Saturday 28 November 2015

మల్లీశ్వరి గొప్పదా?పాతాళ భైరవి గొప్పదా?

     మల్లీశ్వరి అనే సినిమా తియ్యకపోయి ఉంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే కవి కొందరికి మాత్రమే తెలిసి ఉండేవాడు!"వూర్వశి","కృష్ణ పక్షం" లాంటివి చదువు రానివాళ్ళకి యెలా తెలుస్తాయి?అవి చదవగలిగిన వాళ్ళు కూడా మల్లీశ్వరి తియ్యకపోయి ఉంటే కాళిదాసు మేఘసందేశంతో పోల్చదగిన "ఓ మేఘమాలా" పాటని యెట్లా ఆస్వాదించేవాళ్ళు?!
     కధ చాలా చిన్నది.నాగరాజు,మల్లీశ్వరి వరసైన వాళ్ళు.నాగరాజు శిల్పవిద్య నేర్చుకుంటున్నాడు.ఒకసారి తిరునాళ్ళకి వెళ్ళి తిరిగి వస్తూ మధ్యదారిలో వర్షం మూలంగా ఒక గుడిలో ఆగుతారు.అప్పటికే అక్కడ ఇద్దరు పెద్దమనుషులు ఉంటారు.మల్లీశ్వరి చేసిన నాట్యం చూసి యేదైనా వరం కోరుకోమంటే నాగరాజు వీళ్ళేమిటి రాజులకి మల్లే పోజులు కొడుతున్నారు అనిపించి రాణీవాసం పల్లకీ పంపించండి అని ఆటపట్టింపుగా అంటాడు.మల్లీశ్వరి కూడా అదే వరసలో రెచ్చిపోతుంది.వర్షం తగ్గి ఇంటికెళ్ళే దారిలోనే నవ్వుకుని అక్కడితో వాళ్ళని వీళ్ళు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోలేదు.పైగా అది నిజమైన కోరికే అనుకున్నారు - ఇంతకీ వాళ్ళు మారువేషంలో రాజ్యమంతటా తిరుగుతున్న శ్రీకృష్ణదేవరాయలూ ధూర్జటీ!ఇంటికెళ్ళిన తర్వాత కధ మలుపు తిరుగుతుంది.మల్లీశ్వరి తల్లికి నాగరాజు అంటే చిన్నచూపు ఉందని తెలియడంతో అత్త కళ్ళు భ్రమసేటంత ధనం సంపాదించుకు వస్తానని పంతం పట్టి వూరు వదిలి పోతాడు నాగరాజు!రాయలవారు పల్లకీ పంపించగా మల్లీశ్వరి రాణివాసం చేరుతుంది.వూరు వదలి వెళ్ళిన నాగరాజు అదృష్తవశాత్తూ తిమ్మరుసు అనుగ్రహానికి పాత్రుడై పనతం నెరవేర్చుకుని తిరిగి వస్తే ఈ కబురు తెలుస్తుంది.యెలాగైనా మల్లీశ్వరిని కలవాలని దొంగతనంగా వెళ్ళటం వల్ల అంతఃపురంలో పట్టుబడతాడు.మల్లీశ్వరి కోసం వచ్చాడని తెలిసి ఇద్దర్నీ ఖైదు చేస్తారు,కానీ సభలో విచారణ జరుగుతున్నప్పుడు రాయలవారు తాము మారువేషాల్లో ఉండటం వల్ల గుర్తుపట్టలేక తమాషాకి అన్నారని తెలుసుకుని వొదిలెయ్యటంతో కధ సుఖాంతమవుతుంది.కధకి ఒక ప్రముఖ పత్రికలో పడిన చిన్న కధ ఆధారమని చెప్తారు,కానీ కధ కన్నా సంభాషణల్లోని చమత్కారమూ,పాటల్లోని కవిత్వమూ ఒకదానితో మరొకటి పోటీ పడటం వల్లనే అజరామరమైన దృశ్యకావ్యంగా నిలిచింది."వెళ్ళు వెళ్ళు,కలకండ భక్తురాలు!" ,"ఇల్లల్లా కొడితే తట్టెడు మట్టయినా రాలదు,ఏం చూసి పిల్లనిస్తారూ?" లాంటి పదశయ్యా "నల్లని మబ్బులు గుంపులు గుంపులు,తెల్లని కొంగలు బారులు బారులు","పిలచినా బిగువటరా","భళిరా యెక్కడినుండి జారెనీ మెరుపుతీగ" లాంటి స్వరధునీ సాటిలేనివే!

     ఇక,పాతాళ భైరవి మాయలూ మంత్రాలతో నిండిన ఒక  కట్టుకధ!నమ్మడానికి వీల్లేని విషయాల్ని నమ్మేటట్టు చేసే చాతుర్యం తప్ప ఇందులో కధ కూడా చిన్నదే!కధలో గానీ ఇతర అంశాల్లో గానీ పోల్చడానికి వీల్లేని రెండు సినిమాల్లో ఏది గొప్పది అంటే తేల్చడం కష్టమే,కానీ నా వోటు మాత్రం పాతాళ భైరవికే!
     ఎందుకంటే ఒక పిల్లదీ కుర్రాడూ ప్రేమించుకుని,విడిపోయి,కల్స్కోవటం అదే లైనులో ఉన్నవాళ్ళకీ భావుకత యెక్కువగా ఉన్నవాళ్ళకీ తప్ప మిగిలిన వాళ్ళకి కనెక్ట్ అవదు.అదే తోటరాముడు చూదండి - జత్గాడితో కలిసి అల్లరి చేస్తాడు, చాదసతపు తల్లిని ఆటపట్టిస్తాడు,రాజుగారి బామ్మర్దిని కూడా ముందూ వెనకా చూదకుండా పంబ రేగ్గొడతాడు,నచ్చిన ఆడపిల్ల ఉజ్జయిని రాకుమారై అయినా సరే పెళ్ళాడి తీరతానంటాడు.సమాజం కోసం కప్పుకున్న పరదాలు తీసేస్తే ప్రతివాడికీ ఉండే సరదాలు  ఉన్నవాడు యెవడికి నచ్చడు?తోటరాముడు ఆది సాహసి,నేపాళ మాంత్రికుడు కలవకపోయినా ఉజ్జయిని రాకుమారిని పెళ్ళాడగలిగిన సాహసం వాడిలో ఉంది!అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలని కలలు గనే ప్రతి ఒక్కరూ తోటరాముడిలో తమనే చూసుకుంటారు,చివరికి తోటరాముడికి జరిగినట్టే తను కోరుకున్నది తనకూ దక్కుతుందనే నమ్మకం కలుగుతుంది.ఒక కళారూపం వల్ల ప్రయోజనం ఉండాలంటే అది యెక్కువమందికి చేరువ కావడం ముఖ్యం - ఆ లక్షణం మల్లీశ్వరి కన్నా పాతాళ భైరవి లోనే ఎక్కువగా ఉంది.

     ఒకానొకప్పుడు నటుల్నీ విటుల్నీ ఒక్కటిగా చూసి పంక్తిబాహ్యుల్ని చేసేశారు.ఇప్పుడు సినిమాల్లో హీరో వేషాలు వేసే నటుల్ని దేవుళ్ళ లెక్కన చూసి వాళ్ళు తెరమీద యేం తింటే ఇంట్లో తమూ అదే తినాలనీ వాళ్ళు తెరమీద యే డ్రస్సు తొడిగితే తామూ అదే డ్రస్సు తొడగాలనీ డైలాగు రైటర్లు రాసిచ్చిన పంచ్ డైలాగులు తమ హీరోనే స్వయంగా చెప్తున్నాడనీ తాము కూడా ఆ మాదిరి ఫైట్లు చేసేసి అమ్మాయిలతో ఆ మాదిరి రొమాన్సు చెయ్యాలనుకునీ  పిచ్చెక్కిపోతున్నారు.కానీ ఆ నటులు హీరోల్లా కనపడటానికి హంగులు సమకూరుస్తున్న నిర్మాత,దర్శకుడు,కధాసంభాషణాదిగీతరచయితలు,నృత్యదర్శకులు,ఫొటోగ్రాఫర్లు లాంటి సాంకేతిక నిపుణులు మాత్రం ఇంకా నస్మరంతి గాళ్ళలాగే మిగిలిపోతున్నారు.దేవులపల్లి కృష్ణశాస్త్రిని మహాకవి అని నిస్సందేహంగా అనగలిగిన వాళ్ళు పింగళి నాగేంద్ర రావుని అనటానికి సందేహిస్తున్నారు, యెందుకు?కేవలం ఆయన సినిమాల ద్వారా పరిచయం కావడమే తప్ప మహాకవి అని పిలవడానికి కావలసిన అన్ని అర్హతలూ ఉన్నాయి!యెన్ని పదబంధాల్ని సృష్టించాడు?యెంత తాత్వికతని ఒలికించాడు?ఆజన్మ బ్రహ్మచారి అయి ఉండి ప్రేయసీ ప్రియుల మనసులో కదలాడే సుకుమారమైన భావాల్ని కూడా పట్టుకోవటానికి ఆత్మ యే స్థాయిలో కదలాలి?!
     నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29 న శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాంలో జన్మించాడు. ఆయన తండ్రి గోపాల క్రిష్ణయ్య యార్లగడ్డ గ్రామానికి కరణంగా ఉంటూ నాగేంద్రరావు జననానికి పూర్వమే కరణీకాన్ని వదులుకుని విశాఖలో ఉన్న ఆయన తమ్ముళ్ల దగ్గరికి వచ్చేశారు. నాగేంద్రరావు పినతండ్రులలో ఒకరు డిప్యూటీ కలెక్టర్ మరొకరు ప్లీడర్. నాగేంద్రరావు అన్న శ్రీరాములు 1913 లోనే భారతదేశాన్ని వదిలి 1926 నుంచి ఆస్ట్రేలియాలో పంచదార ఎగుమతి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. పింగళికి రెండేళ్ళ వయసులో ఆయన కుటుంబం బందరుకు వలస వెళ్లింది.నాగేంద్రరావు తల్లి మహాలక్ష్మమ్మది దివి తాలూకా. ఆయన చిన్నతనం నుంచీ కృష్ణా జిల్లాలోనే ఉంటూ ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కోపల్లె హనుమంతరావు ప్రభృతులు స్థాపించిన ఈ కళాశాలలో తొలి విద్యార్థుల బృందంలో నాగేంద్రరావు ఒకడు. మంగినపూడి పురుషోత్తమ శర్మ అనే సుప్రసిద్ధ కవీ, మాధవపెద్ది వెంకట్రామయ్య అనే ప్రఖ్యాత స్టేజీ నటుడు ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళే. ఆంధ్రకంతటికీ గర్వకారణంగా వెలసిన ఆంధ్ర జాతీయ కళాశాల యొక్క తొలి విద్యార్థులలో ఒకడైన కారణం చేత కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మొదలైన వారి పరిచయం లభించింది.

     సాహిత్యసృజనలో యేమాత్రం ప్రతిభ లేకుండా,లోకవృత్తపరిశీలన చెయ్యకుండా చలనచిత్ర రంగానికి వచ్చి ఉంటే "ఆడువారి మాటలకూ అర్ధాలె వేరులే","రాగములో అనురాగములో చిందిన","లాహిరి లాహిరి లాహిరిలో ఈ జగమే వూగెనుగా","ఔరౌర గారెలల్ల,అయ్యారె బూరెలిల్ల" లాంటి అత్యధ్భుతమైన పదబంధాల్ని సృష్టించడం సాధ్యమయ్యేదేనా?కృష్ణాజిల్లా లోని ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు.కోపల్లె హనుమంతరావు ప్రభృతులు స్థాపించిన ఆంధ్రుల కందరికీ గర్వకారణంగా వెలసిన ఆంధ్ర జాతీఊ కళాశాల యొక్క తొలి విద్యార్ధులలో ఒకడైన కారణం చేత ఆనాటికి ప్రముఖులైన కోపల్లె హనుమంతరావు,భోగరాజు పట్టాభి సీతారామయ్య,మట్నూరి కృష్నారావు మొదలైన వారి పరిచయం లభించింది.1918లో చదువు పొర్తి చేసి ఖర్గపూరులోని రైల్వే వర్కుషాపులో అప్రెంటిస్ పని కొంత కాలం చేసి ఆరొగ్యపరమయిన ఇబ్బందుల వల్ల ఆఫీసుపనిలోకి మారాడు.ప్రసిధ్ధ వ్యాయామవేత్త హరిరామజోగారావుగారి ఉత్తేజభరితమైన జాతీయోద్యమ ప్రసంగాలకి ప్రభావితుడై 1920లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఉత్తరదేస యాత్రకి శ్రీకారం చుట్టాడు.ఖర్గపూరులో ఉన్నప్పుడే దివ్యజ్~ఞానసమాజంలో సభ్యుడుగా నంపెదు అయ్యాడు.అలా యెక్కడికెళితే అకక్డ దివ్యజ్ఞానసమాజం వారి ఆశ్రమాల్లో బసచేస్తూ ఉతరదేశంలో చాలాభాగం పర్యటించి సబర్మతి చేరుకున్నాడు.స్వభావ్తః బ్రహ్మచారి,ప్రవృత్తి రీత్యా సన్యాసి అయినప్పటికీ సన్యాసం ఇవ్వకుండా పదిహేను రోజుల తర్వాత ఇతను ఆశ్రమవాసిగా కన్నా కాంగ్రెసు సంస్థలో చేరితే దేఅససేవ చేయగలుగుతాదని నిర్ణయించారు!

     దీనికి సానుకూల పడేటందుకు కాకా కలేల్కర్ గారు అప్పటి కృష్ణాజిల్లా కాంగ్రెసు అధ్యక్షులు ధన్వాడ హనుమంతరావు గారికి పరిచయపత్రం రాసి ఇవ్వడంతో నాగేద్రరావుకు కాంగ్రెసు ఆర్గనైజరు వుద్యోగం జీతభత్యాలతో సహా లభించింది.ఈ వుద్యోహ్గంలో ఉండగానే కొన్ని దేశబహ్క్తి గీతాల్ని "జన్మభూమి" పేరుతో పుస్తకంగా ప్రచురించాడు.దీనికి గాను అరెస్టయి కూడా జిల్లా కలెక్తరు కేవలం మందలిచి వదిలేశాడు.తర్వాత మళ్ళీ పట్టాభి సీతారామయ్య గారు ఆర్ధికస్థోమత ఉన్నవాళ్ళే కాంగ్రెసుకి ఎక్కువ సేవ చెయ్యగలరు కానీ బతుకుదెరువు కోసం కాంగ్రెసు మీద ఆధారపడిన వాళ్ళు పార్టీకి భారం అవుతారనే సూచన నచ్చడం వల్ల ఆ ఉద్యోగాన్ని వదిలేసి పత్రికారంగంలోకి ప్రవేశించాడు.సరిగ్గ్గా ఇదే సమయంలో బందరులో కౌతా శ్రీరామశాస్త్రి మోడ్రన్ రివ్యూ,ప్రవాసి వంటి పత్రికల స్థాయిలో తెలుగులో కూడా ఒక పత్రిక తేవాలని అనుకుంటుంటే పట్టాభి గారు నాగేంద్రరావుని సిఫార్సు చేశారు.1923లో శారద అనే పేరుతో మొదలైన ఈ పత్రిక 1924లో నిలిచిపోయేవరకొ శ్రీరామశాస్త్రికి సహాయంగా ఉంటూ తనవంతు సాయం తనూ చేశాడు.ఈ కాలం నాటి నాటక రచనలనూ సాహిత్యసృజననూ పింగళీయం అనే పేరుతో చేశాడు.

