Friday 20 June 2014

తెలంగాణా చరిత్ర యెంత ఘనమయినదో!

గతంలో తెలంగాణా వారు మహా భారత యుధ్ధంలో పాందవుల పక్షాన పోరాడారు, ఆంధ్రా వాళ్ళు కౌరవుల పక్షాన పోరాడారు అన్నారు కదా!

భారత ప్రభుత్వం చరిత్ర కు సంబంధించి మాపుల్ని కూడా ఉదహరించింది. వాట్ని ఆధారం చేసుకుని చూస్తే బహమని సుల్తానుల కాలంలో తెలంగాణా అని కనబడుతున్న భూభాగం వరంగల్, విజయవాడ, రాజమండ్రి కలిసిన సముద్ర తీర ప్రాంతంగా కనిపిస్తున్నది మరి?

బహమనీ రాజ్యం మ్యాప్

బహమనీ రాజ్యం విశేషాలు

మహా జనపదాల మ్యాప్

శాతవాహనుల రాజ్యం మ్యాప్

ఆ మహా భారత కాలంలో పాండవుల తరపున యుధ్ధం చేసిన వారి అనువంశికత ఇప్పుడు ఉన్నదా ఈనాటి తెలంగాణాలో? ప్రపంచంలో జాతులను గుర్తించటానికి మూడే మూడు ఆధారాలు.మొదటి కాలం తెగలుగా ఉన్నప్పుడు పుట్టుక కు సంబంధించిన కుదురు జాతిని నిర్నయించేది.భరత గణం తృత్స గణం – ఇలా.తరవాత మహా జనపదాలు వచ్చాక ప్రాంతం ఆధార మయింది: అంగ, వంగ, కళింగ – ఇలా.ఈ మహా జనపడాల్ని చూపంచే ఒక మాపులో తెలింగ అనే ప్రాంతాన్ని చూశాను.అది సముద్రతీరాన్ని తాకుతున్నది మరి?

ఈ దశ దాటిన తర్వాత అర్వాచీన కాలంలో ప్రపంచమంతటా ప్రాంతమే జాతిని నిర్ణయిస్తున్నది. భాష కూడా ఆ జాతి పేరుతోనే ఉన్నది. రష్యన్లు మాట్లాదేది రష్యన్ అనే దగ్గిర్నుంచి గుజరాతీలు మాట్లాడేది గుజరాతీ అనే వరకు.ఆధునిక కాలంలో ఒక్క తెలంగాణా వారికి తప్ప మిగతా ప్రపంచం లోని జాతు లన్నిటికీ ప్రాంతం, జాతి మరియు భాష అనే మూడింటికి అవినాభావ సంబంధం ఉంటుంది,అవునా కాదా?

వారు విడగొట్టుకున్న ఈ నాటి భాగం రజాకారుల్ని జనం మీదకి వొదిలి ఈ దేశంలోనే కలవనని భీభత్సం చేసిన నిజాముకు సంబంధించిన హైదరాబాదు రాష్ట్రం కాదా?

తెలింగ  వొచ్చి ఇప్పటి ఆంధ్రాలో కలుస్తున్నదని తెలిసాకనో యేమో ఇప్పుడు ఆసక లేదా  అశ్మక మీద పడ్దారు.అది చూస్తే మహారాష్త్ర తో కలుస్తుంది.యేమిటి సార్ ఈ గందరగోళం.ఇప్పటి తెలంగాణా స్థానంలో ఆ మాపులో ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఉంది.

ఈ వ్యాసం చూడండి!
అందులో అసక లేదా అశ్మక గురించి యేమి చెప్పారో చదవండి.

The Country of Assaka or the Ashmaka tribe was located in Dakshinapatha or southern India. In Buddha's time, the Assakas were located on the banks of the river Godavari (south of the Vindhya mountains). The capital of the Assakas was Potana or Potali, which corresponds to Paudanya of Mahabharata. The Ashmakas are also mentioned by Pāṇini. They are placed in the north-west in the Markendeya Purana and the Brhat Samhita. The river Godavari separated the country of the Assakas from that of the Mulakas (or Alakas). The commentator of Kautiliya's Arthashastra identifies Ashmaka with Maharashtra. The country of Assaka lay outside the pale of Madhyadesa. It was located on a southern high road, the Dakshinapatha. At one time, Assaka included Mulaka and abutted Avanti.

మరో లింకు చూడండి!!
అందులో అసక లేదా అశ్మక గురించి యేమి చెప్పారో చదవండి.

Assaka / Ashmaka
Assaka, also known as Ashmaka was a kingdom that was located in the south of India. During the time of Buddha, this tribe was located on the banks of river Godavari. The capital city of Assaka was known as Potana. It was situated in central India and extended till southern India. It is estimated that Assaka was situated roughly at the place where modern day Maharashtra is located.

మరో లింకు చూడండి!!!
అందులో అసక లేదా అశ్మక గురించి యేమి చెప్పారో చదవండి.

Assaka or Ashmaka: It was located in the southern part of India. The Assaka had its capital at Potali or Potana. It is believed that Ashmaka was located roughly at the place where present day Maharashtra is located.

పక్క రాష్త్రం లోని రాజ్యాల్ని తమవిగా చెప్పుకుంటున్నారు!

నేను ఒక తెలంగాణా వారి బ్లాగు పోష్టులో ఒక టపాను చూశాను.అక్కడ నేను ఒక ప్రశ్న అడిగాను.
"ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు" - అనే ప్రస్తావన చూసి

అయ్యా,
ఈ అర జిల్లాకు అర్ధ మేమిటో సెలవిస్తారా?భౌగోళికంగా కానీ, సామాజికంగా కానీ,సాంస్కృతికంగా కానీ, వ్యావకారికంగా కానీ అయితే మూడు జిల్లాలు లేకపోతే రెండు జిల్లాలు ఉంటాయి.కానీ మీరు రెండున్నర జిల్లాలు అంటున్నారు.దాని అర్ధం కొంచెం విపులంగా వివరిస్తే బాగుంటుంది.

ఉద్యమం మొదటి నుంచీ ఈ “రెండున్నర జిల్లల భాషని మా మీద రుద్దిన్రు” అనే మాటతో చాలా చేశారు!యే రెండున్నర జిల్లాల భాషని గురించి మీరు చెప్తున్నారు? ఆ రెండున్నర జిల్లల భాషని అందరి మీదా రుద్దడమే జరిగీతే మీరు కాకుండా మిగతా జిల్లాల వాళ్ళు వ్యతిరేకించరా?భాషాభిమానం మీకు మాత్రమే ఉందా?

ఒక కృష్ణా జిల్లా వ్యక్తీ ఒక కరీం నగర్ జిల్లా వ్యక్తి మొదటి సారి కలవగానే తమ తమ మాందలికాల్లో మాట్లాడుకోవటం మొదలు పెడితే ఆ సంభాషణ యెలా ఉంటుందో తెలుసుకోగలరు కదా? ఇప్పుడు మనం బ్లాగుల్లో కూడా అందరికీ అర్ధమయ్యేలాగా ఇలాగే యెందుకు మాట్లాడుకుంటున్నాం?విభజనకు పూర్వం 23 జిల్లాలు ఉండేవి కదా, వాళ్ళందరూ అర్ధం చేసుకోవడానికి యాసలు లేకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విధంగా యేర్పాటు చేస్తే దాన్నీ తప్పు పడుతున్నారే?మీ కన్నా రాయల సీమ వాళ్ళకి రోషం మరీ యెక్కువే, వాళ్ళని మీలో కలుపుతున్నాం అన్నప్పుడు “వామ్మో, సీమోళ్ళు?!” అనేశారు మీరు.నిజంగా మా భాషనే అందరి మీదా రుద్దటం జరిగితే వారెందుకు యెదురు తిరగలేదో?మీరంటున్న రెండున్నర జిల్లాల భాష అనే పదబంధంలో మీ వెటకారంతో కూడిన అతి తెలివి తప్ప ఇంకేదయినా ఉందా?సూచనగా కృష్ణా గుంటూరు జిల్లాలని గురించి అంటున్నారని తెలుస్తుంది(అర జిల్లా యేదో మీరు చెప్పాలి) గాబట్టి ఒక మాట అడుగుతున్నాను, నిజంగా కృష్ణా జిల్లాకి తనకంటూ ప్రత్యేక మయిన మాండలికం లేదా, ఇప్పుడు మామీద రుద్దారు అంటున్న ఈ భాష లాగే ఉంటుందా?


