Monday 28 March 2016

లెఫ్టు బిహైండు పార్టీల మైండు లేని రాజకీయం - లెఫ్టోవరు వోట్ల కోసం!

          కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తాదంటారు,ఓడలు బళ్ళవుతాయంటారు,పువ్వులమ్మిన చోట రాళ్లమ్మాల్సి వస్తాదంటారు - ఈటన్నిటికన్నా దయనీయంగా పోలిక చెప్పడానికే కుదరనంత పరమ దరిద్రంగా ఉందండయ్యా భారద్దేశంలో వామపక్షాల దుర్గతి!తన రాజకీయ జీవితమంత వయస్సు లేని కన్హయ్యా కుమారుడికి నారాయణ గారు విమానాశ్రయానికి వెళ్ళి ఎదురేగి తోడ్కొని రావడం దగ్గిర్నించీ కారు డోరు తీసి పట్టుకుని హడావిడి చెయ్యడం వరకూ చేసిన మర్యాదలకి నిజంగా అతను ఉద్దరించిన ఘనకార్యం ఏమిటి?

          ఒకప్పుడు ఎట్టా వుండేవోళ్ళు?ఎట్టాంటోళ్ళు ఎట్టా అయిపోయారు!బెంగాలు కమ్యునిష్టులు "మిగతా భారద్దేశమంతా వందేళ్ళ తర్వాత ఆలోచించే విష్యాలు బెంగాలు ఇవ్వాళ ఆలోసిస్తాది" అంటే నోరెళ్ళబెట్టి చూసినోళ్లే దప్ప "ఠాట్!ఏంటి నీ గొప్ప?" అన్నోడు లేడు.ఎక్కద నలుగురు పోగయితే అక్కడల్లా ఈళ్ళ గొంతే ఇనపడేది.గత చరిత్ర గమనం గురించి ఏది ఎందుకు జరిగింది,ఏది ఎందుకు జరగలేదు,ఎట్టా జరిగితే బాగుండేది అని చిలవలు పలవలుగా కళ్ళక్కట్టినట్టు చెప్పి ఒప్పించి నమ్మించగలిగిన తెలివి అంతా యాడికి బొయ్యిందో పాపం!

          జరిగిన దాన్ని గురించి ఎందుకు జరిగిందో చెప్పడానికి ఏ చిలక జోస్యమూ అక్కర్లేదు,ఏ పాండిత్యమూ అక్కర్లేదు,ఫ్యూచరు గురించి చెప్పండ్రా అంటే మాత్రం గుడ్లు తేలేస్తారు - అబ్బే విప్లవం అంటే వీజీ కాదు అని డబ్బాయిస్తారు!సైన్సు ఫిక్షన్ రచయితల పాటి కూడా నిక్కచ్చిగా చెప్పలేరు గానీ వాళ్లు జరుగుతుందనుకున్నది జరక్కపోయినా జరగదనుకున్నది జరిగినా కవరప్ చేసుకోవడానికి పనికొచ్చే చారిత్రక తప్పిదాలకి కారణాలు మాత్రం భలేగా  వండి వారుస్తారులే!

          మీ లక్ష్యం ఏమిటయ్యా అంటే అందర్నీ వర్గరహితసమాజంలో నిలబెట్టడం అని చెప్పడం వరకూ ధీమాగానే చెప్తారు గానీ అదెట్టా ఉంటుందీ అని నిలదీస్తే మాత్రం నత్తినత్తిగా విసుక్కుంటారు, గట్టిగా అడిగితే అడ్దం తిరిగి నువ్వు విప్లవద్రోహివి అర్ధమయ్యే నటిస్తున్నావు అని మనకే పువ్వులు పెడతారు,అదేంటో!పోనీ అడిగేవోడు అర్ధమయ్యే ఎటకారం ఆడుతున్నాడని అనుకుందాం,తనకి తెలివితక్కువగా అనిపిస్తేఅనే గదా ఎటకారం ఆడేది ఎవడయినా - నీ తెలివైన సిద్ధాంతం గురించి ఇంకొంచెం తెలివిగా చెప్తే ఎట్టా ఉంటది!అసలు పూర్తిగా విడమరిచి చెప్తే ఎటకారం ఎందుఒస్తుందీ అంట!బుద్ధుడి లాంటి సన్నాసుల మాటల్నే నమ్మినవాళ్ళు వీళ్ళ మాటల్ని ఎందుకు నమ్మటం లేదు?ఇంతకుముందు ఎవరూ చెప్పని కొత్త సిద్ధాంతం అంటారు, కొత్తది గాబట్టే అర్ధం కాకనే గదా అడిగాం, పూర్తిగా తెలుసుకోకుండా పరిగెత్తుకుని పోయి అగ్గిలో దూకటానికి మనమేం వేముల రోహిత్ లాంటి ఎర్రిపప్పలమా?

         కాలేజీలో క్లాస్ పుస్తకాలు తప్ప ఇంకోటి చదవకుండా ర్యాంకులు తెచ్చుకుని ఘనమైన యూనివర్సిటీలో రీసెర్చి స్కాలరుగా చేరేవరకు పెద్ద ఉద్యోగం చెయ్యాలనే రంధి తప్ప ఇంకేమీ లేనివాడు వీళ్ళ పైత్యపు కబుర్లకి లొంగి ఎట్టా అయిపోయాడో చూదండి.కార్ల్ సగన్ లాగ సైంటిష్టు కావాలనుకున్న వాడు టెర్రరిస్టుల్ని సమర్ధించి గూండాగిరీకి కూడా దిగజారి కోర్టుకేసులో ఇరుక్కుని రాజీ చెసుకుందామనుకున్నప్పుడు కధ తిరిగిన ట్విస్టుకి తన చుట్టూ తను వూదుకున బుడగ బరెస్టయ్యి తను హీరోయిజం అనుకున్న వేస్టు బతుక్కి డెంటిస్టు కూడా కాలేనని తెలిసి బతుకంటే ఇంటరెస్టు పోయి ట్రూరెపెంటెన్సు పుట్టిన ట్వెంటీఫోరవర్సు కూడా గడవకముందే అన్రెస్టు ఎవరెస్టంత పెరిగి సెటైరు కోసం వీసీని ఉరితాళ్ళు అడిగిన మేతావి నిన్నటివరకూ తను జండాలా ఎగరేసిన గుడ్డనే ఉరితాడుగా వాడుకుని మోస్ట్ సింబాలిక్ చావు చచ్చాడు!రేపు ఈ కన్హయ్యా ఏ జఫ్ఫయ్యా అవుతాడో?

ఒకడేమిటో వాడి చావు చెబుతుందంటారు, వాడి బతుకులో ఉన్న కంఫ్యూజనే చావులోనూ ధగధ్ధగాయమానంగా ప్రకాశిస్తున్నది!రాసి కొట్టేసిన భాగం కొంత ఉందని తెలియని కాలంలో చదివిన ఆఖరి ఉత్తరం చదివి నేను చాలా ఫీలయ్యాను.కానీ,రాసి కొట్తేసిన భాగం చదివాక మళ్ళీ కంఫ్యూజన్ కూడా అదే స్థాయిలో మతి పోగొట్టేసింది.The letter purportedly written by Rohith Vemula, the Dalit scholar of University of Hyderabad, before he committed suicide, has been sent to the forensic lab for analysis as reports emerged about an entire paragraph that had been scratched off the note. On close examination, the portion of the note that Vemula, perhaps on second thoughts, decided to keep concealed, reads: "ASA, SFI, anything and everything exist for their own sake. Seldom the interest of a person and these organisations match. To get power or to become famous or to be important in between boundaries and to think we are up to changing the system, very often we overestimate our acts and find solace in traits. Of course I must give my credit to these both groups for making introducing me to wonderful literature and people. (sic)" According to media reports, this part of the letter is reflective of the sense of futility that the scholar felt in being associated with the student unions.చచ్చిపోయటప్పుడు విరక్తి కన్నా భావుకత్వం పొంగిపొర్లడ మేంటి?అంత ఘాటుగా యూనియన్లని ఉతికినవాడు ఎందుకు కొట్టేశాడు?కొట్టేసినవాడు పనిగట్టుకుని ఇది నేనే కొట్టేశాను అని పక్కన రాసి సంతకం చెయ్యడ మేంటి?ఈ రాసి కొట్టేయ్యడం, మళ్ళీ పక్కన నేనే కొట్టేశానని సంతకం చేసినవాడు అయితే పిచ్చివాడయినా అయి ఉండాలి,లేదంటే అతి మంచివాడయినా అయి ఉండాలి!మొదట మనసులో దాచుకోకుండా ఉన్న నిజాన్ని కక్కేశాడు,తర్వాత తీరిగ్గా ఆలోచించి కొట్టేశాడు.ఏమని ఆలోచించాడు?మరీ అంత దుర్మార్గంగా తిడితే తన ఫ్రెండ్సు రేపటి నుంచీ ఇలాంటి హీరోయిజం చూపించటానికి ఇబ్బంది పడతారని అనుకున్నాడు కాబోలు!అంటే,తను వేటికి విరక్తి పుట్టి చచ్చిపోతున్నాడో అవి తన ఫ్రెండ్సు ఆపకుండా చెయ్యాలని అనుకున్నాడు కాబోలు!అదీ గాక,తన శవాన్ని మొదట తన ఫ్రెండ్సే చూస్తారనీ,పోలీసులు ఈ పార్టు కొట్టేసింది తను కాదని తన ఫ్రెండ్సుని అనుమానిస్తారేమోనని జరగబోయేదాన్ని కూడా వూహించి తన చుట్టూ ఉన్నవాళ్లకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఒక రోజు క్రితం వరకు అంత ధైర్యంగా ఉన్నవాడు ఆ ఒక్క రోజులో అంత డీలా పడిపోవడం ఎవరివల్ల జరిగిందో వాళ్ళని తన  చావు వల్ల కూడా ఇబ్బంది పడనివ్వకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవటం - ఇంత గందరగోళపు చావు నేనెక్కడా చూళ్ళేదు?!

