Wednesday 18 February 2015

తిరుపతిలో కూడా తిరుక్షవరమేనా?చింత మరీ ఇంత మోహనమా!

     అనుకోనిది జరిగితే కదా వింత!అనుకున్నది జరగకపోతేనే కదా చింత!వూహించరానిది యేమి జరిగినదని ఈ వగపంత?!ఓటమి అలవాటై పోయి ఆపో సోపో యెవరు గెలిచినా సంబరపడిపోతున్న ఈ తరుణంలో పొరపాటున గెలిస్తే ఆనందం పట్టలేక యెన్ని గుండెలు ఆగిపోతాయో లెక్కేసుకుంటే అంతా మన మంచికే అనిపిస్తుంది!

     తెలిసీ వలచీ విలపించుటలో తీయదనం కోరి వలచుట యేలనో!వికట కవి చెప్పినట్టు "గోవిందా గోవిందా నన్ను బాగుచెయ్యి గోవిందా" అంటూ ఆపదమొక్కుల వాడి సన్నిధిలో నన్నా బోణీ కొడదామని ఆశపడిన మోహనుడి ఆశల వేణువు స్వామివారు కూడా విరగ్గొట్టేశారే,కరుణ యొకించుక యైనను లేకుండగ?చింత చచ్చినా పులుపు చావనట్టు కొందరికి సత్యం కళ్లముందు కనబడినా బుర్రకెక్కదని సరిపెట్టుకోవాలే తప్ప ఇపుడతిగా ఆవేశపడి లాభమేమి?కాలం కలిసిరాకపోతే గాంధీ గారు కూడా బ్రాందీ షాపు పెట్టుకోవలసొస్తుంది,మనమెంత అని బొత్సబాబు యెప్పుడో చెప్పాడంట?!పోగాలము దాపురించిన వారు బ్రాందీమార్గం కనరు కదా!

     చచ్చినోడి పెళ్ళికి వొచ్చిందే కట్నం అని యెన్ని వోట్లు పడ్డాయో లెక్కేసుకుని సంతోషించక పాత అలవాటు చొప్పున రిగ్గింగుల గురించి మాట్లాడతాడేంటి లఘుశంకవీరుడు?మూలిగే నక్కమీద తాండిపండు పడ్డట్టు ఓడిపోతామని తెలిసిన ఇట్టాంటి యెన్నికల్లో పోటీ చెయ్యడాన్ని గురించి మేం విడగొడ్తాం రాష్ట్రాన్ని అంటే మేం విడగొడ్తాం అని పోటీలు పడి మాకంతా తెలుసు యెట్టా విడగొట్టి యెట్టా లాభం తెచ్చుకోవాలో అని గంతులేసి ఇంత దారుణానికి కారణమైన డిగ్గీరాజా కూడా చివాట్లేశాడంట ఆఖరికి - ముఖం యెక్కడ పెట్టుకోవాల్రా నాయనా?!

ఓడిపోయే యెన్నికల్లో పొటీ చెయ్యగూడదనుకుంటే ఇంక పోటీ చెయ్యగలిగిందెక్కడ?!
గెలిచే యెన్నికల్ని కూడా ఓటమికి నడిపించగలిగిన రాహుబాబు యెటూ వున్నాడు!?

2 comments:

  1. చారిత్రిక తప్పిదాలు చేసేవారి సాంగత్యం కదా! వీరూ చారిత్రికతప్పిదాలు చేసేయడం అలవాటు చేసుకుంటున్నారు..

    ReplyDelete
    Replies
    1. yes,I forgot to mention their friendly comrades!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...