Friday 1 March 2019

శివపురాణం శివుడే విష్ణువుతో సహా అన్నింట్నీ సృష్టించాడంటుంది!విష్ణుపురాణం విష్ణువే శివుడితో సహా అన్నింట్నీ సృష్టించాడంటుంది!దేవీభాగవతం ఆదిశక్తియే శివుణ్ణీ విష్ణువునీ సృష్టించిందని చెప్తుంది!హిందూద్వేషులు సంస్కృతం నేర్చుకుని అల్లరి చెయ్యక ముందే వీట్ని సమర్ధించి పారెయ్యాలి - వేదం అబద్ధం చెప్పదని కూసేశాను, ఇప్పుడెట్లా?

హైందవేతరులకే కాదు హిందువులకి కూడా ఇది భూగోళం బద్దలయ్యేటంత పెద్ద సందేహమే!అయితే, అసలు ఇంతమంది దేవుళ్ళు అవసరమా?సృష్టికర్త ఒకడే అని చెప్తున్నప్పుడు ఆ ఒక్క సృష్టికర్తనే పూజించితే సరిపోతుంది కదా, ఇంతమంది సృష్టికర్తల్ని చూపించి గందరగోళంలో పడెయ్యటం దేనికి?మళ్ళీ ఆ  గందరగోళం నుంచి బయట పడెయ్యటానికి కొంతమంది గురుత్వం వహించడం దేనికి?

దీనికి సరైన సమాధానం చెప్పబోయేముందు హిందూమతం గురించి ఒక పరమసత్యం చెప్పాలి - ఇది ఒక మతం కాదు,ఒక పవిత్ర గ్రంధం లేదు,ఒక ప్రత్యేకమైన మార్గం లేదు!ఇది ఎలా సాధ్యపడింది?శంకర మతం,రామానుజ మతం,మధ్వ మతం,  జైన మతం,బౌద్ధ మతం వంటివి ఉన్నాయి కానీ అవి కాక ఇతరులు పాటించే దానిని వైదిక ధర్మం అంటారు.పైన చెప్పిన మతాలు కూడా వేదం నుంచే కొంత భాగాన్ని తీసుకుని తమ సొంత మార్గాన్ని ఏర్పరచుకున్నాయి. అబ్రహామిక్ మతాల వారి దృష్టిలో నాస్తికత్వం అంటే దేవుడు లేడని అనటం, కానీ సనాతన ధర్మం  నాస్తికత్వం  అనే పదానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం వేదం పరమ ప్రమాణం అని అంగీకరించకపోవటం కాబట్టి జైనం, బౌద్ధం, అజీవకం,కాపాలికం వంటివాటిని నాస్తిక మతాలు అని కూడా అంటారు.అయితే పునాదిని బట్టి ఇవి కూడా సనాతన ధర్మంలోని శాఖల వలె అమరిపోయినాయే తప్ప ఆధిక్యత కోసం పరస్పర దూషణ హననాదులు చేసుకోలేదు!

సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తల యొక్క ప్రధాన ఉద్దేశం అబ్రహామిక్ మతాల వారి వలె అందరినీ తీసుకెళ్ళి ఒక్కరికో లేక కొందరికో బానిసల్ని చెయ్యడం కాదు గనక మానవులకి నిజమైన భద్రతనీ శాంతినీ పురోభివృద్ధినీ ఇచ్చే సామాజిక వ్యవస్థ గురించి శోధించారు, సాధించారు. పూర్వ ఋషులు వారి నిశిత పరిశీలనతో మానవులే కాదు, సమస్త జీవుల లోనూ తమ ముందు ఉన్న అనేకానేకమైన వస్తువులలో భావాలలో లక్ష్యాలలో దేనిని స్వీకరించాలనే విషయంలో త్రిగుణాత్మకత కనిపిస్తుందని గమనించారు.

ఐన్స్టీన్ ప్రకృతిలోని కొన్ని దృగ్విషయాలను పరిశీలించి చెప్పిన సాపేక్షతా సిద్ధాంతాన్ని సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తలు ఆనాడే దర్శించారు, సమస్త విషయాలనూ ఆ రకమైన అవగాహనతోనే పరిశీలించారు.అయితే, ఆధునిక సాపేక్షతా సిద్ధాంతంలోని కాంతివేగం వలె సనాతనులు "మార్పు అనివార్యం!" అని ఒక శాశ్వత సత్యాన్ని ప్రతిపాదించారు.తామసం, రాజసం, సాత్వికం అనే మూడు గుణాలు మానవులలోనే కాదు ప్రతి జీవిలోనూ ఉంటాయి.అయితే  ఏదో ఒక గుణం అధిక స్థాయిలో ఉంటుంది.తన ముందు ఉన్నవాటిలో దేన్ని తీసుకోవాలి,తను ఏ పని చెయ్యాలి,తనకు ఏది సంతోషాన్ని కలిగిస్తుంది అనే రకరకాల అంశాలకు సంబంధించి ఆయా ప్రవృత్తులు గలవారి అనుభూతులూ ఆపేక్షలూ భావాలూ లక్ష్యాలూ పూర్తి వైవిధ్యంతో నిండి ఉంటాయి.

వ్యక్తి->వ్యష్ఠి->సముష్ఠి జీవనం సుఖవంతం కావాలంటే ఇతర వర్గాలన్నిటినీ నాశనం చేసి ఒక వర్గాన్ని మాత్రమే మిగిలించడం. ఇతర మతాలన్నిటినీ నాశనం చేసి ఒక మతాన్ని మాత్రమే మిగిలించడం. ఇతర కులాలన్నిటినీ నాశనం చేసి ఒక కులాన్ని మాత్రమే మిగిలించడం. ఇతర కుటుంబాలన్నిటినీ నాశనం చేసి ఒక కుటుంబాన్ని మాత్రమే మిగిలించడం పరిష్కారం కానే కాదు - అసలు అలాంటిది వాస్తవ ప్రపంచంలో సాధ్యపడదు కూడా!సువిశాల ప్రజాసమూహాన్ని ఒక్క తాటి మీద నడిపించాలంటే సమూహంలోని ఈ మూడు ధోరణులనీ పట్టించుకుని ఎవరికి ఏది ఇస్తే సంతోషంగా ఉంటారో వారికి అది ఇవ్వగలగటమే సమర్ధవంతమైన ప్రభులక్షణం అవుతుంది, కదా!

