Sunday 31 January 2016

ఇప్పటివరకూ తన్నకపోవటమే తమ మంచితనం అంటున్నారు!ఇకముందు తంతారేమో తిక్క రేగితే,ఎవడు నమ్ముతాడు ఈ అబద్ధాల కోర్లని?సెటిలర్లూ జర సోంచాయించున్రి?!

        కేసేఅర్ ప్రచారపర్వం లోకి దిగక ముందు ఎంతో ప్రశాంతంగా నడుస్తున గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ఆయన రావడం తొనే భూకంపం వచ్చిననత సంచహ్లనాన్ని కలిగించింది.రావ్డం రావడమే ఓటుకు నోటు వ్యవహారం బయటపడినప్పటి విశ్వరూపాన్ని మళ్ళీ చూపించాడు.ఆనాడు ఆయనగారి విజృంభణలో రాలిన ఆణిముత్యాలలో ఒకటి "చంద్రబాబుని ఇక బ్రహ్మదేవుడు కూడా రక్షించ లేడు!" మరి అంత గట్టిగా ఘీంకరించి కూడా అడ్డంగా దొరికిపోయిన నేరస్తుణ్ణి ఇప్పటి వరకూ ఎందుకు అరెస్టు చెయ్యలెదు?అదే మనిషి అమరావతి శంకుస్థాపనకి పిలిస్తే కులుక్కుంటూ వెళ్ళావెందుకు?అదే మనిషిని నువ్వు ఆయుత చండీ యాగానికి పిలవటం దేనికి?ఈ ప్రశ్నలు ఎవరయినా అడిగారో ఈయనే అడిగారనుకుని చెప్పారో గానీ జనానికి తప్పనిసరిగా వచ్చే అనుమానాలకి తనదైన శైలిలో కొంచెం అబద్ధం కొంచెం ప్రగల్భం కలిపి జవాబు చెప్పారు.

          ఎవరూ అడక్కండానే ఆ జవాబులు చెప్పి ఉంటే తాము చేసిన తప్పుల్ని నిలదీసినా ముఖం చాటేస్తున్న రాజకీయ నాయకులు పుష్కలంగా ఉన్న ఈ రోజుల్లో నిజంగా అపురూపమే!కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉండి అబద్ధాలు చెప్పడమే ఆయన పట్ల సానుభూతిని పుట్టిస్తున్నది.మొదటి అబద్ధం "నేను ఆంధ్రాకి సహాయ్మ్ చేద్దామనుకున్నాను,కానీ మోదీ బాబుకి మట్టీ నీళ్ళూ ఇచ్చాడు,ఇప్పుడు నేనిస్తే పుందు మీద కారం జల్లినట్టు కుళ్ళి చస్తాడని ఇవ్వలేదు" అన్నది - ఎంత బరితెగిస్తే ఇంత అబద్ధం చెబుతాడు!అక్కడ అమరావతి వేదిక మీద మొదట ప్రసంగించినది ఈయనే,ఈయనగారు మాట్లాడ్డం అయిపోయి కూర్చున్నాక మోదీ గారు మాట్లాడ్డం మొదలు పెట్టేవరకు మోదీగారు యేమిస్తున్నాడో ఎవరికీ తెలీదు,మరి మోదీ మట్టీ నీళ్ళూ ఇచ్చాక నేను ఇస్తే ఏడుస్తాడని ఇవ్వలేదు అనటం పచ్చి అబద్ధం!రెండవ అబద్ధం భువనేశ్వరి మా పార్టీకే వోటు వేస్తానన్నది అనేది మరీ ఘోరం.ఆవిడ వెంటనే కంగారుపడిపోయి కౌంటర్ ప్రకటన చేసింది.కేసీఆర్ ధైర్యం ఏమిటంటే తన ఫ్యాన్లు తను అబద్ధం చెప్పినా అదే నిజమని నమ్ముతారని.కానీ ఇక్కడ ఆయన సెటిలర్ల వోట్లు కొల్లగొట్టాలని అనుకున్నప్పుడు ఈయన మాట్లాడాల్సింది ఇలాగేనా?ఇలాంటి ధోరణితో సెటిలర్లని ఆకట్టుకోగలనని ఈయన ఎట్లా భావిస్తున్నాడో నాకర్ధం కావట్లేదు!

          నిన్ననో మొన్ననో తండ్రిగారు ప్రచారం మొదలు పెట్టకముందు తనయుడు కేటీఆర్ ముఖాముఖి చూశాను.మధ్యలో నాగార్జున వచ్చి కొంచెం మెచ్చుకున్నాదు,కుర్రాడు చక్కగా హైదరాబాదుకి తను ఏమి చెయ్యాలనుకుంటున్నాడో లెక్కలతో సహా చెప్పడం చూసి ధోరణి బాగానే ఉంది ప్రాక్టికాలిటీ ఉంది కుర్రాడిలో అనిపించింది.అలా పూర్తిగా కేటీఆర్ మీద వొదిలేసినా బాగుండేది - టీ.ఆర్.యస్ అభిమానులు ఏమనుకుంటున్నారో తెలియదు గానీ ఇది ఖచ్చితంగా కేటీఆర్ ఇప్పటివరకూ చేసినదాన్ని ఉల్టాపుల్టా చెయ్యడమే!సెటిలర్లలో.ముఖ్యంగా ఇప్పటికే కేసీఆర్ ఏదో ఒకరోజున తమని తన్ని తగలేస్తాడేమో అని భయపడుతున్నవాళ్లలో ఇప్పుడు కలిగే ప్రభావం చాలా తీవ్రంగా ఉండొచ్చు!నేను చంద్రబాబుని కదా తిట్టింది అని సమర్ధించుకోవచ్చు గానీ ప్రజలకి మాత్రం కేసీఆర్ ధోరణి మారలేదని నిశ్చయంగా తెలిసిపోయింది.ఈ 18 నెలల్లో ఒక్కసారయినా సీమాంధ్రుల మీద దాడులు జరిగాయా అని అడిగి జరగలేదని చెప్పి తమని తాము సమర్ధించుకుంటున్నవాళ్ళు ఒక విషయం - తెలంగాణ భారతదేశం లోని ఒక రాష్ట్రం అని మర్చిపోతున్నారు!ఈ దేశపౌరులుగా రాజ్యాంగం వారికి దఖలు పర్చిన హక్కు వల్ల ఇక్కడ ఉన్నారు తప్ప వీరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వారిక్కడ ఉండటం లేదు.ఇవ్వాళ వీరు దాడులు చేస్తే జరిగే హాని వీరికి గనకనే వీరు దాడి చెయ్యటం లేదు, అవునా!

          నిజంగా తనలోని ఆంధ్రద్వేషాన్ని తగ్గించుకుని వాస్తవదృష్తితో ఆలోచిస్తున్నాడు అని అనుకోవటానికి ఆధారభూతమైన పనులు కేసీఆర్ ఏమీ చేయలేదు - కేవలం తన పనుల్లో తను తీరిక లేకుండా ఉందటం వల్ల నోరు విప్పలేదు - అంతే!ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నీటిలో చేపలా తన ఎజెండాని అమలు చెయ్యడం కోసమే విఫలప్రయత్నాలు చేశాడు,చేస్తున్నాడు,చేస్తాడు.

          వాహనాల రీరిజిస్ట్రేషన్ ప్రతిపాదన వెనక ఉన్న మర్మమేమిటి?ఆంధ్రా రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు తెలంగాణలో తిరగకూడదని కాదా!సకలజనులసర్వే ఫలితాలు ఏమైనాయి?మాంచి హుషారుగా దూర దూరాల నుంచి కాలి నడకనా సైకిళ్ళ మీదా వచ్చి నమోదు చేయించుకున్నారే ఎక్కడెక్కడి తెలంగాణ ప్రజానీకం!ఎందుకు బుట్ట దాఖలా చేశారు?స్థానికతకి 1956 కొలబద్దగా పెట్టడం వెనక ఉన్న అసలు కధేంటి?అప్పుడు కొందరు తెలంగాణ వాదులు కూడా దాన్ని వ్యతిరేకించారు, అది దుర్మార్గం అని ఒప్పుకున్నారు.ఆధార్ లింక్ పేరుతో హైదరాబాద్ లోని ఆంధ్ర వోటర్లని తొలగించి గందరగోళం సృష్టించి వారికి జీతాలు రాని పరిస్థితిని కల్పించాడు.చివరికి వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది.తెలంగాణా గడ్డమీద ఉన్న ఆంధ్రులకి కాలిలో ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని చెప్తూనే ఆంధ్ర మూలాలు ఉన్నవారికి నష్తం కలిగిస్తుందని తెలిసి కూడా ముల్కీ రూల్స్ పునరుద్ధరణ కోసం ప్రయత్నించాడు.

          అమాయకులు కొందరు వూహాగానలు చేశారు గానీ కేసీఆర్ ఎప్పుడు మారాడు?మారితే ఏం జరుగుతుందో తెలుసా!ఈ రెండు రాష్ట్రాల్లోని తెలుగువాళ్ళూ ఆప్యాయంగా కలిసిపోయి అనవసరంగా విడిపోయామని తెలుసుకుని రెందు రాష్ట్రాల్ని కలిపేస్తారు - అన్ని సాహసాలు చేసింది అందుకా?!ఇవ్వాళ వోటు వెయ్యకపోతే రేపు తంతాదేమోననే భయం ఉంటే తప్ప ఈ సెటిలర్లు అనబడే ఆంధ్రమూలాలు ఉన్న తెలుగువాళ్ళు కేసీఆర్ మారిపోయాడని నమ్మి వోటు వెయ్యడం మూర్ఖత్వం.

ఆంధ్రద్వేషం నుంచి పుట్టిన తెలంగాణ నుంచి ఆంధ్రద్వేషం పోతే తెలంగాణ అదృశ్యమై పోతుంది!

Thursday 28 January 2016

చంద్రబాబుకి సిగ్గూ శరమూ పౌరుషం ఉంటే ముందు అమరావతి శంకుస్థాపన శిలాఫలకం మీద ఉన్న కేసీఆర్ పేరుని తొలగించాలి!

          "అమరావతికే దిక్కు లేదు.ఈ పెద్దమనిషి హైదరాబాదుకు నిధులు తీసుకొస్తాడంట!యాడికెల్లి తెస్తడు?","నా కళ్ళముందే మోదె రెండు మట్టికుందలు ఇచ్చిండు,అయ్యి తీసుకుని ఈయన పళ్ళికిస్తండు!" - ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి సరికొత్త ద్వేషభాష.పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదని పెద్దలు వూరికే అన్నారా?కొన్నాళ్ళ పాటు నాలిముచ్చులా కిక్కురుమనకుండా ఉండి ఉండి ఇక వూరుకుండలేక తన అసలు రూపం ఇట్లా చూపిస్తున్నాడు - సిగ్గు లేకపోతే సరి!

          ఉద్యమ సమయంలో ప్రపంచంలో మాది న్యాయపోరాటం అని చెప్పుకునేవాళ్ళంతా సిగ్గు పడేటట్టు వీధి గూండాలూ ఆకు రౌడీలూ కూడా మాట్లడని బజారు భాష మాట్లాడి అయినా ఏనాడూ ప్రజలు ఉద్యమానికి అనుకూలంగా స్పందించక వరసపెట్టి ధరావతులు పోగొడుతుంటే స్వాభిమానం గలవాడెవ్వడూ చెయ్యనంత దిక్కుమాలిన పద్ధతికి తెగబడి  బల్లకింద చేతులు పెట్టి తెచ్చుకున్నందుకే అల్లాబ్డం బెల్లాండం బద్దలు గొట్టిననతగా విరగబడుతున్నారు.అన్ని గొడవలు చేసి రాష్ట్రం సాధించుకున్నా ప్రపంచంలో అంత సుదీర్ఘ పోరాటం చేసి విజయతీరం చేరిన ఏ ఉద్యమ రధసారధికీ రానంత ఉసూరుమనిపించే బొటాబొటీ మెజారిటీ వస్తే దాన్ని పెంచుకోవటానికి చక్కనైన రాజమార్గము యెటూ దొరక్క సందుగొందులు వెతుకుతూ ఆ పార్టీ ఈ పార్తీ అని లేకుండా గుంపులు గుంపులుగా పక్కలేయ్యటం ఒకటే తక్కువ అన్నంత నీచపు రాజకీయం చెయ్యటమే గొప్ప రాజనీతి అని ఈ సంకర జాతి వంకర బుద్ధుల అధమాధముడూ మరియూ నోరు తెరిస్తే ఉఛ్చనీచాలు లేకుండా రొచ్చుభాష మాట్లాడే ఇంతటి బజారు మనిషిని కూడా వాక్చాతుర్యం గలవాడని కొనియాడుతూ అక్కున జేర్చుకోగలిగిన రెండు నాలుకల విషసర్పాలూ జబ్బలు చరుచుకుంటూన్నారు గానీ వీళ్ళ నిజమైన తెలివి తేటలు ఎవడికి తెలియవు? 

@అమృతమధనం
కాలాన్ని జయించిన దైవాంశ సంభూతుడు
31, మే 2015, ఆదివారం
బాబు అదృష్టజాతకుడు కాకుంటే మరేంటి. దేవుడిచ్చిన సంతానాన్ని వద్దని ఎలా అడ్డుకుంటాం, ఏ సంఖ్యలో ఏ మహాత్ముడు పుడతాడో అని ఎన్టీఆర్ నమ్మడమే కాకుండా డజను మంది పిల్లలకు తండ్రయ్యారు. కానీ ఆ డజను మంది పిల్లలుండి అల్లుడు వారసుడైన రాజు కథ చరిత్రలో ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే బాబు అదృష్టజాతకుడు కాబట్టి. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపికి, ఎన్టీఆర్ అభిష్టానికి వ్యతిరేకంగా అల్లుడు రెండో తరం వారసుడు. ఆ అల్లుడు అచ్చం రాజరికంలో యువరాజును జాతి జనులకు పరిచయం చేసినట్టు తన యువరాజ పట్ట్భాషేకం మహానాడులో జరిపించారు. అంతేనా తన మామ ఉదంతాన్ని చూసిన అల్లుడు తన కుమారుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కుమారుడి వారసుడ్ని కూడా పనిలో పనిగా మహానాడులో దేశ ప్రజలకు పరిచయం చేశాడు. నాలుగవ తరం యువరాజు దైవాంశ సంభూతుడు అని నమ్మడమే కాకుండా అదే పేరు పెట్టారు. దైవాంశ సంభూతుడు మాత్రమే రాజవుతాడు. జాతకంలో కాదు ఏకంగా పేరులోనే దైవాంశ ఉందంటే బాబుగారి విజన్‌కు తిరుగలేదని ఒప్పుకుంటావా? సినిమాలో యువరాణి వెంట చెలికత్తెలు, యువరాజు వెంటన అంజిగాడు లాంటి కామెడీ బృందం ఉన్నట్టు అచ్చం తెలుగు యువరాజుల వెంట ఎమ్మెల్యేల సంతాన బృందం తిరుగుతుంటే నాకైతే సినిమాల్లోని రాజరికాన్ని కనులారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్టుంది.


@అమృతమధనం
20, జనవరి 2016, బుధవారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ఎలా అయినా ఉండవచ్చు, ఎన్నికలు జరగకముందే ఒక కీలకమైన విషయంలో మాత్రం ఈ ఎన్నికలు స్పష్టత నిచ్చాయి. కెసిఆర్ రాజకీయ వారసుడు ఎవరు? అనే ప్రశ్న ఉదయించక ముందే కెసిఆర్ వారసుడు కెటిఆర్ అని తేల్చేశాయి.తాను పదేళ్లు పాలించడమే కాకుండా తన వారసునిగా కెటిఆర్‌ను తీర్చిదిద్దడానికి పూనుకుని కెటిఆర్‌కు తొలి అసైన్‌మెంట్‌గా గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతలు అప్పగించారు. బలం లేకపోవడం వల్లనే గత ఎన్నికల్లో అసలు పోటీ చేయని గ్రేటర్‌లో కెటిఆర్ నాయకత్వంలో విజయం సాధిస్తే, వారసత్వానికి ప్రజల నుంచి కూడా ఆమోదం లభిస్తుందనే వ్యూహంతోనే గ్రేటర్ బాధ్యతలు కెటిఆర్‌కు అప్పగించి ఉండవచ్చు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపినే మూడవ తరం వారసుడిని సిద్ధం చేసుకుంటోంది. ప్రాంతీయ పార్టీలకు ఔనన్నా కాదన్నా కుటుంబ సభ్యులే వారసులవుతారు.ఎన్టీఆర్ తన వారుసుడిని తాను నిర్ణయించలేకపోయారు. చాలా కాలం క్రితం బాలకృష్ణ తన వారసుడు ఎన్టీఆర్  అని ప్రకటిస్తే, ఆ ప్రకటన ఉపసంహరించుకునే విధంగా చంద్రబాబు ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు.టిడిపికి ఎన్టీఆర్ కోరుకున్నట్టుగా కుమారుడు వారసుడు కాలేదు. బలవంతంగా అల్లుడు వారసుడయ్యారు. బాబు మాత్రం పగడ్బందీగా తన కుమారుడిని వారసుడిగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ తన  అల్లుడి రాజకీయాన్ని అర్ధం చేసుకోలేదు, కుమారులకు రాజకీయ పరిజ్ఞానం లేదు. దాంతో ఎన్టీఆర్ కోరుకున్న విధంగా టిడిపికి వారసుడు రాలేదు.కానీ కెసిఆర్ విషయం అలా కాదు. రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఈ కాలానికి తగిన నాయకుడి లక్షణాలున్న తెలివైన కుమారుడు ఉన్నారు. సహజంగా ఎవరైనా తన వారసత్వం తన కుమారుడికే దక్కాలని కోరుకుంటారు. కుమారులకు తెలివితేటలు లేకపోతేనే వారసత్వం దక్కకుండా పోతుంది. కెసిఆర్ సైతం అంతే. 

@హరికాలం
ఈనాటి బూటకపు ప్రజాస్వామ్యాన్నీ ఆనాటి నీతిగల రాజస్వామ్యాన్నీ ఒక్కచోట చేర్చి అసమానతలకు పరిష్కారంగా క్షీరసాగర మధనం జరిపించడానికి ప్రాంతీయవాదాన్ని మంధరగిరిని చేసి అధికార ప్రాప్తిని వాసుకిగా మలచి సుస్థిరత్వం అనే శ్రీకూర్మం పైకి కనబడకుండా చేస్తున సహాయంతో విద్వేషానల హాలాహలం చల్లబడిన తర్వాత పైకి తేల్చిన అమృతరసగుళీకలా ఇవి!


          బుడ్డా మురళి గారు వయస్సులోనూ చదువులోనూ అనుభవంలోనూ ఎన్నదగిన వాడే.నేను ఇదివరకు చాలాచోట్ల చెప్పినట్టు వ్యక్తిగత జీవితంలో నిష్కళంకమైన వ్యక్తియే కావచ్చు.ఈ హరిబాబు అనే బ్లాగరు నిజజీవితంలో అనైతిక శృంగార పిపాసి కావచ్చు!కానీ బ్లాగులలో ఎవరు ఎలా ఉంటారో తెలియని పరిస్థితిలో ఎవరయినా ఈ ఇద్దర్నీ ఎలా అంచనా వేస్తారు?తమ బ్లాగుల్లో రాస్తున్న పోష్టుల్ని బట్టీ ఇతర బ్లాగుల్లో వేసేఅ కామెంట్లని బట్టే కదా! బుడ్డా మురళి గారు పాత పోష్టులో చంద్రబాబు చేసిన పనిని రాజరికంతో పోల్చి ఎన్నో వ్యంగ్యాల్ని కురిపించి కొత్త పోష్టులో చంద్రశేఖర రావు అదే పని చేస్తే 360 డిగ్రీలు తిరిగేసి అది సహజమే అంటున్నారు - ఎంత రాజకీయం ముదిరినా బుద్ధికీవులు ఇంత అడ్డగోలుగా మాటలు మార్చవచ్చునా!నిన్నటి రోజున బహుశా రేపెప్పుడయినా మనవాడూ ఇదే పని చేస్తాడేమో ఎందుకొచ్చిన గోల పొరుగురాష్ట్రపు ముఖ్యమంత్రిని గురించి అవాకులూ చెవాకులూ వాగడం అని కూడా అనిపించనంతగా ఆయనలోని ద్వేషం కంటికి పొరలని కమ్మించింది కాబోలు?!ఒకే ఒక సమర్ధన!చంద్రబాబు మా ప్రాంతాన్ని భ్రష్టు పట్టించాడు కాబట్టి అతను ఏం చేసినా వెక్కిరిస్తామే తప్ప పొగడం, చంద్రశేఖర రావు మా ప్రాంతాన్ని ఉద్ధరిస్తాడని నముతున్నాం గాబట్టి అతన్ని కీర్తిస్తామే తప్ప లోపాలు ఉన్నా సహిస్తాం - అంతేనా?దీనికొక లేబుల్ పెట్టారు ప్రాంతీయాభిమానం అని,కానీ వాస్తవంగా ఇది పని చేస్తున్నదా!


Telangana Assange
Tuesday, 12 January 2016
ప్ర‌స్తుతం జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లను చూస్తుంటే అప్ప‌ట్లో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అన్న మాట నిజ‌మేనేమో అన్న రీతిలో టీఆర్ఎస్ స‌హా అన్ని రాజ‌కీయ పార్టీల ప్ర‌చారం సాగుతోంది. హైద‌రాబాద్ అంతా మేమే(ఆంధ్రా సెటిల‌ర్లు) ఉన్నామ‌ని ల‌గ‌డ‌పాటి, ఇత‌ర ఆంధ్రా నేత‌లు అన్నారు.. ఆ స‌మ‌యంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎంత స‌ర్వే చేసినా 5 ల‌క్ష‌ల మందికి మించి లేర‌ని వాదించారు. మ‌రి హైద‌రాబాద్ లో కోటి మంది ఉంటే అందులో ఉన్న 5 ల‌క్ష‌ల మందిని ఊర‌డించ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ఎస్‌, ఇత‌ర రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారం చేయ‌డం ఏంటి? ఈ త‌ర‌హా ప్ర‌చారం జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌నికి వ‌స్తుందేమో కానీ.. రానున్న రోజుల్లో యావ‌త్తు తెలంగాణ స‌మాజం ముందు మ‌ళ్లా మీరు ఏ మాట‌లు చెప్పి ప్ర‌చారానికి వెళ్తారో ఆలోచించుకోవాలి... సెటిల‌ర్ల‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి కూడా సిద్ధంగా ఉన్నామ‌నే రాజ‌కీయ నేత‌ల్లారా... ఏ త‌ప్పు చేశామ‌ని క్ష‌మాప‌ణ‌లు కోర‌దాం అనుకుంటున్నారు... తెలంగాణ స‌మాజాన్ని అను నిత్యం అవ‌మానించిన పెద్ద మ‌నుషులు క‌నీసం తాము త‌ప్పుగా మాట్లాడామ‌ని ఇప్ప‌టికీ అంగీక‌రించ‌డం లేదు.. అలాంటిది ఏ త‌ప్పూ చేయ‌ని మీరు మ‌నం అంతా గ‌తంలో త‌ప్పులు చేసిన‌ట్లుగా ఇప్పుడు మాట్లాడ‌టం అంటే అది తెలంగాణ స‌మాజాన్ని అవ‌మానించ‌డ‌మే

@హరికాలం
ఇప్పుడు కూడా మీకు అర్ధం కావడం లేదా మీరు గొప్పగా చెప్పుకుంటున్న ప్రాంతీయ వాదం ఎంత బూటకమో!మా ఉద్యోగాలు దోచుకున్నారు అని గిర్గ్లానీ రిపోర్టు చూడమన్నారు మీవారే ఒకరు.చూస్తే "అన్యాయం ఒక్క తెలంగాణా ప్రాంతం వారికే కాదు అన్ని ప్రాంతాల వారికీ జరిగింది" అన్నాడు గిర్గ్లానీ గారు.మీ వాదననీ మీరు సపోర్టుగా తెచ్చుకున్న గిర్గ్లానీ గారి మాటనీ కలిపి చూస్తే తెలంగాణా వారికి ఉద్యోగాల్లో జరిగిన అన్యాయానికి ఆంధ్ర ప్రానతం వారు కారణమైతే మరి ఆంధ్ర ప్రాంతం వారికి జరిగిన అన్యాయానికి తెలంగాణా ప్రాంతం వారు కారణం అయినట్టు కాదా,చెప్పండి!

