Friday 19 December 2014

నాధూరాం గాడ్సే దేశభక్తుడు కాదా?వందే మాతరాన్ని కించపరిచిన జవ్హేరీ లాల్ దేశభక్తుడా!

     ఈ దేశవిభజన అంత కిరాతకంగా యెందుకు జరిగిందో యెవరికయినా తెలుసా?యెన్ని సార్లు యెన్నికలు జరిగినా జిన్నా ఈ దేశం నుంచి విడిపోవాలని యెంతగా ప్రయత్నించినా ప్రజలు తిరస్కరించితే ఇక పాకిస్తాను యేర్పడటం అసంభవమని తేల్చుకుని నిరాశతో రాజకీయాల నుంచి వైదొలగి మూలన కూర్చున్న జిన్నా ఈ దేశ విభజనకి యెలా కారణ మౌతాడు?! జైలులో వున్న మోహన దాసుని అక్కదే చావనివ్వకుండా వొదిలినందుకు ఆ మూర్ఖుడు  చేసిన పని యేమిటో తెలుసా?జిన్నాని కలవటం!కలిసి యేమి వుధ్ధరించాడు?ప్లెబిసైటు పెడదాం ఒప్పుకుంటావా అనే ప్రతిపాదన చేశాదు!జిన్నా నాకు అలా కుదరదు పాకిస్తాను తప్ప నాకేదీ అక్కర్లేదు అని మొదలుపెట్టి ఒక్కసారిగా వూపు తెచ్చుకున్నాడు.పాకిస్తాను గురించి అన్ని ఆశలూ వొదులుకుని మూల కూర్చున్న స్థితి నుంచి అతివేగంగా పావులు కదిపి తన కార్యం సాధించుకునేటంత హుషారు తెచ్చుకున్నాడు?జనం మూలకి తోసిన చెత్తని పనిమాలా పోయి బయటికి తీసుకొచ్చి జనం నెత్తిన రుద్దిన ఈ పిచ్చి పుల్లయ్య జాతిపితా?

     ప్రత్యేక నియోజక వర్గాలు ప్రతిపాదించినప్పుదు ముస్లిములకి వొప్పుకున్న వాడు దళితుల దగ్గ్గిర కొచ్చేసరికి వాళ్లకిస్తే భూగోళం బద్దలవుతుందనేటంత భీబత్సం యెందుకు చేశాడు?సాయిబులు పరాయోళ్ళు గాబట్టి ప్రత్యేక నియోజక వర్గాలు ఇచ్చినా పర్లేదు,వాళ్ళు దేశం నుంచి విడిపోయినా పర్లేదు గానీ దళితులు మాత్రం స్వేచ్చగా తల యెత్తుకు నిలబడకూడదనా?గాంధీ నుంచీ నెహ్రూ నుంచీ కమ్యునిష్టుల నుంచీ దేశభక్తిని నేర్చుకోవాల్సిన దిక్కుమాలిన స్థితిలో యెవడూ లేడిక్కడ!ఆ మనిషి పట్ల అంత భక్తి వున్నవాళ్ళు ఈ యాభయ్యేళ్లలో దేశంలో మద్యనిషేధాన్ని యెందుకు అమలు చెయ్యలేక పోయారు?నా పంచప్రాణాల్లో ఒకటని అఘోరించాడుగా,ఆ ప్రాణాన్ని నిర్లక్ష్యం చేశారేం?

     ప్రకాశం గారు మద్యనిషేధాన్ని నిక్కచ్చిగా అమలు చేసినందుకు ప్రపంచ పార్లమెంటరీ చరిత్రలో యెక్కడా అంతకు ముందు గానీ ఆతర్వాత గానీ జరగని విధంగా అధికార పక్షమే తమ ముఖ్యమంత్రి మీద అవిశ్వాస తీర్మానం పెట్టి దించెయ్యటం అనే గొప్ప పని చేశారని చరిత్రలో రికార్డు అయి వుంది,అవునా కాదా?మొదటి సారి పాపం ప్రతిపక్షాల వాళ్ళు కూడా పెద్దాయన మంచోడు అని మొహమాట పడి తిరక్కొట్తేస్తే తప్పుడు రూలింగు తో మళ్ళీ అదే సెషన్లో పెట్టి అంత మంచోణ్ణి బలవంతంగా గెంటేసారు గదరా!సారా బట్టీల యజమాని మీ పార్టీకి రాష్త్ర స్థాయి అధ్యక్షుడా?మీకు గాంధీ మీద భక్తి పొర్లి పోతుందా?యెవడికి చెప్తారు రా పిట్టకధలు!

