రాజ్యం వీరభోజ్యం అన్న పెద్దలే రాజ్యాంతే నరకం దృవం అన్నారు!
రాష్ట్రాన్ని విడగొట్టటం మరో అధికార కేంద్రాన్ని సృష్టించే పై స్థాయిలోని పెద్దమనుషుల వెసులుబాటు కోసం జరిగిందే తప్ప తెచ్చుకున్న వాడికి తెలంగాణా ప్రజల సౌభాగ్యం మీద దృష్టీ లేదు.ఇచ్చిన వాడికి అసలు విభజించాక అటుపక్కన మరో ముక్క కూడా వుంటుందనే వివేకమూ లేదు?విభజించితే తను అన్ని సీట్లు గ్యారెంటీగా ఇస్తానంటున్నాడు,విభజించకుండా వుండాలంటే మీరు యెన్ని సీట్లు గెలిపించగలరు అని పరిశీలకుడి హోదాలో వచ్చిన తన పార్టీ వాడే కూశాడని మర్చిపోయిన లఘువీరుడు ఇతర్ల మతిమరుపును గురించి యాష్ట పడిపోతున్నాడు?!మాతృరాష్ట్రం అనే గౌరవప్రదమైన హోదా వుండగా అవశేషాంధ్ర అని విన్నవాడికి గుందెలు భగ్గుమనే విధంగా వెక్కిరింతగా మాట్లాడిన దౌర్భాగ్యులు ఇవ్వాళ రాష్ట్రం పట్ల యేదో బాధ్యత వున్నట్టు రెచ్చిపోతున్నారు.సమైక్యవాదం పేరుతో హడావిడి చేసిన దంతా కాంగ్రెసు వాళ్ళు కాదా!వాళ్ళ అసలు వుద్దేశం రాష్ట్రాన్న్ని సమైక్యంగా వుంచడం కానే కాదు,కేసీఆర్ నుంచి హైదరాబాదులో వున్న తమ వ్యాపారాల్ని పదిలంగా వుంచుకోవటానికి కావలసిన లోపాయకారీ హామీ కోసమే జరిగింది!?అతడూ వీళ్ళలాగే పార్ట్ టైం పొలిటీషియన్ కం ఫుల్ టైం బిజినేస్ మాగ్నెట్ గనుక పై స్థాయిలో అది దొరకగానే చల్లబడిపోయారు!
చంద్రబాబు ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చినా కేంద్రంతో గట్టిగా వ్యవహరించకుండా పిరికిగా యెందుకుంటున్నాడో తెలుసా?ఒకనాడు వాజపేయి అనే మేధావీ రుజువర్తనుడూ భాషాయుధ పాణీ నిష్కపటీ ఉదారుదూ అయిన వాజపేయి వల్ల ఒకానొకప్పుడు కేవలం 2 సీట్లకే పరిమితమయి కూడా భాజపా నేడున్న స్థానానికి వచ్చింది!మోదీ ఇవ్వాళ వచ్చాడు?2 సీట్లకి మాత్రమే పరిమితమయిన స్థానం నుంచి యే అంశాన్ని చూసి ప్రజలు ఆదరించారో భాజపా వాళ్ళు మర్చిపోయి వుండవచ్చు.రధయాత్ర నాడు భాజపాని ద్వేషించిన నాలాంటి వాళ్ళు కూడా కాంగ్రెసుకి భిన్నంగా అక్కడున్న వాజపేయి,అద్వానీ లాంటి వాళ్ళ హుందా అయిన రాజకీయ వ్యక్తిత్వాలను చూసే అభిమానించడం మొదలు పెట్టారు!కానీ ఒకసారి అధికారాన్ని అనుభవించి పోగొట్టుకుని మళ్ళీ సాధించిన ఇప్పటి భాజపా నేతలు ఆ గతాన్ని మర్చిపోయి కమలమే సకలం కావాలి అనే ధూర్తత్వాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెసుకి నకలుగా తయారయ్యారు.దేశప్రజలంతా నిర్ఘాంతపోయి చూసే విధంగా లగడపాటి రాజగోపాల్ అనే కాంగ్రెసువాడు చేసిన పెప్పర్ స్ప్రే దుర్మార్గమే కాంగ్రెసుకి ఆ గతి పట్టించింది!అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన పట్టుదల మీదనే వచ్చిందని చెప్పుకున్న ప్రత్యేక హోదానీ విభజన ప్యాకేజినీ తను అధికారంలో వుండి కూడా మా చేతుల్లో లేదని వెంకయ్య నాయుడు చెప్పినప్పటి నుంచే ఆప్ వైపుకి త్రాసు మొగ్గడం వూపందుకుంది?!