     నాగేంద్రరావుకు చిన్నతనం నుంచీ రచనలో ప్రవేశం ఉంది,ముఖ్యంగా నాతక రచన అనతనికి చాలా ఇష్తమైనది.దానితో శారదలో పనిచేసే రోజులోనే ద్విజేంద్రరాయ్ బెంగాళీ నాటకాలు "మేవాడ్ పతన్" పాషాణీ తర్జుమా చేస్తే కృష్ణా పత్రికలో ప్రచురించారు.తన సొంత రచనలైన నాటకాలు "జేబున్నీసా","వింధ్యరాణి" కృష్ణాపత్రికలో ధారావహికలు గానూ "నా రాజు" భారతిలోనూ పరచ్రించబడినాయి."జేబున్నీసా" నాటకాన్ని ప్రదర్శించకుండా ఆపటానికి మహమ్మదీయులు ఉద్యమాలు చేస్తుండేసరికి హిందూ-ముస్లిం ఘర్షణలకు దారితీస్తుందనే ఉద్దేశంతో 1923లో మద్రాసు ప్రభుత్వం ఈ నాటకాన్ని నిషేధించింది.అకారణంగా శారద నిలిచిపోగానే అప్పటికి నాతకరంగంలో లబ్ధప్రతిష్టుదైన డి.వి.సుబ్బారావు గారి ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో సెక్రెటరీ ఉద్యోగం దొరికింది!1946 వర్కూ అక్కడే వుండి నాతకరచన లోని మెళకువలనూ,ప్రేక్షకుల అభిరుచులలోని వైవిధ్యాల్ని పసిగట్టే నేర్పునూ - ముఖ్యంగా చెప్పాల్సిన భావాన్ని రూపం మార్చి అయినా సరే ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా పోతూనే యెట్లా యెక్కించాలి అనేది ఇక్కడే నేర్చుకున్నాడు,సినీ రచనలో ఇతని ప్రత్యేకత కూడా అదే కదా!అంతటి ప్రతిభాశాలి గనకనే నేపాళ మాంత్రికుడి చేత కళాకారు లందరికీ వర్తించే "జనం కోరింది మనం శాయడమా?మనం చేసింది జనం చూడడమా!" అనే సందేహాన్ని బయటపెట్టించాడు?!

     అక్కడ సందర్భానికి అది ఒక గారడీ వాడు తను చెయ్యాలనుకుంటున్న ట్రిక్కిలకి శిష్యుణ్ణీ కొంటెగా అడిగిన అతి మామూలు తింగరి ప్రశ్నలా అనిపిస్తుంది గానీ ఒకానొక ప్రముఖ సాహితీ విమర్శకుడు అది రచయిత,గాయకుడు,చిత్రకారుడు,నటుడు,శిల్పి అనే భెదం లేకుండా ప్రతి కళాకారుడి ముందూ తన జీవితకాలంలో యేదో ఒక మలుపులో ఎదురయ్యే ఒక గంభీరమైన ప్రశ్నగా తీర్మానించారు!తన మనస్సులో ఉన్న భావాల్ని చెప్పి జనాన్ని తను చెప్పిన విషయం కొత్తగా ఉన్నా సరే మెచ్చుకునే విధంగా ప్రేక్షకుల్ని వశంవర్తులని చేసుకోగలొగిన స్థాయి ఉన్నవాళ్ళు రెండో పధ్ధతి యెన్నుకుంటారు!జ్ఞాధికులైన తాత్వికులకి మాత్రమే అది సాధ్యపడుతుంది గాబట్టి ఆ శక్తి లేని ఇప్పటి సినిమా రచయితల మాదిరి జనంలో ఉన్న మాయరోగాల్ని కెలికుతూ నరాల్ని ఉద్రేకపరిచే తక్కువస్త్జాయిదైన మొదటి రకంతో సరిపెట్టుకుంటారు!

     పింగళి నాగేంద్రరావు కిటుకు తెలిసినవాడు గనక్ రెంటినీ సమానంగా నడుపుకు రాగలిగాడు,అందువల్లనే "నారాజు","వింధ్యరాణి" అధ్భుతమైన విజయాన్ని సాధించాయి.వింధ్యరాణి నాటకం యెంత పేరు ప్రఖ్యాతులు సాధించిందంటే  బందరు నివాసి అయిన డాక్టర్ వి.దుర్గా నాగేశ్వరరావు ఆ నాటకాన్ని డివి.సుబ్బారావునే నాయక్య్డిగా పెట్టి సినిమా తియ్యడానికి వైజయంతి ఫిలంస్ సంస్థని స్థాపించాడు!ఈ సంస్థ స్థాపించిన కొద్ది కాలానికే ఎన్.జగన్నాధ అనె అతను వచ్చి చేరాడు.అతను ఇంతకుమునుపే "తారుమారు" అనే ఆరురీళ్ళ సినిమాని తీసి ఉన్నాడు.మరో పదివేల అడుగుల సినిమా తీసి రెంటినీ కలిపి విడుదల చెయ్యటంలో తనకి సహాయం చేస్తే బాగుంటుందనీ, ఆ చిన్న సినిమా నిర్మాణంలోని అనుభవంతో వింధ్యరాణి అనే పెద్ద సినిమా తియ్య్యవచ్చుననీ దుర్గా నాగేశ్వరరావుని ఒప్పించాడు.జగన్నాధ్ రెండో సినిమాగా తియ్యాలనుకున్నది మోలియర్ రచనకి అనువాదమయిన "భలే పెళ్ళి",ఇదే సాంకేతికంగా నాగేంద్రరావుకి సినిమా అరచయితగా మొదటి అవకాశం అయింది.అయితే ఈ సినిమా నాగేంద్రరావుని సినిమాల్లో నిలబెట్టలేదు,రెందవ ప్రపంచయుధ్ధం కమ్ముకొచ్చి మద్రాసు అంతా ఖాళీ అయిపోయిన రోజుల్లో సినిమాలు ఆడటం అసంభవమైపోయి తియ్యటం మహాకష్టం అయిపోగా మళ్ళీ నాగేంద్రరావు బందరు వెళ్ళిపోయాడు.వైజయంతి ఫిలింస్ వారు పట్టు వదలకుండా జెమిని స్టూడియో వారి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించింది.దీనికి సి.పుల్లయ్య గారు దర్శక్యులు.అలా 1946loe మళ్ళీ నాగేంద్రరావు తిరిగి మద్రాసు వచ్చి సి.పుల్లయా గారి పర్యవేక్షనలో వింధ్యరాణి స్క్రిప్టు తయారు చహెశాడు.ఆ తర్వాత ఇంక 1971లో విడుదలయిన రాజకోత రహయం వరకూ మటల్లో పాటల్లో తెలుగుబాషని చిందులు తొక్కించాడు,బోడి సిన్మా కవిత్వం అనుకునే రోజుల నుంచీ సినిమా పాటల్లోనూ మహాకవులకి తీసిపోని శబ్దాలంకారం, భావాలంకారం రెంటితోనూ ఆటాడేసుకుని తెలుగుభాషనీ తన పేరులో ఉన్న నాగేంద్రుడి నాగేంద్రుడి నడకలో ఎన్ని మెలికలు ఉంటాయో అన్ని మెలికలూ తిప్పి చూపించాడు!

     1949లో విడుదలైన గునసుందరి కధ షేక్స్పియర్ కింగ్ లియర్ కధలోని మూలసూత్రాన్ని తీసుకుని ఆయ పాత్ర్లకి తెలుగుదనాన్ని అద్ది  అసలు కధ కింగ్ లియర్ వేదనతో సమాప్తమై దుఃఖాంతం కాగా అతిమానుష శక్తుల ప్రమేయంతో సుఖాంతం అయ్యింది.ఇందులోని హీరో పాత్ర పేరు దైవాధీనం!పేరుకి తగ్గట్టుగానే కంటిచూపు కూడా లేని ముసలితనంలో రాజకుమార్తెనే పెళ్ళాడేస్తాడు.దుర్మార్గులైఅన్ ఇద్దరు అకటావు=ఇకటపు తోడల్లుళ్ళ పేర్లు హరమతి,కాలమతి - పింగళివారు తప్ప ఇంకెవరయినా ఆ అపేర్లని వూహించగలరా?

195లో విడుదలైన పాతాళ భైరవి అయితే ఎప్పుడు చూసినా గొప్పగా అనిపించే కాలం తెలియని నాటి కధ!మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కథలులోని ఒక కథ, అల్లాఉద్దీన్ అద్భుత దీప కథ, బాల నాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారం గా ఈ సినిమాకి కథను అల్లుకున్నారు.అప్పట్లోనే 28 కేంద్రాల్లో సతదినోత్సవం జరుపుకున్న సినిమా ఇది.నందమూరి తారక రామారావు నవయవ్వనంలో ఉండి తోటరాముడు ఇట్లాగే ఉంటాదేమో అనిపించేటట్టు కుదిరాడు!దర్సకత్వం కె.వి.రెడ్డి< నేపధ్యగానంఘంటసాల - అందరూ అతిరధ మహారధులే!మొదట్లో ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును హీరోగా, గోవిందరాజుల సుబ్బారావును కానీ, ముక్కామలను కానీ ప్రతినాయకుడిగా పెడదామనుకున్నారు. కానీ, వాహినీ ప్రాంగణంలో ఎన్టీయార్, ఏయన్నార్ల మధ్య టెన్నీస్ ఆట చూసిన దర్శకుడు కె.వి. రెడ్డి తమ చిత్ర కథలోని నాయకపాత్రకు ఎన్టీయారే తగినవాడని ఆయనను ఎంచుకోవడం జరిగింది - మనోడు యెంటీవోడు పటకాకత్తి లాంటోడు గందా,టెన్నిసు బ్యాటుని కూడా కత్తిలా ఝళిపించేసుంటాడు మరి:-) 

"ఎంత ఘాటుప్రేమయో!" అంటూ "ఘాటు ప్రేమ" అనే ఒక కొత్త పదబంధాన్ని సృష్టించారు పింగళి వారు!"ఇతిహాసం విన్నారా!ఆది సాహసులే ఉన్నారా?" పాతలో నాకు వీరులెవ్వరొ తెల్పుడీ అన్న దేశభక్తి గీతంలోని చాలెంజి కూడా వినాబడుతుంది!"కలవరమాయె మదిలో నా మదిలో" పాటలోని పదాలన్నీ యుక్తవయస్సులో ఉన్న యువతీ యువకులలో తొలిప్రేమ నాటి కలవరాన్ని సూచించే లలితమైన పదాలతో పొదిగారు, "ప్రేమకోసమై వలలో పడెనే పాపం అపసివాడు" అంటూ చిక్కని కన్నీటినీ,గోరువెచ్చని జాలినీ కురిపించారు!"వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు" అని ఇప్పటి ఐటెం సాంగులకి తీసిపోని విధంగా మత్తెక్కించినా "తాళలేనే నే తాళలేనే" అంటూ రేలంగికి తగ్గట్టుగా హాస్యాన్ని చిందించినా వారికి వారే సాటి అన్నంతగా వీర విహారం చేశారు పింగళి ఈ సినిమాకి సంబంధించినంత వరకూ!

1954లో విడుదలైన చంద్రహారం సినిమాకి పింగళి నాగేంద్రరావు రచయితగా పనిచేశాడు.అయితే విజయా వారు పాతాళ భైరవి తర్వాత ఆ స్థాయిలో నిలిచిపోవాలనుకుని ఈ సినిమా తీసినా, అందుకు తగట్టు మంచి ప్రచారం చేయించినా, ఆంధ్ర ప్రాంతంలోని అన్ని కేంద్రాల్లోనూ సినిమాను విడుదల చేసినా అలాగే ప్రివ్యూ షోలో సినిమాను చూసిన సినీ జనమంతా పాతాళ భైరవి మించిపోతుందని అందరూ అనుకున్నా వాస్తవంలో వారి అంచనాల్ని తల్లకిందులు చహెస్తూ చిత్రం ఘోర పరాజయం పాలైంది -కొన్ని సినిమా లంతే!


     ఇక 1957లో విడుదలైన మాయాబజార్ ప్రపంచ చలనచిత్ర  చరిత్రలోనే అద్భుతం అనే మాటకి పర్యాయపదంగా నిలిచిపోయిన చిత్రరారం!ఇదే కథ తో 1936 సంవత్సరం లో శశిరేఖా పరిణయం పేరు తో ఒక చిత్రం రూపొందించబడింది. దానికి మాయాబజార్ అని మరొక పేరు. అదే పేరుని ఈ చిత్రానికి కూడా పెట్టడం జరిగింది. ఇక కథ విషయానికి వస్తే, మహాభారతం లో జరగని ఒక కల్పిత గాథ, ఈ చిత్ర కథావస్తువు. దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుని తో వివాహం నిశ్చయమైన శశిరేఖ ను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుని తో వివాహం జరిపించడం, తాను మాయా శశిరేఖ అవతారం దాల్చడం, కౌరవుల ను ముప్పుతిప్పలు పెట్టడం, కృష్ణుడు వీటన్నిటికి పరోక్షంగా సహకరించడం, ఇవి ఈ చిత్రంలోని ముఖ్య ఘట్టాలు. సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే, ఈ చిత్రము ఒక మహాద్భుతమని చెప్పవచ్చు.అభిమన్యుడి పెళ్ళి చుట్టూ మూడు గంటల సేపు కథ నడిస్తే పాండవులెక్కడా కనిపించకపోయినా వాళ్ళేమయారనే అనుమానమెక్కడా ప్రేక్షకులకు రాలేదంటే అది దర్శకుడు పన్నిన మాయాజాలమే!

     లక్ష్మణ కుమారుని హాస్యగానిగా చూపడం మహాభారత కథలో అతని పాత్రకు అనుగుణంగా లేదు. కాని ఇది "మాయ" బజార్ కదా?.రేలంగి పైజమా(పేంటు వంటిది) ధరించటం వింతగానే అనిపిస్తుంది. అయితే పాత్ర ఔచిత్యాన్ని గురించి మహారచయిత పింగళి నాగేంద్రరావు సమంజసనీయంగానే సమర్థించుకున్నారు. అంత పెద్ద విలన్ అయిన రారాజు కొడుకు ఇంత చీప్ గా ఉండడం ఏమిటి? అన్న విమర్శలకి పింగళి చెప్పింది ఏమిటంటే... నిజమే!రారాజు కొడుకు ఇంత అసమర్థుడిగా వెర్రివెంగళాయిలా ఉండడం కొందరికి నచ్చకపోవచ్చు. అయితే లక్ష్మణకుమారుడు నిజంగా కూడా అంత సమర్థుడేం కాదు... యుద్ధంలోకి అడుగుపెట్టీ పెట్టగానే చనిపోయాడు. భారతంలోని ఈ పాయింట్ని ఆధారంగా చేసుకుని వినోదం కోసం కొంత కల్పన చేశాను . - ఇదీ పింగళి చెప్పినది.ఏదేమైనా రేలంగి కేరక్టర్... ముఖ్యంగా దర్పం, అమాయకత్వం, బింకం, వెర్రితనం... అన్నీ కలసిన అతని సైకాలజీ న భూతో న భవిష్యతి!పింగళి రేలంగి లక్ష్మణకుమారుడి కారెక్టర్ని ఇలా డీల్ చేయడాన్ని తిరుగులేని విధంగా యాక్సెప్ట్ చేశారు జనం. పవర్ ఫుల్ విలన్లకి వెర్రివెంగళప్ప లాంటి కొడుకులు ఉండే టైపు కామెడీకి శ్రీకారం చుట్టింది పింగళినాగేంద్రరావేనంటే అతిశయోక్తి కాదు. తరువాత మనం స్టార్ డైరెక్టర్లనుకున్నవారంతా ఇదే ఫాలో అయ్యారు.

     మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు అజరామరంగా నిలుస్తాయి. ఈ చిత్రంలో రచయిత పింగళి నాగేంద్రరావు తస్మదీయులు, దుష్టచతుష్టయం , జియ్యా , రత్న గింబళీ, గిల్పం, శాఖంబరి దేవి ప్రసాదం, వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తాడు. రసపట్టులో తర్కం కూడదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు వంటి సంభాషణలు మనల్ని గిలిగింతలు పెట్టిస్తాయి. మాటలు లేని చోటుల్లో  మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం మరింత అద్భుతంగా పని చేస్తుంది. ఉదాహరణకు చిన్న పిల్ల గా ఆడుకుంటున్న శశిరేఖ ఉద్యానవనంలో ఒక కొలని గట్టున అలవోకగా కూర్చుంటుంది. కెమెరా ఆమె మొహమ్మీదనుంచి మెల్లగా పాన్ అయి కొలనులోని తామరమొగ్గను చూపిస్తుంది. గడచి పోతున్న కాలానికి గుర్తుగా కొలనులో అలలు రేగడమూ, ఆ మొగ్గ మెల్లగా విచ్చుకోవడమూ, ఆ తర్వాత కెమెరా మెల్లగా వెనక్కి తిరిగి శశిరేఖ మొహాన్ని చూపడమూ జరుగుతాయి. ఇప్పుడక్కడ నవయవ్వనవతి యైన శశిరేఖ అంటే సావిత్రి ఉంటుంది! చమత్కారమేమిటంటే ఈ పాటల పల్లవులు తర్వాతి కాలంలో సినిమా పేర్లుగా వాడుకోబడ్డాయి!

