Sunday 10 March 2019

వందమంది పరుగుపందెంలో పాల్గొంటే వందమందికీ ప్రధమ స్థానం రాకపోయినా పాల్గొనే ప్రతివాడూ ప్రధమ స్థానాన్ని ఆశించడం సహజమే!కానీ, ముందు పరిగెత్తుతున్న వాడి కాళ్ళు విరగ్గొట్టి ప్రధమ స్థానం తెచ్చుకోవాలనుకోవడం మాత్రం దుర్మార్గమే!

మొదటి సంచలన వార్త:డాటా చోరీ కేసు గురించి మొదటి రోజుల టాక్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజల వ్యక్తిగతమైన సమాచారాన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి లీక్ చేసిందని.ఆ కంపెనీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగించుకుని ఒక యాప్ తయారుచేసి ఆ యాప్ ద్వారాప్రతిపక్ష పార్టీ అనుకూల వోటర్లని మాయం చేసేసిందట - ఈ అభియోగాన్ని ఒక వైకాపా కార్యకర్త/జగన్ దూరపు బంధువు తెలంగాణ రాష్ట్రంలో కేసు వేశాడు.

జర్నలిస్టు సాయి గారి కధనం ప్రకారం  తెలంగాణ పోలీసులు మొదట సదరు కంపెనీ యజమానిని కలిసి ప్రశ్నించారు.అతను అప్పుడు మరోసారి వస్తే ప్రింటవుట్ ఇవ్వడానికి ఒప్పుకుని మళ్ళీ పోలీసులు వచ్చేసరికి పరారీ అయ్యాడు.దానితో పోలీసులు నలుగురు జుద్యోగుల్ని తమవెంట తీసుకెళ్ళారు విచారణ కోసం.

ఇందులోని అసంబద్ధతలు:
మొదటి అసంబద్ధత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సమాచారం లీక్ కావడం.సంబంధిత అధికారులు చెప్పిన వివరణ సహేతుకమైనదే - దీనికి నిదర్శనం కేసు స్వభావంలో వూహించని మార్పు వచ్చి కధ వూహించని మలుపు తిరగడమే!

తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డాటా చోరీకి గురయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలనీ దాని గురించి ఏ చర్య తీస్కోవాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెయ్యాలనే కామన్ సెన్సు కూడా లేకుండా కేసుని ఆంధ్రాకు బదిలీ చేసి డాటా చోరీ గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలర్ట్ చెయ్యాల్సింది పోయి తను స్వయంగా విచారణకి పూనుకోవటం రెండవ అసంబద్ధత.

రోహింగ్యా ముస్లిముల వల్ల మన దేశానికి ముప్పు ఉందని తెలిసినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చేసింది?తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన పరీక్షల క్వశ్చెన్ పేపర్లు వేరే రాష్ట్రంలో లీకయితే ఆ రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మీద కేసు పెట్టిందా?పెట్టి ఉంటే తండ్రీకొడుకులకెలా ఉండేది!

రెండవ సంచలన వార్త:పోలీసులు ఉద్యోగుల్ని కోర్టులో హాజరు పర్చినప్పుడు జడ్జి వేసిన కొన్ని చివాట్ల వంటి ప్రశ్నల వల్ల బయటపడినది యేమిటంటే ఉద్యోగులని అధికారికమైన అరెస్టు వారెంటుతో కేసు బుక్ చేసుకుని తీసుకు వెళ్ళలేదని తెలిసింది.ఉద్యోగుల చేత తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకోవడం లాంటి వింత సంగతి కూడా వెల్లడైంది.

ఇందులోని అసంబద్ధతలు:
ఉద్యోగులు తమని నిర్బంధించలేదని చెప్పినప్పటికీ తెల్ల కాగితాల మీద సంతకాలు చెయ్యటం లాంటి పిచ్చిపని ఎందుకు చేశారో!ఒకవేళ పోలీసులు నేరం జరిగిన మాట వాస్తవమనీ దానికి తామే బాధ్యులమని ఉద్యోగుల పేరున రాసి ఉంటే వాళ్ళు జైలుకి వెళ్ళిపోయి కోసు ముగిసిపోయి ఉండేది కదా - ఆ ప్రమాదం ఉందని తెలియదా వాళ్ళకి?

మూడవ సంచలన వార్త:ఎలెక్షన్ కమిషన్ వారికి అతి తక్కువ కాలంలో కొన్ని వోట్లని తొలగించాలని అబ్యర్ధిస్తూ ఫారం 7 ద్వారా లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వెళ్ళాయి.ఆంధ్ర ప్రతిపక్ష పార్టీ ముఖ్యనేత "అవును, ఆ పని మేమే చేశాం.అక్రమగా చేర్చిన వోట్లని తొలగించమని అబ్యర్ధించడంలో తప్పు లేదు కదా!"అని బహిరంగ ప్రకటన చేశాడు.