అందుకే సనాతన ధర్మం ఒకే లక్ష్యాన్నీ ఒకే మార్గాన్నీ ఒకే అంశాన్నీ ప్రజల ముందు ఉంచలేదు.తను ఇవ్వగలిగిన అన్ని ప్రత్యామ్నాయాలనీ ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమనడం గొప్ప విషయమే తప్ప తప్పుడు ధోరణి ఎంతమాత్రం కాదు.ఇప్పుడు మనముందు కొన్ని కీలకమయిన ప్రశ్నలు ఉన్నాయి.

వేదం శివుడే సృష్టికర్త అని చెప్పిందా?
సోమః పవతే జనితా మతీనాం జనితా దివో జనితా పృధివ్యాః|
జనితాగ్నేర్జనితా సూర్యస్య జనితేంద్రస్య జనితోత విష్ణోః||
ఋగ్వేదం 9.86.5

పదార్ధ తాత్పర్యం:(సోమః)ఆ సర్వోత్పాదకుడగు పరబ్రహ్మ (పవతే) అన్నిటిని పవిత్ర పరచును,(జనితా మతీనాం) జ్ఞానముల నుత్పన్న పరచును, (దివో జనితా) ద్యులోకము నుత్పన్న పరచును, (పృధివ్యా జనితా) పృధివి నుత్పన్న పరచును, (అగ్నేర్జనితా)అగ్ని నుత్పన్న పరచును, (సూర్యస్య జనితా) సూర్యు నుత్పన్న మొనర్చును (ఉత) మరియు (విష్ణోః జనితా) జ్ఞానయోగుల నుత్పన్న పరచును మరియు (ఇంద్రస్యజనితా) కర్మయోగుల నుత్పన్న పరచును.

భావార్ధ ప్రతిపత్తి:ఈ మంత్రమున పరమాత్మ యొక్క సర్వకర్తృత్వం  నిరూపించబడినది సోమ నామం శివుణ్ణి సూచిస్తున్నది గనక ఇది శివపురాణం వేదసమ్మతమేనని తెలియజేస్తున్నది.
కాబట్టి శివపురాణం - వేదం ఒకదానితో ఒకటి విభేదించటం లేదనీ శివపురాణం శివుడే సృష్టికర్త అని అనడాన్ని వేదం సమర్ధిస్తున్నదనీ నిరూపణ అయింది, కదా!

వేదం ఆదిశక్తియే సృష్టికర్త అని చెప్పిందా?
ఆరావీదంశుః సచమాన ఊర్మిణా దేవావ్యం మనుషే పిన్వతి త్వచం|
దదాతి గర్భమదితేరుపస్థం ఆ యేన తోకం చ తనయం చ ధామహే||
ఋగ్వేదం 9.74.5

పదార్ధ తాత్పర్యం:(ఊర్మిణా)తన ఆనంద తరంగములతో (సచమానః) కూడియున్న (అంశుః)సర్వవ్యాపకుడగు ఆ పరమాత్మ (ఆరావీత్) సదుపదేశము నిచ్చుచున్నాడు. మరియు (మనుషే) మనుష్యుల కొరకు (దేవావ్యం) దైవభావము నుత్పన్నపరచు శరీరమును (పిన్వతి) పుష్ఠి పరచును మరియు (అదితేరుపస్థే) ఈ పృధివిపై (గర్భ) నానావిధములగు ఓషధులను ఉత్పన్నపరచు గర్భమును (ఆదధాతి) ధరించును.(యేన) దేనిచే (తోకం) దుఃఖములను నాశనమొందించునట్టి (తనయం) పుత్ర పౌత్రాదులను (ధామహే) మనము ధారణ మొనర్చవలెను.

భావార్ధ ప్రతిపత్తి:పరమాత్మ కృప చేతనే సత్కర్మ లొనర్చువారికి వ్యాధిరహితమగు దివ్యశరీరము లభించును.దీనిచే వారు సత్సాంతానమును పొంది ఈ ప్రపంచములో అభ్యుదయశీలురు కాగలరు.ఈ మంత్రంలోని కార్యకారణఫలితసంబంధం నిరూపించబడిన అదితి గౌరికి గల అనేక నామాల్లో ఒకటి కాబట్టి ఇది దేవియే సృష్టికర్త అని చెబుతున్నది.

గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ|
అష్టపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్
ఋగ్వేదం 1.164.41

పదార్ధ తాత్పర్యం:(గౌరీః)గౌరవర్ణాః (మిమాయ) శబ్దాయతే (సలిలాని) జలానీన నిర్మలాని వచనాని (తక్షతీ) (ఏకపదీ)ఏకవేదాభ్యాసినీ (ద్విపదీ)అభ్యస్తద్వివేదా (చతుష్పదీ) చతుర్వేదాధ్యాపికా (అష్టాపదీ) వేదోపవేద్విద్యాయుక్తా (నవపదీ) చతుర్వేదోపవేదవ్యాకరణాదిశిక్షాయుక్తా (బభూవుషీ) అతిశయేన విద్యాను భవంతీ (సహస్రాక్షరా) సహస్రాణి అసంఖ్యాతాస్యక్షరాణి యస్యాః సా (పరమే) సర్వోత్కృష్టే (వ్యోమన్)వ్యోమనద్వ్యాప్తే

అన్వయ భాష్యం:హే స్త్రీపురుషా యైకపదీ ద్విపదీ చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా సతీ పరమే వ్యోమన్ ప్రయతతే గౌరీర్విదుషీర్మిమాయ సలిలానీన తక్షతీ సా విశ్వకళ్యాణకారికా భవతి.

భావార్ధ ప్రతిపత్తి: ఏ స్త్రీలు ఒక్క వేదమును మాత్రము అభ్యసించిన గానీ లేక రెండు వేదములను నేర్చిన గానీ లేక నాల్గు వేదములను చదివిన గానీ లేక నాల్గు వేదములు నాల్గు ఉపవేదముల యందు శిక్షణ పొందిన గానీ లేక నాల్గు వేదములు, నాల్గు ఉపవేదములు, వ్యాకరణాది విద్యలను అభ్యసించిన గానీ గౌరీ యని పిలువబడుచు మృధుభాషులై అవిద్యను పోగొట్టి విశ్వమునకు శాంతిని ప్రసాదించగలరు.


ఇక్కడ సృష్టికి ఆధారభూతమైన వేదవిద్యలకు మూలం గౌరి అని చెప్పడమే కాకుండా వేదం చదివిన స్త్రీలు కూడా గౌరీ సమానులు కాగలరని చెప్పడం వల్ల ఏమి తెలుస్తున్నది?ఆడవాళ్ళని వేదం చదవనివ్వలేదని కొందరు విమర్శించడం  తప్పు కదా!
కాబట్టి దేవీభాగవతం - వేదం ఒకదానితో ఒకటి విభేదించటం లేదనీ దేవీభాగవతం శక్తియే సృష్టికర్త అని అనడాన్ని వేదం సమర్ధిస్తున్నదనీ నిరూపణ అయింది, కదా!

