ఇచ్చి ఉంటాడని నా నమ్మకం.గాలి పోగేసి చెప్పడం లేదు,అప్పటి హిందూ నాయకుల ప్రకటనలు కూడా "హిందువులు మొగలాయీ పాలకుల కాలంలో కష్టాలకి గురయ్యారు.క్రైస్తవులైనా ఇంగ్లీషువాళ్లు మనకి న్యాయమైన పరిపాలననే అందించారు.ఇంగ్లీషువాళ్ళని వెళ్ళగొడితే మళ్ళీ ముస్లిములు అధికారంలోకి వచ్చేస్తారు.వాళ్ళు మనల్ని బతకనివ్వరు" ఆనే పద్ధతిలో ఉండేవి - సరిగ్గా హిందువుల గురించి ముస్లిము నాయకుల వాదన కూడా ఇదే కదా!ఈ దేశం విడిపోకుండా ఉంటే జిన్నాయే తొలి ప్రధానమంత్రి అయి ఉండేవాడు.అది వాళ్ళకి గిట్టక వాళ్ళ రాజకీయం వాళ్ళు చేశారు.ఫలితం వేదం పుట్టిన గడ్డ అని చెప్పుకునే హరప్పా మొహెంజెదారోలు ముస్లిముల అధీనంలోకి వెళ్ళిపోయాయి.

పోనీ గదా, వాళ్లకో దేశం ఇచ్చి పంపించేశారు గనక ఇక తమ మతానికి న్యాయం చేస్తారని అనుకుంటే తమ ఉంపుడుకత్తెల వంటి చరిత్రకారులతో శ్రీరాముడు నిర్మించి ఉంటాడని భావిస్తున్న పరమ పవిత్రమైన హిందూ ఆలయానికి కుతుబుద్దీన్ ఐబక్ కట్టిన తొలి ఇస్లామిక్ కట్టడం హోదాని కట్టబెట్టడం కోసం చెప్పకూడని అబద్ధాల్ని అన్నిట్నీ చెప్పేశారు!"అక్బర్ ది గ్రేట్!", "చెంఘిజ్ ఖాన్ ది గ్రేట్!", "అలెగ్జాండర్ ది గ్రేట్!", "కనిష్క ది గ్రేట్!" అని హైందవేతరులకి అన్ని గ్రేట్లు ఇచ్చినవాళ్ళకి హిందువుల్లో ఒక్కడు కూడా గ్రేట్ అని పిలవదగ్గవాడు కనిపించలేదు, ఎందుకు?స్వతంత్రం వచ్చిన దగ్గిర్నుంచీ హిందువుల్ని భయంకరమైన మతతత్వవాదులుగా ముద్రవేసి అల్లరి చెసినవాళ్ళని ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది హిందువులు కాదా?నెహ్రూ ఎవరు?కాశ్మీరీ బ్రాహ్మణుడు కాదా?వెనకటి చరిత్ర దేనికి?లల్లూ యాదవ్ హిందువు కాదా?ములాయం సంగతి ఏంటి?మాయావతి ఎవరు?లింగాయతుల్ని రెచ్చగొట్టిన సిద్ధరామయ్య ఎవరు?తన గనుల కోసం సుంకులమ్మ గుడిని పడగొట్టిన గాలి రెడ్ది హిందువు కాదా?నిజాం ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలు నడిపిన వాళ్లలో, ప్రత్యేకించి కమ్యునిష్టు పార్టీలోనే ముస్లిములు కూడా ఉన్నారు - వాళ్ళెవరూ ఇస్లాము గురించి చెడుగా మాట్లాడలేదే!

ఎప్పటికైనా రాజకీయ హిందువులకి మతాభిమానం పెంచడం సాధ్యమా కాదా అన్నది పక్కనపెట్టి ఇప్పటి సమస్య మూలాన్ని వెతికితే భాజపాకీ తెదెపాకీ తెగిన మైత్రీబంధమే అసలు కారణం అని తెలుస్తున్నది.వయ్యస్సార్ కాంగ్రెసు  తెదెపాని ఇరుకున పెట్టడానికి ప్రత్యేక హోదా విషయంలో అల్లరి చెయ్యటం తప్ప తిరుమల వివాదం విషయంలో వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు.

అయితే, ఆదినుంచీ హోదా విషయంలో ఎవరు అల్లరి చేసినా వాళ్ళు మాకూ భాజపాకీ పుల్లలు పెట్టటానికే చేస్తున్నారు తప్ప వాళ్ళకి రాష్ట్రం పట్ల చిత్తశుద్ద్జిలేదు అని కొట్టిపారేస్తూ తెలివి చూపించిన తెదెపా వాళ్ళు చివరాఖరికి ఎత్తెత్తి వేసిన కాలు ఎంగిలాకులో వేసినట్టు భాపాతో తెగదెంపులు చేసుకోవడం ఈజగన్నాతకంలో తొలి అంకం!దీనికి సాక్ష్యం వీళ్ళిద్దరూ అనుకూలంగా ఉన్నప్పుడే పుట్టా సుధాకర యాదవ్ గురించి ఒక ఫొటోని పట్టుకుని గొడవ చేసి తెదెపా నియామకాన్ని వాయిదా వేసి చెప్పిన జవాబుతో చల్లబడి తేడాలు వచ్చాక తెదెపా పుట్టాని కుర్చీ ఎక్కించగానే భాజ్పా అదే విషయం గురించి మళ్ళీ రచ్చ మొదలుపెట్టటమే.రమణ దీక్షితులు పక్కన భాజపా నాయకులు ఉండడం భాజపా వాళ్ళు ఉద్దేశ పూర్వకంగానే తిరుమలని తమ రాజకీయాలకి వాడుకుంటున్నారు అనుకోవడానికి మరొక సాక్ష్యం!

రమణ దీక్షితులు తనకి వ్యక్తిగతమైన నష్టాలు ఏర్పడటం వల్ల భాజపాని తోడు తీసుకుని గొడవ చేసినా, నిజమైన ఆర్తితోనే అధికారంలో ఉన్నవాళ్ళని ఎదుర్కోవటానికి బలమైన అండ తీసుకుని గొడవ చేసినా అతన్ని తప్పు పట్టాల్సిన పని లేదు.అతను చేస్తున్న ఆరోపణలు కొత్తవీ కావు, అతనొక్కడే చేస్తున్నవీ కావు.ఎప్పటినుంచో జియ్యర్ స్వామి చేస్తున్న ఆరోపణలు కూడా ఇవే.మరీ చిత్రం ఏమిటంటే, రమణ దీక్షితుల్ని విమర్శిస్తున్నవాళ్ళు "కొన్ని ఏళ్ళ క్రితం జరిగినవాటిని గురించి ఇప్పుడు గొడవ చేస్తున్నారే, ఇన్నాళ్ళూ ఏమి చేశారు?" అనీ "ఆలయం పరువు తీస్తున్నందుకు సిగ్గుగా లేదా?" అనీ అంటున్నారు - దీని అర్ధం ఏమిటి?అప్పుడు ఆడగకపోవటాన్నీ వాళ్ళే తప్పు పడుతున్నారు,ఇప్పుడు అడగటాన్నీ వాళ్ళే తప్పు పడుతున్నారునేను మొట్టమొదట స్పందించిన ఫేస్ బుక్ పోష్టు దగ్గిరే ఈ పోష్టులో మొదట చూపించిన ఆణిముత్యం కనబడింది.

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో పోరాటం ఈ మూడున్నరేళ్ళూ చేయకుండా ఇప్పుడు గొడవ పడుతున్నారే.... అని అడిగితే చాలా రోజులు ఆలోచించుకుని బాబు గారు ఏం చెప్పారో గుర్తుందా.... సరైన సమయంలోనే సరైన నిర్ణయాలు తీసుకోవాలని జగ్జీవన్ రామ్ గారు చెప్పారట. ఇప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నానని బాబు గారు అంటున్నట్టే... రమణ దీక్షితులు గారికీ సరైన సమయం ఇప్పుడు వచ్చిందేమో.ఆ వ్యాసం రాసిన వ్యక్తి తెదెపా మూలస్తంభం - అవును కదా!"ఈ చెత్త వెధవలకి ఎంత ముష్టి వేసినా మనకి వోట్లు వేసి చావడం లేదు!డూడూ బసవన్నల్లాగ మనం ఏం చేసినా తలలూపి చావడం లేదు!" అనే అహంకారపు విసుగు పుష్కలంగా కనిపిస్తున్నది.ఇంకా అక్కడ ఈ వ్యాసకర్తని పొగుడుతున్నచాళ్ళు కూడా అదే ధోరణిలో ఉన్నారు..

బ్రాహ్మలు వేదాల్ని అట్టే పెట్టుకోవడం వల్లనే అన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి,మాకూ నేర్పండి అని కంచె ఐలయ్య తరహాలో రెచ్చిపోతున్నవాళ్ళకి నిజంగా నేర్చుకుని అర్చక వృత్తి చేపట్టే దమ్ము ఉందా?ఇప్పుడు వేదాలు అచ్చులోనూ దొరుకుతున్నాయి.కొనుక్కుని చదివి అర్చకవృత్తికి అర్హత సంపాదించుకుని రండి!

టీడీపీ అంత కులపిచ్చి పార్టీ ఇంకెక్కడా లేదు అని వాగిన దద్దమ్మకి చంద్రబాబు అనంతరం సీ.యం పోష్టు గ్యారెంటీ కావడానికి కారణం ఏమిటి?అది వంశపారంపర్యం కాదా?లేదంటే తెదెపాలో ముఖ్యమంత్రి కావడానికి అంతకన్న సమర్ధుడు ఇంకెవడూ లేడన్నంతగా పార్టీ గొడ్డుపోయిందా - ముఖ్యమంత్రి పదవి ఆ బుజ్జాయికే ధారపొయ్యడానికి!రాజ్యాంగాన్ని కూడా నవ్వులపాలు చేస్తూ మీ లీడర్లకి వంశపారంపర్యం కావాలా?ఆగమాల ప్రకారం హక్కు ఉన్న అర్చకులకి పూజారిత్వానికి వంశపారంపర్యం అక్కర్లేదా?

వేదం మాకూ నేర్పండి అనే వాహినీ వారి పెద్దమనుషులకి నేను చాలెంజి చెస్తున్నా - మీ పిల్లల్ని గానీ మనవల్ని గానీ ఉద్యోగాలూ వైభవలూ తెచ్చే చదువులు మానిపించి వేదపాఠశాలకి పంపించగలరా?ఇంట్లో పిల్లాడు పుడితే నామకరణ జరపాలంటే బ్రాహ్మడు కావాలి,తండ్రి చస్తే తద్దినం పెట్టాలంటే బ్రాహ్మడు కావాలి.అవసరం వచ్చినప్పుడు "పంతులు గారూ!మీరు లేందే పని జరగదండీ!బాబ్బాబు - రండి,రండి!" అని కాళ్ళూ గడ్డాలూ పట్టుకోవటం, అవసరం లేనప్పుడు "బోడి బ్రాహ్మలు,వీళ్ళు లేకపోతే గడవదా!" అనటం - ఇదేమి సంస్కారం?

బ్రాహ్మల చాదస్తం మూలంగా మతం మారుతున్నారా?ఇప్పుడు మీరు పీకుతున్నది ఏంటి?తెల్లారి లేస్తే రోజంతా చర్చిల చుట్టూ తిరిగేవాడు తప్ప హిందూ దేవాలయం బోర్డు చైర్మను పదవికి నీకు ఏ హిందువూ దొరకలేదా?అంటే అన్నందుకు బ్రాహ్మల్ని తిడతారా?హిందూమతం భ్రష్టు పట్టిపోయినా పర్లేదు,నా రాజకీయం నేను చేసుకుంటాను అనేవాడు హిందూమతాన్ని ఉద్ధరిస్తాడా?ఆలయాల్ని రాజకీయాలకి అతీతంగా ఉంచమన్నవాడు మతానికి ద్రోహం చేస్తున్నట్టా?ఏం తెలివి మీది!?

రాష్ట్రంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.కొన్ని గుళ్ళలో రోజూ దీపం పెట్టె దిక్కు కూడా లేదు.మరి ఈ పుట్టా లాంటి గొట్టాం గాళ్ళని వాటిని ఉద్ధరించడానికి పంపించరేం?టీటీడీ చైర్మన్ పదవికే ఇన్ని రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు?ఆగిరిపల్లి వ్యాఘ్రలక్షీనృసింహస్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవికి ఎందుకు పోటీలు పడటం లేదు?నాకోసం/నాకు నచ్చినవాడి కోసం పూజల వేళల్ని మార్చమని చెప్పినవాడు నోటికి అన్నమా?గడ్డియా?అశుద్ధమా?అక్కడున్నది కేవలం విగ్రహమని నాస్తికులు అనుకుంటే తప్పు లేదు,కానీ హిందూ పుటక పుట్టి ఆగమాల ప్రకారం జరగాల్సిన పూజల్ని జరగనివ్వనివాడు అసలు భక్తుడేనా?

అర్చకత్వానికి ఏమన్నా రాజకీయ నాయకులకి వచ్చినట్టు లక్షల కోట్ల కాంట్రాక్టులు వస్తాయా?మాలిక్యులర్ ఫిజిక్స్ చదివి ఉద్యోగం ఖాయమని తెలిసినా నాకు అక్కర్లేదని స్వామి సేవకి అంకితమైనవాడు మీకు అనామకుడిలా కనబడుతున్నాడా!

.ప్రపంచం నలుమూలల నుంచి ఈ దేవుడికి మహత్యాలు ఉన్నాయని నమ్మి వస్తున్న భక్తులకి మీ చెత్త రాజకీయాలు చూసి అసహ్యం వెయ్యదా?అలిపిరిలో మా నాయకుడికి ప్రాణం పోశాడు తిరుమల దేవుడు అనే బాబు భక్తులకి ఆ స్వామికి ఆ మహత్యం ఎట్లా వచ్చిందో తెలియదా?టీటీడీ బోర్డు చైర్మన్ వల్లనా?వేద పండితుల మంత్రబలం వల్లనా?తిరుమలకి వచ్చే భక్తులని అడగండి  చైర్మను పుట్టా సుధాకర్ యాదవ్ కోసమా పూజారి రమణ దీక్షితుల కోసమా మీరు వస్తున్నది అని - వాళ్ళే గడ్డి పెడతారు!