     1961లో విడుదలైన జగదేకవీరుని కధ అయితే యన్.టి.రామారవు ఒక వ్యక్తి కాదు,నిజంగానే జగదేకవీరుడు అని భ్రమపడేతంతగా ప్రేక్షకుల్లో అతనికి విపరీతమయిన అభిమానాన్ని సాధించిపెట్టింది!ఈ చిత్రంలో పింగళి గారు మాటల రూపంగా తమాషాలు చెయ్యకపోయినా,అప్పటి దాకా యెన్నో సినిమాల్లో క్రూరత్వంతో బహయపెట్టిన రాజనాలని ఇందులో హాస్యగాడిగా చూపించి మెప్పించారు,ఇతనికి తోడు బాదరాయణ ప్రగ్గడ అనే తమాషా పేరుతో "హే రాజన్!" అంటూ సియెస్సార్ తోడయ్యాడు - ఈ ఇద్దరితోనూ ఆడవేషాలు వెయ్యడంతో సహా ఎన్నో తమాషాలు చేయించారు!పాటల్లోనూ మంచి పనితనం చూపించి తనదైన మార్కుతో "ఓ సఖీ ఒహో చెలి ఒహో మదీయ మోహినీ!",,"వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా?", "జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా(?)వంటి అజరామరమైన పాటల్ని అందించారు - ముఖ్యంగా పూర్తి శాస్త్రీయంగా ఉండే "శివశంకరీ... శివానందలహరీ చంద్రకళాధరి ఈశ్వరీ" పాట ఒక్కటి చాలు!పాత్రల పేర్లతో చేసిన తమాషా ఏకాశ,రెండు చింతలు పాత్రలు - గిరిజ రేలంగి జంట మొదలైంది ఈ సినిమా తోనే కావచ్చు!

     1962లో పింగళివారు చిత్రానువాదం చేసిన గుందమ్మ కధ అయితే అప్పటికీ ఇప్పటికీ హాస్య చిత్రాలకి మాతృకగా చెప్పుకోదగిన గొప్ప సినిమా!హాస్యాన్ని సృష్టించడానికి పనికివచ్చే రెండు ప్రక్రియలు సందర్భోచితమైన హాస్యం,సంభాషణోచితమయిన హాస్యం రెంటికీ ఉదాహరణలుగా నిలిచే దృస్యాలు చిత్రమంతటా పరుచుకుని ఉంటాయి.జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనె తుంబిద హెణ్ణు పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర నిర్మాణానికి విఠలాచార్య నిర్మాత, వాహినీ స్టూడియోస్ అధినేత బి.నాగిరెడ్డి సహకారం పొందారు. ఆ కృతజ్ఞతతో నాగిరెడ్డి అడగగానే సినిమా హక్కుల్ని విఠలాచార్య ఆయనకి ఇచ్చేశారు. మనె తుంబిద హెణ్ణు సినిమాలో గుండమ్మ అనే గయ్యాళికి, నోరుమెదపలేని భర్త ఉంటాడు. ఆమె తన సవతి కూతురుని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తుంది. ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగబడతాడు. అతను గుండమ్మ స్వంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ జైలుపక్షికి ఇచ్చి పెళ్ళిజరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు. ఇలా సాగుతుంది ఆ సినిమా. అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ, నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి. దాంతో విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ రీమేక్ చేసేందుకు సిద్ధపడ్డారు.

     సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్-విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని, జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు. చివరికి విజయా వారి నిర్మాణంలో మాయాబజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కె.వి.రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు.సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే "ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్" అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది.గుండమ్మకథ సినిమా జూన్ 7, 1962న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది.నేనూ ఆ సవత్సరంలో పుట్టానండోయ్,హందుకే నాకింత క్యామిడీ అబ్బింది కాబోలు:-)

     సినిమాలో నటించిన ఇద్దరు కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు. సినిమా విడుదల సమయంలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందువేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి. అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి, తర్వాత ఒకేసారి సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు వేశారు.అప్పట్నించే ఉందన్న మాట ఈ ఎవడు పెద్ద ఎవడు చిన్న అనే పిచ్చ?!

     1963లో పింగళి నాగేంద్రరావు చిత్రానువాదం నిర్వహించిన శ్రీకృష్ణార్జున యుధ్ధం గయోపాఖ్యానం కధకి కడు చక్కని చిత్రరూపం!ఈ చిత్రంలో ప్రఖ్యాత నటులు ఎన్.టి.ఆర్ కృష్ణుడిగా అధ్బుతమైన పాత్రను పోషించగా, ఏ.ఎన్.ఆర్ అర్జునిడిగా తన ప్రతిభను చూపారు. ఆనాటి ఇద్దరు ప్రముఖ కథా నాయకులు ఒకే తెర పై తమ పాత్రలని అధ్బుతంగా పండించి పలువురి ప్రశంశలు పొందారు. బి.సరోజా దేవి సుభద్ర పాత్రను, ఎస్.వరలక్ష్మి సత్యభామ పాత్రలను పోషించారు. కృష్ణార్జునుల యుద్ధానికి కారణమైన ముఖ్యమైన గయుడి పాత్రను ధూళిపాళ పోషించారు. మాయాబజార్ చిత్రంలో దుర్యోదనుడి పాత్రను పోషించిన ముక్కామల ఈ చిత్రంలో కూడా తిరిగి దుర్యోదనుని పాత్రలో నటించారు."అన్నీ మంచి సకునములే","మనసు పరిమళించెనే తనువు పరవశించెనే" వంటి భావగర్భితమైనవీ "అంచెలంచెలు లేని మోక్షము" వంటి సరదా పాటలూఒ ఉన్న్నాయి!సినిమాగా ఎప్పటికీ అజరామరమైనదే!

     1965లో విడుదలైన సి.ఐ.డి అనే సినిమాకి పింగళి నాగేంద్రరావు రచయితగా పని చహెశారు."నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులేఅనే మధురగీతమూ ఉంది,ఇప్పటికీ అమ్మాయిలు తమవైపొకసారి చూస్తేనే సొల్లు కార్చుకునే కొందరు అబ్బాయిలకి తగిలేతట్టు వెక్కిరింతగా ఉండే "యువతులు చూసి చూడకముందే ఐసౌవుతావా అబ్బాయి" అంటూ సాగే సరదా పాట కూడా ఉంది. ఈ సినిమా లోని "ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో" అనే పాట ఒకరకంగా భక్త రామదాసు ఆవెదనకి ప్యారడీగా చెప్పుకోవచ్చు.సన్నివేశం కూడా సరదాగానె ఉంటుంది,అభినయం యన్.టి రామారావు - ఇంక చెప్పాలా!

     1971లో విడుదలైన రాజకోట రహస్యం గంగరాజు నిర్మాతగా విఠలాచార్య దర్శకత్వంలో నిర్మితమైన జానపదచిత్రం. పింగళి నాగేంద్రరావు చిత్రరచన చేశాడు.ఆ తర్వాత ఈ కవిపింగళం అస్తమించడంతో తెలుగు సినీఎ వినీలాకాశంలోని ఒక ఢృవతార రాలిపోయినట్టయింది.గుణసుందరి కథలో కె.వి.రెడ్డికి మరొక రచయిత హంమతి, కాలమతి వగైరా అరడజను హాస్యపాత్రలను యివ్వగలిగి ఉండడు పాతాళభైరవిలో సీను, అంజి, డింగరి పాత్రల విజయమూ, నేపాళమాంత్రికుడి పాత్ర యొక్క అపురూపకల్పన, నాగేంద్రరావు ప్రతిభకు తార్కాణాలు.చంద్రహారం చిత్రంలో ధూమకేతు, నిక్షేపరాయడు, "ఎంతచెబితే అంతేగాళ్ళు", బుజ్జాయి, చిన్ని మొదలైనపాత్రలు అంతవరకు సినిమాప్రేక్షకులు చూసిన ఏపాత్రకూ తీసిపోవు!


కొందరు బతికిన కాలం తిరిగిరానిది!పింగళిది కూడా అలాంటి జీవితమే!
-----------------------------------------------------------------------------------------------------------------ఈ నాడు శాలివాహన శకం 1937 మన్మధ నామ సంవత్సరం మార్గశిర మాసము 7వ తేదీ శనివారము
-----------------------------------------------------------------------------------------------------------------
ఒక విన్నపం:కొన్ని చోట్ల విషయవివరణ బాగుందటంతో మళ్ళీ నేను వేలుపెట్టడం దేనికిలెమ్మని వికీపీడియా లోని కొన్న్ భాగాల్ని యధాతధంగా ఉంచేశాను - కొన్ని చోట్ల మాత్రమే,ముఖ్యంగా పింగళి నాగేంద్రరావు గారి ప్రతిభని కాలానుక్రమణీకంగా ఉంచాలనుకున్నాను,అంతే!

Wednesday 25 November 2015

నేనూ ఈ మధ్యన చిత్రకారుణ్ణి అయిపోయానండోయ్!మీరు కాస్త వోపిక చేసుకుని ఎలా ఉందో చెప్తారాండి?

     నేను నిజంగా మంచి చిత్రకారుణ్ణే అయి ఉంటే ప్రోగ్రామింగ్ సైడుకి చచ్చినా వచ్చి ఉండేవాణ్ణి కాదు!ప్రోగ్రామింగు వర్కు చాలా చెత్తగా ఉంటుంది - ఎట్లా ఇరుక్కుపోయానోమొదట విజువల్ బేసిక్ నేర్చుకున్నా,యెక్కడో తెలుసా!హైదరాబాదు అమీర్ పేట గ్యాంగులో నేను కూడా ఉన్నా.అన్నీ హడాబిడిగా నేర్చేసుకుని నేల రోజుల్లోగా ప్రపంచం మొత్తంలో ఎక్కడయినా సరే దున్నేద్దామని ట్రయనింగు కోసం డబ్బులు పోగొట్టుకున్న పిచ్చిపుల్లయల్లో నేనూ ఒకడిని. - సింగపూరులో మొదటి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు నేను పని చేస్తున్నానని చెప్పిన కంపెనీ పేరు విని ఒక పాతికేళ్ళ అమ్మాయి నన్ను పట్టుకుని నవ్వుమొహంతో యెగాదిగా చూసిన చూపుకి అర్ధం నెలరోజుల తర్వాత వుత్తచేతుల్తో వెనక్కి తిరిగొస్తున్నప్పుడు గానీ తెలియలేదు!ఆ తర్వాత  అదృష్టవశాత్తూ అనాలో ప్రమాదవశాత్తూ అనాలో తెలియనంత అగమ్యగోచరమైన స్థితిలో చెన్నైలో ASP ప్రోగ్రామరుగా చేరా, ఒక సంవత్సరం తర్వాత మా కంపెనీకి టెక్నికల్ కన్సల్టేంటుగా ఉండి నన్ను ఇంటర్వ్యూ చేసి ఆ ఉద్యోగం రావడానికి కారణమైన పెద్దమనిషి తన సొంత కంపెనీ లోకి తీసుకున్నారు.అక్కడ అయిదేళ్ళపాటు నిరాఘాటంగా పనిచేసి ఆ డాటాబేస్ వర్కులో ఉండే క్రడ్ ఆపరేషన్లు తప్ప మరేమీ లేని వర్కుకి విసుగెత్తి ఫ్లాష్ నేర్చుకున్నాను.

     యెకాయెకిన ఫ్లాష్ నేర్చుకుందామని వెళ్ళలేదు - అది ఇల్లస్ట్రేటరు నుంచి మాయా3డి వరకూ ఒక పూర్తి ప్యాకేజీ,కానీ మాయా వరకూ వెళ్ళడానికి సొమ్ములు చాలక అప్పటికి పూర్తి చేసినవాటిల్లో ఫ్లాష్ నాకు నచ్చి కోర్సు ఆపేసి ఫ్లాష్ డెవలపర్ అయిపోయాను.నేర్చుకునేటప్పుడు ఇల్లస్ట్రేటర్,ఫొటోషాప్ ఇంటరెస్టుతోనే నేర్చుకున్నా గానీ చాలాకాలం టచ్ లేకపోవడంతో ఇప్పుదసలు అయోమయంగా ఉంటుంది.యేమయినా డిజైనర్ల పని హాయి,తలతో ఆలోచించి సాల్వ్ చెయ్యాల్సిన ప్రాబ్లెంస్ ఉండవు!కాంప్లికేటెడ్ ఇమగెస్ షట్టర్ స్టాక్ నుంచి అరువు తెచ్చుకోవటం,వాటికి సొంత సెట్టింగులతో బిల్డప్పు ఇవ్వటం,కంటికింపుగా ఉండే రంగుల గురించి తెలుసుకోవడం,చతురస్రాలూ త్రికోణాలూ వృత్తాలూ గీసి వాటిల్లో గ్రడియంట్ కలర్ నింపటం,వబ్ లేఅవుట్లూ కొల్లాతర్ల్సూ తయారు చెయ్యడం - ఏదో ఒకటి అటూ ఇటూ జరుపుతుంటారు గాబట్టి పని చేస్తున్నటు తెలుస్తుంది!లోగోలు చేసే కళ గానీ అబ్బితే సొంతంగానే యెదగొచ్చు - కొన్ని లోగోలకి మనం వూహించనంత క్రేజు ఉంటుంది!ఫ్రీలాన్సరుగా చేసేవాళ్లకి ప్రత్యక్షంగా అది తెలుస్తుంది గాబట్టి క్రేజుని బట్టి డిమాండ్ చెయ్యొచ్చు.నా సంగతే తీసుకుంటే నా వర్కుకి సంబంధించిన ఆలోచనలు మైండులో జరుగుతాయి కాబట్టి డిజైనింగు పూర్తయి వర్కు నా దగ్గిర కొచ్చేవరకూ ఖాళీగా కూర్చున్నట్టు కనిపిస్తాను?అయినా అపుడప్పుడూ కాగితాలు ఖరాబు చేస్తుంటాను,వాటిల్లో చాలాకాలం క్రితం చాలా ముతగ్గా వేసినా నాకు నచ్చిన బొమ్మ ఇది!
పేపరు చూస్తే కలర్ పపర్,అదీ కార్డ్ బొర్డు!మా బంగారం స్కూలు పన్ల కోసం తెచ్చి దానిమీద నాతో అరవ చాకిరీ చేయించుకుని అంతా అయిపోయాక నా మొహాన పారేసింది నువ్వు వాడుకోమని పర్మిషన్ ఇచ్చేసి.అంతకు ముందు నుంచే ఈ బొమ్మ వూహలో కదుల్తుంటే వెయ్యగలనా అని డవుటు పడుతూ అప్పటి వరకూ నానుస్తున్నాను గదా అది దొరికేసరికి దానిమీదే నా ప్రతాపం చూపించాను.పెన్సిలు వీలయిననత సన్నగానే చెక్కినా పోను పోనూ అరిగిపోవటం,మళ్ళీ చెక్కడం,విసుగొచ్చి ఆ బండముక్కుతోనే పని కానిచ్చేశాను.ఇంకో డ్రాబ్యాక్ పేపరు రఫ్ కదా చెరిపితే గుంటల్లో ఉన్నది చెరగక పోవటం - అయితే అంతా అయ్యాక చూస్తే అది నాకు గ్రడియంట్ మాదిరి కనబడ్డంతో అదీ ఒకరకంగా కలిసొచ్చినట్టే అనిపించింది.మూతి సరిగ్గా రాలదని అనిపించింది,ఏం చేద్దాం?ఇక్కడ చెరిప్తే పేపరు ఖరాబు అయ్యి ఉన్న ఈ కాస్త అందం కూడా పోతుంది!కొంచెం ఆలోచించాక అయిడియా వచ్చింది,ఆ సైజులో ఉన్న వేర కార్డ్ బొర్డ్ ముక్క మీద మూతి వరకూ గీసి అతికించాను.భుకాల పరిస్థితీ అంతే!ఇప్పుడు మీరు చూస్తున్నది స్కానింగు తీసిన ఇమేజి కదా,,స్కానింగు కోసం తీసుకెళ్ళటానికి కవరు లోపల కొంచెం ఫోల్డ్ చేసేసరికి ఆ ఫోల్డింగ్ మరక ఇందులోకి కూడా వచ్చేసింది.నా అలోచన మెల్లగా ఫొటోషాప్ ఉంది కదా నా కన్=ంప్యూతరులో,దాన్ని మల్ళీ గుర్తు తెచ్చుకుని అందులో ఎడిట్ చేద్దామని.తీరా నేను స్కాన్ చేసి ఎడిటింగ్ పని మొదలు పెడదామనుకున్నస్కాన్  టైములోనే మా చిన్న బంగారం పరిక్షల పేరుతో కంప్యూటర్ని హైజాక్ చేసేసింది!