వేదం విష్ణువే సృష్టికర్త అని చెప్పిందా?
సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదం
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణం హరిం
విశ్వమేవేదం పురుషః తద్విశ్వ ముపజీవతి
ఋగ్వేదం - నారాయణ సూక్తం

దీనిని వ్యాఖ్యానం అఖ్ఖర్లేదనుకుంటాను.చాలా స్పష్టంగా విష్ణువు యొక్క గొప్పదనాన్ని చెప్తున్నది.
కాబట్టి విష్ణుపురాణం - వేదం ఒకదానితో ఒకటి విభేదించటం లేదనీ విష్ణుపురాణం విష్ణువే సృష్టికర్త అని అనడాన్ని వేదం సమర్ధిస్తున్నదనీ నిరూపణ అయింది, కదా!


శివుడే సృష్టికర్త అనే శివపురాణాన్నీ విష్ణువే సృష్టికర్త అనే విష్ణుపురాణాన్నీ శక్తియే సృష్టికర్త అనే దేవీభాగవతాన్నీ సమర్ధించడం అంటే వేదం ఏ ఎండకా గొడుగు పడుతున్నట్టు కాదా!కాదు, ఎందుకంటే వేదం పరమ పవిత్రమని చెప్తున్న ఓంకారం ఈ ముగ్గురికీ అనుసంధానించింది గనక  వారిలో ఒకరు అధికులూ మిగిలిన ఇద్దరూ అల్పులూ అని చెప్పటం అసాధ్యం!

“స యద్ ధృవం దిశం అను వ్యచలద్ విష్ణుర్ భూతానువ్యచలద్ విరజం అన్నదిం కృత్వా |” (అధర్వ వేదం 15:14:5) అన్న మంత్రం “వ్రత్య నామధారియైన శివుడే కదాచిత్ లీలావినోదియై విష్ణు రూపమును దాల్చి విరజ అనే అన్నద స్వభావం గలిగిన శక్తిస్వరూపాన్ని సృష్టించాడు” అని స్పష్టం చేస్తున్నది. ఋగ్వేదం 9.74.5 ప్రకారమే అదితి గర్భంలో బీజాన్ని ఉంచి సంతానకారకుడౌతున్నది సోముడే అని తెలుస్తున్నది కదా! “నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ | నమః పూర్వజాయ చ పరజాయ చ | నమో మధ్యమాయ చ పాగల్భాయ చ |” (యజుర్వేదంలోని శ్రీ రుద్ర అనువాకం-6) అనే మహావాక్యం “ఒకేసారి జ్యేష్ఠుని గానూ కనిష్ఠుని గానూ ఉండగలిగిన వానికి నమస్కారం. ఒకేసారి పూర్వజుని గానూ పరజుని గానూ ఉండగలిగిన వానికి నమస్కారం. ఒకేసారి మధ్యస్థుని గానూ గర్భస్థుని గానూ ఉండగలిగిన వానికి నమస్కారం” అని కీర్తిస్తున్నది దేవి యొక్క మూడు అండాల నుంచి ప్రభవించిన త్రిమూర్తులనే కానీ ఎవడో వల్లకాట్లో రామనాధాయ కొడుకుల్ని కాదు.ఈ రుద్రనమకం ప్రకారం ఆ త్రిమూర్తులలోనూ ఉన్నది ఒకే పరబ్రహ్మ అన్నది నిరూపణ అయినట్లే కదా!వేదం శివుడు,విష్ణువు,శక్తి అని పేర్లు పెట్టి పొగిడినది ఒకే పరతత్వాన్ని అని అర్ధం అయింది గనక ఇంక పురాణ కధల విషయం చూడాలి.

ఉపనిషత్తులూ పురాణాలూ ధనుర్వేదం లాంటి ఉపవేదాలూ వేదాలకి కొనసాగింపు మాత్రమే తప్ప మరొకటి కాదు.వేదవ్యాసుడు అన్నిటినీ చదివి అర్ధం చేసుకుని విషయాన్ని బట్టి విభజించిన తర్వాతనే నాలుగు వేదాలు అయ్యాయి.అంతకుముందూ తర్వాతా సత్యాన్ని బట్టి చూస్తే వేదం ఒక్కటే.వేదం బీజరూపం కాబట్టి దానిని  అర్ధం చేసుకోవడం ఆ మంత్రద్రష్టల స్థాయిలో పాండిత్యం సాధించిన వారికి మాత్రమే సాధ్యం.ఆనాడు విద్య అంటే వేదవిద్యయే, ఆ విద్యని ఉపాధి కోసమో కీర్తి కోసమో నేర్చుకుంటూ ఉంటే కాలక్రమేణా వాటికి పనికొచ్చే భాగం మాత్రమే ఉండి మిగిలిన భాగం నశించి ఉండేది.అలా జరగకుండా ఉండటానికి పూర్వరుషులు రెండు మార్గాలను అనుసరించారు.అద్భుతమైన ధారణాశక్తి కలిగిన కొందరిని స్వాధ్యాయం పేరుతో నియోగించడం, వేదార్ధ ప్రతిపాదకాలైన పురాణ కధలని రచించి సామాన్య ప్రజలకు కూడా సమగ్రమైన వైదిక ధర్మాన్ని పరిచయం చెయ్యడం.

కధా సాహిత్యం అనగానే పాత్రల రూపకల్పన, సన్నివేశ కల్పన, సంవిధానం, నాటకీయత వంటి భావోద్వేగాలను రగిలించే అంశాలు ఉంటాయి.కధ అంటేనే జరగని దాన్ని జరిగినట్టు చెప్పడం,జరిగిన దాన్ని జరిగినట్టు చెప్తే అది చరిత్ర - ఈ తేడా కూడా తెలియని మూర్ఖులు హిందువుల పురాణ కధలలోని కల్పిత పాత్రల్ని వాస్తవ ప్రపంచంలోని వ్యక్తుల కింద ఫిరాయించేసుకుని వాళ్ళ మతగ్రంధాలు వాస్తవవ్యక్తులని నొక్కి చెప్తున్న కల్పిత పాత్రల కున్న అవలక్షణాల్నీ అనైతికతల్నీ అంటగట్టి ఆవేశపడిపోతున్నారు. అదీగాక, ఇవ్వాళ కనిపిస్తున్న ఉపనిషత్తులూ పురాణాలలో అధికారికమైనవి చాలా తక్కువ.ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక,మాండూక్య, ఐతరేయ, తైత్తిరీయ, ఛాందోగ్య, బృహదారణ్యక అనే పది ఉపనిషత్తులు మాత్రమే అధికారికమైనవి.ఇవి తప్ప ఏకాక్షర ఉపనిషత్తు నుంచి అల్లోపనిషత్తు వరకు గల సమస్తాన్నీ తీసుకెళ్ళి గోదాట్లో కలిపేసినా హిందూమతానికి ఎలాంటి నష్టమూ జరగదు.