మా నీళ్ళు దోచుకున్నారు అని విడిపోయారు.ఎక్కువ నీటి కోసం ఇదివర్లో నాలుగ్ రాష్ట్రాల మధ్య అజరిగిన ఒప్పందాల్ని మార్చమంటున్నారు.అది నిజంగా సాధ్యపడుతుందనే అనుకుంటున్నారా మీరు?ఇదివరలో నాలుగు రాష్ట్రాలుగా భాగాలు పంచుకున్న నీటిని తెలంగాణా వాటా పెర్గడాని కనుకూలంగా అయిదు రాష్ట్రాల మధ్య పంచాలంటే ఆంధ్రా మా నీళ్ళూ దోచుకున్నారు అంటున్నందు వల్ల కిక్కురు మనకుండా వూరుకున్నా మిగతా మూడు రాష్ట్రాలూ తమ వాటా తగ్గించుకుంటాయా?వేరే రాష్ట్రంగా విడిపోయాక ఆంధ్రా మాత్రం వూరుకుంటూందా?అన్ని చోట్లా ప్రతిపక్షాలు ఉన్నాయి,ఏ  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వూరుకుంటుంది?అందుకే కదా సమైక్య రాష్ట్రానికి దఖలు పడిన నీటినే ఈ రెండు తెలుగు రాష్ట్రాలూ పంచుకోవాల్సిందే తప్ప పాత ఒప్పందాన్ని తిరగదోడటం కుదరదంటున్నారు.

ప్రాణహిత చెవెళ్ళ యేనా?ప్రాజెక్టుని సాక్షాత్తూ ముఖ్యమంత్రియే రంగం లోకి దిగి డిజైను మార్చి చివరి ముక్కని కత్తిరించారు,ఎందుకని?అరిచి గింజుకున్నా ఐంతకు మించి నీళ్ళు రావని కాదా!

మీరు ఇదే బ్లాగులో సాక్షాత్తూ తెలంగాణ ప్రబ్బుత్వమే తెలంగాణ కాంట్రాక్టర్ల క్వాలిటీ బాగోలేదని ఇంకా ఆంధ్రా కాంట్రాక్తర్లకే అన్నీ కట్టబెడుతున్నది,మనవాళ్లని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది,లేకపోతే తెలంగాణా కాంట్రాక్తర్లు సబ్ కాంట్రాక్టర్లుగా మిగిలిపోతారేమో అని అనుమానం వ్యక్తం చేశారు!ఎంత కాలమైంది మీకా అనుమానం వొచ్చి?పరిస్థితి ఏమన్నా మారిందా,తెలుసుకోండి!

Tuesday, 28 April 2015
మ‌న కాంట్రాక్ట‌ర్ల‌నూ ప్రోత్స‌హించండి...! స‌బ్ కాంట్రాక్టర్లుగా మ‌న‌వాళ్ల‌ను మార్చొద్దు..!!

ఆంధ్రా నేత‌ల‌తో సంబంధం ఉన్న కంపెనీల‌కు తెలంగాణ కాంట్రాక్టులు ఇవ్వొద్దు..
Wednesday, 10 June 2015

Tuesday, 12 January 2016

హైద‌రాబాద్ నిండా సెటిల‌ర్ల ఓట్లే ఉన్నాయా?

మరి అరవయ్యేళ్ళ పాటు అంగలార్చి వీళ్ళు సాధించింది ఏమిటి?వీళ్ళ సొల్లుకబుర్లలోని డొల్లతనం ఇప్పటికీ తెలియడం లేదు గానీ ఎప్పటికయినా వీళ్ళకి తెలుస్తుందా?


          తెలంగాణ అసాంజి అని నిష్పక్షపాతంగా వాస్తవాల్ని బయటపెట్టిన ప్రముఖుడి పేరుతో ఉన్న ఈయనకి చంద్రబాబు అంటే ఎంత ద్వేషమో చూడండి!ఆయన బ్లాగులో పైన ప్రముఖంగా ఒక ఒపీనియన్ పోల్ ఉంటుంది "చంద్రబాబుని అరెస్టు చేయాలా?" అనే అంశం మీద!ఓటుకు నోటు కేసుకు ఈయనగారి బుర్ర అతుక్కుపోయి చంద్రబాబుని అరెస్టు చేస్తే చూడాలనీ పరారీలో చంద్రబాబు అనై వారత్ వస్తే చూడాలనీ తపించిపోతున్న మూర్ఖ ద్వేషంలో ఈయన ఉన్నాడు గానీ టెలిఫోను ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టయితే చూడాలని తపించిపోతూ ఏ ఆంధ్రా బ్లాగరయినా ఉన్నాడా?

          ఒక ప్రాంతం వాళ్ళు మమ్మల్ని దోచుకున్నారు గాబట్టి మేము వెనకబడిపోయాము,వాళ్ళని మా ప్రాంతం నుంచి తన్ని తరిమేసి మా ప్రాంతం ప్రత్యేక రాష్త్రంగా విడిపోయి మా ప్రాంతం వాళ్ళు పరిపాలిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది,వాళ్ళలా కాకుండా మేము స్వచ్చమైన రాజకీయాల్ని సాధిస్తాం,వాళ్ళలా కాకుండా మేము న్యాయంగా ఉంటాము అని బల్ల గుద్ది వాదించిన వీరాధివీరులు ఇవ్వాళ అదే రకం కుటుంబ పాలన,అదే రకం కులగజ్జి రాజకీయం,అవే రకం వలసల బలుపుతో కప్పలతక్కెడ లాంటి చిక్కురొక్కురు దరిద్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నా కిక్కురుమనకుండా ఎందుకు పడి ఉంటున్నారు,నిలదీసి అడగాల్సిన వాళ్లని అదేమని అడక్కపోగా సమర్ధించుకుంటున్నారు?ఎవరో మమ్మల్ని ద్వేషించారు,అందువల్ల మాకు బాద కలిగింది అన్నవాళ్ళు ఇంకా ద్వేషాన్ని వదలకుండా ఇంత మొండిగా ఆంధ్ర ప్రాంతపు రాజకీయ నాయకుల మీద ఎందుకు విషం కక్కుతున్నారు?

          వీళ్ళ సొంపుకీ వీళ్ళ సోయకీ వీళ్ల నాయకుడి దొంగ నిరాహార దీక్షలకీ ఏమిటి ఆంధ్రోళ్ళ దోపిడీ ఎక్కడ జరిగింది చెప్పండి అని నిలదీస్తే జవాబు చెప్పలేని దేబెతనాన్ని కప్పి పుచ్చుకోవటానికి ఆర్టికిల్ మూడు ద్వారానే కావాలి అన్నా అక్కడ కూడా అత్తెసరు మేజార్టీ ఉన్న దిక్కుమాలిన కాంగ్రెసు చేసిన ఇంకొన్ని బేవార్సు పనులతో తెచ్చుకుని ప్రజల్లో వూపు లేక వలసలకి లాకులెత్తి రాష్ట్ర పునర్నిర్మాణానికి మళ్ళీ ఆంధ్రోళ్లనే బతిమిలాడుకుంటున్న ఫెయిలైపోయిన ఉద్యమాన్ని చూసుకుని వీళ్ళు గర్విస్తూ నన్ను తెలంగాణా ద్వేషిని అని స్టాంపు కొడితే కొట్టారు గానీ మేము తెలంగాణా వాళ్ళం ఇదీ మా సంస్కృతి అని గొప్పగా చెప్పుకుని గర్వపడేలా వీళ్ళ ఉద్యమం గానీ వీళ్ళ ప్రవర్తన గానీ ఉందా?ఈ మేతావులూ ఈ మేతావులు గాలికొడుతున్న కేతిగాడూ నిజమైన తెలంగాణ సంస్కృతికి ప్రతినిధులా?వీళ్ళలో ఉన్నదే నిజమైన తెలంగాణా సంస్క్రి అయితే నిజంగా తెలంగాణ తల్లి సిగ్గు పడాల్సిందే!

          ఇంతకీ వీళ్లని కాదు అనాల్సింది,వీళ్ళ అబద్ధాల్ని బట్టబయలు చెయ్యలేని ఆంధ్రా రాజకీయ నాకకుల్ని.ముఖ్యంగా సిగ్గూ సరం లేని చంద్రబాబుని!మొదటి నుంచీ ఈ ప్రబుద్ధుడు నందమూరి తారక రామారావు లాగ స్వాభిమానం ఆభిజాత్యం అనే రెండు రెక్కలు దాల్చి ఎగిరే వైనతేయుడిలా కాక వెన్నుపోటు రాజకీయాలతో పైకొచ్చినవాడు గనక తన బుద్ధి ప్రకారమే నడుచుకుంటున్నాడు.ఎంత క్షాత్రం లేనివాడు కాకపోతే ఉద్యమ కాలంలో ఆంధ్రావాళ్ళని అన్ని తిట్టినా,రాష్ట్రం విడిపోయాక కూడా రోజుకొకసారి తనమీద విషం కక్కుతూ కేసు పెట్టి "ఇక చంద్రబాబుని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు!" అని హుంకరించిన వాణ్ణి ఇంటికెళ్ళీ బొట్టూ కాటూక పెట్టి మరీ పిలుస్తాడు?

        చీ!ఛీ!ఇంత పౌరుషం లేనివాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అనవసరం.మన ప్రాంతం వాళ్ళ శ్రమతో ఉమ్మడి రాష్ట్రపు ఆదాయంలో 45% ఒక నగరం నుంచే వచ్చేలా చేసి దాన్ని విశ్వనగరంలా నిలబెట్టి విడిపోయే నాటికి వాళ్ళని నిలవలో ఉంచి మనం లోటుబడ్జెట్ తెచ్చుకుని మన కష్టమనతా వాళ్ళ యదాన గొట్టి కట్టుబట్టలతో తరిగొచ్చాక కనీసం మానుషమన్నా నిలబడకపోతే జాతికి బతుకు దేనికి?మర్యాద మంటగలిసిపోయాక అభివృధ్ధిని ఏం చేసుకుంటాం?రోటీ,కపడా ఔర్ మకాన్ తర్వాత ముఖ్యంగా ఉండాల్సిన ఇజ్జ్జత్ పోయింది - దీనమ్మా అతి మంచితనం,ఇంకెన్నాళ్ళు! 

          ఎందుకంత గజ గజ లాడి చస్తాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే?ఏం,తలగొట్టి మొలేస్తాడా!మాటి మాటికీ విభజన సమస్యల్ని పరిష్కరించుకుందాం రా అని ఇతను పిలవడం దేనికి?అన్ని సార్లు పిల్చాడు,ఒక్కసారైనా జవాబు చెప్పాడా,లేదు - కనీసపు స్పందన కూడా లేదు!తనకి అవసరం ఉంటే ఉరుక్కుంటూ రాడా!ప్రతి విషయం లోనూ వయస్సులో అంబుభవంలో సమర్ధతలో - అన్నింటా అధికుదై ఉండి కూడా తనకన్న అల్పుడి ముందు ఎందుకీ సాగోఅరటం,చీ చీ!మర్యాదకీ మంచితనానికీ కూడా హద్దూ పద్దూ ఉండాలి,కుదరదు - వెంఠనే అమరావతి శంకుస్థాపన శిలాఫలకం మీద ఉన్న ఈ అధముడి పేరుని తొలగించి పారెయ్యాలి.ఇప్పుడున్న శిలాఫలకం మీద మార్పులు చెయ్యటం కుదరకపోతే ఆ పెరు లేకుండా కొత్తది చేయించి తీరాల్సిందే!


మరీ ఇంత మానుషం లేనివాడు పౌరుషానికి మారుపేరయిన ఆంధ్రులకి ముఖ్యమంత్రిగా పనికిరాడు!

Thursday 21 January 2016

ఏవి తల్లీ నిరుదు కురిసిన హిమ సమూహములు?లేవు నాకు ఉగాదులు ఉషస్సులు లేవు!

పెట్టుబడిదారీ విధానం - శ్రామీక వర్గ నియంతృత్వం
బ్రాహ్మణాధిక్యత - దళిత అనుకూల ప్రభుత్వం

స్త్రీక్ నిజమైన శత్రువు పురుషుడు కాదు - స్త్రీయే
కార్మిలులకి నిజమైన శత్రువులు తమలోని లుంపెన్ ప్రొలెటేరియట్లే
దళితులకి నిజమైన శత్రువులు బ్రాహ్మణులు కాదు - దళిత నేతలే
హిందువులకి నిజమైన శత్రువులు ఇతర్లు కాదు - హిందువులే

పెట్టుబడిదారు .> శ్రామికుడు = కమ్యునిజం
బ్రాహ్మణుడు -> దళితుడు = దళిత వాదం
పురుషుడు -> స్త్రీ = స్త్రీవాదం

ఆస్తికులు - నాస్తికులు
హిందువులు - ముస్లిములు
శైవులు - వైష్ణవులు
ముస్లిములు - క్రైస్తవులు
షియాలు - సున్నీలు
ప్రొటెస్టెంటులు - క్యాదలిక్కులు
కమ్యునిష్టులు - నాన్ కమ్యునిష్టులు
లెఫ్టిస్టులు - రైటిస్టులు

రోమిల్లా ధాపర్ - కమ్యునిష్టు ఎజేండాతో ఆర్య ద్రావిడ అభూత కల్పన చేసి చరిత్రకి బొక్కలు వెయ్యటం
ముప్పాళ రంగనాయకమ్మ - ఇల్లు కదలకుండా పాప్యులారిటీ తెచ్చుకోవటానికి హిందూ పురాణాల అవహేళన
కంచె ఐలయ్య - కులరహితసమాజం కోసం అనే వంకతో కులసమీకరణాల సాంకేతిక జ్యోతిష్యం చెప్పటం

ఆంధ్రా అధిపత్య వర్గాల దోపిడి - తెలంగాణ విభజన
అధిపత్య ప్రాంతం వారి జులుం - రాయలసీమ విభజన

విద్యార్ధి సంఘాలు
అరాచకవాద బీజాలు

కొన్ని వేలమంది ఈ దేశపౌరుల్ని చంపిన యాకూబ్ మెమన్ కోసం ప్రార్ధనలు చెయ్యటం
ఆ దుడుకుతనాన్ని నిరసించినందుకు సామూహిక దాడి చేసి ఆస్పత్రి పాలు చెయ్యటం

విశ్వ విద్యాలయాలు 
శవ రాజకీయాలు

ఆత్మహత్య చేసుకున్న ప్రతివాడూ దళితుడేనా?
ఉరి తియ్యబడ్డ ప్రతివాడూ అమరవీరుడేనా?
అయితే యాకూబ్ మెమన్ పేరుతో అభిమాన సంఘాలు పెట్టడం,
అతన్ని కూడా అంబేద్కర్ సరసన నిలబెట్టడం ఒక్కటే మిగిలి ఉంది.
అది కూడా చేస్తే శుద్ధక్షవరం లాంటి పతనంలో ఆఖరి దశ కూడా పూర్తవుతుంది!

దొంగలంజెకొడుకు లసలే మెసిలే ఈ ధూర్తలోకంలో
తలవంచుకు వెళిపోవడమేనా అమాయకులకి మిగిలింది?!

Tuesday 19 January 2016

అప్పుడు మన దేశంలోనే బ్రిటిషర్లు తమ క్లబ్బుల్లోకి కుక్కలతో కలిపి రానివ్వలేదు, ఇప్పుడు అమెరికా వాడు కుక్కల్ని తరిమినట్టు వెనక్కి తరిమాడు - అయినా సిగ్గు పడడం లేదు మనం!

      గత ఏదాది దిశెంబర్ 29,30వ తేదీలలో అయిర్ ఇండియా విమానంలో అమెరికా వెళ్ళిన 15 మంది తెలుగు విద్యార్ధులు అమెరికా లోని నార్త్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ అనే రెండు యూనివర్శిటెలు బ్లాక్ లిస్టులో ఉన్నాయని చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిందిగా సూచించారు అమెరికన్ అధికారులు."ఎందుకు?" అని విద్యార్ధులు ప్రశ్నిస్తే తుపాకీలు గురిపెట్టి బెదిరించారు.ఉగ్రవాదులకు వేసినట్టు చేతులకు బేడీలు వేసి గంటల కొద్ద్దీ విచారణ పేరుతో భయానక వాతావరణం సృష్టిస్తే పాపం భయంతో బిక్కచచ్చిపోయి ఎన్నో ఆశలతో అమెరికా గడ్డ మీద అడుగుపెట్టిన వారంతా నిరాశగా తిరిగి వచ్చేశారు.అమెరికా చదువు కోసం తాహతుకు మించి పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే కదా!

      పైకి బ్లాక్ లిస్ట్ అయ్యాయని సాకులు,లోపల మరేవో తీరులు."ఇండియన్ డాగ్స్ వస్తున్నా"యంటూ అవహేళనలు మరింత దారుణం!అసలు బ్లాక్ లిస్ట్ అయిన యూనివర్శిటీల నుంచి ఇక్కడికి "I20"లు ఎలా వచ్చాయి?మన దేశపు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అమెరికా ప్రభుత్వం వారు చెప్పింది చెప్పినట్టు చిలక పలుకులు వల్లించటం తప్ప స్వంతంగా విషయం కనుక్కోవడానికి గానీ విద్యార్ధులకు అండగా నిలబడి ధైర్యం చెప్పడానికి గానీ ఏమీ చెయలేదు.విద్యార్ధులు తప్పులు చెయ్యడం వల్లనే వెనక్కి పంపించామంటున్న అమెరికా ప్రభుత్వం భారత ప్రబ్భుత్వానికి అవి ఎలాంటి తప్పులో తెలియజేసిందా?I20, అమెరికా ప్రభుత్వం ఆమోదించిన వీసా,అన్ని పత్రాలూ ఇక్కడ చెక్ చేసి పంపించాక కూడా ఆఖరి నిమిషంలో చేసిన భీబత్సం వెనక ఉన్న గందరగోళం కధేమిటి?అమెరికా ప్రభుత్వం యొక్క బ్లాక్ లిస్టులో ఉన్న యూనివర్శిటీల నుంచి I20లు భారత్ లోని విద్యార్ధులకు ఎలా వచ్చాయనే దానికి తమ వైపున ఉన్న లొసుగులు కూడా కారణం కదా, ఏకపక్షంగా విద్యార్ధులనే నేరస్థులుగా నిలబెట్టి ఉగ్రవాదుల్ని విచారించినట్టు సంకెళ్ళు వేసి అనాదరణ చూపించడం దేనికి చేశారు - అడిగేదెవ్వరు?

      మన దేశ ప్రజల్లో ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంది.తెలివితేటల్లో మనవాళ్ళు అఖండమైన వాళ్ళు,ఎక్కడ నిలబెట్టినా శిఖరాగ్రం చేరుకోగలరు - కానీ నిలబడకూడని చోట నిలబడతారు.తామెక్కడ నిలబడితే తమ శక్తియుక్తులు సహజ పద్ధతిలో వికసిస్తాయో తెలుసుకోరు!ఒకడెవడో ఫలానా దేశంలో ఫలానా ఉద్యోగం చేసి లక్షలు కూడబెడుతున్నాడు అని తెలియగానే గుడ్డెద్దు చేలో పడినట్టు పొలోమని వాణ్ణి అనుకరించి వాడిలాగే మనమూ జాక్పాట్ కొట్టేద్దాం అనే దురాశతో ఎండమావుల వంటి అవకాశాల కోసం విలువైన కాలాన్ని వ్యర్ధం చేసుకుని అదీ దక్కక తమ అసలైన ప్రతిభని సానబట్టుకోలేక రెంటికీ చెడుతున్నారు!

      ఇవ్వాళ్టి అమేరికా ఒకప్పటి అమెరికా లాగ లేదు,ఇంకెంతో కాలం అది భూతలస్వర్గం హోదాని నిలబెట్టుకోలేదు.ఇప్పటికే ఉద్యోగ కల్పన విషయంలో ఎక్కడెక్కడి వాళ్ళూ అక్కడికే పరుగులు పెట్టడం వల్ల విపరీతంగా ఉబ్బిపోయి పగలడానికి సిద్ధంగా ఉన్న బెలూన్ మీద ఇంకా ఆశపడి ప్రయోజనం లేదు!వాళ్ళ ఆలోచనా ధోరణులు కూడా కర్కశంగా మారడం సూచనాప్రాయంగా తెలుస్తున్నది.అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ నోటికేది తోస్తే అది మాట్లాడుతున్నాడు, బ్రిటిష్ ప్రధాని కామెరూన్ లండనులో ఉండాలంటే ఇంగ్లీషు నేర్చుకోవాల్సిందే అంటున్నాడు!పైకి క్లీన్ షేవ్డ్ మొహాలతో త్రీ పీస్ సూట్లతో  చెక్కు చెదరని నవ్వుల్తో పెదవి చివరి మర్యాదల్తో టైలర్ మేడ్ జంటిమన్లుగా కనబడుతున్నా వాళ్ళంత జాత్యహంకారులు ఈ భూప్రపంచం మీద ఇంకెవ్వరూ లేరు.వాళ్లకి పాప్యులారిటీ కూడా పెరుగుతున్నది, అంటే ఈ ట్రెండు తగ్గే సూచనలు నాకైతే కనబడ్డం లేదు!

      భారతీయులు చిన్నప్పుడు మనం చదువుకున్న మూడు చేపల కధలో మొదటి చేపలా వ్యవహరించే కాలం దాటిపోయింది,కనీసం రెండవ చేపలా అయినా వ్యవహరిస్తారా!ఒక రూపాయి ఖర్చుతో పది రూపాయలు సంపాదించాలంటే కండల్ని కరిగించి శ్రమించాలి, ఒక రూపాయి ఖర్చుతో వంద రూపాయలు సంపాదించాలంటే తెలివిగా వ్యాపారం చెయ్యాలి,ఒక రూపాయితో కోటి రూపాయలు సంపాదించాలంటే అదృష్టాన్ని నమ్ముకోవాలి,ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా అష్టైశ్వర్యాలు దక్కాలంటే ముదనష్టంగానే రావాలి - భారతీయులు దేన్ని కోరుకుంటున్నట్టు?మెకాలే తమ ప్రభుత్వపు అవసరం కోసం ప్రవేశపెట్టిన క్లర్కుల్నీ ఉద్యోగుల్నీ మాత్రమే తయారు చెసే విద్యా విధానం గురించి గానీ ఇంగ్లీషు భాష గొప్పదనం గురించి గానీ చింకి లెక్చర్లు దంచే మేధావులు వీలయినంత త్వరగా తమ భ్రమల్ని వదిలించుకుంటే దేశానికీ యువతకీ భవిష్యత్తుకీ చాలా మంచిది!మితిమీరిన ఆంగ్లభాషావ్యామోహంతో ఉన్న ఈ మేధావులు మాతృభాషలో విద్యాబోధన యొక్క సానుకూలతల్ని గుర్తించలేకపోతున్నారు.ఇంగ్లీషు పట్ల వ్యామోహాన్ని వదిలేసి మొదట మాతృభాషని క్షుణ్ణంగా నేర్చుకుంటే దానితో అనుసంధానం చేసుకుని ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫ్రాన్సు వెళ్ళవచ్చు,జర్మన్ నేర్చుకుంటే జర్మనీ వెళ్ళవచ్చు,జపనీస్ నేర్చుకుంటే జపాన్ వెళ్ళవచ్చు - పపంచం నలుమూలలకీ విస్తరించగలిగే అవకాశం వస్తుంది!సంస్కృతుల పరంగా చూసినా భారతీయ సంస్కృతి పట్ల గౌరవం అమెరికాలో కన్నా పై దేశాలలోనే ఎక్కువ.మనకి గౌరవం దక్కే చోటుకి పోకుండా మనని అవమానించే చోటుకి ఎందుకు వెళ్ళటం?

