Friday, 23 January 2015

నేను లేస్తే మనిషిని కాను!కానీ ఇప్పుడప్పుడే లేవను?నువ్వు వందసార్లు చెప్పినా నాకు అసలు చెప్పనట్టే?!

ఒకప్పుడు పెళ్ళిళ్లలో కలిసిన చుట్టాలు పాత సంగతుల్ని నెమరేసుకోవటానికి "క్రిష్ణా పుష్కరా లప్పుడు","గోవర్ధనం పెళ్ళప్పుడు","అచ్యుతరావు వాళ్లబ్బాయి బారసాలప్పుడు", అని పుష్కరాల లెక్కనో బారసాలనో పెళ్ళినో కలిపి అప్పుడు జరిగింది అని చెప్పుకునేవాళ్ళు!ఇవ్వాళ రోజులు మారాయి గదా - "చికెన్ గన్యా రోజుల్లో","స్వైన్ ఫ్లూ మొదటిసారి వొచ్చినప్పుదు","లైలా తుఫాను ఇరగదీసినప్పుడు" అని రోగాలూ,గొడవలూ,భీభత్సాలతో కలిపి చెప్పుకుంటున్నాం?

పాతకాలం వాళ్ళు తుఫాన్లూ వరదలూ మన దురదృష్టం కొద్దీ దేవుడే మనమీదకి రప్పిస్తాడని సరిపెట్టుకునే వాళ్ళు.నిన్నటి దాకా కరువుల గురించి కూడా అలాగే అనుకునే వాల్ళు, కానీ కొత్తగా ఎకనమిక్సు లో DRAUGHT ECNOMY| అనేది ఒకటి మొదలయింది!దాని ప్రకారం అంతకు క్రితం ప్రభుత్వాల దుర్మారమయిన ఆర్ధిక నిర్వహణయే కరువులకి కారణమని బలమయిన ఆధారాలు కనిపిస్తున్నాయట! ఈ నాలెడ్జి యేమీ లేకుండానే ప్రపంచంలోని అతి ఘోరమయిన కరుల్లో ఒకటైన బెంగాలు కరువు "కర్జను" అనే ఒక్కడి వల్ల వొచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే గదా!

ఇదివరలో కరువంటే అందరూ భయపడి చచ్చే వాళ్ళు!ఈ రోజుల్లో కరువు కూడా కొందరికి లాభసాటి వ్యాపారమైపోయింది.అనంతపురం కరువు జిల్లా అని అందరికీ తెలుసు,కానీ ప్రపంచ మార్కెట్టులో కొత్త మోడలు కారు యేది రిలీజయినా తెల్లారేసరికల్లా ఆనంతపురం రోడ్ల మీద కూడా తిరుగుతుందట?అదెట్లా అంటే కరువు సహాయక నిధుల మీదా పశుగ్రాసం వాటాల మీదా పెరిగిన కొందరు "గుద్ విల్ కాలనీ" దొరల వైభోగ మది!మనం రోడ్దు మీద వెళ్తుంటే శవాల మీద వేసిన రూపాయీ అర్ధ రూపాయీ యేరుకునే వాళ్లని ఈసడించుకుంటాం,కానీ అదే పని భారీ యెత్తున చేసిన వాళ్ళు "శుభకామన విలాసు" లయ్యారు.చేస్తే శుధ్ధ క్షవరమే చెయ్యమన్న పెద్దల మాటని బహుచక్కగా పాటించారు గదా మరి!

ఇత్లాంటిదే ఒక పాతముచ్చట గుర్తుకొస్తున్నది - రీడర్స్ దైజస్ట్ లో చదివాను.ఒకానొక చిన్న నగరంలో ఒక వీధిలో ఒక ఫొటోగ్రాఫరు తన భార్యయే మోడల్ అవటానికి సిధ్ధపడితే ఆమె నగ్నచిత్రాలే అవుగాక సౌందర్యభరితంగా తీసి వాటిమీద వచ్చే ఆదాయంతో బతుకుదామనుకున్నాడు?చుట్టుపక్కల వున్న సంసారు లంతా అతన్ని వెంటాడి వేధించి ఆ చండాలాన్ని అపేయించారు.అతను అక్కణ్ణుంచి మరోచోటికి వెళ్ళిపోయాడు.అదే పని "ప్లే బాయ్" అనే పత్రిక చేస్తే ఆ పత్రికాధిపతి ప్రపంచ ప్రసిధ్ధి గాంచిన ప్రముఖుల్లో ఒకడయ్యాడు,తేడా యెక్కడుంది?స్థాయీ భేదంలో వుంది!

మనని నష్టపెట్టి తను లాభం గుంజే పని ఇంటి పక్కవాడో,దగ్గిర్లో వున్న ఫ్యాన్సీ షాపు వాడో చేస్తే యేమయినా చెయ్యగలం, కానీ ప్రభుత్వంలో వున్నవాళ్ళు చేస్తే యేవరేమి చెయ్యగలరు?స్వైన్ ఫ్లూ బాధితులూ,చికెన్ గన్యా పీడితులూ వీళ్ళందరి దుస్థితీ ఇదే!చాలాకాలం క్రితం నుంచే డాక్టర్లంతా చాలా రోగాలకి మన చుట్టూ వున్న అపరిశుభ్రతే కారణం అని చెవినిల్ల్లు గట్టుకుని చెప్తున్నా చెప్పింది తమకు కాదన్నట్టు పన్నులు కడుతున్న ప్రజలకి పరిశుభ్రమైన పరిసరాలను సమకూర్చితే చాలు వాళ్ళు ఆయురారోగ్యాలతో వుంటారు,అరోగ్యంగా వున్నవాళ్ళు మరింత హుషారుగా వుత్పాదన పెంచుతారు అనే చిన్న విషయం కూడా వాళ్లకి యెవరయినా అరటి పండు వొలిచి పెట్టినట్టు చెబితే గానీ తెలియదా?నిజంగా తెలియకనే పారిశుధ్య శాఖకి అంత తక్కువ నిధులు కేటాయిస్తున్నారా!

అమితాబ్బచనుకి ఒక్కసారి గాజుపెంకు గుచ్చుకుందని ట్వీటు చేస్తే ఆయన అభిమానులు యెంతమంది అయ్యో అనుకున్నారో కుయ్యోమని మూలిగారో గానీ మనం నిర్లక్ష్యంగా గాజుపెంకుల కన్నా ప్రమాదకరమైన వాట్ని చెత్తకింద విసిరేస్తుంటే కొంతమది ప్రతిరోజూ వుత్తచేతుల తోనే వాట్ని యెత్తుతున్నారు గదా?స్వచ్చభారత్ పేరుతో మోదీ గారూ,రాష్త్రం మొత్తాన్న్నే సింగపూరులా చేస్తాననే బాబు గారూ,మొత్తం హైదరాబాదుని టాంకుబండుతో సహా బహుళ అంతస్తుల భవనాలు లేపి మురికివాడలు లేని నగరంగా చేస్తాననే రావు గారూ పారిశుధ్య శాఖ అనే ప్రభుత్వ శాకహ ఒకటి వున్నదనీ దాన్ని నిక్కచ్చిగా పని చేయించడానికి వీళ్ళు చెప్తున్న వాటికయ్యే  డాబుసరి ఖర్చుల కన్నా చాలా తక్కువ ఖర్చుతోనే ఆ పని చెయ్యవచ్చునని తెలియనంత అమాయకులా?!నమ్మి చెడిన వారు లేరు అని చాదస్తంగా నమ్మేవాళ్ళు వున్నారేమో గానీ నేను మాత్రం నమ్మను!?

ఆ మురికి నలాగే వుంచేసి ఈ వాటా కింద కొత్తగా నిధులు కేటాయించి అందులో కూడా సొంతానికి నొక్కేసి చేసే జబర్దస్త్ దోపిడీ కాదా ఇది?మన పన్లు మనం చేసుకోలేని రోజుల్లో మన మలమూత్రాలు కడిగి మనల్ని శుభ్రం చేసిన తల్లికి దణ్నం పెట్టటం వరకూ మనం మంచివాళ్ళమే గానీ అదే పని మొత్తం సమాజాని కంతా చేస్తున్న పారిశుధ్యపు పనివాళ్లని గురించి న్యాయంగా ఆలోచించకపోవడం వల్ల మనం కూడా ద్రోహులమేనా అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు నాకు?!

ప్రతి పారిశుధ్య కార్మికుడికీ చేతులకి గ్లవుజులూ,కాళ్ళకి బూట్లూ,వొంటికి యెంత మురికి కూపం లో దిగినా ఆ మురికి అంటని యూనిఫారం - ఇవ్వలేరా?జీతాలు పెంచి వాళ్లది కూడా గౌరవనీయమైన పనియే అనే గుర్తింపుని ఇవ్వలేరా?ఇప్పుడు ఆ శాఖలో పనిచేస్తున్న కార్మికులకే వాళ్ళు సంతోషంగా వాళ్ళ పని చెయ్యగలిగే యేర్పాట్లు చేస్తే ఇఇప్పుడున్న మురికి కన్నా రెండింతలు యెక్కువ మురికినైనా వొదిలించగలరు!

చెయ్యాల్సింది చెయ్యకుండా ఫొటోలకి పోజులిచ్చి పత్రికల్లో బొమ్మలు వేయించుకుంటే ఆ పేరున మరింత చెత్త పెరగడం తప్ప వుపయోగం యేమయినా వుందా?!లోపలా బయటా ఇంత మురికి పేరుకుపోయినా దాన్ని తొలగించుకుందామనే తొందర పుట్టటం లేదేమిటి?లోపలా బయటా ఇంత మురికి పేరుకుపోయినా దాన్ని తొలగించుకుందామనే తొందర పుట్టటం లేదేమిటి?ఈ పారిశుధ్య కార్మికుల దగ్గిర్నుంచీ అల్పాదాయ వర్గాలు యెవ్వరూ తమ పిల్లల్ని ఖరీదయిన స్కూళ్ళలో చదివించుకోలేరు!ప్రభుత్వ పాఠశాలల్ని వుద్దేశపూర్వకంగా నీరుగార్చి అస్మదీయుల స్కూళ్ళకి గిరాకీ పెంచుతున్నారు!పరిశుభ్రమైన దేహాలతో ఆరోగ్యాన్నీ వాళ్ళకున్న తక్కువ ఆదాయంలోనే విద్యనీ అందిస్తే యే రిజర్వేషన్లూ అక్కర్లేకుండానే కోట్లలో సంక్షేమ పధకాల తాయిలాలూ పంచనక్కర్లేకుండానే వాళ్ళకేమి కావాలో వాళ్ళే సాధించుకోగలుగుతారు గదా?!వాట్ని పనిగట్టుకుని దూరం చేసి యెప్పటికీ తమ మీదనే ఆధార పడి ఆ కృతజ్ఞతతో మళ్ళీ మళ్ళీ తమకే వోట్లు వేసే వ్యూహమే ఇది?!ఆకబారు వూళ్ళోకి తెచ్చినందుకు కూడా జనాన్ని చంపేసిన నిజాము కాలానికీ ఇప్పటి ప్రజాస్వామిక ప్రభుత్వాధినేతలకీ తేడా యేమయినా వుందా?

సీ || పోయెన్ కుసుమ కోమలోజ్వల సౌరభ
     ములు భూమిపై నుండి - మూక పెరిగి,

     ఇరుకుతనము పెరిగి,మురికియును, మరి
     కిలుము జిడ్డు ముదిరి, కర్బన ద్వ

     యాంలజని విషపదార్ధమై , కరగని
     ధూళులు నీటి యందమితమై పె

     రుగుచు ధరణి పెద్ద రొచ్చుగుంటై పోయె!
     మనుషుల ఆంతర్యములును సరిగ

తే || లేవు - పరధనాసక్తియు, లోభము, మర
     సూయలున్ మస్తుగా మనసులకు పట్టి
     వేసెను, మనిషి నుండి వివేకము తొల
     గంగ - ముక్కులు బద్దలౌ కంపు మిగిలె!
(27/08/1996)

ఇవ్వాళ జరగాల్సింది స్వచ్చభారత్ హడావిడి కాదు,ఘర్ వాపసీ గందరగోళం కాదు - మురికిని ద్వేషంచే మనస్తత్వం పెరగాలి,ప్రజలూ ప్రభుత్వం రెండూ కేవలం నినాదాలతో సరిపెట్టకుండా యుధ్ధమే చెయ్యాలి!బయటి మురికికీ లోపలి మురికికీ అవినాభావ సంబంధం ఖచ్చితంగా వుంది - క్షాళన రెండు చోట్లా జరగాలి!?మురికి,దుర్గంధం,అజ్ఞానం,అలసత్వం యెక్కడ కనిపించినా సహించకూడదు.దోపిడీకి అసలైన పునాది దోపిడీకి గురయ్యే వాడి అమాయకత్వం అని తెలిస్తే విద్య నేర్పి అజ్ఞానాన్ని తొలగించదం యెంత అవసరమో తెలుస్తుంది?!కులపిచ్చి,మతపిచ్చి ప్రాంతం పిచ్చి ఇవన్నీ అమాయకమైనవి కావు - తమాషాకి చెయ్యడం లేదు వాళ్ళు!శ్రీశ్రీ చెప్పినట్టు న్యాయంగా ఆడితే పాయింట్లు యెదటివాడికే పోతాయని తెలిసి రిఫరీని "నువ్వూ నేనూ ఒక్కలాంటివాళ్ళం,వాడు వేరే కాబట్టి నాకు పాయింట్లు వెయ్యి" అనే విధంగా బెల్లించి గెలవటం!అలాంటివాళ్ళు నీతిసూత్రాలకి లొంగరు.ఆ లాభాన్ని వాళ్ళకి దక్కకుండా చేస్తేనే తిక్క కుదురుతుంది!కానీ అలా చెయ్యగలమా?ఈ ట్రిక్కు నంతా యెన్నికల రోజున జరిగే తంతుకి అప్లై చేసి అక్కద రిఫరీలం మనమే అని తెలుసుకుంటే కాస్త వివేకం పెరుగుతుందేమో?!