పద్మ పురాణంలోనే వ్యాసప్రోక్తమైన 19 పురాణాలను గురించి  "వైష్ణవానాం నారదీయం చ తధా భాగవతం శుభం గరుడం చ తధా పద్మం వరాహం  శుభదర్శనే సాత్వికాని పురాణాని విజ్ఞేయాని శుభాని వై, బ్రహ్మాండం బ్రహ్మవైవర్త మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం రాజసాని నిబోధ మే, మత్స్యం కూర్మం తధా లైంగం శైవం స్కంధం తధైవ చ అగ్నేయం  చ షడ్ ఏతాని తాంసాని నిబోధ మే" అని చెప్పారు.

మహాభారత కాలం(పూ.సా 3102) వరకు భారతదేశంలోని ఆధ్యాత్మికత సమస్తమూ వేదాల నుంచే తీసుకోవడం జరిగింది.అప్పటికి బహ్మయే సకలలోకాధిపతి, ఐశ్వర్య ప్రదాత - ब्रह्मा लोकाधिपो यथा (శ్రీమద్ రామాయణం, బాల కాండ)! ఇంద్రుడు విజయ ప్రదాత.కురుక్షేత్ర యుద్ధం అప్పటి బలమైన  సామ్రాజ్యాలను నాశనం చేసింది.ముఖ్యంగా పాందవుల వారసులు బలహీనులైపోవడంతో ఏ ప్రాంతంలో ఏ రాజు బలవంతుడైతే ఆ రాజు తన ఆస్థాన పండితుల చేత కొత్త పురాణాలను రాయిచి కొత్త దేవుళ్ళని సృష్టించి ఇప్పటి అబ్రహామిక్ మతాల వలెనే సంఖ్యను పెంచుకోవడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.అయితే, అప్పటికే వ్యాసప్రోక్తం శిరోధార్యం అని స్థిరపడింది గనక మౌలిక స్వరూపాన్ని చెదరగొట్టటానికి జంకి వీలయినంతవరకు వేదవాక్యంతో విభేదించకుండా జాగ్రత్త పడ్డారు - తమ కర్తృత్వాన్ని కూడా వదులుకుని తమ రచనల్ని కూడా వ్యాసప్రోక్తం అని చెప్పేశారు.వేదం 33 మందిలో ఒకరని చెప్పిన విష్ణువు దేవాధిదేవుడు గానూ వేదంలో అరుదుగా ప్రస్తుతించబడిన రుద్ర నామధారిని శివుడి పేరున మహాదేవుడు గానూ కీర్తించడం ఈ కాలం నుంచే ప్రారంభం కావడం చారిత్రక వాస్తవం.భౌతికపరమైన సాక్ష్యాలతో తెలుస్తున్న అతి ప్రాచీనమైన ఆలయాలు ఈ కాలం తర్వాతనే నిర్మించబడినాయనేది కూడా వాస్తవమే.శక్తి యొక్క రాజరాజేశ్వరి నామం వేదసంహితలలో కనపడదు.గణపతి యొక్క ప్రస్తుత రూపం నాల్గు వేదాలలో ఎక్కడా కనిపించదు.ఈ దేవతల స్థాయిని పెంచే ప్రయత్నంలో బ్రహ్మ యొక్క స్థాయిని తగ్గించేశారు.ఇప్పటికీ ఇండొనేషియాలో బ్రహ్మయే ప్రధాన దైవతం కావడం ఈ మార్పులు జరగక పూర్వపు కాలంలోని ఇక్కడివారు అక్కడికి వెళ్ళి స్థిరపరచిన సంప్రదాయం అని మనం భావించవచ్చును.

వేదం తప్ప మిగిలిన వాటిని వ్యాసప్రోక్తమైతేనే అవి అధికారికమైనట్టు మనం భావించాలి అనే నియమం ఉండటం వల్ల తొలిదశలో తాము ఎవర్ని ప్రధాన దైవం అని చెప్తున్నారో అ దైవాన్ని కీర్తించి సరిపెట్టుకోవడం వల్ల సమస్యలు రాలేదు గానీ పోను పోనూ సంఖ్యను పెంచుకోవడం అనే దుర్గుణం ప్రవేశించి ఇతర దైవాల్ని తూలనాడే అవలక్షణం ప్రవేశించి వైష్ణవం, శైవం, శాక్తేయం అనే స్పష్టమైన విభజన ఏర్పడి వాటిమధ్య కలహాలు మొదలై కొంతకాలం పాటు ప్రచ్ఛన్నయుద్ధం తారాస్థాయిలో జరిగింది!

అంతకు ముందు ఒక వ్యక్తి వేదం చెప్పిన ప్రకారం జీవిస్తున్నాడా లేదా ఆనెది మాత్రమే ప్రధానం అయితే ఈ కాలానికి వచ్చేసరికి అతను ఏ దేవుడి భక్తుడు అనేది ప్రధానం అయింది.దండకారణ్యంలో సీతా రామ లక్ష్మణులు అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు అక్కడి వాతావరణం ఇలా ఉంది:
स तत्र ब्रह्मणः स्थानम् अग्नेः स्थानम् तथैव च || 
विष्णोः स्थानम् महेन्द्रस्य स्थानम् चैव विवस्वतः |
सोम स्थानम् भग स्थानम् स्थानम् कौबेरम् एव च || 
धातुर् विधातुः स्थानम् च वायोः स्थानम् तथैव च |
स्थानम् च पाश हस्तस्य वारुणस्य महात्मनः || 
स्थानम् तथैव गायत्र्या वसूनाम् स्थानम् एव च |
स्थानम् च नागराजस्य गरुड स्थानम् एव च || 
कार्तिकेयस्य च स्थानम् धर्म स्थानम् च पश्यति |
(అరణ్య కాండ 12వ సర్గ 17 - 21 శ్లోకాలు)
Sri Rama entered inside the hermitage and saw therein the sanctus of Brahma, Fire-god, Vishnu, Indra, Vivasvat - the Sun-god, Soma - the Moon-god, Bhaga - one among the twelve Suns, and the sanctusms of Kubera, [Wealth-Management-god, are seen and passed by the three of them, sanctums of Dhaata, Vidhaata - Vedic deities created by Brahma to help Svayambhuu Manu, santucm of Vaayu - the Air-god, and also like that the sanctum of great-soloed VaruNa - the Rain-god who also wields noose, and the sanctum of Gayatri - the presiding deity of gnosis, sanctum of Vasus - eight of them, and the sanctum of cobra's king - aadi sheSa, the divine Thousand-headed serpent that bears this globe on its head, and even the sanctum of GaruDa - the Divine Eagle , and the half brother of aadi sheSa, and the sanctum of Kaartikeya - chief of gods army,and the sanctum of Dharma - Dharmaraaja, presiding deity of Virtue-Vice-Time of living beings, in-charge of the hell.ఇక్కడి విశేషం గమనించారా!శివుడు లేడు,శివుని కుమారుడని ఇప్పుడు మనం భావిస్తున్న కార్తికేయుడు ఉన్నాడు.విష్ణువు వాహనమైన గరుడమూర్తికి కూడా ఆలయం ఉంది.

