Sunday 21 June 2015

యేది సత్యం యేద సత్యం ఓ మహాత్మా?యేది ధర్మం యేద ధర్మం ఓ మహర్షీ!

          "యేకం సత్ విప్రాణి బహుధా వదంతి" అన్న పెద్దలే "సత్యమేకం లలితాఖ్యం వస్తు,సత్యం వదిష్యామి" అన్నారు!"ఆలస్యం అమృతం విషం" అన్న పెద్దలే "నిదానమే ప్రధానం" అని కూడా అన్నారు?సినీమాయాజగత్తులో తెలుగుభాషలో కనపడే బొమ్మల నోటినుంచి వినపడే మాటల్లో యెన్నెన్నో మాయలు చేసి యెవరూ వినని పదాల్ని వుపయోగించీ అవసరార్ధం తనే కొత్త పదాల్ని సృష్టించీ అసదృశంగా నిలబడిన పింగళివారు పాతాళభైరవిలో నేపాళ మాంత్రికుడి ద్వారా "జనం కొరింది మనం శాయడమా?మనం చేసింది జనం చూడడమా?" అని అడిగించి, సదాజపుడి చేత "యెప్పుడూ జనం కోరింది చేస్తున్నారుగా ఈసారికి మీరు చేసింది చూపండి" అని చెప్పించి కొత్తదారి చూపిస్తారు.విమర్శకులొకరు అందులో చాలా లోతైన అర్ధాన్ని వెదికారు!రచయిత,నటుడు,ప్రయోక్త - ఇట్లా సృజనశీలురైన వ్యక్తులకి కూడా ఈ సందేహం అప్పుడప్పుడూ కలుగుతుంది కాబట్టి అది కేవలం ఒక గారడీ విద్యలు చేసేవాడు తమాషాకి వేసిన ప్రశ్న కాదనేశారు!

          ఒక్కొక్క విప్రవరుడూ ఒక్కొక్క రకంగా చెప్పిన వాటిల్లోనుంచి మౌలికసత్యాన్ని కనుక్కోవడం యెట్లా?ధర్మం అన్ని కాలాల్లో అన్ని తావుల్లో అందరికీ ఒక్కలాగే ఆచరణీయ మవుతుందా?ధర్మం అనే మాటకి యెవడికి తోచిన అర్ధం వాడు చేప్పుకుని ఇది నా స్వధర్మం అంటే యేమి చెయ్యాలి?స్వధర్మాన నిధనం శ్రేయ మెందు కయింది?పరధర్మం భయావహ మెందు కయింది?హిందూ సన్యాసి వివేకానందుల వారు ధార్మికక్షాత్రాన్ని బోధించాడు!కమ్యునిష్టు కవి శ్రీరంగం శ్రీనివాస రావు అధర్మనిధనం కోసం ఖడ్గసృష్టి చేస్తున్నానన్నాడు!రెంటికీ తేడా యేమిటి?సాయుధ పోరాట సిధ్ధాంత కర్తలు తాము పెట్టుబడిదారుల్ని దునిమేస్తే అది శ్రేయోరాజ్యం కోసం చేసిన మహత్కార్యం అంటున్నారు,వారే మళ్ళీ హిందూధర్మం గురించి ప్రస్తావన వస్తే మాత్రం మాట తిప్పేసి అది భయంకరమైనదనీ అందులోని భాగమైన గీత హింసని బోధిస్తుందనీ భయపెడుతున్నారు?రాజులంతా బూజులని జనాన్ని నలిపేశారని అంటున్నప్పుడు స్టాలిన్ చేసిన హత్యల్ని గురించి యెత్తితే మాత్రం గప్చుప్ సాంబారుబుడ్డి అయిపోతారు,యెందుకనో?

          యెన్ని ప్రశ్నలు వేసుకున్నా జవాబు ఒక్కటే!సత్యం అనేది అనేక రకాలుగా ఉండదు.చిన్న సత్యం పెద్ద సత్యం అని చెప్పగలమా, లేదే!ఈ ప్రపంచం గురించి తెలుసుకోవలసినది చాలా ఉంది.మనకి కనపడుతున్న వాటి గురించే మనకి తెలిసినది చాలా తక్కువ. ఇప్పటికి తెలిసినది కూడా యే ఒక్క మనిషికో బోధపడినది కాదు.ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కొక్క ఇటుకగా  ఒకదాని పైన ఒకటి పేర్చి కడుతూ వస్తున్న అసంపూర్తి భవనం మనకి తెలిసిన విజ్ఞానమంతా, యెప్పటికి పూర్తవుతుందో యెవరికీ తెలియదు!యెవరి అనుభవాన్న్ని బట్టి వారు నేర్చుకున్నది ప్రత్యేకమైన విషయమే అయినా ఇంతకు ముందు తెలిసిన జ్ఞానంతో అది కలిసిపోగలుగుతున్నది - అనుభవాలు వేరు గనక వైవిధ్యత ఉంటుంది,చెప్తున్నది ఒకే విషయాన్ని నిరూపిస్తున్నది గనక సారూప్యత ఉంటుంది,అదే పరమసత్యం!సత్యానికి కొలబద్ద యేకోన్ముఖత!ఒక విషయం గురించి యెంత చెప్పినా అంటే ఒక్క వాక్యమే చెప్పినా వెయ్యి వాక్యాలు చెప్పినా మరెన్ని వాక్యాలు చెప్పినా మొదటి వాక్యానికీ చివరి వాక్యానికీ అర్ధంలో వైరుధ్యం ఉండకూడదు, వైరుధ్యం కనిపిస్తున్నదీ అంటే అది అబధ్ధమే!ప్రయోగాలతో నిరూపించగలిగినవీ ప్రయోగాలతో నిరూపించలేనివీ అయిన రెండు రకాల జ్ఞానసంబంధమైన విషయాలకీ మొదట సారాంశాన్ని మాత్రమే చూసినప్పుడు వాటిలోని సత్యాసత్యాల్ని తేల్చడానికి ఈ కొలబద్దనే వాడుతున్నారు ప్రపంచమంతటా!

          ప్రపంచంలోని అతి ప్రాచీనమైన నాగరికతలలో నేటికీ సజీవంగా కొనసాగుతున్న వాటిలోకల్లా ప్రాచీనమైనదీ భరతఖండంలో అత్యంత ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న సనాతన ధర్మం అవిచ్చిన్నంగా కొనసాగటానికి ఈ లక్షణం బీజప్రాయమై ఉండటమే కారణం!ఒక సంస్కృతి ఇంత కాలం పాటు కొన్ని వందల తరాల మానవుల్ని ఆ సంస్కృతికి అంటుగట్టుకుపోయి ఉండగలిగేలా చేస్తున్నదంటే అది వారికి క్షేమాన్ని ప్రసాదిస్తుండటమే కారణమని వేరే చెప్పాలా!పాటించడానికి తనని కష్టపెడితే యే మనిషీ ఆ ధర్మాన్ని పాటించడు,అవకాశం దొరకగానే ఎడంకాలితో తన్ని పారేస్తాడు.అట్లాగని యెప్పటి కెయ్యది ఆకర్షణీయమో దాని వెంబడే పరిగెడితే మౌలికలక్షణంలో గుర్తు పట్టలేనంత మార్పుని తీసుకొచ్చి ఆ సంస్కృతి లోని యేకోన్ముఖతని నాశనం చేస్తుంది, మరింక అక్కడున్నది ఒకే సంస్కృతి అని చెప్పడ మెట్లా కుదురుతుంది?దేనిని వదలకుండా పట్టి ఉంచాలి,దేనిని కాలాని కనుగుణంగా మార్చుకోవాలి అనే రెండు అంశాల పట్లా శధ్ధ వహించడం చేతనే తనకన్నా తర్వాత పుట్టిన అనేక సంస్కృతులు కొద్దికాలంలోనే అంతరించిపోయినా ఈ భారతీయ జీవన ధర్మం మాత్రం నేటికీ తొలినాటి జవసత్వాలతోనే సజీవంగా నిలబడి ఉంది!