          ఆ చావే అంత గందరగోళంగా ఉంటే దీన్ని క్యాష్ చేసుకుని పాప్యులారిటీ పెంచుందామనుకున్న ఎరుపు కైపెక్కిన వాళ్ళ గందరగోళం మరింత గందరగోళంగా ఉంది.వాడు స్పష్తంగా "నేను ఆతమహత్య చేస్కుంటున్నాను.నా చావుకి ఎవరూ బాధ్యులు కారు." అని రాసిపెట్టి చచ్చిపోతే అది హత్య అనీ హంతకుల్ని శిక్షించాలనీ అల్లరి చహెశారు,చేస్తున్నారు,చేస్తారు.నిజంగా హంతకుల స్థానంలో ఎవర్నయిన అనిలబెట్టాలంటే  65464 మరియూ 6666 వాళ్లనే నిలబెట్టాలి!ఎందుకంటే,తన రాసి కొట్టేసిన భాగంలో ఎవరి గురించయినా నెగటివ్ ధోరణిలో రాశాదంటే అది వాళ్ల గురించే,మరి వాళ్ళని హంతకుల స్థానంలోకి ఎవరు తీసుకొచ్చి నిలబెదతారు?


          ఇప్పటివరకు రోహిత్ గురించి చర్చించిన వారిలో ఏ ఒక్కరికీ రోహిత్ స్టైపండ్ ఎందుకు ఆగిపోయింది అనే అనుమానం రాలేదు,ఎందుకని?మీడియా యూనివర్సిటీ అధికార్లని అడిగీతె “పేపరు వర్కు వల్ల జాప్యం” అనే ఒక ముక్క మాత్రమే బైటికి వచ్చింది.అధికార్లు విషయం వివరంగానే చెప్పే ఉంటారు,కానీ మొత్తం చెబితే రోహిత్ మీద సానుభూతీ తమ MRTP కొసెం సెన్సేషనూ పుట్టవని కాబోలు మీడియాలో ఎవరూ దానిగురించి ఎక్కువగా కవర్ చెయ్యలేదు.రోహిత్ అక్కడ రీసెర్చ్ వర్కుకి ఎన్రోల్ అయ్యాడు. రీసెర్చ్ వర్కు అంటే ఎన్రోల్ అవటం ఒక్కటేనా ముఖ్యం.వర్క్ చెయ్యాలిగా,చెసినట్టు రిపోర్ట్స్ ఇవ్వాలిగా.నెలవారీ ప్రోగ్రెస్ మదింపు చెయ్యాలని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏమిటో ఇక్కడ వివరంగా చదవవచ్చు.6వ సెక్షనులో అటెండెన్సుతో కలిపి రీసెర్చ్ వర్కుకి సంబంధించిన వివరాలు చూదొచ్చు,7వ సెక్షనులో స్కాలర్షిప్పులకి సంబంధించిన నెలవారీ మదింపు గురించిన నియమాలు చూడొచ్చు.స్కాలర్ షిప్ కూడా ఎన్రోల్ అయితే చాలు వర్క్ చేస్తున్నాడా లేదా అని చూడకుండా నెలనెలా ఇస్తూనే ఉంటారా తేరగా?వాళ్ళకి స్కాలర్షిప్ పేరుతో ఇచ్చేది ప్రజాధనం,కూర్చోబెట్టి మేపడానికి స్మృతి ఇరానీ గానీ జైట్లీ గానీ వాళ్ళ జేబులోనుంచి తీసి ఇవ్వరు కదా!అధికారంలో రాహుల్ గాంధీ ఉన్నా, హరగోపాల్ ఉన్నా,కంచె ఐలయ్య ఉన్నా తన జేబులోనుంచి ఇస్తాడా?ఆ రీసెర్చ్ వర్కుకి అటెండెన్సు ఉంటుంది,ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉంటాయి. కార్ల్ సేగన్ కొటేషన్లు చెప్తూ ప్రకృతిని గురించి చెప్పిన కబుర్లన్నీ గాలికొదిలేసి 24 గంటలూ ల్యాబులో ఉంటే ఉద్యమానికి టైము సరిపోవటం లేదని సైన్సు గూపు నుంచి ఆర్ట్స్ గ్రూపుకి మారాడు.ఇక్కడ కూడా ఈ ఉద్యమాల కోసం తిరుగుతూ అటెండెన్సు బొక్క పడి ఉండవచ్చు,ప్రోగ్రెస్ రిపోర్టులు సబ్మిట్ చెయ్యటం తనవైపునుంచే ఆలశ్యం అయి ఉండవచ్చు! ఇతను పేపర్లు స్బ్మిట్ చెయ్యడం అంటూ జరిగితే స్టైపండ్ ఆపటానికి వాళ్ళకీ దమ్ములు ఉండవు – కోర్టుకీడ్చి ముక్కుపిండి రెట్టింపు వసూలు చేసుకోవచ్చు,అవునా కాదా?బతుకులో బాధ్యత లేనివాడు చావుతో వీరాధివీరుడిగా కొనియాడబడుతున్నాడు?ఈ ముక్క నేను సారంగలో కామెంటుగా వేస్తే మొదట కొంతసేపు ఉంచారు,తర్వాత తీరిగ్గా ఒకరు రోహిత్ స్టైపండ్ ఎందుకు ఆగిపోయిందో అనుమానించండి అంటూ సులువుగా, హేళనగా ప్రశ్నిస్తున్న హరిబాబు గారు, రోహిత్ ఊపిరి ఎందుకు అర్ధాంతంగా ఆగిపోయిండి అనే మౌలిక ప్రశ్న కూడా ఈ దేశాన్ని అత్యున్నత స్థానం నుండి అణగారిన వెలివాడల వరకూ ప్రశ్నిస్తూనే ఉంది. అంటూ నాకు ఉబోస ఇచ్చాక వారి ఉబోసని ఉంచి నా కామెంటుని తీసేశారు,ఏమి నిష్పక్షపాతం ఈ ఎర్ర మేధావులది?అక్కడికి నేను జాలీదయా లేని కఠినుణ్ణీ,వీరు మాత్రమే కరుణామృతహృదయులైనట్టు,అంత జాలి ఉంటే నాచావు నన్ను చావనివ్వండి అన్న చచ్చినోడి వేదనని అరణ్యరోదన చెయ్యరు కదా, రంగరంగ,!

          ఇప్పుడు రాజద్రోహం కేసులో జైలుకెళ్ళొచ్చిన కన్హయ్యా కూడా ఇంకా రోహిత్ చావు కుట్ర కిందే లెక్కేస్తున్నాడు.పది రోజుల క్రితం సుశీల్ కుమార్ అనే సాటి విద్యార్ధిని తను అంతకుముందు వివేకానందుడితో సహా ఎవ్వర్ని బడితే వాళ్ళని గురించి తను వాడిన మాటల్తో పోలిస్తే చాలా చిన్న మాటని వాడితే అర్ధరాత్రి 3 గంతల టైములో నలభైమందిని పోగేసుకుని పోట్లాడగలిగిన వాడిమీద ఎగస్పార్టీ వాళ్ళు కుట్ర చెయ్యగలరా?కుట్ర అంటే పక్కన జేరి మాయమాటలు చెప్పి వీలు చూసుకుని చంపటం - ఆ ఆవకాశం ఉంటే గింటే ASAలో  ఉన్నవాళ్ళకే ఉంటుంది గానీ బయటివాళ్ళకి అతన్ని కుట్రపూరితంగా చంపటం సాధ్యమా!కుట్ర కేసు పెట్టాలన్నా ASA వాళ్లనే బుక్ చెయ్యాల్సి ఉంటుంది,ఏంటి వీళ్ళ బుర్ర తక్కువ వాగుడు!