      మన దేశంలోని కుల వ్యవస్థలో ఒక తమాషా ఉంది.తాము కింది కులాల వాళ్ళ కన్న అధికులం, తెలివైన వాళ్ళం,సంస్కృతి కంతా పట్టుగొమ్మలం అనుకునే ఉన్నత కులాల వారే మొదటి రోజు నుంచీ చివరి రోజు వరకూ ఇంగ్లీషు వాళ్ళకి వూడిగం చేశారు!ఇంగ్లీషు వాళ్ళు తమలో తాము క్లబ్బులు పెట్టుకుని "DOGS AND INDIANS ARE NOT ALLOWED" అని బోర్డులు పెట్టుకున్నా చీమ కుట్టినట్టు కూడా ప్రతిస్పందించ లేదు ఈ విజ్ఞాన తేజోరాశులైన బ్రాహ్మణ శ్రేష్టులూ పౌరుషం మూర్తీభవించిన రాజాధిరాజులూ!ఈ బోడి సత్యాగ్రహాలకి స్వతంత్రం రాదనుకుని ఆఖరు నిముషం వరకూ పోరాటాన్ని వ్యతిరేకిస్తూ ఇంగ్లీషువాళ్లకి మిత్రులుగా గడిపి ఇంక స్వతంత్రం వచ్చేస్తుందనుకున్న వెంఠనే ముందుకు దూకి అధికార మార్పిడిలో తామే పైన ఉండేలా చూసుకున్నారు - కులము గల్గువాడు,గోత్రంబు గల్గువాడు,విద్య చేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిసకొడుకులు అని వేమన్న వూరికే అన్నాడా!ఇప్పటి దళిత మేధావులు కూడా నిన్నటి రోజున ఆ అగరవర్ణాల వారు ఏమి చేశారో అదే పద్ధతిని పాటిస్తూ వారినే ఇమిటేట్ చేసి వారి స్థానంలోకి వెళ్ళడానికే చూస్తున్నారు తప్ప తమకంటూ సొంతదారిని వెతుక్కుని ముందుకు వెళ్ళగలిగే కీలకం గ్రహించటం లేదు.ఇప్పటికీ ఉద్యోగాల మార్కెట్టులో సింహభాగం ఇంగ్లీషుకు ప్రాధాన్యత ఉన్న మంచి స్కూళ్ళలో కాలెజిలలో చదువుకుని వచ్చే డబ్బున్న అగరవర్ణాల పిల్లలదే హవా!వారితో పోటీ పడాలంటే వారికంటే మరింత వేగంగా కదిలితేనే గానీ వారికన్నా ముందుకు పోవటం సాధ్యపడదు కింది కులాల నుంచి కొత్తగా పోటీలో ప్రవేశిస్తున్న వాళ్ళకి!అదే,మాతృభాషలో చదువుకోవడం వల్ల ఈ అధికశ్రమ అవసరం ఉండదు,ఒత్తిడి ఉండదు,వెనుకబాటు తనమూ ఉండదు!

      మొత్తం ప్రాధమిక విద్య అంతా మాతృభాషలోనే జరగాలి.తర్వాత ఇప్పటిలా మూడు నాలుగు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు,సెకండ్ లాంగ్వేజిగా హిందీ,ఇంగ్లీష్,జపనీస్,ఫ్రెంచ్ లాంటివాటి కన్నిటికీ ఒకే రకం ప్రాధాన్యత ఇచ్చి విద్యార్ధుల్ని ఏదో ఒక్కటి మాత్రమే తీసుకుని అందులోనే ప్రావీణ్యత సంపాదించమంటే సరిపోతుంది.అప్పుడు ఆ ఒక్క భాషనీ మాతృభాషతో అనుసంధానించి నేర్చుకుంటే ఆ భాషతో ఎక్కడ నెగ్గగలిగీతే అక్కడికి వెళ్ళే విధంగా విద్యార్ధుల్ని తీర్చిదిద్దితే తప్ప ఒక్క ఇంగ్లీషునే నేర్చుకోవడం ఇంగ్లీషు పనికొచ్చే చోటనే అందరూ గుమిగూడటం అనే దరిద్రం పోయి మనవాళ్ళు ప్రపంచం నలుమూలల్లో ఎక్కడయినా నెగ్గుజురాగలిగే విధంగా తయారవుతారు.ఇది సాంకేతికంగా కూడా విద్యార్ధుల మనస్సు మీద పోటీకి సంబంధించిన ఒత్తిడిని తగ్గిస్తుంది,మౌలికంగా దేశపు సంస్కృతి పట్ల గర్వాన్ని పెంచుతుంది.ప్రభుత్వాలకి కూడా ఉపాధి కల్పన ఇప్పటిలా రొడ్డకొట్టుడుగా చేసి భంగపడకుండా కొత్తదారుల్ని వెతికే ఉత్సాహాన్ని ఇస్తుంది.మనం ప్రపంచానికి తిట్టించుకుని వెనక్కి వచ్చే అసమర్ధుల్ని గాక ఎక్కడి కెళ్ళినా అక్కడివాళ్ళు కళ్ళకద్దుకుని స్వీకరిస్తూ మన దేశపు సంస్కృతికి దర్పణాలుగా నిలిచే దమ్మున్న కుర్రాళ్లని సమర్పించాలి!"I am a westerner with a deep respect for your vedantic philosophy.It pains me to see the erosion of sanatana dharma in Bharat.You must keep these values alive because it is the only hope for our entire planet!When all righteousness dies in the world,We will have to live in calamities. I can see the effects of adharmic living in the west,loss of meaning,depression,addiction,materialism and suicide!Use your innate indian intelligence to see where western values will ruin india just as they are corrupting the whole world.Even the things you crave that are shown in the westernmedia are not real.We are not glamorous,educated,sexy,people like the media shows.Come to the west and you will see lonliness,despair and terrible poverty as well!Hollywood is a propaganda machine  for the west and does not show the truth.The truth is a society that is ruled by greed and lust and is consuming all its treasures to become an ugly place of sterile parking lots and megastores.We go to india to find relief from the depression and ugliness here. In india people are still alive while in the west we are slowly becoming vegetables in front of our electronic devices.hold on to your values and have faith that india's value is its values!"  - ఇది Rose Kerekes అనే ఒక విదశీ వనిత భారతీయులకి ఇస్తున్న సలహా, ఎంత చక్కగా చెప్పింది!

      కానీ మన దేశంలోని వాతవరణం చూస్తే ఇప్పట్లో ఆ దిశగా అడుగు పడుతుందనే ఆశ నాకేమాత్రం కలగడం లేదు."జాతుల్సెప్పుట,మృషల్ సంధించుట,అన్యాయ విఖ్యాతింబొందుట,కొండెకాడవుట - అన్నియు పరద్రవ్యంబు నాశించి" అని ఒక కవిగారు ఇవ్వాళ మనవాళ్ళు చేస్తున్న వెధవ పనులన్నిట్నీ కూలంకషంగా వర్గీకరించి మరీ చెప్పాడు!నీ జాతి వేరు వాడి జాతి వేరు వాడు నిన్ను దోచుకు తినాలని చూస్తున్నాడు నువ్వు వాడితో కలవకు అని ఎవరు చెప్పినా 90 శాతం మందిని ఒక్కటిగా కలవనివ్వకుండా కలిసి ఆలోచించనివ్వకుండా కన్ఫ్యూజ్ చెయ్యటానికీ,వాళ్ళనా కన్ఫ్యూజన్ లోనే ఉంచి వాళ్ళమీద అధికారాన్ని 10 శాతం మాత్రమే ఉన్న తమ దగ్గిరే ఉంచుకోవటానికీ, ఆ అధికారాన్ని ఉపయోగించుకుని మందిసొమ్మును దిగమింగటానికీ మాత్రమే చేస్తారు.తనకి 100 కోట్లు విలువ చేసే కాంట్రాక్టును దఖలు పరిస్తేనే అక్కడి అధికారికి ఒక కోటిని మృషగా సంధిస్తారు.తమకు లేని గొప్పదనాన్ని ఉన్నట్టు భ్రమింపజేసే ప్రబుద్ధులు ఆ పని వూరికే చెయ్యరు - చాటుగా ఆ పేరుని సొంత సంపాదనకి ఉపయోగించుకుంటారు.వాడు మంచివాడు కాదని పక్కవాడి గురించి పైవాళ్ళకి కొండేలు చెప్పేవాళ్ళు అవతలి వాడికి పైవాళ్ళు ఇచ్చేదాన్ని తమకి ఫిరాయించుకోవడానికే ఆ పని చేస్తారు.ఇవన్నీ చెప్పి "ఈ శ్రీ తానెన్ని యుగంబు లుండగలడో శ్రీ కాళహస్తీశ్వరా!" అని నిట్టూర్చాడు.అలా నిట్టూర్చడంలో స్వామీ నాకు మాత్రం ఆ పాడుబుద్ధులు కలగనియ్యకు అని వేడుకోవడం ఉంది!ఎందుకంటే పైన చెప్పిన వెధవపనులు నిన్నటిరోజున చేసినవాళ్ళు ఇవ్వాళ్టిరోజున చేస్తున్నవాళ్ళు రేపటిరోజున చేసేటివాళ్ళు  ఎవరో ఎక్కడుంటారో ఎలా బతికారో ఎప్పుడు చచ్చారో ఎవరికీ తెలియదు.కానీ కొందరు ప్రాతస్మరణీయుల్ని దేశకాలప్రాంతభాషాదుల్ని పట్టించుకోకుండా గుర్తుంచుకుంటున్నామే, వాళ్ళు మాత్రం అట్లాంటి వెధవ పనులు చెయ్యకుండా మరో విధంగా బతకడం వల్లనే మనకి గుర్తుకొస్తున్నారు - అయితే ఇవ్వాళ వాళ్ళే నిజమైన మైనార్టీ అయిపోయారని తెలిస్తే చాలా నిర్వేదంగా ఉంటుంది?!

      పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు,పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదు అన్నట్టు సొంతంగా పూనుకుని ఏదైనా చేస్తే అది కాస్తా ఎదురుతంతే అభాసుపాలవుతామని జనం గట్టిగా అడిగితే గానీ చెయ్యని జడత్వం ప్రభుత్వంలో ఉంది,తమకేం కావాలో తెలియని అజ్ఞానం వల్ల అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడుతూ సొంతంగా ఆలోచించి సరైన పరిష్కారం కోసం డిమాండు చెయ్యని బద్ధకం ప్రజల్లో ఉంది.టపటపా స్కూళ్ళూ కాలేజిలూ సాంక్షన్ చేయించేసుకుని బొట్లేరింగ్లీషు టకటకా చదివేసి ఉన్న పది ఉద్యోగాలకి వంద మంది పోటీ పడితే ఎంత గింజుకున్నా పదిమందికే ఉద్యోగాలు వస్తాయి.ఆ పదిమందీ కాలరెగరేస్తూ పోటుగాళ్ల మాదిరి పోజులు కొడుతున్నారు.మిగిలిన 90 మందిలో మా కులానికి రిజర్వేషన్ శాతం పెంచితే గానీ తమకు మరిన్ని ఉద్యోగాలు రావని కొన్ని కులాల వాళ్ళూ వాళ్ళకి పెంచితే మా వాటా తగ్గుతుందని కొన్ని కులాల వాళ్ళూ కొట్టుకు చావడమే తప్ప కలిసి కూర్చుని తెలివిగా ఆలోచించి సమస్యకి మూలం చూసి సరైన పరిష్కారం కోసం ప్రయత్నించాలనే సద్బుద్ధి లేదు.

ఒకసారి రాగింగులో సీనియర్లు ఆరవ వేదం అంటే ఏమిటి అని అడిగారు - నేను నిర్వేదం అని చెప్పాను!

Thursday 14 January 2016

ఈ మురమ్నా భక్తుడికి అర్ధవంతమైన చర్చలు కావాలట!నేను అడిగిన సూటి ప్రశ్నలని పబ్లిష్ చేసి జవాబు చెప్పడేంటి?నా కామెంట్లలో నన్ను తిట్టడానికి పనికొచ్చేవి మాత్రమే పబ్లిష్ చెయ్యడం ఏమి సంస్కారమో?!

      అనగనగా ఒక బ్లాగు పేరు "వేణువు",బ్లాగరు తన పేరు "వేణు"కి "వు" చేర్చి పెట్టుకున్నాడు.పేరు చాలా సుకుమారంగా ఉంది కానీ అక్కడ వినబడే రాగాలు మాత్రం కర్ణ కఠోరమైనవి.ఆయన నాస్తికుడు.ముప్పాళ రంగనాయకమ్మకి వీరాభిమాని.నాస్తికుడిగా ఉండటంలో తప్పు లేదు,తనకి నచ్చిన రచయితని విపరీతంగా ఆభిమానించటమూ తప్పు లేదు = తన అభిమానాన్ని ప్రకటించుకోవటానికి ఇతర్లని పనిగట్టుకుని నొప్పించనంతవరకూ తన ఆభిమాన రచయితకి వీరపూజలు చేసినా అది అతని స్వంత విషయం కాబట్టి ఎవరూ తప్పు పట్టాల్సిన పని లేదు!అయితే, ఎవరయినా వ్యక్తి చనిపోయినప్పుడు "మా చచ్చిన గేదె కొమ్ములు చారెడు" అన్న సామెత ప్రకారం చనిపోయింది గర్భశత్రువైనా అతని గురించి అవాకులూ చెవాకులూ పేలడు సంస్కారం ఉన్నవాడు,ఎంత చెడ్డా పోయిన వాణ్ణి ఏం తిడతాం అని వెతికి వెతికయినా రెండో మూడో మంచి మాటలే చెప్తాడు,లేదంటే నాకతని గురించి తెలీదు నన్నడక్కండని తప్పుకుంటాడు.కానీ ఈయన బాపు చనిపోయినప్పుడు ఒక పోష్టు వేశాడు.బాపు బొమ్మలు బాగుంటాయి,శ్రీ శ్రీ కవితలక్కూడా బొమ్మలు వేశాడు అని మెచ్చుకుంటూనే విషవృక్షానికి బొమ్మలు వెయ్యడానికి మురంనా చెక్కు పంపిస్తే "రామ రామ" అని రాసి తిప్పి పంపడం గురించి ఎత్తుకున్నాడు - అసలు జరిగింది ఏమిటి అని సాగదీస్తూ.భాషలో బూతులు లేవు గాబట్టి తను సంస్కారం గలవాడినే అని ఈయన అభిప్రాయం అన్నమాట!కొందర్ని గురించి "వాడు నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించే రకం" అంటాం గదా,మరి ఆ మనిషి నవ్వుతున్నాడు గాబట్టి అతని మాటలు వెక్కిరింత కాదు అని అంటాడా ఈయనగారు?

      వెనకాల రాయడంలో తప్పేమి వుంది?బాంకు వాళ్లే ఇప్పుడు ఫోను నంబర్లు అవీ రాయమంటున్నారుగా! ఒకసారి ఒక వ్యక్తికి పంపించిన చెక్కుని గానీ డీడీని గానీ మరొక వ్యక్తికి పంపించటం కుదురుతుందా?అతను స్వీకరించనప్పుడు అదెటూ చెల్లనిదే అవుతుంది గదా!జాలి పుట్టి తన జాలిని వ్యక్తీకరించటం కోసమే అలా రాశాను అన్నప్పుడు ఇంక గొడవముంది?రంగనాయకమ్మ గారికి నచ్చింది ఆమె ..రాసుకున్నారు బాపు గారికి నచ్చింది ఆయన రాసుకున్నారు .తను రిజెక్ట్ చేయడానికి తను రయాల్సింది రాసారు .... దానికి అబ్యంతరం ఈయనకి ... ఎందుకు!!ఒక డీడీ.దానిని బాపుగారు తిరస్కరించారు. ఆయన కారణాలు ఆయనవి.డీడీ పంపిన రంగనాయకమ్మగారు విషవృక్షం ఎందుకు వ్రాసారు? ఆవిడ కారణాలు ఆవిడవి.ఒక డీడీని ఒకవ్యక్తికి పంపాక అది అందుకున్న వ్యక్తి స్వంతమే అవుతుంది. దానిని ఆయన ఏమైనా చేసుకోవచ్చును. బ్యాంకువారు తిరస్కరించే ప్రమాదం లేని విధంగా వీలైతే ఏదన్న వ్రాయవచ్చును కూడా దాని మీద. దానిని కళ్లకద్దుకుని సొమ్ము చేసుకోవచ్చును. పటం‌ కట్టుకుని దాచుకోవచ్చును. లేదా దానిని చించి పోగులు చేసుకోవచ్చును. ఇతరులకు విమర్శించటానికి ఏమీ లేదు. చివరికి డీడీ ఇచ్చిన వారు కూడా ఇక్కడ ఇతరులే. అలాగే సదరువ్యక్తి దానిని తిప్పి పంపవచ్చును - ఐనా అది అది ఎవరిపేరున ఇవ్వబడిందో వారి ఆస్తి మాత్రమే. అది వద్దని తిరస్కరించే హక్కుంది కదా. తిరస్కరించి చెల్లకుండా చేయకూడదని అనలేరు. అలాగే ఆ డీడీ మీద ఏమీ వ్రాయకూడదని రూలేం లేదు - దాని స్వంతదారు ఇష్టం ఈ‌ విషయంలో. ఏమీ వివాదం లేదిక్కడ.‘రామదాసు గుణం వ్యక్తపరచుకున్నాడు’అంటే, బాపు గారు ‘రామదాసు’ అని తెలిసే ఆవిడ పంపిందన్నమాట. బాపుగారు చేసిన తప్పేమీ లేదు. టిట్ ఫర్ టాట్. అచ్చతెలుగులో చెప్పాలంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ. బాపు గారు చేసింది తప్పనే మీ వాదన నిజమైతే.. ఆయన ‘రామదాసు’ అని తెలిసి కూడా అడగడం ఆవిడ తప్పు. ఈయన్ది తప్పనే ముందు ఆవిడది తప్పని ఒప్పుకోవాలి.ఇంత స్పష్టంగా ఉన్నదాన్ని కూడా వివాదాస్పదం చేశాడు.ఆఖరికి అక్కడ విమర్శలన్నీ తను తిరిగి సమర్ధించుకోలేననత గట్టిగా ఉండటంతో తగ్గిపోయి "ఒక వివాదాస్పద విషయం మంచి చెడులను చర్చించుకోవటానికి ఆ వివాదంలోని వ్యక్తులు సజీవంగా ఉన్నారా లేదా అనేదానితో నిమిత్తం లేదనేది నా దృఢాభిప్రాయం. దీనిలో చనిపోయినవారిని హేళన చేయటంలాంటిదేమీ లేదు!" అంటూనూ "బాపు వెటకారాలను ప్రస్తావించి విమర్శించారు కాబట్టి రంగనాయకమ్మ- తాను వ్యంగ్యం లేకుండా ఆ ముఖచిత్ర వివరణ రాసివుండాల్సింది. నిజమే! దీన్ని నేను ఈ పోస్టులోనే రాసివుంటే పోస్టు ఇంకా బాగుండేది. అంటూనూ సరిపెట్టేశాడు!

      మురంనా ఈ మధ్యనే రాసిన ఇదండీ భారతం గురించి ప్రచారం చేసుకోవటానికి "మహాభారతం నాకెంతో ఇష్టం.. మరి ఇప్పుడు?పేరుతో ఒక పోష్టు వేశాడు.అందులో ఈయనగారి అభిమాన రచయిత్రి లాగే తలా తోకా లేని వాదనలు చేశాడు.అందులో ఆ మేధావి రచయిత్రి లాగి చూపించిన "వాళ్ళు యుద్ధం చేసింది , తమ రాజ్యం కోసమే. దానినే తను తీసుకుని, కౌరవుల రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికే ఎందుకు పట్టం కట్ట కూడదు?అనే పిచ్చ రీజనింగు చదివి నాకు నిజంగా మతిపోయింది:-)ధర్మరాజుని అందరూ రేపటి రోజున రాజు కావలసిన వాడని తీర్మానించి యువరాజుగా ఒప్పుకున్నాకనే ధృతరాష్ట్రుడు మావాడితో గొడవగా వుంది మంచివాడివి గదా గొడవ లేకుండా నువ్వు కొంచెం వేరేగా వెళ్ళీ సర్దుకుపొమని బతిమిలాడుకుంటే పెదతంద్రి గదా అని అతని మాటకి మర్యాద ఇచ్చి దూరంగా పోయాడు,పంపించటం కూడా దిక్కూ దివాణం లేని చోటికి పంపించినా ఖాందవదహనంతో మయుడు గొప్ప రాజధాని కట్టి ఇస్తే తన బతుకు తను బతుకుతుంటే రెండుసార్లు ద్యూతక్రీడకి పిల్చి ఓడించి దాన్ని కూడా లాక్కుని సాక్షాత్తూ శ్రీకృష్ణుణ్ణే రాయబారిగా పంపించి అయిదూళ్ళు ఇచ్చినా చాలంటే సూది మొనమోపినంత భూమి కూడా ఇవ్వననడం వల్ల జరిగిన యుధ్ధానికి బల్లే రీజనింగు లాగిందిగా?

      ఈ పాదరేణువు కూడా "ధర్మరాజు తమ అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశాడు. గెలిచినపుడు ధర్మాత్ముడైతే అర్థ రాజ్యమే తీసుకుని, మిగిలిన అర్థరాజ్యం ఇంకా బతికున్న ధృతరాష్ట్రుడికి ఇచ్చివుండాల్సింది. ఈ వాదనలో తర్కమే కాదు, న్యాయం కూడా ఉంది. మాయాద్యూతం, దుర్యోధనుడి దుష్టత్వాలతో సంబంధం లేకుండా జవాబు చెప్సాల్సిన ప్రశ్న ఇది. మీకు తోచిన వాదన మీరు చేయండి. అంతేగానీ- ‘బల్లే రీజనింగు లాగిందిగా?’ అంటూ అమర్యాదగా ప్రస్తావిస్తూ రాస్తే అది మీ వైఖరినే బయటపెడుతుంది!" అని నిలదీస్తున్నాడు,అర్దవంతమయిన చర్చలు చేస్తాననే మేధావి వివేకం అట్లా ఉంది,ఏం చేస్తాం?బుద్ధిగానే అడుగుతున్నాడు గదా అని వివరంగానే జవాబు చెప్పాను:

1).మీ తాజా వ్యాఖ్య: ధర్మరాజు తమ అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశాడు. గెలిచినపుడు ధర్మాత్ముడైతే అర్థ రాజ్యమే తీసుకుని, మిగిలిన అర్థరాజ్యం ఇంకా బతికున్న ధృతరాష్ట్రుడికి ఇచ్చివుండాల్సింది. 