          ఈ సంస్కృతి విశిష్టత తన చుట్టూ ఉన్న ప్రకృతిని అర్ధం చేసుకుని ఆ ప్రకృతిని ధిక్కరించకుండా ఉండటంలోనూ తను దేనివలన ఈ ప్రపంచంలో క్షేమంగా ఉండగలడో ఆ ప్రకృతిని చెగొట్టకుండా తీసుకున్నదానికి పదింతలుగా ప్రకృతికి మేలు చేస్తూ ఆ ప్రకృతిలోనే ఆనందంగా కలిసిపోవడాన్ని శోధించి సాధంచి బోధించి ధ్యానించడంలోనూ ఉంది!నాల్గు వేదాలు,అష్టాదశ పురాణాలు,అసంఖ్యాకమైన ఉపనిషత్తులు,అరణ్యకాలు,గీత - అన్నింటిలోనూ ఉన్న యేకోన్ముఖత అంతా ఈ నాలుగు వాక్యాల్లో ఉంది:
శ్లో:ఈశా వాస్య మిదం సర్వం
     యత్కించ జగత్యాం జగత్
                                                                 తేన త్యక్తేన భుంజీధాం
                                                                 మా గృధః కస్యస్విర్ధనః!
          భగవంతుడు యెవరు,అతనెలా ఉంటాడు,అతనెక్కడ వుంటాడు,అతని కేది ఇష్టం - యేది కాదు,మనిషి చెయ్యాల్సినది యేమిటి,మనిషి  చెయ్యగూనిది యేమిటి - అన్నీ ఇందులో కొండ అద్దమందు కొంచెమై ఉన్నట్టు ఇమిడి ఉన్నాయి!లక్షల సంఖ్యలో పౌరాణికులు,బోధకులు యెన్నో గ్రంధాలు రాసి మళ్ళీ వాటికి వ్యాఖ్యానాలు చేర్చి బయటి వాళ్ళకి చూడగానే సంక్లిష్టంగా కనిపించే హైందవ ధర్మ సారం మరీ ఇంత చిన్నదా అనిపిస్తుంది గదూ!అవును,ఇట్లా తేలికగా అర్ధమయ్యే రీతిలో ఉండటం వల్లనే ఆచరణ మరింత తేలికైంది, అర్ధంలో గందరగోళం లేకపోవటం వల్ల దీన్ని అతిక్రమించాలనే ఆలోచన కూడా యెవరికీ రాలేదు!ఈశ్వరుడు అన్నింటినీ అవరించి ఉన్నాడు - యెట్లా?ఒక దుప్పటిలాగా పైన మాత్రమే కాకుండా యెంత చిన్న అంశంగా విడగొట్టి చూసినా లోపలా బైటా కూడా కనిపించే విధంగా నిండి ఉన్నాడు!కాబట్టి పరిత్యక్తుడవై భుజించు!పొరపాటున కూడా ఇతరులకి సంబంధించిన దాన్ని సంగ్రహించకు!పరిత్యక్తత అనే పదాన్ని విశ్లేషించడానికే భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు అనే సూత్రం ప్రతిపాదించబడింది - "యేదీ నాకు అధికారికంగా దఖలు పడలేదు,నా మేనిలో ప్రాణమున్నంత వరకూ నాకు అందుబాటులో భగవంతుడు ఉంచినది, అవసరం మేరకు మాత్రమే నేను తీసుకోవాలి" అనే గమనికయే స్థితప్రజ్ఞుని జీవన విధానమైన పరిత్యక్తత!

          కరువులూ,మశూచికాలూ వచ్చి నశించినప్పుడు తప్ప మిగిలిన కాలమంతా దృఢంగా ఆరోగ్యంగా చిరకాలం జీవించి యెంతో గంభీరమైన వేదాంత భావనల్ని కూడా హాస్యస్పూర్తితో సామెతలుగా మనకందించిన వారికి మూఢనమ్మకాల్ని అంటగడుతున్న మనం యెన్ని మూఢనమ్మకాల్ని వైజ్ఞానిక సత్యాలుగా భావిస్తున్నామో తెలుసుకుంటే అంత సుదీర్ఘకాలం అజ్ఞానంలో బతికినందుకు యెంతటి వాడికయినా నిర్వేదంగా అనిపించటం ఖాయం!పాండిత్యం వాదనల్లో గెలవడానికి పనికొస్తుంది.వివేకం జీవితంలో సుఖపడడానికి పనికొస్తుంది.రెండూ తెలివికి సంబంధించిన పర్యాయ పదాలే గానీ ఒకదాన్ని వాడాల్సిన చోట మరొకదాన్ని వాడితే ఇప్పటి మన సమాజంలాగే దరిద్రంగా అఘోరిస్తుంది!



          ప్రాణావసరమైన తిండి విషయంలోనే చూస్తే రోజుకి రెండు లేక మూడు సార్లు పళ్ళెంలో తెల్లని వరి అన్నం రాశిగా పోసుకుని నాలుగైదు కూరలు కలిపి ముద్దలు చేసుకుని కుంభాలకి కుంభాలు లాగించడమే భోజనం అనుకుంటున్నాం,కానీ ఆ ఒక్క ఆహారపు టలవాటు మనకి గ్రహపాటుగా యెట్లా మారిందో తెలుసుకోలేక పోతున్నాం!ఇదివరలో ఒక్క వరినే కాదు,జొన్నలు,సజ్జలు,రాగులు కూడా పండించే వాళ్ళు - మరి ఇప్పుడెందుకు పండించటం లేదు?ఒకసారి మీ చిన్నప్పుడు చూసిన జొన్న చేనుని గుర్తుకి తెచ్చుకోండి,జొన్న చేను చుట్టూ పాతకాలంలో అల్లిన శృంగారం రంగరించిన గాధల్ని గుర్తుకు తెచ్చుజోండి?హఠాత్తుగా జొన్నచేలు మాయమైపోయినయ్యేమిటి మన జీవితాల్లోంచీ సాహిత్యం లోంచీ మనల్ని వెర్రివెధవల్ని చేస్తూ?వూచబియ్యం అనే మాట యెవరికయినా గుర్తుందా!చిన్నప్పుడు మాకూ ఓ జొన్నచేను ఉండేది,ఓ ఆదివారం పెద్దవాళ్ళు కాపలా అతనికి ఒక కబురు అందించమని పంపిస్తే వెళ్ళాను.ఆ సమయానికి తను  కంకులు తుంచుతూ ఉన్నాడు గనక అతను చిదుగులు యేరటం,నిప్పు రాజెయ్యటం,కంకి మీద ఉండే వెంట్రుకలు మాత్రం మాడేలాగ కాల్చటం,అతని పైపంచెలోనే మడిచి కర్రతో చిన్నగా కొట్టటం దగ్గిర్నుండి చూశాను,తిన్నాక ఆ పాలకంకుల రుచి నన్నిప్పటికీ ఆ సీను గుర్తుంచుకునేలా చేసింది!ఇవ్వాళ బొత్తిగా వెరయిటీ లేకుండా ఈ వరి అన్నం ఒక్కదానికే అంటుగట్టుకు పోవడానికి హోటళ్ళు మొదలయ్యాక వాళ్ళు వ్యాపారం పెంచుకోవడానికి బొమ్మకట్టి చూపించిన దృశ్యానికి బలయిపోవటమే కారణమా?!