          మనం బలానికి బూస్టూ వయాగ్రా వాడినట్టు వీళ్ళకి వూపు రావాలంటే ఎరుపు కనబడుతూ ఉండాలేమో!అందుకే ఇలా జనాన్ని విడదీసి ఒకడి మీదకి మరొకణ్ణి ఎగదోసి రక్తపుటేరులు పారిస్తున్నట్టున్నారు.ఇద్దరు సఖ్యంగా ఉన్నవాళ్లని విడదియ్యాలంటే ఏం చెయ్యాలి>ఇద్దర్లో దద్దమ్మ ఎవడో కనిపెట్టి,మెల్లగా వాణ్ణి బుట్టలో వేసుకుని,రెండోవాడి మీద అబద్ధాలు చెప్పి నమ్మించాలి!అది చాలు విన్నవాడు అవతలివాడు తనకి చేసిన ద్రోహానికి ప్రతీకారంగా చేస్తున్నట్టు తనని తనే జస్టిఫై చేసుకుంటూ అవతలి వాడిమీద దాడి చెయ్యటానికి!వాళ్లలో ఎవడు గెలిచినా పర్లేదు వీళ్ళకి,వీళ్ళు సృష్టించిన రెండు వర్గాల్లో ఒక వర్గం పూర్తిగా నశించిపోతే ఇంక అక్కడ మిగిలింది వర్గరహితసమాజమేగా!

          వాళ్ళేమి కోరుకుంటున్నాఓ మనకి స్పష్టంగానే తెలుస్తున్నది,కానీ వాళ్ళకి తెలుస్తున్నదా!టెర్రరిస్టుల్ని అమరవీరులుగా చిత్రించటానికీ, ఇంటికో టెర్రరిష్టుని పుట్టించమని దేశంలోని తల్లిదండ్రులకి విజ్ఞప్తుల్ని చెయ్యనివ్వటానికీ, ఈ దేశాన్ని ముక్కలు చెయ్యండని విదేశీయుల్ని ఆహ్వానించడానికీ, ప్రపంచ దేశాలు గుర్తించిన భారత భూభాగంలో విదదీయరాని భాగమైన కాశ్మీరు గురించి నోటికొచ్చినట్టు వాగడానికీ అనుమతిస్తేనే నిజమైన భావస్వాతంత్ర్యం, అంతేనా?వాళ్ళు భావస్వాతంత్ర్యాన్నే కోరుకున్నారు గాబట్టి అందులో తప్పేమీ లేదని కొందరు గోడమీదిపిల్ల్లులు వాదించదలుచుకుంటే వాళ్ళకి కూడా కలిపి ఈ మేధావులకి ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను.ఏ విధమయిన అనుమానమూ లేకుండా వాళ్ళు ఉగ్రవాదులని మీకు తెలుసు వాళ్ళు ఈ దేశాన్ని విచ్చిన్నం చెయ్యాలని దొంగతనంగా సరిహద్దులు దాటి వచ్చి ఈ దేశప్రజల్లో కొందర్ని హతమార్చడమూ మీకు తెలుసు..అయినా సరే,భావస్వాతంత్ర్యం పేరుతోనూ,మరొక రకం తిక్క విశ్లేషణ తోనూ ఇవ్వాళ ఒక ఉగ్రవాదిని నువ్వు అమరవీరుణ్ణి చేసి పొగిడితే రేపు పదిమంది పుట్టరా?నీ చేతల మూలంగానే ఇవ్వాళ్టి రోజున ఉగ్రవాదానికి నువ్వు సపోర్టు ఇస్తూ మళ్ళీ రేపటి రోజున ప్రభుత్వాన్ని ఉగ్రవాదాన్ని నిరోధించడంలో విఫలమైందని విమర్శిస్తావు - నువ్వు నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా,మరొకటా?

          ఒక పిచ్చి డాక్టరు రోహిత్ చట్టం కావాలంటాడు,ఒక శర్మ హిందూ ఫాసిజం అంటాడు,ఒక రాజు    ఈ కుర్రాళ్ళని చూస్తుంటే మళ్ళీ నా కుర్రతనం వస్తునదంటాడు,ఒక భాస్కరుడు భావజాల యుద్ధం అంటాడు - ఏమిటి వీళ్ళ పాండిత్యం!రోహిత్ చట్టంలో ఎలాంటి సెక్షన్లు ఉండాలో స్పష్టత ఉందా?ఇంటికో యాకూబ్ మెమన్ పుడితే వాళ్ళు వీళ్ళని వొదుల్తారా?రోమిల్లా డప్పారు ఇన్నేళ్ళు వినిపించిన ఆర్య-ద్రవిడ సిద్ధాంతం దగ్గిర్నుంచీ కమ్యునిష్టులు చెప్పిన అబద్ధాలన్నీ ఒకటొకటిగా బయటపడుతుంటే ఇవ్వాళ వీళ్ళు చెప్పే కొత్త అబద్ధాల్ని ఎవడు నమ్ముతాడు?

          "If you can't explain it simply, you don't understand it well enough." - Albert Einstein.వీళ్లలో ఉన్న గందరగోళానికీ,ఈ తలాతోకా అలేని చెత్త వాగుడికీ కారణం అదే!ఇన్నాళ్ళూ నెహ్రూ వారసత్వం పుణ్యాన యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా చేరి చెప్పిన అబద్ధాలన్నీ బయటపడుతుంటే ఎట్లా సమర్ధించుకోవాలో తెలియని గనదర్గోళంలో ఉన్నారు వీళ్ళంతా!నేనో మీరో పనిగట్టుకుని తప్పులు పట్టనక్కర లేదు,కొంచెం బుర్రంటూ ఉపయోగిస్తే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ మాటల్లో ఉన్న బేఖారీతనం!రాణి శీవశంకరశర్మ అనే ఒక దుర్బ్రాహ్మణుడు చూదండి ఎంత నీచంగా అవమానించాడో నన్ను!పనిగట్టుకుని సంభాసహణకి పిలిచి నేను అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండా నన్ను హిందూ ఫాసిస్టు అంటున్నాడు,ఇలాంటి అధమసంస్కారం గలవాళ్ళు ఎంత ఎక్కువ ద్వేషం వెళ్ళగక్కితే అంత ఎక్కువ మేరకు హైందవధార్మికక్షాత్రం పదునెక్కుతుంది."Anger is an acid that can do more harm to the vessel in which it is stored than to anything on which it is poured". - Mark Twain.వీళ్ళలో ఉన్న అసహనమే వీళ్ళకి అంతటా ఉన్నట్టు కనబడుతున్నది.కానీ,గత నూరేళ్ళుగా వీళ్ళు వండివార్చిన ద్వేషపు ప్రభావం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల్ని ఏమాత్రం కదిలించలేక పోయింది.ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్ధించి ఈ దేశాన్ని నిలువునా చీల్చినా,ఇన్ని దశాబ్దాలుగా మతకలహాల్ని రెచ్చగొట్టినా ఆ కొద్దిరోజులు గనదరగోళానికి గురయినా నిజం నిలకడ మీద తెలియటంతో జనం ఐకమత్యంగానే ఉన్నారు,ఉంటారు!


          శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గా,మస్తాన్ వలి దర్గా,షేక్ దావూద్ వలి దర్గా - నెల్లూరు జిల్లాలో ఈ మూడు అత్యంత ప్రముఖమైన దర్గాలు.వీటిని ముస్లిములతో పాటూ హిందువులు కూడా సందర్శిస్తారు - ఎంతో భక్తిగా!కడపలో పెద్ద దర్గా అని పిలుచుకునే అమీన్ పీర్ దర్గా ఉంది.ఈ దర్గాను స్థానికులు పెద్ద దర్గా అని పిలుస్తారు.ఇది మతాలకు అతీతంగా ఉంటూ హిందువులు,ముసిములు,క్రైస్తవులు నిత్యం సందర్శించడం వల్ల మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది.ఇవే కాదు,మొత్తం భారతదేశంలో  చాలా చోట్ల ఉన్నాయి,ఈ ప్రాంతాల్లో ఎక్కడా హిందువుల మధ్యా ముస్లిముల మధ్యా చిన్నపాటి గొడవలు కూడా లేవు.ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఇమాం బేగ్ బావి ఉంది.ఇది రామభక్తుడైన ఇమాం బేగ్ గారు యాత్రికుల సౌకర్యం కోసం కట్టించినది.అందువల్ల ఈ దేవాలయంతో ముస్లిములకు కూడా ఆధ్యాత్మికమైన అనుబంధం ఏర్పడింది.తిరపతి బాలాజీ అయితే బీబీ నాంచారు మూలంగా ముస్లిములకి కూడా ఇష్టమైన వాడే!మొన్నామధ్యన ఒక ముస్లిం కుర్రాడు వాళ్ళ నాన్న మొక్కుకుని బతికుండగా తీర్చలేకపోయాదని చెప్పి స్వామివారికి సువర్ణపుష్పాలు సమర్పించి వెళ్ళాడు.బహుశా ఇకముందు వీటిమీద కూడా సూడో సెక్యులరిష్టుల కన్ను పడితే వాటిని అట్లా ప్రశాంతంగా ఉండనివ్వరేమో?