నీతిసూత్రాలు యెక్కువగా దంచడం నాకూ ఇష్టం లేదు గాబట్టి ఒక సినిమా కధ చెప్తాను.బాటసారి అక్కినేని నాగేశ్వర రావు నటించిన సినిమాల్లో కల్లా అత్యధ్బుతంగా నటించిన సినిమా.అన్ని సినిమాల్లోనూ చేసిన నటన కన్నా ప్రత్యేకంగా ఇష్టపడి చేశాడు.మీ సినిమాల్లోకల్లా మీకిష్తమైన సినిమా యేది అని యెప్పుడు యెవరడిగినా ఆ పాత్ర గురించే చెప్పేవాడు!సినిమా లో తనది హీరోఇజం అస్సలు లేని పాత్ర.ఒక రకంగా భానుమతి హీరోయినుగా వున్న సినిమాలో తను సైడు క్యారెక్టరు చేసినట్టు లెఖ్ఖ!ఇవ్వాళ శ్రీయ నేర్చుకుని చేస్తున్నానని చెప్పే మెథడ్ యాక్టింగ్ ఆ రోజుల్లోనే వుపయోగించాడు ఆపాత్రలో.సినిమా అంతా ఒక బాల వితంతువు చుట్టూ తిరుగుతుంది.దేవదాసులో కొంత రొమాన్సూ,భగవాన్లు పాత్రతో చేసే క్యామిడీ అన్నా వుంది,ఇందులో అస్సలు అవేమీ లేవు.మామ్మూలు ప్రేక్షకు డెవ్వడూ వోపిగ్గా చూదలేడు.కానీ అందులో ఒక డైలాగు వుంటుంది అది తను యెలా చెప్పాడు అనే కుతూహలంతో చూద్దామని నా బెజవాడ లయోలా కాలేజి న్యూ హాస్టలు రోజుల్లో విశ్వప్రయత్నం చేశాను!కుదర లేదు.సినిమా హాలు గేటు దాకా వెళ్ళి వెనక్కి తిరగాల్సొచ్చింది - టిక్కెట్లు దొరక్క కాదు?మా ఫ్రెండ్సులో ఒకడు "ఇందులో కామిడీ లేదు బోరుగా వుంటుందిరా" అని వినపడీ వినపడనట్టు నసిగేసరికే బృందంలో మిగిలిన వాళ్లంతా భయపడి వెనక్కి తిప్పేశారు.ఆ ఒక్క ముక్కకే వాళ్ళలా యెందుకు భయపడ్డారో తెలుసా - ఆ ముక్క అన్నవాడు ప్రేమాభిషేకం పదిహేను రోజుల్లోనే ముఫ్ఫయ్ సార్లు చూసిన ఏన్నార్ పంఖా?!పోనీ నేనొక్కణ్నే చూద్దామా అంటే సెకండు షో తర్వాత బెంజి కంపెనీ నుంచి పోస్టలు కాలనీ దాకా ఒక్కణ్నే నడుచుకుంటూ రావాలి!అంత దృశ్యం లేదు నాకు:-<>)

అప్పుడు కుదరనిది యూట్యూబు పుణ్యమా అని ఈమధ్యనే చూశాను.ఆ డైలాగు పట్ల నాకంత పిచ్చ యెందుకు పట్టిందీ అంటే మా మామయ్యల్లో ఒక చాదస్తుడు అది చదివి ఆ సన్నివేశాన్ని పైకి వాగి నా బుర్రలోకి యెక్కించాడు!ఈయనా నేనూ మిగతా విషయాల్లో గజకచ్చపాల్లాగా పోట్లాడుకునే వాళ్ళం గానీ పుస్తకాల విషయంలో మా ఇద్దరి టేష్టూ ఒకటే!ఆ డయలాగ్ నాకు యెక్కినట్టు మీకూ యెక్కాలంటే కధ కొంచెంగానన్నా మీకూ తెలియాలి.భానుమతి క్యారెక్టరు పేరు మాధవి.బాల్య వివాహం జరగడమూ ముసలి భర్త తొందరగా పోవడంతో పిల్లలు లేకుండానే వితంతువు ఐపోయింది.కానీ యేడుస్తూ కూర్చునే మనిషీ కాదు.జమీందార్లు కావడంతో అన్నీ తనే చూసుకుంటూ వుండేది."భూమి జనించీ భుక్తి కొసగనీ ఫలము లున్నవీ కొన్ని" అని తన స్నేహితురాలే అన్యాపదేశంగా దేవుణ్ణి తిడుతుంటే "వేదశాస్త్రములు చదివిన వారే యెరుగరు సృష్తి విలాసం" అని జవాబిచ్చేసి సరిపెట్టుకునే మనస్తత్వంలో వుంది!చెల్లెలికి చదువు చెప్పించి పెళ్ళి చేసి పంపించడం ఒక్కటే తన పని ఆ వాతావరణంలోకి హీరో వొచ్చి పడతాడు.

వీళ్ళు వుండేది కలకత్తాలో.అతను కూడా జమీందారే.సవతి తల్లి మొదట్లో గారాబంగా పెంచి తర్వాత మరీ దద్దమ్మ లాగా తయారవుతున్నాడని కొంచెం ఈసడిస్తున్నట్టు ఒక మాటతో పొడుస్తుంది.అంతే!ట్రంకు పెట్టెలో బట్టలు సర్దుకుని కొంప నుంచి బయట పడి పోలీసు స్టేషను వరకూ వెళ్ళి అక్కణ్ణించి ఈమె ఇంటికి తన చెల్లెలికి లెక్కలు నేర్పే ట్యూటరుగా అడుగు పెడతాడు.కళ్ళజోడు పగిలిపోతే అది బాగు చేయించుకోవడం కూడా తెలీక పోగా బడదీదీ అని అందరూ పిల్చే హీరోయిను బాగు చేయించి పెడితే కనీసం యెవరు బాగు చేయించారు అని అడగటం గానీ థాంక్సు చెప్పటం గానీ తెలియని మొద్దావతారం అతను!యెంత హఠాత్తుగా వచ్చాడో అంత హఠాత్తుగా మాయమైపోతాడు?ట్యూషను చెప్పడం తప్ప మిగిలిన సమయాల్లో ఇతని యవ్వారమంతా కలకత్తా వీధుల్లో చక్కర్లు కొట్టటం.అలా చక్కర్లు కొడుతుండగా ఇతని కోసం వెతుకుతున్న మనిషొకడు అమ్మగారు మీకోసం బెంగెట్టుకున్నారు పదండి వెళ్దాం అనగానే అట్నించటే రైలెక్కేశాడు!వీళ్ళ పనివాడొకడు యెవర్నో రైలెక్కించడానికొచ్చి చూసి చెప్పాడు గాబట్టి తెలిసి ఒక నిట్టూర్పుతో సరిపెట్టుకుంటుంది.కానీ తన జమీకి తిరిగి వెళ్ళాక మాత్రం తెలివిగా వుండి జమీందారీని చూసుకుంటుంటాడు.అప్పుడొస్తుంది ఈ మాట.దివాను డబ్బు దాని యొక్క ప్రాముఖ్యత గురించి తనకి లెక్చరు ఇస్తుంటే నెమ్మదిగానే అన్నా స్థిరంగా "డబ్బుతో కొనలేనివి కూడా వున్నాయి ఆళ్వార్!" అంటాడు?!మా మామయ్య నా చెవుల్లోకి ఇది యెక్కించిన రోజుల్లోనే మరో మంచి కొటేషను ఆంధ్రజ్యొతి దినపత్రికలో ఎడిటోరియల్ పైన ఇచ్చే బాక్సులో చదివాను,"డబ్బుతో దేన్నయినా సాధించగలను అనుకున్న వాడే డబ్బు కోసం యే గడ్డయినా కరవడానికి సిధ్ధ పడతాడు?" అని!ఈ రెండూ నన్ను అతాలాకుతలం చేసేసి ఆఖరికి యెముకల్లోకంటా ఇంకిపోయాయి.ఒకటి గుండెకి పట్టే ఆర్ద్రత నిండినది.ఒకటి కొరకంచు లాగా కాల్చే వ్యంగ్యం నిండినది.మిత్రులంతా ఇవ్వాళ నా భాషని మెచ్చుకుంటున్నది ఆ రెండూ 50-50 లాగా కలిసి పోవటం వల్లనే!


ఆ అరెండు ముక్కలూ యెవరికి యెక్కినా డబ్బు పిచ్చి తప్పకుండా వొదుల్తుంది.అది వొదిల్తే మిగతావీ వొదుల్తాయి,అవునా కాదా?!మురికి,దుర్గంధం,అజ్ఞానం,అలసత్వం - వీట్ని వొదిలించుకోకుండా యెవ్వడూ బాగుపద లేడు?!

Tuesday, 20 January 2015

యెవరు నేను?యెవరు మీరు!అధికారం ముందా,అభివృధ్ధి ముందా?ఈ హరిబాబు యేమి చెప్తాడు?!

"నువ్వు భారతీయుడవైతేనే నువ్వు బ్రిటిష్ వారి (నీ పైన ఉన్నవారిపైన నీ హక్కులకు) పైన పొరాడెదవు అందుకే అస్తిత్వం అవసరం
ఇది మీకు అర్ధం కాదు ఎందుకంటే మీరు సమస్య కు పరిష్కారం చూపలేరు ,చూపించిన పరిష్కారం తప్పు అని ఎలా చెప్పగలరు..?

బ్రితిష్ వాడి లాగే హిందు ముస్లిం మధ్య అంతరాలను ఉపయొగించి దివిజన్ చెసినట్టే మాల మాదిగ అనే దివిజన్ ను మీరు బలపరుస్తున్నారు..ఒక్క విషయం గుర్తుంచుకోండి అన్నేళ్ళు పై వర్ణాలు ఉన్నారు వాళ్ళు కింది వర్ణాలకు ఏం చేశారు..?దోచుకొవడం తప్ప?

కాని పూర్తిగా సమస్యను సాధించే పరిష్కారం లేనప్పుడు సమస్యను కొంతైనా పరిష్కరించేది మెలు ..?కాని అది కూడ వద్దు అనే మీబొటి వాళ్ళు ..?సమస్యకు పరిష్కారం చూపెట్టరు,ఉన్న పరిష్కారాన్ని ఉపయోగించి మీరు మీబోటి వాళ్ళు పరిస్థితులను వాడుకుంటారు.

కులవ్యవస్థను నేను అట్టి పెట్టుకొకుండా ఎలా ఉండాలి అన్నది మీరు చెప్పడం లేదు. 
అది వదిలేసి మళ్ళీ పిట్ట కథలు చెప్తున్నారు.
ఊరికే ఉపన్యాసాలు ఆదర్శాలు చెప్పకూడదు. 
ఇంత రాసినా నాకు తెల్సు మీకు అర్ధం కాదు అని.
ఎందుకంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దెన్ని అంగీకరిస్తున్నారో దెన్ని అంగీకరించడం లేదో మీరు కంఫ్యూజన్ గా ఉన్నారు. 
కామెంట్ కి రెప్లై ఇచ్చే ముందు కామెంట్ ను పూర్థిగా చదవండి .

నేను చెప్పేది నా కింది కులం వాళ్ళు నా కింద ఉండాలని కాదు దీనిని మీరు ఇలా రాసే మెధవులు. 
కాబట్టి నేను నా పైన మరియు నా కింద యే కులం ఉండకూడదు. 
దీనికి యేదైన పరిష్కారం చూపెట్టగలరు. 
లేక పొతే ఇప్పుడు జరుగుతున్నది కచ్చితంగా వర్కౌట్ ఔతుంది.

చూశారుగా ప్రతి ఒక్కరు తమ అస్తిత్వానికి పోరాటం చెస్తున్నారు..
అంతకు ముందు పైన ఉండే వాళ్ళే తమ అస్తిత్వానికై పోరాడేవాళ్ళు.
ఇప్పుడు కింది అట్టడుగు వాళ్ళు తమ అస్తిత్వానికి పోరాడుతారు.

కనీసం ఇప్పుడు కింది వారు పోరాదే హక్కు తమకూ ఉందని తెలుసుకుంటున్నారు ..
అప్పుడు లేదు ..మీరు ముందు కులవ్యవస్థ ను గూర్చి పూర్తి గా అధ్యయనం చెసి రాయండి, లేదు నాకు అంతా తెలుసు అని రాస్తే మీ ఇష్టం -  ఆల్ దె బెస్ట్"
----------------who am i16 January 2015 at 08:07



        ఇది నా గత పోష్టు "ఇదండీ కమ్యునిజం చరిత్ర" పోష్టులోని విషయం గురించి దళితవాదపు సమర్ధకులలో ఒకరి సుదీర్ఘమయిన విమర్శ నాపైన!మరొకరు కూడా దాదాపు ఇలాంటి ఆరోపణలే చేశారు,ఆరోపణలు అనకూడదేమో?పోష్టులోని విషయం అర్ధాంతరంగా ముగియడం వల్ల కూడా ఈ రకమయిన  రెస్పాన్స్ వచ్చి వుండవచ్చు.విషయం చాలా విస్తృతమైనది,పైగా యే కొంచెం మాట పొల్లయినా విపరీతార్ధాలు వస్తాయి!అవగాహన స్పష్తంగానే వున్నా దాన్ని యెలా చెప్పాలా ఈ పోష్టుని యెలా ముగించాలా అని ఆలోచిస్తూ చాలా రోజులు గడిపాను.ఆఖరికి మొత్తం అంతా ఇక్కడే చెప్పడం కుదిరేది కాదని అంతవరకూ పబ్లిష్ చేశాను. అడిగిన ప్రశ్నలన్నిటికీ లెక్క ప్రకారం కిందనుంచి పైకి జవాబులు చెప్తూ వెళ్తే వరస బాగుంటుంది,యెందుకంటే నాకసలు కులవ్యవస్థ గురించి సరైన అవగాహనే లేకుండా నోటికొచ్చిన పిట్టకధలు చెప్తున్నానని అంటున్నారు గదా - ముందు దాంతోనే మొదలు పెడతాను.


        ఇప్పటివరకూ మన దేశం యొక్క గతం గురించి మనకి సాధికారికంగా తెలిసిన నాగరికత సింధు లోయ నాగరికత. ప్రపంచంలోని అతి ప్రాచీనమైన మూడు నాగరికతలలో ఇది ఒకటి! హరప్పా నగరానికి సంబంధించిన తవ్వకాల్లోనే యెక్కువ విశేషాలు తెలియడం వల్లా మిగిలిన చోట్ల బయటపడిన విషయాలు కూడా దాదాపు ఇలాగే వుండటం వల్లా హరప్పా నాగరికత అని కూడా పిలుస్తున్నారు.తన వుచ్చదశలో 5 మిలియన్ల జన సమూహం ఈ సంస్కృతిలో జీవించారు!ఈ జనసమూహం అంతకు ముందు వేట ప్రధానంగా జీవికగా వున్న ఒక తల్లి నుంచి పుట్టిన కుదురు గణం అని పిలవబడే సమూహంగా కదుల్తూ వుండే సంచార జీవనం నుంచి కొత్తగా నేర్చిన వ్యవసాయం మూలంగా స్థిరజీవనాన్ని యేర్పరచుకుంటున్న తొలి దశ!ఇప్పటి మన దేశపు సంస్కృతిలో కూడా ఈ సంస్కృతి చాయలు పరుచుకుని వున్నాయి కాబట్టి దీన్ని గురించి కొంచెం వివరంగా చెప్తాను.

        వేట జీవన విధానంగా వున్న కాలంలోనే ఇక్కడ ఇవ్వాళ కమ్యునిష్టులు చెప్తున్న "అదనపు వులువని సమాజపరం చెయ్యడం" అనే ఆదర్శానికి సమానమైన "దేవీ భాగం" అనే  సాంప్రదాయాన్ని పాటించారని ఈ సంగచ్చధ్వం సంవదధ్వం అనే ఋగ్వేద మంత్రం ద్వారా తెలుస్తుంది!దేవీభాగం అంటే - పసిపిల్లలకూ, దంతాలు లేని వృద్ధులకూ మెత్తని మాంసం మొదట ఇవ్వాలి.తర్వాత దౌహృదులకి - రెందు హృదయాలు ఉండే గర్భవతులకి రెట్టింపు మాంసం ఇవ్వాలి.అలా వారందరికీ పంచగా మిగిలిన మాంసాన్ని యువతీ యువకులకీ, జవసత్వాలు గలిగి సంపద పెంచే ఇతరులకీ పెట్టాలి.ఆ మంత్రంలోనే "పూర్వులు యెలా చేసేవారో" అనడం ద్వారా అప్పటికే దానికి దూరమయ్యారని కూడా తెలుస్తుంది!ఆదర్శం గొప్పదే గనక కొంత శ్రధ్ధ చూపించి కృషి చేస్తే ఇప్పటికీ మరో రూపంలో దాన్ని సాధించి నిలబెట్టుకోవచ్చు!