Ans:

అసలు గుడ్డివాడికి రాజ్యార్హత లేదు.అక్కడి క్రైటేరియాలు:ఇతర్ల మీద ఆధారపడి బతికేవాడు,దీర్ఘరోగం వుండి యెప్పుదు చస్తాడో తెలియని వాడు ప్రభువుగా వుండటానికి ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ కూడా యెవరూ వొప్పుకోరు.పెద్దవాడు కుళ్ళి చస్తాడని జాలి పడి ఇప్పటి మన దేశపు రాష్త్రపతి లాగా హానరరీ పోష్తు మాత్రమే ఇచ్చాడు దయదల్చి.అది కధలో స్పష్టంగానే వుంది.ఇంకా గట్టిగా పరిశీలించి చూస్తే ఇప్పుడు రాష్ట్రపతికి ఉన్నపాటి చిన్న చిన్న అధికారాలు కూడా ధృతరాష్ట్రుడికి లేవు.పేరుకే ధృతరాష్ట్రుడు రాజు తప్ప పరిపాలాన్ మొత్తం పాండురాజు చహెతి మీదగానే జరిగింది పాండురాజు బతికి ఉన్నంతవరకూ.పాండురాజు చనిపోగానే పాంవుల్ని రాజధానికి రప్పించి ధర్మరాజుని యువరాజుగా ప్రకటించేశారు!

తనకి రాజ్యం అర్హతగా లేదు కాబట్టే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడ్ని మాటిమాటికీ నీ శక్తి కొద్దీ ప్రయత్నించు నేను అన్ని విధాలా సాయపడతాను,పబ్లీకున ఇట్టా మాట్టాదితే తిట్టిపోస్తారు గాబట్టి భీష్ముడూ ద్రోణుడూ వాళ్లతో నేను మాట్లాడేవి పట్టించుకోకుండా చాటుగా నువ్వు చేసేది చెయ్యి అని రెచ్చగొట్టటం కూడా కధలో స్పష్తంగానే ఉంది.మంచిగా అడిగినప్పుడు తనకి అయిదూళ్ళు కూడా ఇవ్వనన్నాక జరిగిన యుధంలో గెలిచినవాడు అహంకారంతో కన్నూ మిన్నూ గానకుండా యుద్ధం చేసి ఓడిపోయినవాడి మీద మంచితనం చూపించాలా?గెలిచింది హస్తినాపురాన్నే.అది ఒకనాడు హక్కుగా దఖలు పడినా మంచితనంతో వదులుకున్నదే.ఇంకెందుకు దాన్ని ధృతరాష్ట్రుడి కిచ్చి తను వేరేగా పోవటం,బుర్రతక్కువ మాటలు కాకపోతే!

రాజ్యార్హ్త లేనివాడికి తనకి హక్కుగా వున్న రాజ్యాన్ని ఇవ్వడమేమిటి?సాంకేతికంగా తనకి హక్కు లేని దాన్ని కబళించడానికే రెండు సార్లూ ద్యూతం నడిపాడు దుర్యోధనుడు!

2). మీకు తోచిన వాదన మీరు చేయండి. అంతేగానీ- ‘బల్లే రీజనింగు లాగిందిగా?’ అంటూ అమర్యాదగా ప్రస్తావిస్తూ రాస్తే అది మీ వైఖరినే బయటపెడుతుంది! 
Ans:

మీ అభిమాన రచయిత్రి కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పి వూరుకోలేదుగా?అబధ్ధాలు రెందు రకాలుగా చెప్పొచ్చు!రామాయణం విషయంలో లేనిది కల్పిస్తే తిరిగి తనకే తిట్లు రావదంతో ఇక్కడ మరొక ట్రిక్కు - వున్నదాంట్లో తను వెక్కిరించటానికి పనికొచ్చేవి మాత్రమే వున్నాయని చెప్పటం?

వ్యాసుడు ఒక విషయం గురించి పది మాలు చెప్తే తను విమర్శిస్తున్న వాట్ని పూర్వపక్షం చేసే విషయం అక్కద వున్నా దాన్ని కావాలనే వొదిలెయ్యటం కూడా నిక్షక్షపాతంగా చేసిన విమర్సే అవుతుందా?

మీకు నచ్చిన వాళ్ళు యెట్లాగయినా మాట్లాడవచ్చు గానీ మీకు నచ్చని వాళ్ళు మాత్రం జాగ్రత్తగా మాట్లాదాలి,బాగుంది మీ వరస?!

      ముందే "నేను అసలు భారతం వ్యాసుడు రాసినా సరె రంగనాయకమ్మ చెప్పేదే నమ్ముతాను" అనే ధోరణి ఉన్నవాడికి తప్ప ఇందులో నా వాదన న్యాయమే అనిపిస్తుంది.కానీ "ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత ఉందా లేదా అనేది వేరే చర్చ అవుతుంది" అంటున్నాడు!అదెట్లా కుదురుతుంది?దృతరాష్త్రుడికి రాజ్యార్హత వుందా లేదా అనేది వొదిలేసినా అది వేరే విషయమయినా తను ఈ పాయింటు పట్టడం కూడా అనవసరమే అవుతుంది,అది తెలుసా?అసలు ముఖ్యమయిన పాయింటే అది!ధర్మరాజు తన రాజ్యాన్నే తను గెల్చుకున్నాడు.దృతరాష్త్రుడు మంచితనం కొద్దీ వొదిలేసే ప్రసక్తి లేదు అక్కడ!నేను రాజుని కాలేకపోయాను,నువ్వు రాజు కావటానికి యేది చేసినా నా సపోర్టు వుంటుందని యెక్కేసిన దృతరాష్ట్రుదు అంత న్యాయంగా ఆలోచించగలడా? తనకి హక్కుగా వున్నదాన్ని కూడా పెదతండ్రి అనే గౌరవంతో వొదులుకున్నా అక్క కూడా ప్రశాంతంగా తన బతుకు తను బతకనివ్వకుండా ద్యూతం ఆడించి అడవులకి తరిమితే తిరిగి తన రాజ్యాన్ని తను ధీమాగా యుధ్ధం చేసి సాధించుకుంటే ఇంక దృతరాష్త్రుడు తనమీద దయదల్చి ఇవ్వటం తను దృతరాష్ట్రుడికి తన రాజ్యాన్ని తనకి ఇవ్వటం యేమిటి అర్ధం లేకుండా?

      తనకి ధర్మసూక్ష్మాలు కూడా తెలిసిన పాండిత్యం ఉందనుకుంటూ "తన రాజ్యం అర్థరాజ్యమే. యుద్ధం చేసింది దానికోసమే; పూర్తి రాజ్యం కోసం కాదు. ధర్మాచరణ ఉన్నవాడైతే గెలిచాక అర్థ రాజ్యమే తీసుకోవాలి. ఈ సూక్ష్మం మీకు బోధపడకపోతే వదిలెయ్యండి." అని నాకు కవుంటర్లు వేస్తున్నాడు."యెందుకు వొదిలెయ్యాలి.1).మీకు అసలు దృతరాష్త్రుడికే రాజ్యార్హత లేదు అనే సూక్ష్మం బోధపడటం లేదు.మీకు బోధపడనివన్నీ వొదిలేసి మీకు అర్ధమయ్యే వాటిని మాత్రమే పట్టించుకుంటారా?2). అక్కడ ధర్మరాజు యుధ్ధంలో ఓడించిన భీష్మ ద్రోణ కర్ణాదులు యే రాజ్యం తరపున యుధ్ధం చేశారు?హస్తినాపురం తరపునే కదా?ధర్మరాజు గెలిచింది హస్తినాపురాన్నే కదా? అయిదూళ్ళిస్తే యుధ్ధం చెయ్యను అంటే సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వను అని తెగేసి చెప్తే కదా యుధ్ధం జరిగింది!ఇంకా దృతరాష్ట్రుడు దయతల్చి ఇవ్వడం అంటే యేమిటో ధర్మరాజు దృతరాష్ట్రుడు ఇస్తేనే తీసుకోవడం అంటే యేమిటో వివరిస్తారా?" అని చాలా ఓపిగ్గా అడిగాను.దీనికి తాంబూలాచిచ్చేశాను తన్నుకు చావండి అన్నట్టు "పాండవులూ - అర్థరాజ్యం- యుద్ధం- ఈ విషయంలో నేను చెప్పదల్చినవి ఇప్పటికే చెప్పేశాను. మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు." అనే జవాబు చెప్పి ఇంక నేను చెప్పగిలిగింది లేదు అని తేల్చి పారేశాడు.యుద్ధంలో గెలిచిన వాడు ఓడిపోయిన వాడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఓడిపోయిన శత్రువు ఒప్పుకుంటేనే కొత్త రాజ్యానికి రాజవటం, అట్లా కాకుండా ఓడిపోయింది నా సైన్యం నేను కాదు ఠట్ నా రాజ్యం నీకివ్వనంటే గెలిచినవాడు దడుచుకుని తన పాత రాజ్యానికి తను పోవటం ప్రపంచ చరిత్రలో ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా జరిగిందా?ఇంకా నయం, ఈయన గనక పాకిస్తానుతో భుట్టో హయాములో జరిగిన యుద్ధం అప్పుడు ప్రధానిగా ఉండుంటే మన సైన్యం గెల్చినాక కూడా భుట్టోని నిర్యుద్దసంధికి ఒప్పించకుండా ఆ మహానుభావుడి రాజ్యం ఆయనకి అప్పగించేసి సైన్యాన్ని చెవులు దులుపుకుంటూ వెనక్కి రమ్మనే వాడు కాబోలు,భగవంతుడి దయ వల్ల అప్పుడీ పెద్దమనిషి ప్రధానిగా లేడు:-)"అంటే దానర్ధం యేమిటి?యుధ్ధంలో గెలిచాక కూడా ఓడినవాడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఓడినవాడు దయదల్చి ఇచ్చినంత మటుకే తీసుకోవాలి అనా మీ తీర్పు?తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండి అన్నట్టుగా నేను చెప్పాల్సింది చెప్పేసాను అనే కాడికి మీ అభిప్రాయాలు చెప్పండి,వాదించండి అని ఆహ్వానాలు యెందుకో?!ఆ ముక్క ముందే చెపితే మాకీ చెతుల నెప్పులెందుకు?మీ అభిప్రాయాల్ని వాదనగా వినిపించండనే మాట యెందుకు?ఈ జవాబు మీరు పబ్లిష్ చెస్తారో చెయ్యరో తెలియదు- ఒకటి మాత్రం అర్ధం చేసుకోండి!పాయింటు గట్టిగా వుందా లేదా అనేది తేల్చకుండా ఒకసారి చెప్పేశాను,మళ్ళీ మళ్ళీ చెప్పను అనడం సరయిన వాదనా పధ్ధతి యేనా?" అని నేనూ గట్టిగానే నిలబడ్డాను..దీనికాయన ఇంకా తెలివితక్కువ రీజనింగు లాగాడు:"పాండవులు తమ హక్కు అయిన అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశారు కాబట్టి, యుద్ధంలో గెలిచాక అర్థరాజ్యం మాత్రమే తీసుకోవటం న్యాయం అంటే దానిలో సముచితం కానిదేమీ లేదు. కానీ ఈ పాయింటును మీరసలు పట్టించుకోవటం లేదు/ అంగీకరించటం లేదు. ధృతరాష్ట్రుడి రాజ్యార్హతతో సంబంధం లేని విషయాన్ని దానితో సంబంధం పెట్టి చూస్తున్నారు మీరు. అసలు ధృతరాష్ట్రుడు యుద్ధంలో పాల్లొనలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడని ఎలా చెపుతారు?" అంటూ!నిజంగా ఓక పల్లెటూరి వాడికి ఉండే పాటి కామన్ సెన్సు కూడా లేనివాడు గంభీరమైన ధర్మాధర్మవిచక్షణ జ్ఞానానికి సంబంధించిన రామాయణ మహాభారతాల గురించి ఎందుకు చర్చకి దిగాడో!హస్తినా పురం తరపున యుద్ధం చేసిన సైన్యాలూ ఆ సైన్యం లోని వీరులూ మొత్తం మట్టిగరిచి ఓడిపోతే ఆ రాజ్యపు రాజు వోడిపోయినట్టు కాదా!"హస్తినాపురం తరపున భీష్మ ద్రోణ కర్ణాదులు యుద్ధం చేశారా? వీళ్ళంతా కౌరవుల పక్షాన యుద్ధం చేశారని భారతం చెపుతోందిగానీ ఒక పట్టణం/ నగరం తరఫున యుద్ధం చేశారని కాదు. హస్తినాపురం ఓడిపోవటమేమిటో, అది ఓడిపోతే యుద్ధం చేయని ధృతరాష్ట్రుడు ఓడిపోవటమేమిటో కూడా అంతుబట్టటంలేదు.అనే రకం వాదన ఒక పల్లెటూరి బైతు ముందు చేసినా వాడు కూడా పగలబడి నవ్వుతాడు కదా,ఈ మనిషికి రామాయణ మహాభారతాల్లోని ధర్మాధర్మవిచక్షణకి సంబంధించిన గంభీరమైఅన చర్చలు చేసే అర్హత ఉందా:-)

      ఈయనే "నా హీరోలు..వాలీ,కర్ణుడూ!" అనే మరొక పోష్టు కూడా వేశాడు.చాలా పాతది.ఈ మధ్య అవ్రకూ నేనసలు దీన్ని పట్టించుకోలేదు.ఎందుకంటే పాత అనుభవం ఉందిగా!తప్పొప్పులతో పని లేకుండా మురంనా ఏది చెప్తే అదే వేదం అనుకునే ఈయనతో వాదనలు చెయ్యడం వల్ల ఉపయోగం లేదు,పైగా తన తెలివితేటల్ని నిరూపించుకోవటానికి పనికొచ్చే కామెంట్లని మాత్రమే పబ్లిష్ చేసి ఎదటివాళ్ల నుంచి తను జవాబు చెప్పలేని తెలివైన వాదనల్ని ఎటూ పబ్లిష్ చెయ్యడు,ఎందుకొచ్చిన గోల అని అటుకేసి వెళ్ళడం మానుకున్నాను,అయితే బాహుబలి సినిమా గురించిన టాపిక్కు సరదా అయినది గాబట్టి దాని దగ్గిర నేనూ పాజిటివ్ కామెంట్లే వేశాను,ఆయనా పాజిటివ్ రెస్పాన్సే ఇచ్చాడు.తస్సాదియ్యా,గాచ్చారం గాండు మారితే తాడే పామై కరుసుద్ది గందా!ఈ మజ్జెనే మాలికలో కామెంట్లని జూస్తా వుంటే రాజ కిషోర్ అనే బ్లాగరు వేసిన కామెంటూ,దానికి ఈయన గారు "పోష్టు రాసిన ఇన్నేళ్ళకి మళ్ళీ ఓక అభిప్రాయం రావటం సంతోషంగా ఉంది" అంటుంటే కేవలం కుతూహలం కొద్దీ తొంగి చూశాను.రాజ కిషోర్ గారు "వాలీ, కర్ణుడూ ఇద్దరూ దుష్టులే, అధర్మపరులే. దుష్టులను ఏ విధంగా వధించినా తప్పులేదు. వాళ్ళని తొలగించాలి అంతే.......................అయినా మీ ఇంట్లో రాత్రిపూట ఒక దొంగాడు చొరబడితే అదను చూసి వెనక నుంచి వెళ్లి కొడతారా లేక గొప్పగా జబ్బలు చరుచుకుంటూ వాడికి ఎదురుగా వెళ్తారా? ఈ రెండూ కాకపొతే పదిమందినీ పిలిచి వాడిని పట్టించి బాగా దేహశుద్ధి చేయిస్తారు. అంతేకాదు, ఒక దొంగాడినో, తీవ్రవాదినో పట్టుకోడానికి పదిమంది పోలీసులూ వెళ్ళటం లేదూ? అదను చూసి వెనుక నుంచి దెబ్బకొట్టటంలేదూ? ఒక దొంగాడినే మీరు వెనక నుంచి వెళ్ళి తంతే, లేదా ఒక్కడిని చేసి పదిమంది చేతా తన్నిస్తే తప్పులేదు కాని, అదే పని రాముడు, కృష్ణుడు చేస్తే మీకు తప్పయిపోయిందా? భలే చెప్తున్నారండీ!!!! ఇవేవీ ఆలోచించకుండా ఇలా వ్రాయడం చాలా విచారకరం." అంటూ చెప్పినది వివరంగానే ఉంది,అయినా ఇంకా ఈయన "వాలినీ, కర్ణుడినీ దొంగలతో పోోల్చి వారికి జరిగిన ప్రతిక్రియలను మీరు సమర్థిస్తున్నారు. కానీ వాళ్ళు దొంగల్లాంటివాళ్ళని ముందు మీ వాదనతో రుజువు చేయండి!" అని జిడ్డులా తగులుకుంటే నేను "అంత జవాబూ చదివాక మళ్ళీ అదే చాలెంజి చేస్తే మళ్ళీ అదే జవాబు వొస్తుంది గదండీ!1.నేను ముప్పాళ అరంగనాయకమ్మ అభిమానిని అని ప్రకటించేసుకుని ఆవిడ మీద భక్తిరసంబు వెదజల్లుతూ ఇన్ని పోష్టులు వేశాక మీ ఎజెండా స్థిరపడిపోయినట్టే కదా!రామయణ మహాభారతాల ఎజెండా మీకు నచ్చలేదు గనక అవి తప్పని చెప్పడానికి వ్యాఖ్యానాలూ వాదనలూ సాక్ష్యాలూ కోకొల్లలుగా పుట్టించవచ్చు - అదే కదా సేంటూసేం ఎజెండా ఉన్నవారిలో మిమ్మల్ని గొప్పవాళ్ళని చేసేటందుకు పనికొచ్చే పాండిత్యం!2.మీరు ముప్పాళ అరంగనాయకమ్మ అభిమానిగా ఉన్నంతవరకూ మీకు రాముడు పరమ నీచాతి నీచుడు గానూ,రాముడికి సహాయం చేసిన సుగ్రీవుడూ,జాంబవంతుడూ,హనుమంతుడూ విభీషణుడూ జాతిద్రోహులుగా కనబడటమూ సహజమే.రాముడికి ఎగస్పార్టీ అయిన రావణుడూ,శూర్పణఖా,వాలీ లాంటివాళ్ళు ధర్మావతారులుగా కనబడటమూ అంతే సహజం.ముందుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదటివాడి వాదన ఎంత యుక్తియుక్తంగా ఉన్నా సరే ఒప్పుకోకూడదని భీష్మించుకున్న గట్టి ఎజెండాతో ఉన్న మీకు వాలినీ కర్ణుణ్ణీ దుర్మార్హులని రుజువు చెయ్యడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు:-)" అంటూ ఒక కామెంటు వేశాను.

     దీంతో కధ నేను వూహించని మలుపు తిరిగింది!నాకు చెప్పిన జవాబులో ఆయన "ఒక రచయిత తన ఇంటిపేరును వాడటం మానేశారని తెలిసి కూడా దాన్ని వాడటం, ఆ రచయిత పేరును అస్తవ్యస్తంగా రాయటం వల్ల ప్రయోజనం ఏమిటి? దానివల్ల అలా రాసినవారి vanity తృప్తిపడుతుందేమో కానీ, అది ఆరోగ్యకరమైన చర్చకు కనీస ప్రాతిపదిక ఏమైనా ఉంటే దాన్ని ధ్వంసం చేసేస్తుంది!" అని ప్రస్తావించాడు.అప్పుడే అనుకున్నా ఈ ప్రస్తావన వొచ్చింది అంటే ఇక చివరి వరకూ నిలబడాల్సిందే వెనక్కి తగ్గకూడదు,కానీ ఈయన కామెంట్లు అన్నీ పబ్లిష్ చెయ్యడు గదా!ఏదేమయినా ప్రస్తావన వచ్చింది గాబట్టి జవాబు చెప్పడం నా ధర్మం అని "ఒక మనిషి పేరుని అస్తవ్యస్తంగా రాయడం ఎందుకు చేశానో తెలుసా?ఆ మనిషికీ ఆ పేరుకీ ఏమి సంబంధం ఉందని ఆ రచయిత ఇంటిపేరుని వాడుకోవటం మానివేశారు?ఎందుకు ఆ పేరుని అస్తవ్యస్తం చెయ్యడం పట్ల మీరు వ్యతిరేకత తెలుపుతున్నారు?అంటే,వివేకానందుడు రాజుగారి పటాన్ని కాళ్ళతో తొక్కమంటే భటుడు ఎట్లా భయపడ్డాడో మీరూ అట్లాగే ఆ పేరులో ఆ మనిషిని చూస్తున్నారు,అవునా కాదా?మరి అస్తవ్యస్తం చహెయ్యడం నావైపు నుంచి మీ అభిమాన రచయిత్రికి జరిగీతే మీకు కలుగుతున్న బాధయే మీ అభిమాన రచయిత్రీ చేసిన వక్రీకరణల వల్ల రాముడితో అనుబంధం పెంచుకున్నవాళ్ళకె కలుగుతుంది కదా!డిస్టార్షన్ అనేది మీరు ఇతరులకి అభిమానపాత్రమయ్యే విషయాల పట్ల చెయ్యవచ్చును గానీ ఇతర్లు మీకు అభిమానపాత్రమయ్యే విషయాల పట్ల చెయ్యగూదదా?అని నిలదీస్తూ కామెంటు వేశాను. అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆయనకి పాయింటు అర్ధం కాలెదు!నేను ఈయన లాగా తప్పులు పట్టటం కోసం చదవలేదు గాబట్టి భారతంలో మనుషులంతా గొడవలు లేకుండా ప్రశాంతంగా బతకటానికి చెప్పిన ఒక నీతిని నేర్చుకున్నాను,అదేమిటంటే "ఇతరులు నీకు ఏది చేస్తే బాధ కలుగుతుందో ఇతరులకి నువ్వు అది చెయ్యకు" అనేది.ఈయనకి కనీసం హైస్కూలు కుర్రాడి స్థాయి తెలివి అయినా ఉండి ఉంటే నేను చెప్తున్న జవాబులో "ముప్పాళ రంగనాయకమ్మ పేరుని మార్చి రాసినందుకు మీకు బాధ కలిగితే మరి రాముణ్ణీ సీతనీ వాళ్ళ స్వభావాల్ని మార్చిపారేసి తీరుతెన్నుల్ని వంకర్లు తిప్పి విమర్శించటం దేనికి చేసినట్టు,అది తప్పు కాదా?" అని అడుగుతున్న ప్రశ్న తట్టి ఉండేది.అయినా చెప్పింది అర్ధం చేసుకోకుండా ఇంకా "ఆమె తన రచనల్లో ఏ వక్రీకరణ చేశారని భావిస్తున్నారో అది వక్రీకరణేనని మీరు ససాక్ష్యంగా మీ వాదనలతో నిరూపించటానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన, సంస్కారవంతమైన వాదనలు చేయండి. అది సరైన మార్గం.కానీ మీరు ఏం చేస్తున్నారు చాలాకాలంగా? ఆమె పేరును సంబోధించే విషయంలో హీనమైన సంస్కారం ప్రదర్శిస్తున్నారు. ‘స్వైరిణి’అట. ఆమె భావాలను నేను ఇష్టపడుతున్నాను కాబట్టి.. నా బ్లాగు పేరు ‘వేణువు’ కాబట్టి నేను ఆమె ‘పాద రేణువు’ను అట.నచ్చని భావాలతో సంఘర్షించటంలో ఆరోగ్యకరమైన చర్చల, వాదనల దారిని వదిలేసి, ఆ భావాలను వ్యక్తంచేసే వ్యక్తులను అవమానించటానికి ప్రయత్నించే దూషణల మార్గం తొక్కారు మీరు. అది మీ అభిరుచి కావొచ్చు. కానీ ఇలా ఒక రచయిత్రి పేరునూ, ఆమె భావాలను ఇష్టపడే బ్లాగర్ల పేర్లనూ అస్తవ్యస్తంగా మార్చి రాయటం, దాన్ని అస్తవ్యస్తంగా సమర్థించుకోజూడటం మీ నిస్సహాయమైన ఓటమిని మాత్రమే విస్పష్టంగా రుజువు చేస్తుంది!" అని సాగదీస్తున్నాడు,నేను అంత స్పష్టంగా జవాబు చెప్పినా అర్ధం చేసుకోలేనంతటి ఈ మేధావి యొక్క అజ్ఞానంలోని పై స్థాయిని నేనింతవరకూ ఎవరిలోనూ చూడలేదు,అమ్మ తోడు!