          మీకా భయం అక్కర్లేదు!వెటి దగ్గిరకెళ్ళీ రాజకీయం చెయ్యదలుచుకుంటే హిందూ భక్తులూ,ముస్లిం భక్తులూ జాయింటుగా విరుచుకుపడి కీళ్ళు విరిగేలా తన్ని పంపిస్తారు.ఎందుకంటే ఇప్పుడు మీడియాకెమేరాల ముందు హడావిడి చేసేవాళ్ళూ,పత్రికల్లో విషపురాతలు రాసి పేరు తెచ్చుకుంటున్నవాళ్ళూ అసలు సమాజంలో కొస్తే ఎంతటి అనామకులంటే వీళ్ళ పక్కింటివాళ్ళకే వీళ్ళెవరో తెలియదు - నిజం!ఈ అయిదు ఖండాల భూమి మీద అంగుళం మేరలో కూడా దోపిడీ అనేది లేని ప్రపంచాన్ని సృష్టించే మహదాశయంతో ఉర్రూతలూగిపోతూ ఎప్పుడో స్థాపించబోయే వర్గరహితసమాజం గురించి చింకి లెక్చర్లు దంచుతూ యూనివర్సిటీ సెమినారు హాళ్ళలో వేముల రోహిత్ లాంటి పిచ్చపుల్లయ్యలతో చప్పట్లు కొట్టించుకునేవాళ్ళు తమ ఇంటిపక్కనే ఉన్న రేషన్ షాపులో జరుగుతున్న చిన్నపాటి దోపిడీని కూడా అరికట్టలేకపోతున్నారు, ఎందుకని?సిద్ధాంత బలం లేకనా,మంది చాలకనా,వాళ్ళ వీధివాళ్లకి వర్గరహితసమాజం అక్కర్లేకనా,వీళ్ళకి తగినంత వూపు రాకనా - ముహూర్తం బాలేకనా!రోమిల్లా ఆంటీ తన అబద్ధాల చరిత్ర అటకెక్కేసరికి "who cares now?" అంటూ తెల్లముఖం వేసి తోక ముడిచింది,ముగ్గు బుట్ట ముసిల్ది మురమ్నా మామ్మ మిగిలుంది తుక్కు రేగ్గొట్తించుకోవటానికి - ఆ తర్వాత నారాయణలూ సీతారాముళ్ళూ చేసుకోవాల్సింది చెక్కభజనె:-)

          కమ్యునిష్టులకి అసలు సంగతి తెలియడం లేదు,మోడీ వీళ్ళ వల్లే అధికారంలోకి రాగలిగాడు - నిజం!మీకు అనుమానంగా ఉంటే నేను ఎప్పుదో రాసిన చిత్రమైన గొప్పవాళ్ళు పోష్టులో మోదీ గురించి రాసిన విశ్లేషణ చదవండి.కమ్యునిష్టులకి నేనొక ఉబోస ఇస్తున్నా "ఇవ్వాళా రేపూ కూడా మోదీకి ంకా  బలం పెంచటానికి తప్ప మీ ప్రస్తుత రాజకీయ వ్యూహాలు మీకు మేలు చెయ్యవు" అని - వింటారా?వినరా!అది విన్నా వినకపోయినా మీకో ఝలక్ ఇది:

మీ పుర్రచెతిని అడ్డుపెట్టి హైందవసూర్యోదయాన్ని అడ్డుకోలేరు - ఎరుపు వెలిసిపోతే మిగిలేది కాషాయమే!

Friday 11 March 2016

అవే దృశ్యాలు,అవే భావాలు,అవే మాటలు ,అవే స్మృతులు - అయినా ఎంత నిత్య నూతనం!

     మా అమ్మాయి పుట్టినప్పుడు నన్నసలు హాస్పిటల్ దరిదాపులకే పోనివ్వలేదు మా బంగారం కేకలు విని తట్టుకోలేనని, పాపాయినీ వెంటనే చూడనివ్వలేదు!తెల్లవారుఝామున, పక్కన ఎవరన్నా మాట్లాడుకుంటుంటే నీటిలో మునిగి వింటున్నట్టు అనిపించేటంత మాగన్ను నిద్రలో ఉన్నప్పుడు మా మామయ్య "ఇదుగోనయ్యా!నీ కూతురు, చూసుకో - కలవరిస్తున్నావుగా" అని కొంచెం విసురుగానే నా పక్కలో పడుకోబెడితే,ఆ విసురుకి గాబోలు కదిలి కాలు కొంచెం ఝాడించింది!ఇప్పటికీ ఆ సన్నివేశం గుర్తొస్తే పక్కటెముకల దగ్గిర అప్పటి మెత్తని కాలితాపు స్పర్శ తెలుస్తూనే ఉంటుంది - ఏమిటీ మహామాయ?తనని మొదటిసారి చూడగానే అధాట్న కాలంలో వెనక్కి వెళ్ళిపోయి నా చిన్నప్పటి నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది!చిన్నప్పుడు నన్ను ఇట్లా చూసిన మానాన్నకీ ఇట్లానే అనిపించి ఉండాలి!

     ఇంకా వెనక్కి వెళ్తే మా నాన్న పుట్టినప్పుడు వాళ్ళ నాన్న కూడా ఇట్లాగే అనుకుని ఉండాలి.ఇంకా వెనక్కి వెళ్తే...?మళ్ళీ మా అమ్మాయి మొదటిసారి మాటలు నేర్చినప్పుడూ అదే అనుభూతి!మామూలుగా అందరూ మొదట అమ్మా నాన్నల్ని "అమ్మా!" అనీ "నాన్నా!" అనీ పిలుస్తారు, కానీ మా బుజ్జిగాడు మమ్మల్ని అందరూ పిలిచే పిలుపుల్ని విని పట్టేసి నన్నేమో "హబాబూ!" అనీ మాధవినేమో "మాధీ" అనీ మొదలుపెట్టి తర్వాత "హరిబాబూ!","మాధవీ!" అని మా పేర్లతోనే పిల్చేది!తర్వాతెప్పుడో బాగా పెద్దయ్యాక తనే "అమ్మా","నాన్నా" అనడం నేర్చుకుంది గానీ మాకు మాత్రం మొదటి పిలుపులే నచ్చాయి - వీళ్ళు తేడా మనుషులు అనుకునేటట్టు ఉంటుందని పనిగట్టుకుని అట్లాగే పిలవమని ఒత్తిడి పెట్టలేదు గానీ ఇంకొంతకాలం అట్లానే పిలిస్తే బాగుండును కదా అని చాలాకాలం పాటు బెంగ అనిపించేది మాకు!

     ఈ మాటలు నేర్చుకున్నప్పటి ఒక సుదీర్ఘకాలం పాటు మా ఇద్దరి మధ్యనా జరిగిన హాస్యకదంబం ఎప్పటికీ నవ్వొస్తూనే ఉంటుంది.అన్ని మాటలూ తొందరగానే నేర్చుకున్నది గానీ "డాబా","డబ్బా" అనే రెండు మాటల విషయంలో మాత్రం చాలా టైము తీసుకుంది.ఎవరైనా తప్పులు చేస్తుంటే సరిద్దటం విషయంలో నా చాదస్తం మీకు తెలుసు కదా!నా పట్టుదల కొద్దీ ఎంత మెల్లగా స్పష్టంగా కూనిరాగం తీస్తూ తలని పైనించి కిందకి ఇట్లాగే చెప్పు అన్నట్టు ఆడిస్తూ "డబ్బా!" అనమని చూపిస్తే, అది కూడా అచ్చు నేను ఎంత దీర్ఘం తీశానో అంతే దీర్ఘంతో తలని కూడా నాలాగే ఆడిస్తూ "బడ్డా!" అని మాత్రమే అనేది:-)

