Friday 20 February 2015

దోచుకొనుడూ దంచుడూ అంతా యేమైపాయె?యేం పిట్టల దొరా మళ్ళీ రూటు మార్చిన వేంది?

ఒక్కసారిగా ఇన్ని మంచి మాటలు మీనోటి నుంచి విని తట్టుకోలేకుండా వున్నాం తెలంగాణా చక్రవర్తి గారూ,కొంచెం నిదానించండి!మిగతా రాష్ట్రమంతా మీకు అత్తెసరు మెజార్టీయే ఇచ్చినా పైన గెలిచి వచ్చిన వాళ్ళు అమ్ముడు పోయే రకాలు గాబట్టి కొనేశారు.ఇప్పటి దాకా ఆంధ్రోళ్ళని పొగిడే అవసరం రాలేదు గాబట్టి మీ హజం మీరు చూపించినా లెఖ్ఖ లేకుండా జరిగిపోయింది,కానీ మహానగర యెన్నికలంటూ కోర్టు చివాట్లు పెట్టిందే దాని దుంప తెగ?దాంతో మీరు మరోసారి మీ నరం లేని నాలికని మడత తిప్పేసి వుద్యమ స్పూర్తి నుంచి 360 డిగ్రీలు తిరగాల్సొచ్చింది,మా ఖర్మ ఇట్లా కాలింది?!

వాహనాల రీ రిజిస్ట్రేషను అని మీరు కూసిన దానికి అర్ధం యేమిటి మహాశయా?అది వుద్యమం నాడు అన్న మాట కాదు గదా?పాత ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం రిజిస్టరు కాబడిన వాహనాలనే మీరు తిరగనివ్వకూడదని ఖరారు చెయ్యడం కాదా?మెడ మీద తలకాయ వున్నవాడెవడూ మంచి వుద్దేశంతో ఆ కూత కుయ్యడు కదా!ఒకసారి ఒక ప్రభుత్వ సంస్థ ద్వారా రిజిష్టరు అయితే మరోసారి రిజిష్టరు చెయ్యడం అనేది పిచ్చిమాట అని పదో తరగతి కుర్రాడికి తెలిసిన మాత్రం తమకి తెలియకనే ఆ కారుకూత కూశారా?!

టాంకు బండు మీద వున్న ఒకనాటి మహనీయులనే పెళ్ళగించి ఆంధ్రాకి పంపించేస్తాం అనే వరకూ వెళ్ళారు గదాముఖ్యమంత్రి స్థానంలో వున్న మీ నుంచి అట్టడుగున వున్న మీ వందిమాగధుల వరకూ!మా పాతతరం వాళ్ళ విగ్రహాలనే కంటితో చూడ్డానికి కూడా ఇష్టపడని వాళ్ళు మమ్మల్ని మనుషులుగా అభిమానిస్తారని యెలా నమ్ముతాం?!1956 నాటి స్థానికత సిధ్ధాంతం యెప్పుడు యెందుకు పుట్టించి యెంత మొండిగా పాటించాలని చూశారో కళ్ళముందరే జరిగింది కదా?కళ్ళముందు కనిపిస్తున్నది ఇట్లా వుంటే ఇంకా కనిపించనే కనిపించని మీ ఔదార్యాన్ని యెలా అర్ధం చేసుకోగలం,అజ్ఞానులం పూట కొక్క మాట చెబితే పిచ్చివాళ్ళ మవుతాం మహానుభావా?!