ఇందులోని అసంబద్ధతలు:
అతను ఈ ప్రమాదకరమైన ఆత్మవిధ్వంసకర మలుపు తీసుకోవడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి.ఒకటి, ఆంధ్రరాష్ట్రప్రభుత్వం యొక్క డాటా భద్రంగా ఉందని తెలియటం.రెండవది ఒక యాప్ ద్వారా వోటర్ల వివరాలు కేవలం చూడగలమే కానీ ఆ యాప్ నుంచి వోట్లని ఎన్నికల కమిషన్ డాటాబేస్ నుంచి తొలగించడం కుదరదని తెలంగాణ పోలీసులు ప్రెస్ ముందు ఇచ్చిన mock demo వల్ల సమస్తజనులకీ తెలిసిపోవటం.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదిక మీద నడుస్తున్న గొప్ప హాస్యరసప్లావితమైన అసంబద్ధత ఏమిటంటే పొగకు పాము ఉక్కిరిబిక్కిరై పుట్టనుండి వచ్చినట్టుంది జగన్ పరిస్థితి.టిడిపి వాళ్లు పెద్ద ఎత్తున ఓట్లను తొలగించేసారు అని కేంద్ర & రాష్ట్ర ఎన్నికల కమీషన్లు అన్నీ తిరిగి, ఫిర్యాధులు చేసామని, తమ మీడియాలో గగ్గోలు పెట్టారు. రోజూ అదే రోత పాట పాడుతుంటే సాధారణంగా ఎవడికైనా అనుమానం వస్తుంది. పైగా పొరుగు రాష్ట్రంలో మాయల్ ఫకీర్ చేసిన పని, దాని ఫలితాల పర్యవసానాలతో స్వయంగా కంగుతిన్న తెలుగు తమ్ముళ్లకు అనుమానం వస్తుంది. పైగా జగన్ బ్యాచ్ ఎప్పుడూ, రక్త కన్నీరు నాగభూషణం నుండి రావుగోపాలరావు & సత్యనారాయణ వరకు పండించిన విలనిజం పాత సినిమాలు చూసి కుట్రలు పన్నుతారని తెలుసు కాబట్టి ఆ విధంగా ఆలోచించారు.

అసలే టిడిపిలో పార్టీ ప్రెసిడెంట్ నుండి గ్రామంలో సేవా మిత్ర వరకు టెక్ బ్యాచ్. పెద్ద ఎత్తున ఓటర్లు తొలిగిస్తున్నారని, ఉప్పెనలా సోషల్ మీడియా హోరెత్తింది. అందరూ చెక్ చేశారు. ఫారం 7 తో పెద్ద ఎత్తున లక్షల్లో తొలగించమని అభ్యంతరాలు వచ్చాయని గుర్తించారు.

అప్పుడు కూడా వైకాపా మేకపోతు గాంభీర్యంతో, మా ఓట్లు తొలగించేస్తున్నారని గగ్గోలు పెట్టింది. కొంచం పరికించి చూస్తే నెల్లూరు & ప్రకశం జిల్లాలలో తక్కువగా ఫారం 7 ఫిర్యాధులు అందినట్టు తెలుసుకొంది టిడిపి. ఎన్నికల కమీషనును కలిసి గట్టిగా నిలదీసే సరికి, నకిలీ ఫిర్యాధులు పెద్ద ఎత్తున ఏ ఐపి అడ్డ్రెస్స్ నుండి వచ్చాయో, వాళ్లమీద కేసులు పెట్టండి అని ఆదేశాలు వచ్చాయి. మొత్తం 45 చోట్ల జరిగాయని 45 కేసులు పెట్టారు.

అనుమానం రాకుండా వివేకానంద రెడ్డితో పులివెందులలో నాటకం మొదలెట్టారు. తరువాత, నాకు తెలియకుండా నా పేరుతో, ఎవరో ఫారం 7లు అప్లోడ్ చేసారు, నేను అమాయకుడిని అని పోలీస్ స్టేషనుకు ఫిర్యాధులు ఇవ్వమని అదే దొంగలకు వాట్సాప్ టెంప్లేట్ మెసేజులు పంపారు.

మధ్యలో టిడిపి కొన్నేళ్లుగా, సేకరిస్తున్న డాటా మీద కన్నుపడింది. అదే తెలంగాణాలో కెసీఅర్ & కేటీఅర్ సహకారంతో ఎలా కొట్టేయాలో ప్రణాళికలు వేసారు. వారి వుద్దేశం వోట్లను చెక్ చెయ్యకుండా టిడిపి సేవా మిత్రలను బ్లాక్ చెయ్యడం, ఆ డాటా లోని టిడిపి బూతు స్థాయి వ్యక్తులకు కాల్ చేసి మీరు చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు, పాదయాత్ర సమయంలో జగన్ మీ గురించి తెలుసుకొన్నారు. కలుస్తారా, జగనుకు సలహాలు ఇస్తారా అని కాల్ సెంటర్లతో, మైండ్ గేం మొదలెట్టారు. ఒకటి, మన డాటా జగన్ దగ్గర వుంది అని బయపెట్టడం. కలిస్తే ఏమన్నా డబ్బు వస్తుందేమో అని ఆలోచించేలా మైండ్ గేం అన్నమాట.