అయినా బెజేపీ టీడెపీకి శత్రుపక్షం ఎప్పుడు అయ్యింది?2014లో బీజేపీ తమకి ఇచ్చిన స్థానాల్లో చెత్త క్యాండిడేట్లని పెట్టి మిత్రద్రోహం చెయ్యాలని చూసింది, గుర్తు లేదా?అప్పుడు పెద్ద గొడవే జరిగింది,నేనొక పోష్టు కూడా వేశాను,మీ నాయకుడు కూడా ఆఖరి నిమిషాల్లో కొన్ని స్థానాల్ని వెనక్కి తీసుకున్నట్టు గుర్తు!ఎక్కడో చెన్నయిలో కూర్చుని పేపర్లు చదివి విషయాలు తెలుసుకునే నాకు ఇలాంటి పార్టీతో అతిగా అంటకాగడం తప్పు.దూరంగా ఉండి పోట్లాడి సాధించుకోవడమే మంచిది అనిపించింది - నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం గల మీ నాయకుడికి ఆమాత్రం కామన్ సెన్సు కూడా లేదా?

ఎన్నికల్లో అంత ద్రోహం చేసిన పార్టీ వెంఠనే నలుగురు మంత్రుల్ని వాళ్ళ పక్కలో పడుకోబెట్టేటంత మిత్రపక్షం ఎట్లా అయింది?మోదీ అంత మంచివాడు ఒంకెక్కడా లేడు అని సంవత్సరం క్రితం వరకూ చంద్రబాబే పొగిడాడు కదా,చెంబుడు నీళ్ళూ కుండెడు మట్టీ ఇచ్చినప్పుడూ పోట్లాడలేదు,ఆర్ధికసంఘం సపోర్టు చేస్తున్నా నిధులు ఇవ్వట్లేదని తెలిసినప్పుడూ కోపం రాలేదు,మనకి ఇవ్వమని అడిగినప్పుడు మిగిలిన వాళ్ళకీ ఎత్తేస్తాం అని చెప్పిన ప్రత్యేక హోదాని మనకి తప్ప అందరికీ ఇస్తూనే ఉన్నారని తెలిసినప్పుడూ కోపం రాలేదు - అన్యాయాలు జరుగుతున్నప్పుడు రాని కోపం మీకు ఇపుడెందుకు వచ్చింది అనే ప్రశ్నకి మీరు ఏమి జవాబు చెప్తారు?

"నీ తప్పుల్లొ మచ్చుకి వెయ్యికాళ్ళమండపం కూల్చాలని సలహాచ్చి బాబుని అలిపిరి దెబ్బకు గురిచేసావు"
hari.S.babu
ఏమిటి దీని అర్ధం?అలిపిరి దగ్గిర నక్సలైట్లు చేసిన దానికి కూడా రమణ దీక్షితులే కారణమా?కుక్కని కొడితే తప్పు కాబట్టి పిచ్చికుక్క అని ముద్ర వెయ్యడం కాదా ఇది?అతను గానీ జియ్యర్ స్వామి గానీ ప్రస్తావించిన తప్పుల్లో ఒకదానికి కూడా జవాబు చెప్పకుండా ఇకముందు అలాంటి తప్పులు జరగనివ్వం అని చెప్పకుండా దీక్షితులు మీద ఎదురుదాడి చెయ్యడంలోనే తెదెపా వాళ్ళ దుర్మార్గం తెలియడం లేదా?

టీడీపీ వాళ్ళు గమనించాల్సినది యేమిటంటే, నాతో సహా సామాన్య హిందువులు ఎవ్వరూ రమణ దీక్షితుల్ని టార్గెట్ చేసి హడావిడి చేస్తే చాలుననే ఎత్తుగడని మెచ్చుకోలేరు.అక్కడున్న అసలు సమస్య ఆలయాల మీద ప్రభుత్వం యొక్క అతి పెత్తనం అయినప్పుడు దాన్ని పట్టించుకుని ఆలయాలని రాజకీయాలకి దూరంగా ఉంచడంలో నిజాయితీ చూపిస్తే టీడీపీ పట్ల హిందువుల్లో ఉన్న వ్యతిరేకత తగ్గుతుంది.

హిందువులు ఇదివరకట్లా లేరు.2014లో జాతీయస్థాయిలో భాజపా గెలుపు ముస్లిముల్నీ క్రైస్తవుల్నీ బుజ్జగిస్తూ హిందువుల్ని పట్టించుకోని సెక్యులర్ పార్టీల మీద హిందువులకి ఉన్న కోపం వల్ల సాధ్యపడింది - మొదటిసారి హిందువులు ఓటుబ్యాంకుగా మారి తమకిష్టమైన ఒక పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు.

ఏ ప్రాంతంలోనైనా సరే హిందువులు వోటుబ్యాంకుగా మారితే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అది బీజేపీకే లాభం.ఇవ్వాళ లింగాయతుల్ని రెచ్చగొట్టింది కాంగ్రెసు అయినా ముందుముందు వాళ్ళని తేలిగ్గా బీజేపీ లాక్కోగలదు - చూస్తూ ఉండండి!
తెదెపా తిరుమల విషయంలో తెలివిగా వ్యవహరించి సమస్యని సానుకూలంగా పరిష్కరించకపోతే అంధ్రాలో కూడా హిందువులు బలమైన వోటుబ్యాంకుగా మారిపోతారు - తస్మాత్ జాగ్రత్త!

ప్రత్యేక హోదా అనేది ఎప్పుడూ సమస్య కానే కాదు.ప్రతిపక్షం చేసే గొదవ ఎప్పుడూ ఉన్నదే గానీ ప్రజలు పట్టించుకోవటం లేదని అందరికీ తెలిసినదే అయినప్పుదు అనువు గాని సమయంలో తెగదెంపులు చేసుకోవడానికి సమబంధించి నా వూహ యేమిటంటే బాబుకీ మోదీకీ ఎగో ప్రాబ్లెంస్ వచ్చి ఉండాలి.కర్నాటక గురించి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి బీజీపీకి నష్టం చేశాక మళ్ళీ కలవడం ఇక కుదిరే పని కాదు.2019లో ఓడిపోతే బీజేపీకి నష్టం ఏమీ లేదు.కానీ టీడీపీ ఐక మళ్ళీ కోలుకోలేదు!టీడీపీ ఓడిపోవాలని కోరుకునేటంత శాడిజం నాలో లేదు.ప్రజల్లో కూడా బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా బాబు నెట్టుకు రాగలడు అని నమ్మకం కలిగించిన చంద్రబాబు నాయకత్వ పటిమ గొప్పదే,అందులో సందేహం అక్కర్లేదు.

బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యడానికి అన్ని గతిలేని పనులు చెయ్యాల్సి రావడం కాంగ్రెసు క్రమేణా బలం పుంజుకుంటున్నదనే దానికి సంకేతం - అది వాళ్ళకి అర్ధం కావడం లేదు!బండ పద్ధతుల్లో అప్పటికి అధికారం దక్కితే దక్కవచ్చు గాక,వాటి నుంచి పాఠం నేర్చుకోవటం లేదు వాళ్ళు.అధికారంలో లేని కాంగ్రెస్ ఏమి మంచి పనులు చేసిందని ప్రజలు కాంగ్రెసుకి అంత బలం ఇస్తున్నారు?తమ పట్ల వ్యతిరేకత కాదా!ఒక వోటరు తను వోటు వేసిన పార్టీ అధికారంలోకి వస్తే సంతోషిస్తాడు,అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా రాకపోతే అందుకు కారణమైనవాణ్ణి మరింత ద్వేషిస్తాడు - ఇది జస్ట్ కామన్ సెన్సుతో ఆలోచించినా తెలిసే నిజం!2019 ఎలెక్షన్స్ బీజేపీకి నల్లేరు మీద బండి నడక కాదు - ప్రతికూలతలే ఎక్కువ ఉన్నాయి.కర్నాటకలో మిగిలిన అన్ని అంశాలతో పాటు చంద్రబాబు స్టేట్మెంటు కూడా పనిచేసింది.ఎన్నికల తర్వాత 2014లో కన్న బలహీనపడినప్పుడు చంద్రబాబు అవసరం తప్పనిసరి!

అట్లాగే తెదెపాకీ 2019లో రాష్ట్రస్థాయిలో మెజారిటీ తెచ్చుకోవటం తెలిక కాదు.తెదెపా ప్రత్యేకహోదా విషయంలో బీజేపీని బ్లేం చేస్తే సరిపోతుందని అనుకోకూడదు - నేనే అడుగుతున్నాను కదా,నాలుగేళ్ళు ఏం పీకారని!చాకిరేవు బాబు గారు తెదెపా వీరాభిమాని.అయనే తెదెపాకి ఉన్న సంస్థాగతమైన బలహీనతల్ని ఏకరువు పెట్టాడు.ఇట్లా ఎవరి బలహీనతలు వాళ్ళకి ఉన్నప్పుడు సాక్షాత్తూ తిరుమలనే రణరంగం చేసుకుని మొత్తం హిందూమతాన్నే భ్రష్టు పట్టించే స్థాయిలో అహాలకి పోతూ ఇద్దరూ నష్టపోయేకన్న ఎన్నికలకి ముందే విభేదాల్ని పరిష్కరించుకుంటే ఇద్దరూ లాభపడతారు.బీజేపీకి ఫర్వాలేదు గానీ కొడుక్కి తరిఫీదు ఇచ్చి చంద్రబాబు రిటైర్ అవ్వాల్సిన సమయంలో అధికారం పోతే తెలుగుదేశానికి జరిగే నష్టమే ఎక్కువ.

కాబట్టి రాష్ట్రప్రభుత్వం రమణ దీక్షితుల్ని టార్గెట్ చేసి బీజేపీని ఎక్స్పోజ్ చేసి ఏదో సాదించుదాం అనే ప్లాను మానేసి శత్రువుని వూహించని చోట కొట్టి గెలవడానికి అంది వచ్చిన అవకాశంగా దీన్ని ఉపయోగించుకుని చిత్తశుద్ధితో తిరుమలని రాజకీయాల నుంచి దూరం పెట్టడమే మంచిది.బీజేపీ కోరుకుంటున్నది రాష్ట్రంలో ఎక్కువ సీట్లలో గెలవడం కాబోలు - దానికి సంబంధించిన బేరసారాల్లో చొరవ చూపిస్తే వాళ్ళు కూడా దారికి రావచ్చు.2014లో ఎన్నికల్లో బెండు కొట్టడాన్ని మర్చిపోయి వెంఠనే మిత్రపక్షం అయిపోవడమే అసలైన తప్పు,పదే పదే అన్యాయాలు జరుగుతున్నా పోరాటపంధాకి వెళ్ళకపోవడం తీవ్రమైన తప్పుఅన్నేళ్ళు ఆగినవాళ్ళు ఎన్నికలు నెత్తిమీదకి వచ్చిన సమయంలో తందరపడి ఒంటరి కావడం ఘోరమైన తప్పు - ఇన్ని తప్పులు చేశాక అహంకరించి ప్రయోజనం లేదు.ఈ రెండు పార్టీలూ ఒక్కటి కావటానికి చొరవ తెదెపా చూపించాలి, తెలివి భాజపా చూపించాలి!

ఆలయాలు ఆగమశాస్త్రం ప్రకారమే నడవాలి!ముస్లిం వక్ఫ్ బోర్డుకి నియామకాలు ఎలా జరుగుతాయో తెలుసా!అవి కూడ ప్రభుత్వ సంస్థలే, మెంబర్ల దగ్గిర్నుంచీ అన్ని స్థానాలకీ వాళ్ళే నిర్ణయాలు తీసుకుని పేర్లని ప్రభుత్వానికి పంపిస్తే అనుమతులు మాత్రం ఇస్తారే తప్ప ఇలా పైనుంచి నియామకాలు జరపరు.వక్ఫ్ బోర్డులకి సంబంధించిన వివాదం ఏదన్నా వస్తే చాలు - అర్జెంటుగా స్పందించి వాటిని పరిష్కరించేసి వాళ్ళని సంతోష పెడతారు.మరి హిందూ ఆలయాల మీద మాత్రం అధికారుల పెత్తనం దేనికి?

భక్తుల విషయంలో ఉదారంగా ఉండాల్సిందే - బీబీ నాంచారు వల్ల కొందరు ముస్లిములకి కూడా తిరుమల ఇష్టమైనదే.ఆ మధ్యన ఒక ముస్లిం భక్తుడు స్వామివారికి బంగారు పువ్వులు సమర్పించుకున్నాడని చదివాను.వాళ్లని మనం ప్రోత్సహించాల్సిందే!కానీ యాజమాన్యం, నిర్వహణ విషయంలో హిందూ మత సంప్రదాయాలు ఖచ్చితంగా అమలు జరగాలి.

ఇప్పటికిప్పుడు నేను క్రైస్తవం పుచ్చుకోగలను బాప్తిజం తీసుకుంటే చాలు!కానీ, చేరిన వెంటనే ఒక చర్చి మీద పెత్తనాన్ని నాకు అప్పగిస్తారా?కనీసం బ్రదర్ హుడ్ అయినా వెంటనే ఇవ్వరే?బైబిలు మీద అధికారం కావాలి,ఇతరుల సందేహాలకి జవాబులు చెప్పే పాండిత్యం లేనిదే ఫాదర్ అవ్వలేను కదా!ఇక్కడ ఆ పాండిత్యం బ్రాహ్మణులకి ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించకపోతే ఎట్లా?సందు దొరికింది గదాని రమణ దీక్షితుల్ని ఆడు,ఈడు అంటున్నవాళ్ళు హిందువులేనా?