మొదలు పెట్టటమే రెండున్నర జిల్లాలు అని మీరు యెంత వెటకారంగా మాట్లాడినా మేము ఆ వ్యంగాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తే మిమ్మల్ని మీ భాషని ఆదరంగా చూసుకున్నట్టు అవుతుందా?ఇంతకీ ఆ “రెండున్నర జిల్లాల” పేర్లు చెప్తారా మీ నోటితో?
అని అడిగాను.
దానికి వారిలో ఒకరు ఇచ్చిన జవాబులోని మొదటి భాగం ఇది:
(ఇది 1969ల కాలోజి రాసిన పెద్ద కవితలో చిన్న భాగము)
ఇగ రెండున్నర జిల్లాలు అంటే క్లియర్ గానే చెప్పిన.

1. కృష్ణా, 2. గుంటూరు 3. ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము.

మళ్ళీ అడిగాను,యేమని?
ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము – అనేది యేంటి? ప్రత్యేకంగా ఆ జిల్లాలు రెండూ విడివిడిగానే ఉన్నాయి.అందుకనే అడుగుతున్నా, అయితే మూడు జిల్ల్లాలు లేదా రెండు జిల్లాలు అని మామూలు వాళ్ళు అంటారు.కానీ పైత్యకారి తనం ఉన్న వాళ్ళు మాత్రమే రెండున్నర జిల్లాలు అనే వెటకారం ఆడుతారు, అవునా కాదా?నేను దాని గురించి బాబూ అడుగుతున్నది!ఆ పైత్యకారి వెటకారాన్ని కూడా మీరు మమ్మల్ని పొగిడినట్టుగా భావించి మిమ్మల్ని నెత్తినపెట్టుకోవాలన్న మాట.

దీనికి వారింకా జవాబు చెప్పలేదు,యేమి చెప్తారో మన కనవసరం.ఒకటి మాత్రం నిజం,అలా మనల్ని వెక్కిరించిన కాళోజీకి మనం కూడా నీరాజనాలు పట్టాం ప్రజాకవి బిరుదు నిచ్చి పొగిడాం, యెందుకు?ఫలితం యేమిటి?

ముందు కాలంలో తప్పనిసరిగా తెలిసి వచ్చే విషయం ఒకటి ఉంది.ఇంకెంతో కాలం తెలుగు వాళ్లని కేవలం భాష తో ఒక్కటిగా ఉంచటం సాధ్య పడక పోవచ్చు.ఆంధ్ర ప్రాంతం లోని మేధావులు యెంత తొందరగా "రాష్ట్రాలుగా విడిపోయినా మనం భాష పరంగా ఒక్కటే" అనే మిధ్యని వొదిలించుకుంటే అంత మంచిది.ఈ అభిప్రాయాలు యెవరిలో ఉన్నా సరే అవి కేవలం అమాయకపు మాటలు మాత్రమే.ప్రాంతం పేరుతో స్వంత అస్తిత్వం కోసం అంత ద్వేషాన్ని రెచ్చగొట్టి విడిపోయింది తెలుగు వాళ్ళ మనే పేరుతో కలిసి ఉండడానికా?

వారు కోరుకున్నది ప్రత్యేక అస్తిత్వం, అస్తిత్వం నిరూపణ కావాలంటే పోటీ పడి గెలవాలి.వాళ్ళు పతీదానిలోనూ ప్రాంతంగా పోటీ పడుతుంటే ఆంధ్రావాళ్ళు మాత్రమే మనందరం తెలుగువాళ్ళం అని మురుసుకుంటూ ఉండాలా?

ఈ యాభై యేళ్ళుగా చేస్తున్నట్టు చూసీ చూడనట్టుగానో, అంత ప్రమాదం యేమీ జరగదులే అని మనకి మనమే సర్ది చెప్పుకోవడం వల్లనే ఇప్పటి స్థితి వచ్చింది, ఇక ముందు కూడా ఇదే అమాయకత్వం ప్రదర్శిస్తే మన ప్రాంతపు భవిష్యత్తు మనల్ని క్షమించదు.వాళ్ళెప్పుడో ముసుగులు విప్పేశారు.మనం కూడా విప్పెయ్యాలి వీలయినంత తొందరగా!

ఇంకా తెలుగువాళ్ళు- వాళ్ళని కలపడం అనే సుత్తి రెండు చోట్లా అధికారాన్ని ఆశించే తెదెపాకి మాత్రమే అవసరం,మనకి కాదు. ఆ రెండు కళ్ళ సిధ్ధాంతం చాటున మన రాష్ట్రానికి బెండు వెయ్యకుండా కళ్ళు తెరుచుకుని గమనించాలి.

Saturday 7 June 2014

పోలవరం గురించి ఇప్పుడేడ్చి యేం లాభం?

          విభజన బిల్లు లోనే ఆర్డినెన్సుల ద్వారానే పోలవరం కు అడ్డంకు లను తొలగించాలనీ ఉంది కదా? అంతా విశదంగా చదివారూ, సభలోనే ఉండి ఆమోదించారూ అయినా మళ్ళీ మళ్ళీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, యెలాగండీ మీతో?ఇక్కడ సామరస్యంగా విడిపోయే పధ్ధతి లో అయితే పంపకాలూ వాటాలూ అన్నీ మనం మనం కలిసి కూర్చుని చర్చించుకుని నిక్కచ్చిగా ఉండేది.

          ఇదివరకు భాజపా ద్వారా విడిపోయిన రాష్ట్రాల్లో మొదట విడిపోతామన్న వాళ్ళు కూడా అంకెకు తక్కువ గానే ఉన్నారు.అయినా వాళ్ళు మీలాగా ఇక్కడి అసెంబ్లీలో చర్చించకుండా పైనించి రుద్దేలాగా తెచ్చుకోలేదు. చాలా పధ్ధతిగా ప్రశాంతంగా విడిపోయారు.సభలో చర్చ జరిగినప్పుడు వ్యతిరేకించిన అధిక సంఖ్యాకులు కూడా ఒప్పుకున్నారు.

          కానీ మీరేం చేసారు?అంకెకి తక్కువగా ఉన్నాం, ఇక్కడ మాకు న్యాయం జరగదు అని అంటూ ముందు నుంచీ ఇక్కడ చర్చిస్తే యేమి కంకాళాలు బయట పడుతాయో అని ఈ విధంగా తిట్టి సాధించుకోవాలనే తప్ప సామరస్యంగా విడి పోదామని అనుకోని మీరు మాటి మాటికీ చర్చలకి రాలేదని మమ్మల్ని అంటున్నారు? అసెంబ్లీలో యెన్నికయిన శాసన సభ్యుల మధ్య జరిగే చర్చలే కదా జరగాల్సిన పధ్ధతి.ఇక్కద బ్లాగుల్లో యే గొట్టాం యే వాదన చేసినా ఫలితం ఉంటుందా?యేంతో కొంత కాకుండా చెప్పుకోదగిన స్థాయిలో అభివృధ్ధి చేందిన ఒక మాతృరాష్ట్రం విడిపోగా యేర్పడిన ఈ రెండు రాష్ట్రాలూ యెంత అయోమయాన్ని యెదుర్కొంటున్నాయో మీకు తెలియదా?ప్రభుత్వాలు యేర్పడే సరికే ఆస్తులు, అప్పులు ఇంకా బడ్జెట్ కేటాయింపులకి అవసరమయిన వనరుల లెక్కలూ అన్నీ తెలిసేటట్టు జరగాలి గదా! జరిగినాయా?యేందుకు జరగలేదు?ఇంత అధ్వాన్నంగా విడిపోవటం యెందుకు జరిగింది?