     తను తొలిసారి కింద పదకుండా వూగుతూ వూగుతూ వొచ్చి మీద వాలిపోయి నడిచింది నాలుగడుగులే అయినా గొప్ప ఘనకార్యం చేసినట్టు నవ్వుతుంటే అప్పుడు కూడా తను కాదు నడక నేర్చుకున్నది నేను అన్న గర్వం!ఐశ్వర్యాలు కోరుకుని,వైభవాల కోసం ఆరాటపడి,అసహనాలతో రగిలిపోయి చూడటం లేదు గానీ మనలోనే ఉంది సుఖజీవనసారం!మనపక్కనుంచే మనల్ని రాసుకుంటూనే ఒక భోగయాత్ర నిరంతరం నడుస్తూనే ఉన్నది - ఐతే, చూడాలనుకుంటేనే కనబడే మార్మికత ఉంది అందులో!ఎవరు ఏ దృక్కోణంతో చూస్తే ఆ విధంగా కనబడే మార్మిక లోకం ఇది!నాకో కూతురు పుట్టటం, ఆ పాపాయి నడక నేర్చుకోవటం, అప్పుడు నా మనస్సులో పుట్టే ఆలోచనలూ అనుభూతులూ ఆనందాలూ నాకు మాత్రమే జరిగినవి అనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు జరిగినవి నాకు మాత్రమే ప్రత్యేకంగా జరగడం లేదనీ, మానవసమూహం అనుబంధాలతో పెనవేసుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచీ ప్రతి మనిషికీ జరుగుతున్నవేననీ తెలిసినప్పుడు అంత విచిత్రంగా అనిపిస్తుంది!జననం,బాల్యం,యవ్వనం,కౌమారం,వార్ధక్యం,మరణం - పునరపిగా నిరంతరం జరిగే ఈ దృశ్యాదృశ్య జీవన సంరంభం ఎప్పుడు ఆగుతుంది?అసలు ఆగుతుందా, ఎప్పటికీ ఆగదా!

     మనుషుల్ని కులాలుగా,మతాలుగా,జాతులుగా,ముఖ్యమంత్రులుగా,రిక్షావాళ్ళుగా విడగొట్టకుండా  హఠాత్తుగా వీళ్ళిప్పుడు ఏమి చేస్తూ ఉండి ఉంటారు అని ఆలోచిస్తే మనుషులు అతి మామూలుగా చేసే పనులు ఏమిటి?తొలిసారి తల్లి గర్భం నుంచి బొడ్డుతాడు తెగి జారిపడగానే ఉలిక్కిపడి గుక్కపట్టి ఏడవటం,తల్లి దగ్గిరకి తీసుకోగానే మళ్ళీ సంబాళించుకోవటం,తనకి పాలిస్తున్న తల్లిని గుర్తుపట్టటం,తల్లి మాటల్ని వింటూ మాటలు నేర్చుకోవటం, అమ్మ చంకన ఎక్కటమే కొండకొమ్ముల నెక్కినంత గొప్పగా అనిపించటం,అమ్మ ఎవరివైపు చూసి నవ్వితే వాళ్ళు మంచివాళ్ళనీ ఎవరివైపు కోపంగా చూస్తే వాళ్ళు చెడ్డవాళ్లనీ నేర్చుకోవటం,కొత్తగా నడక నేర్చుకున్న హుషారులో గడపల్ని చూస్కోకుండా పరిగెడుతుంటే "పడిపోతావు!" అనే వెనకనుంచి వినబడే ఆందోళనకి "ఈ మాత్రానికే?" అనుకోవటం,కొత్తసైకిలు కోసం నాన్నని అడగటం,కుదరదంటే "మా నాన్న పీనాసి" అనేసుకుని కొనిచ్చేవరకు అన్నం తిననని మారాం చెయ్యటం,కొనిస్తే అన్నీ మర్చిపోయి "మా నాన్న మంచోడు!" అనేసుకుని నవ్వుకోవటం,పరీక్షల్లో తప్పినప్పుడు తిడుతుంటే తల వేళ్ళాడేసుకుని నిలబడ్డం,డిస్టింక్షన్ కొడితే కాలరెగరెయ్యటం,ఫ్రెండ్సుతో క్లాసులూ టెస్టులూ ఎగ్గొట్టి మ్యాట్నీలకి చెక్కెయ్యటం,మనకి నచ్చిన హీరో హీరొయిన్ల గురించి వాళ్లు నచ్చని ఫ్రెండ్సుతో తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆవేశపడిపోవటం,ఇంట్లోవాళ్ళు ఇక పెళ్ళి చేసెయ్యాలన్నప్పుడు మొదట బోల్డు కంగారు పడిపోయి పిదప తెగ సిగ్గుపడిపోయి ఆఖరికి ఉషారుగా రెడీ అయిపోవటం,పెళ్ళంటే తర్వాత వచ్చే పాలడబ్బాల ఖర్చులూ స్కూలుఫీజుల బరువులూ తెలియకపోవటంచేత పాలగ్లాసూ మల్లెపూలూ మాత్రమే గుర్తొచ్చి రోజుల తరబడి వాటి గురించి వీరలెవెల్ల్లో వూహించేసుకుని తీరా మొదటిరాత్రి తెల్లవారిన తర్వాత "ఓసింతేనా?దీని కోసమా ఇంత హడావిడి!ఈపాటిదానికి ఇవన్నీ అవసరమా?!" అని నవ్వుకోవడం,పెళ్ళి చేసి పంపించేటప్పుడు ఆడపిల్ల తలిదండ్రులు ఎంత ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయినా తెల్లారేసరికి "హమ్మయ్య, ఒక గండం గడిచింది.ఇంక అక్కడెట్లా ఉంటుందో!" అనుకుని పెళ్ళిలో జరిగిన తప్పులూ ఒప్పులూ కోపాలూ తాపాలూ విరగబాట్లూ సర్దుబాట్లూ చెప్పుకుంటూ నవ్వుకోవటం,పెళ్ళయ్యేవరకు పుట్టింట్లో మహారాణిలా పెరిగిన కొత్త పెళ్ళికూతురు రెండో రోజుకల్లా పుట్టింటికే ఎవరో చుట్టాలింటికి వచ్చినట్టు నాల్రోజులుండి వెళ్ళిపోవటం,కొత్త జంటలో ఒకరికొకరు ఇంకా కొత్తముఖాల్లాగే అనిపిస్తూ అందర్లో తిరిగేటప్పుడు జరిగే చిరు తగిలింతలు కూడా పెను పులకింతలై నునుసిగ్గుల మెరుపుల చిరునవ్వుల్ని పుట్టించటం,కాస్త పాతబడిపోగానే అవే కదలికలు "నలుగుర్లో ఉన్నామనే ఇంగితం కూడా లేకుండా ఇంకా ఏమిటీ మోటు సరసం?" అని విసుగు తెప్పించటం,పిల్లలు పుట్టుకురాగానే పాలడబ్బాల ఖర్చులూ స్కూలుఫీజుల బరువులూ మోస్తూ రోజూ పొద్దున్నే లంచ్ బాక్సులు సర్దేసుకుని సగం తిని సగం వదిలేసి ఉరుకులు పరుగులతో సిటీబస్సు అందుకుని చెమట్లు గక్కుతూ పోయి ఆఫీసులో పడి మళ్ళీ చెమట్లు గక్కుకుంటూ రాత్రి కొంపకి జేరి తిన్నామా పడుకున్నామా లేచామా అని ఒకటే హడావిడి పడుతూ తిట్టుకుంటూ విట్టుకుంటూ నెట్టుకుంటూ గానుగెద్దు జీవితం గడుపుతూ జుట్టులో తెల్లవెంట్రుకలు కనపడ్డాక "అప్పుడేనా?ఓర్నాయినో!ఏమీ ఎంజాయ్ చెయ్యనే లేదు, ఇప్పుడెట్లా?!" అని బెంగేట్టుకోవటం,తనకి తల నెరిసిందంటే అర్జెంటుగా పిల్లలకి పెళ్ళిళ్ళు  చెయ్యాల్సిన వయసొచ్చిందని గుర్తొచ్చి హడిలిపోవటం,అసలెంత నిలవెంత కొసరెంత ఇంట్లో ఎంత బ్యాంకులో ఎంత సంబంధా లెప్పుడు వెతకాలి ఏ సంబంధం ఖాయం చేసుకోవాలి నిశ్చితార్ధాని కెంత పెళ్ళిపనులు ఎప్పుడు మొదలెట్టాలి చుట్టాలెవరెవర్ని ఎట్లా ఎట్లా పిలవాలి ఆ ముహూర్తానికి ఏ పెళ్ళిమండపం దొరుకుతుంది అని ఎక్కాల పుస్తకంలో ఉన్న ఎక్కాలన్నీ కవరయ్యేలా లెక్కలు వేసుకుని చచ్చీచెడి శాయంగల విన్నపములై అన్నట్టు ఆ పని కాస్తా ముగించి "ఇంక నాపనయిపోయిందిరోయ్, దేవుడోయ్!" అని గావుకేక పెట్టి వాలుకుర్చీలో కూలబట్టం,పిల్లలు ప్రయోజకులై వాళ్ళ ఘనకార్యాలు చెప్తుంటే పొంగిపోతున్నప్పటి ఆనందంలో గభాల్న "నాన్న కూడా ఉంటే ఎంత బావుండేది!" అనిపించినప్పుడు చెమ్మగిల్లిన తడికన్నులతో నవ్వటం,మనవలూ మనవరాళ్లతో పోటీపడి పరిగెత్తలేనప్పుడు ఇంక మనకి చివరిబండి సిద్ధమయ్యిందని తెలిసిపోవటం,ఎప్పుడొస్తుందో తెలియని మలుపుకోసం ఎదురు చూట్టం - లీనమై బతికితే దేవుడు కూడా ఈర్ష్యపడేటంత సప్తవర్ణ సంశోభితమైన స్వరరాగ గంగాప్రవాహమే కదా మానవజీవితం!