ప్రముఖమైన ఆలయాలు పదే పదే వివాదాలకు గురి కావడంలో బ్రాహ్మణుల పాత్ర కూడా ఉంది - నా తీర్పు ప్రకారం వారి తప్పే ఎక్కువ!కొన్ని శతాబ్దాలుగా బ్రాహ్మణులు కొత్తదనానికి దూరమైపోయారు.తొలినాడు ఆలయనిర్మాణం అనేది చాలా శాస్త్రీయమైన పద్ధతిలోనే చేశారు.దానికి వాటి నిర్మాణంలో వాడిన సాంకేతికతయే సాక్ష్యం!కానీ కాలం గడిచే కొద్దీ ఆలయాలకు అంటిపెట్టుకుని అక్కడ దక్కుతున్న సంపదకీ ఐశ్వర్యానికీ దాసులైపోయి ప్రజల మీద పెత్తనం చెయ్యడం కోసం రాజులకి ఉపాయాలు చెప్పడానికీ,మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేసి ప్రజల్ని తమకి విధేయులుగా ఉంచుకోవడానికీ తమ జ్ఞానాన్నీ కొన్ని శతాబ్దాల విలువైన కాలాన్నీ వృధా చేసేశారు.

ఆయుర్వేదం, ఖగోళశాస్త్రం, జ్యోతిషం, వ్యవసాయం, యంత్రవినియోగం వంటివాటిలో గత వెయ్యేళ్ళలో ఏమి విప్లవాత్మకమైన కృషిని చేశారు వీరు?అన్నీ వేదాల్లో ఉన్నాయి అనే పాత గొప్పల్ని చెప్పుకుంటే ఎవడు వింటాడు?ఎంత కాలం వింటాడు?వేదాల్లో ఉంటే మరి ఎందుకు వినియోగం లోకి తీసుకురాలేదు?నాకు తెలిసినంత వరకు భారత దేశంలో వరాహ మిహిరుడే ఆఖరి శాస్త్రవేత్త - తర్వాత శాస్త్రవేత్తలు ఎందుకు పుట్టలేదు?భక్తియార్ ఖిల్జీ వల్ల చాలా నష్టం జరిగిన మాట వాస్తవమే!కానీ తిరిగి వైభవాన్ని పొందడానికి జరిగిన కృషి ఎక్కడ!ఇప్పటికీ మనదైన శాస్త్రవిజ్ఞానం అనేది రూపొందాలంటే అది బ్రాహ్మణుల వల్లనే సాధ్యం!

మూర్త్యార్చన అనేది భగవంతుణ్ణి చేరడానికి ఉన్న అనేకానేకమైన మార్గాలలో ఒకటి మాత్రమే - అది నాకు స్పష్టంగా తెలుసు.కాబట్టి బ్రాహ్మణులు ఆలయాల చుట్టూ పెనవేసుకుని రుబ్బురోలు పొత్రాల మాదిరి అక్కడే తిష్ఠ వేసుకుని కూర్చోకుండా సమాజంలోకి రావాలి, ఇతరులకి వేద విజ్ఞానాన్ని పరిచయం చేసి బ్రాహ్మణేతరులకి కూడా ఇది కేవలం బ్రాహ్మణుల కోసం పుట్టిన మతం కాదు నాకు కూడా ఈ మతాన్ని రక్షించే బాధ్యత ఉంది అనే ఆప్యాయతని పెంచాలి!ఒకప్పుడు భక్తి ఉద్యమం, ఆర్యసమాజం వంటివి విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చాయి.కానీ వాటిని కూడా మళ్ళీ ఈ రొచ్చులోకి లాగేశారు.ఈసారి ఆ పొరపాటు చెయ్యకుండా నిజమైన వైదిక ధర్మాన్ని ప్రచారం చెయ్యగలిగితేనే మీరు ధర్మాన్ని నిలబెట్టినవాళ్ళు అవుతారు.లేని పక్షంలో బ్రాహ్మణులు చరిత్రహీనులు కావడమే కాదు హిందూమతం కూడా అంతరించి పోతుంది!

ఆలయాల మీద ప్రభుత్వ అజమాయిషీని పూర్తిగా ఎత్తెయ్యటం సాధ్యపడేది కాదు,ముస్లింల వక్ఫ్ బోర్డులు కూడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలే!ధర్మకర్తల అధీనంలో ఉన్నప్పుడు దేవదాసీల పేరుతో వ్యభిచారం, నరబలుల వంటి మూఢనమ్మకాలూ, ధర్మకర్తల అక్రమాలూ అందుకు పూజార్లు కూడా సహకరించటం లాంటివి వెలుగులోకి వచ్చాకనే తప్పనిసరై జోక్యం చేసుకుని ప్రభుత్వం కిందకి తెచ్చారు.కోర్టులు కూడా ప్రభుత్వ జోక్యాన్ని సమర్ధిస్తూ తీర్పులు ఇచ్చిన చరిత్ర ఉంది.అన్ని వైపుల నుంచీ పరిశీలించకుండా నేను ఏదీ మాట్లాడను.హిందూ ఆలయాలని మళ్ళీ ధర్మకర్తల కాలానికి తీసుకెళ్ళాలని నేను అనుకోవడం లేదు.ఆలయాలు సర్వస్వతంత్రమైన స్వేచ్చా మందిరాలు అయితే అది అరాచకానికి దారి తీస్తుంది.

బోర్డు సభ్యులు కానివ్వండి, అర్చకులు కానివ్వండి - రోజువారీ నిర్వహణకు కావలసిన యంత్రాంగం, సామగ్రి, మార్గదర్శకాలు భక్తుల నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో అమరితే మంచిది.స్వామికి జరిగే కైంకర్యాలు మొత్తం ఆగమ శాస్త్రాల ప్రకారం నిష్ఠగా జరగాలి.ఏదైనా అక్రమం జరిగినప్పుడు ఫిర్యాదు చేస్తే చట్టం ద్వారా సరిదిద్దడం వంటివాటికి ప్రభుత్వం పరిమితం అయితే బాగుంటుంది.అంతకన్న ఎక్కువ కోరుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో నెరవేరడం కష్టం!

Sunday 13 May 2018

అంతట నీవే కనిపించావే,అన్నిట నీవే అనిపించావే - హల్లో మై హిందూయిజం!

*హిందూమతంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు?విగ్రహాలు లేకుండా దేవుణ్ణి పూజించలేమా?

          ఇతరులకి హిందూమతంలో అత్యంత సంక్లిష్టమైన రెండు విషయాలు బహుళదేవతారాధన మరియూ విగ్రహారాధన అనేవి నిజానికి చాలా శాస్త్రీయమైనవి!అయితే వీటిని అశాస్త్రీయం అని రుజువు చేసి మా మతం ఇంతకన్న శాస్త్రీయమైనది గాబట్టి "రండి!రండి!మా మతంలోకి రండి!!మీకెంతో మేలు జరుగునండి!!!" అని చెప్పడం కోసం కొందరు "వేదంలో 'న తస్య ప్రతిమా అస్తి' అని ఉన్నప్పటికీ హిందువులు విగ్రహారాధన చెయ్యడం వేదవిరుద్ధం కాదా, బ్రాహ్మణులు సామాన్యులకి అబద్ధాలు చెప్పి పాపకర్మలు చేయించుతున్నారు" అని  వాదించడం చాలాకాలం నుంచీ జరుగుతున్నది.వాళ్ళు ఈ వాదన ఎందుకు చేస్తున్నారు?అసలు హిందూమాతంలో ఉన్న విగ్రహారాధన గురించిన రంధి వాళ్ళకి దేనికి?మన మతంలో తప్పులు వెతుకుతున్న వాళ్ళకి తమ మతంలో తప్పులు కనపడవా?వాళ్ళ మతంలో తప్పులు ఉన్నాయని వాళ్ళకీ తెలుసు - జస్ట్ కామన్సెన్సుతో వెదికినా దొరికిపోయేటంత భయంకరమైన తప్పులు ఉన్నాయి,మరి మన హిందూమతంలో మనకి తెలియని తప్పుల్ని కూడా కనుక్కోగలిగిన మేధావులకి అవి ఎందుకు కనపడవు?కనపడతాయి!కానీ వాళ్ళ  ధైర్యం యేమిటంటే, మనకి వాళ్ళ మతం గురించే కాదు, మన మతం గురించి కూడా తెలియదు కదా - అంత కష్టపడి ఒక హైందవేతరుడు సంస్కృతం నేర్చుకుని వేదంలో ఏముందో తెలుసున్నవాడు అబద్ధం చెబుతాడా అని మన అమాయకత్వం కొద్దీ నమ్మేస్తామని వాళ్ళ వ్యూహాత్మకమైన ఎత్తుగడ!


          ఈ ప్రశ్నని ఇతరుల బుర్రలో నాటడానికి ముందు వాళ్ళు చాలా హోంవర్క్ చేస్తారు.మీకు కష్టం వస్తే మీకన్న ఎక్కువ ఏడుస్తారు,మీ పుళ్ళు కడుగుతారు,మీ పిల్లల ముడ్డి కడుగుతారు,మీరు ఎన్ని వెధవపనులు చేసినా వొద్దని వ్యతిరేకించరు,మీ పాపాల్ని కూడా వాళ్ళే భరించి మీకోసం దుఃఖించి మీరు చేసిన తప్పులకి మీకు శిక్ష పడనివ్వరు - ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో నా మేలు కోరేవాడు ఇతను/ఈమె తప్ప ఇంకెవరూ లేరు అనే నమ్మకం తెచ్చుకున్నాకనే ఈ వ్యూహంలో మొదటి అడుగు వేస్తారు కాబట్టి ఆ సందేహం చాలా బలమైనది అనిపిస్తుంది, తమని అమాయకుల్ని చేసి అబద్ధాలు చెప్పి పాపాలు చేయించి తమ కష్టాలకి కారణమైన బ్రాహ్మల మీద ఒళ్ళు మండుతుంది - ఇంకేముంది, జాటర్ ఢమాల్!హైందవం నుంచి క్రైస్తవం లోకి ఒక గొర్రెపిల్ల జంప్! అసలుకి ఆ శ్లోకం మొత్తం అర్ధం తెలిస్తే మనకి బోల్డు ఖోపం వొచ్చేస్తుంది - అది నమ్మేసి వెళ్ళిపోయినవాళ్ళకి ప్రైవేటు చెప్పేసి వెనక్కి లాక్కొచ్చెయ్యాలని కూడా అనిపిస్తుంది. కాని ఏం లాభం?నా చేగోడీలు కొట్టేసిన గ్యానపెసూనాంబ నేను మా రాధకి చెప్పి తన్నిస్తానని బెదిరించినా "పోరా పొట్టి బుడంకాయ్!" అనేస్తుంది గానీ నా చేగోడీలు మళ్ళీ నాకు ఇస్తుందేవిషీ!


          అష్లా దారి తప్పేసిన అంకుల్సులా కాకుండా ఇక్కడే ఉండిపోయిన చిన్న అంకుల్సుకి పెద్ద అంకుల్సు ప్రైవేటు చెప్తే వీళ్ళు కూడా దారి తప్పరు కదా, పాపం!ఎవరూ చెప్పకపోతే యేం, నేను చెప్పుతాను కదా. నేను మాతరం చిన్నవాడినా చితకవాడినా - నా అంతవాణ్ణి నేను!

శుక్ల యజుర్వేదము - అధ్యాయము 32:3 మరియు 32:4:

న తస్య ప్రతిమా అస్తి 

యస్య నామ మహద్యశః | 

హిరణ్యగర్భ ఇత్యేషః | 

మా మా హిఁసీదిత్యేషా | 

యస్మాన్న జాత ఇత్యేష || 

ఏషోహ దేవః ప్రదిశో ను సర్వాః 

పూర్వోహ జాతః స ఉ గర్భే అన్తః | 

స ఏవ జాతః స జనిష్యమాణః 

ప్రత్యఙ్జనాస్తిష్థతి సర్వతోముఖః ||

"O God your mightines , supremeness is the top, you are unmeasurable, only you knows your true form, you created the things like sun, the God who is not born from anything is worshipable, let him not hurt us. The Supreme God is filled everywhere, he was in the mind and in the creations of all times , he is in everything in a secret form. He exists in all times, his strength is filled everywhere."


          ఎంత ఘోరం?ఏమిటీ అన్యాయం!అది రాయే, అయితే?దాని చుట్టూ ఉన్న సమస్తమూ దేవుడే అయి ఆ ఒక్కటీ దేవుడు కాకుండా పోతుందా - అదెట్లా కుదురుతుందీ!శ్రీ భాగవతంలో సృష్టి ఎలా జరిగిందీ అని చెప్పేచోట "ఒక మనిషి కుండని తయారు చెయ్యాలంటే 1).కుండని చేసేవాడు,2).కుండని చెయ్యటానికి అవసరమైన జ్ఞానం,3).కుండని చెయ్యడానికి పనికివచ్చే మట్టీ వేర్వేరుగా ఉంటాయి - కానీ ఈ సృష్టికి మాత్రం ఆ మూడు అంశాలూ భగవంతుడే!" అని బల్లగుద్ది చెప్పారు.