          ఉద్యమ విధాన మంతా తిట్టి సాధించుకోవాలనే మూర్ఖత్వం వల్లనే కదా విభజన ఇంత చండాలంగా జరిగింది! సామరస్యంగా విడిపోయే ఆ పధ్ధతి నే వ్యతిరేకించి ఇక్కడ అంకెకు తక్కువున్నాం మాకిక్కడ న్యాయం జరగదు, అందుకే మేమొక న్యాయమూర్తిని యెన్నుకున్నాం అని మూడో వర్గాన్న్ని న్యాయమూర్తిగా యెంచుకున్నప్పుడు ఆ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు కట్టుబడాల్సిన బాధ్యత కూడా మీదే.యేకపక్షమయిన తీర్పు ప్రపంచంలో యే న్యాయస్థానమూ ఇవ్వదు.తీర్పులో మాకు నచ్చినదాన్నే మేము పాటిస్తాం, మాకు నచ్చని వాట్ని మేము పాటించం అంటే మీ స్థాయిని మీరే దిగజార్చుకోవటం.

          ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రమాణస్వీకారాలు మాత్రమే చేశారు, కానీ ఆస్తులూ అప్పుల వివరాల్లో స్పష్టత ఉందా?బడ్జెట్ కేటాయింపులకి కావలసిన నిధుల లెక్క తేలిందా?యేదీ లేదు!హైదరాబాదు ఆదాయం తో కలిస్తేనే తెలంగాణా ఆదాయం మిగులులో ఉంటుంది.పునర్నిర్మాణం విషయంలో తెలంగాణాకీ యేన్నో ఇతరమయిన సమస్యలు ఉన్నయి, తెలుసా?

          కరెంట్ కొనుక్కోవాలి, మీ ప్రాజెక్ట్ లలో చాలా మటుకు యెత్తిపోతల పధకాలే - వీటన్నిటి పైనా దృష్టి పెట్టాలి మీ నాయకులు.కచరా కు ముందూ తర్వాతా ఉద్యమ స్వరూపం యెందుకు ఇట్లా మారిపోయిందో తెలుసా?అతను ఈ రకమయిన సమస్యలతో కూడిన తెలంగాణా వైపుకే యెందుకు దారి తీశాడో తెలుసా?వస్తే కొండ పొతే దారం అన్న యెత్తుగడ!అంతా తను అనుకున్నట్టు జరిగితే నా అంతటి మొనగాడు లేదని కాలరెగరెయ్యవచ్చు, లేకపోతే ఆంధ్రా వాళ్ళ దుర్మార్గం వల్ల సమస్యల తో కూడిన తెలంగాణా వచ్చిందే తప్ప తన తప్పేమీ లేదని తప్పుకోవచ్చు. తెలంగాణా ప్రవక్తగా తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర పుస్తకాల్లో తన పేరు ప్రతిష్టలకి లోటు ఉండదు.తెలంగాణాకు అంతకు ముందు ఉన్న సమస్యల కన్న ఈ రకంగానే విభజన జరగడం వల్ల వచ్చి పడిన, అంటే తను తెచ్చి పెట్టిన సమస్యలే యెక్కువ - అది తెలుసా మీకు?

          మీ ప్రాజెక్టులకీ నిర్వాసితుల సమస్య ఉంది, కానీ మీరు మాత్రమే దయార్ద్ర హృదయులూ, అంధ్రావాళ్ళు నిర్వాసితుల గురించి పట్టించుకోని క్రూరులూనూ, అంతేనా?మానవత్వం అంతా మీ దగ్గీరే ఉందా?సాటి వారి కష్టాన్ని గమనించని హృదయం లేని క్రూరులమా మేము?

          వాళ్ళు యే మాత్రం ఇబ్బంది పడకుండా వాళ్లని సంతోషంగా ఉంచే పధ్ధతి లోనే సాధించుకుంటాం. యే ప్రాజెక్ట్ కయినా నిర్వాసితుల సమస్య లేకుండా ఉందా? అందరూ యెలా పరిష్కరించుకుంటున్నారో మేమూ అలాగే పరిష్కరించుకుంటాం. అన్ని రకాల అనుమతుల్నీ ఖచ్చితమయిన ఆధారాల్ని సమకూర్చటం ద్వారానే తెచ్చుకుంటున్నాం కానీ మీకు లాగా విలీనం ఒప్పందం లాంటి వికారమయిన పధ్ధతుల్తో బల్ల కింద చేతులు పెట్టి తెచ్చుకోవడం లేదుగా?కేంద్ర జలసంఘం అనుమతి నిచ్చింది.ప్రణాళికా సంఘం కూడా పెట్టుబడులకి మార్గం సుగమం చేసింది.బచావత్ నుంచి మొదలుకుని మిగతా నదీ జలాల ఒప్పందాల్ని వేటినీ ఉల్లంఘించటం లేదు.ఇప్పుడు జాతీయ హోదా కూడా వచ్చింది.మరి మేమెందుకు పోలవరాన్ని ఆపెయ్యాలి?

          పార్లమేంటులో ప్రకటన జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయి, మేము అధికారం లోకి వచ్చాక పోలవరాన్ని కట్టనివ్వం అంటున్నాడు అతను.రాజ్యాంగబధ్ధంగా యెన్నికల్లో నిలబడి గెలిచి ముఖ్యమంత్రి పదవిని కోరుకునే వ్యక్తి అదే రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేసే చట్టబధ్ధమయిన పనుల్ని అడ్డుకుంటానని అంటున్నాడు. రాజ్యాంగాన్ని ధిక్కరించాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి రాజ్యాంగ బధ్ధమయిన పదవులకి అర్హుడేనా?

          మీ తెలంగాణా కల వయస్సు యాభయ్యేళ్ళే అయితే 1940ల నుంచి మేము పోలవరం కోసం కలలు కంటున్నాం.ఉభయ గొదావరి, విశాఖ, కృష్నా జిల్లాల్లో 7.20 లక్షల యెకరాలకు సాగునీరు అందిస్తుంది.తూర్పు గోదావరి జిల్లాలో 2 లక్షల యెకరాలు లాభ పడతాయి.విశాఖ జిల్లాకు పారిశ్రామిక అవసరాల్నీ తీరుస్తుంది. 960 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న గౌతమ బుఢ్ధుడు నిరంకుశుడా?అందర్నీ ఒప్పించి అందరి అనుమతుల్నీ తీసుకుని చేసే పనులు కూడా మీకిష్టం లేదు గాబట్టి ఆపెయ్యాలా?

          మీరన్న దోచుకోవటం, దాచుకోవటం, తరలించుకుపోవటం తెల్సిన వాళ్ళమే అయితే ఇప్పుడు విడిపోతున్న రెండు భాగాల్లో రాయలాంధ్ర మిగులు లోనూ తెలంగాణా తరుగు లోనూ ఉండి ఉండేది. మాకు ఇస్తున్న పాకేజీలు కూడా ఇంత చండాలంగా విభజిస్తున్నందుకు ముఖం చెల్లక విదిలించినవే తప్ప మేము వాటి గురించి కూడా యెక్కువగా అంగలార్చటం లేదు. మీ కలని యెంతో అపూర్వంగా చూసుకుని నెరవేర్చుకున్న మీరు పోలవరం అనే మా కలను చెదరగొట్టకుండా ఉంటే చాలు. విడిపోయి కలిసుందామని అంటున్న మీరు మాకేదయినా సహృదయంతో ఇవ్వదల్చుకుంటే అది పోలవరానికి అడ్డం రాకుండా ఉండటమే!