అక్కడ చాలా రోజుల ముందే ఐటి గ్రిడ్ కంపెనీదగ్గర పోలీసులు మఫ్టీలో రావడం, నువ్వేం చేస్తావు గట్రా ప్రశ్నలతో అడగడం, సాయి రెడ్డి మీడియాకు తెలియజేయడం, మరుసటి రోజు, షర్మిల & జగన్ మేయర్ మేన మామ తమ్ముడి భార్య మొగుడు లోకేశ్వర రెడ్డి తో ఫిర్యాధు చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు గట్రా పట్టుకుపోవడం జరిగాయి. కోర్టుకు వెళ్లి అక్షింతలు వేసుకొని, వారి మీదే కేసులు అయ్యేలా తప్పుడు పనులతో వైకాపా & తెరాస బండారం బయటకు వచ్చింది.

వీళ్ళిద్దరి మధ్యన పెరిగిన అనుబంధం అందరికీ తెలిసిందే గానీ డాటా చోరీ కేసుతో పబ్లిక్ అయిపోయింది.చంద్రబాబు మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టి రాంగ్ స్ట్రాటజీ వల్ల ఆశించిన ఫలితం సాధించలేక బిక్కమొగం వేసినప్పటి నుంచీ పుట్టిన హుషారులో ఒకింత ఆదమరిచి ఓటుకు నోటు కేసులోలా సరయిన జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు దూసుకెళ్ళడంతో అప్పుడు బాబు ప్లాన్ బాబు మీదకే బూమరాంగ్ అయినట్టు ఇప్పుడు తమ ప్లాన్ తమ మీదకే బూమరాంగ్ అయ్యింది - అప్పటి విజయం కేసీయార్ సమర్ధతకీ ఇప్పటి అపజయం కేటీయార్ అసమర్ధతకీ చిహ్నమా!అప్పుడు కేసీయార్ అంత తక్కువ సమయంలో ఎంత చురుగ్గా స్పందించాడు!ఇప్పుడు కేటీయార్ ఇంత ఎక్కువ సమయం ఉన్నా అంత మందకొడిగా ఎందుకు ఉన్నాడు?

వోటుకు నోటు కేసు అనేది చంద్రబాబు కేసీయార్ ప్రభుత్వాన్ని పడగొట్టటానికి వేసిన ప్లానుని ఆఖరి నిముషంలో కనిపెట్టి దాన్ని బూమరాంగ్ చెయ్యటం.మా వెలమ కులస్తులకి రోషం చాలా ఎక్కువ.అలాంటప్పుడు తనని తొక్కెయ్యాలని చూస్తున్న బాబు పట్ల కేసీయార్ అలా కాకుండా ఇంకెలా రియాక్ట్ అవుతాడు?కానీ కధని ఇక్కణ్ణుంచే మొదలుపెడితే బాబు విలన్ లాగే కనిపిస్తాడు. కానీ ఆంధ్రాకి కొంత వెసులుబాటు కల్పించే విభజన బిల్లుకి సంబంధించిన మెలికల్ని పరిష్కరించుకోవడానికి ముందుకు రాని కేసీయార్ తనకి కావల్సిన హైకోర్టును గురించి పట్టుపట్టటాన్ని మర్చిపోగలమా?

విభజన బిల్లులో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుందా?తనకి ఒక్క రూపాయి కూడా నష్టం రానప్పుడు ఆంధ్రాకి ఒక్క రూపాయి కూడా వెళ్ళకూడదు అనే ఉద్దేశం తప్ప విభజన బిల్లు సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా ముందుకు రాకపోవటానికి ఇంకొక కారణాన్ని తెరాసా అభిమానులే కాదు సాక్షాత్తూ కేసీయార్ అయినా చెప్పగలడా?

మోదీ గృహప్రవేశానికి వస్తూ కుండెడు మట్టీ చెంబుడు నీళ్ళూ ఇచ్చి సరిపెట్టడం ఆంధ్రాకి ప్రత్యేక హోదా రాకపోవటానికి కారణం సాంకేతిక కారణాల వల్ల భాజపా యొక్క అసహాయత కాదనీ ఎంత గింజుకున్నా సరే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని వాళ్ళు ముందునుంచీ కృతనిశ్చయులై ఉన్నారనీ తెలుసుకోవడానికి ఎంత గట్టి సాక్ష్యమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విభజన బిల్లుకి  సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకుందామని ఎన్నిసార్లు పిల్చినా  ముందుకు రాకపోవటం కేసీయార్ ఆంధ్రాని ఆర్ధికంగా దెబ్బదియ్యడం ద్వారానే తెలంగాణలోనూ జాతీయస్థాయిలోనూ రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడని భావించటానికి అంత గట్టి సాక్ష్యం!