          అబ్రహామిక్ మతాలు దేవుడు ఈ సృష్టికి అవతల ఉన్న స్వర్గంలో ఉంటాడనీ ఈ భూమినీ భూమిపైన కనిపించే సమస్త వృక్ష జంతు సముదాయాన్నీ మనిషి ఉపయోగం కోసం సృష్టించి ఇచ్చాడనీ చెబుతాయి.అందుకే బల్లులూ, కప్పలూ, మండ్రడ్రగబ్బలూ, ఎండ్రకాయలూ. పీతలూ, నత్తలూ, కుక్కలూ, నక్కలూ  అన్నీ వారికి తినటానికి పనికొచ్చేవిగానే కనబడతాయి తప్ప సరిసాటి జీవాలుగా కనబడవు - బైబిల్లో ఖురానులో కూడా మనిషే గొప్పవాడు అని చెప్పి వాటిని పాటించేవాళ్ళకి అహంకారం నేర్పుతున్నాయి.మరి భాగవతంలో  మనిషి కూడా మిగిలిన జంతువుల వంటివాడే, కేవలం అతని జ్ఞానమే అతన్ని అధికుణ్ణి చేసింది అని చెప్పారు.హిందువులకి కోడినీ నెమలినీ చూడగానే సుబ్రమణ్య స్వామి గురుకొస్తాడు.పామును చూడగానే నాగరాజూ వాసుకీ ఆదిశేషుడూ గుర్తుకొస్తారు.ఇదంతా వాటిని కమలహాసనూ శృతిహాసనూ తిన్నట్టు తినకుండా వాటిని రక్షించి ఈ లోకంలో వాటి జాతిని కూడా మిగిల్చి ఉంచడానికి హిందూ ఋషులు చేసిన ఏర్పాటు.


          అసలు హిందువులకి ఉన్నది ఒకే ఒక దైవం - ఈ సృష్టి మొత్తం దివ్యమైనదే!విశ్వం విష్ణుః అని  దైవానికి పురుషతత్వం ఇచ్చిన విష్ణుసహస్రనామావళి మొదలయ్యేదీ శ్రీమాత ఆని దైవానికి స్త్రీతత్వం ఇచ్చిన లలితాసహస్రనామావళి మొదలయ్యేదీ లింగభేదాల కతీతమైన పరమేశ్వరుణ్ణి ప్రపిత ఆని పిలిచేదీ అందుకే!ఉన్నది ఓకే దైవం అని హిందువులకి వేదం చెప్తున్నది. హిందువులు పూజించేది ఒక దైవాన్నే - అందులో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు.


          "హమ్మయ్య! హిందువులు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నారు అని నిరూపించేశాను - ఒక పనైపోయింది బాబూ!" అని కాస్త గుక్క తిప్పుకునే లోపు "మరి దేవుడు ఒక్కడే అయితే ఇన్ని రూపాలు ఎందుకు? ఇన్ని విగ్రహాలు ఎందుకు?ఇన్ని ఆలయాలు ఎందుకు?ఇన్ని మూఢనమ్మకాల్ని వ్యాపింపజేయటం దేనికి?ఇంత వ్యాపారం దేనికి?ఇవి కూడా వేదంలో ఉన్నాయా!" అని తగులుకుంటారు కదూ వీళ్ళు! అవును, వాళ్ళు అలాగే అంటారు. కాస్త తెలుగు మీరినవాళ్లయితే రూటు మార్చి "మేము వైదికఋషుల్ని తిట్టలేదు, మీరు మాకు లేని దురుద్దేశాల్ని అంటగడుతున్నారు. సంస్కృతం రాక పొరపాటు పడ్డాం ,అంతే! పూర్వఋషుల మంచి బోధనలకి తర్వాత కాలంలో చెడు అర్ధాలు చెప్పి మూఢనమ్మకాల్ని వ్యాపింపజేశారని మాత్రమే అంటున్నాం.స్వార్ధపరులు మధ్యలో పెట్టిన చెడుని తొలగించుకుని మీ మతాన్ని సంస్కరించుకోమని సలహా ఇవ్వడంలో తప్పేమిటి" అని బూకరిస్తారు కూడా!


          అయితే నతస్యప్రతిమా అన్న ఒక్క ముక్కని మనకి చూపించి నిలదీస్తున్నవాళ్ళకి అ పక్కనే పాంచరాత్రం, వైఖానసం కనపడలేదా?అవేమిటీ అని కొందరు హిందువులు కూడా అడుగుతారు, నాకు తెలుసు!ఆలయాల్ని ఎలా నిర్మించాలి. అర్చామూర్తుల్ని ఎలా చెక్కాలి, ఏయే మూర్తులకి ఏయే కైంకర్యాలు చెయ్యాలి అనే విషయాల క్రోడీకరణయే ఆగమ శాస్త్రం. అనేకమంది వ్యక్తుల మేధస్సు నుంచి పుట్టిన  కొన్ని లక్షల సంవత్సరాల వయసున్న హిందూజ్ఞానరాశిని కేవలం ఒక వ్యక్తి యొక్క జ్ఞానరాశిని మాత్రమే గీటురాయిగా తీసుకుని కొలుస్తున్నారు గానీ అక్కడ వేదం ఏమి చెబుతున్నది?ఈ విశ్వం అంతా తానే అయినవాణ్ణి మానవులు పూర్తిగా అర్ధం చేసుకోలేరు అని అంటున్నదే కానీ ప్రతిమల ద్వారా అర్చించరాదనీ వాళ్ళ గ్రంధాలలోలా చూడకూడదు అనీ నిషేధం పెట్టలేదు కదా!


          "మేము మాకు కనపడుతున్నదాన్ని మాత్రమే ఒప్పుకుంటాము, మాకు కనపడనిదాన్ని గురించి ఉన్నట్టు చెప్తే పట్టించుకోము,మీకు కనబడి మాకు కనబడనిదాన్ని కూడా ఒప్పుకోము, మాకు అర్ధం అయ్యేటట్టు చెప్పడం కూడా మీ బాధ్యతే!" అని వాళ్ళ లిమిటేషన్సుని వాళ్ళ అడ్వాంటేజి కింద చెప్పుకుంటూ అడిగితే ప్రతి వస్తువునీ ఒకేసారి పితాసోదరసంతాన(Father,Siblings and Progeny) సంబంధాలతో కలిపి చూసి వాటి చుట్టూ ఉన్న వ్యక్తావ్యక్తాలు రెండింటినీ అర్ధం చేసుకోగలిగినవాళ్ళు ఆ కండిషన్లని పాటిస్తూ చెప్పాలంటే ఎన్ని మెట్లు కిందలి దిగాలి?అందరూ అలా దిగగలరా!పైమెట్లకి యెక్కలేని వాళ్ళని చూసి జాలిపడినవాళ్లకి తప్ప అందరికీ అంత తీరిక ఎక్కడిది?


          ప్రపంచంలోని అన్ని రకాల చింతనల్నీ పరిశీలించి చూస్తే దైవం - సృష్టి అనే వాటి మధ్యన రెండు రకాల దృష్టికోణాలు మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది.వాటిలో ఒకటి ఈ ప్రపంచాన్ని నకారాత్మక దృష్టితో చూడటం:అబ్రహామిక్ మతాలు సృష్టిలో దేవుణ్ణి చూడవు,సృష్టికి అవతల దేవుడు నిర్మించిన స్వర్గాన్ని చేరుకోవడమే వాటి లక్ష్యం.బౌద్ధం కూడా ఈ లోకం నుంచి తప్పించుకుని పోవడాన్ని గురించే చెబుతుంది.దానికి కార్యకారణశృంఖలని తెగగొట్టుకున్న నిర్వాణం ఆని పేరు.హిందూమతంలో "బ్రహ్మ సత్యం!జగత్ మిధ్య!" అనే సూత్రానికి చెప్పే వ్యాఖ్యానం దాదాపు ఈ మతాల వారు చెప్పే విధంగానే ఉంటుంది.దీని ముఖ్యలక్షణం ప్రపంచాన్ని నెగటివ్ అనుకోవడం.


          ఇక రెండవది "ఏకమేవాద్వితీయం!" అని ఈ ప్రపంచాన్ని సకారాత్మక దృష్టితో చూడడం:ఈ సృష్టి మొత్తం భగవంతుని సంకల్పానుసారం జరిగింది కాబట్టి భగవంతుణ్ణి చేరుకోవడానికి దీనినే ఉపయోగించుకుని తరించడం.ఇది హిందూమతంలో తప్ప ఇంకే మతంలోనూ కనపడని పద్ధతి.ఈ సూత్రానికి పండితులు చెప్పే వ్యాఖ్యానం తెలుసుకుంటే దీని స్వభావం ఇలా ఉంటుంది:మామూలు లోకవ్యవహారంలో అహంకారం నకారాత్మమైన గుణమే కానీ భాగవతం అవ్యక్తం నుంచి వ్యక్తం ఏర్పడేటప్పుడు పుట్టిన ఆహంకారాన్ని గురించి చెప్పేచోట "మహదహంకారం","మహత్తత్వం!"అని అంటుంది - శ్రద్ధ ఉంటే వెతికి చూడండి!


          సకల వేదాంతసారమైన అష్టాదశాధ్యాయి గీతలో జ్ఞానషట్కం మొదటి పద్దతిని శ్రేష్ఠం అంటుంది,భక్తి షట్కం రెండవ పద్ధతిని శ్రేష్ఠం అంటుంది,యోగ షట్కం రెండింటినీ కలిపిన పద్ధతిని శ్రేష్ఠం అని చెబుతుంది.సాధకుడు మొదట తన స్వభావం ఏమిటో తెలుసుకుని తన స్వభావానికి తగిన మార్గం ఎంచుకుంటే సరిపోతుంది.అంటే, అబ్రహామిక్ మతాల ప్రభావంలో ఉన్నవారు తాము పాటంచే మార్గం మాత్రమే ఉత్తమమైనదనీ తక్కినవి పాపం అనీ చెబుతుంటే హిందూ ఋషులు సాధకులకి రెంటినీ ఉత్తమమైనవిగా చెప్పి ఎంచుకోవడానికి స్వేచ్చను ఇస్తున్నారనీ భగవంతుణ్ణీ చేరుకోవాలని అనుకోవడమే అపురూపం కాబట్టి అది ఎలా సాధ్యపడినా పాపం కాదనీ అర్ధం చేసుకుంటే చాలు విగ్రహారాధన పట్ల ఇతరులు వ్యక్తం చేస్తున్నవి అర్ధం లేని ఆరోపణలు అని తెలుసుకోవటానికి. అయితే, వాళ్ళు ఒప్పుకోలేనిది యేమిటంటే వాళ్ళు కూడా ఒక స్థాయిలో విగ్రహారాధన చేస్తూనే అది హిందువుల విగ్రహారాధన కన్న ప్రత్యేకంగా ఉండటంతో తాము చేస్తున్నది విగ్రహారాధన కాదనీ హిందువులు చేస్తున్నది మాత్రమే విగ్రహారాధన అనీ కొట్టి పారేస్తున్నారు.కాబట్టి దీనిని కొంచెం లోతుకి వెళ్ళి పరిశీలించడం అవసరమే!


          ప్రాచీనభారతీయఋషులు అవ్యక్తం అనీ ఆధునికవిజ్ఞానవేత్తలు సింగ్యులారిటీ అనీ అంటున్న దాని గురుంచి పాశ్చాత్యులే కాదు భారతీయ మేధావులూ మౌనమే ఆశ్రయించారు.ఇక వ్యక్తం గురించి తెలుసుకోవడానికి వేదం, తోరా. జెండ్ అవెస్త, బైబిల్, ఖురాన్ వంటి ఆధ్యాత్మిక సాహిత్యంలోనూ ఆధునిక ప్రాచీన విజ్ఞానశాస్త్రంలోనూ జరుగుతున్నది ఒకటే - రూపం, భావం, నామం అనే మూడింటికీ మధ్యన ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం, నిరూపించడం, అధ్యయనం చెయ్యడం, ఉపయోగించుకోవడమే! భాగవతంలో చెప్పిన కుండనే తీసుకుందాం. కుండ అనేది మొదట్లో లేదు.ఒక మనిషిలో కుండకు సంబంధించిన జ్ఞానం పుట్టింది, ఆ జ్ఞానంతో ఒక వస్తువు తయారు చేశాడు,దానికి కుండ అని పేరు పెట్టాడు - ఇది ఒక పద్ధతి. అప్పటికే ఉన్న ఒక చెట్టును చూశాడు.ఆకుల్ని మళ్ళీ మళ్ళీ చూసి ఇతర చెట్ల ఆకులతో పోల్చి గుర్తు పట్టాడు. పోలికల్నీ తేడాల్నీ సరిచూసుకుని దీనికి రావిచెట్టు అని పేరు పెట్టాడు - ఇది ఒక పద్ధతి.రూపం అనేది లేనిదాన్ని మనం తెలుసుకోలేము,పైగా రూపం లేనిదాన్ని గురించి తెలుసుకోఅవటం అనవసరం కూడా!ఇలా వ్యక్తమాన ప్రపంచానికి సంబంధించిన సమస్తమైన జ్ఞానంలోనూ రూపం, నామం, భావం అనేవి కలిసే ఉంటాయని తెలిస్తే యెహోవా అనే పేరునీ అల్లా అనే పేరునీ ఉచ్చరిస్తూ అతడు ఉన్నాడు అని చెబుతూనే అతనికి రూపం లేదనటమూ ఉన్నప్పటికీ ఆ రూపాన్ని మానవులు దేవుడు సృష్టించిన ఈ విశ్వంలో చూడకూడదనటమే అశాస్త్రీయమైనది.


          ఈ మూడింటికీ మధ్యన ఉన్న సంబంధాల్ని గురించి విశ్లేషించి చెప్పే ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా material representation, spiritual manifestation మధ్యాన్ ఉన్న తేదాల్ని గురించి పరిశీలించి  హిందూ ఋషులు చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నది! దీని ప్రకారం హైందవేతరులు పాటిస్తున్నది Ascending symbolism:ఉదాహరణకి ప్రజల్లో దేశభక్తి అనే ఒక abstarct conceptని తేలిక పద్ధతిలో అలవాటు చెయ్యాలంటే ఆ దేశానికి జాతీయపతాకం అనే ఒక concrete symbol కావాలి.అయితే పతాకం డిజైనుని మార్చవచ్చు.ఇక్కడ భావానికి రూపం అవసరమే కానీ గట్టి సంబంధం ఉండదు.క్రైస్తవుల శిలువ, మహమ్మదీయుల నల్లరాయి వస్తువులే, వాటికి ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం కూడా విగ్రహారాధనయే - కానీ లూజు కనక్షను కాబట్టి వొప్పుకోరు, అంతే!ఇక హిందువులు పాటిస్తున్నది Descending Symbolism:ఇందులో భావానికీ రూపానికీ ఖచ్చితమైన సంబంధం ఉంటుంది - మీ ముఖానికీ మీ ఫొటోకీ ఉన్న సంబంధం ఏమిటో అంత గట్టి సంబంధమే ఇక్కడా ఉంటుంది.