Tuesday 3 June 2014

ఈ వడ్లగింజలో బియ్యపుగింజ కింత రాధ్ధాంతమా?

============================================================
                                                        యేక సభ్య సంఘం
                                                     (ఆరు సూత్రాల పధకం)

                                             జే.యం.గిర్గ్లాని, ఐ.యే.యస్(విశ్రాంత)

                                                            ఆఖరి రిపోర్ట్
                                                      మూడు భాగములలో

అధ్యాయం - 1
కీనోట్
1.1.0 11/04.1969 వ తేదీన ప్రధాన మంత్రి, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారు లోక్ సభ లో తెలంగాణా ప్రాంతమునంకు సంబంధించిన అభివృధ్ధి, విద్యా ఉద్యోగ విషయాలకు సంబంధించి ఒక ప్రకటన చేశారు.ఇక్కడి సందర్భానికి తగిన ఒక ముఖ్య విషయం పాయింట్ 6 - "The possibility, of providing for appropriate Constitutional safeguards in the matter of public employment in favor of people belonging to the Telangana region will be examined by the Government of India in consultation with a committee of Jurists ". మిగిలిన అన్ని ఫారులాల వలెనే ఈ ఫార్ములా కూడా ఆచరణ లోకి రాలేదు.

                                                     ఆరు సూత్రాల పధకం - 1973

1.3.1 ఒక అఖిల పక్ష ప్రతిపాదన రాజ్యాంగ బధ్ధంగా రాష్ట్రపతి ఆదేశంగా రూపు దాల్చింది.

రిపోర్టు యొక్క పరిమితి

*1.4.0 ప్రతి వారిలోనూ కొన్ని విషయాలకు సంబంధించి గందరగోళం నెలకొని ఉంది. ప్రభుత్వం, ఉద్యోగులు,పాత్రికేయులు,రాజకీయ వాదులు,ఉద్యోగ సంఘాలు, న్యాయశాఖ అందరి లోనూ "ఆరు సూత్రాల పధకం", "రాష్ట్రపతి ఆదేశం", "610 జీ.వో" మధ్య గల తేడాలూ వైరుధ్యాలూ విడమరివ్జి చెప్పాల్సీన అవసరం ఉంది.
1.5.0 పైన వివరించిన విధంగా 1969 నాటి తెలంగాణా ఉద్యమాన్నీ 1972 నాటి ఆంధ్రా ఉధ్యమాన్నె దృష్టిలో ఉంచుకొని రాష్త్రం భవిష్యత్తులో సమస్యలకి గురికాకుండా ఆంధ్ర ప్రదేశ్ నాయకత్వం కేంద్రంతో చర్చించి 21-09-1973 లో అపార్ధాలను(misgivings) తొలగించే నిమిత్తం ఒక ఆదేశాన్ని జారీ చేశారు.అది ఈ క్రింది విధంగా ఉంది:

(1) త్వరిత గతిన వెనుకబడీన ప్రాంతాలు అభివృధ్ధి చెందేటందుకు వీలుగా రాష్త్ర శాసన సభకు సహకరించేటందుకు నిపుణుల కలిసి అభివృధ్ధి పధకాలను పర్యవేక్షించడానికి కొన్ని ప్రాధమ్యాలను గుర్తించారు.రాష్ట్ర స్థాయిలో ప్రణాళికా సంఘం మరియు కొన్ని ఉప సంఘాలను ఇందు కొరకు యేర్పాటు చేశారు.

(2) విద్యాలయాల్లో ప్రవేశానికి రాష్ట్రమంతటా స్వప్రాంత అబ్యర్ధులకు ప్రోత్సాహం కల్పించడంలో ఒకే రకమయిన అరణ్యమెంట్లు ఉండాలని ఆదేశించారు.ఇంకా హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న విద్యావకాశాల్ని మెరుగు పర్చేటందుకు ఒక కేంద్ర విశ్వ విద్యాలయాన్ని ప్రతిపాదించారు.

(3) మొత్తం రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా స్వప్రాంత అబ్యర్ధులకు (అ) నాన్-గెజిటెడ్ పోస్టులు (ఆ) స్వప్రాంత సంస్థలలోని సంబంధిత ఉద్యోగాలు (ఇ) తహసీల్ దార్లు, జూనియర్ ఇంజనీర్లు వంటి వాటిలో స్వప్రాంత అబ్యర్ధులకే ప్రాధమ్యం ఇవ్వాలి.
......
......
(5) పైన వివరించబడిన వాటిని ఆచరణ లోకి తీసుకు వచ్చేటప్పుదు యే విధమయిన లిటిగేషను మరియు అనిశ్చితి యేర్పడకుండా అవసరమయినప్పుదు రాష్ట్రపతి కి అధికారాలను దఖలు పరుస్తూ రాజ్యాంగ సవరణలు చేయవలెను.

(6) ఈ విధమయిన దారిలో వెళ్తే ముల్కీ నిబంధనలూ ప్రాంతీయ కమిటీ రద్దు అయిపోతాయి.

1.5.2 ఇందులోని మూడవ సూత్రమే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాన్ని రాష్ట్రపతి ఆదేశం పరిధి లోకి తీసుకు వచ్చింది.రెండవ పాయింటుకు సంబంధించి కూడా వేరొక రాష్ట్రపతి ఆదేశం ఉన్నపటికీ ఈ సంఘం మూడవ పాయింటుకు సంబంధించిన ఆదేశాన్ని మాత్రమే పరిశీలిస్తుంది.ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు మాత్రమే సంబంధించినది.

కాబట్టి "ఆరు సూత్రాల పధకం", మరియు "రాష్ట్రపతి ఆదేశం" అనే ఈ రెంటినీ ఒక దాని కొకటిగా కలప కూడదు. రాష్ట్రపతి ఆదేశం ఆరు సూత్రాల పధకం లోని ఒక భాగాన్ని, అంటే ప్రభుత్వోద్యోగాల విషయాన్ని మాత్రమే పరిశీలిస్తే ఆరు సూత్రాల పరిధి చాలా విస్తృత మయినది.

                                          సంఘానికి ఇచ్చిన సూచ్యార్ధ ప్రస్తావనలు
                                      (Terms Of Reference Of The Commission)

1.8.3 పేరా 3 కు సంబంధించిన ప్రస్తావనను విశ్లేషించి చూస్తే - 'యేవయినా అక్రమాలు జరిగాయని తెలిస్తే నష్ట నివారణకు తగిన చర్యలు తీసుకోవడానికి సూచనలు ఇవ్వడానికీ' అని అర్ధంవుతుంది.

(1) One part is to suggest remedial action. The remedy is a specific antidote to a specific malady. The maladies are what we have called „deviations‟ which the Commission has brought out in this Report. Under each specific Deviation Genre, the Commission has given its Findings and suggested appropriate Remedial Action.

1.9.1 It may be mentioned that the general issues mentioned in Chapter-3 of the Preliminary Report and given in terms of the points with Commission‟s observations have been included in the Part-1 of this Report under the appropriate “Deviation Genre” and “Finding”. However where any point in the Preliminary Report is not found in the Final Report, the Commission‟s finding in the Preliminary Report may be read as a part of the Final Report.

                                                           Causes of Deviations
1.10.0  A reading of the Report will itself indicate which deviation can be attributed to which cause. Some of the causes discerned by this Commission are the following: -

1) Dynamics of administration. The pace of these has been increasing day by day. The implications of various administrative decisions that impinge on the Presidential Order have gone either unnoticed or got ignored.

1). కార్య నిర్వాహక వ్యవస్థ పని తీరు రోజు రోజుకూ వేగవంతం కావడం అనే దశలో |ప్రెసిడెన్షీల్ ఆర్డర్| కి సంబంధించిన విషయాల్ని సీరియస్ గా తీసుకోలేదు.