     మళ్ళీ ఇంత సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మొదలుపెట్టాను,కారణం ఉంది!ఈ మధ్యనే ప్రింటరు అమిరింది.దాంతో ప్రింటు తీసి చూసుకుందామనే దురద పుట్టి మెల్లగా పని మొదలు పెట్టాను.అయితే ఈలోపు కంప్యూటరు కేదో ప్రాబ్లం వచ్చి ఓయస్ అప్డేట్ చేసినపుడు ఫొటోషాప్,ఫ్లాష్,డ్రీం వీవర్ లాంటివన్నీ యెగిరిపోయాయి.ఈ మధ్యనే నా చెస్ బోర్దు సైటు పని కోసం ఫ్లాష్ ఒక్కటే ఫ్రండ్ దగ్గిర్నుంచి తెచ్చి లోడ్ చేసుకున్నాను.అందులో కూడా పెన్ టూల్ లాంటి కొన్ని గ్రాఫిక్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి గదా!పెన్ టూల్ వాడి నా పెన్సిల్ లైన్ల మీదనే కొత్తగా లైన్లు గీదామని నా అయిడియా,కానీ నా కౌశలం సరిపోక నాకే యేళు పట్టేటటు ఉందనిపించింది!ఇక చేసేది లేక ఎరేజర్ టూల్ వాడి సెంటర్లో ఉన్న బొమ్మని మట్టుకు లేపి ఇంకో లేయర్ మీదకి తెచ్చాను.బోసిగా వొదిలయ్యడం కన్నా బోర్డరు తగిలిస్తే బాగుంటుందనిపించింది.దాంతో ఈ షేపుకి వచ్చింది!. 
     ఆ ముతక బొమ్మ కన్నా ఈ చిత్రరాజం కొంచెం బాగుండటంతో ప్రముఖ చిత్రకారుడిలా ఆలొచించటం మొదలు పెట్టాను.ప్రముఖ చిత్రకారులు వెర్షన్లు ప్రయత్నిస్తారు గదా అని వూహించి మధ్యలో బ్యాక్ కలరు మార్చాను.ఫ్లాష్ లోపల ఒక ఇమేజిని షేపుగా బ్రేక్ చెయ్యొచ్చు.ఆ ంతక మోదల్ని అలా బ్రేక్ చేసి ఈ ఎడిటింగ్ అంతా చేశాను.ఫైనల్ వెర్షను పెద్దది చేసి చూస్తే చుట్టూ ఖాళీ చాలా ఉంది.అది కూడా కత్తిరించేశాను.ఆ మార్పులతో ఈ మోడల్ తయారయ్యింది!
     ఇక్కడ పెట్టటానికి ధైర్యం ఎలా వచ్చిందనుకుంటున్నారు?నా పాటికి నేను నాగురించి ఓవరుగా వూహించేసుకుని బ్లాగులో పెట్టి మీతో చివాట్లు తింటానా!ప్రింటరు ఉందిగా,ప్రింటు తీసి చూపిస్తే బంగారం బానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చింది,అయినా మీరు కూడా ఓ మాట చెప్తే ఇంకొంచెం హంగులు చేసి క్యాలెండరుగా రిలీజ్ చేద్దామనే ఆలోచన ఉంది!హంగులు అంటూ పెద్దగా యేమీ చెయ్యన్ను,నాకేందుకో కళ విషయంలో భారీగా పోవడం నచ్చదు,నేను చూసి మెచ్చుకోవాలన్నా సింపులుగా ఉండాలి!రంగులు వేస్తాను,అంతే!బ్యాక్ డ్రాప్ రంగులు మార్చి చూస్తాను,గ్రడియంట్ రప్పించగలనో లేదో చూడాలి!ఈ ఆంజనేయ భగవాన్లుని హరిమర్కటం అంటారు గదా - దేహానికి లైట్ గ్రీన్ కలరు వేస్తాను,అన్ని దేవాలయ్యాల్లోనూ చూస్తున్నాను గాబట్టి మూతికి ఎరుపు రంగు ఫిక్స్ చేసేశాను,పంచెకీ తలపాగాకీ కాషాయం రంగు వేస్తాను,చాలు గదా!

నాకేమో పైది నచ్చింది,మా బంగారానికేమో ఈ బ్లూ కలర్ ఉన్నది నచ్చింది,మరి మీ వోటు ఎవరికి?

Saturday 21 November 2015

తమిళమామికి తెలుగువాళ్ళు లోకువైపోయా రేంటి?తమిళనాట తెలుగువాళ్ళ ప్రాభవం ఇక నాస్తి యేనా!

     తమిళనాడులో ఇప్పటికీ తెలుగువాళ్ళు నాలుగోవంతు ఉన్నారు.చెన్నై మహాపట్నమే చెన్నప్ప అనే తెలుగువాడి పేరు మీద వచ్చింది.400సంవత్సరాల పైచిలుకు చరిత్ర గల ఈ నగరంలో తొలినాళ్ళ నుంచీ తెలుగువారు తమిళులతో కలిసి ఎదిగారు.రాష్ట్రాలుగా విడిపోక ముందు నుంచీ మొత్తం దక్షిణ భారత భాషలకి సంబంధించిన చలనచిత్ర మహామహులంతా ఇక్కడే తమ తమ భాషలతో పాటూ తమిళంలో కూడా మాట్లాడ్య్తూ బతికారు.అన్ని రాష్ట్రాలూ విడిపోయిన తర్వాత కూడా చాలా కాలం వరకూ వీరంతా మద్రాసుని వదలకుండా ఉన్నారంటే ఆ నగరపు వాతావరణం తోనూ తమిళ సంస్కృతి తోనూ ఆత్మీయతలు ఎంతగా పెనవేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు!

     2006లో తమిళనాడు ప్రభుత్వం తమిళ విద్యాబోధన చట్టం చేసింది.దాని ప్రకారం మైనారిటీ వర్గాలకి సంబంధించిన విద్యాసంస్థలతో సహా అన్ని విద్యాసంస్థలలో నర్సరీ,ప్రైమరీ,మిడిల్,హయ్యర్ మరియూ హయ్యర్ సెకందరీ స్థాయిలలో తమిళ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన భాషగా నిర్ధారించారు - సీబీయస్సీ మినహా!మాధ్యమం విషయంలో కూడా తమిళేతర భాషల పట్ల చాలా నిర్దయగా ఉన్నది చట్టం.ఇంగ్లీషునీ తమిళాన్నీ తప్ప మిగిలిన వాటిని ఆప్షనల్ గ్రూపుకి బదలాయించారు.పైగా ఈ సబ్జెక్టుల మార్కులు పరీక్షా ఫలితాల్లో కలపరు.అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమిళనాడులో తమిళాన్ని తప్ప ఇంకే భాషనీ ప్రోత్సహించడం మాట అటుంచి బతకనివ్వకూడదని నిర్ణయించుకున్నట్టు అర్ధమవుతున్నది.దీనితో తమిళేతర వర్గాలలో యెక్కువశాతం ఉన్న తెలుగువాళ్ళకి ఇబ్బంది ఎదురవుతున్నది.ఇందులో ఉన్న దుర్మార్గం ఏమిటంటే తమిళనాడు ప్రభుత్వం నిరాదరిస్తున్నది ఇతర భారతీయ భాషల్ని మాత్రమే,అసలు మన దేశానికే సంబంధించని విదేశీ భాష అయిన ఇంగ్లీషు పట్ల మాత్రం అభిమానపూర్వకంగా వ్యవహరిస్తున్నది!

     ఇప్పటికే చాలమంది సీబీయస్సీకి మారిపోయారు,తెలుగు మీడియం స్కూళ్ళు మూసివేతకి దగ్గిరయ్యాయి.బీ ఎ రోమన్ ఇన్ రోం అన్నారు పెద్దలు.తమిళనాడు ప్రభుత్వం అంత గట్టిగా తమ భాషని ప్రోత్సహించుకోవాలనుకున్నప్పుడు విమర్శించీ ఉద్యమాలు చేసీ సాధించగలిగింది ఏమీ లేదు.తమిళ ప్రజలకి తమ సంస్కృతి పట్ల అభిమానం ఎక్కువ.దేవాలయాల్లో సైతం దేవభాష అయిన సంస్కృత శ్లోకాలు ఉపయోగించటం కన్నా తమిళ మంత్రాలు ఉపయోగించితే గానీ సంతృప్తి పడనంతగా వారు తమిళ భాషని ఇష్టపడతారు.తమిళనాడులో శాశ్వతంగా ఉండాలంటే అనధికారికంగా అయినా సరే ప్రతివారూ తమిళులుగా మారిపోక తప్పదు.వయ్యాపూరం గోపాలకృష్ణ వైగో అని ఎందుకు పేరు మార్చుకున్నాడు?భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడినా తెలుగుని అధికార భాషగా చేసుకోవటానికి పట్టుదల లేని తెలుగువాళ్ళలా అందరూ ఉండాలని కోరుకోవటం వెర్రితనం!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జాబు రాశాడట,అయితే యేమిటట?ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కలిసి విజ్ఞాపన చెయ్యాలి గానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం తెలుగు వాళ్ళందరికీ ఏవిధంగా బాధ్యత వహిస్తాడు?ఇక తమిళనాడులోని తెలుగువాళ్ళు ఇప్పటికే తమని తాము తమిళీకరించుకున్న మిగతా వాళ్ళ మాదిరిగానే తమ ప్రత్యేక అస్తిత్వాన్ని వొదులుకోక తప్పదు.

     తమిళులది నిజంగా చాలా వింతైన మనస్తత్వం - మొత్తం భారతీయుల కందరికీ ఇంగ్లీషు అనే విదేశీ భాషకి బదులు హిందీ అనే భారతీయ భాషని లింక్ లాంగ్వేజిగా పేడదామని ప్రతిపాదించినప్పుడు మిగతా భారతీయు లందరికన్నా గట్టిగా వ్యతిరేకించి తమిళ ప్రాంతీయాభిమానం పొడుచుకొచ్చి అల్లరల్లరి చేసి ఒక భారతీయ భాషనే తిరస్కరించి వీళ్ళ ధాటికి ప్రభుత్వమే వెనక్కి తగ్గి ఆ ప్రతిపాదనని ఉపసంహరించుకునేలా చెయ్యగలిగిన వాళ్ళు ఇవ్వాళ మిగతా భారతీయ భాషల్ని కూడా తిరస్కరించేసినప్పటికీ ఇంగ్లీషు అనే విదేశీ భాషని మాత్రం అంతగా ముద్దు చేయడం చూస్తుంటే అయితే తమిళ భాష లేకుంటే ఇంగ్లీషు భాష నేర్చుకోవాలి తప్ప సాటి భారతీయ భాషల్ని నేర్చుకోకూడదనే మనస్తత్వాన్ని యెలా అర్ధం చేసుకోవాలో తెలియటం లేదు నాకు!భారతీయ భాషలు అన్నిట్లోనూ తమ భాషే గొప్పది అనే అహంకారం,ఆంగ్లేయుల పట్ల మమకారాన్ని చూపించే ఇంగ్లీషు పట్ల భావదాస్యం రెంటినీ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసేశారు.దీనికి పూర్తి భిన్నమైన మనస్తత్వంలో ఉన్న తెలుగువాళ్లకి వీళ్ళెప్పటికీ అర్ధం కారు - ఆలు అర్ధమే కానప్పుడు వాళ్ళని మార్చడం సాధ్యమా? 

     దక్షిణాపధాన్ని అంతా ఆక్రమించిన శాతవాహనుల సామ్రాజ్యంలో ఈ చిన్న ముక్క మాత్రం ఖాళీగా ఉండిపోయింది.ఎందుకో?వొదిలేశారా, లొంగి రాలేదా!పాండ్య,చేర,చోళ వంశాలకి చెందిన రాజూల గురించే తమిళ సాహిత్యం ఎక్కువగా వర్ణించింది.తొలి నుంచీ మిగతా భాషల వారికన్నా అధికంగా ఒకచోట సంగం పేరుతో గుమిగూడి పట్టుదలతో తమ భాషనీ సంస్కృతినీ వృధ్ధి చేసుకోవటంలో ఐకమత్యాన్ని ప్రదర్శించడం విశేషం!అయితే, స్వాతంత్ర్యానంతరం పుట్టిన బ్రాహ్మణ వ్యతిరేక తమిళ స్వాభిమాన ఉద్యమాల వల్ల ఏర్పడిన ద్రవిడ మున్నేట్ర కజగం వారి రాజకీయం ముదిరే వరకూ వీరు కూడా భారత జాతీయతకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు.ద్రవిడ ఉద్యమాలకి బీజాలు బ్రిటిషు వారితో పూర్తిగా మమేకం అయిపోయి, దేశానికి స్వతంత్రం రాకూడనీ బ్రిటిషువాళ్ళ ప్రభుత్వమే కొనసాగాలని వాదించి స్వాతంత్రపోరాటానికి సకల విధాలుగా ఎదురొడ్డి లిలిచిన జస్టిస్ పార్టీలో ఉన్నాయి.ఇందులో ఉన్నవాళ్ళంతా ఇంగ్లీషువాళ్ళ వల్ల పైకొచ్చిన చెట్టియార్లూ భూస్వాములూ కదా - యూనియన్ జాక్ నులివెచ్చని నీడలో పెరిగినవారు రాజభక్తిని ప్రదర్శించకుండా యెట్లా ఉంటారు?ఇంగ్లీషు వాళ్ళు ఈ దేశంలో ప్రభువులుగా పాతుకుపోయనాటికి అప్పటి భారతీయ సమాజంలో విద్యకి అధిపతులుగా ఉన్న బ్రాహ్మణులు సహజంగానే ఇంగ్లీషు విద్య ముందుగా నేర్చుకుని ప్రభుత్వోద్యొగాలు తెచ్చుకుని దూసుకుపోతుంటే అసంతృప్తితో రగిలిపోతున్న బ్రాహ్మణేతరులకి బ్రాహ్మణాధిక్యత గురించి చెప్పి తమవైపుకి లాక్కున్నారు.కళ్ళముందు కనబడుతున్న దృశ్యం అలాగే ఉంది గాబట్టి మూలకారణాల్ని శోధించకుండా బ్రాహ్మణేతరులూ నమ్మేశారు.తన శక్తిమేర జస్టిస్ పార్టీ చెయ్య్యగలిగినది బ్రాహ్మణేతరుల్ని స్వాతంత్ర్య పోరాటం వైపుకి నడవనివ్వకపోవటం.అయితే గాందీ సూటిగా సామాన్యులని ఉద్యమంలోకి లాగే కార్యక్రమాల్ని ప్రవేశపెట్టడంతో జస్టిస్ పార్టీ పునాదులు బలహీన పడినాయి.1935 నాటి రాజ్యాంగం ప్రకారం జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీకి సంబంధించిన దిగ్దంతులు కూడా మట్టి కరిచారు.అసలైన వింత యేంటంటే హిందీని కంపల్సరీ చేసింది 1937లో తమిళనాడు ముఖ్యమంత్రి అయిన చక్రవర్తి రాజగోపాలాచారి,ఆయన తమిళుడే కదా!నిజానికి హిందీ నేర్చుకుంటే తమిళాన్ని అవమానించడం అని యెక్కడయినా బతకాలనుకున్న ఏ తమిళుదూ అనుకోడు,అది ఆప్పటికే బ్రాహ్మణాధిక్యతకి వ్యతిరేకంగా తమిళ స్వాభిమానం పేరుతో రాజకీయ పునాదిని నిర్మించుకోవాలనుకున్న జస్టిస్ పార్టీ మరియూ పెరియార్ ద్వయం తమ యొక్క వ్యతిరేకతని మొత్తం తమిళులకి అంటగట్టేసి చేసిన రభస.ముఖ్యమంత్రి యెంత గట్టివాదయినా అలాంటి సున్నితమైఅన విషయంలో వెనుకడుగు వెయ్యక తప్పదు,ఆయన వెనుకడుగును వీళ్ళు తమ గెలుపుగా చూపించి తమ బలాన్ని మరింత పెంచుకోగలిగారు.ఎన్నో పురాణాలు చదివిన పండితుడూ,కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన రాజనీతిజ్ఞుడూ అయిన రాజాజీ కొంచెం గట్టిగా ప్రయత్నించి ఉంటే సమస్య చల్లారిపోయి ఉండేదేమో!కానీ కాంగ్రెసువాడు కదా - ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకోవడానికి ఏ రాజకీయవాదీ.ముఖ్యంగా కాంగ్రెసువాడు ధైర్యం చెయ్యడు!రెండవ ప్రపంచయుధ్ధం జరుగుతున్నప్పుదు జస్టిస్ పార్టీ బాహాటంగానే అమితోత్సాహంతో ఇంగ్లీషువాళ్ళకి తమ మద్దతును తెలిపారు.అన్నాదురై అయితే జస్టిస్ పార్టీకి మైకులాంటి విడుదలై దినపత్రికలో ఇంగ్లీషువాళ్ళకి పూర్తిగా బాకారాయుదే అయిపోయాడు.వీరికి విదేశీయులైన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కన్నా స్వదేశీయులైన బ్రాహ్మణులు మరింత ప్రమాదకారులుగా కనపడ్డారు,ఒకసారి ఆ దృక్కోణంలోకి మనము వెళ్ళినా వీరంతా స్వాతత్ర్యోద్యమాన్ని వ్యతిరేకించటానికి చేసిన ప్రయత్నాల్నీ ఇంగ్లీషువారితో అంటకాగడాన్నీ న్యాయమేనని చక్కగా సమర్ధించవచ్చు!కానీ చరిత్రలో నిజంగా జరిగినదే అయినా తర్వాతిరోజుల్లో ఎక్కడా ప్రముఖంగా ప్రస్తావించబడకపోవటంతో తమిళేతరులకి అంతగా తెలియని ఒక విషయం - సరిగ్గా ఉత్తర భారతంలో ముస్లిం లీగ్ పాకిస్తానును ప్రతిపాదించిన సమయంలోనే దక్షిణ భారతంలో వీరు ప్రత్యేక ద్రవిడస్థాన్ ప్రతిపాదించారు,మద్రాసు ప్రెసిడెన్సీని మిగిలిన భారతదేశం నుంచి విడగొట్టి యూనియన్ జాక్ చల్ల్లని నీడలో యెక్కడో లండన్ లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోనే కొనసాగించాలని ప్రతిపాదించారు, వీళ్ళకన్నా ముస్లిములే నయం కదూ తమకంటూ సార్వభౌమాధికారం గలిగిన స్వతంత్ర దేశాన్ని కోరుకున్నారు!కాంగ్రెసువాళ్ళు అప్పట్లో ఇలాంటి సిధ్ధాంతాలు ప్రమాదకరం అని చూచాయగా తెలిసినప్పటికీ దేశమంతటా అతివేగంగా పెరుగుతున్న కమ్యునిష్టు భావజాలపు ప్రభావానికి భయపడి ప్రజలు వాళ్ళ వైపుకి వెళ్ళకుండా ఉండటానికి ఇలాంటి వర్గాల్ని ముందుచూపు లేకుండా ప్రోత్సహించటంతో అగ్నికి వాయువు తోడయినట్టు చెలరేగిపోయారు.1952 ఎన్నికల్లో డియంకే పోటీ చెయ్యకుండా ఏ అభ్యర్ధి ద్రవిడస్థాన్ కోసం నిజాయితీగా కృషి చేస్తారో ఆ అభ్యర్ధికి తాము సహాయం చేస్తామని ప్రకటించింది - బహుశా వోట్లు వేసి ప్రచారం చేసి గెలిపించడమే ఆ సహాయం కాబోలు!!ఆఖరికి ద్రవిదస్థాన్ కోసం ఐక్యరాజ్యసమితిని కూడా కదిలించాలని ప్రయత్నించింది.1957 ఎన్నికల్లో పాత నిర్ణయాని మార్చుకుని సొంతంగ అభ్యర్ధుల్ని నిలబెట్టి 14 స్థానాల్ని గెలుచుకుంది.1962 నాటికి బాహాటంగా ద్రవిదస్థాన్ ప్రస్తావన తీసుకురాకపోఇనా అంతర్లీనంగా ఇప్పటికీ తగినంత మెజారిటీ వస్తే ద్రవిడస్థాన్ వాదనని ముందుకు తీసుకొచ్చి స్వతంత్రదేశంగా ఆవిర్భవించాలనే ఆశ వారిలో పూర్తిగా పోయిందని చెప్పలేం.ఇవ్వాళ భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయితే మాత్రం ఏమంత ప్రత్యేకత యేముంటుంది గనక, పైన ప్రధానమంతి ఉన్నాడు గద, జనం తమ వాదనల్ని నమ్మి ఆదరిస్తే ఇవ్వాళ్టి ఉద్యమనేత రేపటి రోజూన ఒక స్వతంత్ర దేశానికి ప్రధానమంత్రియే కావచ్చు - అబ్బ!