          ఒక్క పిడికెడు జొన్నలు తింటే ఇక రోజంతా యేమీ తినకపోయినా ఫర్వాలేదనిపిస్తుందనేది యెంతమందికి తెలుసు?ఇక్కడ బ్లాగుల్లోనూ పూర్ణచంద్ గారు వరన్నం,పాలు,పంచదార లాంటి తెల్లనివన్నీ యమ డేంజరు,పళ్ళెంలో రంగు పడితేనే ఒంట్లో రంగు పడుద్ది అంటున్నా ఇంకా ఈ వరన్నం మీద వ్యామోహం పోకపోతే యెట్లా?అసలవి కూడా అఖ్ఖర్లేదు ఒక రెండో నాలుగో అరటిపళ్ళు తిన్నా చాలు గదా!అంత పెద్ద ఆనకట్ట,అదీ ఆ కాలంలో అంతమంది మనుషులతో తను కూడా వాళ్లలో ఒకడిగా కలిసిపోయి పని చేయించి కట్టిన అంత గొప్ప వ్యక్తి ఆర్ధర్ కాటన్ కేవలం అరటిపళ్ల మీదనే ఆధారపడి బతికాడంటే నమ్మగలరా!రావు బాలసరస్వతి గుర్తుందిగా,ఆవిడ ఈ మధ్యనే ఆంధ్రజ్యొతి కిచ్చిన ఇంటర్వూలో నేను ఇప్పటివరకూ కొన్ని కోర్టు కేసుల్ల్లో ఇరుక్కుని ఉన్నాను, అవన్నీ నాకు అనుకూలంగా వచ్చి పరిస్థితి మళ్ళీ ఇదివరకట్లాగ కుదురుకున్నది గనక ఖాళీగా ఉండకుండా మళ్ళీ సినిమాలు తీద్దామనుకుంటున్నాను అనేసరికి కళ్ళు తిరిగినంత పనయింది - యెందుకంటే ఆవిడ వయసు చూస్తే 85 దాటింది,సినిమా తియ్యడం అంటే మాటలా?అంత ధీమాగా చెప్తున్న ఆవిడ ఆహారం పళ్లరసాలు!మనలాగ రోజుకి రెండుమూడుసార్లు ఫుల్లుమీల్సు లాగించకుండా ఆకలేసినప్పుడల్లా  కొంచెం కొంచెం ఫ్రూట్ జ్యూసు తాగుతూ ఆవిడంత గట్టిగా బతుకుతుంటే పూర్ణచంద్ గారు చెప్పినట్టు వరన్నం వల్లనే మనమిలా నీరసంగా తయారయ్యామా, యేమో?నాకింకా దీర్చంగా ఆలోచిస్తే ఇవ్వాళ్టి రోజున దేశాల మధ్యనా రాష్ట్రాల మధ్యనా రావణ కాష్ఠాలు రగిలిస్తూ పెరిగిపోతున్న ఈ నీటి తగాదాలకి కారణం కూడా వరన్నమే ననిపిస్తుంది - వరన్నం అభిమానులు అనామకంగా వచ్చి నన్ను శాపనార్ధాలు పెట్టకుందురు గాక!మీరే ఆలోచించండి,వరి పొలాల కోసమే గదా నారుమళ్ళు చెరువుల్లాగ నింపటం,వాటిల్లో యేకొంచెం నీరు తగ్గినా పంటలు పాడైపోవటం,రైతులు బేజారవ్వటం జరుగుతున్నది,అటు చూస్తే జొన్నలకీ రాగులకీ ఈ గొడవలేమీ అఖ్ఖర్లేదు గదా!ఈ పొలిటికల్ సంగతు లిక్క దేనికి గానీ నాకయితే మనలాంటి ఉద్యొగస్థులు కూడా పొద్దున్నే ఆఫీసుకు పోవటానికి ముందు లంచ్ బాక్సుల్లో వరన్నమూ కూరలూ కలుపుకోవటానికి కాళ్ళు తొక్కుకుంటూ అవస్థలు పడే బదులు బాటిళ్ళలో పళ్ళరసాల్తో ప్రయోగం చేస్తే యెట్లా ఉంటుందా అనిపిస్తుంది,కానీ కుదురుతుందా?కాకపోతే ఈప్లానులో ఒకటే ఈక్నెసు - లంచవరు మిస్సయిపోద్ది,ఆ పేరుతో కొట్టే హస్కు తగ్గిద్ది!



          లంచనీ సప్పరనీ యెక్కువ మొత్తంలో ఒకేసారి తినడం వల్ల జీర్ణక్రియ మీద యెక్కువ భారం పడుతుంది గనక యాండ్రాయిడ్ ఫోన్లలో మాదిరి ఉన్న కొంచేం శక్తిని పొదుపు చెయ్యదం కోసమని నిద్దరొస్తుంది - అదే పై పధ్ధతికి మళ్ళితే రోజంతా హుషారుగా ఉండగలుగుతాము కదా!నిద్ర కూడా రోజూ పదింటికి ఠంచనుగా పక్క యెక్కెయ్యాలనీ 7 గంటల లోపల లేవరాదనీ అనుకోకుండా దేహానికి నిద్ర అవసరమైనప్పుడే నిద్ర పోవాలి - ఆందోళనలు యెక్కువై అసలు నిద్రపట్టకపోతే కంగారు పడాలి గానీ మామూలప్పుడు అలాంటి మిలిటరీ దిసిప్లిను అఖ్ఖర్లేదు!కానీ లేవడం మాత్రం సూర్యొదయానికి ముందు లేచి స్నానాదికాలన్నీ పూర్తి చేసుకుని సూర్యోదయాన్ని సర్వేంద్రియాలతో అనుభవిస్తే ఆ రోజంతా ప్రత్యేకంగా ఉంటుంది!నిద్ర రావడ మంటూ వస్తే పక్కనే బాంబులు పేలినా పట్టించుకోకూడదన్నంత గట్టిగా వస్తేనే పడుకోండి - తిరిగి నిద్ర లేచేలోపు ఈ లోకం యెట్లా పోయినా నాకనవసరమనిపించేటంత గాఢంగా నిద్రపోవాలి,కాకుంటే చుట్టుపక్కల బాడీ లాంగ్వేజి స్పెషలిష్టులు  యెవరైనా ఉన్నారేమో చూసుకోండి - యెందుకంటే మీరు నిద్రపోయే భంగిమని బట్టి మీకున్న మాయరోగాల్ని కూడా కనిపెట్టగలిగేటంతగా ఆరితేరిపోయారు వాళ్ళీమధ్యన!



          ఇక దుస్తుల సంగతి చెప్పాలంటే అదో పెద్ద మైరావణ చరిత్ర!తెల్లోడు మనల్ని నలిపేస్తున్నప్పుడు కాలెజీల్లో కుర్రాళ్ళూ ముసలాళ్ళూ కూడా స్వదేశీ మత్తులో పంచెకట్టులోనూ చీరకట్టులోనూ తిరిగి స్వతంత్రం రాగానే తొక్కలో స్వదేశీని అమాంతం విసిరిపారేసి ప్యాంటుల్లోకీ స్కర్టుల్లోకీ దిగిపోయారు,అప్పటి వాళ్ళెందు కట్లా చేశారో నాకిప్పటికీ మిస్టరీయే!సరిగ్గా భూమధ్యరేఖ మీద తిరుగుతూ ఉన్న మన వేడి ప్రాంతానికి నూలు దుస్తులూ పట్టు చీరలూ ప్రశస్తం,కానీ వినేవాడెవడు?పంచె కడితే విడాకు లిచ్చేస్తానని మా బంగారం యెప్పుడో వార్నింగు ఇచ్చింది గాబట్టి నేనంటే గిట్టని నీహారిక లాంటి వాళ్ళు యెంత బలవంతపెట్టినా నేను కట్టను గాక కట్టను, ఇంక మీకు చెపితే "యెదటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అనే ప్రేమనగర్ పాట యెత్తుకుంటారు నా మొహమ్మీదనే!మా నాన్నగారు పోయినప్పుడు కార్యం చేయించడానికొచ్చిన పంతులుగారు ఆ కబురూ ఈ కబురూ చెప్తూ ఇవ్వాళ జనంలో భయమూ భక్తీ పెరిగినాయి గనక మాకుర్రాళ్లకి ఆదాయం బాగానే పెరిగింది గానీ పెళ్ళిళ్ళు మాత్రం కావట్లేదు,మా అమ్మాయిలు గూడా ఈ అచ్చివాయ్ బుచ్చివాయ్ మంత్రాలు చదివే పిలక రాయుళ్ల కన్నా నీటుగా ఏసీల్లో తిరిగే సాఫ్టువేరు కుర్రాళ్ళని చేసుకోవటానికే చూస్తున్నారు అన్నాడు,కాబట్టి ఆడవాళ్ళు తమ కిష్టమైన మగాణ్ణి పంచెకట్టులో చూడాలనేటంతగా మారేవరకూ మనం మగధీరుడి లాగ పంచె కట్టుకు తిరిగాలని ఆశ పెట్టుకునే పని లేదు,అవునా?యేమైనా సరే పంచెకట్టి సాంప్రదాయం నిలబెట్టాల్సిందే నన్న పట్టుదల యే మగాడిలో నైనా ఉంటే నాలుగు రోజుల్లో సన్నాసుల్లో గలిసిపోవడం ఖాయం గనక ఇంటి కన్నా గుడి పదిలం అని నమ్మేవాళ్ళు మాత్రమే సాహసించాలి!