2) The Presidential Order had gradually been receding into the limbo of oblivion. Hence its implications in the administrative decisions, even in the matters of reorganizations and far-reaching personnel and structural changes and in the movement of personnel, did not even cross the minds of the proposers and decision-makers.While in every such decision the financial implications were always examined and legal aspects kept in mind the implications under the Presidential Order escaped attention and tended to get ignored. Even where they did occur to the concerned authorities, as in the case of work charged establishments, these were skirted and the easy way out was adopted.

2).|ప్రెసిడెన్షీల్ ఆర్డర్| క్రమేణా విస్మృతం కావడం మొదలయింది.ఉద్యోగుల స్థానచలనానికి సంబంధించి అన్ని ఆర్ద్గికపరమయిన మరియు సాంకేతిక పరమయిన విషయాల్ని తరచి చూడాల్సిన సందర్భాల్లో కూడా |ప్రెసిడెన్షీల్ ఆర్డర్| అనేది ఒకటి ఉందనేది మర్చిపోవడం, లేదా ప్రతిష్ఠంభన యేర్పడినప్పుడు తేలికగా కుదీరే పరిష్కారానికి రావడమూ జరిగింది.

3) In some situations the imperatives/compulsions of circumstances left no choice but to turn the Nelson‟s eye to the provisions of the Presidential Order.

4) In a few cases patronage, favoritism or the blue-eyed boy syndrome stand out quite patently and rather deplorably.

5) The ignorance and often misconception about or misconstruance of some of the provisions of the Presidential Order and of the instructions in G.O.s like G.O.P.No.728 and G.O.P.No.729 of General Administration (SPF) Department,both of 01-11-1975 quite often stand- out glaringly. One finds free mention in official correspondence and discussions of such things as “VII Zone” (some thing that does not exist), “Free Zone” (referring to the City of Hyderabad), “Non-local Quota” (which is nowhere contemplated in the Presidential Order), interchangeability of the concept of nativity with local candidate etc.. One finds even guiding stars misguiding - for example the advice of the General Administration (SPF) Department and orders of Finance Department in the case of work charged establishment and its absorption, and Government Memos. on the issue of compassionate appointments.

6) (a) Departments that have a very large cadre and which include certain wings which are/were excluded from the Presidential Order like Police and Irrigation and Command Area Development Department;

(b) “Umbrella” Departments which have an integrated cadre covering new offspring Departments - have some genuine difficulty in cadre management particularly in wings where they find stagnation due to original defective staffing pattern or any other reason. Such Departments tend to resort to amnesia now and then with regard to the Presidential Order as the easy way out.(For this cause, see the Chapter-2).

7) Above all, a very important cause is the absence of any device for (i) either on-going control or monitoring system as Finance Department has through pre-audit process or Law Department has through legal advice on files, or inspections that the Social Welfare Department has OR (ii)post-facto monitoring system such as audit for accounts,and (iii) absence of a nodal agency to guide and control the implementation of the Presidential Order, and (iv) absence of a legislative controlling committee like Public Accounts Committee, or Committees as there are for Scheduled Castes, Scheduled Tribes and for Women which create a feeling in the minds of the officials that they are accountable to the Legislative Assembly through a Committee. Such state of apparent absence of accountability enforcing devices or agencies has tended to create an attitude of indifference, some callousness with a sense of immunity and impunity in the implementation of the Presidential Order over the last almost three decades.

7). పైవాటన్నింటి కన్నా (1).యెప్పటి కప్పుడు మదింపు చేస్తూ నియంత్రించటానికి పనికి వచ్చే యేర్పాటు (2). Audit చెయ్యటానికి అవసరమయిన యేర్పాటు లేకపోవటం (3).మార్గదర్శకాల్ని నిర్వచించే వ్యవస్థ లేకపోవటం (4). శాసన బధ్ధమయిన అధికారిక సంస్థ యేదీ లేకపోవటం  అనేవి |ప్రెసిడెన్షియల్ ఆర్డర్| నుంచి దూరం జరగటానికి ముఖ్యమయిన కారణాలుగా కనబడుతున్నాయి.

ఇక్కడి నుంచి తెలంగాణా మేధావులు |violations| గా పిలుస్తున్నప్పటికీ గిర్గ్లానీ గారు |deviations| పేరుతో ఇచ్చిన పరిశీలనల లిస్టు వస్తుంది.

2,2.0:దృగ్విషయం 1        01-11-1975 నుంచి, గతించిన 28 సంవత్సరాలలో కార్యనిర్వాక వ్యవస్థలో వచిన గతానుగతికమయిన మార్పుల వలన మొత్తం కార్యనిర్వాహక వ్యవస్థ మరియు ప్రభుత్వ స్వభావం చాలా మార్పులకు గురయింది.

2.3.0:దృగ్విషయం 2         ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో "శాఖ యొక్క తల" మరియు "శాఖల యొక్క తలలు" అను పదములను సరిగా నిర్వచించనందువల్ల కొన్ని సార్లు సంస్థలను చీల్చి కొత్త సంస్థలను పుట్టించినప్పుడు తమ తల కార్యాలయములను కూడా "శాఖల యొక్క తలలు" గా పొరపాటున  అన్వయించుకుని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా 14 ద్వారా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుండి మినహాయింపు పొందారు.

2.6.0:దృగ్విషయం 5    ఈ కమిషన్ పరిశీలనలో తెలిసింది యేమిటంటే న్యాయశాఖ పూర్తిగా ఆ శాఖకు సంబంధించిన నియామకాల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని పాటించదం లేదని.మామూలుగా హైకోర్టు మాత్రమే ఆ శాఖ కంతటికీ "శాఖ యొక్క తల" గా ఉండి మిగిలిన జిల్లా స్థాయి నియామకా లన్నింటి లోనూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని పాటించాలి.

2.27.0: దృగ్విషయం 21     హైదరాబాద్  మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు సెవరేజ్ బోర్డ్ వారి విషయం మరీ చిత్రమయినది. చట్ట ప్రకారం దీనిని ఉత్పత్తి చేసినప్పుడు ఇది స్థానిక సంస్థ. తదనంతరము ప్రభుత్వము వారు ఇది స్థానిక సంస్థ కాదని విశదీకరించినారు, అయితే ఆంధ్ర ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వారు ఈ విశదీకరణను ఖండించినారు(ఖండించినది వ్యక్తులను కాదు గావున యెవరికీ భాద కలుగలేదు).ఆలాగున ఇది ప్రెసిడెన్షియల్ ఆర్దర్ కిందికి వచ్చు స్థానిక సంస్థయై ఉన్నది. సమస్య యేమనగా ఈ బోర్డ్ యొక్క తల కార్యాలయమును ప్రెసిడెన్షియల్ ఆర్దర్ పేరా 14(b) కిందికి వచ్చునట్లుగా గుర్తింపు నివ్వవచ్చునా?ఈ బోర్డ్ స్థానిక సంస్థయే తప్ప శాఖ కాదు.ఈ మొత్తము స్థానిక సంస్థ ఒకే స్థానిక సంస్థ కావున దీనికి శాఖ యొక్క తల అను సిధ్ధాంతము వర్తించదు.

2.29.0: దృగ్విషయం 22     ఒక శాఖ ఒకే తలను కలిగి ఉండగలదు.అది రాష్ట్రమంతటిలో పని చేయు రెక్కలు కలిగి ఉండవచ్చు. కాబట్టి ఒక శాఖకు ఒకే శాఖ యొక్క తల ఉండును, లేని యెడల అది శాఖయే కాదు.ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా 14(b) పై స్థాయిలోని అధికారికమయిన శాఖ యొక్క తలకు మాత్రమే వర్తించును.

2.29.2: సమస్య యేమనగా ఒక శాఖ యెన్ని శాఖల యొక్క తలలు గలిగిన కార్యాలయములను కలిగి ఉందవచ్చు? ఒక శాఖ లోని యెన్ని శాఖల యొక్క తలలను ప్రెసిడెన్షియల్ ఆర్దర్ 14(బ్) కిందికి తీసుకు రావచ్చు?