ద్వేషం పునాదుల మీద సిద్ధాంతం నిర్మించుకుని ద్వేషం పరిధిని రాజకీయానికి పరిమితం చెయ్యకుండా సామాజిక సైద్ధాంతిక సాంస్కృతిక సాహిత్య కళారూపాల వరకు విస్తృతం చేసి కొన్ని దశాబ్దాల పాటు భాషాహింసానలరణఘోషతో మమేకమైపోయిన ఉద్యమాన్ని నిర్మించుకుని న్యాయమా అన్యాయమా అనే తర్కవితర్కాలతో పనిలేకుండా తమకు కావల్సినది ఇవ్వకపోతే ఎదటివాళ్ళ తనుధనమానప్రాణాల్ని హరిస్తూ రక్తపుటేరులు పారించటానికి కూడా సిద్ధపడి అధికారం చేపట్టినవాళ్ళకి సామరస్యం మృదుభాషిత్వం ఎట్లా అలవడుతాయి - మాడదిరే దెబ్బ ఎదటివాడు కొడితేనే తల్లోని జేజెమ్మ దిగి కళ్ళు అసలు బొమ్మని చూస్తాయి!

యజమానిని సంతోషపెట్టటానికి బానిసలు ప్రాణాలను సైతం పణం పెట్టి శత్రువుల తలలు నరికి తెచ్చి ప్రభువు పాదాల మీద పడవెయ్యాలనుకున్న మధ్యయుగాల నాటి హంవీరచూడామణుల వంటి తేలున్‌గాణ పోలీసులు కేటీయార్ గారిని సంతోషపెట్టటానికి చూపించిన అత్యుత్సాహం వల్ల ఈసారి అంబ పలికి పంబ రేగి పట్టిన దెయ్యం దిగేటట్టు ఉంది చూడబోతే!ఎన్నికల కమిషన్ వద్ద భద్రంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సమాచారం చోరీకి గురైందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి గత నెల 19న ఢిల్లీలో జాతీయ ఎన్నికల కమిషనుకు ఫిర్యాదు చేశారు.అయితే ఎన్నికల కమిషన్ తన పని మొదలుపెట్టటానికి ముందే ఫిబ్రవరి 22న తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు.దీంతో సైబరాబాద్ పోలీసులు ఐటీగ్రిడ్స్ కంపెనీలో అనధికారిక తనిఖీ నిర్వహించారు.తమాషా ఏమిటంటే, ఈ ఫొటోలు బయటికి వస్తే అవి ఎలా బయటికి వచ్చాయో దర్యాపు చేస్తాం అన్నారు తప్పితే కేసు నమోదు చేయకుండా దర్యాప్తు చేయటం ఖచ్చితంగా తప్పే అయినప్పటికీ దాన్ని మాత్రం ఒప్పుకోలేదు.అప్పటికే వైకాపాకీ తెరాసకీ వైవాహికేతర సంబంధం ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే అయినా ఎంత మాంసాహారి అయినప్పటికీ ఎముకలు మెళ్ళో వేసుకు తిరగనట్టు విజయసాయిరెడ్డి ఫిర్యాదుకు రియాక్టయితే మరీ పబ్లిక్ రొమాన్స్ అవుద్దేమోనని కించిత్తు సిగ్గు పడినట్టున్నారు లోకేశ్వరరెడ్డి అనే దూతిక నుంచి ఫిర్యాదు తీసుకుని మార్చి 2వ తేదీన కేసు నమోదు చేశారు.

అసలు ఆంధ్ర డాటా చోరీకి గురి కానప్పుడు ఇవన్నీ వేస్ట్ కదా!మరి, పేపర్లలోనూ టీవీల్లోనూ చూస్తున్న మనకి తెలిసిన మాత్రం కేసీయారుకి తెలియదా?తెలుసు!అటూ ఇటూ కొన్ని రోజుల పాటు మాటల యుద్ధం జరగటం తప్ప తను ఈసారి చంద్రబాబుని కనీసం ఓటుకు నోటు కేసులోలా కూడా ఇరుకున పెట్టలేనని తెలిసే ఉండొచ్చు - మరి  ఎప్పుడూ ఎఫెన్సివ్ గేమ్ ఆడే కేసీయార్ ఇప్పుడు డిఫెన్సివ్ గేమ్ఎందుకు ఆడాడు?

తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైకుంఠపురం బ్యారేజి కట్టడానికి వీల్లేదని కృష్ణా రివర్ మ్యానేజిమెంట్ బోర్డుకి ఫిర్యాదు చేసింది!ఎప్పుదు?ఫిబ్రవరి 26వ తేదీన!అబ్బే!ఈ రెండూ కో ఇన్సిడెన్స్ కావచ్చు అంటారా?ఇప్పుడే కాదు,ఇదొక్కటే కాదు - మొదటి రోజు నుంచీ మన రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టు మీదా తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసింది!ఇలాంటి వెధవపనులు చేస్తున్నప్పుడల్లా తెలంగాణ ప్రజల మరియు ఆంధ్ర ప్రభుత్వ దృష్టిని మళ్ళించడానికి ఇదే విధమయిన సంచలనాన్ని సృష్టించడంలో కేసీయార్ సృజనాత్మకత అద్భుతం!అత్యద్భుతం!పరమాద్భుతం!!!