          తిన్నాక తలుపులు బిగించుకుని గమ్మున తొంగుందామనుకున్నఇంటి విషయాని కొస్తే మరీ ఘోరంగా వుంది పరిస్థితి!కాంతి గాని గాలి కాని చొరబడకుండా పట్టపగలు కూడా లైట్లూ ఫ్యాన్లూ వేసుకుని తిరగాల్సిన దరిద్రంలో ఉన్నారు నగరవాసులు!ప్రతిరోజూ ఇంత ధారాళంగా ఎలెక్ట్రిసిటీని వాడుతూ యేడాది కొకసారి ఎర్తవరు పేరుతో ముక్కీ మూలిగీ ఒక గంట ఆపేసినంత మాత్రాన ఉరికిపడే సౌభాగ్యం యేముంటుంది?పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పైరుపచ్చలతో వాగువంకలతో గువ్వాగోరింకల తేట్రింతలతో పిల్లతెమ్మెరలతో కొబ్బరాకుల గలగలలతో కళకళలాడుతూ ఉండాల్సిన పల్లెటూళ్ళు కూడా నగరాలకి కాపీక్యాట్ అయిపోతున్నాయి - కొంతకాలం సిటీలైఫుకి అలవాటు పడి పల్లెటూళ్ళకి వెళ్ళేవాళ్ళు గొప్పకోసం ఆ వైభవాల దరిద్రాన్ని కూడా తమతోపాటు మోసుకురావడంతో!మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి చూస్తే శక్తి నిత్యత్వ నియమం ప్రకారం భూమి మీద కొత్తగా జీవరాశిని పుట్టించలేమని తెలుస్తుంది,తమ చుట్టూ ఉన్న వాతావరణం నుంచి కొంత సారం తమలోకి తీసుకుంటూ అధికంగా చేరిన సారంతో సంఖ్యని పెంచుకుంటూ ఉన్న మొత్తం జీవధాతుసంచయంలో ఒకచోట శిధిల మవుతుంటే ఒకచోట కిసలయిస్తున్నది!అందుకే ఒక ప్రాంతంలోని జీవుల ద్రవ్యరాశిని మొత్తం లెక్కించి బయో మాస్ ఇండెక్స్(BMI) అనే ప్రామాణిక సూచితో కొలుస్తారు.మనిషి ఒక్కడే కాకుండా,అతను పెంచుకునే పెంపుడు జంతువులైన ఆవు,గేదె,కుక్క,చిలుక లాంటి ప్రతి జీవికీ ఆ జీవి జీవనక్రియలు ఆరోగ్యంగా జరగాలంటే వాటికి యెంత గాలి అవసరం,యెంత నీరు కావాలి,వాటిమీద యెంత మేర కాంతి ప్రసరించాలి అనే లెక్కలు స్పష్టంగా ఉన్నాయి.వీటిలో యేది లోపించినా ఆ జీవుల ఆరోగ్యం దెబ్బతింటున్నదని పరిశోధనలు వెల్లడిస్తూనే ఉన్నాయి,అయినా భవన నిర్మాణంలో వీటిని ఉపయోగించుకోవాలనే తెలివిడి అటు కట్టేవారిలోనూ లేదు,ఇటు ఉండేవారిలోనూ లేదు!సౌకర్యం,సౌందర్యం లేని తమ ఇంటితీరు వల్లనే ఒకప్పటి వాళ్ళకి లేని నీరసాలకి బలవుతున్నామనీ, వచ్చేవరకూ వూహించనయినా వూహించలేని కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నామనీ యెంతమందికి తెలుసు?సిమెంటు రోజు మొత్తంలో వేడిని మెల్లగా పీల్చుకుంటుంది,తర్వాత వదలడం కూడా అంత మెల్లగానే వదుల్తుంది - దీన్ని హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు - ఇవ్వాళ కొంచెం ఉష్ణోగ్రత పెరగ్గానే నాకంతా తెలిసునని చెప్పుకోవడానికీ యెవణ్ణో ఒకణ్ణి తిట్టడానికీ పనికొచ్చే ఓజోను హోలు గురించి లెక్చర్లు దంచుతారు గానీ యేదైనా రాయిని చూసుకుని - గ్రానైట్ అయినా సరే - దానిమీద యెండ తగ్గి సాయంకాలపు గాలి వీచిన కొద్దిసేపటికి కూర్చుని చూడండి - చాలా చల్లగా ఉంటుంది!భవనాల నిర్మాణంలో సిమెంటు వాడకం ద్వారానూ గాలీ వెల్తురూ చొరబారని చీకటి గుయ్యారాల వల్లనూ ఇంటిలోపల వేడి పెరుగుతుంటే దానికి పరిష్కారంగా ఫ్యానులూ, ఏసీలూ, ఫ్రిజ్జులూ తెచ్చుకుని ఎలెక్ట్రిసిటీని యెక్కువగా వాడుతూ ఖర్చుల్నీ జబ్బుల్నీ పెంచుకుంటున్నాం?పెరిగిన ఖర్చుల్ని తట్టుకోవడానికి తిండికీ నిద్రకీ కూడా తీరిక లేనంతటి యాంత్రికజీవనానికి అలవాటు పడిపోతున్నాం - కనీసం ఇట్లా బతకటం అవసరమా అనే ప్రశ్న కూడా పుట్టదం లేదేమిటి?



          రోగమొస్తే వేసుకునే మందులు కూడా విషాల కన్నా ప్రమాదకరమైనా అవే మింగుతూ కూడా యేదో ఒక చిరుతిండిలో మాత్రమే ఉన్నట్టు ఆ ఒకటీ నిషేధిస్తే చాలునని అల్లరి చేస్తున్న వాళ్ళు యెంత పిచ్చి వాళ్ళు?ఇవ్వాళ క్రిమి సంహారక మందులుగా వాడుతున్నవి నిన్న మొన్నటి ప్రపంచ యుధ్ధాల్లో శత్రుసైనికుల్ని చంపడానికి వుపయోగించినవని యెంతమందికి తెలుసు?మనుషుల్నే చంపగలిగినవి పురుగుల్ని చంపలేవా!వాటిని చంపటానికి పంటల మీద పిచికారీ చేస్తే వాటిని తిన్న మనుషులే చస్తున్నారు తామెందుకు తొందరగా చస్తున్నామో కూడా తెలుసులేని అమాయకత్వంతో!



          మన లోపల జరిగే జీవరసాయనిక క్రియల లోని అసలు మర్మమేమిటో ఇక్కడ వివరిస్తాను,కొంచెం శ్రధ్ధగా చదవండి. ఇప్పుడు చెప్పబోయే విషయం మీద నాకు యెంత అధికారం ఉన్నా మీరు కూడా శ్రధ్ధ చూపిస్తే గానీ యెక్కదు!యెముకలు,దంతాలు,గోళ్ళు,వెంట్రుకలు లాంటివన్నీ కాల్షియం,సల్ఫర్ లాంటి నిర్జీవ మూలకాలతో ఉంటే మిగతా శరీరం మొత్తం గ్లూకోజ్,ప్రోటీన్,ఫ్యాట్ అనే మూడు ముఖ్యమైన మాలిక్యూల్స్ విభిన్న నిష్పత్తులలో కలిసి అనేక రకాలైన కణజాలాల్ని యేర్పరుస్తాయి. కణజాలం అంటే ఒకే రకమైన కణాల గుంపు.నాడీ మండలం యొక్క నిర్మాణ మంతా నాడీ కణాల కలయికతో యేర్పడుతుంది.కండరాలలో ఉండే కణాలన్నీ ఒక రకంగా ఉంటాయి.వాటి వాటి పనుల కోసం నిర్మాణంలో వైవిధ్యం ఉన్నా అన్ని కణాలకీ సామాన్యమైన నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది.కణం యొక్క బయటి వాతావరణం నుంచి కణద్రవ్యాన్ని వేరు చేస్తూ ఒక పొర,ఈ జీవద్రవ్యంలో ఒక కేంద్రకం ఉంటాయి.ఈ జీవద్రవ్యంలో జరిగే భౌతిక రసాయనిక క్రియలలోని ఒక విచిత్రమైన అతి చిన్న గారడీయే తన చుట్టూ ఉన్న నిర్జీవ ప్రపంచం నంచి జీవానికి ప్రత్యేకత నిస్తుంది.చిన్నప్పుదు మనం చదువుకున్న ఆస్మాసిస్ పాఠం గుర్తుంది కదా,జీవద్రవ్యంలో కూడా ఈ ఆస్మాసిస్ యెప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మనం ప్రయోగశాలలో చూసే ఆస్మాసిస్ అటూ ఇటూ సమానమైన గాఢత వచ్చేశాక ఇక ఆగిపోతుంది - దాన్ని ఈక్విలిబ్రియం అంటారు!అయితే జీవద్రవ్యంలో జరిగే భౌతికరసాయనిక చర్యలన్నీ పూర్తిగా ఈక్విలిబ్రియం వరకూ వెళ్ళకుండా నిలిపి ఉంచబడతాయి.దీన్ని స్టడీ స్టేట్ అంటారు.ఇదెలా జరుగుతుందంటే మనం ప్రయోగం చేస్తున్న సమతాస్థితిలో ఉన్న ద్రవాల్లో ఒక వైపున గాఢతని పెంచినా తగ్గించినా అవి రెండూ సమానమయ్యేటంత వరకూ ఆస్మాసిస్ మళ్ళీ మొదలవుతుంది కదా - సరిగ్గా ప్రాణుల లోపల స్టడీ స్టేట్ కదలకుండా పట్టి వుంచే అలాంటి మోడిఫికేషనే తన చుట్టూ ఉన్న నిర్జీవ ప్రపంచాన్నుంచి జీవాన్ని వేరు చేస్తున్నది!మనం తీసుకునే ఆహారం చాలా సంక్లిష్టంగా ఉంటుంది.దీన్ని బద్దలు చేసి కణాల వరకూ పంపించటానికి శక్తి కావాలి,ఇవి కణాలలో దహించబడినప్పుడు పుట్టే శక్తి ఈ స్టడీ స్టేట్ అనేదాన్ని పట్టి ఉంచుతుంది!దుర్గంధం రాగానే అనుకోకుండానే ముక్కు మూసుకోవడానికి కారణం అది జీవరసాయనికచర్యల్ని స్టడీ స్టేట్ నుంచి ఈక్విలిబ్రియం వైపుకి బలంగా తొయ్యడం వల్ల జీవధాతువులు ప్రకంపించి పోవటమే కారణం - జీవరసాయనిక చర్యలు పూర్తిగా ఈక్విలిబ్రియం దగ్గిరకి వెళ్ళటం అంటే హంస లేచిపోయిందన్న మాటే?!