సరే,ఇంక చుట్టూ తిప్పి తిప్పి చెప్తే బుర్రకి ఎక్కడం లేదని తెలిసిపోయి మన తరపు నుంచి పూర్తి స్పష్టత ఉండే ఒకే ఒక ఆఖరి కామెంటు వేసి ఇంక అతని మూర్ఖత్వానికి అతన్ని వొదిలేద్దాం అనుకుని ఒక సుదీర్ఘమైన కామెంటు వేశాను.అయితే అక్కడి కామెంటు బాక్సులో కంటెంట్ లిమిట్ ఉండటం వల్ల రెండు భాగాలుగా విగొట్టి మొదటి కామెంటు చివర్లో "TO BE CONTINUED" తగిలించి రెండో కామెంటు మొదట్లో "CONTINUED FROM ABOVE" అనీ ఉంచి పోస్ట్ చేశాను,అది మొత్తంగా ఇది:

-----------------------------------------------------------
ఇంతకీ రామాయణం మహాభారతం కావ్యాలు అని మీరు అంటున్నారా? రామాయణం వాల్మీకి రాసిన కధ అనుకుంటే వాల్మీకి రాసినదే ప్రమాణంకావాలి సహజంగా.వాల్మీకి రాసిన రామాయణం లోని పాత్ర అయిన వాలి మంచివాడా చెడ్డవాడా అనేది వాల్మీకి చెప్పనివాటితో నిర్ణయించటం తెలివైనవాడు ఎవడూ చెయ్యడు వాల్మెకిని వ్యతిరేకించటం కోసమే వ్యతిరేకించాలన్న ఎజెండా ఉన్నవాడు తప్ప! కోటానుకోట్ల మంది ప్రభావితం అయినా సరే కావ్యమర్యాద ప్రకారం పాత్రల తీరుతెన్నుల మీద రచయితదే సర్వాధికారం.ఆయన రాసిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ రచయిత ఇట్లాగే రాముణ్ణి సమర్ధిస్తూ ఎందుకు రాశాడు,మరోట్లా నాకు నచ్చినట్టు వాలిని సమర్ధిస్తూ ఎందుకు రాయలేదు అని అనడం మా అమ్మకి నేను ఇట్లా పొట్టి బుదంకాయలా ఎందుకు పుట్టాను మరోట్లా నాగార్జునలా పొడుగ్గా ఎందుకు పుట్టలేదు అని అడిగినట్టు శుద్ధ వెర్రిబాగుల వాగుడులా ఉంటుంది:-)

ఒక కవి రాసిన పాత్రలని ఆ కవి రాసిన ప్రణాళికకి విరుద్ధంగా వ్యాఖ్యానించాలనుకోవడం దేన్ని సూచిస్తుంది?వాల్మీకికి రామాయణం రాయడం వెనక ఒక ఎజెండా ఉంది.అది తను ధర్మం అనుకున్నదాన్ని అందరిలో బలంగా ఎక్కించడం!మీ అభిమాన రచయిత్రికి వాల్మీకి ధర్మం అంటున్నది అధర్మంగా కనిపించే ఎజెండా ఉంది.అయితే దైరెక్టుగా వాల్మీకి ధర్మం అంటున్నదాన్ని అధర్మంగా నిరూపించితే ఎవ్వరూ కాదనరు - నాతో సహా!అలా చెయ్యాలంటే రాముడి ఏకపత్నీవ్రతం తప్పు సీత పాతివ్రత్యం తప్పు అని చెప్పి లైంగిక విశృంఖలత్వాన్ని సమర్ధించాలి.ఎందుకంటే రామాయణం లో భరతుడు తనని చూడ్డానికి వచ్చినప్పుడు "తమ్ముడూ బాగున్నావా" అనే మామూలు పలకరింపు స్థానంలో రాజ ధర్మాల గురించి చాంతాడు పొడుగు ఉపన్యాసం చెప్పి ఇవ్వాన్నీ చేస్తున్నావా అని అడ్గినట్టు వాల్మీకి తన అభిప్రాయాలు చెప్తున్న సన్నివేశాలు ఎన్ని  ఉన్నప్పటికీ మొత్తం కధలో రాముడు - రావణుడు, సీత - శూర్పణఖ వంటి ప్రధాన పాత్రల మధ్య నడిచిన సన్నివేశాల లోని కధ అంతా స్త్రీ-పురుష సంబంధాల్లో ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం కోసమే కదా!
TO BE CONTINUED

CONTINUED FROM ABOVE
ఆమెని "స్వైరిణి" అనడానికి కారణం కూడా చెప్తాను. స్వభావతః సంస్కారవంతుడినై ఉండి కూడా ఓక్ స్త్రీని నిరాధారంగా నిందిస్తున్నానంటే బలమైన కారణం లేకుండా ఉంటుందా,తప్పకుండా చెప్తాను అది నా బాధ్యత కూడా చెప్తాను మీరు నమ్మినా నమ్మకపోయినా! రాముడు పాటించిన ఏకపత్నీవ్రతాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి?సీత పాటించిన పాతివ్రత్యాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి? ఆమె కూడా వివాహితయే కదా,ఆమె దాంపత్యజీవితం ఎట్లా గడిపింది? ఒక పురుషుడితో వివాహబంధంలో ఉన్నప్పుడు మరొక పురుషుడి గురించి ఆలోచించకుండా మీ అభిమాన రచయిత్రి కూడా సీతలాగే ప్రవర్తించిందా మరొక విధంగా స్వైరవిహారం చేసిందా!మరి సీత రావణుడి గురించి ఫాంటసీలు వూహించుకుంది,రాముదు శూర్పణఖని చూసి చొల్లు కార్చుకున్నాడు,"ఆహా!సీత కన్నా ముందు తను కనబడితే నేను ఈవిణ్ణే చెసుకున్నేవాణ్ణి" అనుకున్నట్టు రాయడం, పైగా మనసులో అంత వాంచ ఉన్నా అణుచుకుని రాముడు జనం పొగడ్తల కోసం పైకి నటనగా మాత్రమే ఏకపత్నీవ్రతానికి కట్టుబడ్డట్టు రాయడం వెనక ఉన్న ఉద్దేశ్య మేమిటి?ముప్పాళ రంగనాయకమ్మ అను నాకన్నా సీత ఉన్నతంగా ఉండటానికి వీలు లేదు, నాలాగే తను కూడా మొగుడు కాని ఇంకో మగాడి గురించి ఫాంటసీలు వూహించుకునే ఉంటుంది అని చెప్తున్నట్టా!

తను కూడా దాంపత్యం విషయంలో సాంకేతికంగా సీత మాదిరిగానే ఉంటూ అదే లక్షణాన్ని కధారూపంలో పాత్రగా నిలబడిన సీతని వెక్కిరించటం అంటే తను పాటిస్తున్న దాంపత్యపు లక్షణాన్ని తప్పు అని చెప్తూ తనని తను విమర్శించుకోవటం - తనని తను తిట్టుకునేవాళ్లని ఏమంటారు?ఒక స్త్రీ ఒక పురుషుడు జీవితకాలం కలిసి ఉండే వివాహాన్ని తప్పు అంటున్నప్పుడు ఆమె సాటి స్త్రీలకి బోధిస్తున్నది స్వైరవిహారాన్నే కదా!

వాల్మీకి రామాయణం లో సీత రాముడికే అంకితమవడాన్ని విమర్శించిందా? లేదు,అదంతా నటన మాత్రమే,చా టుగా రావణుడి గురించి ఫాంటసీలు అల్లేసుకుంది పొమ్మంటున్నది,అవునా?రాముడు సీతను మాత్రమే ఇష్టపడటాన్ని విమర్శించిందా?లేదు,అబ్బే రాముడు వాల్మీకి చెప్పీంట్టు పవిత్రంగా లేడు శూర్పణఖని చూసి  ఐసయిపోయాడు,కాకపోతే జనం తిడ్తారని నటించాడు అంటున్నది. అట్లా వాల్మీకి ఆదర్శవంతులుగా నిలబెట్టిన పాత్రల స్వభావాల్ని పూర్తిగా మార్చిపారేశాక ఇప్పుడు మనకి కాబట్టి అయ్యలారా అమ్మలారా మీరు రాముడిలాగా సెతలాగా ఆ ధర్మాన్ని పాటించకండి అని చెప్తున్నది,అంతేనా? నేను బుద్ధిగా మొగుడితో కాపురం చెస్తూ గడిపిన మీ అభిమాన రచయిత్రిని "స్వైరిణి" అన్నందుకు మీకు ఖోపం వచ్చేసి అదేంటి ఆ పాడు పని ఆవిద చెయ్యలేదుగా అని బోల్డు బాధ పడిపోయి ఆవిడ చెయ్యని పనిని అంటగట్టిన దుర్మార్గం గురించి నన్ను నిలదీస్తున్నారు గాబట్టి మీరు మరి సీతకీ రాముడికీ లేని దుర్గుణాల్ని ఆవిడ ఎందుకు అంటగట్టిందో చెప్పాల్సి ఉంటుంది - చెప్పగలరా?!

P.S:ఆవిడకి లేని చెడ్డ గుణాన్ని అంటగట్టటం నా కుసంస్కారం అయితే వాల్మీకి సృష్టించిన పాత్రలకి లేని లక్షణాల్ని అంటగట్టటం ఆవిడ కుసంస్కారం కాదా - ఆ పాయింటు బోధపడితే నేను ఆ పని ఎందుకు చేశానో అర్ధం అవుతుంది.నేను చేసింది ఒక మంచి పని కోసం తప్పు చెయ్యటమే అని అర్ధం అయితే కౌరవులు తప్పు చేశారని పాండవులూ తప్పు చేస్తే ఇద్దరూ అధర్మపరులే అవుతారు గదా అనే మీ లాజిక్ ఎందుకు తప్పో కూడా అర్ధం అవుతుంది.

ఒకచోట నమ్మినా నమ్మకపోయినా అన్నాను గదా నేను బూకరించంటం లేదు అని మీరు నమ్మితేనే ఈ జవాబు మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది.అట్లా నమ్మకపోయినా మీకు కూడా తప్పొప్పులతో సంబంధం లేకుండా మీ అభిమాన రచయిత్రి ఎజెండాయే ముఖ్యం అయితే ఈ జవాబు కూడా వ్యర్ధమే అవుతుంది - స్వస్తి!
-----------------------------------------------------------

"వ్యక్తిగతంగా హీనపరిచే దూషణలు చేయటమే తప్పు. వాటికి మళ్ళీ కారణాలు వివరిస్తూ సమర్థించుకోబోవటం ఏమిటి?!ఒక రచయిత్రి భావాలు మీకు నచ్చకపోతే ఆమెను సంస్కారహీనమైన మాటలతో దూషించేయటమేనా? ఆమె భావాలు ఇష్టపడేవారిని అవమానకరంగా సంబోధిస్తూ చెత్తగా రాసెయ్యటమేనా? సంస్కారవంతంగా, ఆరోగ్యకరంగా చర్చ చేసినంతవరకూ ఆ వాదన నాకు ఆమోదయోగ్యం అయినా కాకపోయినా ఆ వ్యాఖ్యలను ప్రచురిస్తాను." అని తన బ్లాగులో అంటున్న ఈ పెద్దమనిషి అక్కడ తను ప్రచురించకపోవడం వల్ల ఇక్కడ నేను ప్రచురించిన భాగంలో ఏమి ఆసభ్యత ఉందో తన బ్లాగులో ఇంకా దాన్ని డెలిట్ చెయ్యకుండా ఉంటే పబ్లిష్ చేసి గానీ లేదా ఇక్కడి కొచ్చి ఈ భాగాన్ని పరిశీలించి గానీ నిరూపించగలడా?

     అయినా వాలికి జవాబు చెప్పుకునే చాన్సు ఇవ్వలేదని ఏడ్చేవాడు నేను నిజాయితీగా చెప్పిన జవాబుని ఎందుకు పబ్లిష్ చెయ్యటం లేదు?నాకు మండదా?నిజంగానే కాలగూడని చోట చురచురా కాలిపోయి కోపం నషాళానికే అంటింది!అయితే ఒకటి,ఎంత కోపం వచ్చినా నాకు మైండు మాత్రం మొద్దుబారదు,ఇంకా చురుకెక్కుతుంది!కలుగులో దాక్కుని అల్లరి చేస్తున్న ఎలకని బయటికి రప్పించాలంటే ఎరని విసరాలి వరసలు వరసలుగా పేర్చాలి.ఒక్కొక్కటిగా ఎరల్ని తింటూ బయటి కొచ్చిన ఎలకని లటుక్కున పట్టేయ్యాలి - అదీ ఒడుపు తెలిసిన వేటగాడి పద్ధతి!కామెంటులో కొంచెం మసాలా దట్టించి వదిలేసరికి ఠక్కున పన్లిష్ చేశాడు:-)గొప్ప తెలివిగా "చూశారా,చూశారా ఈ హరిబాబు ఎంత బూతులు మాట్లాడుతున్నాడో!" అని గుండెలు బాదుకుంటున్న ఈ అర్ధవంతమైన చర్చల్ని ప్రోత్సహించే ఉదారుడు ఇప్పటికైనా సరే ఆ కామెంటు లోని రెండవ భాగాన్ని అక్క పబ్లిష్ చేసి గానీ ఇక్కడి కొచ్చి గానీ ఆ కామెంటులో నేను తనకి వేసిన సూటి ప్రశ్నలకి జవాబు చెప్పగలడా?చెప్పలేడు - పిరికి దద్దమ్మ!తనకి నేను ఎందుకు మురమ్నాని స్వైరిణి అన్నానో చాలా సంస్కారవంతంగా జవాబు చెప్పి ఆ జవాబులో సూటిగా తనకి రెండు ప్రశ్నలు వేసిన కామెంటుని పబ్లిష్ చెయ్యకుండా నన్ను బద్నాం చెయ్యటానికి పనికొచ్చే కామెంటుని మాత్రం పబ్లిష్ చేసి సాటి వాళ్ళ కందరికీ చూపించి గగ్గోలు పెడుతున్న ఈ ప్రబుద్ధుడు ఈ మధ్యలో నేను పోష్టు చేసినా పబ్లిష్ చెయ్యని మరో కామెంటు ఇది:
-----------------------------------------
veNuvu
వ్యక్తిగతంగా హీనపరిచే దూషణలు చేయటమే తప్పు. వాటికి మళ్ళీ కారణాలు వివరిస్తూ సమర్థించుకోబోవటం ఏమిటి?!

haribabu
నేను బుద్ధిగా మొగుడితో కాపురం చేస్తూ గడిపిన మీ అభిమాన రచయిత్రిని "స్వైరిణి" అన్నందుకు మీకు ఖోపం వచ్చేసి అదేంటి ఆ పాడు పని ఆవిద చెయ్యలేదుగా అని ఆవిడ చెయ్యని పనిని అంటగట్టిన దుర్మార్గం గురించి నన్ను నిలదీస్తున్నారు గాబట్టి మీరు మరి సీతకీ రాముడికీ లేని దుర్గుణాల్ని ఆవిడ ఎందుకు అంతగట్టిందో చెప్పాల్సి ఉంటుంది - చెప్పగలరా?!


I know You are not able to answer that question!That’s why You  suppressed that part,coward:-)
-----------------------------------------


రవి గాంచనిది కవి గాంచును, కవి గాంచనిది కూడా హరి గాంచును - బస్తీమేసవాల్?!

Sunday 10 January 2016

మృఛ్చ కటికం, కన్యాశుల్కం - రెండు మహా నాటకాలు ఒక్క పోలిక నుండు గానీ రుచుల జాడ వేరు!

      మృఛ్చ కటికం నాటకాన్ని రాసింది ఒక మహారాజు.శూద్రక మహారాజు.కన్యాశుల్కం రాసింది ఒక జమీందారు గారి దగ్గిర ఉన్నతోద్యోగంలో ఉన్న వ్యక్తి.రెంటిలోనూ ఉన్న విశిష్టత అనాటి  కాలానికి అట్టడుగున ఉన్న జనసమూహాన్ని పాత్రలుగా చేసుకుని బొమ్మకట్టి చూపించినట్టు ఉండటం!

      తరవాత నేను చూపించబోయే పోలికలూ తేడాలూ వాట్ని చదవని వారికి కూడా అర్ధం కావడం కోసం మొదట క్లుప్తంగా కధల్ని వివరిస్తాను.

మృచ్చకటికం:చారుదత్తుడు ఒక బతికి చెడ్డ మంచి కోమటి గృహస్థు.పెళ్ళయి రోహసేనుడు అనె కొడుకు కూడా ఉంటాడు.కధ మొదటి సన్నివేశం నాటికే వసంతసేన అనే వేశ్య చారుదత్తుణ్ణి అభిమానించటం,ఇతనూ ఆమె పట్ల సానుకూలంగా ఉన్నా తనిప్పుడు నిర్ధనుడు గదా అని వెనుకాడ్డం జరుగుతూ ఉంటుంది.అయితే వాళ్ళ మధ్యన పరిచయం పెరగడం రాజశ్యాలకుడు శకారుని పుణ్యాన జరుగుతుంది.ఒకనాటి చీకట్లు గమ్మొతున్న సాయంత్రపు వేళ శకారుడు వెంబడిస్తుంటే తప్పించుకోవటానికి చారుదత్తుడి ఇంట్లో దూరుతుంది వసంతసేన.ఆ పరిచయాన్ని పొడిగించుకోవటానికి వసంతసేన తన నగల్ని ఇక్కడ దాచమని ఇస్తుంది.అయితే వసంతసేన దగ్గిర దాసీగా ఉన్న మదనికని విడిపించటానికి శర్విలకుదు అనే దొంగ ఈ చారుదత్తుడి ఇంటికి కన్నమేసి ఆ నగలని కాజేసి వసంతసేన ఇంటికే తెస్తాడు.ఈలోపు చారుదత్తుడు తన ఇంట్లో దొంగలు పడ్డారని చెప్తే ఎవరు నమ్ముతారని విచారపడుతుంటే అతని భార్య ధూతాదేవి తన ఆభరణాలు ఇస్తుంది.అవి తీసుకెళ్ళి పోయినవాటి బదులు ఇవి జమ చేసుకోమని క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించడమూ ఆ సంభాషణ ఇద్దరి మధ్యనా ఉన్న అడ్దంకుల్ని తొలగించి వసంతసేన ఏకంగా చారుదత్తుడి ఇంటిలోన నిస్సంకోచంగా ఒక రాత్రి గడిపే వరకూ వెళ్తుంది.తెల్లవారిన తర్వాత చారుదత్తుడి ఇంటిలో నిద్రలేచిన వసంతసేనకి ఒక ఉద్యానవనం పేరు చేప్పి అక్కడికి రమ్మని కబురందించి చారుదత్తుడు ముందే అక్కడికి వెళ్తాడు.వసంతసేన ఒక ఎడ్లబండిని మాట్లాడుకుని సిద్ధంగా ఉంటుంది.దీనికి సమాంతరంగా శకారుడి కోసం కూడా ఒక బండి సిద్దమై వస్తూ ఉంటుంది.ఈలోపు ఆర్యకుదనే రాజద్రోహనేరం మోపబడి కారాగృహంలో ఉన్నవాడు తప్పించుకున్నాడని కలకలం రేగుతుంది.రాజవీధిలో మామూలుగా ఉండే హడావిడికి తోడు ఈ హడావిడి కూడా తోడై చారుదత్తుడి దగ్గిరకి వసంతసేన వెళ్ళాల్సిన బండిలో ఆర్యకుడూ,శకారుణ్ణి తన స్వగృహానికి చేర్చటానికి శకారుడున్న చోటుకి వెళ్తున్న బండిలో వసంతసేనా ఎక్కుతారు.వసంతసేన దిగాల్సిన బండిలో నుంచి దిగిన ఆర్యకుణ్ణి చూసిన చారుదత్తుడు అతని వివరాలు తెలుసుకుని అతని పట్ల ఆదరంతో వ్యవహరించి శృంఖలాలు విడిపించి పంపిస్తాడు చారుదత్తుడు.అక్కడ శకారుడు తన దుష్టబుద్ధి ప్రకారం వసంతసేనని తన కోరిక తీర్చమని ఒత్తిడి పెట్టి ఒప్పుకోకపోవదంతో గొంతు నులిమి చంపేసి తర్వాత కంగారు పడి వసంతసేన మీద ఆకులలములు కుప్పగా కప్పేసి అక్కణ్ణుంచి పారిపోయి వస్తూ సరికొత్త ఐడియా అనుకుంటూ ఆ హత్యానేరాన్ని చారుదత్తుడి మీదకి తోస్తాడు.అయితే వసంతసేన నిజంగా చనిపోలేదు.చనిపోయిందనుకుని శకారుడు కప్పిన ఆకులలముల మీద బౌద్ధసాధువు గా మారిన సంవాహకుడు తడిబట్టని ఆరవేస్తే తడికి కదిలి లేస్తుంది.ఎవరు చనిపోయారనుకుని శిక్ష వేస్తున్నారో ఆ వసంతసేన ప్రాణాలతో కనబడ్డంతో చారుదత్తుణ్ణి న్యాయాధిపతి విముక్తుణ్ణి చేస్తాడు.కొసమెరుపుగా ఆర్యకుడు తిరుగుబాటుని జయప్రదంగా పూర్తి చేసి రాజవుతాడు.వసంతసెన చారుదత్తుడి భార్య అయితే శకారుడు తన తప్పులకి శిక్ష అనుభవిస్తాడు.