          విషయం ఏమిటంటే, సృష్టిని గురించి తెలిపే జ్ఞానంలో సమన్వయం సాధించాల్సిన రూపం, నామం, భావం అనేవాటికి సంబంధంచి హిందువుల జ్ఞానమే సమగ్రమైనది.  హైందవేతరులు ఆ మూడింటిలో ఒకదాన్ని నిరాకరిస్తున్నారు కాబట్టి అదియే అశాస్త్రీయం, అసమగ్రం, అహేతుకం, అసంబద్ధం, అక్రమం, అన్యాయం, అయోమయం, జ్ఞానము పట్ల అలసత్వం, దైవము పట్ల అపరాధం!


*హిందువులని ఎలా గుర్తు పట్టాలి?హిందూమతం యొక్క స్వభావం ఏమిటి?

1).నమస్కారం:ఒక హిందువు ఇంకొక వ్యక్తిని పలకరించే సందర్భంలో రెండు చేతుల్నీ జోడించి నమస్కరించడం సంప్రదాయం.ప్రాచీన కాలం నుంచి దీనిని హిందువులే ఎక్కువ పాటించడం వల్ల ఇది ఈ మతం వారికి సంబంధించినదిగా భావించి ఇతర మతస్థులు కొందరు దీనికి విముఖతని ప్రదర్శిస్తున్నారు. ఆధునికత కోసం కొందరు హిందువులు కూడా పాటించడం లేదు.కానీ ఇందులో ఒక విశేషం ఉంది.ఇంద్రియపంచకంలో స్పర్శకి స్థానం మన అరచేతులు.ప్రతి ఇంద్రియమూ తనకి నిర్దేశించిన పనిని చేస్తున్నప్పుడు అక్కడ పుట్టిన నాడీప్రచోదనలు మెదడును చేరినప్పుడు మనకి స్పర్శకి సంబంధించిన సమాచారం తెలుస్తుంది.ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూడగానే రెండు చేతులూ జోడించి ఆ వ్యక్తి కళ్లలోకి సూటిగా చూస్తూ చిరునవ్వుతో నమస్కరించడం అంటే ఆ వ్యక్తిని చూస్తున్నందుకు మనమ అనుభవిస్తున్న్ ఆనందాన్ని అతనికి వ్యక్తం చెయ్యడం అని అర్ధం చేసుకోవాలి.


          సమస్థాయి వారికి నమస్కార ప్రతి నమస్కారాలు చాలు.పెద్దలకి పాద నమస్కారం చెయ్యాలి, అత్యంత గౌరవనీయులకి సాష్టాంగప్రమాణం చెయ్యాలి.స్త్రీలు ఎవరికైనా సరే సాష్టాంగప్రమాణం చెయ్యాల్సిన పనిలేదు, మోకాటి తండా వేసి తలని నేలకి తగిలించితే చాలును. హందూమతంలో సుకుమారులైన స్త్రీలకి విధించినదాన్ని రెటమతంలో పురుషులు అనుసరిస్తున్నారు - భశుం!


2).దర్శనం:సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్న సత్యం ప్రకారం సనాతనధార్మికశ్రేష్ఠులు వ్యక్తికి తమ బోధనల్ని నిజమో అబద్ధమో తేల్చుకోవటానికి అతని అనుభూతినే ప్రమాణం చేశారు.ఇహలోకంలో తను పొందాల్సిన సుఖాలతో పాటు భగవంతుణ్ణి సైతం తన కన్నులతో చూడటం ద్వారా ఆనందానుభూతిని పొందగలిగే మార్గాలను చూపించారు.ప్రతి హందువుకీ ఎవరో ఒకరు గురువు ఉంటారు, ఉండాలి.అవకాశం కుదిరినప్పుడు గురుసందర్శనం తప్పక చెయ్యాలి.ఇక ఆలయసందర్శనం మరింత ముఖ్యమైనది.హిందువుల అర్చామూర్తులు పెద్ద పెద్ద  అందమైన కళ్లతో ఉండటానికి దర్శనం యొక్క ప్రాధాన్యతయే కారణం.



          శిల్పులు అర్చామూరులను చెక్కేటప్పుడు కూడా కళ్ళను ఆఖర్న మరింత శ్రద్ధ తీసుకుని చెక్కి పూర్తి చేస్తారు.మనం ఇతర్లతో మాట్లాడేటప్పుడు అనుకోకుండానే వాళ్ళ కళ్ళల్లోకి చూస్తాం కదా,అదే పద్ధతిలో అర్చామూర్తిని చూసేటప్పుడు అర్చామూర్తి మనవైపు చూస్తున్నట్టు అనిపించడం వల్ల దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడనే నమ్మకం కలిగి కష్టాలని ఎదుర్కునే ధైర్యం పెరుగుతుంది!


3).ఇంద్రియనిగ్రహం:హిందూమతానికి ఒక ప్రవక్త, ఒక పుస్తకం, ఒక నిబంధన, ఒక వేషం లేకపోవడానికి ముఖ్యమైన కారణం వ్యక్తిని విడి అస్తిత్వంలో కాకుండా వ్యష్ఠిలో నిలబెట్టి చూడటం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి గౌరవం పొందాలంటే అతనికి అవసరమైనప్పుడు సహాయం చెయ్యాలి. ఈ సహాయం చేసేటప్పుదు సొంత లాభం కొంత తగ్గించుకోవాలి. నష్టాన్ని మౌనంగా భరించాలే తప్ప ఫలానావాడికి సాయం చేసి నేను నష్టపోయాను బొరోమని దుఃఖించకూడదు.


          ఈ త్యాగబుద్ధి దానంతటది రాదు గనక సనాతనులు ఇంద్రియనిగ్రహాన్ని ప్రతిపాదించారు.హిందువులకి పూర్వఋషులు బోధించిన నిత్యపూజాదికాలు, ప్రత్యేక తిధులలో జరిగే విశేష పూజలు, సంతాన సాఫల్యత, గ్రహదోష నివారణ వంటి కామితార్ధ క్రతువులు, రకరకాల యజ్ఞవిధులు అన్నింటిలోనూ ఇంద్రియనిగ్రహం, ప్రశాంతచిత్తం సాధించటానికి ఉద్దేశించిన పద్ధతులు ఇమిడి ఉండటం మనం గమనించవచ్చును.


4).స్వేచ్చాప్రియత్బం:"అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీయని వేల్పు,మోహనమున దానెక్కిన బారని గుఱ్ఱము, గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!" - ఈ కవి గానీ హిందువు కాకపోయి ఉంటే "మ్రొక్కిన వరమీయని వేల్పు"ని కూడా "గ్రక్కున విడువంగవలయు" అనే ధైర్యం చెయ్యగలడా?తను దీనత్వంలో ఉన్నప్పుడు సహాయం చేసినవాడికి దైవానికి నమస్కరించినంత భక్తితో నమస్కరించడం నుంచి తన ఇంటిలోని చిన్నపిల్లల్ని చిన్ని కృష్ణుడితో పోల్చుకుని మురిసిపోవడం వరకు హిందువులు దేవుణ్ణి చూసి, విని, స్పర్శించి పొందే ఆనందాన్ని దేవుణ్ణి చూడాలని అనుకోవడానికే భయపడే ఇతర మతస్థులు ఎట్లా తెలుసుకోగలరు?చచ్చాక వెళ్తారో లేదో తెలియని స్వర్గం మీద పేరాశతో ఇక్కడ అనుభవించాల్సిన ఆనందాన్ని దూరం చేసుకుంటున్న వ్యర్ధజీవులు ధన్యాత్ములైన హిందువుల్ని చూసి జాలి పడుతున్నారే!


          అయితే, ఒక లిటిగేషను మాత్రం ఉంది.పూర్వఋషులు పెట్టిన సంప్రదాయాల్ని ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా చెయ్యడం మాత్రం ఎంతో ప్రమాదం!ప్రాచీన కాలపు సనాతన ధర్మం నుంచి స్పూర్తి పొందిన యూదుమతం, జొరాష్ట్రియన్ మతం ప్రాభవాన్ని కోల్పోయి క్రైస్తవ, ఇస్లామిక్ మతాలు ఉనికిలోకి రావడానికి అవి పుట్టే కాలంలో అక్కడ ఆయా పాత మతాలని అనుసరిస్తున్నవారు వాటిని అర్ధం చేసుకుని ఇతరులకి బోధించి కాలానుగుణమైన మార్పులు చేసుకోవడానికి బదులు ఒక చట్రానికి బిగించివేసి సంస్కరణని వ్యతిరేకించి రవీంద్రుడు వర్ణించిన శిధిలాలయం స్థితికి చేరుకున్నారు.


*మతము లేమియు లేని కాలాన హైందవమే ధరణి యంతట వెలిగినదా?

          గ్రీకు సాహిత్యంలో కన్యరాశి గురించిన ఒక కధ ఉంటుంది.Aratos ముఖతః మనకు తెలుస్తున్న కధ ఇలా ఉంటుంది.తొలినాటి స్వర్ణయుగంలో ఆమె మానవకాంతయే.న్యాయానికి గుర్తుగా ఉండి ప్రజలను సన్మార్గంలో నడిపిస్తూ ఉండేది.ఈ కాలంలో ప్రజలు కుట్రలు చెయ్యకుండా కలహాలు లేకుండా సుఖశాంతులతో బ్రతికేవాళ్ళు.దీని తర్వాతిదైన రజతయుగంలో ఈమె మానవసమూహాల నుంచి దూరమై పర్వతగుహలలో నివసిస్తూ అప్పుడప్పుడూ వచ్చి వారి పాపకర్మల నుంచి విముక్తుల్ని చేసి మళ్ళీ పర్వతగుహలలోకి వెళుతూ ఉండేది.మనిషి కత్తిని కనుక్కుని తొలిసారి ఆవుని చంపగానే తామ్రయుగం మొదలై ఈమె ఇక భూమి నుంచి వినువీధికి చేరి తారగా మారిపోయింది!ఇందులో రెండు విశేషాలు ఉన్నాయి.మొదటిది గోవధని నిరసించదం,రెండవది మానవ సమాజంలో ధర్మం పతనమై పోవడాన్ని వైదిక సాహిత్యంలోని యుగవిభజనని పోలిన కొన్ని దశలని ఉదహరిస్తూ చెప్పడం.కొందరు అన్ని చోట్లా మనుష్యుల ఆలోచనలు ఒక్కలాగే ఉండటం వల్ల ఎవరికి వారు కల్పించుకుని ఉండవచ్చును కదా,ఇక్కడినుంచే వెళ్ళాయనడానికి గట్టి ఆధారం లేదు కదా అంటున్నారు గానీ ఒకటీ రెండూ గాక నాలుగింట మూడు వంతులు కలవడం విడివిడి ఆలోచనల గజిబిజి ఎదుగుదల పద్ధతిలో ఎట్లా సాధ్యం?అసలు విలువిద్య ఏమాత్రం తెలియని వాడు కూడా పదిసార్లు ప్రయత్నించితే ఒకసారి లక్ష్యాన్ని కొట్టడంలో ఆశ్చర్యం లేదు.కానీ ఒక వ్యక్తి పదింటిలో కనీసం ఆరుసార్లు లక్ష్యాన్ని కొడితే అతనికి విలువిద్య వచ్చి ఉండాలి అనేది ఖాయం, అవునా?


          అబ్రహామిక్ మతాల ప్రభావంలో ఉన్నవారు నమ్మలేరు గానీ వాస్తవాలని వెలికితీసే నిష్పక్షపాత బుద్ధితో పరిశోధనలు చేసిన ప్రసిద్ధ చరిత్రకారులు ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ అతి ప్రాచీన కాలంలోనే హిందూమతం ఉనికిలో ఉందనడానికి సాక్ష్యాలను చూపిస్తున్నారు.Archaeologists found thirty thousand year old Poompuhar,Tamil Nadu had trade relations with Greece. Jwalapuram in Karnool district of Andhra Pradesh is dated 74,000 years ago. Early Roman settlements have been excavated near Madurai,Tamil Nadu. Lord Vishnu’s Idol  was unearthed in Russia.It is dated before Christ was thought of. The Construction of Chichen Itza resembles Madurai Meenakshi temple. Roman Emperors with Sri Vaishnava Marks are found in Egypt. Australia provides evidence of ancient people with Vaishnava Marks. Cookes Island,New Zealand, Nazca Lines of Peru are accurately described in the Kishkinta Kanda of Ramayana. Greek Historians Strabo,Megasthanes describe Krishna and Shiva concepts having been appropriated and modified by Greeks. Rig Veda is dated at 5000 years ago and is considered as the First Literary Work Of The World.Bjoomipooja was parcticed in rome .“…Historians and poets of Imperial Rome give us a description of the solemn ceremony observed on the occasion of marking out the limits of a new settlement…. a bull and a cow were yoked together, the cow being placed on the inner side, a furrow was made with a plough round the proposed site. This was done on a lucky day to satisfy religious scruples….” This procedure of choosing an auspicious day with reference to astrology and breaking the ground for a new city with a plough drawn by kine is Vedic practice.ఇక్కడి నుంచే అక్కడికి సంస్కృతి ప్రవహించినదనడానికి బలమైన సాక్ష్యం వాటి పతనానికి దారి తీసిన చారిత్రక దశలని గమనించితే దొరుకుతుంది.