        ఒక దేశపు చరిత్ర ఆ దేశప్రజల సమిష్టి బాల్యస్మృతుల్ని తట్టిలేపే తేనెతుట్టె!నాకు మా తాతగారి ఇంట్లో గడిచిన బాల్యం చాలా అపురూపంగా వుంటుంది.అయితే ఆ ఇల్లు ఇప్పుడు లేదు.జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ ప్రతి అంగుళాన్నీ గుర్తుకు తెస్తాయి.కానీ జ్ఞాపకాల కోసమని ఇప్పుడు సౌకర్యం కోసం కట్టిన భవంతిని కూల్చేసి మళ్ళీ ఆ పూరింటిని కట్టడం అనే పిచ్చిపని నేను చెయ్యను?దేశపు చరిత్ర కూడా అంతే!అప్పుడు మనం చేసిన తప్పుడు పనులు కూడా ఇప్పుడు మనకి తియ్యగా వున్నట్టే అప్పటి వాళ్ళు చేసిన తప్పొప్పుల్నీ చూడాలి - వాళ్ళు చేసిన తప్పుల్ని మనం చెయ్యకూడదనే వివేకాన్ని పెంచుకోవడమూ వాళ్ళు చేసిన గొప్పపనుల్ని తలుచుకుని వుత్తేజితులు కావడమే చరిత్ర పఠనానికి లక్ష్యంగా వుండాలి తప్ప ఒకవైపు నుంచే చూసి ఆయనెవరో చెప్పినట్టు యేనుగుని చేతికందినంతమేర తడిమి అదే సమస్తం అని వర్ణించే గుడ్డివాళ్ళ మాదిరి భాష్యాలు చెప్పే యేకపక్షపు సిధ్ధాంతుల్ని అమాయకంగా నమ్మితే మనకి కనబడేవి అర్ధసత్యాలే!

        సరిగ్గా హరప్పా కాలం నాటి వాతావరణమే కలిగిన మాయా నాగరికత లాంటివి అక్కడి ప్రాంతాల నైసర్గిక స్వరూపం వల్ల ఇతర జాతుల దాడిలో చాలా త్వరగా రూపాన్ని మార్చుకున్నాయి,కానీ హిమాలయ శ్రేణులు మిగతా ప్రపంచం నించి ఈ భూభాగాన్ని వేరు చెయ్యడం వల్ల బ్రిటిషర్లు శిధిలం చేసే వరకూ కొనసాగిన "స్వయం పూర్ణ గ్రామ వ్యవస్థ" హరప్పా సంస్కృతి మూలాల్ని పదిలంగా పట్టి వుంచగలిగింది!కొందరు ఈ శీతనగాన్ని దాటి వచ్చి తాము దోచుకుని తమ దేశాలకి తరలించుకుపోయినా బాబరు లాంటి వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చేసరికే అక్కడి నిరంతర యుధ్ధాలకి విసుగెత్తి వుండటంతో ఇక్కడే తమ సామ్రాజ్యాల్ని స్థాపించుకున్నారు!మొగలు వంశ స్థాపకుడైన బాబరే కాదు షేర్షా సూరి లాంటి వాళ్ళు కూడా అదే పని చేసినా వారి లక్ష్యం రాజ్యస్థాపన కాబట్టి ప్రజల సంస్కృతిని కదిలించక పోవడం వల్లనే పై స్థాయిలో రాజు యెవరయినా ప్రజలకి యే విధమయిన తేడా తెలియ లేదు.

        కొత్తగా కట్టిన ఆధునిక నగరాల్ని కాకుండా ప్రాచీన నగరాల్నీ చరిత్ర పూర్వకాలం నుంచీ వున్న పల్లెల్నీ చూస్తే వారి జీవనకేంద్రంలో ఒక దేవాలయం వుండటమూమళ్ళీ  ఆ కోవెలకి తప్పనిసరిగా ఒక పుష్కరిణీ లేదా స్నానఘట్టం వుండటమూ గమనించవచ్చు.అది సింధులోయ నాగరికతకి రూపు మారిన కొనసాగింపు!మూలాలు తెలియకుండానే వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నా ఆ మూలాల గురించి వాస్తవంగా తెలిసింది క్రీ.శ 1842లో చార్లెస్ మాస్సన్ ద్వారానే.తర్వాత 1856లో జనరల్ కన్నింగ్ హాం కరాచీ లాహోరులను కలుపుతూ ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ తరపున జరిగే పనిలో భాగంగా దీన్ని గురించి ప్రముఖంగా పట్టించుకుని ప్రపంచానికి తెలియజేశాడు!రాజ్యం అనేది ప్రాధమిక స్థాయిలో వున్న అప్పటి నగరంలో రెండు ప్రధానమైనవి - ఒకటి ధాన్యపు రాశి,రెండు బహిరంగ స్నానఘట్టం.స్నానఘట్టం కేవలం స్నానానికి వుద్దేశించింది అనుకుంటే పొరపాటు!ప్రతి ఇంటిలోనూ స్నానాల గదీ మురుగునీటి సౌకర్యమూ వుండగా మళ్ళీ దీన్ని యెందుకు యేర్పాటు చేశారో తెలుసా?ఇవ్వాళ్టికీ దైవ ప్రార్ధనకి ముందు దేహాన్ని స్నానం ద్వారా శుభ్రపరచడం అనేది జరుగుతున్నదే గదా - ఆ అవసరం కోసమే ఈ బహిరంగ స్నానఘట్టం!దానికి నిదర్శనం అక్కడ వున్న దుస్తులు మార్చుకోవడానికి వున్న గదులు!ఇప్పటి ఆధునిక కాలంలోని స్విమ్మింగ్ పూల్స్ మాదిరి విలాసానికీ ప్రత్యేక తిధుల్లో మతాచారాల కవసరమయిన శౌచానికీ వుపయోగించేవారని మనం భావించవచ్చు!అందువల్లనే కాబోలు తర్వాతి దశ ఆయిన రాజరిక వ్యవస్థలో స్నానఘట్టాలు దేవాలయం - రాజప్రాసాదం అనే రెండు చోట్లనే కనిపిస్తున్నాయి?

        తర్వాత యేర్పడిన రాజ్యాలు కూడా ఓకే నగరాన్ని ఆధారం చేసుకుని వుందటం వల్ల అదే సామాజిక నిర్మాణం కొన్ని మార్పులతో కొనసాగింది.ధాన్యాగారం ధనాగార మయింది.స్నానఘట్టం పూర్తి హంగులతో దేవాలయం అయ్యింది!మరోసారి వెనక్కి వెళ్ళి నగర క్రమబధ్ధీకరణ గురించి తెలుసుకుంటే కళ్ళు చేదిరే దృశ్యం కనబడుతుంది.నగర నిర్మాణంలో ఆ కాలపు భారతీయులు వుపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం మధ్యప్రాచ్యంలోని సమకాలీన నాగరికతల కన్నా సరిపోల్చలేనంత గొప్పగా వుంది!అది మన వారసత్వం,అది మన ప్రాచీనుల మహత్వం!దాదాపు నాగరికులంతా అయితే చేతివృత్తులతో కళాఖండాల్ని సృష్టించగలిగిన వారూ లేదంటే వారు సృజించిన వాట్ని సుదూరతీరాలకు కూడా తీసుకెళ్ళి అక్కడి విపణివీధుల్లో అమ్మగలిగి సంపదని సృష్టించే రహస్యం తెలిసిన వ్యాపారస్తులూ ఐవున్నారు.దానికి సాక్ష్యం వారు నగరనిర్మాణంలో వాడిన కొన్ని వస్తువులు ఆ దరిదాపుల్లో యెక్కడా దొరకనివి కావటం.

        ఈ జనసమూహాలు అంతకుముందు వేట ప్రధానమైన జీవికగా వుండి ఒక తల్లి సంతానం అంతా ఆమె పేరుతోనే పిలవబడే ఒక గణంగా కలిసి ఒకచోట ఆహారం పలచబడగానె మరొకచోటికి కదులుతూ సంచారజీవనం సాగిస్తూ వుండేవి!తర్వాతి కాలంలో జన్యురోగాలకి కారణమవుతున్నాయని తెలిసిన నిషిధ్ధ శ్రంగారం కూడా అప్పుడు సహజంగా అనిపించేది!ఒక తల్లి నుంచి పుట్టిన సంతానం, ఆ సంతానంలోని ఆడవాళ్ళ నుంచి పుట్టిన సంతానం అంతా ఒకటే కుదురు అయ్యేది!ఇవ్వాల్టి మాదిరి ఒక స్త్రీ ఒక పురుషుడు ఆజీవపర్యంతం కలిస్ బతికే వివాహం అనేది గణసాంప్రదాయాన్ని ధిక్కరించటం కింద పరిగణించే వావివరుసలు లేని  కాలమది!ఇవ్వాల్టి మేనరికాల లాగే ఒకే గణానికి చెందిన స్రీ పురుషులు కొన్ని తరాల పాటు కలవడం వల్ల వచ్చి పడుతున్న కారణం తెలియని రోగాలకి భయపడి ఒకే గణానికి చెందిన స్త్రీ పురుషుల కలయికని నిషేధించి గణ సమూహాల మధ్య ఆదాన ప్రదానాలతో కూడిన బాంధవ్యాల్ని పెంచుకున్నారు.పుట్టుక తోనే వచ్చే ఆ  రోగాలకి కారణం స్త్రీ గర్భం అనే అపోహ వల్లనో యేమో తమ ఆడవాళ్ళని వేరే గణానికి పంపుతూ వరే గణానికి చెందిన స్త్రీలని తాము తెచ్చుకుంటూ కుండమార్పిడి పధ్ధతిని పాటించారు.అసలు కారణమేమిటో తెలియక చేసినా అసలు సమస్య పరిష్కారమవడంతో పాటు సొంత గణంలో పట్టుని కోల్పోయి కొత్త గణంలో పట్టును సాధించలేక ఆదపెత్తనం అంతమైపోయి మగపెత్తనం మొదలయింది!మొదటి దశలో ఇలా గణాల మధ్యన ఆడవాళ్ళ మార్పిడి జరిగినా శృంగారం మాత్రం సామూహికమే సాంప్రదాయంగా వుండేది.ఇవ్వాళ మనం పెళ్ళిలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి కారణం మొట్టమొదటి సారిగా ఆ ఆలోచన చేసి దానికి కట్టుబడి వశిష్టుణ్ణి కూడా ఒప్పించడమే!కులాల్ని వేరు చేసేది వివాహమే కాబట్టి ఇవ్వాళ్టి కులవారసత్వాలకి సంబంధించిన వివాహ సాంప్రదాయాలు యెట్లా యేర్పడినాయో తెలియడం కోసమే ఇంత విస్తారంగా చెప్పాను.ఇప్పటికీ అనుకోకుండానే యెవరినైనా మామగారింటిని "మీ అత్తవారిల్లు" అని ప్రస్తావించడంలోనూ ఆడపిల్ల తలిదండ్రుల్ని "మీ అమ్మాయిని యే వూరిచ్చారు?" అని అడగటంలోనూ ఏనాడో కాలగర్భంలో కలిసిపోయిన మాతృస్వామ్యపు  ఆనవాళ్ళూ సామూహిక వివాహపు అలవాట్లూ వున్నాయనేది తెలిస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం విషయాల పట్ల కూడా మనం యెంత ఆప్యాయంగా వున్నామో అర్ధమవుతుంది!

        హరప్పన్ ఇంజనీర్లు వాడిన దంతం మీద గాట్లతో యేర్పరచిన స్కేలు మీది అతి చిన్న ప్రమాణం ఇప్పటి 1.7 మిల్లీమీటరుకి సరితూగుతుంది!ఇళ్ళ నిర్మానంలో సైజుల వారీ తేడాలు వున్నా అన్ని ఇళ్ళూ ఒకేరకంగా వుండటం వల్ల అప్పటివాళ్ళు సమానత్వాన్ని పాటించేవారని తెలియజేస్తున్నాయి.నగరం నలుమూలలకీ వీధులూ ఇళ్ళూ ఒక గ్రిడ్ మాదిరి విస్తరించి వున్నాయి.మొత్తం నగరం రెండు భాగాలుగా వుంది.ధాన్యాగారానికి దగ్గిరగా వున్న ప్రాంతం యెగువనగరం గానూ దూరంగా వున్న జనావాసాలతో కూడినది దిగువ నగరం గానూ వుండేవి.ఇంకొక విశేషం యుధ్ధానికి సంబంధించిన జాడలూ అమరవీరుల స్మారకస్థూపాలూ లేకపోవటం - ఆదినుంచీ మనం శాంతికాముకులమే నన్నమాట?!

        సరిగ్గా ఇవే మౌలికాంశాలు తర్వాతి కాలంలోని నగర రాజ్యాలలోనూ స్వయంపూర్ణ గ్రామాలలోనూ మరింత స్పష్టమై కనబడతాయి.ఇవ్వాళ్టి రాకీయ నాయకులంతా స్మార్ట్ సిటీలూ స్మార్ట్ విలేజిలూ అని పేర్లు మాత్రమే లీకు చేసి హడావిడి చేస్తున్నారే గానీ వాటి స్వరూపం యెలా వుంటుందో మాత్రం ఒక్కముక్క కూడా చెప్పటం లేదు!కానీ స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థ అంటే తనకి కావలసిన వాటి నన్నిట్నీ దానికదే సమకూర్చుకోగలిగిన సామాజిక భౌగోళిక ఆర్ధిక నిర్మితి!సింధులోయ నాటి వృత్తులన్నీ కులవృత్తులుగా స్థిరపడిపోయి "కులవృత్తికి సాటిలేదు గువ్వలచెన్నా!" అని పాడేసుకుంటున్నారు! ఒకే వృత్తికి సంబంధించిన వారంతా ఒకే వీధిలో సర్దుకుని "కోమట్ల బజారు", "కంసాళ్ళ వీధి","చాకలి పేట"లుగా స్థిరపడిపోయినాయి.కులవృత్తిని తమలోనే పదిలంగా వుంచుకోవటానికి స్వకులంలోని వివాహాలకే మొగ్గు చూపించే వారు?!వ్యవసాయం పశుపోషణ అంతా రైతులది కాగా దానికి అనుబంధమైన ఈ వృత్తిపని వారందరినీ పోషించే బాధ్యత రైతులది!పంట రాగానే అందరికీ దామాషా పధ్ధతిలో వాటాలు వేసి ధాన్యం పంచేసే వాళ్ళు!అది ఇవ్వననడానికి వీల్లేని హక్కుగా వచ్చిపడే ఆదాయం కావడంతో ధీమాగా సామేతల్నీ ఆమెతల్నీ పుట్టిస్తూ ఒక కులం మీద మరో కులం వాళ్ళు జోకు లేసుకుంటూ గడిపేవాళ్ళు!కరువొచ్చినా వరదొచ్చినా ప్లేగులాంటి మహమ్మారి విరుచుకుపడినా వూళ్ళకి వూళ్ళు ఖాళీ అయ్యేవి గాబట్టి ప్రాణం విలువ తెలిసి బాంధవ్యాలకు ప్రాధాన్యత నిచ్చి అమాయకంగా బతీకేశారు "ఫరంగీలు" అనీ "కుంఫిణి దొరలు" అని తొలిరోజుల్లో అబ్బురంగా చూసి మురిసిన ఇంగ్లీషువాళ్ళు వచ్చేవరకూ?!అంతటా వ్యవసాయమే ప్రధానం కావటం వల్ల మొత్తం భరత ఖందమంతా ఒకే రకమయిన సంస్కృతిలో ఒదిగిపోయింది!యేనుగుల వీరాస్వామయ్య గారి "కాశీయాత్ర చరిత్ర" ప్రకారం అన్నం అమ్మడం తప్పుగా భావించేవాళ్ళు!రూపాయికి బస్తా బియ్యం అనే లెక్కల్ని మన పెద్దలు చెప్పగా విన్నాము కదా,డబ్బుతో అవసరం లేని జీవితం వాళ్ళ చుట్టూ పరుచుకుని వండటం వల్ల దేన్నీ కొనాల్సిన అవసరం లేకుండా పంచుకుంటూ బతకటం వల్లనే అది సాధ్యపడింది!ఆ మనస్తత్వం నుంచి బయట పడ్డాకనే ప్రతిదాన్నీ కొనాల్సిన అవసరం యేర్పడి వస్తువులకి ధరలు పెరిగాయి!