     ఇంతటి ఘనకీర్తి గలిగిన ద్రవిడ ఉద్యమ నేతల తమిళ స్వాభిమాన బలప్రదర్శనా కౌతుకం ముందు తెలుగువాళ్ళ ఆవేదన అరణ్యరోదన కాక తప్పదు.2006లోనే ప్రణాళికలు వేసుకుని ఇంత పటుదలగా ముందుకు వెళ్తున్నవాళ్ళు అంత తేలిగ్గా వెనక్కి తగ్గరు.మీరు తెల్లవారు ఝామున తమిలనాడు మొత్తంలో యెక్కడయినా వీధుల్లో కొంచెం దూరం తిరిగితే ఒక చిత్రమైన దృశ్యం కనబడుతుంది.ఇంటిలోపల యెటూ పూజ గది ఉంటుంది,గాబట్టి అక్కడ యెంతసేపు చేస్తారో గానీ అది అయిపోయాక వీధిలోకొచ్చి ఇంటి ప్రహరీ గోడలో అమర్చుకున్న చిన్న చిన్న ప్రతిమల ముందు కూడా హారతులూ గంటలూ మంత్రాలూ కలిసి వీధి మొత్తాన్నీ మారుమోగిస్తూ ఉంటారు.ఇంత భక్తిగా ఉండేవాళ్ళు దేవుణ్ణి బూతులు తిట్టటం ఒక్కటి తక్కువగా ద్వేషించిన పెరియారును యెట్లా ఆదరించారో తల్చుకుంటే అయోమయంగా ఉంటుంది.తమిళ సమాజమంతా బ్రాహ్మణులూ బ్రాహ్మణేతరులూ స్పష్తంగా విడిపోయి ఉన్నారని నాకు తెలుసు గానీ తమిళులలో ఉన్న స్వజనదోషసహిష్ణుత గురించి ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది నాకు!ఆ మధ్యనెప్పుడో కొందరు యం.జీ.ఆర్ మీద తమకున్న అభిమానాన్ని చూపించుకోవటానికి రోడ్డు మీద విస్తళ్ళలో కాకుండా నేలమీద అన్నమూ కూరలూ వడ్డించుకుని సుబ్బరంగా తినేశారు!అన్నం పరబ్రహ్మస్వరూపం అనే సుత్తి సుదాణం కబుర్లు దేనికి గానీ సరిగ్గా వీళ్ళు ఆ పని చేస్తున్న చోట ఇదివరలో మనుషుల నుంచీ జంతువూల వరకూ మలమూత్రవిసర్జన కార్యక్రమాలు జరిగి ఉండొచ్చుననే ఆలోచన కొంచెం కూడా లేకుండా ఇతర్లకి వినడానికే అసహ్యంగా అనిపించే పనులు యెట్లా చెయ్యగలుగుతున్నారు?ఈ మధ్యన జరిగిన తాళితెంపుడు కార్యక్రమం కూడా అలాంటిదే కదా!తమ బుధ్ధికి ఏం తోస్తే అది నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనుకుంటూ చెయ్యగలగడమూ,చేసింది సాటి తమిళులు గనక మనవాడు ఏం చేసినా విమర్శించకూడదు అనే పైకి కనబడని ఒక కట్టుబాటూ ఈ భూప్రపంచం మొత్తమ్మీద తమిళులలో మాత్రమే కనిపించే ప్రత్యేక లక్షణాలు.కాబట్టి ఈ భూమి మీద తమిళ సంస్కృతియే గొప్పదని అనుకునే స్వానురాగపు అతి ధోరణి నుంచీ సాటి భారతీయ భాషల్ని తిరస్కరించేస్తూ ఇంగ్లీషును ఆదరించే వలస ప్రభువుల పట్ల మమకారపు ధోరణి నుంచీ వారు యేనాటికీ కొంచెం కూడా పక్కకి జరగరు.

     తమిళనాడులోని తెలుగువారు రెండు రకాలు - తమిళ తెలుగులు,ఆంధ్ర తెలుగులు.మొదటి రకం వైగో లాంటివారు- తమ తెలుగు మూలాల్ని మర్చిపోయి పూర్తిగా తమిళుల వలె మారిపోయిన వాళ్ళు,వీరు పొరపాటున కూడా ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించరు,వ్యతిరేకించటం లేదు కూడా!రెండో రకం తమిళనాడులో ఉంటున్నా మూలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్త్రంలో వెతుక్కుంటున్న వాళ్ళు - తెలంగాణ వాళ్ళు ఎవరయినా ఉన్నా వాళ్ళూ ఈ ఆందోళనల్లో కలవకపోవచ్చు.2006 నుంచీ చేస్తున్న విధానపరమైన ఆలోచనలకి తోడు ఇటీవల యెర్రచందనం అక్రమ నరికివేతని ఆపుతున్న సమయంలో తమిళ కూలీల మీద దాడి జరిగిన తర్వాత ఆ ఎర్రచందనం స్మగ్లర్లలో కొందరు తమిళులూ ఉన్నారు గదా,ఆ పలుకుబడి గలిగిన తమిళ స్మగ్లర్ల వల్ల తమిళనాట ఆంధ్రావాళ్ళంటే వ్యతిరేకత వచ్చింది,ప్రభుత్వపెద్దల లోనూ అది ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్రపు వనరుల్ని దోపిడీకి గురి కాకుండా చూసుకోవడానికి చేసిన పని అయినా ముందుగా ఒక మాట తమ చెవిలో వేస్తే దిద్దుబాటు చర్యలు తీసుకోవటానికి పనికొచ్చేది గదా అని తమకి కలిగిన ఇబ్బంది నుంచి తప్పుకుని ప్రతిపక్షాల కన్నా తామే ఎక్కువ లాభం పొందాలన్న రాజకీయం ప్రవేశించింది.కాబట్టి ఇకముందు తెలుగువాళ్ళ పరిస్థితి తమిళనాడులో ఇంకా దుర్భరం అవ్వడమే తప్ప అంత ఆందోళన చేసి రాష్ట్రం విడిపోయినా తెల్లవారి నుంచీ ఏమీ జరగనట్టు కలిసిమెలిసి బతికినగతకాలపు అనుబంధాలు ఇక కలలోని మాటే అవ్వచ్చు!

                             ఈ దేశంలో ఏదీ శాశ్వతం కాదు పరాధీనతా ఇంగ్లీషు భాషా తప్ప?!
-----------------------------------------------------------------------------------------------------------------ఈ నాడు శాలివాహన శకం 1937 మన్మధ నామ సంవత్సరం కార్తీక మాసము 30వ తేదీ శనివారము

Wednesday 18 November 2015

ప్రపంచం మొత్తాన్ని ఉగ్రవాదం పడగ నీడలో బిక్కుబిక్కుమనేటట్టు చేసిన ఈ అధమాధముణ్ణి యేం చేస్తే పాపముంటుంది?

     43 యేళ్ళ వయస్సులో లేబర్ పార్టీ తరపున ప్రధానమంత్రి అయ్యి 1997 న్నుచి 2007 వరకు ప్రధానమంత్రిగా ఉన్న ఈ టోనీ బ్లెయిర్ తొలి ఆరేళ్ళ లోనే మొత్తం అయిదుసార్లు బ్రిటిషు సైన్యాన్ని యుధ్ధానికి నడిపించిన వాడు - గొప్ప శాంతికాముకుడట?మొదటిసారి 1998లో మళ్ళీ 2003లో ఇరాక్ మీద,1999లో కొసోవో యుధ్ధం,2000లో సియెర్రా లియోన్ యుధ్ధం,2001లో ఆఫ్ఘనిస్థాన్ యుధ్ధం - అన్ని యుధ్ధాలూ శాంతిని స్థాపించడానికేనట!
     సొలోవో యుధ్ధాన్ని వీడు నైతీకత ప్రాతిపదికన మొదలుపెట్టినా క్రూరమైన వైమానిక దాడులతో అది కాస్తా నేతిబీరకాయలోని నెయ్యిగా తేలిపోయింది.అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అన్యమనస్కంగానే అంగీకరించినా వీడు మాత్రం మహోత్సాహంతో బ్రిటిషు సైన్యాన్ని పూర్తిగా మోహరించి వీరోచితంగా యుధ్ధం చేయించాడు.మిగిలిన యుధ్ధాల సంగతి యెలా ఉన్నా వీడు అత్యుత్సాహంతో ఇతర్లని కూడా రెచ్చగొట్టి జీవితలక్ష్యం వలె సాగించిన ఇరాక్ యుధ్ధం మాత్రం ఈ అధమాధముడి నీచత్వం సమర్ధించుకోవడానికి వీలు లేనంతటిదని కొద్దిరోజుల్లో బయటపడే చిల్కాట్ రిపోర్టు బట్టబయలు చేస్తుంది.ఒక పెద్ద బృందాన్ని తయారు చేసి కొన్ని సంవత్సరాల పాటు సద్దాం హుస్సేన్ ప్రపంచం మొత్తానికే ప్రమాదకారి అని నమ్మటానికి కావలసిన సమాచారం గుదిగుచ్చి దాన్ని అమెరికా అధ్యక్షుడు నమ్మేటట్టు వూదరగొట్టి అతని సాయంతో ప్రపంచంలో శాంతిని స్థాపించటానికి ఏర్పడిన ఐక్యరాజ్యసమితిని కూడా యుధ్ధానికి ఆమోదం తెలుపుతూ సంతకం చేసేవరకూ ప్రశాంతంగా ఉండనివ్వకుండా దాని సభ్యదేశాల్ని కూడా బలవంతంగా ఇరాక్ మీద యుధ్ధానికి నడిపించిన దుర్మార్గం వీడిది!

     ఒకనాడు నూతన భావాలకు తెరచాప లెత్తి శాస్త్రీయ దృక్పధంతో ఆలోచించిన మేధావుల కృషి ఫలితంగా తమ దేశంలో జరిగిన పారిశ్రామిక విప్లవంతో అక్కడివాళ్ళకి ఆ చిన్నదేశం ఇరుకైపోయి ప్రపంచమంతటా వ్యాపించి యెక్కడికెళితే అక్కడ స్థానిక సంస్కృతుల్ని చిన్నాభిన్నం చేసి తమ సంస్కృతిని రుద్దేస్తూ వాటిని వలసలుగా భావించి అక్కడి ప్రజల శ్రమని పిండుకుని తింటూ తమది రవి అస్తమించని సామ్రాజ్యమని గొప్పలు చెప్పుకుని కాలవశాన యెక్కడి జనం అక్కడ నుంచి చీకొట్టి తరిమితే వలసలన్నీ మాయమైపోయి తమ సామ్రాజ్యంలో రవి యెక్కడ ఉదయిస్తున్నాడో తెలియని స్థితికి చేరుకుని కూడా తమ అహంకారాన్ని మాత్రం వొదులుకోలేదు,యెందుకని?వారి వలసల్లో అతి ముఖ్యమైన దక్షిణాఫ్రికా,భారత్ అనే రెండు దేశాల్లోనూ మోహనదాసు ప్రచారం చేసిన "మీ పారతంత్ర్యానికి ఆంగ్లేయులు కారణం కాదు,మీలోని దోషాలే - కాబట్టి వారి మీద క్రూరంగా తిరగబడి తరిమెయ్యకుండా తెలివిగా రాసే మహజర్ల తోనూ గుండ్రబల్ల ముచ్చట్లతోనే పనులు జరిపించుకోవచ్చు,మీరు వాళ్ళతో ఆయుధాలు చేపట్టి పోరాడి ప్రాణాలు పోగొట్టుకోనఖ్ఖర్లేకుండానే మీకు కావలసినవి సాధించుకోగలుగుతారు,నన్ను నమ్మండి,నేను చెప్పింది చెప్పినట్టు యెందుకని అడక్కుండా చెయ్యండి,రెండేళ్ళలో మీకు స్వాతంత్రాన్ని సాధించిపెడతా!" అనే తింగరి సిధ్ధాంతం చెప్పి నమ్మిస్తే ఇతడు నిజంగానే చెప్పింది చెయ్యగలడని నమ్మి వీళ్ళని ఇంటికొచ్చిన చుట్టాలని చీరెసారెలతో సాగనంపినట్టు మర్యాదగా పంపించటం జాత్యహంకారంతో కళ్ళు పొరలు గమ్మిన వాళ్ళకి ఆయా దేశాల్లో తాము చేసిన దుర్మార్గాల పట్ల కనీసపు పశ్చాత్తాపం కూడా లేకుండా చేసిందా!