          Rodney Stark అనే సామాజిక శాస్త్రవేత్త క్రైస్తవ మతం యొక్క ఎదుగుదలను గురించి కొన్ని  విప్లవాత్మకమైన సూత్రీకరణలని చేశాడు.క్రైస్తవులూ క్రైస్తవేతరులూ కూడా ఒప్పుకు తీరాల్సిన పరమ సత్యాలను కొన్నింటిని చెప్పాడు.తొలినాటి Jesus Movement యొక్క ప్రధాన కర్తవ్యం అప్పటి రోమన్ సామ్రాజ్యం మీద రాజకీయమైన తిరుగుబాటు చేసి యూదులకి రాజ్యాధికారాన్ని సాధించి పెట్టడం మాత్రమే.ఇప్పుడంటే అది బీదసాదలకి వారిమీద దేవుని కరుణని పంపించి ఉద్ధరించే మతం అయింది గానీ తొలినాళ్ళలో Hellenized Jews అనే మధ్యతరగతి కుటుంబీకులూ ఉన్నతతరగతి కులీన కుటుంబాల వారూ రోమన్ అధిపత్యం మీద అప్పటి నగర జీవితంలోని సంక్లిష్టతని ఉపయోగించుకుని నడిపిన రహస్య విప్లవం!


          రోమన్ నాగరికతలో ప్రారంభం నుంచీ ఆధ్యాత్మికత బలమైనదిగా ఉండేది.Julius Caesar రాజకీయపరమైన సర్వాధికారి కావటానికి ముందు అతని హోదా Pontifex Maximums,అంటే ప్రధాన పూజారి.రోమన్ ప్రభువులలో చాలామంది నుదుటి మీద భారతదేశంలోని శ్రీవైష్ణవుల తిరునామం ధరించేవారు.సీజర్,అగస్టస్ వంటివారు భారతదేశంలోని "రాజు దైవాంశసంభూతుడు" అనే సూత్రాన్ని పాటిస్తూ తమకు తామే దైవత్వాన్ని ఆపాదించుకున్నారు.బహుశా, క్రైస్తవంలో జీసస్ తప్ప ఇంకే మానవుడూ దైవంతో సమానం అని భావించరాదనే నిషేధం ఉండటానికి ఈ రోమన్ ప్రభువుల యొక్క సంప్రదాయం పట్ల వారికి గల వ్యతిరేకతయే కారణం కావచ్చు!ఒక చిత్రమైన విషయం ఏమిటంటే ఇవ్వాళ గొర్రెల కాపరి అని క్రైస్తవులు నమ్ముతున్న జీసస్ క్రీస్తు కూడా రాజరిజపు వారసత్వం ఉన్న కులీన కుటుంబానికి చెందినవాడే.


          హిందూ సమాజం లాగే అప్పటి రోమన్ సామాజిక వాతావరణం కూడా బహుళదేవతారాధన, తాంత్రికపూజలు వంటివాటితో కూడి ఉండేది. మతస్వేచ్చ చాలా ఎక్కువ, పున్నానికీ అమాసకీ ఇదుగో నాది కొత్త మతం అంటే అదుగో నాది కొత్త మతం అన్నట్టు కొత్త కొత్త మతాలు పుట్టుకొస్తూ ఉండేవి.అన్నింటినీ ఆదరించే లక్షణం ఉండేది, కానీ మరీ అసభ్యకరమైన గ్రీకుల త్రాగుడు దేవుణ్ణి కొట్టుకొచ్చేసి పునర్జన్మ ఎత్తించేసిన The cult of Bacchus అనేదాన్నీ నరబలులు చేస్తున్న Celtic Druids తెగనీ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు.Judea దండయాత్ర తర్వాత తిరగబడుతున్న యూదులకి కూడా అణిచివేత సెగ తగిలింది.ఈ నేపధ్యంలో జీసస్ ఉద్యమం మొదలైంది.


          ఒక విశ్లేషకుడు "Early persecutions of Christians were probably carried out at the whim of provincial governors and there was also occasional mob violence. Christians’ refusal to sacrifice to Roman gods could be seen as a cause of bad luck for a community, who might petition for official action" అని చెప్పడం వల్ల అప్పట్లో క్రైస్తవాన్ని పాటించడం అంటే చావుని కొని తెచ్చుకోవడం అన్న పరిస్థితి ఉందనేది తెలుస్తుంది."రోం నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి!" అనే కధ క్రీ.శ 64 నాటిది.అతడు నిజంగా అలా చేశాడో లేదో తెలియదు గానీ ఇప్పటి రాజకీయ నాయకుల్లాగే అది క్రైస్తవుల దుష్ప్రచారం అని చెప్పి చాలామంది క్రైస్తవుల్ని వూచకోత కోయించాడు.అది క్రైస్తవం మీద జరిగిన మొదటి అతి పెద్ద దాడి.


          క్రీ.శ. 250లో రెండవసారి Decius కాలంలో మరొకసారి పెద్ద ఎత్తున క్రైస్తవుల వూచకోత జరిగింది.రాజ్యక్షేమం కోసం కొన్ని బలులని చెయ్యాల్సిందని ప్రతి ఒక్కరినీ ఆజ్ఞాపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.మిగిలిన వారికి అభ్యంతరాలు లేకపోవటంతో చేశారు గానీ వీటి పట్ల వ్యతిరేకత మీద ఏర్పడిన మతం కావటంతో అప్పటి క్రైస్తవులు వ్యతిరేకించారు.రాజు పనిగట్టుకుని క్రైస్తవుల మీద పగతో ఆజ్ఞలు ఇవ్వలేదు గానీ వీళ్ళు మాత్రమే వ్యతిరేకించినందువల్ల తిరుగుబాటుగా భావించారు.అయితే, క్రీ.శ. 261 నాటికి ఈ శాసనం రద్దు చేసేశారు.భారతదేశంలోని బౌద్ధమతం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే పుట్టింది.అయితే బుద్ధుడు మంచి పాండిత్యం గలవాడు కావటంతో శాంతమార్గంలోనే వ్యతిరేకులని కూడా అనుచరులను చేసుకోగలిగాడు.అప్పటి క్రైస్తవులలో పాండిత్యం లేకపోవటం, బౌద్ధం విజృంభించినప్పుడు వెనక్కి తగ్గి కొంతకాలం గడిచాక తమ పాండిత్యంతో బౌద్ధులని గెలిచిన హిందువుల వలె గాక అప్పటి రోమన్లు క్రూరమైన అణిచివేతని పాటించడం వల్ల రోమన్ సామ్రాజ్యం అంతమైపోయి క్రైస్తవం వృద్ధిలోకి వచ్చిందని మనం అర్ధం చేసుకోవాలి.


          Rodney Stark విశ్లేషణ ప్రకారం తొలినాటి క్రైస్తవులు సాయుధ పోరాటం వైపుకి పోకుండా అణచివేతని సహనంతో భరించి వినయశీలతని కలిగి ఉండటమే ఆ మతం యొక్క పురోగతికి మొదటి కారణం.ప్లేగు వ్యాధి ప్రబలి ఇతరులు నగరాలని ఖాళీ చేసి వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళు అక్కడే ఉండి రోగులకి సేవ చేస్తూ వారి అభిమానం సంపాదించేవాళ్ళు క్రైస్తవం birth control, abortion, infanticide వంటివాటిని నిషేధించడంతో  లైంగిక నిష్పత్తి కూడా క్రైస్తవం ఎదగడానికి దోహదం చేసింది.క్రైస్తవుల ముఖ్యమైన సూక్తుల్లో "redemption through sacrifice" అనేది అమాయకులకి ఓదార్పుని ఇచ్చింది.ఒకరికొకరు ఓదార్పును ఇచ్చుకుంటూ కష్టాలని ఎదుర్కోవడం బయటనుంచి చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించి కొంతమందీ మహిళలకి కూడా ప్రార్ధనావిధులని అప్పగించడంతో మహిళలూ పెద్ద ఎత్తున ఆ మతంలోకి చేరిపోయారు.


          ఇప్పటివరకు క్రైస్తవం యొక్క ప్రాభవాన్ని పెంచిన దుర్మార్గాన్ని Constantine మీదకి నెట్టేసిన వారికి ఈ విశ్లేషణలు కొంత ఇబ్బందిగానే అనిపిస్తాయి.క్రీ.శ. 312లో Battle of Milvian Bridge జరుగుతున్నప్పుడు తనకి క్రైస్తవమతం గెలుపుని ఇచ్చినట్టు చెప్పుకుని క్రీ.శ. 313లో క్రైస్తవుల మీద నిషేధాన్ని ఎత్తేస్తూ Edict of Milan పేరుతో liberty to follow that mode of religion which to each of them appeared best అని ప్రకటించాడు. అయితే, తన గెలుపుకి క్రైస్తవమే కారణం అని క్రైస్తవులకి ఉత్తరాలు రాయడం,చర్చిలకి ధనసహాయం చెయ్యడం నిజమే, కానీ ఇతర మతాల్ని కూడా ఆదరించాడు,ముఖ్యమైన విషయం,తన Pontifex Maximus అనే హోదాని చివరి వరకు కొనసాగించాడు!ఏది ఏమైతేనేం, Constantine పుణ్యాన అలా వ్యతిరేకత తగ్గడం వల్ల క్రైస్తవులు తమ మతంలో చేసుకున్న మార్పుల్ని అతనికి అంటగట్టి ఉంటారు.Constantine తర్వాత క్రమేణ వ్యతిరేకత తగ్గి బలం పెంచుకున్న  క్రైస్తవాన్ని క్రీ.శ. 380లో అప్పటి Theodosius I క్రైస్తవం రోమన్ సామ్రాజ్యం యొక్క రాజమతం అని ప్రకటించడంతో క్రైస్తవం యొక్క మహర్దశ మొదలైంది.


          ఈ Theodosius చెక్కించిన Edict of Thessalonica మీదనే  మొదటిసారి Father, Son and Holy Spirit అనే  క్రైస్తవం యొక్క Holy Trinity ప్రస్తావన కనబడుతుంది.ఇప్పటివరకు అణచివేతకి గురయిన క్రైస్తవం ఇప్పటినుంచి ఇతర మతాల్ని అణిచివెయ్యడం మొదలుపెట్టింది.ఇప్పటి క్రైస్తవానికి దఖలుపడిన Catholic Church  అనే పేరు అప్పుడు ఖాయమైనదే. రోమన్ సామ్రాజ్యాన్ని కూల్చివేసిన చాలామందికి ఆధ్యాత్మికత పట్ల నిష్ఠ తక్కువై అధికారమే పరమావధి కావడంతో చాలా తేలిగ్గా క్రైస్తవంలోకి మారిపోయారు.


క్రైస్తవం పుట్టుకకు ముందరి గ్రీకోరోమన్ ఆధ్యాత్మిక ప్రపంచం ఇలా ఉండేది:

-------------------------------------------------------------------------------------------------

The Pantheon: the gods and goddesses of mythology.

The old gods -- Chronos, Uranus, and others overthrown by the Olympian deities

The Titans - defeated allies of the old gods -- friends of humanity -- Prometheus, the fire-bringer was a titan.

The demi-gods -- the "almost gods" -- like Ganymede, chosen as servants by the Olympians

The heroes -- humans who achieved divine status -- Hercules was the most famous example. Note that the gap between god and human was not so great as to be uncrossable.

Local deities -- each region, city, town, and village had its own tutelary gods, and their were gods who protected field boundaries, storehouses, and every other imaginable thing of value.

Nature spirits -- each tree, stream, hill, and other natural feature had its in-dwelling spirit. Dryads in trees, hydrads in springs and streams, oreads in hills and mountains.

lares and penates -- the early Romans were ancestor worshippers, and each family and family home had its "household gods."

Genii -- in addition, each individual had his or her own "genius," a tutelary deity transformed by the early Christians into the "guardian angel."

Magic and superstition -- people needed to believe that they had protecting spirits, because they were very superstitious and that they were always in danger of "bad luck" on Fridays, the 13th of the month, after having broken a mirror, when their stars were not in a good alignment, and so forth. They also believed in witches, vampires, the evil eye, and other malevolent forces.

There were alternate systems of belief for those dissatisfied with the chaotic traditional religious forms:

Greek philosophical systems (Skepticism, Epicurianism, Stoicism) that offered moral bases but no hope.

------------------------------------------------------------------------------------------------

తమాషా ఏమిటంటే, adapt కావటం కోసం దేనినైనా adopt చేసుకోగలిగిన క్రైస్తవమతప్రచారకులు వీటిని కూడా క్రైస్తవంలోకి దించేశారు!


          గ్రేటరు గుడ్డు కెసం చేసే స్మాలరు సిన్ను పేరుతో మతప్రచారం కోసం ఏమాత్రం సిగ్గుపడకుండా ఎన్ని ఘాతుకాల్నైనా చెయ్యగలరు క్రైస్తవులు!తిరువళ్ళువార్ రోజూ సముద్రతీరానికి వెళ్తూ ఉండేవాడనీ, అక్కడున్న శ్రీలంకకి చెందిన ఒక వ్యాపారి బైబిలు ఇస్తే చదివి ముగ్ధుడైపోయి దానినే తిరుక్కురళ్ పేరుతో తమిళంలోకి అనువదించాడనీ అనటం ఇంకెవరన్నా చెయ్యగలరా?George Uglow Pope, the man who spread all these lies accepted his evil plan on his deathbed, "we're Christian missionaries, and we go there to convert peple, and if you want to convert people - you must read their own language, and I packed them"  in 1936 AD.But how could we make current generation tamil Christians to think about this deception?It is too late, now they won't even listen to you - because we were the sinners that spreading lies against Christianity!సెయింట్ ధామస్ - ఇండియా నివాసం గురించి భారతదేశం బయట ఉన్న క్రైస్తవులు ఎవరూ ఒప్పుకోరు,అసలు వారికి ఈ కధలు తెలియనే తెలియదు - అది భారతీయ క్రైస్తవుల కోసం మాత్రమే సృష్టించబడిన అబద్ధం!కానీ గొర్రెల కాపరి "నీకు నిన్న పెట్టింది చిట్టు,ఇప్పుడు పెట్టింది తవుడు!" అని చెప్తే "అబ్బో!ఎంత గొప్ప వెరైటీ?" అని  సంతోషం ప్రకటించే వెర్రిగొర్రెల వంటి భారతీయ క్రైస్తవులు మాత్రం నమ్మారు, నమ్ముతున్నారు, నమ్ముతూనే ఉంటారు.