          ప్రాచీన భారతీయ వైద్య విధానమైనా ఆధునిక పాశ్చాత్య వైద్య విధానమైనా కారణం లేని రోగం ఉండదు అనే మూలసూత్రాన్ని గట్టిగా నమ్ముతున్నాయి.అందుకే రోగనిర్ధారణ అనేది రెంటిలోనూ అతి ముఖ్యమైనది. శారీరక రోగాలకే కాదు మానసిక రోగాలకి కూడా అవి మనల్ని బాధ పెట్టటానికీ ఆ బాధ తొలగిపోవటానికీ ఒక బలమైన కారణమే ఉంటుంది.యే రోగమూ కారణం లేకుండా రాదు,వచ్చిన యే రోగమూ దానంతటదే తగ్గిపోదు.శారీరక వ్యాధులకి కారణాలు ఇంద్రియాలకి కనపడతాయి గనక వైద్యశాస్త్రంతో సంబంధం లేనివాళ్ళు కూడా గుర్తుపట్టగలుతారు, కానీ మనోవ్యాధుల్ని యెట్లా తెలుసుకోవాలి?అందుకే ఒకప్పుడు ఈ మనోవ్యాధుల్ని తగ్గించటానికి మరోమార్గం కనబడక మంత్రతంత్రాలతో కూడిన భూతవైద్యాన్ని వాడేవాళ్ళు!తొలిసారిగా దీన్ని బద్దలు కొట్టి మానసిక రోగాల్ని సమర్ధవంతంగా నిర్ధారించి నివారణ మార్గాల్ని సూచించటానికి పనికొచ్చే శాస్త్రీయమైన విధానాన్ని ఆధునిక మనోవైజ్ఞానికశాస్త్ర పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ మేధావులైన స్నేహితులూ గురువులూ కూడా ఒక పట్టాన ఒప్పుకోలేనంత విప్లవాత్మకమైన సూత్రీకరణలతోనూ ఆ సూత్రీకరణల్ని ఉపయోగించి తను కొంతమంది వ్యాధిగ్రస్తుల్ని పూర్తి ఆరోగ్యవంతుల్ని చెయ్యడంతోనూ ఒక కుదుపుని తీసుకొచ్చాడు!అతని సూత్రీకరణల్ని యధాతధంగా ఇప్పటి సైకియాట్రిస్టులు రోజువారీ కేసుల్ని పరిష్కరించటానికి వాడకపోయినా కొన్ని జటిలమైన వాటికి మాత్రం ఫ్రాయిడియన్ సైకోఎనాలిసిస్ యొక్క సహాయాన్ని తీసుకుంటున్నారు.ప్రతి కేసుకీ వాడకపోవటానికి కారణం ఫ్రాయిడ్ చెప్పినవి నమ్మటానికి ఇబ్బందిగా అనిపించటమే!ఉదాహరణకి ఒక డాక్టరు తన పేషెంటుకి నువ్వు చిన్నప్పుడు నీ తల్లిని కామించావు అని చెబితే అతను ఒప్పుకోగలడా,మళ్ళీ ఆ డాక్టరు దగ్గిరకి వైద్యం చేయించుకోవటానికి వస్తాడా?ఫ్రాయిడ్ కూడా తన సిధ్ధాంతాన్ని కేవలం ఒక డాక్టరు తన దగ్గిరకొచ్చిన పేషెంటుకి వైద్యం చెయ్యటానికి పనికొచ్చేటందుకు మాత్రమే పరిమితం చెయ్యకుండా మానవాళి సమస్తానికీ ఉపయోగ పడేటందుకు - తమలోనికి చూసుకుని తమలోని దౌర్బల్యాల్ని జయించటానికి పనికొచ్చే తత్వశాస్త్రం లాగ తయారు చేశాడు!"ఆత్మానం విద్ది" అన్న ప్రాచ్య దేశపు జ్ఞానులూ "know thy self" అన్న పశ్చిమ దేశపు జ్ఞానులూ ఆ తెలుసుకోవడం యెట్లా అనేది మాత్రం ఇతమిత్ధంగా చెప్పలేక పోయారు ,ఫ్రాయిడ్ ఆ పనిని పూర్తి చేశాడు - అతడు జ్ఞాని!



          ఆ జ్ఞానంలోని మెచ్చుతునకలు కొన్ని వివరిస్తాను,మొదట నమ్మటానికి ఇబ్బందిగా ఉన్నా స్థిమితంగా ఆలోచిస్తే అవి నిజమేనని ఒప్పుకోవాలనిపిస్తుంది!అమాయకమైన బాల్యం అనేదాన్ని అతడు నిరాకరించాడు. తమ జననేంద్రియాల మధ్యన గల విభిన్నతని  గమనించిన తొలిబాల్యపుదశలొనే యెవరూ చెప్పకుండానే మగపిల్లలకి ఆధిక్యతాభావం ఆడపిల్లలకి అత్మన్యూనతా వస్తాయి.అయితే తలిదండ్రులు మనోవైజ్ఞానిక శాస్త్రం చదవకపోయినా తమ పిల్లల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తే వారు తమ పిల్లలందర్ని సమానంగా చూసి పెంచడం ద్వారా వారిలోని అవలక్షణాల్ని వదిలించగలరు.ఈ వయసులో పాజిటివ్ ధోరణి ఉన్నా ఒకవేళ పెరిగి పెద్దయ్యాక పదే పదే తమమీద ఇతర్లు దాడి చేసే పరిస్థితుల్లో బతకటం తప్పనిసరి అయినప్పుడు నెగెటివ్ ధోరణికి మళ్ళటం జరగవచ్చు - అది దురదృష్టకరమే!అయినా అక్కడ ఆ మనిషి గనక కొంతకాలానికి తప్పు తెలుసుకుని ఆ దుస్థితి నుంచి  బయటపదే అవకాశం ఉంది.కానీ ఈ వయస్సులో నెగిటివ్ ధోరణికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఒకంతట పాజిటివ్ ధోరణికి మళ్ళరు,దానికి కారణం తమలోని తప్పుల్ని తప్పులుగా గుర్తించని స్థాయికి అప్పటికే వెళ్ళిపోవటం!



          ఫ్రాయిడ్ తన కొచ్చిన "ఇర్మా ఇంజక్షన్" అనే కలని విశ్లేషించుకోవడం ద్వారా సూత్రీకరణల్ని యేర్పరచుకోవటం మొదలు పెట్టి అప్పటిదాకా పూర్తి ఆరోగ్యంగా ఉండి హఠాత్తుగా పక్షవాతానికి గురయిన ఒక పేషెంటుని తన పధ్ధతి నుపయోగించి స్వస్థతకి తీసుకురావటంతో ఇక వెనుదిరిగి చూసుకోకుండా తన కాలపు మేధావుల్నీ తద్వారా ప్రపంచంలోని మనోవైజ్ఞానికశాస్త్రజ్ఞు లందర్నీ ప్రభావితం చెయ్యగలిగాడు.మనోవ్యాధికి మందు లేదు,నిజమే!ఇప్పటికీ సైకియాట్రిస్టులు యే రోగాన్నీ మందులతో నయం చెయ్యరు - అదీగాక పూర్తిగా కూడా నయం చెయ్యలేరు!శరీరవైద్యశాస్త్రానికీ మనోవైద్యశాస్త్రానికీ సంబంధించి ఒక జోక్ వుంది,అదేమిటంటే మొదటిదానికి సంబంధించిన పుస్తకాలు చదివితే అక్కడ చెప్పిన జబ్బులన్నీ మనకి ఉన్నట్టు అనిపిస్తుంది,రెండోదానికి సంబంధించిన పుస్తకాలు చదివితే అక్కడ చెప్పిన రోగాలు పక్కవాళ్ళ కున్నట్టు అనిపిస్తుంది!