     ఒకనాడు భారతీయులూ ప్రపంచదేశాల మార్కెట్లలో వీరవిహారం చేశారు.వీరు పరదేశంలో అడుగుపెట్టేనాటికి స్వదేశంలో సంస్కృతిపరంగా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించారు,అయినా సరే యెదుటివారి మర్యాదను కాపాడుతూ తమ మర్యాదని కాపాడుకుని గౌరవాభిమానాల్ని ఇచ్చిపుచ్చుకున్నారే తప్ప ఈ పెత్తందారుల వలె తాము వ్యాపించటం కోసం ఇతర్లని వలసప్రజలుగా చేసుకోవాలని అనుకోలేదు - మర్యాదాపురుషోత్తములు!ఒకే విధమయిన పరిస్థితుల్లోకి ప్రవేశించినా ఒకరు గొప్పగా ప్రవర్తించారు,ఒకరు చెత్తగా ప్రవర్తించారు - అయినా చెత్తగా ప్రవర్తించినవాళ్ళు పోటుగాళ్ళమని ఇప్పటికీ విర్రవీగుతున్నారు!తమ సరుకుల్లోని నాణ్యతను చూపించి మార్కెట్లని కొల్లగొట్టారే గానీ రాజుల్ని వశపర్చుకుని సుంకాల్లో ఇతర్ల కన్నా యెక్కువ శాతం రాయితీలు పొంది, రాజ్యాల్ని కబళించి ముడిసరుకుల్ని తక్కువధరకి కొట్టేసి,తమ సరుకుల్ని ప్రజల చేత బలవంతంగా కొనిపించే రకపు దిక్కుమాలిన వ్యాపారం చెయ్యలేదు.ఖండాంతరాలలో మనం మ్లేచ్చులూ యవనులూ అనుకునేవారిలో ఉన్న ఋషులకి కూడా నిండుమనస్సుతో నమస్కరిస్తున్నాను అన్న కృష్ణద్వైపాయనుని వినయంలో ఉంది విశ్వగురువులని ప్రపంచమంతా కీర్తిస్తున్నా ప్రతివారినుంచీ యెంతోకొంత నేర్చుకోదగినది ఉందని తెలుసుకుని ఒదిగి ఉండే  భారతీయత!అంతటి ఔన్నత్యమే ఉంటే ఇంతటి దుర్మార్గం ఎందుకు చేస్తారు?

     ఇరాక్ మనకి మిత్రదేశం,అయినా మన దేశమూ మిత్రుడి మీదకే యుధ్ధానికి వెళ్ళాల్సిన దౌర్భాగ్యం పట్టింది!వాస్తవానికి ఆంగ్లేయుల దుర్నీతి ప్రకారం వారి ప్రోద్బలంతో ద్విజాతి సిధ్ధాంతం ప్రవచించుకుని రెచ్చిపోయి జాతీయత లేని భారతీయ కమ్యునిష్టులు ప్రోత్సహించటంతో జ్ఞాతికలహంతో పక్కలో బల్లెంలా ఆవిర్భవించిన పాకిస్తాను తప్ప మిగిలిన అన్ని ముస్లిం దేశాలూ మనదేశంతో సఖ్యంగానే ఉంటున్నాయి.ముఖ్యంగా ఇరాన్,ఇరాక్ వాటిలో అవి యెంత శత్రుత్వం ఉండి చెదురుమదురు గిల్లికజ్జాలతో సతమతమవుతున్నా భారత్ మాటని మన్నించి గొడవల్ని తగ్గించుకున్న సందర్భాలూ ఉన్నాయి.ఆ రెండు దేశాల్లో ఏ దేమూ ముస్లిం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన చరిత్ర కూడా లేదు,ఇంకా గట్టిగా చెప్పాలంటే దూరంగానే ఉన్నాయని కూడా చెప్పవచ్చు.ఇరాక్ అధినేత చేసిన తప్పల్లా తన దేశంలోని ఆయిల్ నిక్షేపాల మీద పూర్తి అధికారం తనకే ఉండాలని కోరుకుని,తన ప్రజల సౌభాగ్యం కోసం వెచ్చించడం కోసం ఈ సామ్రాజ్యవాదులకి తక్కువధరకి అమ్మకపోవడమే!వీడు వండి వార్చిన క్రిమియుధ్ధాల కట్టుకధలు కూడా అబధ్ధాలని యుధ్ధం ముగిసిన వెంటనే సమస్త ప్రపంచానికీ స్పష్టంగా తెలిసిపోయింది.ఇరాకీ ప్రజల్లో సద్దాం హుస్సేన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నదనేది పూర్తి వాస్తవం కాదనీ,అది అగ్రరాజ్యాల పెంపుడు మీడియా జిగిబిగితో అల్లి ప్రచారం చేసిన కట్టుకధనీ అప్పట్లోనే అందరికీ తెలుసు.సద్దాం హుస్సేనును దించిన యేడాది కాలంలోనే అరవై శాతం ప్రజలు ఆయనకు అనుకూలంగా ఉన్నారని బీబీసీ ఒక సర్వేలో తేల్చి చెప్పింది.వచ్చే యేడాది ఆరంభంలో వెలుగు చూస్తుందని అంటున్న చిల్కాట్ నివేదిక వెలుగు చూసినాక కూడా ఇప్పటి మాదిరి నిబ్బరంగా ఉండగలడా ఈ యుధ్ధోన్మాది?!

     తా జెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు వలస రాజ్యాలు పోవటంతో వైభవం నశించి ఇతర యోరోపు దేశాలతో యూరో డాలర్ పేరు చేప్పి హడావిడి చేసినా ఫలితం లేక తన యేడుపు తను యేడవాల్సింది పోయి ఒకనాటి యెత్తుగడల్ని సొంతంగా పాటించే దిక్కులేక అమెరికా పక్కన జేరి సిగ్గులేని తాతగారు బుధ్ధిలేని మనవడికి రంకు నేర్పినట్టు అమెరికానీ చెడగొట్టాడు.ఇదివరకే గ్రెనెడా మొదలుకొని లాటిన్ అమెరికా దేశాల్లో ముఖం వాయగొట్టుకుని కూర్చున్న అమెరికాని బలవంతంగా యుధ్ధంలోకి దించి ఆఖరికి అమెరికా ఆర్ధిక పరిస్థితినీ దిగజార్చాడు ఈ జాత్యహంకారి!ఆ ఒకే ఒక యుధ్దంతో నిండుకుండలా ఉన్న అమెరికా పరిస్థితి అప్పులకుప్పగా దిగజారింది!ఒక దేశపు అధినేతని,అదీ ప్రజల్లో పలుకుబడి గలిగిన సార్వభౌముణ్ణి అనాధలాగ నిలబెట్టి తన తాబేదారు జడ్జితో ఉరిశిక్ష వేయించిన ఘాతుకం హిట్లర్ కూడా చెయ్యలేదు,వీడు మాత్రమే చెయ్యగలిగాడు - ముఖం చూస్తే జేమ్సుబాండు గుణం చూస్తే దొంగ గాడ్దె?!

     ఇప్పుడేమైంది?చాలా సహజంగా ఈ రెండు క్రైస్తవ దేశాలూ కూడబలుక్కుని ముస్లిం దేశాల మీద పెత్తనం చేస్తున్నాయని ముద్ర పడిపోయింది,ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుందన్నట్టు అంతే సహజంగా ముస్లిం ఉగ్రవాదం బిన్ లాడెన్ రూపంలో విజృంభించింది.అసలే యుధ్ధం ఖర్చు తడిసి మోపెడయినా కోర్టులో గెలిచినవాడిలా కుములుతున్నా ఇంట్లో ఈగలమోతని తట్టుకుంటూ అమెరికా మరింత ఖర్చు చేసి అష్టకష్టాలూ పడి ఆ ఒక్కణ్ణీ మట్టుబెట్టి వూపిరి పీల్చుకునేలోగానే అయిసిస్ పేరుతో పదింతల బలంతో మరొక భూతం పైకి లేచింది - కోతిపుండును కెలకటం దేనికి?అది బ్రహ్మరాక్షసి అయ్యిందని వగచటం దేనికి!అమెరికా సైతాను దెబ్బకి బుధ్ధొచ్చి తన కాలిన తోకని ఆర్పుకుంటూ అఘోరిస్తుంటే ఆ సైతాను ఇప్పుడు ఫ్రాన్సు బుర్ర్రలో దూరి అమెరికా ఖాళీ చేసిన చోట్లలో తన సైన్యాల్ని మోహరించి పెత్తనం చెయ్యాలని చూస్తున్నది - ప్రపంచం ప్రశాంతంగా ఉంటే చూడలేని దరిద్రులకి కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు అధికారం అందితే వాళ్ళు ఇట్లాగే ప్రవర్తిస్తారు, మొదట తుదముట్టించాల్సింది వీళ్ళనే!

     భద్రతా మండలిలో మన దేశానికి వీటో పవర్ ఉండి ఉంటే ఇరాక్ యుధ్ధాన్ని ఆపగలిగేవాళ్ళమేమో!కానీ మనకి ఇస్తామన్నప్పుడు ఎడ్వినా ప్రియుడు నాకు దేనికి నా దోస్తు చైనాకి ఇవ్వండన్నాడు - అదేమి తెలివో మరి?ఇప్పుడు మనం వీటో పవర్ కోసం అడుగుతుంటే ఆ చైనాయే మోకాలు అడ్డం పెడుతున్నది సమాధిలోని డింపట్ ఇంకాస్త కుళ్ళి చచ్చేలా!కమ్యునిష్టులకి మనుషులు మనుషుల్లాగ కనపడరు కాబోలు వాళ్ళ ఎజెండాని అమలుచెయ్యటానికి పనికొచ్చే మనిముట్ల లాగ తప్ప, అర్హత ఉందా లేదా అని కూడా చూడకుండా ఎమినెంట్ ప్రొఫెసర్లుగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కుప్పలు తెప్పలుగా నింపేసి తమ ఎజెండాని అమలుపరిచినంతకాలం అభివృధ్ధి కాముకుడు,శాంతికాముకుడు అని పొగిడేసిన వాళ్ళు తమకిష్టమైన చైనాతో యుధ్ధం రాగానే ఇవ్వాళ మిగతావాళ్లని అవార్డులు తిరిగిచ్చేయమని రుబాబు చేసి అందరితోనూ కొండమంగళ్ళు చేసే గుండుగొరుగుడు పనులు చేయించారు గానీ ఆరోజున నెహ్రూ కూర్చోబెట్టిన తమ తమ ఉద్యోగాలకి రాజీనామాలు ఇచ్చి బయటికి రాకుండా కూర్చుని నెహ్రూ చేసిన తప్పుల వల్లనే అంత మంచి చైనాతో యుధ్ధం వచ్చిందని నెహ్రూనే తిట్టటం మొదలుపెట్టారు,పాపం సొంత మంత్రివర్గంలోని వారు వ్యతిరేకించినా ఎట్లాగో తట్టుకోగలిగాడు గానీ  తను ఎంతో గొప్పగా ప్రవచించిన పంచశీలలో ఒక శీలని వూడబీకిన చైనా క్రూరమైన మిత్రద్రోహాన్నీ ప్లేటు ఫిరాయించిన కమ్యునిష్టుల నిర్దాక్షిణ్యమైన తిట్లనీ మాత్రం భరించలేకపోయాడు - మనోవ్యధతో మంచం పట్టి కుళ్ళి కునారిల్లి హతమారిపోయాడు!

     నెహ్రూ తన పంచశీలని బుధ్ధుడి బోధనల నుంచి తీసుకున్నానని పైకి చెప్పినా చాణక్యుడి షాడ్గుణ్యంలోని అతి ముఖ్యమైన మొదటి సూత్రాన్ని యెగరగొట్టేసి మిగిలిన వాటికి వాక్య సముచ్చయంలో రూపం మార్చి చాణక్యుడి పేరు చెప్తే తనకి హిందూత్వం అంటగడతారని భయపడి బుధ్ధుడి పేరుతో చలామణిలోకి తెచ్చాడు.నిజానికి బుధ్ధుడు యజ్ఞయాగాదుల్లో మితిమీరిన జంతుహింసని ఆపి వ్యవసాయాన్నీ వాణిజ్యాన్నీ ప్రోత్సహించమని కొన్ని ఉదారవాదపు నీతిసూత్రాలు చెప్పడం తప్ప సమాజ స్వరూపాన్ని పూర్తిగా మార్చే విప్లవాత్మకమైన ప్రతిపాదనలు ఏమీ చెయ్యలేదు.పైగా చెప్పిన విషయం కూడా అంటీముట్టనట్టు చెప్పి వొదిలెయ్యటమే తప్ప గట్టిగా ఇది చేసి తీరాలని యెవ్వర్నీ శాసించలేదు.ఒకసారి మగధ మహామంత్రి వజ్జి రాజ్యం మీద దాడి చేసి ఆక్రమించుకుందామని ముందుగా బుధ్ధుడి వైపునుంచి సానుకూలత తెచ్చుకుంటే విమర్శలు తప్పుతాయి గదా అని బుధ్ధుడితో ప్రస్తావించాడు.దానికి సూటిగా మగధ మహామంత్రికి "వద్దు" అని చెప్పకుండా పక్కనే ఉన్న ఆనందుడనే శిష్యుడితో సంభాషిస్తున్నట్టు "ఆనందా!వజ్జి రాజ్య ప్రజలు వృధ్ధుల పట్ల గౌరవంగానే ఉంటున్నారు కదా?వారు ఐకమత్యంగానే ఉంటున్నారు కదా?అత్యున్నత మానవతా ధర్మాల్ని వదలకుండా పాటిస్తూనే ఉన్నారు గదా?" అని అనేకమైన ప్రశ్నల్ని సంధించి ఆనందుడి నుంచి అన్నిటికీ "అవును" అని సమాధానం రావడంతో "ఆ విధంగా వారు ఉన్నంతకాలం వారు నశించకుందురు గాక!" అని ముక్తాయించి వొదిలేశాడు - గట్టిగా తన మనసులోని మాటని చెప్తేనే దిక్కు లేకుండా పోతుంటే ఇట్లా సూక్తులు చదివితే యెవడు వింటాడు?అమాయకంగా ఆలోచించే మనబోటివాళ్ళకి బుధ్ధుడు వజ్జిరాజ్య ప్రజల్ని ఆశీర్వదిస్తున్నట్టు అర్ధమవుతుంది,కానీ రాజకీయ జీవి అయిన మగధ మహామంత్రికి వారిలో ఐకమత్యాన్ని చెడగొడితే ఫర్వాలేదు కదా అని వీలు దొరికి వజ్జి రాజ్యంలోకి తన మనిషిని పంపించి అంతపనీ చేశాడు!కొందరు బిష్పక్షపాతంగా చరిత్రని వ్యాఖ్యానించిన పండితుల పరిశీలన ప్రకారమే అప్పటి కాలంలో బుధ్ధుడు రాజ్యాధినేతల్ని గానీ ప్రజల్లోని మేధావుల్ని గానీ ఎక్కువగా ప్రభావితం చేయలేకపోయాడు.అలాంటి బుధ్ధుడు భారతదేశానికి ప్రేమతన్నుల హైందవేతర ముఖచిత్రాన్ని ఇవ్వడం కోసం ఆధునిక కాలంలో కొందరికి కీలుబొమ్మలా ఉపయోగపడుతున్నాడు - అసలు సారం యెవరికీ అఖ్ఖర్లేదు, పనికిరాదు కూడా!ఇవ్వాళ్టి రూపం చూస్తే హీనయాన, మహాయాన, తాంత్రికయానపు మిశ్రమ పరిజ్ఞానంతో అనుసరించేవారిని యుధ్ధాలకీ హింసకీ గూడా పురికొల్పుతూ శ్రీలంకలో వలె జాత్యహంకారుల్ని కూడా వెనకేసుకొస్తూ జాలి గొల్పుతున్నది!అద్దం ఇటు జరిపితే ఒక ఫలితం అటు జరిపితే ఒక ఫలితం అంటూ హడావిడి చేసే ఫెంగ్షుయ్ వాస్తుని కూడా చేర్చుకుని నవ్వులాటగా తయారయింది:-)

     చాణక్యుడి షాడ్గుణ్యంలో మొదటి హెచ్చరిక నీ పొరుగు దేశాన్ని ముందుగానే మిత్రదేశంగా యెన్నడూ భావించకు అనేది!రాజుని విజిగీషువు అన్నాడు,అంటే ఇవ్వాళ ఒక గ్రామమే అతని అధీనంలో ఉన్నా శక్తి కొద్దీ పరిక్రమించి ఒకనాటికి మొత్తం భూమండలాన్ని జయించే హక్కు ఉన్నది అని అర్ధం!అయితే అది ధర్మవిజయమే కావాలి అని గట్టిగా నొక్కి చెప్పాడు.అలాంటి విజిగీషువుని మధ్యలో ఉంచి మిత్రుడికి శత్రువు తనకూ శత్రువే అనీ శత్రువుకి మిత్రుడు కూడా తనకు శత్రువే అనీ చిలవలు పలవలుగా అల్లుతూ గొప్ప ప్రణాళికతో కూడిన మండల సిధ్ధాంతాన్ని ప్రతిపాదించాడు.పొరుగు రాజుల్లో యెవరయినా పూర్తిగా బలహీనపడినా లేదంటే అతిగా బలవంతుడైనా ఈ మండలం లోని సమతౌల్యం దెబ్బతింటుంది గాబట్టి బలహీనంగా ఉన్నవాళ్ళని ప్రోత్సహించి బలం పెంచుతూ బలవంతుల్ని నిగ్రహిస్తూ నిత్యజాగరూకతతో తనని తను కాపాడుకుంటూ ఉండాలని చెప్పాడు.శత్రువు నుంచి ప్రమాదం వస్తే తప్ప తనకు తనుగా యుధ్ధానికి ఎన్నడూ ఉరకలు వేయరాదని హెచ్చరించాడు,విజిగీషువు కాబట్టి వ్యాపించటం సరైనదే అయినా ఇప్పటి తన ప్రజల్ని కష్టపెడుతూ గెలిచాక కొత్తగా తన పాలనలోకి చేరిన ప్రజల్ని సంతోషపెట్టలేని యుధ్ధం వినాశనానికి దారితీస్తుంది గనక అది ఆత్మహత్యాసదృశం అని చెప్పాడు.