          రెండు వందల ఏళ్ళ క్రితం ఎక్కడ భయంకరమైన అణచివేతని ఎదుర్కొన్నదో అక్కడ రాజమతం హోదాని సంపాదించుకోవడం విజయం అయితే ఎవరి కోసం జీసస్ క్రీస్తు ఉద్యమించాడో ఆ యూదులకి ఈ మతంలో స్థానం లేకపోవడం విషాదం. ప్రపంచంలోని ఇతరుల కోసం దుఃఖించే క్రైస్తవ సంఘాలు క్రీస్తు యొక్క స్వజనం కోసం ఎందుకు దుఃఖించరో?బహుశా, హిట్లరు లాంటి ఇంకో పదిమందిని ప్రోత్సహించి ఒక్క యూదు కూడా భూమి మీద లేకుండా చేశాక, అప్పుడు యూదుల సమాధుల ముందు మోకరిల్లి దుఃఖిస్తారు కాబోలు! అది కూడా తమ పాపాలకి క్షమాపణ కోసమేనేమో?


          రోము నగరంలో జీసస్ క్రీస్తు పుట్టిన 570 సంవత్సరాల తర్వాత మక్కాలో మరొక ఉద్దండపిండం పుట్టాడు. భక్తులు/అనుచరులు/బానిసలు మహమ్మదు అని పిలుచుకునే ఆఖరి ప్రవక్త అసలు పేరు అహ్మద్ ఖురేషీ.ఈ మహమ్మద్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు:1).క్రీ.శ. 570- మక్కాలో జననం (అప్పటికే తండ్రి చనిపోయాడు), 2).క్రీ.శ. 576 - తల్లి కూడా మరణించడంతో అనాధగా మారాడు, 3).క్రీ.శ. 595 - ఖదీజా అనే తనకంటే వయసెక్కువున్న ధనవంతురాలైన విదవరాలితో వివాహం, 4).క్రీ.శ. 610 - దేవదూత ద్వారా అల్లా తనకు వాక్యోపదేశం చేసాడని మొట్టమొదటి ప్రకటన, 5).క్రీ.శ. 619 - చిన్నాన్న మృతి, 6).క్రీ.శ. 622 - మక్కా నుండి మదీనాలో స్థిరపడటానికి ప్రయాణం (హిజ్రా), 7).క్రీ.శ. 623 - మక్కా ప్రయాణీకుల గుడారాలపై (caravans) దాడి చేయాలని తన అనుచరులకు ఆజ్ఞ, 8).క్రీ.శ. 624 - బద్ర్ యుద్ధంలో విజయం, 9).క్రీ.శ. 624 - ఖానుఖా యూదులను మదీనా నుండి నిర్మూలించుట, 10).క్రీ.శ. 624 - అబూ అఫక్‌ను హతమార్చమని అనుచరులకు ఆజ్ఞ, 11).క్రీ.శ. 624 - అస్మా బిన్త్ మర్వాన్‌ను హతమార్చమని ఆజ్ఞ, 12).క్రీ.శ. 624 - కబాల్ అష్రఫ్‌ను హతమార్చమని ఆజ్ఞ, 13).క్రీ.శ. 625 - ఉహద్ యుద్ధంలో ఓటమి, 14).క్రీ.శ. 625 - నాదిర్ యూదులను తరిమివేయుట, 15).క్రీ.శ. 627 - ట్రెంచి యుద్ధంలో విజయం (దీనినే ఖందక యుద్ధం అంటారు), 16).క్రీ.శ. 627 - ఖురైజా యూదుల ఊచకోత, 17).క్రీ.శ. 628 - మక్కావారితో హుదైబియా సంధి, 18).క్రీ.శ. 628 - ఖైబర్ యూదులను నాశనంచేసి మిగిలినవారిని తన నియంత్రణలోకి తెచ్చుకొనుట, 19).క్రీ.శ. 629 - మూతా యొద్ద క్రైస్తవ ప్రాంతాలపై దండయాత్రలో ఓటమి, 20).క్రీ.శ. 630 - ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఆశ్చర్యకరంగా మక్కా కైవసం, 21).క్రీ.శ. 631 - క్రైస్తవ ప్రదేశమైన తబూక్‌పై దాడి. ప్రతిఘటన లేకుండానే కైవసం, 22).క్రీ.శ. 632 - జబ్బుపడి మరణం.


           క్రైస్తవులు తొలినాళ్ళలో అణచివేతకి గురయి కొన్ని శతాబ్దాల పాటు గుంటకి గుక్కెడు నీళ్ళు తాగుతూ దేశాలు పట్టి తిరుగుతూ రహస్య జీవితం గడిపి మెల్లమెల్లగా ప్రజల నుంచి సానుభూతిని పొందుతూ ప్రజలకి సేవలు చేస్తూ ఎదిగాకనే చేజిక్కిన అధికారం పోకుండా ఉండేటందుకు ఇతర మతాలను తుడిచిపెట్టటం మొదలుపెట్టారు గానీ ముస్లిములు మొదటినుంచీ ఎదిరించినవాళ్ళని కత్తికో కండగా నరుకుతూ రక్తపిశాచుల మాదిరి అనాగరికతకి తుదిమెట్టున నిలిచి ఎంతటి ధైర్యస్థుడికైనా భయం గొలిపేటంత క్రూరమైన యుద్ధాలతో ఇతర మతాల్ని అణిచివేస్తూనే వ్యాపించారు.


          అణిచివేతకి గురవడం అంటే ఏమిటో వారికి తెలియదు - దానికి కారణం సంఖ్య తక్కువగా ఉన్నపుడు టకియానీ సంఖ్య తగినంతకి చేరుకున్నప్పుడు జెహాదునీ పాటించే విధానం వారిది.తొలినాళ్ళలో ప్రవక్తని చాలా హింసించారు,అణిచివెయ్యాలని చూశారు,చంపెయ్యాలని కూడా చూశారు.అందుకే విధిలేక యుద్ధాలు చెయ్యాల్సి వచ్చింది అని కొందరు ముస్లిం చరిత్రకారులు సమర్ధించుకుంటున్నారు గానీ అది అబద్ధం! .ప్రపంచంలోని ప్రవక్త యొక్క జీవితచరిత్రలలో మొట్టమొదటిదైన Ibn IshaQ రచించినది. అది ఏ విధమైన సందేహాలకి ఆస్కారం ఇవ్వకుండా కొన్ని వాస్తవాలని నిర్మొహమాటంగా చెబుతుంది.

=======================

          A year after his arrival in Medina, and thirteen years after his ‘call’, the apostle of Allah prepared himself for war in obedience to the command of Allah that he should attack the idolaters. He was then fiftythree years old.




          Religious hostility and a measure of personal resentment against the Quraysh idolaters were deeply implanted in the mind of the apostle. He had sworn vengeance against them and, now that his followers were settled in Medina, he felt the time had come to make good his threats.




          Not far from Medina was the main caravan route which the Quraysh used in their trade with the north. Frankincense, silk, precious metals and leather passed regularly back and forth between Mecca, Syria, Abyssinia, and the Yemen. The prizes were too rich not to add an irresistible weight to basically religious and political impulses. And attack on the caravans of the Quraysh meant an attack on what was simultaneously their weakest and most valued link.




          This was the first occasion on which the white banner of Muhammad was seen. Muhammad sent out from Medina sixty or eighty of the Emigrants, led by Ubayda; none of the Helpers accompanied them. They rode as far as the water in the Hijaz and there found a great trading caravan of Quraysh from Mecca. There was no battle, but Sad shot an arrow which was the first arrow shot in Islam. Then the parties separated. Two men fled from the Unbelievers to join the Muslims; these were alMiqdad and Utba.




          At the same time, the apostle sent his uncle, Hamza, with thirty riders to the seacoast at alIs; there they met a party of three hundred men from Mecca, led by Abu Jahl, but a man named Majdi who was on good terms with both sides mediated between them and they separated without coming to blows. Hamza also bore a white banner which had been tied on by Muhammad, and some say that this was the first time the banner was seen; but his expedition and that of Ubayda occurred at the same time and this has caused the confusion.




          The apostle himself next went forth in search of the Quraysh and reached Buwat, in the direction of Radwa. But he returned to Medina without encountering his enemies and remained in Medina for some weeks before he again went forth. He passed through the valley of the Banu Dinar, then through Fayfaul-Khabar, then halted under a tree in the valley of Ibn Azhar. Food had been prepared for him nearby; there he prayed, and there his mosque is. He and his companions ate, and the very spot on which his cookingvessel stood is still known. He continued his journey until he reached alUshayra in the valley of Yanbu and remained there for a month, forming alliances with neighbouring tribes along the seacoast, before returning to Medina. He encountered no enemies, the caravan from Mecca  commanded by Abu Sufyan  having passed before he reached alUshayra.




          When he returned from the expedition to alUshayra, the apostle remained at Medina for only ten nights before he had to sally out against one Kurz, who had plundered the herds of Medina. He marched as far as the valley of Safawan in the region of Badr, but was unable to overtake Kurz, and returned to Medina, where he remained for a further two months. This was the first expedition to Badr.




          Shortly after this expedition to Badr the apostle sent Abdullah b. Jahsh and eight Emigrants on a journey. He gave a letter to Abdullah, but ordered him not to read it till the end of a two days' march; he also told him to avoid giving offence to any of his companions.




          After Abdullah had marched two days' journey, he opened the letter, and found it contained the following instructions: 'Go on to Nakhla, between Mecca and AlTaif, and keep watch over the Quraysh there and bring back news of their business.' Abdullah said, 'I read and obey!' Then he told his companions about the letter, and added, 'He has also prohibited me from forcing any one of you to do anything against his will. If, therefore, any of you wishes to earn martyrdom, let him come with me; but if not, let him go back.' All his companions went with him, and none remained behind, but at Bahran two of the travellers lost the camel which they had been riding in turns and they fell behind to look for it. Abdullah marched on with the rest of his companions to Nakhla, where they came upon a Quraysh caravan laden with raisins, tanned hides, and various other goods., and accompanied by four men.




          When the caravan saw Abdullah and his companions they were afraid because they had alighted so near to them, but when Ukkasha – whose head was shaved like that of a pilgrim – approached them, they recovered their confidence and said, “These are pilgrims, and we need have no fear of them.’




          This took place on the last day of the sacred month Rajab [October]. Abdullah and his companions conferred among themselves: ‘If we allow these people to continue and reach sacred territory tonight, they will be safe from us; but if we attack them now, we profane the sacred month.’ And they vacillated and hesitated to attack, but at last mustered up their courage and agreed to slay as many of the Quraysh as they could, and take possession of what they had with them. So Waqid shot an arrow and killed one of the Quraysh, two others were made prisoner, and the fourth fled.




          Then Abdullah, with his companions, the caravan, and the prisoners, returned to Medina, saying, One fifth part of our plunder belongs to the apostle of Allah.’ This was before Allah had made it encument on Believers to give up a fifth part of any booty to Him. One fifth of the caravan was set aside for the apostle of Allah, and Abdullah distributed the rest anong his companions.




          When they arrived at Medina, however, the apostle said, 'I did not command you to fight in the holy month, and he walked away from the caravan and the prisoners, and refused to take anything from them. The captors were crestfallen and decided they were doomed, and their Muslim brethren too, reproved them for their deed. In Mecca, the Quraysh were saying: “Muhammad and his companions have violated the sacred month; they have shed blood in it, and taken booty, and captured prisoners.’ The Jews interpreted the event as a bad omen for the apostle.




          When speculation on the subject became widespread Allah revealed these words to His apostle: 'They will ask thee about the sacred month and the fighting. Say "To fight in the sacred month is a matter of grave import, but to obstruct the worship of Allah and not to believe in Him, to prevent men from entering the holy mosque or to drive them out of it, these are of even graver import." '




          So the apostle of Allah took possession of the caravan and the prisoners. The Quraysh sent men to negotiate for the ransom of the prisoners, but the apostle replied that he could not release them until the two Emigrants who had fallen behind Abdullah to look for their camel returned, because he feared the Quraysh might have met and harmed them. 'If you have killed them, we shall kill our prisoners,' he said. But the two wanderers returned and the apostle released the prisoners, one of them making profession of Islam and remaining in Medina with Muhammad.




          When Allah made plunder permissible He allowed four parts to those who had won it, and one part to Himself and to His apostle, exactly as Abdullah had done with the captured caravan.




          This was the occasion when the first booty was taken by the Muslims, when the first prisoners were taken by the Muslims and when the first man was slain by the Muslims. It was eighteen months since the Emigrants had arrived in Medina.

=======================


          నేను ఈ భాగాన్ని చాలాసార్లు చదివాను, చదివినప్పుడల్లా చాలా ఆశ్చర్యం వేస్తుంది - మా మతం అన్ని మతాల కంటె గొప్పది, మా ప్రవక్త అందరు ప్రవక్త కన గొప్పవాడు అని మురుసుకు చచ్చే ముస్లిములు ఇది చదవలేదా?"Religious hostility and a measure of personal resentment against the Quraysh idolaters were deeply implanted in the mind of the apostle" అనే ఈ వాక్యం ఇస్లామేతరుడు చేసిన విశ్లేషణ కాదు - రచయిత పదహారణాల ముస్లిం!అసలు Ibn HishaQ మతవ్యాప్తి కోసం అని చెప్పి వదిలివెయ్యకుండా పాతపగలని తీర్చుకోవడానికి కూడా యుద్ధాలు చేశాడని అంత గొప్పగా ఎలా చెప్పుకోగలిగాడో నాకు అర్ధం కావడం లేదు - ప్రపంచానికి శాంతిని ప్రసాదించడానికి అల్లా దేవుడు స్వయంగా ఎన్నుకుని ఈ భూమి మీదకి పంపించి అతనికి మాత్రమే కనబడుతూ వినబడుతూ ప్రత్యేకతను కట్టబెట్టిన ప్రవక్తలో పాతపగలను తీర్చుకునే దరిద్రపు మనస్తత్వం ఉండటం అంటే ఏమిటి?అసలు తను ప్రవక్తనని ప్రకటించుకున్న తొలినాళ్ళలో ఇతన్ని ఎవరు ద్వేషించారు?ఎందుకు హింసించారు?