        ఈ మొత్తం సంస్కృతినంతా నిజాయితీగా రికార్డ్ చేసిన కన్నింగ్ హాం లాంటి వాళ్ళకి మనం దురుద్దేశాలు అంటగట్టలేము గానీ రొమిల్లా థాపర్ మొదలుకుని కమ్యునిష్టు సిధ్ధాంతులంతా ప్రమాదవశాత్తూ హిందువైన నెహ్రూ గారి సంపూర్ణ సహాయ సహకారాలతో అత్యుత్సాహంగా పని చేసి అన్ని శతాబ్దాల పాటు ఈ వ్యవస్థ ప్రశాంతంగా నడవటానికి "బ్రాహ్మణాధిక్యత" మాత్రమే కారణం అని తేల్చడం వెనక 50% అజ్ఞానం 50% దుర్మార్గం వుంది.అజ్ఞానం యెందుకంటే భూమి మీద అధిపత్యమంతా రైతులకే వుండటం వల్ల ఆ వ్యవస్థ బద్దలయిన ఇప్పటి కాలంలో కిందికులాల వారితో పాటు వాళ్ళు కూడా దెబ్బతినడం యేకొంచెం నిష్పాక్షిక దృష్టితో చూసినా కళ్లముందు కనపడే వాస్తవం!పెట్టుబడిదారీ వ్యవస్థని బద్దలు కొట్టడానికి అది బలహీనంగా వున్నచోట కొట్టమన్న మార్క్సు గారి బొధన ప్రకారం మతపరమయిన కర్మకాణ్దలు చేస్తూ సంభావనలతో సరిపెట్టుకుని అన్ని కులాల మధ్యనా లింక్ క్లాస్ గా వున్న బ్రాహ్మల్ని బద్నాం చెయ్యడం ద్వారా అన్ని కులాల్నీ ఒకేసారి విడగొట్టవచ్చనేది వాళ్ళ దుర్మార్గం?!పెతీదానికీ ఫ్రేం వర్కు వుండాలనే వాళ్ళకి వాళ్ళు చెప్పేదానికన్నా గట్టి ఫ్రేం వర్క్ వున్న హిందూ ధర్మాన్ని బద్దలు కొట్టడానికి వాళ్ళకి కనబడిన బలహీనత అది. వాళ్ళ పేర సొంత ఆస్తి సెంటు కూడా లేకుండా కేవలం దానాల మీదా సంభావనల మీదా ఆధారపడి బతికిన వాళ్ళూ ఆ వ్యవస్థ బద్దలవగానే అందరితో పాటూ వీధినపడ్డవాళ్ళూ  దుర్మార్గులా?బ్రాహ్మల్ని వెక్కిరించటానికి గురజాడకి కన్యాశుల్కంలో భాషా బలిపీఠంలో రంగనాయకమ్మకి తిండీ దొరికాయి,యింత నీచపు విమర్శలు చేసిన వాళ్ళు వున్నతులా! 

        ఇంగ్లీషు వాళ్ళ ప్రమేయంతో ఆ వ్యవస్థ బద్దలయ్యే క్షణం వరకూ దాన్ని పట్టి వుంచటానికి బ్రాహ్మణులతో పాటూ అన్ని కులాల వాళ్ళూ తమ వంతు సాయం చేసి తీసుకోవలసిన ఆదాయాన్ని తీసుకుని అది బద్దలయ్యాక ఇప్పుడు పడుతున్న కష్టాలకి అప్పటి వాళ్ళని తిట్టి యేమి ప్రయోజనం?తండ్రి హయాంలో కట్టిన పూరిపాకని కూల్చిన కొడుకు భవంతిని కడితే ప్రయోజకత్వం అంటాం,దేన్నీ కట్టకుండా వొదిలేస్తే అప్రయోజకు డంటాం!అదే దేశం విషయంలో అయితే ఇంగ్లీషువాళ్ళు కూల్చిన వ్యవస్థ స్థానంలో అంతకన్నా గొప్పదాన్ని నిర్మించి వుంటే అభివృధ్ధి జరీగేది,దాని స్థానంలో మరింత చెత్త నింపడం వల్లనే ఈ అధోగతి!ఈ మధ్యనే వరూధిని బ్లాగరు  ఇంగ్లీషు వాళ్ళు రాకపోయి వుంటే దేశమంతా ముస్లిము మతం వ్యాపించి వుండేది,వీళ్ళు రావడం వల్ల అది జరగలేదు అనే భావంతో ఒక పోష్టు వేశారు.కానీ అది సరి కాదు.మాలిక్ ఇబ్రహీం మల్కింభరాముడు అని కీర్తించబడే విధంగా పరిపాలించాడు!హిందూ ధర్మం యే పునాది మీద గట్టిగా నిలబడిందో ఆ స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థని వాళ్ళు కదిలించలేదు.ఇంగ్లీషు వాళ్ళు కూడా  ఆ అపని చెయ్యకుండా వుంటే ఇప్పటికీ ముస్లిము ప్రభువుల మాదిరే వాళ్ళూ మనకు ఆదర్శ పభువులుగానే వుండి వుండేవాళ్ళేమో?!


        వాళ్ళు రాకుండా వుండి వుంటే నిలవనీరులాగా మార్పు లేకుండా వుండటం అనే అవలక్షణాన్ని ప్రపంచం నలుమూలలకీ వ్యాపార పరిధిని విస్తరించిన మన వణిక్ప్రముఖుల ద్వారా యెక్కడేం జరుగుతుందో తెలుసుకుని రావలసిన మార్పుని శాంతియుతంగానే సాధించుకునే వాళ్ళమేమో?!

        నా ఇంటిపేరుకో చరిత్ర వుంది.తమ దేశం మీదకి దండెత్తి వస్తున్న అపారమయిన శత్రుసైన్యాన్ని కేవలం నలుగురు వీరయువకులు వేనకనుంచి తమ సైన్యం వస్తున్న దాఖలా వినిపించేవరకూ అంటే కొన్ని గంటల సేపు నిలబెట్టి వెనకనించి బేరీనాదం విన్న తర్వాతనే కూలారు!అప్పటి వరకూ "బతకాలి,పోరాడాలి,శత్రువుని ముందుకు రానివ్వకూడదు" అనే సంకల్పం మాత్రమే వాళ్ళని నిలబెట్టింది.అప్పటి వాళ్ళ శౌర్యంతో పోలిస్తే "ఒక్కొక్కణ్ణి కాదు షేర్  ఖాన్ వందమందిని ఒకేసారి పంపించు" అనే ఇవ్వాల్టి సినిమా డైలాగు జోకులాగా వుంటుంది!ఆ నలుగురి పెర్లకి "నేని" కలిపి పెట్టిన పేర్లు నాలుగే వున్నాయి వెలమల్లో!నా పేరులో వున్న సూరన్నని తల్చుకుని వుత్తేజం పొందే నేను కురుమ గొల్లలు కొమరం భీం శౌర్యాన్ని తలుచుకోవడాన్ని యెందుకు వ్యతిరేకిస్తాను?మీలో వున్న గందరగోళం యేమిటో మీకు చూపించటానికే అన్నిసార్లు రెట్టించాను.అన్ని సార్లు రెట్టించినా మీరు మీ కులవారసత్వానికి అంత గట్టిగా అంటిపెట్టుకోవాలనుకునది బ్రాహ్మణులు బోధించడం వల్ల కాదు - మీ తాత ముత్తతల గొప్పదనం పట్ల మీకున్న మమకారానికీ బ్రాహ్మణులకీ యే సంబంధమూ లేదు,అవునా కాదా?గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి! అప్రస్తుత వీరవరేణ్యులూ ప్రాతస్మరణీయులూ కొన్ని కులాలకే పరిమితం కాలేదు,అన్ని కులాల్లోనూ పుట్టారు.ప్రాచీనతనీ సాంస్కృతిక నేపధ్యాన్నీ,మొత్తం సామాజిక జీవనంలో వాటికున్న ప్రాధాన్యతనీ లెక్కిస్తే అన్ని కులాలూ గొప్పవే!ఇప్పుడు మీరు పొరబడుతున్న యెక్కువ తక్కువలు సంస్కృతికి సంబంధించినవి కావు ఆర్ధికానికి సంబంధించినవి."కులములోన ఒక్క గుణవంతు డుండెనేని కులము వెలుగు" ననీ "కలిమి లేనివాని కులము దిగు" ననీ చెప్పిన వేమన్న యెప్పటివాడు?

        మిమ్మల్ని గట్టిగా కులాన్ని వొదులుకోమని రెట్టించినందుకో యేమో "పరిస్థితిని తమకనుకూలంగా వాడుకునే వాళ్లు,ఆదర్శాలు దంచేవాళ్ళు" అనే గుంపులో నన్నూ కలిపేశారు!మావాళ్ళు సముద్రంలో కాకిరెట్టల్లాగా అక్కడొకడూ ఇక్కడొకడూ వున్నారు.వున్న కొద్దిమంది కూడా కులం పేరుతో ముఠా రాజకీయాలు నడపకుండా కొంచెం సంసార పక్షంగానే వండిపోయారు,నేను మిమ్మల్నీ మీ పరిస్థితుల్నీ సొంతానికి వుపయోగించుకుని  బాగుపడటం కుదిరేనా పెట్టేనా?ముసుగులో గుద్దులాట లెందుకు,మీరు వర్కౌట్ అవుతుంది అంటున్న ప్లాను - ముందు దళితవాద అనుకూల ప్రభుత్వాన్ని సాధించుకుని ఆ ప్రభుత్వం సాయంతో అగ్రకుల పెత్తందార్లని కట్టడి చేస్తేనే కింది కులాలు పైకి రాగలుగుతాయని,అంతేనా?అదే మీ ప్లాను అయితే మావోఇష్టుల వల్లనే తప్ప మరోవిధంగా జరగదు!యెందుకంటే ఇలాంటి వ్యవహారం యేది నిక్కచ్చిగా జరగాలన్నా దానికి తగ్గట్టు మంచి ఫ్రెం వర్క్ వుండాలి,కదా?ఇప్పుడున్న ప్రభుత్వం నడిచే తీరు యెట్లా వుంది?ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్నే వుద్యోగుల జీతాలకీ,అభివ్ర్ధ్ధి ప్రణాళికలకీ,సంక్షేమ పధకాలకీ ఖర్చు చేస్తుంది.అందులో యెక్కువ వాటా ఇచ్చే వ్యాపారస్తులు యే కులం వాళ్లయినా యే ప్రాంతం వాళ్లయినా యే మతం వాళ్లయినా వాళ్ళకి యెటువంటి ఇబ్బందిని కలిగించడాని కయినా సాహసించదు!దానికి గొప్ప సాక్ష్యం తెలంగాణా చక్రవర్తి - రాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయ గంద గందరగంద - శ్రీశ్రీశ్రీ చంద్రశేకర వర్మ మహారాజులుం గారు చూపిస్తారు?! వారొకప్పుడు రామోజీ ఫిలిం సిటీని లచ్చ నాగళ్ళతో దున్నిస్తానని గర్జించేసరికి అక్కడున్న చదువుకున్న దద్దమ్మలు కొందరు పులకించిపోయారు. ఇప్పుడు ఆయన ఆ తావుకే వెళ్ళి ప్రశంసల వర్షం కురిపించేసరికి కక్కలేకా మింగలేకా సతమతమయ్యారు.ఆఖరికి కొంటె జర్నలిష్టు ఒకడు అడిగీతే తన్నినంత పని చేశాడు నేనెప్పుడన్నానని!అన్నవాడు మాటలో దొరుకుతాడు గానీ కరణం రాతలో దొరకడన్నంత తెలివైన మనిషి గాబట్టి "అదియును నీ పతిప్రాణంబు దక్క" అన్నంత నిక్కచ్చిగా "అది కబ్జా అయితేనే" అని మెలిక పెట్టి అని వుంటాడేమో గానీ నిజంగా దున్నితే చూద్దామని అనుకున్న వాణ్ణి యేవిధంగా అంచనా కట్టాలి?!విభజన ద్వారా వెనకటి రాష్ట్రం నుంచి యెంత రెవెన్యూ వస్తుంది,అది యెన్నేళ్ళ బద్జెట్టుకి సరిపోతుంది,ఫిలిం సిటీని దున్నించాక రెవెన్యూలో పడే బొక్కని యెట్లా యెక్కణ్ణించి తెచ్చుకోవాలి అనే ప్రశ్నలు వచ్చి వుండవు ఆ మదురదృశ్యం మనసులో పైశాచికానందాన్ని నింపుతున్నప్పుడు?!కేసీఆర్ మొహమాటం లేని నిక్కచ్చి మనిషి గాబట్టి ఫెదీమని తేల్చేశాడు గానీ లేకపోతే యెంతకాలం ఆ ఫాంటసీలో వుండిపోయేవాళ్ళో!దళిత అనుకూల ప్రభుత్వం కూడా అలాంటి ఫాంటసీయే అనిపిస్తుంది నాకు?!

        ఆ ఫాంటసీ మీకు రావడానికి నేను వూహిస్తున్న కారణం కమ్యునిజంలో వున్న వర్గ దోపిడీ అనే ముక్క మాత్రమె నచ్చడమూ,పూర్తిగా సాయుధపోరాటాన్ని కూడా ఒప్పేసుకుందామా అంటే రక్తపాతం పట్ల విముఖత్వం వుండటం వల్ల కావచ్చు!కానీ అదనపు విలువ నుంచి సొంత ఆస్తి రద్దు ,దాని నుంచి సాయుధ పోరాటం,దానితో వర్గరహిత సమాజం అనేవి ఒకదానితో ఒకటి లింకప్ అయి వున్నాయి గాబట్టి ఒక సహాన్ని మాత్రమే అక్కణ్ణించి తీసుకుని మిగతా సహాన్ని కులసమీకరణల పైరవీలతోనూ కలిపేస్తే కాళిదాసు కవిత్వం కొంత నా సొంత పైత్యం కొంత అన్నట్టు తయారవుతుందే తప్ప అందులో ఒరిజినాలిటీ లేదు!అసలు ఇవ్వాల్టి పరిస్థితికి ముఖ్యమయిన కారణాలు రెందు:ఇంగ్లీషు వాళ్ల ద్వారా బద్దలైన ఒక ఫ్రేం వర్కుకి సరైన ప్రత్యామ్నాయాన్ని తయారు చెయ్యటంలో ప్రభుత్వాలు ఫెయిలవ్వటం,కులవృత్తులు పోయి అన్ని కులాల వాళ్ళూ ఒకే పనికి పోటీ పడటం?!