          పైన చెప్పుకున్న మొదటి పేషెంటు కధ ఇట్లా ఉంది:ఫ్రాయిద్ తన ఫ్రీ అసోసియషన్ అని పేరు పెట్టిన హిప్నాటిక్ ట్రాన్సులోకి వెళ్ళి ఆ అమ్మాయి చెప్పింది యేమిటంటే తన తండ్రి చావు బతుకుల్లో ఉన్న సమయంలో అతడికి సేవ చేస్తూ ఉన్నపుడు ఒకానొక సందర్భంలో మితిమీరిన శృంగార భావనలు చెలరేగడం?!తంద్రిని జాగ్రత్తగా చూసుకోవలసిన సమయంలో అట్లా ఆలోచించినందుకే తండ్రి మరణించాడేమో అనే ఆలోచన కూడా తోడవటంతో అపరాధ భావనకి లోనైంది.శరీరానికి మనం ఇచ్చే పోషణ మనస్సుని యెట్లా ప్రభావితం చేస్తుందో మనస్సు కూడా శరీరాన్ని ప్రభావితం చెయ్య్యగలదు - దీన్ని సైకోసొమాటిక్ ఎఫెక్ట్ అంటారు!"నీ తండ్రి అట్లా పడివుంటే నువ్వు శృంగారం గురించి ఆలోచించావు - నువ్వు నీచురాలివి?" అనే ఒక వాదనా "లేదు,నేను తప్పు చెయ్యలేదు - నేను అమాయకురాలిని!" అనే ప్రతివాదనా చెరోవైపునా అంతరంగంలో యెదతెరిపి లేకుండా సంఘర్షించడంతో మనస్సు అలిసిపోయి దేహాన్ని శిధిలం చేసింది! తనలోనే ఉండి తనని విమర్శించే భాగం యొక్క వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికి కవచంగా కూడా ఈ శరీరం చచ్చుబడిపోవటం ఉపయోగ పడింది - చూడు యెట్లా అయిపోయానో అని జాలి పుట్టించి విమర్శల నుంచి తప్పించుకోఅవచ్చు కదా!ఈ అపరాధ భావన నుంచి తప్పించుకోవటానికి వాడుకునే షీల్డింగ్ మెకానిజమే మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞులకి పని కల్పించే లక్షోపలక్షల మనోవ్యాధులకి మూలం!



          ఈ షీల్డింగ్ మెకానిజం రెండు రకాలుగా ఉంటుంది - ఆ అమ్మాయిలో పాసివ్ షీల్డింగ్ ఉండటం వల్ల  తనకు పక్షవాతాన్ని తెచ్చుకుని కృశించింది,అగ్రెసివ్ షీల్దింగ్ మెకానిజం ఉంటే తన చుట్టూ ఉన్న మనుషుల్ని విసిగించి ఉండేది.షీల్డింగ్ పాసివ్ స్ట్రాటజీలో ఉన్నా అగ్రెసివ్ స్ట్రాటజీలో ఉన్నా తనలో సమాజం అనుమతించని భావాలు ఉండటం వల్ల సమాజం శిక్షిస్తుందనే భయమూ తనకు ఆ భావాల పట్ల మమకారం ఉండటం వల్ల వాట్ని వదులుకోలేని మోహమూ ఒకేసారి విజృంభించటంతో గందరగోళం,అసహనం,కోపం లాంటివి ప్రవర్తనలో ప్రముఖంగా కనపదతాయి!ఆత్మహింస, పరహింస - ఈ రెంటిలో దేనినైనా సరే యే స్థాయిలోనైనా చెయ్యడానికి వెనుదీయని మొండిధైర్యం మాత్రం అధికంగా ఉంటుంది. ఈ సంక్లిష్టతలేవీ లేని మిగతా వారి కన్నా ప్రత్యేకంగా ప్రవర్తిస్తారు.ఈ ప్రత్యేకతలకి తోడు స్వానురాగం కూడా తోడైతే అగ్నికి వాయువు తోడైనట్టే!ఇటువంటి అగ్రెసివ్ షీల్డింగ్ మెకానిజం ప్రభావంలో ఉన్న వ్యక్తులతో వాదనకి దిగితే అవతలి వారు గెలవటం కష్టమే కాదు అసంభవం!యెందుకంటే, యెదటివారి మీద పైచేయిగా ఉంటేనే తమ ఆత్మన్యూనత పైకి లేవకుండా ఉంటుంది గాబట్టి యెంత అడ్డదిడ్డంగా వాదించి అయినా సరే తమదే ఆఖరి మాట అయ్యేటట్టు జాగ్రత్త పడతారు!అవతలివారికి విసుగు పుట్టి ఆపెయ్యాల్సిందే తప్ప వీరి వైపు నుంచి మాత్రం చర్చ ఆపరు గాక ఆపరు!వారికి కావలసిన షీల్డింగ్ గెలవటం - అంతే?!"రాముడిపై నా ఆరోపణలు రెండు...ఒకటి స్త్రీలపై హింసను మొదలుపెట్టిందే రాముడు. రెండు వివాహ వ్యవస్థలో విడాకులు తీసుకువచ్చిందే రాముడైతే ఆదర్శ దాంపత్యం ఎలా అయింది ?అన్న కొద్దిసేపట్లోనే "మీరు రాముడిని కేవలం అభిమానిస్తున్నారు,నేను రాముడిని అనుకరించాలని ప్రయత్నిస్తున్నాను.అని కూడా అనగలరు. యేదో ఒక విధంగా యెదటివాళ్ళ వాదనల్ని యెట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకుని వాళ్ళ కన్నా తక్కువగా ఉండటానికి సిధ్ధపదకపోవటం వల్ల్ల "నేను కాశ్మీర్ సమస్యని పరిష్కరించటానికే రామజన్మభూమి సమస్యలో వేలు పెట్టాను" అని కానీ "సంస్కృతం నేర్చుకోవాలన్న కోరికా తీరికా లేవు . రామాయణాన్ని చదివే ఉద్దేశ్యం ప్రస్థుతానికి లేదు.ఉర్దూ నేర్చుకున్నా ఇంగ్లీష్ నేర్చుకున్నా నాకు ఉపయోగపడుతుంది.నా ప్రాజెక్ట్ కొంచెం ముందుకెళుతుంది.రాముడిని ద్వేషించినా తరించవచ్చు అని ఆర్యుల ఉవాచ !సామాన్యులకు అర్ధమయ్యేలాగా చెప్పవలసిన బాధ్యత రాముడి తరుపున వకాల్తా పుచ్చుకున్న వారిదే !" అని కానీ మరోరకమైన వాదన కానీ యెంతో గంభీరంగా చెయ్యగలరు, మనకి తెలితక్కువగా అనిపిస్తుంది గానీ వారికి కాదు - వారిలో ఉన్న ఆత్మన్యూనత+స్వానురాగం ఆపని చెయ్యనివ్వదు!ఈ అగ్రెసివ్ స్ట్రాటజీ యెట్లా పని చేస్తుందంటే "నేను వీళ్ళందరి కన్నా యెంతో ప్రత్యేకమైన యెన్నో రెట్లు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని,నేను వీళ్ళని శిక్షించగలనే కానీ నాముందు ఓటమి నంగీకరించిన వీళ్ళు నన్ను శిక్షించలేరు" అనే సమర్ధన దొరుకుతుంది అపరాధ భావనకి కవచంగా!తను ద్వెషించే తన అసలు ప్రవరనని మరుగుపరుస్తూ మారుపేర్లతో పూర్తి భిన్నమైన వ్యక్తిలా వ్యవహరించటం కూడా షీల్డింగ్ చేసే గారడీయే,ఇక్కడ తక్కువ గానీ అమెరికా వంటి దేశాల్లో ఒకే మనిషి నాలుగైదు విభిన్న వ్యక్తిత్వాల్ని ప్రదర్శించే కేసులు చాలా బయట పడ్డాయి,వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ తను ఒక రకమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో తనదే అయిన మరో వ్యక్తిత్వానికి సంబంధించిన కనీసపు జ్ఞాపకం కూడా ఉండదు వాళ్ళకి - మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్దర్ అంటారు దీన్ని! తమకి అపరాధభావన కలగజేసే విషయాల ప్రభావం లేనప్పుడు యెంతో తెలివిగా కనపడటం వల్ల ఇతర్లకి వింతగా అనిపిస్తుంది - అంత తెలివిగా ఉన్నవాళ్ళు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నా రేమిటని?ఇలాంటి యెన్ని కేసుల్ని తరచి చూసినా ఇలాంటివారి కందరికీ రెండే రెండు అంత్యదశలు కనబడుతున్నాయి - ఒకటి తనలోని లోపాన్ని తెలుసుకుని మనసులోని అపరాధ బావనల్ని తగ్గించుకుని సమాజానికీ తనకీ ఉండే సంతులనాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన ప్రవర్తనకి మళ్లటం, లేదా మార్క్ ట్వయిన్ రాసిన విచిత్రవ్యక్తి కధ చివర్లో పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించే చర్చి ఫాదర్ పాత్ర లాగ స్థిరపడి పోవటం?విజ్ఞులైన వారు యెవ్వరూ ఆ స్థాయిలో అపరాధభావనలు తమలో ఉండకుండా జాగ్రత్త పడాలి. తమకు తెలిసిన వారిలో ఉంటే వీలయితే వారిని సరిదిద్దటానికి ప్రయత్నించటం లేదంటే వారికి వీలయినంత దూరంగా ఉండటం తప్ప తమకూ అది అంటుకోకుండా ఉండటానికి మరో మార్గం లేదు?!మానసిక వైద్యం కూడా ఆ వ్యక్తి సంసిధ్ధత లేకుండా పని చెయ్యదు!మనోవైద్యులు చేసేది కూడా ఆ వ్యక్తికి తన రుగ్మతని తొలగించుకోవటానికి సూచనలు ఇస్తూ సహాయం చెయ్యటమే తప్ప సొంతంగా పూనుకుని చేసే వైద్యం అంటూ ఉండదు అక్కడ!చంద్రమా మానసో జాతః అన్నట్టు అన్ని సమస్యలకీ మనస్సు ముఖ్యం అని తెలిసిన వాళ్ళు గనకనే మనసుని నిర్మలంగా ఉంచుకోవటానికి సూర్యనమస్కారాల నుంచి మొదలు పెట్టి యోగాసనాల వరకూ యెన్నో సాధనాల్ని సమకూర్చి ఉంచారు మన ప్రాచీనులు, వాటిని ఉపయోగించుకోకుండా దాని అవసరం కూడా తెలియని అల్లోపతి వెంట పడటాన్ని తగ్గించుకోవడం మంచిది!