     అక్కడా ఇక్కడా నిన్నా మొన్నా ఇదే జగన్నాటకం పదే పదే జరుగుతూనే ఉన్నా చిన్న చిన్న ఎదురుదెబ్బలు కూడా ఇంతకుముదు ఇంకెవరికీ తగలనట్టు హడావిడి చేస్తూ ఇప్పుడే తమకొకరికే ఇట్లా జరిగినట్టు అతిగా వూహించేసుకుని పెద్దలు చెప్పిన అనుభవసారమంతా మర్చిపోయి ఇప్పటివరకు చెప్పినదంతా పరగడుపైన వాళ్ళు తమ బతుకు పుస్తకాల్ని మధ్యలో మూసేస్తున్నారు - ఎంత పిచ్చివాళ్ళు వాళ్ళు?చావుని పొగిడేవాళ్ళు,చావుకి ఎదురు నడిచేవాళ్ళు, పనిగట్టుకుని చావుని కెలికేవాళ్ళు మంచివాళ్ళు కానేకాదు - చచ్చిపోవటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని వాళ్ళు!వాళ్ళ మాటల్లో ఒక్క మాట కూడా నిజం కాదు - అస్సలు నమ్మొద్దు, అటువైపు పోవద్దు!దేవుడు కూడా ముచ్చట పడి ఇక్కడ పుట్టి బతికి చూపించిన ఇంత గొప్ప బతుకును సగంలో ముగించి ఏం సాధిస్తావు నువ్వు?ఇవ్వాళ్టి పార్ధుడికి ఇప్పటి గీతాచార్యుడు యుద్ధం గురించి చెప్పడం లేదు, ఒక భోగయాత్రని గురించి చెప్తున్నాడు - చెవులు రిక్కించుకుని విను!

     ఈ విశ్వం మొత్తానికి నువ్వే కేంద్రబిందువు - అనుకో, పర్లేదు!నువ్వే నేననీ నేనే నువ్వనీ కూడా అనుకో, నేనేమీ అనుకోను!ప్రపంచమొక నిరంతర భోగయాత్ర!అవును, నీచుట్టూ నేనొక భోగయాత్రని కల్పించాను - చూడు!నడిచి,నడిపించు!భోగయాత్ర అంటే - గడప దాటి బైటికెళ్తే ఛస్తానని భయపడుతూ ఇంటిపట్టున కూర్చుని రేపటి కోసం దాచుకుని తింటూ ఎక్కడ కూర్చోబెడితే అక్కడ పీఠమేసుకుని కూర్చోవటం కాదు, రేపటి గురించి ఆలోచించని ధీరుడివై ఉన్నది సమస్తం మూటగట్టుకుని సామగ్రిని ఒంటెమీద కెక్కించి ఇల్లు వదిలి నీలాంటి భోగయాత్రికుల్ని కలుపుకుని వూళ్ళు పట్టుకు తిరగటం - సరికొత్త దేశదిమ్మరి తనం!

     నీ సాటివాడు బీడీ కాలుస్తున్నాడు,నీకూ కాల్చాలనిపించింది,జేబులు తడుముకున్నావు, లేదు!ఏం మొహమాట పడకుండా "అన్నా!నేనూ ఓ దమ్ము లాగనా?" అని సూటిగా అడిగెయ్యి.అతను కూడా "దాందేముంది తమ్ముడూ!పూర్తి బీడీయే తీసుకో!" అని కొత్తదే ఇస్తాడు.నీ సాటివాడు "అన్నా, దాహమేస్తుంది!ఓ గుక్క తాగుతానేం!" అని నీ నడుము కున్న సొరకాయ బుర్రని చనువుగా తీసుకుంటాడు.నువ్వు కూడా "ఒక్క గుక్కేం ఖర్మ,మొత్తం తాగేసినా పర్లెదు - వచ్చే చెలమ దగ్గిర నింపుదాంలే!" అంటావు.భోగయాత్రలో ఉన్న కిటుకే అది - ఖరీదుఅమ్మడం, కొనడం, లాభం, నష్టం, మోసం, ద్వేషం - ఇవేవీ ఉండవు, అంతా పంచుకొనుడే - "కలిసి నడుద్దాం. కలిసి మాట్లాడుకుందాం. కలిసి మెలిసి ఒకరి మనస్సు లొకరం తెలుసుకుందాం. మన పూర్వులు దేవీభాగాన్ని యెలా పంచుకునేవారో అలాంటి జ్ఞానాన్ని ఉపాసించుదాం!"నీ దగ్గిర లేనిది ఎదటివాడి దగ్గిర ఉంటే అడిగి తీసుకోవచ్చు - అయితే, అతను సంతోషంగా ఇస్తేనే తీసుకోవాలి. జులుం చేసి గుంజుకోవొద్దు. అటు వైపు నుంచి తీసుకున్న ప్రతి రూపాయికీ పది రూపాయలు చేసి ఇటు వైపు నుంచి ఇవ్వు - అదీ భోగయాత్రికుడి లక్షణం!

     కొందరుంటారు, తీసుకోవడానికి చూపించే తొందర ఇవ్వడానికి చూపించరు.ఒక వూరిలో ఒక బావి ఉంది.పొరుగూరి వాడొకడు అందులోకి జారిపడ్డాడు.పెద్ద లోతు కూడా లేదు.వాడు గట్టిగా ఎగిరితే వీళ్ళు చెయ్యి పట్టుకుని లాగెయ్యొచ్చు.కానీ,చెవుడేమో అనుకుని అరిచి చెప్పినా మూగేమో అనుకుని సైగలు చేసి చెప్పినా వెర్రి చూపులు చూస్తాడే తప్ప ఎగరడే!వాలకం చూస్తే పిచ్చోడిలా లేడు, వాడి ఖర్మకి వాణ్ణి వొదిలేద్దామా అంటే వీళ్ళంతా పాపం మంచి ముండా వాళ్ళు!ఆఖరికి ఒకడొచ్చి లటక్కన లాగేశాడు?!వీళ్ళందరికీ దిమ్మదిరిగి మైండు బ్లాంకయ్యింది.అనుమానమొచ్చి "బాబూ, నీ పేరు పండుగాడు కదూ!" అనడిగారు, వాడు కాదనేశాడు?మరీ కంగారెత్తిపోయి ఈసారి మొహమాటం లేకుండా అసలు డౌటు అడిగేశారు,"మేమందరం అంతసేపు తంటాలు పడ్డా లాగలేక పోయాం,మరి నువ్వు చేసిన ట్రిక్కు యేంటీ?" అని.దానికి వాడు మొహమంతా నవ్వు చేసుకుని "మీరేమన్నారు?నీ చెయ్యిటివ్వు లాగేస్తాం అని,కదా!నేనేమన్నాను?నా చెయ్యి పట్టుకో లాగేస్తాను అని, కదా!ఆడు మా వూరోడే. తీసుకోవటమే తప్ప ఇవ్వటం ఆడి జన్మకి చెయ్యడు" అన్నాడు.అటువంటి వాళ్ళు ఈ భోగయాత్రకి పనికిరారు!