        మీరు అనుకుంటున్నట్టుగా ఇప్పుదు అధికారంలో వున్న సొంతకులంవాళ్ళ అండతోనే వ్యాపారం విస్తరిస్తుందనేది నిజమేనా?స్మిత్తుగారు ఆర్ధికశాస్త్రం వ్యాపారం అనేదాన్ని యెట్లా నియంత్రించాలి అని  గవర్నమేంటులో వున్నవాళ్ళకి సలహా లివ్వడానికి రాశాడు!మార్క్సుగారు డబ్బు ఇటువైపునుంచి అటువైపుకి వెళ్ళడాన్ని మాత్రమే చూపించి భయపెట్టాడు గానీ వ్యాపారి వైపు నుంచి కస్టమరుకి వచ్చే సౌకర్యం గురించి అసలు ప్రస్తావించాడా?ఇవ్వాళ మార్కెట్లో వున్న ప్రతి వస్తువు వెనకా కొనుగోలు దారుకు ఒక సౌకర్యం తప్పకుండా వుంది - టూత్ పేష్టు,సబ్బు,ఫ్యాను,ప్రెషర్ కుక్కర్,మైరోవేవ్ ఓవెన్ - ఈ లిష్టు అనంతం!గ్రాహం బెల్ సరాసరి టెలిఫోను కనిపెట్టేద్దాం డబ్బుతో పొంగి పొర్లుదాం అనుకుని బయల్దేరలేదు,బధిరులకి సహాయంగా వుండాలనే సేవా దృక్పధంతో సొంత చిలుమే వొదిలించుకుంటున్న దశలో కాబోయే మామగారు వ్యాపారి బుర్రతో ఆలోచించి తను అన్నీ సమకూర్చి విషయం మార్కెట్టుని కుదిపేదిగా వుందని తెలియగానే పేటెంటుకి పరిగెత్తించి హడావిడి చేస్తే తన ఆవిష్కరనతో తను ప్రయోఅనం పొందగలిగాడు.తనొక్కడేనా,యే వ్యాపారి అయినా మనకి కొంత సౌకర్యం అందించి మనని సంతృప్తి పరచినాకనే దానికి ప్రతిగా తను లాభం తీసుకుంటున్నాడు గదా!దాన్ని పట్టించుకోకపోతేనే ఇప్పుడు వ్యాపారం చేసి పైకెళ్ళిన వాళ్లంతా దుర్మార్గులనీ వాళ్లని అణిచెయ్యదం తప్పు కాదనీ అనిపిస్తుంది?!

        శ్రామికులు రంగంలోకి దిగే ముందుగానే పెట్టుబడితో వ్యాపారి బయల్దేరతాడు.పెట్టుబడి సమకూర్చుకునే ముందుగానే అతను ఇవ్వాళ ప్రజలకి యే సౌకర్యం తక్కువగా వుందో చూసి దాన్ని తను మాత్రమే ఇవ్వగలడని నమ్మకం కలిగించుకుంటాడు!తను మార్కెట్లో యెక్కడ ప్రవెశించినా అక్కడ వున్న పోటీని తట్టుకుని తనకి చోటు దక్కించుకోవాలంటే తప్పనిసరిగా మిగతా వాళ్లకన్నా తను ప్రత్యెకమయిన సౌకర్యాన్నే కొనుగోలు దారుకి ఇవ్వాలి!వీటిల్లో యేవయినా ఒక కులం వాళ్ళు మాత్రమే చెయ్యగలిగిన పనులు వున్నాయా?ఒక పెద్ద కంపెనీలో రిస్కు లేకుండా బతుకుతున్న నలుగురు వుద్యోగులు "యెంతకాలం చేస్తాం ఇట్లా,వీళ్ళు చేస్తున్నది మనం చెయ్యలేమా" అని వుద్యోగాలకి రాజీనామా ఇచ్చి రేకుల షెడ్డులో మొదలు పెట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్తించారే వాళ్ళ దగ్గిర మొదట్లో వున్న పెట్టుబడి యెంత?

సీ||     తిండి తినుట, తిని పండుకొనుట, బోరు 
          కొడితె సైన్మలు షికార్ల కేగు

          ట - ఇవి కావు పనులంటే; బతుకు గడిచేందు
          కవసరమయిన పైకమును దెచ్చు

          పనులె పనులు ధరపైన మనుషులకు.
          తగు లాభ ఇచ్చెడి పనులు తప్ప

          ని సరిగ చేయాలి - హుషారైన 
          పనిని లాభకరంగ మల్చగలిగి


తే||    తే బహు శభాషు! ఒక్కడివే మరెవరి
       తోడు లేక ఏ పని చేయబోకు - నలుగు
       రి కుపయోగ పడ్తు నలుగురి నుపయుక్త
       పరుచుకుంటు బతకడమే మనిషికి విధి!

        తోపుడుబండి మీద బజ్జీలమ్ముకునే వాణ్ణి బీటు కానిస్టేబులు కూడా భయపెట్టగలడు,కానీ ఖండాంతరాలకు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యాధిపతి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా లెక్క చెయ్యడు!మీకూ మీ కులానికీ ఆ దమ్ము కావాలంటే వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ప్రవేశించి సత్తా చూపిస్తే మీరు ముందుకెళ్ళటానికి పదేళ్ళు చాలు!దళిత అనుకూల ప్రభుత్వం వచ్చాక గూడా అది చెయ్యకుండా మీ కులం పైకి లేవడం జరగదని స్టాంపు పేపరు మీద రాసివ్వడానికయినా నేను సిధ్ధం,జరుగుతుందని రాసివ్వడానికి మీరు సిధ్ధమా?!మీరు కూడా ఆ తెలంగాణా మేధావుల దోరణిలో వుంటే నా మాటలు ఖచ్చితంగా పిట్టకధల లాగానే అనిపిస్తాయి!


చెప్పండి,ఇవికూడా పిట్టకధలేనా?!

Wednesday, 14 January 2015

బ్లాగ్మిత్రు లందరికీ సంక్రాంతి శుభాకాక్షలు!

           సంక్రాంతి అంటే చెరుగ్గడలు,భోగిపళ్ళు,గంగిరెద్దులు,గొబ్బెమ్మలు,కోడిపందాలు - అన్నిట్నినీ మించి హుషారు!!వీటిల్లో ఇవ్వాళ చాలామటుకు కనపడకుండా పోయినాయి.కానీ హుషారు మాత్రం అలాగే వుండటం మాత్రం బాగుంది.కోడిపందాల్ని కూడా నిషేదించేసి వుంటే ఆ కాస్త హుషారు కూడా వుండేది కాదు!

         యెక్కడ లేదు హింస!రోజూ తెగే కోళ్ళ సంగతేంటి?బాక్సింగు పోటీలు వుండొచ్చా,గుర్రప్పందాలు వుండొచ్చా,కోడిపందాలు వుండకూడదా?హఠాత్తుగా మనోళ్ళకి ఇప్పుడే భూతదయ గుర్తుకొచ్చిందేంటో?కోడిపందేలు లేని సంక్రాంతి కూడా ఒక సంక్రాంతేనా?కత్తిగట్టని కోడిపందెమూ ఒక కోడిపందెమేనా?మనం కావాలని ట్రయినింగిచ్చి చంపుతున్నామా, రేసుల్లో పరిగెత్తలేని గుర్రాల్ని యజమానులే చంపడం కన్నా ఘోరమైనదేదయినా ఇక్కడ జరుగుతుందా?ఈ కాలానికి ప్రకృతి సిధ్ధంగా వాటిలో వచ్చే మార్పు అది - దాన్ని యెటూ నిషేధించలేం గదా!మిగతా రోజుల్లో అప్పటిదాకా మనం యెదుర్కొన్న గెలుపోటములకి సంబంధించిన వూద్రేకాల్ని బయటికి రప్పించి అంతటితో వొదిలెయ్యటానికి పెట్టిన వినోదం,దాన్ని కూడా భూతద్దం లోంచి చూసి అనవసరమయిన హడావిడి దేనికి!



               చిన్నప్పుడు నేనూ ఆ కోడిపందేల హడావిడి మధ్య పెరిగినవాణ్ణే!నేనూ ఒక పుంజుని పెంచాను.మా పెదనాన్న గారికి బాగా సరదా వుండతంతో వాళ్ళింట్లొనే చాలా కోళ్లని తెప్పించి కట్టేసి వుంచారు యెవరి కిష్తమైన దాన్న్ని వాళ్ళు కొనుక్కోవడానికి వీఎలుగా.వూరకే చూద్దామని వెళ్ళినా అందర్లోకి చిన్నవాణ్ణి గదా అని మొదటి సెలక్షన్ నాకే ఇచ్చారు.అన్నిట్నీ ఒకసారి అలా చూసేసి ఒక పుంజు వైపు వేలు చూపించగానే ఫక్కున నవ్వేస్తూ "బలే సెలక్షనురా నీది,దానికో కన్ను లేదు" అనేశారు!నేను "అది నాకెలా తెలుస్తుంది,కన్ను లేనిదాన్ని ఇక్కడెందుకుంచారు మరి" అని నసిగేసి ఇంకోదాన్ని యెన్నుకోబఓయేసరికి మళ్ళీ వాళ్ళే గుడ్డిదే అయినా ఇది కూడా పందేలు గెల్చిందే లెమ్మని సర్దేశారు.అప్పట్నించీ ఇక దాన్ని మేపడం అనే సరదా పని మొదలయింది.కొంతమంది సీరియస్ పందెగాళ్ళు భీభత్సమయిన మేతల్ని కూడా వేస్తారు.యమగోల గుర్తుందిగా!మా నాన్నగారికి అసలు ఆ పందేలంటేనే ఇష్తముండకపోవటం అది గుడ్డిదని తెలియటం - అటువైపు నుంచి యెంకరేజిమెంటు లేదు.కానీ దాన్ని కట్టెయ్యటానికి తాదు మాత్రం సంపాదించా స్పెషలైనది.దాని రకం  "కెక్క్కిరాయి", కన్ను లేదు గాబట్టి మానోట్లో పడి "గుడ్డి కెక్కిరాయి" అయింది.మొత్తం జాతులైతే చాలా వున్నాయి - "పూలా","నెమిలి","డేగ","కాకిడేగ" అని!

               అసలు పందెం జరిగింది మా నాయనమ్మ గారి పేరు మీదున్న మా మామిడి తోటలొనే.నాలుగు చెట్ల మధ్యన చాలా ఖాళీ వుంటుంది కదా,అక్కడ మాంచి జబర్దస్తుగా దడి కట్టారు నాలుగు వైపులా దార్లు వొద్లి.అన్ని కోళ్ళనీ ఒకే వైపు నుంచి దించరు - కోళ్ళ జంటని బట్టి దిక్కుని మారుస్తారు.యెన్ని వొళ్ళ వాళ్ళు చేరినా ఆటోమాటిగ్గా రెండు పక్షాలుగా విడిపోతారు.మొదటి కోడిని యెవరు దించాలి,ఆ కోడికి దీటుగా లెక్క ప్రకారం యే జాతిని దించాలి అనే ప్రతి దానికీ లెక్కలుంటాయి.నాకు అన్నయ్య వరస అయ్యే పెద్దమనిషికి అన్ని వూళ్లలోనూ అందరూ మధ్యవర్తిగా వొప్పుకునేటంత నాలెడ్జి వుంది కుక్కుటశాస్త్రంలో!పెద్దమనుషులు కూర్చోవడానికి చాపలు యేర్పాటు చేశారు,మిగిలిన వాళ్ళు నించోవడమే!అసలు హుషారు పెరిగితే కూర్చోవడమే కష్తం గదా - అందుకే వాళ్ళూ చాపల కోసం పట్టించుకోలేదు.ఆ పై పందేల భాష నాకస్సలు అర్ధం కాలేదు - "కాకిడేగ అయిదెచ్చు,కాకి నెమిలి పదెచ్చు" అనే మాటలు వింతగా వుందటం వాల్ల గుర్తున్నాయి గానీ.మా పనికుర్రాడికీ సరదాగానే వుంది గాబట్టి మా పుంజుని వాడే తీసుకొచ్చాడు!మేమంతా వేరే వూళ్ల నుంచి కూడా వచ్చిన చుట్టపక్కాల జనంతో కలిసి బండిలో వెళ్తే తను సైకిలు మీద అతి జాగ్రత్తగా ఇంకో మనిషిని పట్టుకోమని వెనక కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడు.అతి జాగ్రత్తగా యెందుకంటే పుంజు బెదరకూదదు మూడ్ డిస్టర్బ్ అవ్వకూదదు మరి!

                  ఈ హడావిడి అంతా మధ్యాన్నం వరకూ బాగానే జరిగింది గానీ ఇప్పట్లాగే పర్మిషన్లు లేని యవ్వారం కావడంతో పోలీసులు వొచ్చిపడ్డారు!అప్పటిదాకా కోలాహలంగా వున్న వాతావరణం కాస్తా గందరగోళంగా మారింది.అంతమంది జనం చేరితే చిన్నా చితకా వ్యాపారాలు కూడా వుంటాయిగా - మొత్తం కకావికలై పోయారు.కుర్రాళ్ళం మేము ముళ్ళకంచెల్ని కూడా చెంగున దూకటం ఆశ్చర్యం లేదు గానీ పెద్దవాళ్ళు గూడా మాతోపాటుగా దూకేశారు ముళ్ళకంచెల్ని!ఇంతకీ వడ్లగింజలో బియ్యపు గింజలాగా పట్టుకున్న వాళ్లనీ పోలీసులు యేమీ చెయ్యలేదు.అక్కడ పట్టుబడిన వాళ్ళంతా పెద్ద పెద్ద గండభేరుండాలు గదా ఓ గంట వుంచి డబ్బు కట్టించుకుని వొదిలేశారు.ఈ సందట్లో ముందే ఫలానా కోడి గట్టిది అని తెలియడంతో మంచి కోళ్ళని చంకనెత్తుకు పోయే సీన్లు కూడా జరిగినయ్.మా పని కుర్రాడు యెలర్టుగా వుండి ముందు అటే పోయి దాన్ని చంకనేసుకునాకనే బయట పడ్డాడు గాబట్టి నా పుంజు దక్కింది,తను వెళ్తుండగానే యెవడో తాడు విప్పేస్తున్నాడంట!

                డబ్బు కట్టేటప్పుడే ఒప్పందం కుదుర్చుకున్నారు గాబోలు తర్వాత పోలీసుల భయం లేకుండా జరిగినాయి గానీ నాకు మాత్రం పర్మిషను ఇవ్వలేదు ఇంట్లో!మా పనికుర్రాడే తీసుకెళ్ళి వేశాడు.ఒక కన్ను లేకపోయినా మా "గుడ్డి కెక్కిరాయి" తనకన్నా భారీగా వున్న పుంజునే గెలుకొచ్చేసింది!అప్పట్నించీ చాలా పందేలు గెల్చింది,కొంతమంది వాళ్ళు ఆ నెలరఓజులూ వాళ్ళే పెంచి పందెంలో దించి పందగైపోయాక మళ్ళీ తిరిగి ఇచ్చేసే పధ్ధతి కూడా నడిచింది!దానిమీద కాసిన పందేలతో చాలా మందికి వుపయోగపడింది.కానీ మొదటి పందెం రోజున మాత్రం మా ఇంట్లోనే చనువుగా తిరిగే ఒకతను "దాని మీద పందెం కాయొద్దు,దానికో కన్ను లేదు,మా చిన్నబాబు సరదా పడుతున్నాదని దించాం" అని చెప్పి ఆపితే అది కాస్తా గెల్చాక యమతిట్లు తిట్టారంట.