బహుశా మెదక్కులో పుట్టి పెరిగినందువల్ల ఆంధ్రోళ్ళ గురించి తెలియక పోవచ్చు!ఆంధ్రోళ్ళు యేమి చేసినా యేది మాట్లాడినా లెక్క ప్రకారం మాట్లాడతారు!ముందు యే అంధ్రోడు తెలంగాణా మాణ్యాన్ని యెంత దోచుకున్నాడో పేరుపేరునా లెక్కలు తియ్యి!లెక్క ప్రకారం దొంగయితే తరిమి కొట్టు తెలంగాణా బోర్దరు దాటే వరకూ,ఒక్కడు నిన్ను తప్పు పట్టడు!ఇవ్వాళ సర్వాధికారాలూ వున్నయి నీకు -  నిజం నిరూపించ లేవా?తప్పు చెయ్యలేదా తప్పు చెయ్యనోణ్ణి తప్పు పట్టిన నువ్వు తల దించుకో?!నువ్వు ఒకప్పుదు "నో ఆప్షన్స్" అన్నావు యెదటివాళ్ళకి,గుర్తుందా?ఆంధ్రోణ్ణి నీకు నేను రెండు ఆప్షన్లు ఇస్తున్నా?!లెక్క ప్రకారం మాట్లాడు.నువ్వే చెత్త మాట్లాడినా నెత్తిన పెట్టుకు వూరేగడానికి మేము తెలంగాణా పుచ్చొంకాయ్ తెలివితేటల మేతావులం కాదు,గుర్తుంచుకో!

అందరూ నీకులాగ మాటే గదా అనుకోరు!తనువున విరిగిన అలుగులు పద్యం తెలుసా నీకు?మాట అన్నవాణ్ణి కాదు పడ్డవాణ్ణి బాధిస్తుంది!ఒకటా? రెండా?పన్నెండేళ్ళు వరసగా అన్ని కారుకూతలు కూసి ఇవ్వాళ ఒక్క మాటతో సరిపెట్టుకోమంటున్నావు,యేం తిని పెరిగావు నువ్వు?!లక్ష తిట్లు తిన్నా లెక్కచెయ్యని సిగ్గులేని తనం నీకుండొచ్చు.మాకు మాత్రం రోషమెక్కువ, అది తెలుసుకో?మహానగర్ యెన్నికల కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పకు. నిజాయితీగా ద్వేషించడమే నీకు తగినది - మరొకటి నీకు నప్పదు? సరిపని వేషం కట్టి అభాసు పాలు కావద్దు,పది కాలాల పాటూ చప్పట్లు కొట్టించుకోవాలనుకనే యే నటుడూ అట్లాంటి తెలివితక్కువ పని చెయ్యడు?

లక్ష నాగళ్లతో ఫిలిం సిటీని దున్నిస్తానంటే పులకించిన వాళ్ళూ ఆంధ్రోళ్ళు కబ్జా చేసిన భూములన్నిట్నీ లాక్కుని వస్తానంటేనూ మురిసి ముక్కలై వోట్లు వేసే జనం తెలంగాణాలో చాలామంది వున్నారు,అక్కడ చెప్పు నీ సొల్లు కబుర్లు.నీ మాట మాకు నిబధ్ధం కాదులే,యెన్నిసార్లు మాట తిప్పలేదు."దాదాపు 58 ఏళ్ళు కలిసి వున్నాం.విడిపోవలసిన అవసరం వచ్చింది కాబట్టి విడిపోయాం.అనతే కానీ తెలుగు వారిమధ్య విభేదాలు లేవు?!" - యేమి పచ్చి నిజం చెప్పావయ్యా నీ ఇల్లు బంగారం గానూ!58 అంటే నువ్వు 12 యేళ్ళ పాటూ తిట్టిన తిట్టు తిట్టకుండా ఆంధ్రోళ్ళని తిట్టిన కాలాన్ని కూడా కలిపావన్న మాట,వామ్మో?