ఇలా ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమూలాల్ని దెబ్బతీస్తున్న కేసీయార్ స్పాన్సర్ చేస్తున్న వై ఎస్ అర్ పీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో పయనిస్తుందని ఇదా ప్రపంచం బ్లాగర్ చెబుతున్నారు - ఎంత అమాయకత్వం!. "ప్రత్యేక హోదా కోసమయితే వై ఎస్ ఆర్ పీ గెలిచినా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓటు వేయొచ్చు"నట! ఇటు బీజేపీ తోనూ, కేసీఆర్ తోనూ సఖ్యతగానే ఉంటున్నారు అనేది వారి వాదన.

కానీ, అటు బీజేపీ దగ్గిరా ఇటు తెరాస దగ్గిరా జగనుకే ప్రత్యేక హోదా లేదు!కనీసం సమానస్థాయి కూడా ఇవ్వటం లేదు వాళ్ళు - ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి పీఠం అనే వ్యామోహానికి గురైన జగన్ బలహీనతలతో ఇద్దరూ ఆడేసుకుంటున్నారు. పెతి యెదవ ప్లానుకీ మొదట్లో ఈసారి సక్సెస్ ఖాయం అని ఉర్రూత లూగుతున్నాడు, ఫెయిలయినప్పుడల్లా పిచ్చెక్కి పోతున్నాడు, ఈ బలిపశువు ఇట్లా చిత్రహింస పడుతుంటే వాళ్ళేమో ఈ బలిపశువు ఆక్రందనల్ని చూసి వినోదిస్తున్నారు, ముఖ్యమంత్రి అయ్యాక కూడా సుఖంగా ఉండనివ్వరు, ఎదురు తిరిగితే తొక్కేస్తారు!

విభజన బిల్లులోని సమస్యల్ని పరిష్కరించుకున్నందువల్ల కేసీయారుకి గానీ ప్రత్యేకహోదా ఇచ్చినందువల్ల మోదీకి గానీ ఒక్క రూపాయి నష్టం లేకపోయినా యెందుకు ముందుకు రావడం లేదో తెలుసా!ఆ వెసులుబాట్లు ఏవీ లేకపోయినా వీళ్ళు ఎన్ని అడ్డుకట్టలు వేసినా చంద్రబాబు రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వ అధికారికమైన నివేదికల సాక్ష్యంగా దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్యన శిఖరాగ్రం మీద నిలబెట్టాడు!
=====================
Andhra Pradesh has achieved the number one rank in the country with an average growth of 10.5% during the last four years.

It has surpassed many developed States such as Maharashtra and Gujarat following a “focused approach” and setting high targets for itself.

According to the State Planning Department, the average growth in the country stood at 7.3% during the last four years.Probably, Andhra Pradesh is the only State to clock the double-digit growth rate.

While Telangana has slipped to the second place, Maharashtra is ranked sixth. Punjab is placed 14th and Karnataka third.

The growth in Andhra Pradesh was 9.2% in 2014-15, the year of bifurcation. Later, it was ranked second. In the subsequent year, it achieved a double-digit growth of 10.6% though its rank had slipped to the 4th place.

Double-digit progress
Since then, the State has been achieving double-digit growth rates.

Gujarat, which is considered the most developed State, registered a growth of 10.5% in 2014-15. But it slipped to 10.1 in 2016-17. The data pertaining to 2017-18 is not available.

Telangana, which registered 6.8% growth in 2014-15 could achieve 10.4% in 2017-18, officials said.

The Per Capita Income (PCI) also increased by more than ?40,000 during 2017-18 in the State, which started its journey with “the lowest PCI of ?93,903” in the southern States.

The PCI crossed the ?1 lakh mark in 2015-16. The trend has been upward since then.

The PCI grew to ?1,08,163 in 2015-16 and to ?1,23,664 in 2016-17 and ?1,42,054 in 2017-18.
=====================
వందమంది పరుగుపందెంలో పాల్గొంటే వందమందికీ ప్రధమ స్థానం రాకపోయినా పాల్గొనే ప్రతివాడూ ప్రధమ స్థానాన్ని ఆశించడం సహజమే!కానీ, ముందు పరిగెత్తుతున్న వాడి కాళ్ళు విరగ్గొట్టి ప్రధమ స్థానం తెచ్చుకోవాలనుకోవడం మాత్రం దుర్మార్గమే!

పత్రికల వాళ్ళు మొదటి పేజీలో తాటికాయంత హెడ్డింగులు పెట్టి చూపించే డాటా చోరీ లాంటి సంచలన వార్తలకి బుర్ర తిరిగిపోయి లోపలి పేజీల్లో తెలంగాణ వైకుంఠపురం బరాజును ఆపమని కృష్ణా రివర్ మ్యానేజిమెంట్ బోర్డుకి పిటిషన్ వేసిన  బుల్లి వార్తల్ని చదవటానికి పేజీ తిప్పకుండా వెంటనే మరిన్ని విశేషాల కోసం టీవీ ముందు కూర్చుంటే బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అంటూ హడల గొడుతూ డాటా చోరీ లాంటి సంచలన వార్తలను మాత్రమే చూసే మనకి తెలియదు గానీ జగన్ తెలంగాణ దుర్మార్గం తెలుసుకోలేనంత దూరంగా లేడు - మరి, ఎందుకు మాట్టాడ్డూ!