     హోం రూలు వుద్యమం దగ్గిర్నుంచి అంత దేశభక్తిని ప్రదర్సించిన జిన్నా ఒక్కసారిగా దేశ విభజనకి కారకుడయిన విలన్ లాగా యెలా మారాడు?నోటితో ఈశ్వరల్లా చెక్కభజన్లు చేస్తున్నా ప్రాక్టికల్ పాలిటిక్స్ దగ్గిర కొచ్చేసరికి ముస్లిములకి సరయిన గుర్తింపు ఇవ్వకుండా తిక్కగా ప్రవర్తిస్తుంటే మండదా యెవడికయినా?అసలు ముస్లిములని ప్రత్యేకంగా వుంచడం దేనికి??కాంగ్రెసులోకి చేర్చుకుని వాళ్లని వుత్సాహంగా కాంగ్రెసు కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేసి వాళ్ళ కార్యదక్షతని బట్టి గౌరవాదరాలు కల్పిస్తే కాదనే వాడెవడు?ముస్లిములు ముస్లిము లీగులో విడిగానే వుండాలి,కానీ కాంగ్రెసుకి పక్కతాళం వేస్తూ అణిగిమణిగి పడి వుండాలే తప్ప కాంగ్రెసుని మించి పోగూడదు అనే తిక్క పాలసీయే గదా ముస్లిముల్లో లీగుకి అంత బలాన్ని తెచ్చి పెట్టింది!అయినా విభజన దగ్గిర కొచ్చేసరికి ప్రజలు మేము విడిపోము,కలిసే వుంటాం అని అంత గట్టిగా చెప్పాక గూడా ఈ దేశం యెందుకు విడిపోయింది?పై స్థాయిలో రాజకీయ ప్రయోజనం ఆశించిన వాహినీ వారి పెద్ద మనుషులు కుట్రతో ప్రజల ఆకాంక్షలకి విరుధ్ధంగా ఈ దేశాన్ని విదగొడితే నాయకులు మమ్మల్ని మోసం చేశారు అని మోసపోయిన ప్రజల ఆగ్రహమే కాదా నాడు రగిలిన కార్చిచ్చుకి కారణం?!

   చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయాక అటువైపు నుంచి శవాల రైళ్ళు వస్తున్నా శాంతిమంత్రం జపిస్తూ సొల్లు కబుర్లు చెప్తుంటే యెవడు వింటాడు? ప్రజల అసలు కోపం ఈ గురుశిష్యుల మీదే కదా, వీళ్ళ మాట అస్సలు వినలేదు!ఒకసారి శిష్యుల వారు ముద్దుల కూతురితో మంటల్ని ఆర్పడానికి వెళ్తుంటే గుంపులో ఒకడు ఆ సుందరాంగి పైట లాగాడట!వొళ్ళు కొవ్వెక్కి చేశాడనుకుని ఆగ్రహించబోతే,"అయ్యా, మీ కూతురు పైట లాగినందుకే ఇంత కోప మొచ్చిందే?మా ఆడవాళ్ళ మీద ఇంతకన్నా దారుణమైన పన్లు చేస్తున్నారు, మాకెంత కోపం రావాలి!" అని అడిగేసరికి డింపట్ కుక్కిన పేను లాగా అయిపోయాడు.ఇది జరిగిన చరిత్ర!ఆ ప్రశ్న అడిగిన ఒక్క వ్యక్తి కాదు కొన్ని కోట్ల మందిలో ఆ ఇద్దరి మీదా భగ్గున మండిన మంటకి ప్రతిరూపమే నాధూరాం గాడ్సే!అతడేమీ నిరక్షర కుక్షి కాదు!ఆఖరి నిముషం వరకూ స్వాతంత్ర్య సంగ్రామాన్ని వ్యతిరేకించి స్వతంత్రం రాగానే కాంగ్రెసు మంత్రివర్గాల్లో చేరిన మనుజేశ్వరాధములలో ఒకడు కాదు?వాళ్లంతా దేసభక్తు లయితే అతను కూడా ఖచ్చితంగా దేశభక్తుడే?!

     చంపకుండా వుంటే అనామకంగా హతమారి పోయే వాడేమో అనేటంతగా అప్పటికే అభాసు పాలైన వాణ్ణి చంపి మీకు ఇన్నేళ్ళుగా పనికొచ్చిన ఇంటిపేరుగా మార్చి మేలు చేసినందుకు కృతజ్ఞతగా నైనా అతన్ని దేశభక్తుడిగా వొప్పుకోవాలిరా కాంగ్రెసు బడుద్ధాయిలూ!


వందే మాతర గీతాన్ని బ్యాండు మేళానికి పనికి రాదని అవమానించిన వాడు దేశభక్తుడా?

2 comments:

  1. నిజం చెపితే ఎవరు వింటారండి? సాయిబ్బుల పాలనలో హిందువులంతా క్షేమంగా ఉన్నారనే "వైట్ పాలిష్" చరిత్ర చదివి, వాళ్ళు చెప్పిందే నిజమనే బడుద్దాయిలం మనం. ఇంక వీల్లకి ఎంత చెప్పినా ఒకటే. ఇప్పటికయినా నిజం తెలుసుకుంటారని ఆశిద్దాం.

    ReplyDelete
    Replies
    1. అంతే,యెందుకంటే జనం ఇవ్వాళ చదువుతున్నది వాళ్ళు కూర్చిన హిష్టరీ పాఠాలే!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...