          ఇప్పుడు తెలుస్తున్న ఖురాను సాహిత్యం ప్రకారమే, "అడుగో,అబూ మత్తాలిబ్ మనవడు - ఏమిటో, స్వర్గం - నతకం అంటూ కొత్త కధలు చెప్తున్నాడు!" అని నవ్వుకుంటూ పోయేవాళ్ళు తప్ప కనీసం చీదరించుకోను కూడా లేదు.At first the Pagan Arabs were tolerant and even curious about this new "prophet", they had a genuine interest in the monotheistic beliefs of the Jews and Christians and were willing to make room for another religious belief system in their society. It was not until Muhammad began insulting the traditional Pagan deities and insisting that the Pagan Arabs and their ancestors will burn in hell for eternity for worshiping false gods that they began to regard Muhammad and his followers with disdain. (Ibn Ishaq pg. 167)ఏమిటండీ ఇది?మొగుణ్ణి కొట్టి మొగసాలకి యెక్కినట్టు అప్పుడు తన చుట్టూ ఉన్న జుదాయిజం, క్రైస్తవం, మిత్రాయిజం, సబాయిజం లాంటి సమస్తమైన వాటినుంచీ తలకొకటి కాపీ కొట్టి వెరైటీ కోసం పేర్లుమార్చి చెబుతూ తనని పట్టించుకోని వాళ్ళని పాపులనీ నరకానికి పోతారనీ తిట్టినది తనయితే తమ మతాన్ని తిడుతుంటే సహించలేక తన్నినందుకు అవతలివాళ్ళు దుర్మార్గులా!


          సంఖ్య తక్కువున్నప్పుడు మనతో మంచితనం మూర్తీభవించినట్టు కనిపిస్తున్న మర్యాదస్తులైన ముస్లిములతో మనమూ మచిగా ఉంటే సంఖ్య ఎక్కువై జెహాదు మొదలైనప్పుడు మనల్ని కాపాడతారని అనుకుంటే అంతకన్న తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు - స్వజనం తనని నరకయాతన పెడుతున్నప్పుడు ఆదరించి అక్కున జేర్చుకుని తను వూపిరి పీల్చుకుని బలం పుంజుకోవటానికి సహాయపడిన మూడు మదీనా యూదు తెగల్ని ప్రవక్తయే తన దారికి రానందుకు కినిసి సర్వనాశనం చేసేశాడు!Banu Qaynuqa తెగని క్రీ.శ. 624లో Banu Nadir తెగని క్రీ.శ. 625లో అక్కడినుంచి వెళ్ళగొట్టి ఇక ఒంటరై మిగిలిన Banu Qurayza తెగని క్రీ.శ. 627లో మట్టగించి పారేసి పాముకి పాలుపొయ్యడం లాంటి ముస్లిములకి సాయం చెయ్యడం ఎట్లా ఉంటుందో లోకానికి తెలియజేశాడు - తెలియాల్సినవాళ్ళకి మాత్రం తెలియడం లేదు, ఏం చెస్తాం?


          "మహమ్మద్ తననుతాను పొగుడుకొని ఆనందించే స్వార్థపరుడు (narcissist), పిల్లలతో లైంగిక కలాపాలు చేసేవాడు (pedophile), సామూహిక నరహంతకుడు (mass murderer), తీవ్రవాది, స్త్రీద్వేషి (misogynist), కామాంధుడు (lecher), పిచ్చివాడు, బలాత్కారుడు, దోపిడీదారుడు, కుట్రదారుడు" అని ముస్లిం మతభ్రష్టుడైన అలీ సినా (Ali Sina) ప్రకటించాడు. ఇది తప్పు అని ఎవరైనా తమ పవిత్ర ఖురాన్ మరియు ఇస్లామిక్ గ్రంథాలనుండి నిరూపించినట్లైతే 50,000 డాలర్ల బహుమానం ఇస్తానని మరియు తన ఆరోపణలను ఉపసంహరిచుకొంటానని బహిరంగ సవాలు విసిరారు. ఈ సవాలు ఇప్పటికీ నిలిచి ఉంది.

          నిజం చీర కట్టేలోపు అబద్ధం వూరంతా చుట్టి వస్తుందన్నట్టు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంత కప్పెయ్యాలని చూసినా ప్రాచీన వైదిక సాహిత్యపు ప్రతిధ్వనులు ఆయా మతాల వారి విశిష్ట గ్రంధాల  నుంచి వినబడుతూనే ఉంటాయి!గురికి బెత్తెడు ఎడం అన్నట్టు చెబితే సుకుమారులకి ఎక్కదు గనక వారి మతగ్రంధాలలోని ప్రముఖమైనవాటిని గురించి మాత్రమే ఇక్కడ చెబుతాను.బైబిలు ఆధారిత సాహిత్యంలో చాలా చోట్ల కనిపించే Greater Flood అనే సంఘటనకి వారు నిర్ధారించిన కాలం ద్వారక మునిగిపోయి కలి ప్రారంభం కావడానికి హిందూపూర్వరుషులు చెప్పిన February 18, 3102 B.C.తో సరిపోతున్నది.ఆరవ శతాబ్దం నుండి పధ్నాల్గవ శతాబ్దం మధ్యన రచించబడిన Persian, Islamic, European రచనలలో దీనికి సాక్ష్యాలు దొరుకుతాయి.




          బైబిలు పాత నిబంధన Biblical Floodకి ముందు జీవించిన కొందరి ఆయుర్దాయాలని ఇచ్చింది, అవి ఇలా ఉన్నాయి:Adam, 930; Seth, 912; Enos, 905; Kenan, 910; Mahaleel, 895; Jared, 962; Enoch, 365; Methuselah, 969; Lamech, 777; and Noah, 950. - సరాసరి చూస్తే అందరి సగటు వయస్సు 912 సంవత్సరాలు!అదే గ్రంధంలో Biblical Floodకి తర్వాత జీవించిన కొందరి ఆయుర్దాయాలని ఇచ్చింది, అవి ఇలా ఉన్నాయి:Shem, 600; Arphachshad, 438; Salah, 433; Eber, 464; Plelg, 239; Reu, 239; Serug, 230; Nahor, 148; Terah, 205; Abraham, 175; Isaac, 180; Job, 210; Jacob, 147; Levi, 137; Kohath, 133; Amaram, 137; Moses, 120; and Joshua, 110. - వీటిలో క్రమేణ తరుగుదల కనిపిస్తూ ప్రాచీనహిందూఋషులు కలియుగానికి నిర్దేశించిన మానవుల జీవితకాలం 100కి చేరడం ఆశ్చర్యంగా లేదూ!Berosus అనే Babylonian చరిత్రకారుశు Greater Floodకి ముందరి Babylonian రాజుల పరిపాలనాకాలం 432000 సమవ్త్సరాలు అని చెప్పాడు,ఇది హిందూఋషులు చెప్పిన 4,3,2,1 నిష్పత్తులలో కలి,ద్వాపర,త్రేతా, సత్య యుగాలు కలిసిన ఒక మహాయుగం యొక్క పరిమాణం అవుతుంది.

          ఇస్లాము పుట్టక ముందరి అరేబియా సంస్కృతికి సుమేరియన్ నాగరికత తల్లివేరు లాంటిది.ఆ సుమేరియన్ నాగరికత  ప్రాచీన వైదిక సంస్కృతిని పోలి ఉంటుంది.అందువల్ల అర్ధాలు తెలియకుండా విన్నది విన్నట్టు కాపీ కొట్టిన చిలక పలుకుల ఆఖరి ప్రవక్త స్థాపించ్గిన ఇస్లాము ధర్మంలో కూడా హిందూధర్మం పోలికలు కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి.మచ్చుకు కొన్ని మెచ్చ్గుతునకలు:మక్కాలోని కాబాగుడి ఒక శివాలయం.వాళ్ళు పవిత్రం అని చెప్పుకునే 786 అనేది సంస్కృతంలోని ఓంకారాన్ని విడదీసి తిరగేసిన ఆకారం.అక్కడ ఇప్పుడు ఉన్న "గంగ" ఆనె పేరును ఖూనీ చేసి "zamzam" అనే పేరు పెట్టి పిలుచుకుంటున్న బావిని తవ్వింది అహ్మద్ ఖురేషీ తాత.అల్లా దేవుడి కూతుళ్ళు అని చెప్పబడే Al-Uzza,Al-Lat, Menat పేర్లు గల దేవతలు హిందూమతంలోని త్రిమాతలను పోలినవారు.హిందువులు ఆలయం లోపలికి వెళ్ళాక దైవదర్శనానికి ముందు గర్భాలయం చుట్టూ సవ్యదిశలో చేసే ఏడు ప్రదక్షిణాలనే కాపీ కొట్టినట్టు తెలియకుండా ఉండటానికి అపసవ్య దిశలో చెయ్యమని ప్రవక్త చెప్తే భక్తులు/అనుచరులు/బానిసలు ఎందుకు అని అడక్కుండా చేసేస్తున్నారు.అసలు మక్కా లోని కాబా తెరిచే సమయం ఏమిటో తెలుసా - శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదోషకాలం!

          అసలైన విశేషం ఒకటి చెబుతాను కళ్ళు విప్పార్చుకుని చెవులు రిక్కించుకుని వినండి! హిందువులకి ప్రతి అర్చామూర్తికీ శతనామావళి,అష్టోత్తర సతనామావళి,త్రిశతి,సహస్ర నామావళి అని పేర్లు పెట్టుకుని కీర్తించే లక్షణం ఉంది.ముస్లిములు దాన్ని కూడా కాపీ కొట్టేశారు.Al-Asma-ul-Husna ( اَلاسْمَاءُ الْحُسناى )  గురించి ఏ ముల్లాని అడిగినా చెప్తాడు.పేర్లూ వాటికి ఇచ్చిన ఆర్ధాలూ అచ్చు హిందూ దేవతల పేర్లకి మల్లే ముచ్చట గొలుపుతాయి.హిందూ అదేఅవ్తాల్ నామావళిలో మాదిరే మోద్ట ఆ పేర్లని గురించి పొగడ్తలు ఉంటాయి. అన్నీ అయిపోయాక ఫలశ్రుతి కూడా ఉంటుంది సుమండీ!

          అమెరికా ఉత్తర ఖండంలోని Native Sioux Indians తాము పాటించే మతాన్ని ఆకాశం నుంచి ఒక దివ్యాంగన దిగివచ్చి ఇచ్చిందని చెబుతారు.ఆమె కాలంలో నాలుగు యుగాలు ఉంటాయనీ ఒక sacred buffalo కూడా ఉంటుందనీ మొదటి యుగంలో నాలుగు కాళ్ళు ఉండి తర్వాత యుగాల్లో యుగాని కొక కాలు పోతుందనీ చెప్పిందట.ఇప్పుడు చివరి యుగంలో ఉన్నామనీ ఇప్పుడు ఆ sacred buffalo ఒంటికాలితోనే ఉందనీ Native Sioux Indians నమ్ముతున్నారు.



          ప్రపంచంలో జుదాయిజం, జొరాష్ట్రియనిజం, మిత్రాయిజం, సబాయిజం వంటివి ఎన్నో ఉన్నాయి కదా - ఈ రెండింటి ప్రత్యేకమైన లక్షణం ఏమిటి?Both the Christians and Muslims were quite intolerant. They believed that their God was the only God and that their Savior was the only savior.  More than that, they also believed that Their God through their Prophet had commanded them to spread the faith by converting others. As a consequence, both Christians and Muslims were not willing to let others follow their own faiths.ఈ రెండు మతాలూ పుట్టినది హిందూమతం యొక్క శాఖల వంటి ఇతర మతాల మీదనే కాబట్టి వాటికి మూలమైన హిందూమతాన్ని ఏమీ చెయ్యలేకపోతున్నామనే కసి వాటిలో ఉంది. అతి ముఖ్యమైన ద్వేష కారణం ప్రపంచం మొత్తాన్ని వారి మతంతో నింపాలనే వారి ప్రవక్తల ఆజ్ఞని నెరవేర్చడానికి  ప్రధానమైన అడ్డంకి హిందూమతమే అన్నది వారికి తెలుసు!ఈ ఆఖరి శత్రువుని గెలవడం కోసం ఇవ్వాళ ప్రపంచస్థాయిలో ఎంత డబ్బుని పెట్టుబడి పెడుతున్నారో, ఎంతమంది మనుషుల్ని వినియోగిస్తున్నారో తెలుసుకుంటే హిందువులే కాదు నిష్పక్షపాత బుద్ధి కలిగిన నాస్తికులు సైతం నిర్ఘాంతపోతారు!

          హిందువులు ఈ రెండు మతాల  పట్ల నిరంతరం హెచ్చరికతో ఉండాలి.హిందూమతాన్ని ఈ రెండు మతాల వారి దాడినుంచి కాపాడుకోవటం కేవలం బ్రాహ్మణులకే వదలకుండా అన్ని కులాల వారూ బాధ్యత తీసుకోవాలి.రోములోనూ మక్కాలోనూ జరిగినది ఇండియాలో జరగనివ్వకూడదు.వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధ పర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్టితమైన నా గురుపరంపర నాకు ఇచ్చిన వివేకంతో నేను హిందువులకి చెబుతున్నది ఒకటే - చరిత్రను చదివినందుకు ఒకసారి జరిగిన పొరపాటల్ను మళ్ళీ జరగనివ్వకూడదనే పటుదలని పెంచుకోవడం అనేది పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనది అవుతుందో అదే సుందరమైనదీ అవుతుంది!



సత్యం శివం సుందరం!!!


కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...