హయ్యోరామ, "ఏమిటండీ!తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి అంత అన్యాయం చేస్తుంటే మీరు ఒక్క ముక్క మాట్లాడరేంటి?" అని నిలదీస్తే అతనికి కలిగే ఇబ్బందిని తొలగించడానికే సరిగ్గా అదే సమయంలో ఇలా సంచలనాలను సృష్టిస్తున్నారండీ బాబూ!

కేసీయార్ మరియు మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ని ముఖ్యమంత్రిని చెయ్యటంలో కేవలం రాజకీయపరమైన కారణాలు మాత్రమే లేవు - ఆర్ధిక కోణం, అంటే లాభాపేక్ష కూడా వుంది. ప్రకాశం జిల్లాలో వివాదాస్పదంగా మారిన వాన్‌పిక్ ప్రాజెక్టులో కొంత వాటాను కేసీయారుకు అత్యంత సన్నిహితులు కొనుగోలు చేశారు.ఏపీలో జగన్మోహనరెడ్డి అధికారంలోకి వస్తే వాన్‌పిక్ ప్రాజెక్టును క్లియర్ చేయించుకుని ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఓడరేవును నిర్మించుకోవాలన్నది  కేసీయార్ సన్నిహితుల కోర్కె!అలా నిర్మించే ఓడరేవుతో తెలంగాణ ప్రభుత్వం సరుకుల ఎగుమతులు దిగుమతుల కోసం ఒప్పందం  కుదుర్చుకుంటుందట!

మోదీ చాయ్‌వాలాయే కావచ్చు, కానీ అమిత్‌షా కాదు గదా - ఆ వ్యాపారి కూడా ఆ పోర్టులో వాటా తీసుకుంటాడు!నేడు ఆంధ్రా మీద డేటా చోరీ కేసు  పేరున రంకెలు వేస్తున్న కేసీయార్ నిన్న తనే తెలంగాణ ఎన్నికల కమిషనరుతో కలిసి చేసిన మోసాన్ని రేపు జాతీయ ఎన్నికల కమిషనరుతో కలిసి దేశమంతటా తమ పార్టీ కోసం చేద్దామనుకుని సుప్రీం కోర్టు చివాట్లు పెట్టటంతో ఆగిపోయిన ప్రబుద్ధుడు మోదీ!

మా ప్రాంతాన్ని దోచుకున్నారు,మమ్మల్ని దోచుకుని ఆంధ్రోళ్ళు బాగుపడ్డారు,విడిపోతేనే బతుకుతాం,కలిసుంటే చచ్చిపోతాం అని రంకెలు వేసి విడిపోయినవాళ్ళకీ మంచితనంతో కలిసి ఉండటం గురించి చెప్పినప్పుడల్లా విడిపోతే మమ్మల్ని దోచుకోవడం కుదరదని మొసలికన్నీళ్ళు కారుస్తున్నారు, మీ మోసపు కబుర్లకి మేం లొంగం, విడిపోయి తీరతాం అని ఇంకా వెఱ్ఱెక్కిపోయినవాళ్ళకీ విడిపోయాక ఇన్న్నేళ్ళూ జరిగింది ఆంధ్రావాళ్ళు తెలంగాణా వాళ్ళని దోచుకోవడం కాదనీ తెలంగాణా వాళ్ళే ఆంధ్రావాళ్ళ కష్టం మీద పెరిగారనీ ఆంధ్రప్రాంతంలో ఉన్న భూములూ పోర్టులూ లేకుండా తెలంగాణాయే బతకలేదనీ అర్ధమయినట్టుంది!

అంత క్రూరంగా తిట్టి విడిపోయి మంచిగా అడిగితే వాటా ఇవ్వరు గాబట్టి  ఆంధ్రాలో తమ కుక్కని కూర్చోబెట్టగలిగితే వాన్‌పిక్ ఒక్కటే యేంటి,మొత్తం రాష్ట్రాన్నే దున్నేసుకోవచ్చునని మరో ఎదవ ప్లానెయ్యటమే కేసీయార్ నీచత్వానికి పరాకాష్ఠ.

ఎవరీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు?తనకి వీళ్ళతో అనుబంధమే లేదా!సమైక్య రాష్ట్రంలో ఒకనాడు తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగానూ మంత్రిగానూ ప్రమాణం చేసేటప్పుడు వీళ్ళని రక్షించటం కోసం తన సర్వశక్తులూ ధారపోస్తానని చెప్ప్పినది అబద్ధమా?అది తన గతజన్మ అనుకుంటున్నాడేమో - డెబ్బయి వేలపుస్తకాలు నమిలిన జ్ఞాని కదా!పోనీ, తెలంగాణ వోటర్లు 16 పార్లమెంటు సీట్లూ తనకిస్తే జాతీయస్థాయిలో చక్రం తిప్పేటప్పుడు కూడా ఈ ఆంధ్ర ప్రజలు తను రక్షించాల్సిన వాళ్ళలో ఉంటారు కదా!బహుశా, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని నిర్ధూమధామం చేశాకే జాతీయస్థాయికి వెళ్తాడు కాబోలు!