సకలం కావాలీ అనే భాజపా లక్ష్యం ప్రతి పార్టీకి వుండొచ్చు,కానీ యెలా సాధించాలనుకున్నది ఆ పార్టీ?తను చేసిన వాగ్దానాల్ని నిరపేక్షంగా నెరవేర్చి సజావైన పధ్ధతిలోనా!తనకే లాభం రావాలనే తొండి రాజకీయపు పైత్యకారి తనంతోనా!
ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజపా పరమ దుర్మార్గమైన వ్యూహంతో వుంది!జగన్ మీద వున్న కేసులు ఇప్పుడు విచారణ జరుగుతున్న పధ్ధతి ప్రకారం 2090వరకూ కూడా పూర్తి కాకపోవచ్చు,అసలెప్పటికీ పూర్తి కానె కాకపోవచ్చు!అసలు జగన్ మీద ఆరోపణలు యేమిటి?తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించాడని కదా!ఆ తండ్రి ముఖ్యమంత్రి అనే ప్రధమ స్థానంలోనే వున్నా మంత్రివర్గ సభ్యులకి తెలియకుండా చెయ్యగలడా యే పని అయినా?అధికార దుర్వినియోగం జరిగితే అది రహస్యంగా యెప్పటికీ జరగదు?!కన్నమేసే దొంగ కూడా తోడు లేకుండా చెయ్యడు గదా, మరి అతని మంత్రివర్గంలో వున్న లఘువీరుడికీ బొత్సకీ పార్టీలో యెవ్వడికీ తెలియకుండా జరిగిందా అది?ఆ కేసు స్వరూపం ప్రకారం అసలు ముద్దాయి జగన్ అవ్వడు వీళ్ళే అసలు నేరస్థు లవుతారు!జగన్ ధైర్యం కూడా అదే!చంద్రబాబు తోక ఝాడించిన మరుక్షణం జగన్ భాజపా సహకారంతో నిర్దోషిగా బయట పడి తెదెపాని మట్టి కరిపిస్తాడు.నేను జగన్ అభిమానిని కాదు,కానీ ఇన్ని విధాల కేసులతో సతమతమవుతున్నా రోజుకొకసారి తెదెపా శ్రేణులతో యెప్పుడు జైలు కెళ్తావో తెలియదు అని జోకు లేయించుకుంటున్నా అంత ధీమాగా వుండగలటానికి కారణం యేమిటనే ప్రశ్న వేసుకుంటే మీకే అర్ధమవుతుంది! జగన్ కూడా నిక్కచ్చిగా కేసుల నుంచి బయట పడదల్చుకుంటే చాలా ఈజీగా బయట పడగలడు,కానీ తనకి సానుభూతిని రప్పిస్తున్న ఈ వ్యవహారాన్ని తనూ తన కనుకూలంగా తీసుకుంటున్నాడు!
యే విధంగా జరిగినా ఒకసారి అధికారం కోల్పోయాక మళ్ళీ అధికారంలోకి రావడం అంత తేలిక కాదని మనందరి కన్నా చంద్రబాబుకే యెక్కువ తెలుసు! అంతా మోసం!అంతా దగా!ముఖ్యమంత్రుల బోర్డు ఒప్పుకోదేమో అని అనుమానాలు ఇప్పుడు వెలిబుచ్చుతున్న వాళ్ళు ఇచ్చినవాడు తమ పార్టీ వాడు కాదు గదాని గట్టిగా కృషి చెయ్యకపోవడం వల్లనే గదా వ్యతిరేకించేది?హామీ ఇచ్చిన వాడు నిన్నటి వాడయినా ఇచ్చింది ప్రధాని స్థానంలో వుండి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రులయినా మరెవరయినా కుంటిసాకులతో దానికి తూట్లు పొడిస్తే రాజ్యాంగబధ్ధమయిన ఆ పదవికే తలవొంపులు కాదా?
ఒక దేశప్రధాని ఇచ్చిన న్యాయబధ్ధమయిన హామీ పట్ల ఇంత అనిశ్చితిని రగిలించిన భాజపాని యెవరయినా యెలా అభిమానించ గలరు?అందుకే వ్యతిరేక ప్రభంజనం దిల్లీలో తొలి విసురు విసురుతున్నది?!ముస్లిముల్ని రంజింప జేసినా కాశ్మీరులో వుషారు ఇచ్చినా ప్రధాని స్థానంలో ఉండి ఒక నగర ప్రజానీకాన్ని రంజింపజెయ్యాలని చూసినా యెదురు తన్నడం యెందుకు జరుగుతుందో యెదురుదెబ్బ తగిలిన తర్వాతనయినా బోధపర్చుకుంటే మంచిది.
అధికారాంత మందు జూడవలె గదా అయ్యల సౌభాగ్యములు?!