                   నేను కొంచెం పెద్దయి వాటికి దూరంగా వుండిపోవటంతో వేరేవాళ్ళకి అమ్మేశారు కూడా.నాకూ దానికీ వున్న విచిత్రమయిన అనుబంధం యేమిటో తెలుసా - అది గెల్చిన పందేలు యేవీ నేను చూడలేదు,నేను చూసిన పందెంలో అది వోడిపోయింది!చాలా కాలం తర్వాత మళ్ళీ కొత్తగా ఒకసారి కోడిపందేలకి వెళ్తే అక్కడ మేయిన్ డేరాలో కాకుండా బయట వేసే పక్క పందేల్లో వొదిలారు.అనుకోకుండా వేళ్ళి నేనూ మా పనికుర్రాడూ ఇద్దరం గుర్తు పట్టాం.నేను చూడ్డం వల్లనే అది ఓడిందా,అది గెల్చుకొచ్చిన పుంజుల్లాగే ఇవ్వళ్టితో దీని బతుకూ ముగిసిపోతుంది గదా అని కొంచెం సేపు మనసు పీకింది గానీ అప్పటికే అది ముసలిదయింది గదా యెంతకాలం పోట్లాడగలుగుతుంది లెమ్మని సరిపెట్టుకున్నా!

         మాకోడి నాకు చాలా జీబితసత్యాల్ని చెప్పింది.మనుషుల్లో అయినా అంతే గదా,సినిమా ఫీల్డులో,రాజకీయాల్లో,క్రీడల్లో,వ్యాపారంలో - యెక్కడయినా గెల్చినంత వరకే నెత్తిన పెట్టుకుంటారు, ఓడిపోయిన వాణ్ణి వేష్టు క్యాందిడేటు కింద పక్కకి పెట్టేస్తారు!గెల్చామా ఓడామా అన్నది కాదు కొశ్చెను ఫీల్డులో నిలబడ్డామా లేదా అనేది పాయింటు!చేస్తున్నది కరెక్టా కాదా అన్నది తేల్చుకుని కరెక్టనిపిస్తే ఆ "పందెంకోడి" లాగే చావుకైనా తెగించి పోరాడు!


అదే సంక్రాంతి స్పూర్తి!!

Tuesday, 13 January 2015

ఇదండీ కమ్యునిజం చరిత్ర!

          ఈ మధ్యనే కమ్యునిష్టు పార్టీలో కాస్త నోరున్న ఒక ముగ్గుబుట్ట ముసిల్ది బోరు కొట్టి "ఇదండీ భారతం" అని హిందూత్వాన్ని వెక్కిరిస్తూ ఒక పుస్తకం రాసిందంట - యెవడు కొంటాట్ట!"బలే మంచి చౌకబేరము" అని యెగురుకుంటూ కొనుక్కెళ్తారనో యేమో జేవలం వంద రూపయలేనట పుస్తకం ఖరీదు?మరి "ధర తక్కువ బంగారానికి" అని నవ్వుకుంటూ కొనకుండా వెళ్ళిపోతేనో!లోయరు క్లాసు వాళ్ళు కూడా యేదైనా హోటల్లో వుండాలనుకుంటే డీలక్సు రూము లడిగే రోజుల్లో ఈ చీపు ట్రిక్కు నిజంగా పనిచేస్తుందా?భారతం చదివి అర్ధం చేసుకోగలిగిన హిందువుకి "ఇదండీ భారతం" అని ఈవిడ చెప్తే తప్ప తెలియదా?కాకపోతే అటూ ఇటూ వూగిసలాడేవాళ్ళు, సరే అంత నమ్మబుధ్ధయ్యేటట్టు చెప్తుంది గదా అనే లాజికల్ అమాయకత్వం వున్నవాళ్ళు నమ్ముతారేమో?అదీ యెంత కాలం!అసలు తను తన సిధ్ధాంతం గురించి మా కమ్యునిజంలో వున్న మంచి ఇది అని చెప్పి జనాలని మెప్పిస్తూ పాజిటివ్ ప్రచారం చేసుకోవాలి గానీ వాళ్లలోనూ వీళ్ళలోనూ తప్పులు పట్టే నెగిటివ్ ప్రచారం దేనికి? అంతగా కావాలనుకుంటే మన ముసలాళ్ళు కృష్ణా రామా అనుకున్నట్ట్టు - మరీ దురద పుడీతే మార్క్సు సహస్ర నామావళి.లెనిన్ అష్టోతరం,యెంగెల్సు దీక్షలతో కాలం గదపక భారతం మీదకి వెళ్ళిందేమిటో ఈ వయస్సులో?అదీ వీళ్ళ యాభయ్యేళ్ళ నిర్వాకం వల్లా తమ అతి మంచితనం వల్లా జరిగిన నష్టమేమిటో తెలిసి హిందువులు కళ్ళు తెరిచాక ఇప్పుడు అసలు ఆ పుస్తకం యెంత మంది కొంటారో గూడా తెలియదు.ఒక సంవత్సరం తర్వాత ఆ పుస్తకం "వేణువు" బ్లాగులో పాత పోష్టులో వార్తగా తప్ప ఇంకెక్కడా కనపడదు,పాపం యెంత కష్టపడి రాసిందో?!

          నేనయితే అస్సలు కొనను,చదవను,పట్టించుకోను - విషవృక్షం కొన్ని పార్టులు అదీ నాస్తికుడిగా వున్నప్పుడే అసహ్యించుకున్నాను.అసలు ఇట్టా రామాయణాన్ని విమర్సిస్తూ ఒక పుస్తకం రాస్తున్నానని చెప్తే ఈ శీలమూ లైంగిక స్వచ్చతా లాంటి వాటికి దూరంగా వున్న శ్రీశ్రీయే అనవసరంగా రామాయణాన్నెందుకు కెలకడం అన్నా వినలేదట!ఇప్పటి దాకా నేహ్రూ మార్కు సెక్యులరిజాన్ని పైన చెప్పిన కమ్యునిష్టోళ్లతో సహా ముల్లాలు చెప్పింది చచ్చినట్టు వినే సాయిబులు పట్టించుకోకపోయినా పోనీలెమ్మని హిందువులే ఆ పుచ్చొంకాయ్ సెక్యులరిజానికి కూసింత విలువిచ్చారు!ఇన్నాళ్ళూ ఆ సెక్యులరిజం ఇట్టా ఆన్నా బతికి వుందంటే హిందువుల పుణ్యమే!కానీ తిరిగే కాలూ తిట్టే నోరూ వూరుకోవుగా?!

          తను రాసిన పుస్తకం మనం చదివే బదులు తను "ఇదండీ భారతం" అని రాసినట్టు మనం "ఇదండీ కమ్యునిజం" అని నీవు నేర్పిన విద్యయే నీరజాక్షీ అంటే యెష్లా వుంచుంది?మనము కూడా మార్క్సిష్టు సిధ్ధాంతాన్ని హిందూ ధర్మం ప్రకారం విమర్శించి వెక్కిరించ వచ్చునా?చూద్దాం, మన సత్తా యేంటో చూపిద్దాం!చిన్నప్పుడు మాఫ్రెండు వాళ్ళింట్లో క్రీస్టియన్లు బైబులు పుస్తకాల్ని ఫ్రీగా పంచిపెట్టేటట్టు రాదుగ వాళ్ళు  ప్రచురించి వొదిలినటువంటి "గతి తార్కిక భౌతిక వాదం","లెనిన్ కావ్యం","నీలం నోటు బుక్కు" లాంటి ధర తక్కువ బంగారాల్ని చాలా కక్కుర్తిగా చదివాను.ఇప్పటికీ చాలా భాగాలు గట్టిగానే గుర్తున్నాయి.అన్నట్టు "మార్కుసు మతం మానవాళికి మత్తుమందన్నాడు" - కాబట్టి మతాన్ని ఈ భూమ్మీద నించి తరిమెయ్యనిదే జనం బాగుపడరు(మన్లో మన మాట ఒక్క హిందూ మతం మీదనే వీళ్ళ యేడుపుగొట్టు వులిపికట్టె దాడి అంతా? మిగతా మతాల్ని గురించి చాలా ప్రేమగా మాట్లాదతారు!) అని వీరంగాలు వేస్తున్నారే ఆ కొటేషను ఫుల్లుగా చదివా!

          మార్క్సు మొత్తంగా అన్న మాటలివి,"మతం అణగారిన ప్రజల నిట్టూర్పు.ఈ నిర్దాక్షిణ్య ప్రపంచానికి అది హృదయం.ఆత్మలేని ప్రపంచంలో అది ఆత్మ.ప్రజల పాలిటి అది మత్తుమందు." ఇందులో మతం యెందువల్ల మనిషికి అనుసరణీయమవుతున్నదో తెలిసిన మనిషికి వుండే సహృదయత వుందే తప్ప మతాన్ని ఈ ప్రపంచం నుంచి తుదిచిపెట్టేదామనే వెర్ర్రి ఆవేశం వుందా!చాలా కాలం నుంచీ చివరి వాక్యాన్ని మాత్రమే జనానికి చెప్తున్న వాళ్ళు మొత్తం కొటేషను యే అర్ధాన్నిస్తున్నదో తెలియకే అట్లా చేశారా?కాదు, అందులో కమ్యునిష్తుల్లో వున్న నాస్తికులు ప్రపంచాన్నంతా గానీ కుదరకపోతే పార్టీ సభ్యుల్నయినా గానీ తమలాగే తయారు చేసి చూసుకోవాలనే దుగ్ధతో చేశారు!విప్లవాన్ని రహస్యకుట్రల్తో విజయవంతం చెయ్యాలనే వాళ్ళ దురాశే వాళ్ళని ఈ భూమ్మీద నుంచి ఖాళీ చెయ్యబోతున్నది.యేవరి ఖర్మ కెవరు బాధ్యులు?!

          అసలు మతాన్ని గుడ్డిగా నమ్ముతున్న జనాన్ని మతం నుంచి దూరంగా నడిపించాలంటే యేమి చెయ్యాలి?మార్క్సు గారి కొటేషను మొత్తం సరిగ్గా అర్ధమయితే వాళ్ళ మీద అనుకంప చూపించాలి.తమ ప్రాబల్యం లేని చోట వున్నాం గాబట్టి సున్నితంగానే చెప్పి నయగారంగా వొప్పించాలి,క్రీస్తియన్లని చూడండి, తిట్టినా సరే వుడుక్కోరు - మా యేసు క్షమించమన్నాడు అనే పాయింటు మీద గట్టిగా నిలబడి మన్ని క్షమించేస్తారు? అదే వాళ్ళకి ప్లస్ పాయింటు!అదే కమ్యునిష్టులు - ముఖ్యంగా ఈ మురంనా లాంటివాళ్ళు రివర్సు గేర్లో వెళ్ళి మీరు వెధవలు,దద్దమ్మలు,మీకేమీ తెలీదు అనే టైపులో రెచ్చిపోతే ఇలాగే యెదురు తంతుంది రిజల్టు!సముద్రంలో కాకిరెట్ట లాగా అక్కడో వోటూ ఇక్కడో వోటుతో దేశమంతటా వుండి కూడా ఆ కాంగ్రెసు లాంటి బూర్జువా పార్టీని అంటకాగుతూ తుమ్మితే వూడే ముక్కు పరిస్థితిలో యెలాగో ఒకలా నెట్టుకొస్తుంటే ఈ రాంగు టైములో ఆ పుస్తకం రాసి పబ్లిష్ చెయ్యడం దేనికి - మూలిగే నక్కమీద తాటిపండు వేసినట్టు!


          ఇవ్వాళ దేశంలో వీస్తున్న మోదీ హవా కాకతాళీయమూ కాదు పాలపొంగూ కాదు!"వేలాది మందిలో ఒక్క రుద్యమింతురు,వుద్యమించిన వేలాదిమందిలో ఒక్కడు శ్రధ్ధాళు వగును,వేలాదిమంది శ్రధ్ధాళువులలో ఒక్కనికి జ్ఞానం వికసించును,అట్ట్టి వేలాది మంది జ్ఞానులలో ఒక్కడు నన్ను చూడగలడు" అనే పధ్ధతిలో యేర్పడిన పిరమిడ్ అది - శిఖరాన కనబడే మోదీ కేవలం ఆ ఆవేశానికి మూర్తిమత్వం మాత్రమే. యాభయ్యేళ్ళుగా నెహ్రూ మార్కు సెక్యులరిజం ఈ మాత్రమయినా బతికి బట్ట గట్టిందంటే అది హిందువులు ఆచరించడం వల్లనే అని తెలుసుకోకుండా వాళ్లనే మతతత్వవాదులు అనే పేరుతో మళ్ళీ మళ్ళీ చీకాకు పరుస్తుంటే ఇంత కాలానికి సహనం నశించి హిందువుల్లో వుదారులైన వాళ్ళు కూడా మోదీని సమర్ధించడం తమ నిర్వాకం వల్లనే నని వాళ్ళెప్పటికీ తెలుసుకోలేరు!యెందుకంటే దశాబ్దాని కొకసారి "చారిత్రక తప్పిదాల క్షమాపణ తీర్మానాల"తో కాలక్షేపమూ పుస్తకావిషరణ మీటింగులూ ఇక ముందు పనిచెయ్యకపోవచ్చు, ఒకేసారి యెలిజీలు సిధ్ధం చేసుకోవాల్సిన సమయం వచ్చింది?

          మోదీ హవానే కాదు భాజపా వుత్ధానాన్ని కూడా యెవ్వరూ తక్కువ అంచనా వెయ్యడానికి వీల్లేదు.విశ్వ హిందూ పరిషత్ ద్వారా గానీ ఆర్.యెస్.యెస్. కార్యకర్తల ద్వారా గానీ,భజరంగ్ దళ్ ద్వారా గానీ లేక అన్నిటితో క్షేత్రస్థాయిలో గాలి తమ కనుకూలంగా వుందనే విషయం గట్టిగా తెలిశాకనే "కమలమే సకలం కావాలి" అనే మాట అంత ధీమాగా చెప్తూ వుండీ వుండవచ్చు!ఇదంతా కాంగెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ పెద్ద పుడింగిల్లాగా తమ కంటే ఈ దేశప్రజల గురించి మరెవరికీ తెలియదనే కన్నూ మిన్నూ గానని అహంతో చెలరేగిపోవదం వల్ల హిందువులకి కాలగూడని చోట కాలిపోవడం వల్ల జరిగింది?!అటు చూస్తే వీళ్ళు నెత్తిన పెట్టుకు వూరేగిన సూడోసెక్యులరిజము యొక్క అసలు స్వరూపం ముస్లిములలో సంసారపక్షంగా వుంటూ సుఖంగా బతకాలనుకున్న వాళ్ళందరికీ కుంకుడు కాయ రసం లాగా కళ్ళు తెరిపించింది.ఒకసారి కళ్ళు తెరిచిన వాళ్ళు మళ్ళీ కళ్ళు మూస్తే అది వాళ్ళ ఖర్మ గానీ ఇప్పట్లో ఆ పరిస్థితి రాదనే అనిపిస్తుంది!వాళ్ళకీ బాగా కాలిందనేది యే మోదీని యెక్కడయితే గోద్రా అల్లర్ల పేరుతో చిల్లర వేషాలు వేసి దెబ్బ తీద్దామనుకున్నారో అక్కడే ముస్లిములు కూడా మోదీనే గెలిపించినప్పుడే తెలుసుకుని జాగ్రత్త పడివుంటే గుడ్డిలోమెల్లగానన్నా వుండేది కాంగ్రెసు పరిస్థితి.