5.4.0:దృగ్విషయం 47    ఇక్కడ స్థానికతకు సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్దర్ లోని విషయానికి అధికారులు అనుసరిస్తున్న సాంప్రదాయికమయిన విధానానికీ ఉన్న భేదం పట్ల గందరగోళం ఉందని తెలుస్తుంది.అధికారులకు సంబంధించిన రూల్ బుక్ లో స్థానికత అంటే అతను యెక్కడ నుండి తొలి సారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు అనేది అయితే ప్రెసిడెన్షియల్ ఆర్దర్ ప్రకారం రిక్రూట్ చేసుకుంటున్న ఏరియాకు ప్రాముఖ్యత ఉంటుంది. అధికారులు తమ సర్వీస్ రూల్స్ కూ ప్రెసిదెన్షియల్ ఆర్దర్ కూ విభేదం వస్తే తమ సర్వీస్ రూల్స్ వైపుకే మొగ్గు చూపుతున్నారు.
"The entire scheme of Presidential Order is based on the premise that the unit of recruitment which is
called “local area” has nothing to do with the “unit of appointment” which is an administrative
stipulation in the service Rules of a post. The unit
of recruitment is statutorily laid down as the “local area” for direct recruitment of a post as per its local
cadre under the Presidential Order."

6.5.0:దృగ్విషయం 51   కమిషన్ ట్రాన్స్ఫర్ ల గురించిన సమాచారం సేకరించగా అది ఇలా ఉంది:716 అంతర్-జిల్లా అంతర్-జోన్ ట్రాన్స్ఫర్ లు.81 దంపతులు,113 మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లు,101 పబ్లిక్ ఇంటరెస్ట్ ట్రాన్స్ఫర్ లు,186 ఇతర కారణాలు కాగా 235 కారణాలు చెప్పనివి.ఇతర కారణాలలో 160 రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ లు. యెక్కువ ట్రాన్స్ఫర్ లు హైదరాబాద్ వైపుకి(79) జరగగా తర్వాత స్తానంగా(60) చిత్తూర్ వైపుకి జరిగాయి,కానీ చిత్రంగా హైదరాబాదు నుంచి 79  ట్రాన్స్ఫర్ లు బయటి వైపుకి జరగదంతో తేడా 0 అయ్యింది.ఇక జోన్ల వారీగా చూస్తే 72 జోన్6 లోకి,66 జోన్2 లోకి,59 జోన్4 నుంచి జరిగాయి.

అసలు ట్రాన్స్ఫర్ ల పైన బ్లాంకెట్ బాన్ లాంటిది విధించాలా అని ఆలోచిస్తే ప్రెసిదెన్షియల్ ఆర్దర్ ట్రాన్స్ఫర్ లకు పూర్తిగా సుముఖంగా లేదు. పైగా వివాహాల్లో కులాంతర మతాంతర వివాహాల మాదిరి జోనాంతర వివాహాలు కూడా సమస్యగా తయారై సమాజికంగా కూడా వ్యతిరేక ఫలితం రావచ్చు.కేవలం రెండు మూడు జిల్లా లో జరిగిన వాటిని అన్ని జిల్లాల లోనూ వర్తింప జేయడం అనవసరం

6.27.0:దృగ్విషయం 69    యెక్కడా ఫలానా జోనులో హీనపక్షంగా యెంత మంది స్థానిక వ్యక్తులను ఖచ్చితంగా తీసుకోవాలనే కనీస సంఖ్య నిర్ధారించబడనట్టుగా కనపిస్తున్నది.

7.1.0:దృగ్విషయం 74   మొదటి నుంచీ |work-charged employees|ని అది గోదావరి, కృష్ణా, తుంగభద్రా లాంటి ఇర్రిగేషన్ ప్రాజెక్టు లయినా,రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన పను లయినా ప్రెసిడెన్షియల్ ఆర్దర్ కి బయటనే ఉంచేస్తున్నారు.దీనికి సరయిన కారణం కూడా లేదు.అసలు ప్రాజెక్టుల విషయంలో ఈ |work-charged establishment| ముఖ్యమయిన పాత్ర వహిస్తుంది.

7.10.0:దృగ్విషయం 83   ఫలితం యేమిటంటే అధికంగా పోగుపడిన వీరంతా ప్రాజెక్ట్ కాలం ముగిసాక కూడా మళ్ళీ పనికొస్తారనే మిషతో పాత ఉద్యోగాలు మాత్రం పోగొట్టుకోకుండా ఉండిపోయారు.ఒకటికి రెండింతలు లాభం.సివిల్స్ రాసి పాసయి APPSC ద్వారా రాకపోవటం ఒకటే తేడాగా "దొడ్డి దారి ప్రవేశం" ద్వారా ప్రభుత్వం లోని సివిల్ పోష్టులకి రాగలిగారు.ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి మినహాయింపు పొందగలిగారు.

8.2.0:దృగ్విషయం 91  కమిషన్ దృష్టికి వచ్చిన మరొక ముఖ్యమయిన విషయం యేమిటంటే - 18.10.1975(ప్రెసిడెన్షియల్ ఆర్డర్)కి ముందు నాన్-గెజిటెడ్ గా ఉన్న పోష్టుల్ని అదే డిసిగ్నషన్ లొగానీ డిసిగ్నషన్ మార్చి గానీ గెజిటెడ్ పోష్టులుగా మార్చారు.దీని వల్ల ఆ పోష్టుకి ఉండే 70% స్థానికత హక్కును కోల్పోవటం జరిగింది.

8.8.0:దృగ్విషయం 97:  It is a paradox, or an irony of the administrative system, that has escaped the attention of the Government, that while in G.O.Ms.No.610 Government have assured about taking up with the Government of India, the question of localization of all the first gazetted posts, the contrary process of pulling out from the localized cadres of non-gazetted zonal posts through the process of gazetting them has been going on unabated, after the Presidential Order, causing jeopardy to local candidates in terms of loss of
opportunities for direct recruitment and promotions.

నాన్ గెజిటెద్ పోష్టుల్ని గెజెటింగ్ చెయ్యదం లోని హేతుబధ్ధత

8.10.0 ఈ విధంగా నాన్ గెజిటెడ్ పోష్టుల్ని గెజిటెడ్ గా మార్చటం అనేది స్థానిక అబ్యర్ధుల అవకాశాలకు సంబంధించి వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వటమే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ లో కూదా అవాంచనీయమయిన పరిణామాలకి దారి తీసింది.మొదట గెజిట్ చేసినది ప్రధమ నియంత్రిత స్థానం అనుకుంటే తర్వాత అది ద్వితీయ నియంత్రిత స్థానం అవుతుంది.ప్రధమ నియంత్రితాన్ని కంట్రోల్ చేసేది ఖచ్చితంగా ఆ శాఖాధిపతి అవుతాడు, కానీ అది కొనసాగింపు అయి అది రెండవ నియంత్రిత అంతరువుకు పెంచబడినప్పుడు శాఖాధిపతి యొక్క క్రమశిక్షణాయుతమయిన అధికారాలు పలుచన అవుతాయి.

9.4.0 దృగ్విషయం 101: కమిషన్ 01-03-1999 నుంచి 01-01-2002 వరకు 34 నెలలకు సంబంధించిన |compassionate appointment|లకు సంబంధించిన సమాచారాన్ని అదిగితే 62 శాఖలు స్పందించాయి.ఇందులో 7 శాఖలు ఈ |compassionate appointment|ని అసలు చెయ్యలేదు. 55గురు శాఖాధిపతులు 6,805 ఇటువంటి నియామకాలు జరిగినట్టు తెలిపారు.ఇందులో 6,211 మంది స్థానిక అబ్యర్ధులని స్థానిక క్యాడర్లోకి,594 మందిని స్థానికేతరుల్ని నియమించారు,అంటే 8.73%.ఈ 594 మందిలో 462 మందిని ఆయా శాఖలకు అధిపతులుగా నియమించడం ఆమోదయోగ్యమే.132 మంది స్థానికేతర క్యాదర్లోకి తీసుకోబడ్దారు.మొత్తంగా 6759 మంది రెగ్యులర్ పోష్టులకు అపాయింట్ చెయ్యబడితే 46 సూపర్ న్యూమరరీ పోష్టులు మాత్రమే సృష్టించబడ్దాయి.