ఇప్పుడు నా మెడకీ మీ మెడకీ అతి పెద్ద ఉరితాడు తగిలించేశారు మన పూర్వఋషులు, అవునా?వేదం చెప్పని మూర్తిపూజని సమర్ధించడం వేదవిరుద్ధమే కదా - అది పాపకార్యం కాదా!కానే కాదు, ఎందుకంటే వేదం దృష్టిలో అసత్యం చెప్పడం, ఇతర జీవుల్ని హింసించడం,అన్యాయార్జన చెయ్యడం వంటివి మాత్రమే పాపకార్యాలు - మూర్త్యారాధనని కానీ బహుళదేవతారాధనని కానీ వేదం నిషేధించలేదు కాబట్టి అవి పాపకర్మలు కావు! అంతే కాదు,నారాయణ సూక్తం నుంచి పురుష సూక్తం వరకు గల వేదమంత్రాలు అన్నీ ఈ విశ్వమూ దైవమూ ఒకటే అని చెప్పాయి కదా - చూసి, తెలుసుకుని, ధ్యానించి, లీనమై తరించమనే కదా వేదం చెప్పింది!కంటికి కనిపించే వాటిలో కొన్నింటికి వాటి పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ రెండు చేతులూ జోడించి చేసే నమస్కారం మూర్తిపూజలోని భాగమే!

"పూరణాత్ పురాణం ఇతి చన్యత్ర" అని చెప్పిన దాని ప్రకారం వేదం బీజరూపంలో చెప్పినదాన్ని విస్తరించి చెప్పడమే పురాణ కధల ప్రధానమైన లక్ష్యం కాబట్టి .గ్రాడ్యుయేట్ లెవెల్లో చెప్పే పాఠాలు ఇంటర్‌మీడియట్ లెవెల్లో  చెప్పడం లేదు గాబట్టి డిగ్రీలో చెప్తున్న పాఠాలు ఇంటర్‌మీడియట్ పాఠాలతో విభేదించనట్టే పురాణకధలు కూడా వేదంతో విభేదించడం లేదని అర్ధం చేసుకోవాలి.


తామసం కన్న రాజసం ఉన్నతమైనది - ఎందుకంటే అది కనీసం కర్మలు చెయ్యడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించేలా చేస్తుంది కాబట్టి.రాజసం కన్న సాత్వికం ఉన్నతమైనది - ఎందుకంటే అది సత్కర్మలు చెయ్యడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించేలా చేస్తుంది కాబట్టి.ఈ మూడు గుణాలని బట్టి విభజించిన అన్ని పురాణాలూ సాత్వికమైన శ్రీకృష్ణ చరితామృతమైన భాగవత పురాణం అతిశ్రేష్ఠం పరమ ప్రమాణం అని అంటున్నాయి.ఇంక భేదాభిప్రాయం, సంఘర్షణ,పరస్పర హననం వంటివాటికి చోటు ఎక్కడ ఉంది?వైష్ణవం, శైవం, శాక్తేయం మధ్యన కూడా ఆయా శాఖలకి చెందిన పండితుల మధ్యన వాదోపవాదాలు జరగడమూ ఆయా మతాలకు చెందినవారి మధ్య జరిగిన చెదురు మదురు  హింసాత్మక సంఘటనలు జరగడమూ తప్ప మార్క్సిష్టు చరిత్రకారుల ప్రకారం కూడా ఏ రాజూ మతయుద్ధం పేరున యుద్ధం చేసి రక్తపుటేరులు పారించలేదు!

అయితే, "వేదం మూర్తిపూజనీ బహుళదేవతారాధననీ నిషేధించలేదు అనే కారణంతో ఒకరి దేవుణ్ణి మరొకరు దూషించుకునేటంతవరకు వెళ్ళినప్పుడు హిందూమతం సర్వోత్తమమైనది ఎట్లా అవుతుంది?" అనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది - దాన్ని తప్పించుకుని తిరగడం కూడా కుదరదు!

ఇంతవరకు చెప్పాక చల్లకొచ్చి ముంత దాచినట్టు శైవ, వైష్ణవ, శాక్తేయ కలహాల చరిత్రని దాచిపెట్టెయ్యటమూ సాధ్యం కాదు.వేదం చాలా స్పష్టంగానే చెప్పింది సృష్టికర్త ఒక్కడే అని, కానీ ఇంద్ర,అగ్ని,వరుణ, రుద్ర వంటి దేవతలను ప్రస్తుతించే సూక్తాలూ మంత్రాలూ కూడా ఉన్నాయి కదా!ఆలయాలలోని అర్చామూర్తుల పూజావిధానాలకు సంబంధించిన ఆగమం వేదంలోని భాగమే కదా!అదీగాక, "న తస్య ప్రతిమా అస్తి" అనే మంత్రం కూడా విశ్వమే తానైన సృష్టికర్తను ఒక రూపానికి కుదించటం అసాధ్యం అని చెప్పింది గానీ అసలు రూపం లేదని అనలేదు - అన్ని రూపాలూ ఆయనవే అని నొక్కి చెప్పింది! వివిధ దేవతలకు అర్చామూర్తులను చెక్కడానికి శిల్పులు అనుసరించే శిల్పాగమ శాస్త్రం కూడా వేదంలోని భాగమే అయినప్పుడు ఇంక వేదం మూర్తిపూజనీ బహుళదేవతారాధననీ వ్యతిరేకించినట్లు ఎట్లా అవుతుంది?