          అల్లోపతి మందులకి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ గురించి వింటూనే ఉంటారు,అవి చేసే పని ఈ స్టడీ స్టేట్ మెకానిజం బలహీన పడేలా చెయ్యటమే!అల్లోపతి మందులు వాడేవాళ్ళకీ ఇచ్చేవాళ్ళకీ కావలసిన శీఘ్ర నివారణ ఆ మందుల్ని వాళ్ళు ఆ పవరు కోసం పడే పాట్లు సైడ్ ఎఫెక్ట్స్ గురించి పట్టించుకోకుండా చేస్తున్నాయి?దీనికి బిన్నంగా భారతీయ సాంప్రదాయిక వైద్యవిధానంలో రోగాన్ని తగ్గించటానికి పనికొచ్చే అసలు మందుతో పాటు ఈ సైడ్ ఎఫెక్ట్స్ మీద పనిచేసే మరో దినుసుని కూడా కలపటం అనేది చాలా పట్టుదలగా చేస్తారు,స్టడీ స్టేట్ మెకానిజంని దెబ్బతియ్యకుండా ఉండటానికే యెక్కువ సమయం తీసుకుంటారు!మన సాంప్రదాయక వైద్యవిధానం యొక్క శక్తిని నేను మా ఇంట్లోనే కళ్ళారా చూశాను.నగర జీవనం ఆడవాళ్ళ సుకుమారమైన దేహాల మీద చూపించే ప్రభావం మా బంగారం మీద కూడా పడింది!అల్లోపతిలో ఆపరేషన్ చేసినా పూర్తిగా నయమవుతందనే గ్యారెంటీ లేని ఒక సున్నితమైన సమస్యకి ఆయుర్వేదంలో మంచి ఫలితం కనిపించింది!మొదత్లో మామూలు నడకే కష్టంగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు తన ఇదివరకటి స్థితికి కేవలం మూడువారాల్లో వచ్చేసింది - ఖర్చు కూడా కేవలం రూ.30,000 మాత్రమే!ఆ పంతులు గారు భయమూ భక్తీ పెరిగాయన్నది కరెక్టే - హాస్పిటల్ కెళ్తున్నా రోగం తగ్గుతుందో లేదో అనే గ్యారెంటీ లేకపోతేనూ ఖర్చు తడిసి మోపెడవుతుందేమో ననిపిస్తేనూ మొదట గుర్తొచ్చేది దేముడే కదా!



          యెందరో పురాణ పురుషుల్ని కళ్లకి కట్టినట్టు చూపించి తిరపతి భక్తుల్తో మొక్కించుకుని దేవుడల్లే బతికి రాజకీయాలలోకి తారాజువ్వలాగ వొచ్చి కాంగ్రెసు పార్టీ ధణుతెగరగొట్టి వచ్చినవాడు ఫల్గుణుదు అన్నట్టు యెకాయెకి ముఖ్యమంత్రి పీఠానికే యెక్కిన యెంటీవోడు యెక్కడో యెవడో గొట్టాంగాడుఒక అత్యాచారం చేస్తే తను విరక్తి ఫీలయ్యి కాషాయం కట్టాడు,కానీ కట్టిన తీరు మాత్రం కన్యాశుల్కంలో గిరీశం వేషంలో తను కట్టిన షోకిల్లా పధ్ధతిలో చెంగు ధోవతి జేబులోకి దోపాడు - దాని కిక్కునిచ్చే యెఫెక్టు వల్లనే కాబోలు అతి కొద్దికాలంలోనే మళ్ళీ సంసారి అయ్యి తెల్లధోవతికి మారాడు!?ఆ కాలంలో యెవరయినా మగాడు ఆ తీరులో పంచె కట్టి మణికట్టుకి మల్ల్లెపూలు చుట్టి గడప దాటితే "యెక్క్కడికి వెళ్తున్నావు?" అని అడిగిన వాడు పాపాత్ముడు?!కులస్త్రీలకి శ్రంగారం నిషేధం -  భర్తగారు కోరుకుంటే దగ్గిర కొచ్చి కోరిక తీర్చిపోవటం తప్ప తానుగా నవ్వను కూడా నవ్వకూదదు?పురుషులకి మాత్రం స్వేచావిహారం - వెలయాలు ప్రియురాలిగా లేనివాడు అసమర్ధుడే!ఇప్పటికీ ఆడది నాకు అలా ఉంటే బాగుంటుంది అని రొమాన్సు గురించి మాట్లాడితే కంగారు పడని మగవాళ్ళు చాలా తక్కువ - అన్ని మైనారిటీ వర్గాల కన్నా మంచివాళ్ళు అనే వర్గం మరీ దిక్కూ దివాణం లేని మైనారిటీ ఇవ్వాళ!శృంగారం అనేది మగవాడు ఆడదాని నుంచి ఆనందం పొందడానికే తప్ప ఆడదాని మనోభావాలకి అందులో తావులేదని అనుకోవడం వల్లనే ఇవ్వాళ స్త్రీల మీద అన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి.బలం ఉన్నవాడు బలాత్కారం చేస్తున్నాడు,తెలివి ఉన్నవాడు కల్లబొల్లి కబుర్లు చెప్పి తన కోరిక తీరాక తన దారిన తను పోతున్నాడు,సౌజన్యం ఉన్నవాడు స్నేహంతో ఆకట్టుకుంటున్నాడు - మనిషి ప్రవర్తనలో కనబడే అన్ని రకాల పాజిటివ్,నెగటివ్ ఆలోచనల మీద కూడా ఆ మనిషి యొక్క శృంగార జీవితం లోని అంశాలు ప్రభావం చూపిస్తున్నాయని ఇటెవలి పరిశోధనల ద్వారా నిర్ద్వందంగా నిరూపించబడింది.అయితే పశ్చిమ దేశాల విజ్ఞానం ఈరోజు చెప్తున్న దానిని మన ఋషులు యెప్పుడో గ్రహించారు - వాత్స్యాయన ఋషి రచించిన కామసూత్ర గ్రంధం యెప్పటిది?వేదాంతం గురించి చెప్పే భగవద్గీతలో "కామమ్ము లందు ధర్మావిరుధ్ధ కామమ్ము నేను" అని ప్రస్తావించడ మంటే దానికెంతటి విలువనిచ్చారో తెలుస్తున్నది గదా!కామి గానివాడు మోక్షగామి కాడు అనే ఉద్దశంలో కాబోలు మానవు లంతా తప్పక సాధించాల్సిన నాలుగు పురుషార్ధాలలో మోక్షానికి ఒక మెట్టు కింద మూడో పురుషార్ధంగా నిలబెట్టారు.వాత్స్యాయనుడు శ్రంగారం పురుషుడు స్రీని సంతోషంగా ఉంచడం కోసం ఆమెకి ఇష్టమైన పధ్ధతిలోనే చెయ్యదం తన కర్తవ్యంగా భావించాలని  - అంటే పురుషుడి కోసం స్త్రీ కాదు స్త్రీ కోసమే పురుషుడు అని బల్ల గుద్ది చెప్తున్నాడు, ఇప్పటి మన నమ్మకాలకి పూర్తి విరుధ్ధంగా ఉంది కదూ!