12.1.0 దృగ్విషయం 112: There are four types of departments/categories of posts where the process of recruitment/allotments of recruited candidates has to be closely watched through an ongoing process of scrutiny to ensure that Presidential Order is being adhered to. These are :

1. Departments and posts which are kept outside the purview of Andhra Pradesh Public Service Commission and/or District Selection Committees.
2. Departments with multiple wings but integrated cadre.
3. “Umbrella” Departments with an integrated cadre and centralized cadre management for all the  offsprings.
4. Where a new dispensation is introduced as in the case of creation of the system of Panchayat Secretaries.

13.7.0 దృగ్విషయం 123:In Government Hospitals Auxiliary Nurses(ANMs) were allotted by Andhra Pradesh Public Service Commission overlooking the Presidential Order. Auxiliary Nurses were from among non-locals for want of local candidates. Actually, in case of non-availability of locals, if non-locals had to be brought because of the essential nature of the services of ANMs, they could have been taken on tenure basis, not appointed in the vacancies of local candidates. There has been dearth of trained Nurses in zones V and VI.

***Issuing immediate orders that the Service Registers should depict the local status of the employees must be done immediately. It appears quite strange at this stage to find that the "nativity column‟ which was originally there in the Service Registers, continues but after the Presidential Order, the "local status column‟ and "local cadre column‟ were not inserted. If this is done now and forthwith, Government would find that it will facilitate handling the contentious issues, as well as taking redressal measures effectively and promptly.

అధ్యాయం - 2

2.1.6 If we exclude 46,831 gazetted posts from the total Government employees we have 3,85,564 Government employees who are covered by the Presidential Order. (We may ignore for statistical purposes Gazetted employees presently in the Specified Gazetted Category, being negligible in number) Out of these, the Planning Department has given district-wise break-up for 3,54,131 employees. Regarding the remaining 31,433 employees the Planning Department has shown 31,281 under the heading “not covered under Presidential Order”, and 152 under the heading “employees working outside the Andhra Pradesh” (these last being in Delhi, etc.)

2.1.7 The district-wise figures of local and non-locals show the following results:

1) The lowest percentage of non-locals ranging between 3.42%to 4.81% is in eight districts of which one is in zone-I, one is in zone-II, four in zone-IV and two in zone-V. (Warangal and Karimnagar).

2) In the second range i.e. between 5.16% to 5.99% we have seven districts of which one is in zone-I, one in zone-II, three in zone-III and two in zone-VI (Mahabubnagar and Medak).

3) The third range is 8.52% to 11.63% with one district in zone-I, one in zone-II and two in zone-V (Adilabad and Khammam) and three districts in zone-VI (Ranga Reddy,Nizamabad and Nalgonda).

4) Beyond this, we have only one district viz. Hyderabad which has 18.06% non-locals which is far more than the 1st, 2nd& 3rd ranges mentioned above.

5) All the districts except Hyderabad District are far below 20%which is the highest permissible for open quota of district cadre posts in which locals and non-locals can come without reservation. Hyderabad is just below 20% which shows ‘inter alia‟, and „prima-facie‟ not only that a large part of the open quota is filled with non-locals but also that there must be a lateral inflow of non-locals through transfers,compassionate appointments, deputations etc.

2.1.35 These dis aggregated figures give an idea as to where the non-local element has entered. Mostly it is in the category of Teachers, and Paramedicals of the Health Department. Non-Locals have also entered in a big way among work-charged employees. This last category has remained under complete camouflage because they have been treated (erroneously) as outside the purview of the Presidential Order.

18.2.0 Who are the Losers and who are the Beneficiaries?
Until each Finding is taken up for action in terms of the Remedial Action proposed in the Final Report, no one can say which are the zones that are beneficiaries and which are the zones that are losers.
============================================================
తెలంగాణా వాదులు |violations| అని అంటున్న వాటిని గిర్గ్లానీ గారు ప్రత్యేకించి |deviations| అని యెందుకు అన్నారో తెలుసా?మెద మీద తలకాయ ఉన్న యే అధికారి అయినా తను రూల్స్ అతిక్రమించానని వొప్పుకోడు. పట్టుబడే అవినీతి పరులు కూడా కేవలం నిర్లక్ష్యం వల్ల దొరికి పోతారే తప్ప ప్రతి అధికారీ తను చేసే ప్రతి పనీ రూల్స్ ప్రకారం ఉందని తేల్చుకున్నాకనే చేస్తాడు.

ఈ ఉద్యోగుల నియామకాలకి సంబంధించిన కమిటీ రిపోర్టు లన్నీ సలహాల కోసమే తప్ప వీటిని ఖచ్చితంగా పాటించి తీరే విధంగా సర్వీస్ బూక్స్ లోకి యెక్కించలేదు. అది ఒక చోట గిర్గ్లానీ గారు కూడా టచ్ చేసినట్టున్నారు, గమనించారా?యేదయినా శాఖాపరమయిన విచారణ వొస్తే సర్వీస్ బుక్ ఫాలో అయ్యాడా లేదా అని చూస్తారే తప్ప పద్మనాభన్ కమిటీని ఫాలో అయ్యాదా గిర్గ్లానీ కమిటీ రిపోర్టుని ఫాలో అయ్యాడా అని చూడరు.

విశ్రాంత అధికారిగా అది ఆయనకీ తెలుసు.ఇంతకీ ఈ గొడవ లన్నీ ముఖ్యంగా యే ఉద్యోగాలకు సంబంధించినవి.ఒక ప్రభుత్వ శాఖలో శాఖాధిపతిగా రావాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రావాలి. అలా వచ్చిన వ్యక్తికి తన కింద స్థాయిలో పని చేసే ఉద్యోగుల్ని యెన్నుకునే అధికారం ఉంటుంది.ప్రతి ఉద్యోగానికీ అర్హతలూ, మార్గదర్శక సూత్రాలూ ఉంటాయి, కానీ ప్రభుత్వమే వీళ్ళకి విచక్షణాధికారం అనేది కట్టబెట్టింది.అంటే యెక్కడయినా యే రెండు రూల్స్ అయినా ఒకదాన్ని ఒకటి వ్యతిరేకిస్తూ గందరగోళం యేర్పడితే తన విచక్షణని ఉపయోగించి నిర్ణయం తీసుకోవచ్చు.

ఆంధ్రదేశం ఏర్పడిన కొత్తలో తెలంగాణా ప్రాంతంలో విద్యా సౌకర్యాలు ఇప్పుడున్నంత బాగా లేవు. ఉపాధ్యాయుల్ని తరిఫీదు చేసే సంస్థలు కూడా చాలా తక్కువ. ఒకవైపున పాఠశాలల సంఖ్య అభివృద్ధి అవుతోంటే ఉపాధ్యాయుల కొరత ఏర్పడినది.1956లో తెలంగాణా ఆసుపత్రులలో పడకల సంఖ్య 5000. 1966లో 10,000. పడకలు పెరిగిన కొద్దీ నర్సుల, మంత్రసానుల అవసరం కూడా కలుగుతుంది. తెలంగాణా అభివృద్ధికీ ఆరోగ్యానికీ అవసరమైన ఉపాధ్యాయుల్నీ, నర్సుల్నీ, మంత్రసానుల్నీ తీసేస్తే, మిగిలేవి 1100 మంది బంట్రోతు, డ్రైవర్లు ఉద్యోగాలలో వున్నవారు, ఒక లక్షా ఏడువేల ఉద్యోగాలలో 1100, పోనీ 4500 ఎన్నో వంతు? వీటి కోసం రాష్ట్ర విచ్ఛిన్న కార్యక్రమం తలపెట్టినారంటే విన్నవారు నవ్వరా?