కన్యాశుల్కం:ఈ నాటకం  మొదలవడం "సాయంకాలమైంది" అనే గిరీశం తొలిపలుకుతో మొదలై "డామిట్!కద అడ్డం తిరిగింది" అనే తుదిపలుకుతో సమాప్త మవుతుంది.కధ అగ్నిహోత్రావధాన్లు నే కోపిష్టి ఇంటిలో మొదలవుతుంది.పెద్ద కూతురు బుచ్చమ్మకి చిన్నప్పుడే పెళ్ళి చెయ్యడం వల్ల తలచెడి ఇంట్లో కూర్చున్నా మళ్ళీ చిన్న కూరురు సుబ్బికి కూడా కాటికి కాళ్ళు చాపుకున్న ముసలాణ్ణి పెళ్ళికొడుకుగా నిర్ణయించేస్తాడు.భార్యకి ఇతని చాదస్తాలు ఇష్టముండదు.గొంతు పెంచి అరిచేతప్పుడు అప్పటికి మాట్లాడదు గానీ చాటుగా తను చెయ్యాలనుకున్నది చేస్తూ ఉంటుంది ఈ సంబంధం ఎట్లా అయినా చెదగొట్టమని తన అన్న కరటక శాస్తుర్లుని బతిమాలుకుంటే అతను మధురవాణిని బతిమలాడుకుంటాడు.మధురవాణి ఈ పెళ్ళి చేసి లాభం పొందాలనుకుంటున్న రామప్పంతులు ఉంచుకున్న వేశ్య!ఇక్కడ అగ్నిహోత్రావధానులు కొడుకైన వెంకటేశం అనే బడుద్ధాయకి ఇంగ్లీషు పంతులుగా వచ్చి బుచ్చమ్మని మనిద్దరం లేచిపోతే ఈ పెళ్ళి తప్పి పోతుందని నమ్మించి ఆ ప్రయత్నంలో ఉన్న గిరీశం కూదా కొంతకాలం మధురవాణికి పాత క్లయింటే!మధురవాణి వేసిన ప్లాను ప్రకారం రామప్పంతులే ప్లేటు ఫిరాయించి ఈ అగ్నిహోత్రావధాన్లు కూతుర్ని పెళ్ళాడి ధనలాభం కిట్టించుకోవాలనుకున్న లుబ్ధావధాన్లకి ఇంతకన్నా మంచి సంబంధం అని ఆశ చూపించి కరటక శాస్తుర్లు శిష్యుడికి ఆడవేషం వేసి పెళ్ళి చేస్తారు.ఆ తర్వాత జరిగిన గందరగోళంలో కరటక శాస్తుర్లు శిష్యుడు మధురవాణి పెళ్ళికూతురు అలంకారానికి ఇచ్చిన కంటెతో సహా ఉడాయించటంతో లుబ్ధావధాన్ల మీద పెళ్ళి కూతుర్ని చంపీన మర్దరు కేసు చుట్టుకుంటుంది.అతను నిరపరాధి అని జాలిపడి సౌకన్యారావు ఆ కేసు వాదించాలని తీసుకున్నా కోర్టులో ఎట్లా రుజువు చెయ్యాలో అతనికీ తెలియక అవస్థ పడుతుంటే మధురవాణి సౌజన్యారావు యాంటినాచ్చి అని తెలుసుకుని మగవేషంలోఅతని ముందుకు వెళ్ళి మొత్తం కధంతా చెప్తుంది. సౌజన్యారావు మధురవాణి చెప్పిన క్లూలని బట్టి లుబ్ధావధాన్లని నిర్దోషిగా విడిపిస్తాడు.లుబ్ధావధాన్లు కూతుర్ని ఏదో ఓక సహాయసంస్థలో జేర్చి తను కాశీకి పోతాననడమూ గిరీశం కూడా సౌజన్యారావుని కలవడానికొచ్చి మగవేషంలో ఉండతం వల్ల మధురవాణిని గుర్తుపట్టక సౌజన్యారావుతో కోతలు కోస్తూ పాత అలవాటు చొప్పున మధురవాణిని గురించి కూడా కారుకూతలు కూస్తే సౌజన్యారావు బూటకపు యాంటినాచ్చి గురించి తిడతాడు.గిరీశం ఇంకా "ట్ర్రూ రెపెంటెన్సు" గురించి లెక్చర్లు దంచబోతుంటే బయటకు పొమ్మనదంతో కధ ముగుస్తుంది.

      చారుదత్తుడు-సౌజన్యారావు,వసంతసేన-మధురవాణి,ధూతాదేవి-బుచ్చమ్మ,శకారుడు-గిరీశం లాంటి ప్రధాన పాత్రల స్వభావాలు చాలా దగ్గిరగా ఉందటమే కాకుండా కధాగమనంలో వాటి ప్రాధాన్యతలు గూడా ఒక్కలాగే ఉంటాయి.వర్ధమానుడు,స్థావరకుడు,చందనకుడు,వీరకుడు,మాధురుడు,దూతకరుడు - వీళ్ళంతా ఇక్కడి కల్లుపాక దగ్గిర జనమూ బండివాడూ లాంటివాళ్లతో పోలిన పాత్రలు.కధలో ఉన్న మెలికకి సంబంధం లేకపోయినా కధలోని పతాక సన్నివేశం ఖచ్చితంగా అటువైపుకే నడిచే నాటకీయతకి ఒక్కలాగే దోహదం చేస్తారు.

    చారుదత్తుడు వసంతసేన తన దగ్గిర దాచబెట్టిన నగలు దొంగలెత్తుకుపోతే తన భార్య నగలు ఇచ్చి భయంభయంగా క్షమాపణ చెప్పుకునే బతికి చెడిన మంచి/పిచ్చి కోమటి గృహస్థు అయితే సౌజన్యారావు డబ్బు కోసం కాకుండా నిర్దోషి అని తను నమ్మిన కేసుని డబ్బు తీసుకోకుండా వాదించే మంచి/పిచ్చి లాయరు!

      అక్క శకారుడు "కుంతిని భీముడు చెరబట్టినట్టు" అని అకటావికటంగా మాట్లాడి నవ్వు తెప్పించే కామెడీ విలన్ అయితే ఇక్కడ "నాతో మాట్లాడ్డమే ఎడ్యుకేషన్" అని గప్పాలు కొట్టుకునే గిరీశం కామెడీ విలన్.అక్కడా ఇక్కడా కూడా ఇలాంటి విలనీ కొత్తగా వీరు ప్రవేశపెట్టిన చిత్రమైన కల్పనయే - ఇప్పటి సినిమాల్లోని కామెడీ విలన్లు కూడా ఈదే మౌల్డులో ఉంటున్నారు,ఎంతటి వాస్తవికత!

      అక్కడ వసంతసేన నగల ముంత దొంగతనానికి గురై కధ మలుపు తిరుగుతుంది,అదే కధానాయకుడికి శిక్షాకారణ మవుతుంది,ఇక్కడ మధురవాణి రామప్పంతులు మంత్రాంగం ప్రకారం పెళ్ళికూతురికి ఇచ్చిన కంటెని కరటక శాస్త్రి శిష్యుడు చేసిన హడావిడి వల్ల లుబ్ధావధాన్లకి హత్యానేరం చుట్టుకుంటుంది.ఆఖరి డృశ్యంలో అవి రెండూ చేరవలసిన చోటికి చేరి కధానాయికలు న్యాయం జరిపించగలిగిన వాళ్ళ ముందుకి వచ్చి తెర వెనక జరిగిన అసలు కధని చెప్పటంతో నిరపరాధులు తమమీద అన్యాయంగా మోపబడిన నేరం నుంచి విముక్తు లవుతారు.

      ఈ రెండు నాటకాల్లోనూ ప్రధానపాత్రలు అన్నీ మొదటి నుంచీ చివరి వరకూ మనస్తత్వాలలో ఏ మార్పూ రాకుండా ఉంటాయి - ఒక్క పాత్ర తప్ప!అక్కడ సంవాహకుడు కధా ప్రారంభానికి జూదరిగా ఉన్నవాడు వసంతసేన తన అప్పులన్నీ తీర్చెయ్యగానే మారిపోయి బౌద్ధసన్యాసి అవుతాడు,ఇక్కడ లుబ్ద్ధావధాన్లు కధా ప్రారంభానికి లుబ్ధుడిగా ఉన్నవాడు సౌజన్యారావు డబ్బు తీసుకోకుండా కేవలం తనమీద జాలితో కేసు వాదించటాన్ని చూసి మారిపోయి కూతురి గురించీ తన భవిష్యత్తు గురించీ ఎంతో న్యాయమైన ఆలోచనలు చేస్తాడు.

     ఈ పోలికలన్నీ చూసి గురజాడ మృచ్చకటికాన్ని కాపీ కొట్టినట్టు అనిపించవచ్చు.నా దృష్టిలో కాపీ కొట్టినా అతప్పు లేదు.ఎందుకంటే రెంటిలోనొ కధ గానీ పాత్రలు గానీ కధాగమనం గానీ అవేవీ ప్రధానం కాదు - సామాజిక చిత్రణ వల్లనే అవి రెండూ అసదృశమైనవి!కానీ ఇద్దరు రచయితల ఉద్దేశాలు వేరు,వారు వూహించుకున్న ప్రయోజనాలు వేరు.మృచ్చ కటికం నాటకానికి వినోదమే ప్రధానం.చారుదత్తుడు తన బీదరికాన్ని తలుచుకునే సమయాల్లో తప్ప మిగిలిన నాటక మంతా హాస్యభరితమే!కానీ కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఒక దురాచారానికి వ్యతిరేకంగా పనిచేసేటట్టు రచించాడు!పాత్రలు నిలబడిన సమాజం వేరు,వాటి మధయన ఉన్న సంబంధాలు వేరు,మాట్లాడిన మాటలూ వేరు!అయితే, అవి రెండూ ఇప్పటికీ మనచుట్టూ కనబడే అతి సామాన్య వ్యక్తులనే పాత్రలుగా తీసుకున్నాయి,ప్రతి పాత్రకీ ఆ పాత్ర స్వభావాన్ని సూచించే పేరు పెట్టి కొంచెం హాస్యంతో రంగరించిన ప్రహసనం అనబడే సాహిత్య ప్రక్రీయతో నిర్మించబడ్డాయి.మృచ్చకటికం లోని సమాజమే కన్యాశుల్కం లోనూ ఉంది - ఇప్పుడూ అదే సమాజం!

      మొదటి కధ సుఖాంతమయ్యింది,కానీ రెందవ కధ అడ్డం తిరిగి ఆగిపోయింది,అంతే!మొదటి కధలో మంచివాల్ళు సంతోషంగా ఉన్నారు,చెడ్డవాళ్ళు శిక్షకి గురయ్యారు.మోద్టి కదహలో పాతర్లకి మంచిచెడ్డలకి సంబంధించి పూర్తి విబహాన ఉంది.రెందవ కధలో ప్రతి పాత్రలోనూ మంచీ-చెడొ కలగలిసి పోయి ఉన్నాయి,కధ పూర్తయ్యే సమయానికి మంచి పాత్రలతో సహా ఏ పాత్రకీ న్యాయం జరగలేదు.గురజాడ శూద్రకుణ్ణి కాపీ కొట్టడం అని కాదు గానీ వాళ్ళు పాతర్లకి తీసుకున్న వాస్తవ వ్యక్తులు ఏ కాలంలో కనబడినా వాళ్ళ స్వభావాలు అట్లాగే ఉంటాయి,బహుశా వాళ్ళ కష్టాలూ కన్నీళ్ళూ కూడా అట్లాగే ఉంటాయి కాబోలు!ఇప్పటికీ ఆయా పత్రలు మన చుట్టూ కనబడుతూనే ఉన్నాయి - వేషమూ మార్చెను,భాషనూ మార్చెను అయినా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు అన్న కవివాక్యం ప్రకారం!

      ఈ రెంటి మధ్యనా ఉన్న మరో అద్భుతమైన పోలిక - అన్ని నాటకాలూ చదవటానికి బాగుండవు,కానీ ఇవి మాత్రం చదువుతుంటేనే దృశ్యాలు బొమ్మ్మకట్టీంట్టు కనిపించి నాతకం చూదనక్కర లేకుండానే రసస్పందన పూర్తయిపోతుంది!

మృచ్చకటికం కాలం నుంచి కన్యాశుల్కం కాలం వరకూ సమాజం ఒక్కటిగానే ఉంది - ఇప్పటికి కూడా!

Wednesday 6 January 2016

ఇక్కడ మనవరాలి పెళ్ళికి పిలుస్తా!అక్కడ పఠాన్ కోటలో దాడి చేస్తా! - ఒక లెవెలై పోద్ది?!

"మనవాళ్ళుత్త వెధవాయలోయ్!" అని గురజాడ గిరీశంతో ఎందుకనిపించాడో గానీ మనవాళ్ళు మాత్రం పదే పదే దాన్ని నిజం చేస్తూనే ఉన్నారు.

పాకిస్తానీలు చాలా గొప్పగా వెధవల్ని చేస్తున్నారు ఇండియన్లని:-)

మా మనవరాలి పెళ్ళికి రమ్మని ఆయన పిలిచాడు.ఈయన అగ్గగ్గ లాడుతూ పోయి ఆయన తల్లి కాళ్లకి గూడా మొక్కాడు!

మన దేశంలో తమ సొంత దేశంలో కదుల్తున్నంత ధీమాగా తిరిగి మిలిటరీ శిక్షణ కూడా ఉందన్నంత పకడ్బందీగా భారత వైమానిక స్థావరం మీదనే దాడి చేశారు?

ఇలాంటి దేశపు ప్రభుత్వంలో కొంతకాలం పాటు మంత్రిగా కూడా ఉండి ఇలాంటి పనుల్లో ఆరితేరిపోయినవాడొకడు మన దేశంలో "మా దేశం పావురమంత మంచిది,మీ దేశం డేగలాగ చెడ్దది" అని అర్ధమొచ్చెలా పుస్తకం రాసి పబ్లిష్ చేస్తుంటే మనోళ్ళంతా విశాల మానవతావాదపు ఆనందకన్నీరు కారుస్తూ ఎర్రమొగాలేసుకుని చూశారు.ఈ దేశంలో పుట్టి శతృదేశం వాణ్ణి వెనజేసుకొస్తున్నవాడి మీద మసిపూసిన శివసేన వాళ్ళని అల్లరి చెయ్యాలన్న దురద తప్ప వాడెందుకు ఆ పుస్తకం అంతర్జాతీయ వేదికల మీద ఎన్నో సాక్ష్యాలు చూపించి పాకిస్తానుని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఒత్తిడి చేస్తున్న మనదేశంలోనే పబ్లిష్/మార్కెట్ చేసుకోవాలనుకున్నాడో అర్ధం చేసుకోలేకపోయారు.

పాకిస్తాన్ రాజకీయ చరిత్ర తెలుసా మీకు?ఆ దేశంలోని ఏ రాజకీయ పార్టీకి చెందినవాడినా సరే ఎప్పటికైనా భారత్ మీద సైనికంగా విజయం సాధించాలనే రహస్యవ్యూహంలో మాత్రం ఒక్కతాటి మీద నడుస్తారు - కమ్యునిష్టులతో సహా!

"మెదడు తక్కువ సన్నాసులు, భారతీయులు!" - ఇది మనకన్నా పాకిస్తాను వాళ్ళకి స్పష్టంగా తెలుసు:-)

Sunday 3 January 2016

దేవుడు లేడన్న గౌతమబుధ్ధుడు దేవుడు యెట్లా అయ్యాడు?బౌధ్ధుల దేవుడు విష్ణుదేవుడి అవతారంగా ఎప్పుడు ఇరుక్కున్నాడు!

      క్రీ.పూ 623వ సంవత్సరంలో వసంత ఋతువు నందు ఒకనాడు పూర్ణచంద్రుడు నభోమందలం నుంచి జగత్తు నంతా వెన్నెల దుప్పటిని విసిరి పరిచినట్టున్న శుభసమయాన కపిలవస్తు నుంచి నిండుగర్భిణి యైన మాహామాయ ప్రసవం పుట్టింటిలో జరగాల్సిన సంప్రదాయం వల్ల దేవదాహ నగరానికి వెళ్తూ మార్గమధ్యంలో విడిది చేసిన లుంబిని వనంలో ఒక సాల వృక్షపు నీడలో విశ్రమించి ఉన్నప్పుడు పెరిగి పెద్దవాడై ప్రపంచాన్ని వెలిగించిన ఒక శిశువుని కన్నది.ఎప్పుడు పుట్టిందో తెలియని హైందవ సనాతన ధర్మాన్ని మినహాయిస్తే ప్రపంచంలో ఇప్పటికీ పూర్తి జవసత్వాలతో కొనసాగుతున్న అత్యంత ప్రాచీనమైన బౌధ్ధమతాన్ని స్థాపించిన శాక్యముని గౌతమ సిధ్ధార్ధుడే ఆ బాలుడు.316 సంవత్సరాల తర్వాత అశోకుడు ఇక్కడ నిర్మించిన స్మారకస్తంభం మీది శాసనం "హిద బుధె జతె శక్యముని" అని ప్రకటించింది,అంటే "శాక్యముని బుధ్ధుడు ఇక్కడ జన్మించాడు" అని అర్ధం!


      శిశువుతో తిరిగి కపిలవస్తు నగరానికే వచ్చింది మహామాయ.ఐదవ రోజున జాతకరచన కోసం వచ్చిన ఏడుగురు సిధ్ధాంతులూ "ఇతడు ప్రపంచానికే చక్రవర్తి వుతాడు, అయితే విరాగియై మానవాళిని అజ్ఞాన శృంఖలాల నుంచి బంధ విముక్తుల్ని చేసి తరతమ భేదాలు లేని ఆధ్యాత్మిక ప్రపంచానికి మకుటం లేని మహారాజు అవుతాడు!" అని చెప్పారు.పేరు కూడా సిధ్ధార్ధుడు అని పెట్టారు అన్ని కోరికలూ తీరిపోయినవాడు అని అర్ధం వచ్చేటట్టు.తొమ్మిదవ రోజూ తల్లి మాహమాయ చనిపోయినప్పటి నుంచీ ఆమె చెల్లెలు గౌతమి సంరక్షణలో పెరిగి సిధ్ధార్ధ గౌతము డయ్యాడు.

      శుధ్ధోధనుడు ఒక ఉపాయం ఆలోచించాడు,దుఃఖం వల్ల విరక్తి పుడుతుంది గాబట్టి అతని చుట్టూ ఎప్పుడూ సంతోషమే ఉండేటట్లు అన్ని జాగ్రత్తలూ తీసుకుని పెంచాడు. యుక్తవయస్సు రాగానే యశోధరతో వివాహం జరిపించాడు.అయితే రావలసిన మలుపు రానే వచ్చింది - ఒక రోజు చన్నుడనే సారధి రధాన్ని తోల్తూ నగర సందర్శన చేస్తున్నప్పుడు  ముడతలు పడ్డ దేహంతో కర్ర పోటేసుకుని నడుస్తున్న ఒక ముసలివాణ్ణీ,బంధువు లంతా రోదిస్తూ వెంట నడుస్తున్న ఒక శవయాత్రనీ,అంతర్ముఖుడై ప్రశాంతవదనంతో సాగిపోతున్న ఒక శ్రమణుణ్ణీ చూశాడు.ఆ శ్రమణుడిలో కనిపిస్తున్న దుఃఖరాహిత్యాన్ని అందరిలోనూ కనిపించేలా చెయ్యడమే నిజమైన ప్రజ్ఞ అనుకుని  కొడుకు పుట్టిన వార్త విన్నా అదొక బంధనం అన్న విసుగే తప్ప మోహం పుట్టని స్థితికి చేరుకుని ఎవరికీ చెప్పకుండా చన్నుడి సహాయంతో రహస్యంగా నగరం దాటి తనను వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడం కోసం శోధన మొదలుపెట్టాడు.



      తొలిదశలో అప్పటికి చింతనాపరులు మామూలుగా చేసే ధ్యానం,యోగం,తపం అన్నిటినీ సాధన చేసినా అశాంతి మాత్రం పోలేదు.తన ప్రశ్నలకు జవాబులు దొరకలేదు.ఒక గురువు నుంచి మరో గురువుకు మారుతూ శుశ్రూషలు చేస్తూ తిరిగి తిరిగి ఉరువేల చేరుకున్నాడు.అక్కడి ప్రశాంతత అతనికి ఇక్కడే తన సమస్యకి పరిష్కారం లభించవచ్చునని అనిపించేటంతగా నచ్చింది.ఇక్కడ కాకపోతే ఇకెక్కడా సాధ్యపడదనుకుని కఠోరమై దీక్ష పట్టాడు - ఆకులలములు తిన్నాడు, శవాల మధ్య నిద్రించాడు, ముళ్ళపైన శయనించాడు, ధూళి ధూసరితమై వస్త్రాలతో తిరిగాడు,దేహం పూర్తిగా కృశించిపోయింది."ఒక సన్యాసి వెళ్ళగలిగిన స్థాయిలో తారాస్థాయికి చేరుకున్నాను.ఇతరులెవ్వరూ వూహించరానంత జ్ఞానదాహాన్ని అనుభవించాను.దేహభాగాలన్నీ పనికిరానివిగా అయి నాడులన్నీ తెగిన వీణ తీగల్లా మారేటంతగా..."  అని అప్పుడు తను చేసిన తపస్సును గురించి తర్వాతి కాలంలో శిష్యులకి వర్ణించి చెప్పాడు.అలాంటి ష్తితిలో ఆరు సంవత్సరాలు గడిపినా తన లక్ష్యం చేరుకోగలనన్న నమ్మకం కలగలేదు.ఈ దారి సరైనది కాదు,ఇంతటి శిధిల దేహంలో కొత్త ఆలోచనలు పుట్టవు గాక పుట్టవు అనిపించడంతో మెల్లగా తనువును కృశింపజెయ్యడం ఆపి మామూలు స్థితికి వచ్చాడు.తన ప్రాణ చైతన్యం తిరిగి వచ్చింది గానీ తనతో పాటు సాధన చేస్తున్న అయిదుగురు సహచరులు మాత్రం ఇతను సాధన మధ్యలో వదిలేసి భోగలాలసుడైనానే తిరస్కార భావంతో ఇతనికి దూరంగా వెళ్ళారు.ఒకరోజు సాయం సమయాన సమీప గ్రామం నుంచి సాధుసేవ కోసం వచ్చి పాయసం సమర్పించిన సుజాత అనే ఒక సంపన్న గృహస్థు కుమార్తె,"స్వామీ, ఈరోజు మీరు ఆశించినది పొందెదరు గాక!" అన్న శుభవచనంతో అతని మనస్సుకి సంతోషం కలిగింది.ఆ బోధివృక్షం కింద పద్మాసనస్థుడై ధ్యాననిమగ్నుడయ్యాడు.క్రమమగా అతనికి యదార్ధం గోచరించింది."ఇది దుఃఖం,ఇది దుఃఖానికి బీజం,ఇది దుఃఖానికి అంతం,ఇది దుఃఖాన్ని అంతం చెయ్యడానికి మార్గం" - అనే జ్ఞానత్రయం కలగడంతో ఒక మే నెల వెన్నెల రాత్రిలో జన్మించిన గౌతముడు మరొక మే నెల వెన్నెల రాత్రిలో సిధ్ధిని పొంది బుధ్ధు డయ్యాడు.ఆనాడు గౌతమబుధ్ధుడు దర్శించిన నాలుగు సత్యాల నుంచి మానవాళిని దుఃఖం నంచి విముక్తుల్ని చేసి అప్పటి వరకూ అశాంతితో పరస్పర ద్వేషాలతో రగిలిపోతున్న అసంఖ్యాక ప్రజల జీవితాలని శాంతి సామరస్యాలతో జీవిస్తూ సఫలకర్ముల్ని చెయ్య్గలిగిన ఒక నూతన జీవన విధానం జలపాత సదృశమై ఉప్పొంగింది!