ఈ వాస్తవికతని వొదిలి ఆ స్వాప్నికతని నెత్తికెత్తుకున్నవాడు పండితుడట - ఖర్మ, ఖర్మ!
-----------------------------------------------------------------------------------------------------------------ఈ ప్రసంగం శాలివాహన శకం 1937 కార్తీక మాసము 28వ తేదీ గురువారము నాడు ప్రచురించబడినది.

Thursday 12 November 2015

తెలుగు బ్లాగుల్లో నీరసానికి కారణాలు ఏమిటట?ఆడబ్లాగర్లని నిషేధించడం మంచిదని నా ఉబోస!

     ఈ మధ్యన ఒక మంచి యాగ్రిగేటర్ మూతబడింది!మిగిలిన యాగ్రీగేటర్ నిర్వాహకులు కూడా పెదవి విరిచేస్తున్నారు?విషయం బ్లాగుల్లో సందడి తగ్గిందని,కామెంట్లు వరదల్లా పొంగుకురావడం లేదని,పోష్టులకి హిట్లు ఉధృతంగా తగలట్లేదని - బోల్డు కంపెయింట్లు!?నేను బ్లాగుల్లోకి వచ్చిన కొత్తల్లో ఆంధ్రా ఆకాశరామన్న నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్టుండేది.ఒక్కో వాదన చదువుతుంటే వీళ్ళు గనక యెదురెదురుగా తారసపడితే ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటారేమో అన్నట్టుండేది వాతవరణం!అపట్లో సొంత బ్లాగు యెలా ఓపెన్ చెయ్యాలో తెలీదు గనక పొడుగాటి కామెంట్లతో నేనూ దూకాను.రాష్ట్రం విడిపోవటంతో ఆయన నిరాశ పడిపోయి ఇక సెలవనేశాడు!మోద్ట్లో తెలుగులో యెట్టా రాయాలో గూడా తెలీదు,మెల్లమెల్లగా కామెంట్లు తెలుగులో యెట్టా రాయాలో తెల్సుకుని చాలాకాలం పాటు కామెంరుగానే గడిపా,హఠాత్తుగా వనజ వనమాలి బ్లాగులో ఆమె కూడా వేరేవాళ్ళు క్లూ ఇస్తే బ్లాగు ఓపెన్ చేఇనట్టు తెలిసి అడిగితే దేవరహస్యం కాస్తా మీ ఐడియే దాన్ని పట్టుకుని మందుకెళ్ళమన్నారు.ఈ బ్లాగులు మామూలుగా గూగుల్లో డైరెక్టుగా రావు.వీటికి యాగ్రిగేర్లు ఉండాలి.బ్లాగుల్ని తిరగటానికి జల్లెడ దగ్గిర మకాం వేసేవాణ్ణి.అందులో అయితే ఒక రచయిత కనెక్ట్ అవడం అంటూ జరిగితే మొత్తం అన్ని పోస్టులూ పర్మనేంటుగా కనబడతాయి.రీడబిలిటీ బాగుంటుంది.కానీ నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నా బ్లాగు మాత్రం అక్క కనెక్ట్ అవ్వలేదు,బహుశా అప్పటికే కిక్కిరిసిపోయి ఉండొచ్చు?యాగ్రిగేటర్లని మెయింటెయిన్ చెయ్యడం కేవలం ఆసక్తి కొద్దీ చేసే శ్రమ తప్ప ఆదాయం ఉండదు.ఆదాయం లేకపోయినా ఉత్సాహం రావాలంటే బ్లాగుల్లో పోష్టులు త్వరత్వరగా పడుతూ ఉండాలి,లెక్కకోసం హిట్లు కనబడాలి,పోష్టులు బాగున్నాయని తెలియడానికి కామెంట్లు యెక్కువ పడాలి!

     ప్రస్తుతం బ్లాగుల్లో నిరాశకి రాష్త్ర విభజన ఒక ముఖ్యకారణం అని నా అనుమానం!ఏది రాసినా ప్రాంతీయం అయిపోతుందేమో అనే భయం బ్లాగర్లని ధైర్యంగా టాపిక్కుల్ని యెన్నుకోవడానికి ఉషారు నివ్వట్లేదని నా అనుమానం!ఈ మధ్యన ఆంధ్రజ్యోతిలో ఒకాయన విశ్వనాధ సత్యనారాయణ గారి గురించి ఒక ఆర్టికిల్ రాశారు.ఆయన విశ్వనాధ వారి ప్రతిభ గురించి చెప్పిన విషయం బాగానే ఉంది గానీ మాటిమాటికీ ఆయన స్మారక మందిరం హైదరాబాదులో ఉంది ఓ తెలంగాణ బాబులూ ఆయన్ని కేవలం ఆంధ్రావాడని ముద్ర వెయ్యకండి బాబూ ప్లీజ్ అని బతిమిలాడుకునే ధోరణిలో ఉంది - బహుశా తెలంగాణ ముఖ్యమంత్రీ ఆయన అనుంగు అభిమానులూ ట్యాంకుబండు మీద ప్రాతస్మరణీయుల్ని పెకలించి ఆంధ్రాకి తరలించాలన్న నాటి హ్యాంగోవరు ప్రభావం అనుకుంటా!నిన్ననో మొన్ననో ఒక మహిళారత్నం వ్యాస రచయితకే నీతులు చెప్తూ విసుర్లు విసరనే విసిరారు.నాకు మాత్రం ఆ ఇద్దరి మీదా జాలి వేసింది!అయితే విశ్వనాధకి ఈ ప్రాంతీయ భేదాలు ఉండవు.ఆయన మాందలికాల జోలికి పోకుండా రచనలో సరళగ్రాంధికం వాడాడు!వాళ్ళ పేర్లతో శకాలు ఉన్నయ్యంట పోష్టులో నేను వాడిన తెలుగు అర్ధం అయితే విశ్వనాధ సాహిత్యం కూడా తేలిగ్గా చదవొచ్చు!విషయం కూడా ప్రాంతీయం కాకుండా మొత్తం భారతీయం, అదీ చరిత్ర గురించి స్పెషలైజ్ చేశాడు గాబట్టి కంటెంటుని బట్టి లెక్కేస్తే కేవలం తెలుగువాళ్ళే కాదు ,భారతీయుడైన ప్రతివాడూ గర్వంగా చెప్పుకోదగినవాడు!ముఖ్యంగా హాస్యాన్ని ఇష్టపడేవాళ్ళకి విశ్వనాధ సైలెంటుగా వేసే జోకులు గొప్పగా కితకితలు పెదతాయి:-) అలాంటి హాస్యం రచనల్లో తగ్గడం కూడా బ్లాగులు పాప్యులర్ కాకపోవడానికి ఒక కారణం అని నా అభిప్రాయం. 

     ఇంకొక ముఖ్యాతి ముఖ్యమైన కారణం మగబ్లాగర్లంతా ముసలాళ్లయిపోయారు.ఆడబ్లాగర్లు వాళ్ళ పోష్టులన్నిట్నీ ఆడాళ్ళ కష్టాలతో నింపేస్తున్నారు.పెళ్ళీడు కొచ్చిన అమ్మాయో అబ్బాయో సరదాగా తెలుగు బ్లాగుల్లో కొస్తే "వ్యాసుడు బ్రాహ్మణుడా?అబ్రాహ్మణుడా?" అని పోట్లాడుకుంటుంటే దడుచుకుని పారిపోరా?పైగా దున్నడం దున్నించుకోవడం అని డైరెక్టు కామప్రకోపాల భాష వాళ్ళమీద వొదిలితే వాటికి అలవాటు పడి చెడిపోనన్నా చెడిపోవాలి,లేదా అసహ్యం పుట్టి యే ఫేసుబుక్కు వైపుకో పారిపోవాలి.అందుకే నేను ట్రాక్ మార్చేస్తున్నా.పొలిటికల్ సెటైర్లకీ, తింగరి చర్చలకీ పులిస్టాప్ పెట్టేసి రొమాన్సూ,క్యామెడీలకి రంగం సిధ్ధం చేశా.యాభయ్యేళ్ళు,అరవయ్యేళ్ళు అంగలార్చి కొత్తగా రాష్ట్రం సాధించుకున్నాం అని డాబుసరి కబుర్లు చెప్పుకుంటూ తన రాష్ట్రం గురించి మాత్రం నా మసీదు,నా గుడి, నా నగరం అని ముడ్డీ నోటా పులకించి పోతూ పొరుగు రాష్ట్రం యేర్పడి రెండేళ్ళు కూడా గడవక ముందే ముక్కలు చెక్కలవ్వాలని కోరుకుంటూ అక్కడ పుట్టే వేర్పాటు ఉద్యమాలకి ఆల్ ది బెస్ట్ చెప్పే కిరాతకులు ఉండగా యెన్ని నీతులు చెప్పినా యేమి ప్రయోజనం?ఆంధ్రాకి హక్కుగా చెయ్యాల్సిన పని గట్టిగా చెయ్యటానికి కూడా చెయ్యాల్సిన వాళ్ళకి చేతులు రాక బీహారులో భాజపా ఓడిపోవాలని కోరుకోవాల్సిన పరిస్థితిలో రాజకీయం ఉంటే యేమి అనాలిసిస్సులు రాసినా యేమి ఉపయోగం?ఆ ద్వేషమూ ఈ నిర్లక్ష్యమూ ఇప్పుడప్పుడే పోయేవి కావు - బిడ్డ చచ్చినా పురిటికంపు వెంటనే పోదన్నట్టు ఆంధ్రావాళ్ళు ఈ రెంటినీ కొంతకాలం భరించాల్సిందే, బహుశా అనంతకాలం వరకూ?!మొదట వాత్స్యాయన కామసూత్రాలు పరిచయం చేస్తా.తర్వాత అర్ధశాస్త్రం పరిచయం చేస్తా.బోరు కొట్టకుండా నా మార్కు క్యామెడీ లాంగ్వేజి ఉండనే ఉంది.కురాళ్లకి భవిష్యత్తుని యెట్లా తీర్చి దిద్దుకోవాలి అనేది చెప్పకుండా సోది టాపిక్కులన్నీ యెత్తుకుంటే యెవడు చదువుతాడు?ఈ విషయంలో కష్టేఫలి మాస్టార్ని ఒక్కర్ని మినహాయించెయ్యాలి,బాతాఖానీ లక్ష్మీఫణి మాస్టార్ని కూడా!

     ఒక్క నేను తప్ప దాదాపు ప్రతి మగబ్లాగరూ నీహారికతో యేదో ఒక సందర్భంలో చివాట్లు తిన్నవాళ్ళే!అది కూడా నీరసానికి ఒక కారణం అయ్యుండొచ్చు,మగబ్లాగర్లంతా ఇంత బతుకూ బతికి ఈ అమ్మాయితో తిట్లు తినడమా అన్న ఫీలింగుతో బితుకూబితుకూ మంటున్నారని నా అనుమానం!ఈ నీహారికా ఆంటీలో చాలా మ్యిస్టేరీ ఉంది సుమండీ!నేను విడాకులు అడిగినా మా అయన ఇవ్వట్లేదు అంటుంది చూశారూ,అది అసలైన ఆడ తెలివి,జాణతనం!నిజంగా విడాకులే కావాలంటే ఆయన్ని బతిమిలాడుకోవడం దేనికండీ,లాయరు దగ్గిరకెళ్ళి డైరెక్టుగా నోటీసు పంపించాలి గానీ?!పెద్ద ఘొప్ప - మా అయన చూడండి నేను విడాకులడిగినా ఇవ్వకుండా నన్ను ఎంత గారాబంగా చూసుకుంటున్నాడో అని రివర్సు ఫిట్టింగులు వేస్తున్నాది - అది అర్ధం చేసుకోకుండా ఈవిడ శూర్పణఖ అభిమాని కాబోలు అబ్బో,అమ్మో,ఓహోహో అనేసుకుని అపార్ధం చేసుకుంటే కళ్ళు పోతాయి - నిజం,ఒట్టు,అమ్మతోడు!యేమైనా నీహారిక దెబ్బ తగలకుండా చూసుకోవడం విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల వల్లనే మగబ్లాగర్ల పోష్టులు తగ్గాయనేది నా పరిశోధనాత్మకమైన వివరణ!అయితే,ఆడబ్లాగుల్ని నిషేధించాలనే నా ఉబోసని అందరూ ఒప్పుకోకపోవచ్చు,బొత్తిగా సెక్సప్పీలు ఉండదేమోనని ఫీలయ్యే పుంగవాలు కూడా ఉండే ఉంటారు మగబ్లాగర్లలో, పైకి చెప్పరు గానీ కుర్రతనంలో ప్రతి మగబ్లాగరూ గ్రంధసాంగుడే - అబ్బో!ఇక ఆడబ్లాగర్లలో యెవ్వరిని ఆపినా నీహారికని మాత్రం అస్సలు ఆపలేం:-)

     పోస్టు పట్ల కుతూహలం పుట్టాలంటే టైటిలు లోనే కిక్కు ఉండాలి!కధామంజరి మాస్టారు ఈ మధ్యన ఈ విషయంలో ఆరితేరి పోయారు,అట్లాగన్న మాట!టైటిలుకీ కంటెంటుకీ రిలేషన్ లేకపోయినా పర్లేదు.విజిటరు టైటిలు చూడగానే "హర్రె!ఇదేమిటి?" అని కంగారు పడయినా సరే బ్లాగుకి వచ్చిపడేట్టు ఉంటే చాలు!అయితే వచ్చిన విజిటరు నీరసంగానో,కోపంగానో యెంత ఫాస్టుగా వచ్చాడో అంత ఫాస్టుగా పారిపోకుండా ఎంటర్టెయిన్ చెయ్యగలగాలి.ఎంటర్టెయిన్మెంటు గిట్టుబాటయితే ఫర్వాలేదని సరిపెట్టేసుకుని టైటిలుకీ పోష్టుకీ సంబంధం లేకపోయినా విజిటరు క్షమించేస్తాడు గానీ బోరు కొడితే మాత్రం అస్సలు క్షమించడు,టైటిలూ టాపిక్కూ యెంత అన్యోన్యంగా ఉన్నా విసుక్కుంటాడు!పోష్టులో మనం వాడే భాష కూడా ముఖ్యమే,నా మట్టుకు నేను చాలా ప్రయోగాలు చేశాను.తెలంగాణ మాండలికం నుంచీ సరళ గ్రాంధికం వరకూ యేమాత్రం రసాభాస కాకుండా రాయగలిగాను!ఇదంతా జరగాలంటే పోష్టు గురించి సమయం యెక్కువ కేటాయించాలి.నాది ఇన్వాల్వ్మెంటు కీలకమే అయినా ఆఖర్లో వచ్చే అరణ్యమెంటు గాబట్టి తీరిక యెక్కువ,మిగతా బ్లాగర్లకి ఉద్యోగ బాధ్యతల వల్ల అంత తీరిక ఉండట్లేదు గాబోలు!