చంద్రబాబు కూడా తన ప్రాభవం కోసమే ఎత్తులు వేస్తున్నప్పటికీ అందులో ఆంధ్రప్రజల భవిష్యత్తు ముడిపడిఉంది!ఎన్నికల తర్వాత కూడా ఆంధ్రాకి ప్రత్యేక హోదా దక్కాలన్నా విభజన బిల్లు పూర్తి రూపంలో అమలు కావాలన్నా ఆంధ్రాలో చంద్రబాబు మరింత బలపడటం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడటం చాలా అవసరం అనేది ఆంధ్ర వోటర్లు గుర్తుంచుకోవాలి!పుల్వామా ప్రతీకార దేశభక్తి ప్రదక్షిణల్ని చూసి ముగ్ధులైపోయి ఇక్కడ బాబుని గెలిపించి అక్కడ మోదీని గెలిపించుదాం అని మొహమాట పడినా రాష్ట్రం "అవశేషం"గా మిగిలిపోతుంది!


తెలంగాణ ప్రజలు పొరుగు రాష్ట్ర ప్రజల పట్ల న్యాయంగా ఆలోచించాలి.మీ ముఖ్యమంత్రి మీకు మేలు చేస్తున్నాడు గాబట్టి అతను పొరుగు రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తూ రాజకీయంగా ఎదగాలనుకోవడాన్ని సమర్ధించకూడదు!


మిమ్మల్ని చూసి మేము ఏడవట్లేదు!మమ్మల్ని చూసి మీరు ఏడవకండి!

18 comments:

  1. well said, aa moodu daridraalu eppudu vadultayo manaku.

    ReplyDelete
  2. 45 days for elections in India???? some thing fishy in favor of central government. Enough time to change voter's mind at few places..

    ReplyDelete
  3. అన్ని వేల పుస్తకాలు చదివిన మన మేధావికి బళ్ళారి రాఘవ ఎవరో తెలియదు. వెకిలిగా మాట్లాడటం మాత్రం తెలుసు. ప్రజలు నవ్వుకుంటున్నారన్న ఇంగితం ఉండాలి.

    ReplyDelete
  4. deshamanta wing comandar abhinandan dhairyam mechukunte chandrababu okkade Imran khan goppalu cheptadu idemi chodyam

    ReplyDelete
  5. Replies
    1. ఒక మంచి వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు. 3:24 దగ్గర ఆయన అడిగిన ప్రశ్న సూపర్ అసలు...కేటీఆర్ తాట తీసేసారు.ఒక మనిషిని తంతేనే బుద్ధి వస్తుందా ? మనిషికో మాట చాలదా ?

      Delete
    2. @neehaarika
      ఒక మంచి వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు.

      hari.S.babu
      T10 చానెల్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారనుకుంటాను.ఆయన వీడియోలు అన్నీ చాలా బాగుంటాయి.సీరియస్ విషయాల్ని అంత చక్కగా చెప్పటం గ్రేట్!

      బడ్జెట్ గురించిన అనాలిసిస్ ఇంకా బాగుంటుంది.కేసీయార్ అధ్వర్యంలో ప్రభుత్వమే ప్రజల్ని ఎట్లా దోచుకుంటున్నదో కళ్ళకి కట్టినట్టు వివరించారు.మిషన్ భగీరధని ఒక కార్పొరేట్ సంస్థ తరహాలో డిజైన్ చేశారు.అంటే, దానికి కావలసిన మొత్తం నిధులు ప్రభుత్వం పన్నుల ద్వారా సేకరించిన నికరమైన ఆదాయం నుంచి ఇవ్వదు. బయటనుంచి సమకూర్చుకుని పని చెయ్యాలి.ఆ నిధుల సేకరణ వడ్డీకి తీసుకునే ఋణాలుగా కూడా ఉండవచ్చు.ఇది నేను చెప్తున్నది కాదు,వీరయ్య గారు చెప్తున్నదే.ముఖ్యమంత్రియే మిషన్ భగీరధ కోసం కేంద్రాన్ని 12000 కోట్లు ఋణం అడుగుతున్నాడు.ఆ అప్పు తీర్చడం కోసం అవసరమైన ప్రతి రూపాయినీ ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తానని కేంద్రానికి హామీ కూడా ఇచ్చేశాడట!