      నిజానికి ఈ సత్యాలు అతను కొత్తగా కనుగొన్నవి కావు,మరచిపోయిన వాటిని మరింత గట్టిగా నొక్కి చెప్పాడని అనుకోవచ్చు.అతని పేరుతో ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వారు అతన్ని దేవుణ్ణి చేసినా తను మాత్రం దేవుణ్ణి పూర్తిగా తిరస్కరించాడు.దేవుడినే కాదు,దేవుడికి సంబంధించిన జపతపాల్నీ యజ్ఞయాగాదుల్నీ పాపపరిహారాల్నీ శిక్షాభయాల్నీ కూడా తృణీకరించాడు.తమకి మోక్షం కోసం దేవుణ్ణి యాచించేవాళ్ళు ఇతరులకి మోక్షాన్ని ఎలా ప్రసాదించగలరు?అవసరమైతే ఇతరులు సహాయం చెయ్యడమే తప్ప వ్యక్తి తనకు తానుగా దుఃఖ విముక్తిని తన సంకల్పంతోనే తన సాధన తోనే సాధించ గలుగుతాడు - ప్రార్ధనలూ వేడుకోళ్ళూ నిరర్ధకం!ఒక వారం పాటు తనకు తోచిన సత్యాలను తిరిగి తిరిగి మననం చేసుకుంటూ ఎక్కడా హేతు విరుధ్ధత లేదని తెలిసి పరిపూర్ణమైన ఆనందాన్ని పొందాడు.ఇక ఈ ధర్మాన్ని బహిరంగ పర్చటానికి నిశ్చయించుకుని తొలిసారిగా తన నుంచి దూరంగా వెళ్ళి వారణాసిలో ఇంకా సాధనలోనే మునిగి తేల్తున్న పాత మిత్రులకి వినిపించి వారి అభిప్రాయం తెలుసుకుంటే బాగుంటుందని అనుకున్నాడు.



      క్రీస్తు జననానికి 589 సంవత్సరాల ముందు జులై వెన్నెల రాత్రి నాటి సంధ్యాసమయాన సూర్యుడు దిగుతూ చంద్రుడు ఎదుగుతూ ఉన్న వేళ తొలిబోధని విజయవంతంగా చేసి పంచేంద్రియముల వంటి శిష్యపంచకాన్ని తయారు చేసుకున్నాడు."యతులారా,జ్ఞానార్ధులకు రెండు ద్వంద్వాలు ఏమాత్రం తగనివి. లాలసతని పెంచే నీచమైన దేహాభిమానం,దేహాన్ని శుష్కింపజేసే తీవ్రమైన దేహదమనం.ఈ రెంటిలో ఎటువైపుకీ వంగకుండా మధ్యేమార్గంలో పయనిస్తూ నిర్వాణ సాధన చెయ్యాలి.ఏమిటా మధ్యేమార్గం?అదే అష్టాంగ మార్గం!ఇందులోని ఎనిమిది అంశాలు ఇవి:సమ్యక్-దృష్టి,సమ్యక్-సంకల్పం,సమ్యక్-వాక్,సమ్యగ్-కర్మ,సమ్యక్-జీవన,సమ్యక్-ప్రయత్న,సమ్యక్-స్థితి,సమ్యక్-సమాధి.మరి ఏది సరైనదో ఎట్లా తెలుసుకోవాలి అని సందేహం వస్తే బహుజన హితాయ బహుజన సుఖాయ అనేది నా జవాబు."  అని మొదలు పెట్టి చేసిన ప్రసంగంతో ప్రపంచంలో తొలిసారిగా ఒక వ్యక్తి స్థాపించిన జీవన విధానం అనేకమందిని తనలోకి ఇముడ్చుకుంటూ నేటికీ కొనసాగుతున్నది.

      అలా మొదలై కాలినడకన శిష్యులతో కలిసి పర్యటించి తన ప్రసంగాలు విన్న ప్రతి ఒక్కరినీ సమాన వాత్సల్యంతో ఆదరించి సందేహాలు తీరుస్తూ ఆజీవ పర్యంతం సాగరసదృశంగా జీవించాడు.అయిదుగురు శిష్యులు అలలు అలలుగా పెరుగుతూ అతి తక్కువ కాలంలోనే వేల సంఖ్యకి పెరిగి ప్రతి చోటా వారి కోసం ఆరామాలు నిర్మించబడినాయి.ఈ ఆరామ సంప్రదాయమే తదనంతరం నలంద,విక్రమశిల,జగద్దల,విక్రమపురి వంటి విశ్వవిద్యాలయాల నిర్మాణానికి దారి తీసింది.వీటి నుంచి వెలువడిన జ్ఞానపుంజాలు ఆసియా ఖండ మంతటినీ కాంతిమయం చేసి సకల మానవాళికి మానసిక ప్రశాంతతని ప్రసాదించాయి.అలాంటి సాధుజీవనవైభవంతో నలభై ఆయిదేండ్లు గడిపి తన ఎనభయ్యవ యేట భౌతిక ప్రపంచం నుంచి నిష్క్రమించాడు - అది మహాభినిష్క్రమణం,అది మృత్యోర్మా అమృతం గమయం!

      తర్వాత కాలంలో అతణ్ణి దేవుణ్ణి చేసిన మహాయాన గాధల నుంచి అసంగతాల్ని తీసేస్తే స్థూలంగా గౌతమ బుధ్ధుని జీవితపయనం ఇది. క్రీ,పూ 5వ శతాబ్దిలో బుధ్ధుని మహాపరినిర్వాణం జరిగిన వెంటనే రాజగృహ నగరంలో తొలి ధర్మచక్రప్రవర్తన జరిగింది.క్రీ,పూ 4వ శతాబ్దిలో జరిగిన రెండవ ధర్మచక్రప్రవర్తనలో కొన్ని చిల్లరమల్లర విభేదాలు మొదలయ్యాయి.ధనం వాడుకోవటానికి అనుమతించటం, రెంవసారి భిక్షకి వెళ్ళటం వంటి విషయాల్లో వెసులుబాటు కోసం ప్రతిపాదించగా ఒక వృధ్ధసన్యాసి తీవ్రంగా మందలించడంతో ఆ సడలింపులు అప్పటికి ఆగిపోయాయని ఒక కధనం.క్రీ,పూ 250లో అశోక చక్రవర్తి అధ్వర్యంలో మూవ ధర్మచక్రప్రవర్తన జరిగింది.ఇది తొమ్మిది నెలల పాటు జరిగిన వేడుక అశోకుడు శ్రధ్ధ తీసుకుని స్వయంగా భిక్షువుల్ని ప్రశ్నించి ఎవరు నిజమై జ్ఞానులో ఎవరు కాదో తేల్చుకుని కలుపుమొక్కల్ని ఏరిపారేసి కొంచెం శుధ్ధి చేశాడు.భిక్షువుల్ని దూర దేశాలకి పంపటం కూడా ఇప్పటి నుంచే మొదలైంది.కైస్తవుల వలె క్రూసేడ్లు చెయ్యలేదు,ముస్లిముల వలె జెహాదులు ప్రవచించలేదు - దానిలోని ఔన్నత్యం చేతనే మెప్పించింది, దాన్ని పాటిస్తున్న శ్రమణుల ఆదర్శజీవనం వల్లనే విస్తరించింది.క్రీ,పూ 2 శతాబ్దిలో అప్పటి రాజకీయ వాతావరణం వల్ల మొదలై క్రీ,పూ 1వ శతాబ్దానికి బుధ్ధుణ్ణి దేవుణ్ణి చేసి బోధిసత్వుడి అవతారాల్ని గురించి చెప్తున్న మహాయానం అనే కొత్త శాఖ ప్రముఖ పాత్ర వహించదంతో తధాగత బుధ్ధుడు చెప్పిన నాస్తికత్వానికి భిన్నంగా వెళ్ళినప్పటికీ సామాజిక జీవితంలో పాటించాల్సిన నియమనిష్టల విషయంలో మాత్రం అదే స్పూర్తినీ నిష్ఠనీ  బౌధ్ధసన్యాసులు ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండటమే ఎలాంటి వివాదాలకీ తావివ్వకుండా విమర్శించడానికి వీలు లేనంత గౌరవప్రదంగా బౌద్ధధర్మం విరాజిల్లుతున్నది- మెచ్చుకోదగిన విషయమే!

మరీ సూక్ష్మవివరాలకు పోకుండా స్థూలంగా తనను తను తధాగతుడు అని సంబోధించుకుంటూ బుధ్ధుడిగా ప్రకటించుకున్న సిధ్ధార్ధ గౌతముడు చెప్పిన బోధనలు ఇట్లా ఉంతాయి,

,కనుగొన్న నాలుగు సత్యాలు(చత్వారి అర్య సత్యాణి):
1.దుఃఖం అంతటా ఉన్నది(జన్మయే దుఃఖం) - పుట్టుక,ఎదగటం,రోగం,చావు అన్నింటా దుఃఖమే.మనకు నచ్చనివాటితో సంబంధం కలగడమే దుఃఖం.
2.దుఃఖ కారణం(దుఃఖ సముదయ కోరిక - ఇచ్చ,వ్యామోహం-తన్హ,దాహం-తృష్ణ) - సంతోషం కోసం,ఉనికి కోసం,ఆస్తుల కోసం,అధికారం కోసం మనం చేసే పనులు మనకు కావలసిన దాన్ని సాధించకపోగా దుఃఖాన్ని పుట్టిస్తున్నాయి.
3.దుఃఖానికి దూరంగా ఉందటం(దుఃఖ నిరోధ) - కోరికల్ని తగ్గించుకొనడం ద్వారా దుఃఖాన్ని తగ్గించుకోవచ్చు.మరణ సమయానికి నెరవేరని కోరికలు పునరపి జననం పునరపి మరణం అన్నటువంటి చక్రమార్గంలో ఈ సంసారంలోనే దుఃఖంతో సహవాసం చేస్తూ కొనసాగేటట్టు చేస్తున్నాయి.
4.దుఃఖ నిరోధ మార్గం - దీనికొరకై అష్టాంగ మార్గం నిర్దేశించబడింది

అష్టాంగ మార్గం అంటే ఎనిమిది అంశాల్ను శ్రధ్ధతో సాధించే ఒక పధ్ధతి:
1.సమ్యక్-దృష్టి
2.సమ్యక్-సంకల్పం
3.సమ్యక్-వాక్.
4.సమ్యగ్-కర్మ
5.సమ్యక్-జీవనం
6.సమ్యక్-ప్రయత్నం
7.,సమ్యక్-స్థితి
8.సమ్యక్-సమాధి

దుఃఖాన్ని కలిగించేవి మనకి వాటితో సంబంధం కలిగినప్పుడే దుఃఖం పుడుతుంది.రెండు రకాల సంబంధాలు ఉంటాయి గనక సరైన రీతిన సంబంధం కలిగించుకుంటే దుఃఖానికి బదులు ఆనందం కలుగుతుంది.ఏది సరైనది అన్న ప్రశ్న వస్తే బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న కొలబద్ద ప్రకారమే తేల్చుకోవాలి.

మానవులు చెయ్యగూడని పనులు అయిదు:
1.హింసకి దూరంగా ఉండాలి,ఏ ప్రాణిని చంపినా ఒకేరకమైన పాపకర్మ అవుతుంది
2.లైంగిక వికారాలకి వీలైనంత దూరంగా ఉందాలి,సమస్తమైన దుర్మార్గాలూ ఇక్కడి నుంచే మొదలవుతాయి.
3.అబధ్ధానికీ మోసానికీ దూరంగా ఉండాలి,ముఖ్యంగా నువ్వు ఇతరులకి పాటించమని చెప్పే విషయాలలో దాపరికం అసలు ఉండరాదు.
4.చౌర్యానికి దూరంగా ఉండాలి,వస్తు చౌర్యమే కాదు భావ చౌర్యం జ్ఞాన చౌర్యం కూడా పరిహరించదగినవే.
5.ద్వేషభావాల్నీ విషాహారాల్నీ పూర్తిగా పరిత్యజించాలి

       తధాగత బుధ్ధునిలో గమనించదగ్గ విశేషం వాస్తవికత - కేవలం బోధ చేసి వూరుకోలేదు,ఒక ప్రణాళికతో ఆధ్యాత్మిక ప్రభుత్వాన్ని నిర్మించాడు 45 సంవత్సరాల పాటు  సంవత్సరాని కొక నగరంలో విడిది చేసి  ప్రతిచోటా ధర్మచక్రం నిరంతరాయంగా తిరిగేటందుకు అవసరమైన నియమాలను చాలా స్పష్టంగా నిర్వచించాడు.ఒక వ్యక్తి "ఇది నేను చెప్తున్నాను,ఎందుకు చెయ్యాలి అని ప్రశ్నించకు,దీన్ని నువ్వు చేసి తీరాలి" అని పెత్తనం చెయ్యకుండా అతను చెప్పింది చెప్పినట్టు విన్నవాళ్ళు విన్నది విన్నట్టు పాటించడం అంతకు ముందు గానీ ఆ తర్వాత గానీ చరిత్రలో ఎక్కడా జరగలేదు.ఈ స్వేచ్చానిర్ణయపు పట్టుదల వల్లనే మగధ మహామంత్రి వజ్జియనుల మీద దాడికి అనుమతి కోరినప్పుడు నాకిష్టం లేదు గాబట్టి వద్దు అనకుండా ఆనందుడితో సంభాషణ ద్వారా వజ్జియనుల ఔన్నత్యాన్ని గురించి చెప్పి అటువంటి అత్యున్నత సంస్కృతిలో ఉన్నవాళ్ళు నీకు లొంగరు అని ముక్తాయింపు ఇచ్చాడు - ఇప్పుడర్ధమైంది, మణిపద్మోహం!ధార్మిక గ్రంధాల్లో రహస్యాన్ని అతడు తిరస్కరించాడు."దాపరికం వాటిలోని మోసానికి చిహ్నం" అని  నిర్మొహమాటంగా ప్రకటించాడు.అయితే ఒక విషయం గమనించాలి.ఒక సన్నివేశంలో కొన్ని విషయాల్ని గురించి బుధ్ధుడు కావాలనే జవాబుని దాటవేస్తున్నట్టు అనుమానించి దాని గురించి ప్రశ్నిస్తే,తను కూర్చున్న చెట్టు కింద రాలిన ఆకుల్ని తన పిడికిట పట్టి "సన్యాసీ!ప్రపంచంలో ఉన్నవి ఇవే ఆకులా ఇంకా ఉన్నాయా?" అని అడిగాడు."గురువర్యా ,ఖచ్చితంగా ఎక్కువే ఉన్నాయి,చెట్టుమీద ఉన్నాయి గదా!" అని జవాబివ్వగా "సన్యాసీ!ఇప్పటికిప్పుడు నేను చలిమం వేసుకోవాలంటే నాకు ఇవి మాత్రమే ఉపయోగ పడతాయి.చెట్టు మీద ఉన్న ఆకులు నాకు అనవసరం.నాకు తెలిసిన దానిలో మీకు ఉపయోగం లేనివి చాలా ఉన్నాయి, అందుకే వదిలి వేస్తున్నాను.మీకు అవసరం నిపిస్తే మీ అంతట మీరు శోధించి సాధించుకోండి" అని స్పష్టం చేశాడు.అనవసరమని అనుకున్నవాటిని చెప్పకుండా వొదిలెయ్యటం వేరు,అవసరమైన దానిని కూడా చెప్పకపోవటం వేరు, కదా!


      సమాజంలో ఉన్న అంతరువులను పాటించకండా జ్ఞానాసక్తిని మాత్రమే పరిగణించి జ్ఞానబోధకి తలుపులు తెరవడం నిజంగా అనాటి కాలానికి ఖచ్చితంగా విప్లవాత్మకమైనదే.ఉపాలి అనే అర్హతుదు క్షురకుడు!భిక్షుకి సంఘంలో గొప్ప పేరు గల సన్యాసినులు పున్న,పున్నిక ఇద్దరూ కట్టు బానిసలు.జాతి భేదాలకు వ్యతిరేకంగా తధాగత బుధ్ధ్హుడు చేసిన ప్రకటనని UNESCO తన కార్యక్రమాలకి సంబంధించిన Declaration on Race and racial Prejudice,UNESCO 1978 ప్రకటనలో యధాతధంగా స్వీకరించింది!

      అయితే ఇప్పటికీ జీవితకాలనిర్ణయం విషయంలో అన్నీ అనిశ్చితంగానే ఉన్నాయి.బౌధ్ధ మత గ్రంధాలు కూడా ఏ ఒక్క తేదీ విషయంలోనూ ఏకీభవించటం లేదు.దీని వల్ల కొందరికి అసలీ గౌతమబుధ్ధుడు వాస్తవంగా ఉన్నాడా లేక కల్పితమా అనే అనుమానాలు కూడా వచ్చాయి.యెందుకంటే ఓక వైపున ఈ మతాన్ని స్థాపించిన వ్యక్తి దేవుడి ఉనికిని పూర్తిగా తిరస్కరించి యజ్ఞయాగాదుల్నీ పూజా విధానాలనీ త్రోసిరాజని తర్కంతో బ్రతకమని శాసించాని చెప్తూ మళ్ళీ అతను బోధిసత్వుదనే దేవుడి 28వ అవతారం అనడం హేతువిరుధ్ధం కాదా?బౌధ్ధమతం మీద ఎంతో పరిశోధన చేసిన T.W,R Davids కూడా "ఇన్ని శతాబ్దాల పాటు విస్తరించిన బౌధ్ధ మతసాహిత్యపు చరిత్రని తీరగేసినా ఖచ్చితంగా బుధ్ధుని అనుయాయులు ఏ కాలంలో ఎక్కడి నుంచి ఈ పరంపరని మొదలు పెట్టారనేదానికి సాక్ష్యం చెప్పగలిగిన ఒక్క రికార్డు కూడా కనపడలేదు నాకు" అనేశాడు.

      బౌద్ధమతానికి సంబంధించి మనలో రెండు రకాల భ్రమలు ఉన్నాయి.ఒకటి, శంకరాచార్యుడు బౌధ్ధాన్ని నాశనం చేశాడనేది.రెండు,అశోకుడు ఒక్కడే బౌధ్ధాన్ని ఎక్కువగా ఆదరించాడనేది.బుద్ధుడు పుట్టి 80 యేళ్ళ వయస్సులో మహాపరినిర్వాణం చేసిన 300 సంవత్సరాల తర్వాతి వాడు అశోకుడు.ఆ మధ్య కాలంలో ఎవరూ ఆదరించనే లేదా?ఎవరూ ఆదరించకుండానే 300 ఏళ్ళ పాటు సజీవంగా ఉండగలిగిందా!అశోకుడి పరివర్తనకి కారణమైనదిగా చెప్పబడుతున్న  కళింగ యుధ్ధం కూడా నిజంగా జరిగిందని చెప్పలేని పరిస్థితి.ఇవ్వాళ మనం చదువుతున్న అధికారికమైన చరిత్ర అంతా నెహ్రూ ఆదరణతో విశ్వవిద్యాలయాల్లో చేరిన కమ్యునిష్టులు తమ ఎజెండాని బట్టి వండివార్చిన చరిత్ర.



      చారిత్రకంగా చూస్రే క్రీ.శ 8వ శతాబ్దానికి ముందు అప్పటికే మహాయానం ప్రముఖం కావడం వల్ల బుధ్ధుడు దేవుడుగా మారినా విష్ణువు యొక్క అవతారం అనే మాట వినబడేది కాదు.ఈమార్పు క్రీ.శ 8వ శతాబ్దం నాటి రాజకీయ పరిస్థితుల కనుగుణంగా జరిగింది గనక దీని మూలంగా ఆధ్యాత్మికమైన కల్లోలం ఏదీ జరిగినట్టు కనిపించదు.అప్పటి రాజస్వామ్యమైనా ఇప్పటి ప్రజాస్వామ్యమైనా ప్రభుత్వానికి ప్రజల వైపు నుంచి కావలసింది విధేయత.ఆ విధేయతను భగ్నం చెయ్యనంత వరకు ఏ ప్రభుత్వమూ ఏ మతాన్నీ తిరస్కరించదు - ప్రభుత్వంలో ఉన్నవారికి మరీ వ్యక్తిగతమైన ద్వేషం ఉంటే తప్ప!మహాయాన సంప్రదాయం ప్రకారం వాళ్ళు కూడా దేవాలయాలు కట్టడం మొదలయ్యాక రాజులకి ఒక సమస్య వచ్చి పడింది.రాజు మతాన్ని ప్రోత్సహించడం అంటే ఏమిటి?ఒక ప్రాంతంలో వాళ్ళు ఆలయం కోసం సరైన స్థలం ఎన్నుకోవడం దగ్గిర్నుంచి వారి మతానికి సంబంధించిన వైభవోపేతమైన వేడుకలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు కలగకుండా చూదటం,అవునా?ఈ లెక్కన ఒక ప్రాంతంలో హిందువులనీ బౌధ్ధులనీ వేరువేరుగా ప్రోత్సహించడం కన్నా రెంటినీ కలపడం ద్వారా ప్రభుత్వ నిధుల్నీ పొదుపు చెయ్యొచ్చు లేనిపోని తలనెప్పుల్నీ తగ్గించుకోవచ్చు . ఎప్పుడైతే దేవుడు లేడన్న బుధ్ధుణ్ణి దేవుడిగా మార్చుతూ మహాయానం మొదలైందో అప్పుడే ఈ దేశంలో బౌధ్ధం ఆకర్షణ కోల్పోవమూ మొదలైంది!అచ్చం హిందూమతంలాగే ఉన్న బౌధ్ధం లోకి ఏ హిందువైనా ఎందుకు మారాలి?బౌధ్ధానికి భారత దేశంలో ఉన్న ఈ ప్రతికూలత విదేశాల్లో ఎదురు కాలేదు కాబట్టి ఆయా దేశస్థుల్ని బౌధ్ధం విశేషంగా ఆకర్షించింది.ఆ దేశాలకి వెళ్ళింది కూడా అప్పటికే హిందూమతాన్ని అనుకరించటం మొదలుపెట్టిన నవీన భౌద్ధమతమే!శంకారాచార్యుడు చేసినదల్లా హిందూమతాన్ని చైతన్యవంతం చెయ్యడం,దానితో సహజంగానే బౌధ్ధం పెద్దగీత పక్కన చిన్నగీతగా ఉన్నది కాస్తా బుల్లిగీతగా అయ్యింది.