రేపటి తెలంగాణా లోనూ ఈ జోనల్ పధ్ధతిని ఫాలో అయితే ఒక పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఆంధ్రోళ్లని తిట్టినట్టు తెలంగాణా లోని కొన్ని జిల్లాల వార్ని మిగతా వాళ్ళు తిడతారు, అది తధ్యం!ఆచార్య దేవో భవ, వైద్యో నారాయణో హరి అంటూ అప్పుడు విద్యకోసం ఆరోగ్యం కోసం అవసర మయి ఆంధ్రా నుంచి టీచర్లనీ నర్సుల్నీ కోరి పని చేయించుకున్నారు.ఇవ్వాళ వాళ్ళు రిటయిర్మెంటుకు దగ్గరయ్యాక వారికి పెన్షన్ ఇవ్వటానికి కూడా బాధ పడిపోయి తన్ని తగిలేస్తున్నారు!యేరు దాటే వరకూ వోడ మల్లయ్య గారు యేరు దాటాక బోడి మల్లయ్య గాడు!!

ఈ మధ్యనే కేంద్రం నుంచి ఉద్యోగుల విభజనకి వచ్చిన కమిటీ పరిశీలనకు ఉంచబడిన మొత్తం ఉద్యోగాలు 50, 000 రమారమి అంటున్నారు.మొదట 10,000 అని కనబడింది, వారికే సిగ్గ్గేసి ఇంకా ఘట్టిగా ఫిల్టర్ చేసారేమో ఆఖరికి 50,000 దగ్గిర ఆగింది.వారి తీర్పు నచ్చలేదని గొడవలు రేగటంతో ప్రస్తుతానికి మమ్మల్ని ఇలా వొదిలెయ్యండి, పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు యేర్పడ్డాక మీరూ మీరూ చూసుకోండని వారు దణ్ణం పెట్టేశారు.మరి ఆంధ్రా వాళ్ళు దోచుకున్న లక్షల ఉద్యోగాలు యేమయిపోయినాయో, రేపటి రోజున వారే ప్రభుత్వంలో ఉండి లెక్కలు తీసినప్పుడు గానీ ఈ లెక్క నిక్కచ్చిగా తేలదు.అయినా ఈ బతక లేని బడి పంతుళ్ళూ సిరెంజిలు కడుక్కునే నర్సులూ యాభయ్యేళ్ళ పాటు మొత్తం పది జిల్లాల తెలంగాణా మేధావుల్నీ వెనుకబాటు తనానికి గురి చేశారంటే ఆశ్చర్యం గా లేదూ!

అసలు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం యేమిటంటే |violations| అంటున్న |deviations| అన్ని జోన్ల లోనూ సమానంగానే జరిగాయి, ప్రత్యేకంగా ఒక జోను నష్టపోయింది అని చెప్పలేం అని అంత ఖచ్చితంగా చెప్తే మాకు అన్యాయం జరిగిందని గిర్గ్లానీ కమిషన్ రిపోర్తులో ఉంది, వెళ్ళి చూసుకోండని వీరంగాలు వేశారు. మిగతా అన్ని జోన్లలోనూ అంతా బాగనే ఉండి ఒక్క తెలంగాణాలోనే జరిగితే కదా వారికి ప్రత్యేకంగా అన్యాయం జరిగినట్టు?ఇంత కాలం నేను అసలు గిర్గ్లానీ కమిటీలో యేం ఉందో చూడాలని అనుకోకపోవటానికి కారణం మేధావులూ విద్యావంతులూ సంస్కారం గలిగిన వాళ్ళు మరీ దుర్మార్గంగా అబధ్ధాలు చెప్తారా అనే భరోసా తోనే!తీరా చూస్తే పరిస్థితి ఇది.

అసలు ఒక విషయం నిజమా అబధ్ధమా అని యెలా కనిపెట్టాలి?ఒక విషయం గురించి యెదటి వ్యక్తి వెయ్యి వాక్యాలు చెప్తే మొదటి వాక్యానికీ వెయ్యవ వాక్యానికి అర్ధంలో తేడా వొస్తే అబధ్ధం అని తేలుసుకుంటాం, కదా? ఒక వేళ ఈ వెయ్యి వాక్యాల్లో యే విరుధ్ధతలూ లేకపోయినా వెయ్యిన్నొకటో వాక్యం కొత్తగా తెలిసి దానికి గట్టి సాక్షాలు ఉంటే ఈ వెయ్యి వాక్యాలూ నిజమనిపించేటట్టు అంతా యేకసూత్రంగా ఉన్నా అవన్నీ అబధ్ధాలు అయి పోతాయి,అవునా? ఇప్పుడు అసలు విషయంలో వైరుధ్యాలు ఉన్నా యెదటి వాళ్ళకి తెలిసే వీలు లేదనుకుని వాటిల్లో కొన్నిట్ని దాచేసి అంతా తమ వాదానికి అనుకూలంగా ఉన్నవాట్ని మాత్రమే చెప్తే అబధ్ధం కూడా నిజమయి పోతుంది గదా!

ఈ మధ్యనే నేను ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనకి ముందరి విషయాల్ని గురించి మానసికంగా విడివడాలని ఒక నిర్ణయం తీసుకున్నాను, కేవలం విసుగు వల్ల - చెవిటి వాడి ముందు శంఖ మూదినట్టు మళ్ళీ మళ్ళీ ఒకే విషయం గురించి యేం రుద్దుతాం అని.కానీ ఒకే ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సివచ్చింది.నేను గిర్గ్లానీ కమిటీ రిపోర్తును చదివి ఈ పోష్తు వేసాక ఈ మధ్యనే ప్రజ చర్చా వేదిక దగ్గిర గ్రీన్ స్టార్ గారు తగిలారు నాకు.చర్చలో వారే ఈ రిపోర్టు గురించి యెత్తేసరికి అన్ని జోన్లలోనూ జరిగాయని అంటున్నారు కదా అనే జవాబు వేశాను.

దానికి వారు -
అన్ని జోన్లలో జరిగాయి, నిజమే. కాని వారు ఇంకో విషయం కూడా చెప్పారు, అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు అని. అంటే హైదరాబాదు అని నేను అనుకుంటున్నాను. అసలు ఏ ఏ జోన్ లలో ఎంతెంత అక్రమాలు జరిగాయో ప్రభుత్వమే ఒక శ్వేత పత్రం ఎందుకు విడుదల చెయ్యదు? 
- అని మరో ప్రశ్న వేసారు.

వారు అంటున్నది "అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు"

కానీ
ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిర్గ్లానీ గారు చెప్పింది ఇది,"ఒక్క తెలంగాణా వారే నష్టపోలేదు.అన్ని ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది.మేలు జరిగిందెవరి కంటే అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి తరలి వెళ్లగలిగిన వారు లబ్ధి పొందారు."

ఆయన చెప్పింది వెళ్ళగలిగిన వాళ్ళు లాభ పడ్దారు అని.ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కృష్నా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?స్పష్టంగా చెప్పిన దాన్నే ఒప్పుకోనప్పుడు శ్వేతపత్రాలు సాక్ష్యానికి పనికొస్తాయా?వారు యే గిర్గ్లానీ కమిటీ రిపోర్టును గురించి మాకు అన్యాయం జరిగిందని చెప్తుందని వూదరగొట్టారో ఆ రిపోర్టు తయారు చేసిన పెద్ద మనిషే అంత స్పష్టంగా మీ మాట తప్పు అంటుంటే ఇంకా శ్వేతపత్రం అంటారేమిటి?

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...