     భోగ యాత్రిక లక్షణాలు వంటబట్టాలంటే నువ్వు తప్పకుండా చెట్లని చూసి నేర్చుకోవాల్సిందే!చెట్టు చేమలన్నీ ఎప్పట్నుంచో భోగయాత్రలోనే నడుస్తున్నాయి. నిరాడంబరంగా జీవిస్తూనే వైభవోజ్వలంగా ప్రకాశించదల్చుకుంటే అందుకో చక్కని రాజమార్గం ఉంది, చెప్పనా?చూడు...పచ్చగా ఎదిగే చెట్టుని చూడు!ఆ చెట్టులాగే సారవంతమైన నేలవంటి కఠినసత్యప్పు పునాదుల మీద నీతినియమాలతో నిండిన నీ ప్రవర్తన అనే ధృఢమైన కాండాన్ని నిలబెట్టి ఉంచు.అందుకోసం మొదట నీ జిజ్ఞాసల వేర్లని మహనీయుల బోధనల్లోకి వీలైనంత పొడుగ్గా సాగించి ఉంచు.అప్పుడిక విజృంభించి నలుదిక్కులకీ శాఖల్ని విస్తరించు.ఆ శాఖలు నీ హృదయంలో పొంగిపొర్లుతున్న సౌజన్యాన్ని ప్రతి కణుపులోనూ నిండుగా నింపుకున్న స్నేహామృత హస్తవారధులే కదూ!ఆత్మీయంగా కనబడే రూపం,మోహనంగా వెలిగే చిరునవ్వూ,సదా స్వాగతించే హస్తచాలనంతో నిలబడి నీకు దగ్గిరగా వచ్చిన ప్రతి మనిషినీ ప్రియభాసహణతో అలరించు.ప్రతి నిముషమూ నీకు పరిచయమౌతున్న అసంఖ్యాక జనసందోహం నుంచి సాధ్యమైనంత  తక్కువ సమయంలో వీలయినంత ఎక్కువమందిని నీకోసం ప్రాణమిచ్చే స్నేహితులుగా పెంచుకుంటూ ఎదుగు.ఐతే,నీ స్నేహానికి తగనివాళ్ళైన కొందరు చీడపురుగుల్ని మాత్రం అసలు దగ్గిరకే రానివ్వకు.అప్పుడు మొహమాట పడి మితిమీరిన చనువిస్తే తర్వాత నీకే ప్రమాదం!ఇతర్లని వెక్కిరించి ఆనందించే వాళ్ళనీ,తమ అవసరం కోసం మమకారం నటించే వాళ్ళనీ - వాళ్ళ బుద్ధి తెలిసిన మరుక్షణమే వాళ్ళతో నీకున్న అనుబంధాన్ని కత్తిరించేసి వాళ్ళని అంతటితో విస్మరించి పారెయ్యి.చిరుమొలకలుగా ఉన్నప్పట్నించీ తెగుళ్ళనీ,చీడపీడల్ని ఎప్పుడు హింసించటం మొదలుపెడితే అప్పుడు తడబడకుండా అడ్డుకోగలిగినవే నేడిలా మహావృక్షాలై నిలబడ్డాయని తెలుసుకో!అనునిత్యం జీవం తొణికిసలాడుతూ, స్నేహమధురవసంతాల చిగుళ్ళు తొడుగుతూ ఆప్తులందరికీ సతతతహరితంగా కనబడు.ప్రియమిత్రులకి నిరాఘాటంగా ఆతిధ్యపు నీడనిచ్చి, అవసరమై వచ్చి సహాయ మడిగితే బెట్టు చెయ్యకుండా చెయ్యాల్సిన త్యాగసముదాయాల్ని పండిన ఫలాలుగా అందించి నిగర్వంగా ఉండటాన్ని నేర్చుకో!

     భోగయాత్రలో కదలాలంటే కలివిడితనం ఉండాలె!పూనుకుని మాట కలుపాలె.మాటకి మాట కలుపాలె.కష్టం సుఖం కలబోసుకోవాలె.పగలల్లా కష్టపడాలె,రాత్రికోసం ఎదురుచూడాలె.రాత్రికి మంచి చోటు చూసుకుని డేరాలు బిగించి మజిలీ వేస్తారు చూడు, అప్పుడు మొదలవుతుంది కోలాహలం!రాత్రయింది గదాని కడుపునిండా పట్టించి ముసుగుతన్ని పడుకోవద్దు!నువ్వు వండిన వంటకం నువ్వు మాత్రమే తినకు - అదే అసలైన దరిద్రం!అక్కడ కోలాహలాగ్ని దగ్గిర తక్కిన భోగయాత్రికులు సందడి చేస్తుంటే నువ్విక్కడ ఒంటికాయ సొంటికొమ్ములా కూర్చుంటే కుదరదు!ఎదటివాడు తనని ముట్టుకుంటే తను మైలపడతాననే ఆలోచన మనస్సులోకి వచ్చిన వాడెవడయినా అస్పృశ్యుడే అవుతాడు!తనని ముట్టుకున్న ప్రతివాడికీ తననుంచి పవిత్రతని ప్రవహింపజెయ్యగలిగినవాడు మాత్రమే నిజమైన బ్రాహ్మణుడు కాగలడు!వెళ్ళు వెళ్ళు, అక్కడ వెలుగుతున్న కోలాహలాగ్ని దగ్గిర కెళ్ళు!ఈ మోసం,ద్వేషం,ఎక్కువ,తక్కువ,స్వార్ధం - అన్నింటినీ బైటికి తీసి కోలాహలాగ్నిలో తగలెయ్!ప్రతివాడినీ హృదయానికి హత్తుకో!కలం ఝళిపించి కొత్త పాట రాసెయ్!గొంతు పెకలించి కొత్త రాగం పాడెయ్!గజ్జె కదిలించి కొత్త చిందు వేసెయ్!చేతి కొద్దీ దరువెయ్!కాలి కొద్దీ ఎగిరెయ్!అలిసిపోయినా వెనకబడిపోకు, పక్కనే పానశాలలో సాకీ ఉంది!మధుపాత్ర నింపు, ఖాళీ చెయ్!అలుపు తీర్చుకుని మళ్ళీ వొచ్చిపడు!ఆడుతున్నవాళ్లకి చప్పట్లు కొట్టి వాళ్లని మరింత హుషారు చెయ్!పాడుతున్నవాళ్ళకి పక్కతాళం వేసి నువ్వు మరింత రెచ్చిపో!ఇప్పుడున్న గుడారం నచ్చకపోతే వెంటనే పక్కదాంట్లోకి వెళ్ళు!ఈ భోగయాత్రలో ఎవడికీ ఏ డేరానీ హక్కుభుక్తం రాసివ్వలేదు నేను!గొడవలొస్తే వెనక్కి తగ్గొద్దు!నువ్వు నాలుగు తిట్లు తిట్టు!నువ్వు నాలుగు తిట్లు తిను! ఏదయినా చెయ్యి గానీ, నువ్వు ఏడవొద్దు - ఎవర్నీ ఏడిపించొద్దు!

     ఏడుపే అసలైన చావు!అసలు చావనేది లేనే లేదు.నువ్వు చావనుకుంటున్నది చావు కాదు.నిన్నటి మీ తలిదండ్రులు ఇప్పటి మీ భార్యాభర్తలుగా బతికి ఉన్నారు.ఇప్పటి మీ భార్యాభర్తలు రేపటి మీ కొడుకూ కోడళ్ళలో కూతురూ అల్లుళ్ళలో బతికి ఉంటారు - కొత్తవాళ్ళకి చోటుకోసం పాతవాళ్ళని ఖాళీ చేయించే సత్రమిది, అంతే!ఈ గొలుసుకట్టును తెగనివ్వకు.నడుస్తున్న భోగయాత్రని ఆగనివ్వకు.ఏడుస్తూ బతికినా నవ్వుతూ బతికినా ఒకసారి చచ్చిపోయాక మళ్ళీ తిరిగి రావడం కుదరదన్నది సత్యం.యేది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

Friday 4 March 2016

అధికార పార్టీ కండువా రంగు మారడం తప్ప ఇదివరకటి తెలంగాణకీ ఇప్పటి తెలంగాణకీ తేడా ఏంటి?అంతా అప్పట్లాగే ఉంటే,మరి ప్రత్యేక రాష్ట్రం కోసం అంతగా ఎందుకు ఏడ్చారు!

     గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బ తినడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కళ్ళు పత్తికాయల్లా చేసుకున్న వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది, ఇన్నాళ్లకి వాళ్ళ కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది - కొంచెం మామూలు స్థితికి వచ్చినాయి!అయితే,కొంచెం కళ్ళు నులుముకుని చూస్తే ఇవ్వాళ తెరాసలో మంత్రులుగానూ ఇంకా వీళ్ళకి తెలంగాణ పునర్నిర్మాణం అనే బృహత్కార్యాన్ని భుజాల మీద వేసుకుని తెలంగాణ భూఖండాన్ని ఉద్ధరించే మహాత్ములుగానూ అక్కడ కొలువుదీరి కనబడుతున్నవాళ్ళంతా ఒకప్పుడు టీడెపీ వాళ్ళే:-)

     అసలు ముఖ్యమంత్రి గారే నందమూరి తారకరామారవుకి భక్తుడు!చంద్రబాబుకి రహస్యమిత్రుడు కూడాను - ఇప్పటికీ!ఒక్క చంద్రబాబు తప్పిస్తే తెలంగాణ నుంచి దుష్ట దుర్మార్గ తెలంగాణ విధ్వంసక ప్రజాశత్రువు చంద్రబాబు ద్వారా ఎన్నికైన తెదెపా వాళ్ళంతా, వాళ్ళొక్కళ్ళేనా అన్ని పార్టీల్లోనూ ఉండి ఇప్పటివరకు ఉద్యమపార్టీని వ్యతిరేకించిన వాళ్ళంతా ఇప్పుడు తెరాస లోనే ఉన్నారు.మరి!యాభయ్యేళ్ళ నాటి పాతకధని మర్చిపోయి ఈ కొత్త కధలో పన్నెండేళ్ళుగా వీళ్ళు ఎవరినైతే బాబు పచ్చ పార్టీలో ఉండి తెలంగాణకి అన్యాయం చేశారని శాపనార్ధాలు పెట్టారో వాళ్ళంతా కండువా మార్చగానే మంచివాళ్ళు అయిపోతారా?కండువా రంగు మార్చటం కోసమా వీళ్ళు ఇంత గోల చేసింది?