విడిపోవలసిన అవసరం నీ కుటుంబానికి అధికారం కోసం నీ సొంత వ్యవహారమా?విశాల ప్రజా ప్రయోజనాల కోసమా?ముందు అది తేల్చు!ఆంధ్రోళ్ళు మన భూములన్నీ కబ్జా చేశారు,వాటన్నిట్నీ విడిపిస్తాను అని కూసి ఇవ్వాళ నువ్వు చేస్తున్న దేమిటి?కబ్జాదారులు కొంత డబ్బు చెల్లించితే చాలు వాళ్ళు కబ్జా చేసిన భూములకే చట్టబధ్ధమయిన యజమానులై పోతారని అంటున్నావు!నీ పిట్టకధలు తెలంగాణా పిచ్చిపుల్లయ్యల దగ్గిర చెప్పు,మా దగ్గిర కాదు.లెక్క ప్రకారం దోచుకున్న దెవరు?దోపిడీకి గురయిన దెవరు?దొంగలు కానివాళ్లని దొంగలు అన్నదెందుకు?అన్నిటికీ లెక్కలు చెప్పి మాట్లాడు, అబధ్ధాలు చెప్పొద్దు?!అన్నవాడివి నీకు నీ మాట చిన్నదే కావచ్చు పడ్డవాళ్ళం మాకు మా కష్టం పెద్దదే?!

యేమి చాలాకు కబుర్లు జెప్తా వుండావు ఇప్పుడు!అప్పుడు తరిమి కొడ్తానన్నది యెవర్ని?ఇప్పుదు నెత్తిన పెట్తుకుంటున్నది యెవర్ని?అంతా చూస్తానే వుండామప్పా!వ్యాపారం జేసి సంపద పెంచితే అందరూ పంచుకున్నారు?అందరూ కలిసి పెంచింది గదాని న్యాయమైన వాటాయే అడిగినా ముగమాటానికయినా సరే అనకపోతివి!మా ప్రాంతం అని తెలిసి రావడం మీ వెర్రిబాగుల తనం మా ప్రాంతంలో పుట్టిన సంపద అంతా మాదే మీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వం అన్న లెఖ్ఖన మాట్లాడినారు గదా నోరున్న తెలంగాణోళ్లు అందరూ?!ఇప్పుడు మళ్ళా ఆంధ్రోళ్ళు తెలంగాణాని పెంచాలె,మీ పెట్టుబడులూ,మీ తెలివితేటలూ అన్నీ మాగ్గావాలె అంటున్నవు,అది నోరా మరొకటా?హైదరాబాదు ఆదాయంలో వాటా ఇవ్వకుండా నువ్వు తన్ని తగిలేసినా తమ సొంత రాష్ట్రం అల్లల్లాదుతుంటే మనసులో యేమాత్రం కసి లేకుండా నీ రాష్ట్రాన్ని బాగు చెయ్యడానికి యే ఆంధ్రోడు అమాయకంగా ముందుకొస్తాడు?అట్లా వొస్తే ఆంధ్రోళ్ళు వాణ్ణి వుతికి అరెయ్యకుండా వుంటారా?ప్రాంతీయాభిమానం మీకు మాత్రమే కావాలా దొరా?!ఆంధ్రోళ్ళ కక్కర లేదా!

ద్వేషించినా నిజాయితీగా ద్వేషించు?!పలుమార్లు మాటలు మార్చి అభాసు పాలు కావద్దు!!

5 comments:

  1. అయ్యా హరిబాబు గారు మీ వేదనేంటో మీకే తెలియాలి

    ReplyDelete
    Replies
    1. అయ్యా రమేష్ బాబు గారూ, ఈ స్పందన యేమిటో నాకర్ధం కావడం లేదు.

      Delete
  2. ఎవ్వరికైనా , ఏ ప్రభుత్వానికైనా ఈ మాటలు సూట్ అవుతాయి . ఎఱికలో వుంచుకొనవలసినది ఈ ఏలికలు .

    " ద్వేషించినా నిజాయితీగా ద్వేషించు?!పలుమార్లు మాటలు మార్చి అభాసు పాలు కావద్దు " .

    ReplyDelete
  3. Haribabu garuu.....ive nenu ninna chepdamanukunna maatalu.
    mee noti ninchi I mean kalam ninchi vachayi.
    sharma gaaru annattu 'dweshinchina nijayitheega dweshinchu'
    Edee aa nijaayithee?

    ReplyDelete
    Replies
    1. thanks,every andhrite wil respond to him in the same way.hw doesn't know what seeds he dropped!
      WHAT YOU REEP WHAT YOU SED!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...