      ఇక గౌతమ బుధ్ధుణ్ణి విష్ణువు అవతారంగా చెప్పాలంటే ఇటు హిందూ పురాణాల్లో గానీ అటు బుద్ధ వాజ్మయంలో  గానీ ప్రస్తావనలు ఉండాలి కదా!అంతకు ముందరి కాలంలో ఏ ప్రస్తావనలూ లేకుండా ఒక్కసారిగా ఒక మతం దేవుణ్ణి మరో మతానికి అంటుగట్టెయ్యడం అంటే బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టెయ్యడమే కదా - ఇరుమతాల్లోని పెద్దలూ అంతటి అప్రాచ్యపు ప్రతిపాదనకి ఎలా ఒప్పుకుంటారు?"ఏకవింశతితమం బైన బుద్ధ నామధేయంబునం గలియుగాద్యవనరంబున రాక్షససమ్మోహనంబు కొరకు మధ్యగయాప్రదేశంబున జినసుతుండై తేజరిల్లు" అని పోతన భాగవతంలో బుధ్ధావతార వర్ణన ఉంటుంది."Some Blunders of Indian Historical Researchగ్రంధంలో పి.యన్.ఓక్ మహాశయుడు మగధ రాజవంశావళిని తెలుసుకోవడానికి పురాణాలు ప్రశస్తమైన ఆధారసామగ్రి అని పేర్కొన్నాడు.మహాభారత యుధ్ధం జరిగే కాలానికి సోమాధి అనే అతను మగధకు ప్రభువుగా ఉండేవాడు.అతను వంశకర్తగా 22 మంది రాజులు 1006 సంవత్సరాలు గడిచాయి.ఆతర్వాత ఆయిదుగురు రాజల పరంపరతో ప్రద్యోత వంశం 138 సంవత్సరాలు పాలించింది.దాని తర్వాత 10 మంది రాజుల పరంపరతో శిశునాగ వంశం 360 సంవత్సరాలు పరిపాలించింది.ఈ శిశునాగ వంశంలో నాలుగవ వాడై క్రీ.పూ 1892 నుంచి క్రీ.పూ 1852 వరకూ రాజ్యపాలన చేసిన క్షేమజిత్ గౌతమ బుధ్ధుడి తండ్రియైన కపిలవస్తు నగరాధీశుడు శుధ్ధోదనుడికి సమకాలికుడు!ఈ మధ్య కాలంలో పుట్టిన బుధ్ధుడు ఐదవ శిశునాగ ప్రభువైన బింబిసారుని పరిపానా కాలమైన క్రీ.పూ 1852 నుంచి క్రీ.పూ 1814 మధ్య కాలంలో జ్ఞానసిధ్ధిని పొంది తధాగతుడై ఆరవ శిశునాగ వంశపు రాజైన అజాతశత్రువు పరిపాలనా కాలమైన క్రీ.పూ 1814 నుంచి క్రీ.పూ 1787 మధ్యకాలంలో మహాపరినిర్వాణం పొందాడు."Age of Buddha, Milinda and King Amtiyoka and Yuga Purana" గ్రంధంలో పండిట్ కోట వెంకటాచలం కూడా ఇదే రకమైన విశ్లేషణ చేశారు.ఈయన లెక్క ప్రకారం బుద్ధుడు ఇక్ష్వాకు వంశపు రాజులలో 23వ వాడు.క్రీ.పూ 1814 నాటికి,అంటే అజాతశత్రువు పట్టాభిషేకం జరిగేనాటికి బుద్ధుడికి 72 ఏళ్ళు.కాబట్టి అతని జననం క్రీ.పూ 1887 అవుతుంది.

      కొత్త పరిశోధనల ప్రకారం ఇప్పుడు గౌతమబుధ్ధుడి కాలం క్రీ.పూ 6వ శతాబ్దం.అంటే క్రీ.పూ 1887 నాటి బుధ్ధుడూ క్రీ.పూ 643 నాటి బుధ్ద్జుడూ వేరువేరు వ్యక్తులు అని నిర్ధారణ అయినట్లే కదా!వీరి తలిదండ్రుల పేర్లు కూడా ఒకటి కాదు.పుట్టిన ప్రాంతాలూ ఒకటి కాదు.మొదటి బుద్ధుడి తండ్రి జినుడు లేక అజినుడు,తల్లి అంజన.పురాణాలలో అతని అవతార సంభవానికి సంబంధించిన కధల లొని విశేషాల్ని ఒకటిగా కలిపితే ఇట్లా ఉంటుంది:కలియుగారంభంలో వైదిక ధర్మాన్ని లోపలి నుంచి భ్రష్టు పట్టించడానికి రాక్షసులు యజ్ఞయాగాదులలో జంతుబలుల్ని ప్రవేశపెట్టి చెలరేగిపోతున్నారు.శుక్రాచార్యుడు రాక్షసుల్ని అజేయుల్ని చెయ్యడానికి ఒకటి లేక అనేక యజ్ఞాల్ని చెయ్యటానికి సంకల్పించాడు.దానితో ఎప్పటిలాగే దేవతలు అర్ధించగా అజిన ప్రభువుకు 12 ఏళ్ళ వయసు బాలుడిగా కనబడ్డాడు.అతని చక్కదనానికి ముగ్ధుడై జినుడు అతన్ని సంతానంగా స్వీకరిస్తాడు.అట్లా రాక్షసుల వ్యూహాన్ని తిరిగి వారి మీదకే విసురుతున్నట్టు వారిలో ఒకడై వారికి యజ్ఞ యాగాదులలో జరిగే జంతుబలుల పట్ల అసహ్యం పుట్టించి శుక్రాచార్యుడు చేయించదలుచుకున్న యజ్ఞాలకు విముఖత్వం కలిగించటానికి అహింసను బోధించి సమ్మోహితుల్ని చేసి పరివర్తన ద్వారానే దుష్టసంహారం చేస్తాడు.ఫలితంగా వైదికధర్మవిరుద్ధమైన జంతుబలుల వంటి క్రూరమైన రాక్షసకృత్యాలు నిరోధించబడి వైదికధర్మం దోషరహితమై తిరిగి ధూమరహిత దీపకళిక వలే వెలిగింది.ఇవి హిందూ పౌరాణిక సాహిత్యరూపాల వైపు నుంచి మొదటి బుద్ధుడికి సంబంధించిన విశేషాలు.ఇప్పుడు మనం బుద్ధగయ అంటున్న దానిని పురాణాలో కీకట దేశం అని ప్రస్తావించారు.అది కూడా సరిగ్గానే కలుస్తున్నది.ఇప్పటి బుద్ధుడు జన్మించినది కపిలవస్తు,తల్లి మహామాయ,తండ్రి శుద్ధోదనుడు.ఈ తేడాల వల్ల హిందువుల పౌరాణిక గ్రంధాల వైపు నుంచి తొలిదశలో ఇద్దరు బుద్ధుల్ని గుర్తించినట్లే తెలుస్తున్నది గదా!



      అటువైపు బౌద్ధమత సాహిత్యంలోనూ తొలిదశలో ఇద్దరు బుద్ధుల్ని వేరువేరు వ్యక్తులుగా గుర్తించినట్లు ఆధారాలు ఉన్నాయి.అమరసింహుడు అనే ప్రముఖ రచయిత బుద్ధ సాహిత్యంలోని చాలా గ్రంధాల్ని రచించాడు.వాటిలో అమరకోశం ఒకటి.అందులోని ఒక బుద్ధ స్తుతి ఇలా ఉంటుంది:

"సర్వజ్ఞః సుగతో ధర్మజ్ఞః తధాగతః
సమంత భద్రో భగవాన్ మారజిత్ లోకజిత్ జినః
శదభిజ్ఞో దశబలో ద్వయవాది వినాయకః
మునీంద్ర శ్రీఘనః శాస్తమునిః"

ఇందులోని 18 పేర్లూ సుగతబుద్ధుడికి సంబంధించిన విశేషణాలు.తర్వాతి చరణాలు ఇలా ఉంటాయి:

"శాక్యమునిస్తు యః స శాక్యసింహః సర్వార్ధసిద్ధ శౌద్ధోదనిశ్చ
గౌతమశ్చ అర్కబంధుశ్చ మాయాదేవీ సుతశ్చ సః"

      ఈ రెండవ భాగంలోని ఏడు పేర్లూ గౌతమబుద్ధునికే వర్తిస్తాయి తప్ప సుగత బుద్ధునికి కాదని మీకూ అర్ధమయ్యే ఉంటుంది.బుద్ధ వాజ్మయంలో బుద్ధమూర్తులు చాలామంది ఉంటారు అమితాభ బుద్ధుడు,సమంత భద్రుడు,మైత్రేయ బుద్ధుడు - ఒక్కొక్క బుద్ధునికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.సుగత బుద్ధునికి సమంతభద్రుడు అనేది పర్యాయపదం.మరింత గట్టి సాక్ష్యం క్రీ.శ 1807 నాటి H. T. Colebrooke యొక్క అమరకోశం అనువాదంలో దొరుకుతుంది.అందులోని 21వ అధ్యాయంలో లలితవిస్తారగ్రంధం నుంచి ప్రస్తావనల్ని ఉదహరిస్తూ సుగత బుద్ధుడు తపస్సు చేసిన చోటనే గౌతమ బుద్ధుడు తపస్సు చేసినట్లు ప్రస్తావించాడు!


LAUGHING BUDDHA
      కాలం చూస్తే 500 సంవత్స్రాలు తేడా,పుట్టుక చూస్తే ప్రాంతాలు వేరు తలిదండ్రులూ వేరు,మతం చూస్తే రెండూ ఒకదానికొకటి విభిన్నమైనవి - అయినా ఈ ఇద్దర్నీ కలిపేస్తుంటే ఏ మతంలోనివారూ అసలు అభ్యంతరమే చెప్పకుండా ఎందుకు కొనసాగించారు?నేను చదివిన  విశ్లేషణలు చాలా ఉన్నాయి,కానీ ఏ ఒక్కటీ సమగ్రంగా లేదు - నాకు కొన్ని అసలు నమ్మదగినవిగా అనిపించ లేదు. చదివిన వాటిల్లో నాకు నచ్చినవి రెండు,నాకు తోచినవి రెండు కలిపితే మొత్తం కారణాలు నాలుగు.


బౌద్ధమత సాహిత్యం లోని అస్పష్టత:

        ఇప్పటికీ నాకు రెండవ బుద్దుడైన గౌతమ బుద్ధుడు చారిత్రక వ్యక్తియేనా లేక బౌద్ధమతస్థుల కల్పనయా అనే సందేహం వదలటం లేదు.ఎందుకంటే కోట వెంకటాచలం ప్రభృతులు వర్ణించిన వంశావళి లోని క్రీ,పూ 1884 నాటి బింబిసారుడూ అజాతశత్రువూ మళ్ళీ క్రీ.పూ 6వ శతాబ్ది కాలంలోనూ కనిపిస్తున్నారు.మగధీరలో హీరో ఒక్కడే కాకుండా హీరోయినూ విలనూ కూడా మళ్ళీ పుట్టి మళ్ళీ అదే రకంగా తన్నుకున్న ఫార్ములా సినేమా ఖద చరిత్రలో రిపీటయ్యే అవకాశం ఉంటుందా!


WARRIOR BUDDHA
      బౌద్ద సాహిత్యంలో ఈ బుద్ధుడి వంశావళికి సంబంధించి నాలుగు వెర్షన్లు ఉన్నాయి.1.హిందూ పురాణాలు.2.భారత దేశపు తొలినాటి బౌద్ధవాజ్మయం,3.సింహళ దేశపు వెర్షన్,4.చైనా దేశపు వెర్షన్ - ఈ నాలుగూ నాలుగు రకాలుగా చెప్తున్నాయి.గట్టిగా నిలదీస్తే జవాబు చెప్పలేని పరిస్థితి వారిలోనే ఉన్నది గాబట్టి బౌద్ధులు వెనక్కి తగ్గి ఉండవచ్చు.పైగా వ్యక్తుల పేర్లూ ఉద్దేశం మాత్రమే తేడా తప్ప మౌలిక సిద్ధాంతం ఒక్కటే!వారంతట వారే సుగత బుద్ధుణ్ణి సమంత భద్రుడిగా ఒప్పుకుని ఉన్నారు గనక ఆ బుద్ధుడూ ఈ బుద్ధుడూ ఒక్కరే అని ఒప్పుకోవడానికి అభ్యంతరం ఏముంటుంది?


శంకారాచార్యుల వారి స్ఖాలిత్యం:

      చరిత్రలో హిందువుల వైపునుంచి తొలిసారిగా వీరిద్దర్నీ కలిపిన వ్యక్తి శ్రీ శంకర భగవత్పాదులు.వాదనలో బౌద్దుల్ని ఓడించిన తర్వాత శిష్యులతో చేసే ప్రస్తావనల్లోనూ తన రచనల్లోనూ ఇద్దర్నీ కలిపి "సర్వధ అపి అనాదరణీయ అయం సుగత సమయః ఇతి అభిప్రాయః అమరకోశ గ్రంధ" అని ప్రస్తావించడం జరిగింది.ఇది శంకరాచార్యుల వారు కావాలని చేశారా లేక పొరపాటుగా చేశారా అనేది చెప్పలేము గానీ దీనివల్ల హిందువుల వైపు నుంచి ఇద్దరు బుద్ధుల్నీ కలపడం పట్ల వైముఖ్యం తగ్గి ఉండొచ్చు.శంకరాచార్యుడు తను విమర్శించడానికి తీసుకున్న అమరకోశం లోనే పైన చెప్పుకున్న స్తుతి ఉంది కదా!అదీ గాక గౌతమ బుద్ధుడి కాలం నాటికే సుగత బుద్ధుడికి సంబంధించిన వివరాలు విస్మృతమైపోయినాయి.శంకరాచార్యుడు సొంతంగా ఈ ఇద్దరూ వేరువేరా లేక ఒక్కరా అనే విషయం మీద శ్రద్ధ చూపించి ఉండకపోవచ్చు.శంకరాచార్యుడి ఆధ్యాత్మిక ప్రయాణం అతివేగంగా జరిగింది.గౌతమ బుద్ధుడు 45 ఏళ్ళ పాటు ఉత్తరాదినే తిరిగి సాధించిన దాన్ని శంకరుడు కేవలం ఇరవయ్యేళ్ళ లోనే ఆసేతుశీతనగం వరకూ తిరిగి సాధించాడు - అసలైన లక్ష్యంతో పోలిస్తే ఇలాంటివి కూడా పట్టించుకుని ఉంటే ఆ వేగం సాధ్యమయ్యేది కాదు!


GREEN BUDDHA
      ఏ విధంగా జరిగినా శంకరాచార్యుల ముఖతా వచ్చిన ఈ ప్రస్తావన సరిగ్గా అదే సమయంలో రాజులు ఈ రెండు మూర్తుల్నీ కలపడానికి తీసుకున్న రాజకీయ నిర్ణయం పట్ల సామాన్య హిందువులకి వ్యతిరేకత లేకుండా చేసంది.శంకరాచార్యుడి కాలం తర్వాత కూడా బౌద్ధమతం ఈ దేశంలో పూర్తిగా మాయమై పోలేదు,హిందువులు గానీ శంకరుడు గానీ నిజంగా నాశనం చెయ్యాలనుకుని ఉంటే బుద్ధుడి తర్వాత అశోకుడి కాలానికి మధ్యలో ఉన్న 300 సంవత్సరాలు చాలా ఎక్కువ,శంకరుడి కాలం తర్వాత బౌద్దం మనగలిగిన కాలం కూడా చాలా ఎక్కువే!


హిందువుల వసుధైక కుటుంబ భావన:

      ఈ రోజున కొందరు తమ ఎజెండా ప్రకారం చేసిన కుట్రలు బయటపడి హిందువులు సంఘటితమవడం చూసి అసహనం ఎక్కువై తమలోని అసహనాన్ని హిందువులకి అంటగట్టి అల్లరి చేస్తున్నారు గానీ చరిత్ర కందని కాలం నుంచీ హిందువులలో పరమత సహిష్ణుత చాలా ఎక్కువ.ఈ సనాతన ధర్మం లోని అత్యున్నతమైన భావ శకలాల్లో "వసుధైక కుటుంబ భావన" ఒకటి.మహా ఉపనిషత్తు 6వ అధ్యాయం లోని 72వ శ్లోకం "అయం బంధురయం నేతి గణానా లఘుచేతసాం ఉదారచరితానాం వసుధైవ కుటుంబం" అని చెప్తుంది.కేవలం ఈ ఒక్కచోట మాత్రమే కాదు వైదిక సాహిత్యం లోని హితోపదేశ మనే మరొక భాగం లోనూ కనబడుతుంది.గీత లోని ఏ ఒక్క భావమూ కేవలం హిందువులకి మాత్రమే చెప్తున్నట్టు ఉండదు.ఈ పృధివి పైన జన్మించిన ప్రతివాడూ పార్ధుడే కదా,మొత్తం భారతీయ వేదాంత మంతటా "లోకా స్సమస్రా సుఖినో భవంతు" అనే భావన అంతర్లీనంగా కనబడుతూనే ఉంటుంది.ఇతర మతాల వారు మా మతాన్నే పాటించండి,మేము చెప్పిన దేవుణ్ణే కొలవండి,లేకపోతే మీరు సర్వనాశనమై పోతారు అని చెప్తుంటే ఒక్క హిందూ మతాచార్యులే "అన్ని మతాలూ చెప్పేది ఒక్కటే,ఎవరి మతాన్ని వారు నిష్ఠగా పాటించుకుంటే చాలు" అంటున్నారే తప్ప మత మార్పిడుల ద్వారా సంఖ్యని పెంచుకోవాలని చూడటం లేదు.ప్రాచీనత వల్ల కలిగిన ఔన్నత్యాన్ని బలహీనతగా భావించే బధిరాంధులకు నమస్కారం!ఔన్నత్యం వల్ల కలిగిన శాంతిప్రియత్వాన్ని చేతగానితనంగా భావించే ద్వేషభూయిష్టులకు నమస్కారం!

      సాంస్కృతికపరమైన ఈ వసుధైక కుటుంభ భావన ఈ గడ్డ మీద పుట్టటానికి వీరి మూలమే కారణమని ఆధునిక శాస్త్ర పరిశోధనలు కొత్త గొంతుకతో చెప్తున్నాయి.జన్యుశాస్త్రం, వాతావరణ శాస్త్రం, శిలాజ శాస్త్రం వంటి ఎన్నో శాస్త్రాలని ఆధారం చేసుకుని పరిశోధించి STEPHEN OPPENHEIMER అనే శాస్త్రవేత్త సకల సమూహాల నాగరికతలకీ తల్లివేరు భరతభూమియే అని నిర్ద్వంద్వంగా చాటిచెప్పాడు!అనుమానం ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న ఒక యానిమేటెడ్ జర్నీ చూసి తెలుసుకోవచ్చు.దాని ప్రకారం 160,000 సంవత్సరాల క్రితం తూర్పు ఆఫ్రికా గడ్డ పైన తొలి తరం మానవజాతి ఉద్భవించి ప్రవృద్ధమై ప్రకృతి ఒడిలో ఆడుతూ పాడుతూ స్వేచ్చగా తిరుగాడింది.135,000 సంవత్సరాల నాటికి నాలుగు దిక్కులకీ వ్యాపిస్తూ ఒక సమూహం గుడ్ హోప్ అగ్రాన్ని చేరుకున్నది, ఒక సమూహం కాంగో బేసిన్ చేరుకున్నది, మరొక సమూహం ఐవరీ కోస్ట్ వైపుకీ చేరుకున్నది.115,000 సంవత్సరాల నాటికి మరొక సమూహం 125,000 సంవత్సరాల నాటి ఆకుపచ్చని సహారాను దాటి ఉత్తరపు మైదాన ప్రాంతంలో ఆఫ్రికా ఖండపు సరిహద్దుని దాటింది.ఇది ఆఫ్రికా నుంచి ఇతర ప్రాంతాలకి కదిలిన తొలి మానవ సమూహం.కాని 90,000 నాటికి ఈ మానవ సమూహం తొలి హిమానీ యుగం శైతల్యపు తీవ్రతకి నశించి పోయింది.మళ్ళీ 85,00 సంవత్సరాల క్రితం మరొక సమూహం ఈసారి ఎర్ర సముద్రపు ముఖద్వారం దగ్గిర ఆఫ్రికా ఖండాన్ని దాటి తీరప్రాంతం వెంబడి పయనించి భరతఖండాన్ని చేరింది.ఈనాటికీ ఆఫ్రికేతర సమూహాలన్నీ భరతఖండాన్ని చేరిన ఈ సమూహం నుంచే ఉద్భవించినాయి.ప్రపంచమంతటా ఈనాడు విస్తరించిన అన్ని మానవ సమూహాలకూ ఆధారమైన తొలి మానవ సమూహం ఇక్కడ తామరతంపరగా పెరిగి తర్వాతనే ఇతర ప్రాంతాలకు విస్తరించింది.అయితే,74,000 సంవత్సరాల క్రితం ఇప్పటి సుమత్ర్రా ప్రాంతంలో ఉన్న తోబా అగ్నీర్వతం విలయాన్ని సృష్టించటంతో ఇప్పటి భారత్,పాకిస్థాన్ దేశాల మధ్య ప్రాంతంలో పరిఢవిల్లిన జీవరాశి మొత్తం నశించిపోయింది.65,000 సంవత్సరాల క్రితం నాటికి తొలి విధ్వంసం తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన ఇతర మానవ సమూహాలలో కొన్ని నావలలో సాగరాల్ని దాటుకుని రావడంతో తాతల నాడు దూర దేశం తరలివెళ్ళిన వారి మనుమలు తాతల నాటి పాతకొంపకి తిరిగి వచ్చినట్టు భరత ఖండం మళ్ళీ మానవ సమూహాలతో కళకళ లాడటం మొదలైంది.ఈ మానవ సమూహాలన్నీ ఒకే స్త్రీ మూర్తి నుంచి వచ్చాయని జన్యు పరిశోధనలు చెప్తున్నాయి.అందుకే కాబోలు మనవాళ్ళు అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మకు శ్యామవర్ణం పులిమి భయద సౌందర్యాన్ని రూపు దిద్ది చూపించారు!పురాణ సంస్కృతియైన భారత సంస్కృతియే సకల సంస్కృతులకు తల్లియని ప్రాజ్ణులు కొందరు చెప్పినప్పుడు నమ్మనివారికి కూడా నమ్మకం కుదిరేటంత గొప్పగా సత్యాన్ని తేటతెల్లం చేసిన ఒప్పెన్ హీమర్ మహాశయుడికి సర్వాంగ ప్రణామం!


బౌద్ధుల శాంతిపూర్వక స్నేహశీలత:

      తన కాలానికి నాస్తికత్వం ప్రబోధించిన తధాగతుడే మీ బుద్ధిని ఉపయోగించుకుని మీ ధర్మాన్ని మీరు నిర్వచించుకొమ్మని ఇచ్చిన స్వేచ్చను ఉపయోగించుకుని కాలానికి తగ్గట్టు మారుతూ మహాయాన వజ్రయాన సిద్ధాంతాల్ని చెప్పినా మౌలికమైన అహింసాయుతమైన ప్రవర్తనతో జీవించటం,తర్కబద్ధమైన వాదనతోనే ఇతరుల్ని మెప్పించటం అనేవాటికి భంగం కలగనివ్వకపోవటం బౌద్ధ మతస్థుల లోని విశేషం!తమ మతానికి సంబంధించిన దైవాన్నీ హిందూ మతానికి సంబంధిన దైవాన్నీ ఒక్కటి చెయ్యాలని ప్రతిపాదించినప్పుడు తమ మౌలిక ధర్మచక్రప్రవర్తనకి విరుద్ధం కానందువల్ల దైవసంకరం అని భావించకుండా హిందువులతో ఏకీభవించటం బౌద్దుల స్నేహశీలరకు తార్కాణం.



      ఒక వ్యక్తి చేత స్థాపించబడిన మతధర్మా లన్నిటిలో సరిహద్ద్దు లెరుంగక సకలజనుల్నీ అమోఘంగా ఆకర్షించి అత్యంత శాంతియుతంగా వ్యాపించినది బౌధ్ధ ధర్మం ఒక్కటే.H.Fielding Hall  తన The soul of a People గ్రంధంలో "There can never be a war of Buddhism.No ravished country ever borne witness to the prowess of the followers of the Buddha; no murdered men have poured out their blood on their hearth stones, killed in his name: no ruined women have cursed his name to high heaven. He and his faith are clean of the stain of blood. He was the preacher of the Great Peace.,of love of charity of compassion, and so clear is his teaching that it can never be misunderstood" అన్నాడు.

                         బుధ్ధం శరణం గఛ్చామి!ధర్మం శరణం గఛ్చామి!సంఘం శరణం గఛ్చామి!
-----------------------------------------------------------------------------------------------------------------
(చిత్రాలు గూగుల్ సౌజన్యం)

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...