          1818 మే 5న పుట్టి 1883 మార్చి 14న గిట్టిన కార్ల్ మార్క్స్ అనే పేరు గల ఈ జర్మన్ మేధావి రాసిన రెండు పుస్తకాలు -  1848లొ రాసిన కమ్యునిష్టు మానిఫెస్టో,1867లో మొదలు పెట్టి 1894లో పూర్తి చేసిన బృహద్గ్రంధం దాస్ క్యాపిటల్ -  ప్రపంచంలో వున్న ప్రతి మేధావీ తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన ఒక విప్లవాత్మమైన సిధ్ధాంతాన్ని పరిచయం చేశాయి.నేను మొదట్లో "మార్క్సిస్ట్ యెకానమీ" అనే మాటని చూసి తను ఒక కొత్త ఆర్ధికశాస్త్రాన్ని రాశాడని అనుకున్నాను,కానీ స్మిత్సోనియన్ ఆర్ధిక విధానాలని వొప్పుకుంటూనే అందులో వున్న లోపాల్ని సరిచేయ్యడానికి కొన్ని సూత్రీకరణలు మాత్రమే చేశాడు!ఆర్ధికశాస్త్రానికి సంబంధించి ఇతను కొత్తగా కనిపెట్టిన విషయం "అదనపు విలువ" మాత్రమే.ఆర్ధికాంశాలలో అదనపు విలువ అనేది కార్మికుల శ్రమతోనే సాధ్యం గాబట్టి అది కార్మికులకే చెందాలని ఇతడి వాదన.ఇతని అసలైన ప్రతిభ చరిత్రని వ్యాఖ్యానించడం.యేది చరిత్ర గమనాన్ని నిర్దేశిస్తుంది?సామ్రాజ్యాల వుత్ధాన పతనాలకి కారణ మేమిటి?అవి హఠాత్తుగా జరిగినవా లేక వాటి వెనుక యేదయినా చైన్ రియాక్షను లాంటిది యేదయినా వుందా?ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యే వారికి ఇతని విశ్లేషణలు కొత్తదారులు చూపించాయి.ఆర్ధికశాస్త్ర విశ్లేషణ అంతా స్మిత్సోనియన్ భావజాలానికి భిన్నంగా లేదు గాబట్టి మనం వుపేక్షించవచ్చు గానీ చరిత్రని అర్ధం చేసుకోవడానికి ఇతను ఇచ్చిన పనిముట్లు మాత్రం ఇప్పటికీ నిక్కచ్చిగానే వున్నాయి!

          ఇక్కడ ఒక విశేషం వుంది! యే హెగేలియన్ భావవాదాన్ని తిరగేసి మార్క్సు చారిత్రక భౌతిక వాదాన్ని  నిర్వచించాడో ఆ భావజాలాన్ని పోలిన సాంఖ్యవాదం హెగెల్ కన్నా చాలా ముందే భారత దేశపు తాత్విక చింతనలో ప్రముఖ స్థానంలో వుంది!హెగెలియన్ భావవాదం లోనూ సాంఖ్యవాదం లోనూ చాలా దగ్గిర పోలికలు వున్నాయి.హెగెల్ చరిత్రలో వచ్చే దశల్ని మూడు అంశాలతో వర్ణించాడు - మొదట ఒక థీసిస్ వుంటుంది,ప్రతి థీసిస్ కీ  కాలక్రమంలో ఆంటిథీసిస్ యేర్పడి ఈ రెంటి సంఘర్షణ వల్ల ఒక సింథీసిస్ యేర్పడుతుంది.ఈ సింథీసిస్ అనుకోకుండా మళ్ళీ థీసిస్ గా మారుతుంది.సరిగ్గా ఇలాంటి పోలికనే గుర్తు చేస్తూ మొదట ఈ ప్రపంచగమనం ప్రకృతి పురుషుల మధ్య జరిగే సంయోగం వల్ల జరుగుతుందనే నిరీశ్వర సాంఖ్యం భారత దేశంలో వచ్చింది.అక్కడ మార్క్సు భావవాదం పునాదితో వున్న దాన్ని తిరగేసి భౌతికవాదానికి మళ్ళిస్తే ఇక్కడ నిరీశ్వర సాంఖ్యంలోని పురుషుణ్ణి కాస్తా పరమ పురుషుడు అని తిప్పేసి సేశ్వర సాంఖ్యంగా మార్చారు!

          తీరా చూస్తే ప్రపంచ చరిత్రలో ఇదివరకే జరిగిన విషయాల్ని యెందుకు జరిగాయో చెప్పడం వరకూ బాగానే వుంది కానీ అత్యుత్సాహంతో కొన్ని ప్రిడిక్షన్స్ కూడా చేశాడు - మొట్టమొదట కమ్యూనిజం అమేరికా లాంటి పారిశ్రామికంగా వ్యాపారపరంగా యెదిగి తను దోపిడీ అని నిర్వచించిన వ్యవహారం దిట్టంగా నడుస్తున్న చోట వచ్చే అవకాశం వందన్నాడు.రష్యా లాంటి పారిశ్రామికంగా వెనకబడీనవి అంటే దోపిడీ అనేది ప్రజలకి అనుభవంలోకి రాని దేశాల్లో వచ్చే అవకాశం లేదన్నాడు.తను రాదు అని చెప్పిన చోట రానూ వచ్చింది కరిమింగిన వెలగపండు మాదిరి పోనూ పోయింది!తను వస్తుంది అని చెప్పిన చోట ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు కూడా కనపడటం లేదు?పైగా నిన్నటి రోజున చార్లీ చాప్లిన్ అనే హాస్యగాడు పొరపాటున "కామ్రేడ్" అనే మాటని వాడినందుకు నానా యాగీ చేసి అమరికా నుంచి గెంటేస్తే స్విట్జర్లాండులో బతకాల్సి వచ్చింది!వారు అశాస్త్రీయమైనవి అని వెక్కిరించే నోస్త్రదామస్ జోస్యాలూ బ్రహ్మంగారి కాలజ్ఞానాలూ కూడా నిజమవుతూ పూర్తి శాస్త్రీయమైన మార్క్సు గారి ప్రిడిక్షన్లు యెందుకు అబధ్ధాలైనాయి?

          అసలు సిధ్ధాంతం లోని మొట్టమొదటి మెలిక మానవుడు వస్తుగత వాది కాబట్టి తన ప్రయోజనాన్నే ఆశిస్తాడు అనేది ఒప్పుకుని స్మిత్తు గారి ఆర్ధిక శాస్త్రాన్ని కూడా కాదనకుండా వొప్పేసుకుని కూడా దానికి విరుధ్ధమయిన వర్గరహిత సమాజాన్ని సాధించడం కోసం "స్వంత ఆస్తి రద్దు" అనేదాన్ని ప్రతిపాదించటం!వస్తుగత వాది అయిన మనిషి ఆ స్వంత ఆస్తి రద్దుకి తనంతట తను వొప్పుకోడు,వొదులుకున్న దానికి అధికంగా ప్రయోజనం వుంటుందంటేనే తప్ప అరిచి గింజుకున్నా వొప్పుకోడు.దానికి విరుగుడుగానే "సాయుధ పోరాటం" అనేదాన్ని ప్రతిపాదించాడు?దాని ఫలితమే మీరు ఇక్కడ చూస్తున్న చార్టు!



          ఒక్కొక్క నెత్తురు బొట్టూ ఆ పెద్దమనిషి పాదాల కింద పడి నలిగి చచ్చిన మిలియన్ మందికి సమానం!ఇప్పటి వరకూ మనం హిట్లరే మహా క్రూరుడు అనే భ్రమలో వున్నాం.ఇవన్నీ కమ్యునిష్టులు కూడా కాదనలేని ఖచ్చితమైన లెక్కలు!ఆ వర్గ రహిత సమాజ స్రష్టలు చంపింది యుధ్ధాలు చేసి విదేశీయుల్ని కాదు స్వదేశీయుల్నే అని అర్ధం చేసుకుంటే వారు చెప్పే భవిష్యదుజ్వల సువర్లోకం యెలా వుంటుందో ఇక్కడ దానికోసం ఆశపడుతున్నవారు తెలుసుకోగలుతారు!వారంతా పెట్టుబడి దారులూ సమసమాజాన్ని వ్యతిరేకించిన ద్రోహులు అని అంటే అనవచ్చు గాక అక్కడ అంతమంది చావడానికి కూడా సిధ్ధపడి వ్యతిరేకించిన వ్యవస్థని ఇక్కడ మనం ఆహ్వానించడంలో అర్ధమేమయినా వుందా?కొందరు శాడిష్టులు మేం పుణ్యాత్ములం, "మా నాన్న చచ్చే వాడిగా కాకుండా చంపేవాడుగా వుండాలని నాకీ పేరు పెట్టాడు" అని టెక్కు చూపించి చచ్చేవాళ్ళలో వుండము గదా అని సంబరపడి సమర్ధించవచ్చు!కానీ భీభత్సం మొదలయిన తర్వాత ఆ గ్యారెంటీ వుండదు.స్టాలిను గారి విజృంభణకి జడిసి దేశం వొదిలిపోయిన ట్రాట్స్కీ గారు కూడా మొదట్లో ఆయనకి అనుంగు సహచరుడే - అతను అధ్యక్ష పదవికి యెదగడానికి సహాయ పడ్డవాడే?

          స్మిత్తుగారి లాగానే మానవుడు వస్తుగత వాది అని తను కూడా వొప్పుకున్నాడు.అయితే, ఆ స్మిత్తుగారి ఆర్ధిక సూత్రాలు చలనంలో "అదనపు విలువ"ని పుట్టిస్తున్నాయని కనుక్కున్నాడు - అంతవరకూ బాగానే వుంది!కానీ దాన్ని పరిహరించే కొత్త ఆర్ధిక శాస్త్రాన్ని రచించలేదు?పైగా ఈ అదనపు విలువ కార్మికుడు రంగప్రవేశం చేసాకనే వొచ్చింది గాబట్టి దీనిమీద సర్వహక్కులూ కార్మికులవే అని తీర్మానించాడు.ఈ అదనపు విలువని శ్రామికులకి మాత్రమే దఖలు పర్చే "శ్రామిక వర్గ నియంతృత్వం" అనే మరో జీడిపాకాన్ని మొదటి సూత్రం నుంచి లాగాడు.వస్తుగత వాది అయిన పెట్టుబడిదారు నయానా భాయానా లొంగి తనంతట తను ఈ అదనపు విలువని కార్మికులకి ఇవ్వడు గాబట్టి "సాయుధ పోరాటం" ద్వారానే ప్రపంచ కార్మికు లంతా యేకమై సాధించాలని నువ్వులద్ది మనం చిన్నప్పుడు ఇష్టంగా తిన్న పాకంజీడి లాంటి ఒక ఆకర్షణీయమైన వంటకాన్ని తయారు చేశాడు.ఈ వంకం తింటే యేమొస్తుంది అనేదానికి అందరు వంటవాళ్ళ లాగే "వర్గ రహిత సమాజం" అని దాని గురించి చవులూరించేలా యెన్నో పిట్టకధలు చెప్పాడు.

          వెక్కిరింతగా అనలేదు నేను పిట్టకధలని,నిజంగానే వర్గరహిత సమాజం గురించి ఆయనా మిగతా మార్క్సిష్టులూ చెప్పే ప్రతి మాటా మిగతా మతాలకి సంబంధించిన పూజారి వర్గం చెప్పే "స్వర్గం" అనే అందమయిన ప్రాక్కల్పన లాగే వుంటుంది తప్ప శాస్త్రీయమయిన మాట ఒక్కటి లేదు?! పెట్టుబడి శ్రమా రెంటికీ 50-50 ప్రాధాన్యత ఇస్తే కొంత న్యాయంగా వుండేది కానీ పెట్టుబడి నథింగ్ శ్రమే యెవ్విరీథింగ్ అనడం ముఖ్యమయిన లోపం!వర్గరహిత సమాజం యేర్పడినాక రాజ్యం అంతరించి పోతుందనే కంటి తుడుపు వ్యాఖ్యతో శ్రామిక వర్గ నియంతృత్వం నిక్కచ్చిగా అమలవుతూ శాశ్వతంగా కొనసాగే విధంగా రాజ్యం యేమి చేయాలనేది చెప్పకపోవటం అసలైన మూర్ఖత్వం?!వస్తుగత వాది అయిన మనిషిని వర్గరహిత సమాజపు నియమాలకి పట్టి వుంచాల్సిన అవసరం లేదనుకున్నాడా?హెగెల్ చెప్పిన దాన్ని తిరగేసినా యెలా చేసినా మార్క్సిష్టు కార్యాచరణ అంటే గతితార్కికంగా పుట్టుకొచ్చే వైరుధ్యాల్ని మనం కోరుకున్న దిశకి నదిచేలా సమన్వయం చెయ్యడం అయినప్పుడు వర్గ రహిత సమాజంలో కూడా మిత్రవైరుధ్యాల విషయంలో నైనా ఆ అవసరం వుంటుంది కదా?వర్గరహిత సమాజం ఆవిర్భవించెయ్యగానే మానవుడిలోని వస్తుగత వాంఛ హఠాత్తుగా అదృశ్యమైపోతుందా?అసలు ఒక ప్రాంతంలో వర్గరహిత సమాజం ఆవిర్భవించిందని యెలా గుర్తు పట్టాలి?అసలు లక్ష్యాన్ని సరిగా నిర్వచించకుండా పిట్టకధలతో సరిపెట్టేస్తే కొత్తగా ఈ సిధ్ధాంతాన్ని ఆచరించాలనుకునే తెలివైన వాళ్ళకి లక్ష్యం గందరగోళంగా వుండదా!అసలు సిధ్ధాంతంలోనే ఇన్ని గందరగోళాలు వుంటే వాటిని అనుసరించేవాళ్ళు మరింత అయోమయాన్ని సృష్టిస్తున్నారు!సాయుధపోరాటమే శ్రామికవర్గనియంతృత్వానికి వున్న ఒకేఒక్క దారి అని మార్క్సు గారు అంత తెగేసి చెప్పినాక కమునిష్టులు యెన్నికల్లో నిలబడ్డం యెందుకు?నిలబడిరిపో, ఒక బూర్జువా వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ వాడయిన నెహ్ర్రూని "అభివృధ్ధికాముకుడు,శాంతికాముకుడు" అని పొగిడి ఆ పెద్దమనిషి వోట్లకోసం వాడుకున్న కుహనా సెక్యులరిజాన్నే తామూ భుజాన వేసుకోవటం దేనికి?తమకంటూ సొంతంగా సెక్యులరిజం అంటే యెమిటో తేల్చుకోలేని వాళ్ళు ఈ పైలాపచ్చీసు యెన్నికల వ్యవస్థలో వీళ్ళు యెవరినుంచి వోట్లు ఆశిస్తున్నారో వాళ్ళకెవరికీ అర్ధం కాని సిధ్ధాంతాన్ని వూదరగొడుతూ యేమి పీకగలుగుతారు?