          అపారమైన జలరాశి మధ్య నిలబడినా మన దోసిలి పట్టినంత నీటినే మనం తాగగలం - చెంబు కొద్దీ గంగ!జ్ఞానం కూడా అంతే - తిండీ,నిద్రా,బట్టా,నిద్రా,ఇల్లూ,శ్రంగారం లాంటివాటిలో ఉన్నట్టుగానే మితమైన జ్ఞానమే హితం.పరిధిని మించిన జ్ఞానం ప్రమాదం?మన ముందున్న సమస్యకి కొత్త సమస్యల్ని తెచ్చిపెట్తని ఒక చక్కని పరిష్కారం సాధించుకోవటానికి పనికొచ్చేటంత జ్ఞానం చాలు.చదివింది అర్ధం చేసుకుని అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకునే లక్షణం లేకుండా దెభ్భైవేల పుస్తకాలు చదివినా లక్ష పుస్తకాలు చదివినా వ్యర్ధమే?అబధ్ధాలతో పేనవేసుకున్న సంస్కృతీ ప్రభావం వల్ల మనలో కొత్తగా దిగబడిన ఈ వింతైన మూఢనమ్మకాల్ని పోగొట్టుకోవటానికి న్యాయబుధ్ధితో ఆలొచించి సత్యసౌందర్యంతో విలసిల్లే ధర్మమార్గం వైపుకి నడిచే ఉద్దేశం లేనంతకాలం మనం యెవరినైనా గానీ యెవరైనా మనని గానీ దీర్ఘాయుష్మాన్ భవ అని యెంత నిండు మనస్సుతో దీవించినా అది పనిచెయ్యదు!

          అదేమిటో,పరాధీనతలో ఉండగా పౌరుషంతో స్వతంత్రభావనల్ని మానసాల్లో నింపుకున్నామన్నారు, ఆ స్వతంత్రం రాగానే వల్లమాలిన నిర్లక్ష్యంతో పరాధీనులైపోయారు - యేమి చిత్రమైన జాతిరా ఇది!పరాధీనతని జాతికంతటికీ నీచంగా చూపి స్వపరిపాలన రాగానే ప్రజల్ని స్వాభిమానంతో తలయెత్తుకు తిరిగేలా చేస్తామని ప్రగల్భించారు,ఆ స్వాధీనత ప్రాప్తించగానే మన సంస్కృతినే పరిహసిస్తూ హాస్యానికి కాదు నిజంగానే మనవాళ్లుత్త వెధవాయలోయ్ అనుకునేటట్టు ప్రవర్తిస్తున్నారు - యెంత నికృష్టమైన వాళ్ళురా వీళ్ళు?


యేది సత్యమో అదే శివమూ అవుతుంది!యేది శివమో అదే సుందరమూ అవుతుంది!!
సత్యం శివం సుందరం!!!
-----------------------------------------------------------------------------------------------------------------
(చిత్రదాత:గూగులమ్మ)

18 comments:

  1. ఒక్క ముక్క అర్థమయితే ఒట్టు. చాంతాడంత చాటా భారతము రాసే బదులు క్లుప్తంగ చెప్పాలనుకున్నది రాసి ఉండొచ్చు కదండి?

    ReplyDelete
  2. కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? :)

    ReplyDelete
  3. కేరళ ఆయుర్వేద హాస్పటల్ అడ్రెస్ చెపుతారా?

    ReplyDelete
    Replies
    1. @sameera
      మీరు చెన్నైలో ఉంటున్నారా?

      Delete
    2. మా అమ్మగారిని చూపించాలనుకుంటున్నాము. పామర్రు దగ్గర ఉంటారు.కృష్ణా జిల్లా.

      Delete
  4. Vishayam allatidi.Intha kante klupteekarinchadam jarige panena?
    ....janalaki chadive vopika taggipoyindi. Andukenemo meeku chata bharatham anipinchindi.

    ReplyDelete
  5. Vishayam allatidi.Intha kante klupteekarinchadam jarige panena?
    ....janalaki chadive vopika taggipoyindi. Andukenemo meeku chata bharatham anipinchindi.

    ReplyDelete
  6. అదేవిటో, హరి బాబు గారి కామింట్లే కాదు, టపా లు కూడా ఒక్క ముక్కా అర్థం కాదుస్మీ :)

    జిలేబి

    ReplyDelete
  7. అబధ్ధాలతో పేనవేసుకున్న సంస్కృతీ ప్రభావం వల్ల మనలో కొత్తగా దిగబడిన ఈ వింతైన మూఢనమ్మకాల్ని పోగొట్టుకోవటానికి న్యాయబుధ్ధితో ఆలొచించి సత్యసౌందర్యంతో విలసిల్లే ధర్మమార్గం వైపుకి నడిచే ఉద్దేశం లేనంతకాలం మనం యెవరినైనా గానీ యెవరైనా మనని గానీ దీర్ఘాయుష్మాన్ భవ అని యెంత నిండు మనస్సుతో దీవించినా అది పనిచెయ్యదు!
    ????
    ఇక్కడి వరకూ యెవరూ చదవలేదా?

    ReplyDelete
    Replies
    1. మీరన్నది అక్షరాలా నిజం.

      కానీ పాపి చిరాయువు అని కూడా అంటారు కదా? అంటే పాపుల్ని యెవరూ దీర్ఘాయుష్మాన్ భావ అని దీవించనక్కర్లేదు.

      Delete
    2. అసలు కన్నా కొసరెక్కువైన చోట, అసలు కనుమరుగయ్యి, జనులు దాన్ని గ్రహింపమ వదిలివేయుదురు కదా??

      Delete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. chadavadaniki time pattindi kaani, manchi vishayalu chepparu.
    As expected always.

    ReplyDelete
  10. నా ఫేవరెట్ జొన్న రొట్టె గుత్తొంకాయ. రాగి ముద్దా, తలకాయ కూర. మా ఫ్రెండ్స్ అందరికి చెప్తాను మొదటి పట్టు బియ్యం తినండి అని. ముగ్గురు ట్రై చేశారు అరగటం లేదు అని మానేసారు. మీ బియ్యాన్ని చీమలు పడితే అందులో ఎంతో కొంత పౌష్టిక విలువలు ఉన్నట్టు మా నాన్నమ్మ చెప్పేది. ఇప్పుడు వచ్చే బియ్యం చీమలకి కూడా నచ్చట్ల :). పొద్దున్నే లేచి కొంచెం మెంతి పొడిని నీళ్ళల్లో తేనెతో కలిపి తాగితే bad cholestrol తగ్గుతుంది. అందుకే మన వాళ్ళు తాలింపులో మెంతులు వాడుతారు. ఇది నాన్నమ్మే చెప్పింది( నాన్నమ్మ నూనె ఎక్కువ వాడుతాము కదా దానికి ఇది విరుగుడు అని చెప్పింది అర్థం ఇదే కదా ). ఇంకా ఆఖరున పెరుగన్నం తినటం. తొందరగా అరుగుతుంది దీని వల్ల. కరివేపాకు తీసి పడేస్తుంటారు. అందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. పచ్చగా ఉండేవి అన్ని మంచివే. పొద్దున్నే లేచి కనీసం 50 గుంజీలైన తీయ్యటం అలవాటు చేసుకోవాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. కనీసం అరగంట సేపు బాసిపట్లు వేసుకుని నిటారుగా కూర్చోవటం(ఇది కొంచెం కష్టమే అలవాటు చేసుకోవచ్చు). ఇలా చిన్నపటి నుంచి చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చు.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...