ఈ వైష్ణవ, శైవ, శాక్తేయ కలహాలు వ్యాస భగవానుడు ఆయా పురాణాలను తామస, రాజస, సాత్విక విభజన చేసిన ఉద్దేశాన్ని గమనించని రాజులూ పండితులూ అతి చెయ్యడం వల్ల జరిగాయి - అతి సర్వత్ర వర్జయేత్ అన్న సామాన్య నియమం ప్రకారం ప్రజలు వారి అతి ధోరణుల్ని తిరస్కరించారు.

వ్యాసదేవుని అవగాహన ప్రకారం వ్యక్తులలో గానీ సమాజాలలో గానీ మొదట తామసం(ignorance) ఉంటుంది.వీరికి, అంటే పరమేశ్వరుడి పట్ల ఆసక్తి కూడా లేని స్థితిలో ఉన్నవారికి తామసిక స్వభావం నింపుకున్న కధలు ఆకర్షణీయంగా ఉంటాయి.తామసం కన్న రాజసం(passion) కొంత ఉన్నతమైనది.ఎందుకంటే, ఇది మనిషిని చైతన్యవంతుణ్ణి చేస్తుంది.ఈ మనఃస్థితిలో ఉన్న మనిషికి రాజసిక స్వభావం గలిగిన కధలు సంతృప్తిని ఇస్తాయి.ఒకసారి రజస్సు పుడితే అది మనిషిని ఆ స్థాయిలోనే ఉండిపోనివ్వదు - సాత్వికం(realization) వైపుకు మనిషిని నడిపిస్తుంది.అప్పుడు సాత్విక స్వభావం కలిగిన పురాణ కధలు ఈశ్వర తత్వాన్ని సాధకుడిలో సుస్థిరం చేస్తాయి.ఇది ఆయా పురాణ కధల ప్రారంభాన్ని గమనిస్తే అర్ధం అవుతుంది.

ఉదాహరణకు, లింగ పురాణం ప్రారంభంలో శౌనకాది మునులు సూత మహర్షిని లింగరూపంలో ఉన్న శివుడి గొప్పదనాన్ని చెప్పమని అడుగుతారు - ఆ ప్రశ్నలోనే సూత గోస్వామికి వారు కొన్ని పరిధులు విధించారు.సూత మహర్షి కూడా అడిగిన ప్రశ్నకి మాత్రమే జవాబు చెప్తూ ఆ మూర్తి తత్వాన్ని ప్రశంసించే పురాణ కధల్ని వినిపిస్తాడు.అదే సాత్విక పురాణమైన భాగవతం దగ్గిర పరబ్రహ్మ తత్వాన్ని గురించి చెప్పమని అడుగుతారు.సాక్షాత్తూ వేదవ్యాసుడే హరివంశంలో "వేదే రామాయణే చైవ పురాణే భారతే తధా ఆదే అంతేచ మధ్యేచ హరిః సర్వత్ర గీర్యతే" అని స్పష్టం చేశాడు.

అయినా సరే, ప్రమాదో ధీమతా మపి అన్నట్టు ఆ పురాణ కధలని వ్యాసుడు అలా యెందుకు రాశాడో గమనించనివారు ఆ సంకుచితమైన ప్రశ్నల నుండి పుట్టిన పాక్షిక జ్ఞానాన్నే సమస్తం అని పొరబడి పక్షపాత బుద్ధిని ప్రదర్శించారు.ఆ చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం ఇక లేనట్టే - ఐతే అలాంటి ధోరణులని మళ్ళీ ప్రోత్సహిస్తే మాత్రం ఇక సనాతన ధర్మం అంతరించి పోయినట్టే!

ఒకటి గమనించండి, వేదమంత్రాలలో ప్రస్తుతించడిన ఓంకారాన్ని ఏ దేవత నామానికి ముందు చేరుస్తారో ఆ దేవతామూర్తి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే అవుతుంది.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पुर्णमुदच्यते
पूर्णश्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే|
పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే||
"That is complete, This is complete, From the completeness comes the completeness.If completeness is taken away from completeness, Only completeness remains." - ఈ భావంలోని completeness అనే పదాన్ని తీసేసి  Shiva, Vishnu అనే పదాల్ని చేరిస్తే "Shiva is complete, Vishnu is complete, From the Shiva comes the Vishnu.If Vishnu is taken away from Shiva, Only Shiva remains." అయి శివుడే పరిపూర్ణుడు అని అర్ధం వస్తుంది, అవునా?దీనినే బ్రహ్మ, శక్తి, గణపతి, రామ, కృష్ణ, హనుమ, అయ్యప్ప వంటి మూర్తులకి కూడా అనుసరించవచ్చును - ఎవరి తారణ వారిదే!

తారణకు సర్వులూ అర్హులే అనేది సనాతన ధర్మం యొక్క ప్రధాన సూత్రం అని వ్యాసపరాశరాదిషిర్డిసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి నేను చెబుతున్న పరమ సత్యం!ఏది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

4 comments:


  1. శ్రీకాళహస్తిలో శివునికి అప్రదక్షిణమే చేస్తారట. ఆలయం పశ్చిమ ముఖంగా ఉంటుందట.

    ReplyDelete
  2. *నాటి కార్గిల్ యుద్ధ అద్దం లో నేటి యుద్ధ కధని పరిశీలిద్దాం!*

    ప్రియమైన మిత్రులారా, ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య గతంలో మూడున్నర యుద్దాలు జరిగాయి. 1947, 1965, 1971 లలో మూడు సార్లు పూర్తిస్థాయి యుద్దాలు జరిగాయి. 1999లో అర్ధయుద్దం (మినీయుద్ధం) జరిగింది. దానినే "కార్గిల్ యుద్ధం" అంటారు. ఈ మూడున్నర యుద్దాలలో మొదటి అండ్ (1947) నాలుగవ (మినీ యుద్ధం) యుద్దాల మధ్య పొలికలున్నాయి. రెండు ప్రత్యర్థి దేశాలని ఒకే యుద్ధ ఆయుధ విక్రేత రాజ్యం తెర వెనుక వుండి నడిపించిన విచిత్ర నేపధ్యమది. దాన్ని గుర్తు చేసుకుందాం.