     విజిటర్లు గూడా కొంచెం ఓపిక చేసుకుని నచ్చిన బ్లాగు పోష్టుల్ని మెచ్చుకుంటూ,నచ్చని వాటిని ఎందుకు నచ్చలేదో చెప్తూ ఉంటే బ్లాగర్లకి కూడా ఆ రెస్పాన్స్ మరింత హుషారు ఇస్తుంది,కదా!నచ్చితే యెలాగూ భేషులూ శభాషులే ఉంటాయనుకోండి,నచ్చనప్పుడు ఇచ్చే సూచనలు మాత్రం కొంచెం సరళంగా లోపం ఏమిటో చెప్పి తప్పుకుంటే బాగుంటుంది,ఎంతయినా బ్లాగరు హోస్టూ కామెంటరు గెస్టూ కదా,మనం ఒకరింటికి వెళ్ళి వాళ్ళనే తిట్టి రాము కదా!కామెంటర్లకి రెస్పాన్స్ ఇవ్వడంలో శ్యామలీయం బెస్టు!పబ్లిష్ చేసిన ప్రతి కామెంటుకీ కృతజ్ఞతలు చెప్తూ అయినా తప్పనిసరిగా రెస్పాండ్ అవుతూ ఉంటారు.ఇంకా కొందరు ఉన్నారు,కానీ ఇక్కడే ప్రముఖంగా చూశాను.నాకేమో మొదట్లో పనుల వొత్తిడి యెక్కువైనప్పుడు హడావిడిగా వొచ్చి నేను కూడా విజిటరులాగా ఒక లుక్కేసి పోవడం జరిగేది,ఇప్పటికీ బధ్ధకం ఒకటి ఉండటం వల్ల కర్టెసీ రిప్లై కామెంట్లు ఇవ్వడంలో శ్యామలీయం అంత నిష్ఠగా ఉండలేకపోతున్నాను.అయితే, నా బ్లాగులో అన్ని పోష్టుల్లోనూ నాకు నచ్చిన కామెంటు ఒకటి ఈ మధ్యనే పడింది!"వాళ్ళ పేర్లతో శకాలు ఉన్నయ్యంట,వాళ్ళు మాత్రం ఈ భూమ్మీద లేరంట!య్యో,యేందయా నీ చరిత్రా నువ్వూనూ?" పోస్టులో ఒక ఆజ్ఞాత వేసిన జోకు, అది ఇది:రెండు కళ్ల సిద్దాంతం తెలంగాణ వాళ్లు తిప్పి కొట్టి బాబు ను ఎగతాళి చేయని రోజు లేదు. తెలుగు సినీ పరిశ్రమ ఎమిటి, ఆంధ్రా వాళ్లు అందరు ముందూ వెనుకో తెలంగాణాను వదులుతారు. ఖాళి గా ఉన్న హైదరాబాద్ రోడ్లలో జై, శ్రీకాంత చారి, విశ్వరూప్, గుండు గారు, ప్రభాకర్ మందార, బుద్దా మురళి, కంచా ఐలయ్య తో కలసి క్రికేట్ ఆడుకొని, పోటొలను గుండు బ్లాగు లో అప్ లోడ్ చేసి కింద తెలంగాణ భాష లో పద్యాలు రాసే రోజు చాలా దగ్గరలో ఉంది. - ఎప్పుడు గుర్తొచ్చినా మొహాన దహాలు పూయించే సరదా కామెంటు:-)ఇట్లాంటి సరదా మనుషులు ఒక పదిమంది ఉంటే చాలు ఆంధ్రోళ్ళూ తెలంగాణోళ్ళూ పదిమంది కేసీఆరులూ వందమంది గొట్టిముక్కలలూ యేడ్చి కుళ్ళుతున్నా పట్టించుకోకుండా ఘొల్లుఘొల్లున నవ్వేసుకుంటూ కలిసిపోతారని నా నమ్మకం?!నిజంగా అలా జరిగే అవకాశం లేదు,హాస్యోత్ప్రేక్ష అది:-)కాకపోతే సీరియస్ విశ్లేషణలో నేను కూడా ఆంధ్రా వాళ్ళు ఎప్పటికయినా తెలంగాణలో వెనక్కి వెళ్ళకతప్పదనీ,ఆ తర్వాత తెలంగాణ వాళ్ళు ఆ చోటుని భర్తీ చెయ్యడానికి కొంచెం టైము పడుతుందనీ రాసి ఉన్నాను.నా అంచనా అయితే పదేళ్ళు,వాళ్ళ చురుకుదనాన్ని బట్టి ఇరవయ్యేళ్ళు పట్టినా పట్టొచ్చు,ఇంకా అధికారంలో ఉన్నవాళ్లని ఉదారంగా అన్ని మంచిపన్లూ వాళ్ళనే చెయ్యనిస్తే వచ్చేసారికి మనం పవరులోకి రావడం యెట్లా అనే రంధితో ఉన్నవాళ్ళు గట్టిగా కృషి చేస్తూ ఉంటే మరో యాభయ్యేళ్ళు పట్టినా పట్టొచ్చు,ఏమంటారు?నీహారికని ఆంటీ అనడం వల్ల కామెంటరు కుర్రాడే అనిపిస్తుంది,ఇలాంటివాళ్ళ కోసమైనా మోడరేషన్ యెత్తెయ్యాలనిపిస్తుంది.కొందరు వాళ్లకున్న ఆబ్లిగేషన్స్ వల్ల ఐడీతో ఇలాంటి కామెంట్లు వెయ్యరు,అది అందరికీ తెలుసు.యెలాగూ ట్రాక్ మారుస్తున్నాను గాబట్టి మళ్ళీ చెత్త కామెంట్లు రాకపోవచ్చు,చూడాలి!

     యాగ్రిగేటర్ల వారు కూడా మరీ ఇటీవలి రెండు పోష్టులతో సరిపెట్టెయ్యకుండా ఒక నాలుగైదు పోష్టులకైనా ఆ సంఖ్యని పెచితే బాగుంటుంది.యెందుకంటే కొందరు విజిటర్లు సబ్జెక్టుని బట్టీ టైటిలుని బట్టీ కొంచెం పాతవైనా సరే చూడాలని ఆశించటం సహజం!వెంటవెంటనే పోష్టులు రాసేస్తే,వెంటవెంటనే రెండు మూడు మాత్రమే ఉండి పాతవి మాయమైపోతూ ఉంటే పోష్టు యెంత మంచిదైనా యెక్కువమంది చూడలేరు గదా!బహుశా దానివల్ల యాగ్రిగేటర్ సిస్టం యొక్క మెమొరీ మీద బరువు పడుతుందేమో,అయినా పరిశీలించి చూస్తే మంచిది!విజిటర్ల వైపు నుంచి చూస్తే అదొక ఇబ్బంది అనిపిస్తున్నది నాకు!అన్ని యాగ్రిగేటర్ల లోనూ కామెంట్ల సెక్షను లేదు.నేను ఈ మధ్యన కంచె సినిమా గురించి ఒకరు వేసిన కామెంటుని బట్టే చూశాను,అట్లా బ్లాగుల్ని వెదికేవాళ్ళూ ఉంటారు విజిటర్లలో.


ఆడవాళ్ళు తిట్లకి లంకించుకుంటే యెంతటి మగాడికయినా గుండెలు జార్తాయి - ఇంక ఆపేస్తాను!
-----------------------------------------------------------------------------------------------------------------

ఈ ప్రసంగం శాలివాహన శకం 1937 కార్తీక మాసము 22వ తేదీ శుక్రవారము నాడు ప్రచురించబడినది.

Tuesday 10 November 2015

ఆంధ్రాకి న్యాయంగా ఇవ్వాల్సిన వాట్ని కూడా బీహారు యెన్నికల పేరుతో తొక్కిపట్టేసినందుకు భాజపాకి మంచి శాస్తి జరిగింది?!

    డిల్లీలో యెన్నికల్లో ఆప్ గెలిచినప్పుదే చెప్పాను "ఆంధ్రావోళ్ళకి అన్యాయం చెయ్యదల్చుకున్నవాడు యెవడూ బతికి బట్టకట్టడు" అని!ఇప్పుడు రెండో సారి రెందేళ్ళ తర్వాత మోదీకి తగిలిన చావుదెబ్బలో ఆంధ్రాకి చేస్తున్న అన్యాయం కూడా ఒక కారణమే!లేకపోతే విభజన సమయంలో భాజపా స్వయంగా సమర్ధించిన ప్రత్యేక హోదాని కట్టబెట్టటానికి వెనకాడటం గురించి భాజపా చూపిస్తున్న సాంకేతిక కారణాలు నిజమైనవేనా?హోదా ఇవ్వకుండా తప్పుకోవడానికి వెంకయ్య్య నాయుడు దగ్గిర్నుంచీ ప్రతీ అడ్డగాడిదా చెప్పిన యే ఒక్క కారణంలోనూ సహేతుకత లేదు!నోరు తెరిస్తే చాలు హోదా కన్న యెక్కువే ఇస్తాం,గట్టి ప్యాకేజీయే ఇస్తాం అని సొల్లుకబుర్లు చాలా చెప్పారు.కానీ సరిగ్గా విభజన తర్వాత జరిగిన యెన్నికల్లోనే వాళ్ళూ అధికారంలోకి వచ్చారు.మాట్లాడితే బిల్ల్లులో యెందుకు పెట్టలేదు అని కాంగ్రెసు మీద రంకెలు వెయ్యదం తప్పిస్తే విభజన బిల్లుని గట్టిగా అమలు చెయ్యడంలో మాత్రం యేమి ఆసక్తి చూపించారు?రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ కష్టం ఉందని తెలిసి కూడా హోదానో ప్యాకేజీయో ప్రకటించటానికి రెండేళ్ళు సమయం కావాలా?రెండు ఆర్ధిక సంవత్సరాలు యేమీ తేల్చకుండా ఉండటం అంటే  అది నిర్లక్ష్యం కాదా?

     గట్టిగా అడిగినప్పుడల్లా లోపాయికారీగా బీహారు యెన్నికల తర్వాత అని సర్దిచెప్పడం వెనక మతలబు యేంటి?ఆంధ్రాకి ఇవ్వాల్సిన ఖాతాని బీహారు యెన్నికల్లో లబ్దికి ఫిరాయించారా?గెలిచి ఉంటే యెటూ బీహారులో గెల్చేశాం గాబట్టి ప్యాకేజీ ప్రకారం బీహారిలకి ఇవ్వాలి గాబట్టి ఏపీకి అడుగూ బొడుగూ ముష్టి విదిల్చితే చాలుననా భాజపా పెద్దల ప్లాను?ఒకప్పుడు కాంగ్రెసు ఇలాంటి చేత్తపన్లు చేసి ఇప్పటి స్థితికి దిగజారింది,అది తెలిసి కూడా భాజపా అదే దారిలో నడుస్తున్నది,అదే గతి పడుతుంది,కాదు కోరి కోరి అదే గతిని నెత్తి మీదకి తెచ్చుకుంటుంది!

     ప్రపంచం పొలిమేరలు దాటి సొల్లుకబుర్లు చెప్పి చప్పట్లు కొట్టించుకోవడం తప్ప మోదీ ఈ రెండేళ్లలో  నెరవేర్చిన ఘనకార్యం యేదయినా ఉందా?ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కు ఉన్నా ఇవ్వకుండా బీహారుకి అడక్కపోయినా యెందుకు ఇస్తున్నారు నేది ఆలోచించ్నంత దద్దమ్మలా జనం?!ఆంధ్రాని రెండేళ్ళూ అయోమయంలో ఉంచటం అనే ప్రమాదకరమైఅన యెత్తుగడ ఇప్పుడు భాజపాని మొత్తం జాతీయ స్థాయిలో దిక్కు తోచని స్థితిలో నిలబేట్టేసింది - వయంకృతాపరాధం!ఇప్పటి వరకూ తెదెపా భయం భయంగా ఒదిగి ఉంది - యే కొంచెం గట్టిగా మాట్లాడినా తనకి టాటా చెప్ప్పేసి జగన్ కేసులు రద్దు చేసి ప్రభుత్వాన్ని మార్చిపారేస్తుందేమోని ప్రతి ఒక్కరూ అనుమానించేటంత గొప్ప స్నేహం భాజపా తెదెపాలది?!బాబుకి ఇప్పుడా భయం పోయింది.భాజపా గనక ఆ పని చేస్తే బాబు కూడా వెంఠనే భాజపాకి మతతత్వం ముద్ర పులిమేసి ఒంటరిని చేసేస్తాడు, ఖాయం!ముందు ముందు యెన్నికలు జరగబోయే అయిదు రాష్ట్రాల్లో యెక్కడా భాజపాకి స్థానబలిమి లేదు,బాబుని కూడా దూరం చేసుకుని ఒంటరి అయితే ఒకప్పుడు కమలమే సకలం కావాలి అని వారు కన్న కలకి విరుధ్ధంగా కమలం కాకావికలం అవుతుంది!

     సరిగ్గా ఒకనాడు ఇలా ఒంటరిగా ఉన్న స్థితి నుంచి రామాలయ నిర్మాణం అనే హదావిడితో మంచి వూపును తెచ్చుకుంది,కానీ అధికారం వచ్చాక అసలు ఆ వూసే యెత్తకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ రామాలయ నిర్మాణం యెత్తుకుందామనుకుంటే అస్సలు గిట్టుబాటు కాదు!ఒకవేళ మూర్ఖంగా ఆ ప్రసక్తి తెస్తే ప్రభుత్వం కుప్పకూలిపోయి మధ్యంతరం వస్తుంది.చెప్పుకోవడానికి ఒక్క మంచిపనీ లేని స్థితిలో యెన్నికలకి వెళ్తే యేమవుతుంది - చిరిగి చాటవుతుంది:-)కాబట్టి మోదీ నుంచి వెంకయ్య వరకూ గయ్యాళి కబుర్లు ఆపి కాస్త కాళ్ళు నేలమీదకి దించి వాస్తవిక దృష్టితో ప్రభుత్వం నడిపితే తప్ప మరుసటి యెన్నికలకి తలెత్తుకు తిరగలేని దుస్థితి!వార్తాపత్రికల్లో వాళ్ళ ఆత్మవిమర్శనాత్మకమైన స్టేటుమెంట్లు చూస్తుంటే బింకం ఇంకా సడిలినట్టు లేదు.ప్రచారం అంతా మోదీతో చేయించి గెలిస్తే మోదీకి అంటగట్టేవాళ్ళు,ఇప్పుడు ఓటమికి మాత్రం సమిష్టిగా బాధ్యత వహించాల్ట!రాముడికి గుడి కడతామని చెప్పి రాముణ్ణి మర్చిపోయి ఆవుతోక పట్టుకుని యెన్నికల గోదారి ఈదాలనుకున్నారు,గోమాతకి సహనం నశించి ఈడ్చి తన్నింది!కాఫీలకీ టీలకీ ఆవుపాలు బాగుండకనో యేమో జనం గేదెపాలకి రుచి మరిగారు,ట్రాక్టర్లు వచ్చి దుక్కిటెద్దులతో పని లేకుండా పోయింది.వీళ్ళిప్పుడు గోరక్షణ చెయ్యాలంటే వాటికి మేత యెవడు పెట్టాలి?ఆర్ధికంగా ఆవులూ ఎద్దుల ప్రయోజనం తగ్గిపోవడం వల్ల వచ్చిన సమస్యకి ముస్లిముల మీద పడి యేడిస్తే ఇట్లాగే ఉంటుంది మరి - కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడింది!

     ఇప్పుడు తక్షణం భాజపా ఆంధ్రాకి గట్టి సాయం చేసి మాట నిలబెట్టుకోకపోతే ఇకముందు చెప్పుకోవటానికి ఒక్క మంచిపని కూడా ఉండదు.కాబట్టి బుధ్ధిగా నీతి ఆయోగ్ పెద్దలకి చురుకు పుట్టించి వీలయినంత తొందర్లో ఒక నికరమైన ప్రకటన జరిగితీరాలి!బాబు కూడా మారిన పరిస్థితిని సరిగ్గా అంచనా వేస్తే వేగంగా తనకి అనువుగా మలుచుకుని భాజపా మీద తను పైచేయి సాధించగలిగితే మరీ మంచిది!

హిందూత్వం బోడిగుండుకీ గోవధ మోకాలికీ ముడిపెట్టబోతే కమలానికి గూబ గుయ్యిమంది!

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...