      మిషన్ భగీరధ సక్సెస్ అయితే ఆ కీర్తి కేసీయారుకి దక్కుతుంది.మరి, ఫెయిలయితే?ఫెయిల్ కావడం అంటే అప్పుల పాలు కావడం అని అర్ధం!ఆ సంస్థ చేసిన అప్పుల్ని ఎవరు తీర్చాలి?అక్కడ ఉన్నవాళ్ళు కేవలం యజమానులు కాదు కదా!చచ్చినట్టు ప్రభుత్వమే తీర్చాలి.అంటే, పన్నుల ద్వారా వెళ్తున్న అధికారికమైన ఆదాయం నుంచి తీర్చాలి.ఇదీ కేసీయార్ ఆవిష్కరిస్తున్న బంగారు తెలంగాణ!

      ఈ అనాలిసిస్ చేస్తున్న వీరయ్య గారికే కాదు,వింటున్న నాకూ గుండె గుభేలు మనేసింది!

      Delete
    3. బడుగువర్గాలే కేసీఆర్ ని నమ్ముకున్నాయి. వారికి ఈ విషయాలు తెలిసే అవకాశమే లేదు. మనం చెప్పినా అర్ధం చేసుకోరు. వారికి అర్ధమయే రీతిలో చెప్తే అర్ధం అవుతుంది. ఎవరు చెపుతారు ? కేసీఆర్ ని ఎదిరించే వాళ్ళు తెలంగాణాలో ఎవరున్నారు ? చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత మహదేవ!

      https://youtu.be/55qVejsh8EU

      Delete
    4. This id the effiiancy of modi:

      https://www.youtube.com/watch?v=7k0bP_KNmVY


      could we live safe in this country?

      He is taking 85,000 crores on a scheme from public/donors
      and he gave only 300 crores to the public!

      Delete
    5. u say wat u want abt kcr but namo is true deshbhakt

      Delete
    6. 2010 లోనే నేను వ్రాసాను. గుజరాత్ లో అందరూ వ్యాపారులే ఉంటారు. వ్యాపారం చేసుకునేవాళ్ళు వాళ్ళున్నచోట సౌకర్యాలు ఉండేలా చూసుకుంటారు. గుజరాత్ అభివృద్ధి మోదీ ఘనత అనేసుకున్నారు. అపుడే మనిషికి 50 వేల రూ. అప్పు ఉంది. ఇపుడు దేశం మొత్తం అప్పుల్లో నిండిపోయింది. అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఉందిగా వాళ్ళు అభివృద్ధి చేయలేదు మేం చేసాం అందుకే అప్పులయినాయి అని కేసీఆర్ వాగుతున్నాడుగా ?

      Delete
    7. meru eppadayina gujarath velara

      Delete
    8. మీరు ఎపుడైనా పాకిస్థాన్ వెళ్ళారా ?

      Delete
    9. Pakistan gurinchi rasindi meere atlage gujarath raasindi koodaa meere. intlo koochoni ededo ohinchukoni bavilo kappa laga rayakandi.

      Delete
  6. >>>>deshamanta wing comandar abhinandan dhairyam mechukunte chandrababu okkade Imran khan goppalu cheptadu idemi chodyam>>>>

    ఇమ్రాన్ ఖాన్ ప్లేస్ లో ముష్రాఫ్ ఉంటే ఏం జరిగిందో చూసారుగా ? ఇమ్రాన్ ఖాన్ ఒక క్రీడాకారుడు, ఇదేమీ ఆటస్థలం కాదు కదా గెలుపోటములు తేల్చుకోడానికి....యుద్ధం వల్ల కలుగబోయే నష్టాలను ముందుగానే చెప్పారు, చర్చలకు రమ్మని కూడా అన్నారు. ఇంతకంటే ఏంచేయాలి ?

    ReplyDelete
    Replies
    1. Correct!
      Imran khan has GUTS to accept the truth in such a way
      Nice of Him!

      Delete
  7. మొన్నటి ఎలెక్షన్లలో ఓడిపోవాల్సిన కేసీయార్ ఎట్లా గెలిచాడో తెలుసా!

    ఇరవై లక్షల వోట్లని నిర్దాక్షిణ్యంగా వోటర్ లిస్టు నుంచి తొలగించేశాడు!ఆంధ్రాలో 2014 నాటి ఎన్నికల్లో తెదెపా కేవలం అయిదు లక్షల వోట్ల తేడాతో వైకాపా మీద గెల్చింది!

    వైకాపా అంత వెర్రిబాగుల పార్టీ ఇంకొకటి ఉండదు.ఎందుకంటే ఫిబ్రవరి 19న మొదలుపెట్టిన పిచ్చ పని చెయ్యకుండా ఉంటే "నువ్వా?నేనా!" అన్నట్టు ఉండాల్సిన పోటీ ఇప్పుడు తెదెపాకి అనుకూలమైపోయింది - నిజం!

    ఎన్నికల తర్వాత బాబు కేసీయారుకి తనిచ్చిన రిటర్న్ గిఫ్టుకి ధాంక్స్ చెప్పటం ఖాయం!

    ReplyDelete
  8. See today's Eenadu newspaper, there is no photo of Mr.Harish rao in karimnagar election campaign. What is the reason for ignoring him and inviting to congress leaders?

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...