    1947కీ, 1999కీ మధ్య యాబై ఏళ్ల కి పైగా వ్యవధి ఉంది. 1947 యుద్ధంలో ఇండియా, పాకిస్తాన్ లని బ్రిటన్ కంట్రోలు చేసింది. చివరి గవర్నర్ జనరల్ గా లార్డు మౌంట్ బాటన్ రెండు ఇరుగు పొరుగు బాల్య దేశాలకి పాలనాధికారిగా వుండి నియంత్రణ చేసాడు. ఆనాటి మరో విచిత్రమైన విషయాన్ని గుర్తు చేయాలి. రెండు పొరుగు దేశాల సైన్యాలకి కూడా బ్రిటీష్ ఆర్మీ అధికారులే "సైనిక సలహా దారులు"గా ఉండటం గమనార్హం. రెండు పొరుగు దేశాల ప్రజల మధ్య కాశ్మీరు సమస్య పై శాశ్వత "పగ" రగిల్చే తన దీర్ఘకాలిక లక్ష్యం నెరవేరిన తర్వాత మధ్యవర్తిత్వం వహించి యుద్దాన్ని తాత్కాలికంగా విరమణ చేయించింది. అది ఒకే యుద్ధరాజ్యం (బ్రిటన్) రెండు దేశాల ప్రభుత్వాల మధ్య యుద్ధం చేయించిన నేపధ్య కధ!

    మౌంట్ బాటన్ అవార్డు పేరిట అపసవ్యం గా దేశ విభజన కి బ్రిటన్ దిగింది. అంతే కాకుండా, కాశ్మీరు సమస్య ని తన రాజకీయ క్రీడలో ఓ తురుపుముక్కగా వాడుకున్నది. అంతిమంగా హిందూ-ముస్లిం విద్వేషాల ని రగిల్చింది. ఆ లక్ష్యంకై ఆనాడు తానే ఇరు దేశాల్ని రెచ్చగొట్టి యుద్ధం చేయించి ఇరు దేశాలకి కూడా తానే ఆయుధాలు అమ్ముకొని పబ్బం గడుపు కున్నది. తుదకి తానే ఇద్దరి మధ్య రాజీ చేయించింది. భవిష్యత్తులో నూరేళ్ళ పాటు యుద్ధ వాతావరణం కొనసాగే రీతిలో యుద్దాన్ని ముగించింది. అది 70 ఏళ్ల క్రితం నాటి యుద్ధకథ!

    1965, 1971 యుద్దాల స్వభావంలో మార్పు లేదు. కానీ యుద్ధస్వరూపంలో మార్పు వుంది. ఇరువైపుల ఓకే "యుద్ధ మాస్టారు" స్తితి లేదు. అంతర్జాతీయస్థితిలో ఈలోపుగా మౌలిక మార్పు వచ్చింది. ప్రచ్ఛన్న ప్రపంచ క్రమం ఏర్పడింది. కావున ఇండియా, పాకిస్థాన్ లని చెరొక రాజ్యం బలపరిచే స్తితి ఏర్పడింది. అందుకే 1947 నాటి యుద్ధం కంటే 1965&1971 యుద్దాలు ఎక్కువ తీవ్రతతో సాగాయి. (1965కంటే 1971 యుద్ధం మరింత తీవ్రతని కలిగింది) పై నేపధ్యం వల్ల ఉభయ దేశాలని ఓకే అగ్రరాజ్యం నియంత్రించే స్తితి లేదు. యుద్ధవిరమనని ఓకే రాజ్యం చేయగలిగే స్తితి లేదు. యుద్దాన్ని 1947లో వలె ఓకే బ్రిటన్ ముగించిన విధంగా సాధ్యం కాదు. అది రెండు అగ్రరాజ్యాల మధ్య ముగింపు జరగాలి. అంటే నాడు ఆచరణలో USA, USSR ల మధ్య రాజీయే ఇండియా-పాకిస్తాన్ ల మధ్య రాజీగా మారింది. అదో తరహా యుద్ధకథ!

    ప్రచ్ఛన్న యుద్ధశకం ముగిశాక ప్రపంచ పరిస్థితి లో కూడా మౌలిక మార్పు వచ్చింది. ఇండియా, పాక్ దేశాల రాజకీయ వ్యవస్థలు రెండూ ఓకే అమెరికాపై ఆధారపడి స్తితి వచ్చింది. దీనితో 1947నాటి యుద్ధ కదే పునరావృతమైనది. ఆ నేపధ్యస్తితిలో 1999 లో కార్గిల్ యుద్ధం జరిగింది. అందుకే అది పూర్తి స్థాయి యుద్దం గా మారలేదు. 1947 లో ఓకే ఒక్క బ్రిటన్ లక్ష్యం నెరవేరితే యుద్దాన్ని ముగించే వీలున్నది. 1999 లో కూడా ఒకే అమెరికా లక్ష్యం నెరవేరితే యుద్ధం లేదా అర్ధయుద్దం ముగించే వీలుంది. ఆ నిర్దిష్ట ప్రపంచ స్థితిలో "పూర్తి యుద్ధం" గా మారాలన్న షరతు ఉండదు. ఎందుకంటే రెండు పొరుగు దేశాలపై తన రాజకీయ, ఆర్ధిక, సైనిక నియంత్రణా సామర్ధ్యం తగిన స్థాయిలో బలపడితే చాలు. అమెరికా ని అట్టి నిర్దిష్ట స్తితి సంతృప్తి పరుస్తుంది. అదే యుద్ద విరమనకి ప్రాతిపదికగా ఉంటుంది. ఈ అవగాహనా వెలుగు లో 1999 లో ఏమి జరిగిందో ఒకసారి టూకీగా అవలోకిద్దాం.

    TO BE CONTINUED

    ReplyDelete
  3. 1999లో ఇండియాలో అంతరంగికంగా NDA సర్కారుకి గడ్డుస్తితి ఎదురైనది. నాడు పాకిస్థాన్ లో నవాజ్ షరీఫ్ సర్కారు స్థితీ అదే. పై రెండు సర్కార్ల ని ఆయా దేశాల ప్రజలలో స్థిరపరుచుకొని, తిరిగి ఎన్నికల్లో గెలిపించుకునే లక్ష్యం నాడు అమెరికాకి ఉంది. అట్టి నేపథ్యంలో కార్గిల్ యుద్ధం జరిగింది. రెండు నెలల యుద్ధం నాటి అమెరికా లక్ష్యాన్ని సఫలం చేసింది. 1947లో వలె భారత ఉపఖండంలో రెండు పొరుగు దేశాలపై నాడు అమెరికా ఆధిపత్యం మరింత పెరిగింది. రెండు దేశాలకి అమెరికాయే తన ఆయుధాలని అమ్మింది. "నిర్జన", "నిర్ధన", "నిస్సార" మంచు కొండల్లో సరిహద్దు కి రెండు వైపులా, రెండు నెలలూ పేలిన శతఘ్నులూ అమెరికా దేశానివే! పైగా రెండు దేశాల సర్కార్ల మధ్య మొదట రెచ్చగొట్టే పాత్రనీ, తర్వాత రాజీ కుదిర్చే పాత్రనీ అమెరికా చేపట్టడం గమనార్హం.