     పోనీ ప్రాంతీయాభిమానం లెక్కల ప్రకారం సంస్కృతి గురించి గొప్పగా చెబుదాం అనుకుంటే బతుకమ్మని కులాలవారీగా చీల్చి భ్రష్టు పట్టించారు!బతుకమ్మ పరువు తియ్యటం పూర్తయ్యాక ఇప్పుడు సమ్మక్క మీద పడ్డారు.కొత్తగా నెత్తి కెత్తుకుంటున్న సమ్మక్క,సారక్కల గోలేంటో అర్ధం కాదు.వీళ్ళు కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి మా ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టిన మహారాణి అంటారు.తెలంగాణ భాషలో కాకుండా సంస్కృత పదాలతో నిండిపోయిన గ్రాంధికపు రాష్ట్రగీతంలో రుద్రమదేవిని పొగిడితే వీళ్ళు ఆంధ్రోళ్ళని తిట్టిన దానికన్నా పదింతలు తిట్టిన సమ్మక్క,సారక్కల భక్తులకి అది నచ్చటం లేదు.అందుకని, కొత్త కధల్లో ప్రతాపరుద్రుడికి  పశ్చాత్తాపం అనే ముసుగు తగిలిస్తున్నారు.వాళ్ళు ఎక్కడెక్కడివాళ్ళూ పోగయి మా సంప్రదాయాల్లో వేళ్ళు పెడుతున్నారు,మ మా కధల్ని గూడా మార్చేస్తున్నారు అని కోప్పడుతున్నారు.కొంచెం వైభవంగా బతికిన ఈ మధ్యకాలపు ధర్మప్రభువు గదాని నిజాముని పొగుడుదామంటే అక్కడ బలంగా ఉన్న నక్సలైట్లు ఒంటికాలిమీద లేస్తారు.నక్సలైట్లని తన్ని తగిలేద్దామంటే గిరిజనులు వాళ్ళు మా అన్నలంటారు - ఇదెక్కడి గోల!

    పోనీ పరిపాలన సమర్ధవంతంగా ఉంది అనుకుని సంతోషపడదామంటే సాక్షాత్తూ రాజధాని నడిబొడ్డునే ఉగ్రవవ్ద సంస్థలకి శాఖలు లేస్తుంటే వాటిని మూయించే దమ్ము లేదు.ముఖ్యమంత్రి గారు ఆర్భాటంగా మొదలెట్టిన గతకాలపు సాహసోపేత నిర్ణయాలన్నీ కొన్ని కోర్టు మొట్టికాయలతో కొన్ని జనాల చివాట్లతో అటకెక్కేసినాయి - అవి మళ్ళీ కిందకి దిగొచ్చే సూచనలు కూడా లేవు.కోర్టుల్ని ఆంధ్రా కోర్టులు గాబట్టి వాటిని కొట్టేసినాయి అని చెప్పుకుని కొంచెం పరువు నిలబెట్టుకున్నారు.కానీ పోలీస్ కమిషనరేట్ అని పోలీసుశాఖకి గాలి కొట్టబొతే ఎయిర్పోర్తు అధారిటీస్ గాలి తీసేసింది.అంతకిముందు జరిగిన వాటికి ఆంధ్రోళ్ళ మీద నెట్టేశారు,మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంకృత నిర్ణయాలని కూడా ఆంధ్రోళ్ళ మీద నెట్టెయ్యరు కదా:-(

     ఈ రెండేళ్ళలో చెప్పుకోదగిన గొప్పపని ఆయుత చండీయాగం తప్ప ఇనకేమీ కనబడ్డం లేదు.దాని మూలంగా కూడా అప్పటి వరకు పచ్చమీడియా పేరుతో ఏదో చేద్ద్దామని అంతు చూదబోయి ఏమీ చేయలేనని తెలిసి రాధాకృష్నతో కత్తు కలిపెయ్యడం ఒక్కటే గట్టి లాభం!మిగిలినవన్నీ మబ్బుల్లో నీళ్ళే.అయినా ఎందుకు వీళ్ళింత హ్యాపీగా ఫీలవుతున్నారు?ఆంధ్రప్రదేశ్ విభజనకి ముందు కూడా ఇలాగే తెలంగాణా ఇవ్వకుండా ఆంధ్రా వారు అడ్డుపడుతున్నారనీ కావూరి లగడపాటి లాంటివాళ్ళని దోషులుగా చిత్రీకరించి ఆంధ్రా వారినందరినీ తిట్టేవాళ్ళు. సాధారణంగా డబ్బున్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు తక్కువ అసూయ చెందేవాళ్ళు ఎక్కువ కనుక సోనియా కూడా తెలంగాణా వారి మాటలనే నమ్మి అంత పెద్ద బడా పారిశ్రామిక వేత్తలను కూడా కాదని పార్లమెంట్ లో 23 నిమిషాలు తలుపులు మూసి మూజువాణి ఓటుతో విభజన చేసారు. .విభజన కావాలా వద్దా అన్నది ప్రజల అభీష్టం ప్రకారం జరగాలి, కానీ వీళ్ళు అట్లాంటి రాజమార్గం ద్వారా కాకుండా వక్రమార్గం దవరా తెచ్చుకున్నారు,అది వాళ్ళకి కూడా స్పష్టంగా తెలుసు.ఈ రకమైన జరిగిన విభజన మొత్తం ఒక పక్కా ప్రణాళికతో నడిపించారు కొందరు వ్యూహకర్తలు - మొదటి వాదన,విడిపోతే రెండు ప్రభుత్వాలు,మరిన్ని పదవులు,మరిన్ని కాంట్రాక్టులు,మరిన్ని తాయిలాలు వస్తాయి అనేది.దానివల్ల ఎక్కువ నష్టం తనకే అని తెలిసిన చంద్రబాబు వ్యతిరేకించాడు - బాబుకి మాత్రం ప్రజలమీద ఏమంత ప్రేమ ఉంది గనక!కానీ చూడండి ఈయన్ని ఆయన అమరావతికీ ఆయన్ని ఈయన చండీయాగానికీ ఎంత ఆత్మీయంగా పిల్చుకున్నారో - తోడుదొంగలు!

     ఇక్కడ కూర్చుని "అండి" కన్నా "రి" ప్రశస్తం అని వాగేవాళ్ళకి మేళ్ళు చెయ్యటంకోసమో ,"చెప్పాలె" అనే గొప్ప ప్రయోగానికి బదులుగా ఇన్నాళ్లూ "చెప్పాలి" అనే తప్పుడు ప్రయోగం ఒప్పుగా చెలామణీ అయిందని అఘోరించే కుపండితులకి గందపెండేరాలు తొడగటం కోసమో కాదు విబజన జరిగింది.పైస్థాయిలో వాళ్లు ఆదాయాల్ని పంచుకోవడానికి సులువుగా ఉంటుందని!వీళ్ళకి దక్కేదల్లా మ్యాపులో విడిగా కొత్త రాష్ట్రంగా కనబడ్డమే.చంద్రబాబు మాటిమాటికీ తెలుగువాళ్ళని కలుపుతానని వాగుతున్నప్పుడల్లా వీళ్లకి ఇప్పటికీ తుమ్మితే వూడిపోయే ముక్కులా ఉన్న తెలంగాణ గురించి అంటున్నట్టు ఉలిక్కిపడేవాళ్ళు.ఇప్పుడా భయం పోయింది,అదీ వీళ్ళ ధీమా!వీళ్ళ దృష్టిలో ఎన్నికల్లో తెరాసా గెలుస్తూ ఉంటే చాలు తెలంగాణా బాగున్నట్టే.

గులాబి రంగు జిందాబాద్!పసుపు రంగు ముర్దాబాద్?

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...