    కార్గిల్ యుద్ధం జరిగాక కొన్నేళ్ళకి ఎన్నో వాస్తవాలు బహిర్గతమయ్యాయి. వికీ లీక్స్ బయటపెట్టిన చేదు నిజాలు కూడా ఉన్నాయి. "అమెరికా కోసం, అమెరికా యొక్క,అమెరికా చేత (For the USA, of the USA, by the USA) సృష్టించబఢ్ఢ కార్గిల్ యుద్ధంగా ఆనాడు ప్రపంచ రాజకీయ పటం మీద ధ్వనించింది. కేవలం రెండు పొరుగు దేశాలపై ఆధిపత్యంకే పరిమితం కాకుండా, వాటి రెండింటికి ఆయుధాల అమ్మకానికే కాకుండా, నాటి ప్రపంచ పరిస్థితుల్లో ఆధిపత్య ప్రయోజనాల కోసం కూడా ఒక హెచ్చరికగా చేసే లక్ష్యం తో అమెరికా సృష్టించిన యుద్ధంగా కూడా ఆనాడు ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు ప్రత్యర్థి పొరుగు దేశాల మధ్య తానే యుద్ధం చేయించి, తానే రాజీ కూడా కుదర్చగల సామర్ధ్యం తనకి ఉందని నిరూపించుకోవడం ద్వారా అమెరికాకి ఒక లక్ష్యం ఉంది.నాడు తమ సార్వభౌమాధికారంకై తలెత్తుకునే ప్రయత్నం చేస్తున్న కొన్ని దేశాలని భయపెట్టే లక్ష్యంతో నాడు అమెరికా చేయించిన యుద్ధంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

    వర్తమాన ప్రపంచ గమనంలో ఇండియా నేడు అమెరికా పట్టులోనే ఉంది. పాకిస్థాన్ స్థితీ స్థూలంగా అదే! వర్తమాన ప్రపంచ రాజకీయ పటం మీద చీలిపోలిన రెండు ప్రత్యర్థి ధృవాల వెనక ప్రత్యర్థి దేశాలుగా నేటికీ ఇండియా, పాకిస్తాన్ విడిపోయినట్లు ఒక నిర్ధారణకు రాలేము. నేటికీ స్థూలంగా అమెరికా పడగ నీడలో పరస్పరం పొట్లాడుకునే ప్రత్యర్థి దేశాలుగానే ఉన్నాయి. అందుకే స్థూలంగా తాజా యుద్ధస్తితి కూడా స్థూలంగా 1947 & 1999 కార్గిల్ యుద్దాల స్వభావాలని కలిగి ఉంటుందని భావించ వచ్చు. అంటే "అమెరికా కోసం, అమెరికా యొక్క, అమెరికా చేత" జరిగే యుద్ధంగా అంచనా వేయ వచ్చు. భారత, పాక్ పాలక వర్గాల ప్రయోజనాలకూ అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలకూ మధ్య స్థూలంగా వైరుధ్యం లేని నిర్దిష్ట పరిస్థితుల్లోనే అట్టి అవకాశం ఉంటుంది. దీని అర్ధం పై మూడు దేశాల పాలక వర్గాలకు విడివిడి స్వంత ప్రయోజనాలు ఉండవని కానేకాదు. వాటికి ఒకవైపు విడివిడిగా స్వంత ప్రయోజనాలుంటూనే, మరోవైపు ఉమ్మడి ప్రయోజనాలు కూడా ఉంటాయి. విడివిడి ప్రయోజనాలు అప్రధాన అంశంగా (సెకండరీ); ఉమ్మడి ప్రయోజనాలు ప్రధాన అంశంగా (ప్రైమరీ) ఉన్నప్పుడే మరో కార్గిల్ యుద్ధం పునరావృతానికి వీలుంది. నేటి ప్రపంచ & దక్షిణాసియా పరిస్థితులు సూచించే వాస్తవమిది.

    రెండు పొరుగు దేశాల ప్రభుత్వాలూ ప్రజా వ్యతిరేక స్వభావం గలవే. రెండింటినీ తన వెనక నిలబెట్టుకోవడం అమెరికాకి నేడు ప్రత్యేక అవసరమే. చిన్నదేశమైన ఉత్తర కొరియా చేతుల్లో ఓటమి పొందిన అమెరికా బలహీనపడుతున్నదనే సంకేతాలు వెలువడుతున్న స్తితి ఉంది. గాన కొన్ని చిరకాల అమెరికా అనుకూల దేశాలు కూడా ప్రత్యామ్నాయం మార్గం వెతుక్కుంటున్న స్తితి ఉంది. అట్టి దేశాలకి ఒక హెచ్చరిక పంపాల్సి అవసరం నేడు అమెరికాకి ఉంది. తాను బలహీనురాలిని కాదనే సంకేతాలని అట్టి దేశాలకి చెప్పాల్సి ఉంది.పైనేపథ్యం లో నేటి యుద్ధస్తితి ముగ్గురి ఉమ్మడి ప్రయజనాల సమన్వయంతో జరిగే స్తితి ఉంటుంది. ఇది సారంలో రెండు దేశాల ప్రజలపై జరిగేదే!

    ఇప్పుడు అమెరికా మార్గదర్శకత్వంలో రెండు పొరుగు దేశాలు సంతలో విలువైన సరుకుగా కుహనా "దేశభక్తి" ని ఉత్పత్తి చేస్తున్నాయి. దాని కొనుగోలుకు ఎగబడకుండా "యుద్ధవ్యతిరేక" నిరసన ప్రదర్శనలకు దిగడం వాస్తవ దేశభక్తియుత ప్రజల తక్షణ బాధ్యత! అది ఏటికి ఎదురీత వంటి కర్తవ్యమే. ఐనా నేడు నిజమైన దేశభక్తియుత, ప్రజాతంత్ర శక్తులు, శ్రేణుల ఎదుట మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. ఎంత చిన్నస్థాయులో నైనా కావచ్చు. యుద్ధవ్యతిరేక వాణి ఒకసారి ఎదో స్థాయు లో ప్రారంభమైతే, దాని గొంతు కూడా క్రమంగా పెరిగి తీరుతుంది. అందుకు సిద్ధపడదాం

    ReplyDelete
  4. మీరు వ్రాసిన పురాణాల గురించి చదువుతూ ఉంటే తెలియని విషయాలు తెలుస్తున్నాయి

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...