          గాంధీ జయంతి రోజున మాంసం తిన్నందుకు లెంపలేసుకున్న కమ్యునిష్టు నాయకులు బౌతిక వాదులా?హవ్వ!ఇంకా నయం గాంధీ జయంతి రోజున యేదయినా గుడి కెళ్ళి గాంధీ గారి పేరున అర్చన చేయించి పూజారి గారిచ్చిన పువ్వుని రొజంతా చేవిలో పెట్టుకు తిరగాలంటే అది కూడా చేసేవాడా!ఇలాంటి కేతిగాళ్ళు శ్రామిక వర్గ నియంతృత్వాన్ని సాధించటం కోసం వర్గపోరాటం చేసి గెలుస్తారంటే నమ్మేవాడిని చూసి నవ్వాలి?!ఒకప్పుడు కమ్యునిష్టులు వస్తున్నారంటే గ్రామదేవతలని వూరేగించినట్టు ప్రభలు కట్టి వూరేగిస్తూ వూళ్ళలోకి తీసుకెళ్ళిన జగజ్జేగీయమానమయిన స్థితి నుంచి బూర్జువా పార్టీల్ని ఆ సీటు మాకొదులు ఈ సీటు మాకొదులు అని దేబిరిస్తూ యెంత  అంటకాగినా తగుమాత్రపు వోట్లని కూడా నిక్కచ్చిగా తెచ్చుకోలేని దుస్థ్తితికి దిగజారడానికి కారణాలు వెతుక్కుంటే నిర్మాణాత్మకంగా యెదగటానికి పనికొస్తుంది గానీ రామాయణాన్నీ మహాభారతాన్నీ తిడీతే యేమొస్తుంది?

          ఈ నాస్తికులంతా యింత గట్టిగా మతాల మీద దాడి చెయ్యాలని చూస్తున్నారు గానీ వీళ్ళు యెదటివాళ్ళని అన్నీ వేదాల్లో వున్నాయిష గాళ్ళు అని వెక్కిరించడం నుంచి ఇన్స్పైర్ అయ్యారో యేమో గానీ కొందరు బుధ్ధిమంతులు అసలు కమ్యునిజంలో కూడా ఒక మతానికి వుండే లక్షణాలన్నీ వున్నాయని ఢంకా బఝాయించి చెప్తున్నారు?దైవం స్థానంలో చరిత్రని చూపించాడు.దోపిడీకి మార్క్స్ ఇచ్చిన నిర్వచనాలన్నీ మతాల్లో పాపకర్మకి ఇచ్చిన నిర్వచనాలతో సరిపోలి వున్నాయి.శ్రామికవర్గనియంతృత్వం అనే సాధనని మోక్షసాధనకి ప్రత్యామ్నాయంగా తీసుకున్నాడు.మనిషి యొక్క అంతిమ గమ్యం విషయంలో మతం స్వర్గాన్నీ భగవంతుణ్ణి చేరడాన్నీ చెప్తే మార్క్సిజం వర్గరహిత సమాజాన్ని గురించి చెప్తుంది.అంటే యేమిటన్నమాట, తొందర్లోనే నేను మొదట్లో చెప్పినట్టు "కొత్తా దేముడండీ కొంగొత్తా దేముడండీ" అనే పధ్ధతికి దిగిపోతే తప్ప రోజురోజుకీ మతానికి ఇంకా గట్టిగా దగ్గిరవుతున్న ఈ కాలం ప్రజలు వీళ్ళని దగ్గిరకి రాబివ్వని కాలం వచ్చింది?!

          తల్లివేరుకి చెదలు పట్టి కొమ్మలన్నీ తెగుళ్ళతో యెండిపోయి అసలు కమ్యునిజమే ఇట్లా అఘోరిస్తుంటే దీని నుంచి సైడుపక్కకి పెరుగుతూ పుట్టిన పిలకల పరిస్థితి ఇంకా గందరగోళంగా వుంది!మార్క్సు "శ్రామికులు" అని చెప్పిన చోటల్లా "మానవుడు" అని రీప్లేస్ చేస్తే మానవవాదం తయారయింది,"స్త్రీలు" అని రీప్లేస్ చేస్తే స్త్రీవాదం అయ్యింది,"దళితులు" అని రీప్లేస్ చేస్తే దళితవాదం అయింది!

          మానవేంద్ర రాయ్ పేరుతో ఇంగ్లీషులో రాయిజం అనీ తెలుగులో మానవవాదం అనీ పిలుచుకునే ఒక పట్టాన కొరుకుడు పడని  రాయిలాంటి సిధ్ధాంతానికి తెలుగు బ్లాగుల్లో ఇన్నయ్య అనే మేధావి మాత్రమే ఆలంబనగా కనబడుతున్నాడు.ఈ మానవేంద్రుడు మొదట్లో మార్క్సు గారితో కొంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఆ శ్రామికవర్గనియంతృత్వం - సాయుధ పోరాటం అనేవాటికి కాస్త దడుచుకునో యేమో మార్క్సు గారి సిధ్ధాంతాన్ని 45 డిగ్రీలు పక్కకి తిప్పేసి "నేను శ్రామికుడి బదులు మానవుణ్ణి కేంద్రంగా నిలబెడుతున్నాను,అయితే నేను కూడా సమసమాజాన్నే ఆశిస్తున్నాను, కానీ యే ఫ్రేం వర్కూ వుండకూడదు" అనే హడావిడి మొదలెట్టాడు!నాకు సహజంగా జ్ఞాపకశక్తి యెక్కువ,యేళ్ళ క్రితం చదిబినవి కూడా గుర్తుంటాయి!కానీ ఈ పెద్దమనిషి రాసిన "ఒక పిల్లి ఆత్మకధ" ఈ మధ్యనే చదివినా మొదలూ చివరా తప్ప మిగిలిందంతా మర్చిపోయాను?మొదలవడం అద్భుతమయిన వ్యంగ్యంతో మొదలయింది గాబట్టి గుర్తుంది.ముగింపు గొప్ప తాత్విక చింతనతో వుంది కాబట్టి అదీ గుర్తుంది.కానీ మధ్యలో ఆ పిల్లి గారి బాధేమిటో ఈ రాయి దేన్ని బద్దలు కొట్టాలనుకుందో మాత్రం నాకర్ధం కాలేదు,అందుకే మర్చిపోయాను! యే ఫ్రేం వర్కూ వుండకూడదంటున్నారు గదా అని మీరు అరాచకవాదులా అని పృశ్నించకండి, చాలా అరాచకంగా రెచ్చిపోతారు.స్వేచ్చ,స్వేచ్చ,స్వేచ్చ - యే నియమ నిబంధనలూ లేని యే ఫ్రేం వర్కుకీ కట్టుబడని స్వేచ్చ కావాలి,అంతే!కాకపోతే వీరికీ కమ్యునిష్టులకీ వున్న సారూప్యం హిందూమతాన్ని విమర్శించటం.హిందూ యోగులు గాలిలో తేలతారంటే నమ్మరు గానీ తమ సిధ్ధాంతమే యే ఆధారమూ లేకుండా గాలిలో తేలుతున్నదని మాత్రం ఒప్పుకోరు.వీరు చేప్పే క్యాపిటలిష్టా  శ్రామికుడా అనేది పట్టించుకోకుండా మానవుణ్ణి కేంద్రంలో నిలబెట్టడం అనే వ్యవహారమూ,యే ఫ్రేం వర్కూ వుపయోగించకుండా సర్వమానవసమానత్వాన్ని సాధించటం అనే తతంగమూ ఒక్క శ్మశానంలోనే సాధ్యపడుతుంది - గరిమనాభి సూత్రం ప్రకారం శవం పాడెకి కేంద్రం లోనే వుండితీరుతుంది కాబట్టీ అన్ని శవాలూ ఒక్కలాగే కాల్తాయి గాబట్టీ?!

          స్త్రీవాదం అనే మరో పిలక తొందర్లోనే మాయమైపోయింది యెందుకనో!అప్పట్లో వొల్గా అనే పేరు చాలా యెక్కువగా వినబడుతూ వుందేది.కానీ ఇవ్వాళ మాత్రం స్త్రీవాదం అనేది బలహీన పడిపోయినట్టే లెఖ్ఖ!ఆడవాళ్ళు సహజంగా మగవాళ్ళ కన్నా తెలివైన వాళ్ళు కావడం వల్లనో యేమో వోల్గా గొంతు వినబడే కాలంలో కూడా ఆడవాళ్లలోనే పెద్ద స్థాయిలో కదలిక పుట్టించలేకపోయింది.సౌజన్యారావుని చూసే వరకూ ప్రోనాచ్చి గా వున్న గిరీశం హఠాత్తుగా యాంటీనాచ్చి అయిపోయినట్టు మిత్రులు శ్రీకాంత్ గారు ఒకప్పుడు ప్రోఫెమినిష్టుగా వుండి ఇప్పుదు యాంటీ ఫెమినిష్టుగా మారిపోయి రఘునందన్ లాంటి వారికోసం గృహహింస చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు తన బ్లాగులో.అటు వెళ్ళి ఇటు వచ్చిన తనలాంటి వారికి తప్ప నాకంతగా తెలియని దాన్ని నేను పరామర్సించలేను గాబట్టి దీన్ని వదిలేస్తున్నాను.

          ఇక దళితవాదం పిలకకి ఇప్పుడున్న పెద్ద గొంతు కంచె ఐలయ్య గారిది!ఈయన గారిది నిజంగా మైరావణ చరిత్రే?ఆఖరికి అన్ని కులాల వాళ్ల కోసం పోరాడే మావోయిష్టు నేతకి కూడా పొరపాట్న "గణపతి" అనే గుప్తనామం పెట్టుకున్నందుకే బ్రాహ్మణీయ ఆధిపత్య సంస్కృతిని అంటగట్టేసిన దళితవాదపు మగ ముప్పాళ రంగనాయకమ్మ!మొదటిసారి నేను ఈయన పేరు ప్రముఖంగా విన్నది పౌలస్త్యబ్రహ్మ ముని మనవడయిన రావణుడు కూడా దళితుడే అని వింత ప్రకటన చేసినప్పుడు!ఈయనే కాదు ఇలా సంచలనం కోసం యేదో ఒకటి మట్లాడే వాళ్లంతా "నైబర్స్ ఎన్వీ వోనర్స్ ప్రైడ్" అని ఝమ్మున సేల్స్ పెంచుకున్న వ్యాపార ప్రకటన నుంచి స్పూర్తి పొందిన వాళ్ళే!అప్పటి నుంచీ ఈయన పేరుతో వచ్చిన వ్యాసాలలో కుదిరిన ప్రతిదీ చదివాను.పైకి దళితవాదం అని పేరు పెట్టుకున్నా అసలు రంగు చూస్తే కులవాదం అని స్పష్టంగా తెలుస్తుంది.ఈ మధ్యనే కులపరమయిన రిజర్వేషన్లని సర్ధుబాటు చెయ్యటం గురించి ఒక రచయిత మాదిగలలో వుండే వుపకులాల గురించి చాలా కొత్త విషయాలు చెప్పి వారికి కూడా న్యాయం జరగాలనే విధంగా వాదించారు.ఈ మొత్తం మేధావుల్లో యెవ్వరూ కులాల మధ్య అసమానతలు తొలగాలని నిజంగా కోరుకోవటం లేదు!మందకృష్ణ మాదిగ మరియూ మాలమహా నాడు నేతలు తమలో తమకున్న అధిపత్యాల్ని వొదులుకోకుండా తమ కులప్రయోజనాల కోసమే పోట్లాడటానికి కూడా బ్రాహ్మణాధిపత్యమే కారణమని వారంతా నిజంగా నమ్ముతున్నారా?ఒకవేళ అదే కారణమైతే ఐలయ్య గారు బ్రాహ్మణులు చెప్పడం వల్ల యేర్పడిన తన కులవారసత్వం పట్ల అంత వ్యామోహం చూపిస్తున్నాడేమిటి?బ్రాహ్మణులు అంత దుర్మార్గంగా యేర్పాటు చేసిన కులవ్యవస్థని ధిక్కరించి పారేసి - తను కులరహితుడిగా నిలబడితే గదా బ్రాహ్మణ్యాన్ని ధిక్కరించినట్టు?!

          మీరిలాంటి మహా ధైర్యమయిన మరియూ గంభీరమయిన కులరాహిత్యాన్ని యే దళితవాది నుంచీ ఆశించలేరు!ఈ అసమానతలన్నీ ఇలాగే వుండి లటక్కన తమ కులం మాత్రం అధికారంలోకి రావాలి అనే గొంతెమ్మ కోరిక తప్ప కనీసం దోపిడీకి గురవుతున్న కులాల నన్నిట్నీ ఐక్యం చేసి ఆ పీడిత కులాల మధ్యనైనా సమానత్వాన్ని సాధించే వుద్దేశమూ లేదు?!యెందుకంటే వారి లక్ష్యం కులరహిత సమాజం కాదు,కేవలం అధికారం ఇప్పుడు అనుభవిస్తున్న కులాల నుంచి తమ కులానికీ తమ మిత్రుల కులాలకీ దఖలు పడటం మాత్రమే వీరు కోరుకుంటున్నది!అందుకోసం వీరు కనుక్కున్న మహత్తరమయిన పరిష్కారం యెన్నికల్లో కేవలం తమ కులపు వాణ్నే గెలిపిస్తూ సంఖ్యాబలాన్ని పెంచుకోవటం!అందుకోసం ఇప్పుడు పైనున్న కులాల వాళ్లలో వున్న మంచివాళ్లకి గూడా అణిచివేతయే ఆనందంగా వున్నదని రుజువు చేసే విషయాలని పరిశోధించి తెలుసుకోవటం తమ కులపు వాళ్లందర్నీ తమ కులంలోని దొంగవెధవలకి గూడా సంతోషంగా వోట్లు వేసేలా సంఘటిత పరచటం లాంటి ఘనకార్యాలు చేస్తూ వుంటారు!?కానీ ఈ మేధావులకి తెలియని బేసిక్ విషయం యేమిటంటే మందబలాన్ని పెంచుకోవాలనే వ్యూహంతో తాము పైకి పంపించే తమ కులంలోని దొంగ వెధవలు ఇప్పుడు పైనున్న కులాల్లోని దొంగవెధవల్తో కలిసిపోవడానికే నూటికి తొంభైతొమ్మిది శాతం ఆస్కార ముందనేది?!వాళ్లకి తెలిసినా మనలాంటి వాళ్ళకి చెవిలో పెట్టడానికి వుపయోగించుకున్నా ఈ స్వైరకల్పనల్ని యెన్నేళ్ళపాటు పోషించినా వాళ్ళు ముందు కెళ్లలేరు.

          అసలు ఈ పిలకలన్నీ మొలిచింది కమ్యునిష్టులు దారి తప్పడం వల్లనే గదా!ఆత్మవిమర్శ చేసుకుని తప్పుల్ని సరిదిద్దుకుని అందర్నీ కలుపుకుని తమ లక్ష్యం కోసం పాజిటీవ్ ప్రయాణం చెయ్యాల్సిన సమయంలో ఈ నిగిటివ్ నిర్వాకం దేనికి?అంతమై పోయే కాలం సమీపించినా ఈ దిక్కుమాలిన పన్లతో కాలం గడిపితే యెవరికి నష్టం?

Tuesday, 6 January 2015

శిక్షాభయం కూడా లేకుండా కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళ మీద బలాత్కార ప్రయత్నం యెందుకు చేస్తున్నారు?

          గత యేడాది డిసెంబర్ నెలలో ఒక ఉబర్ క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్లో ప్రయాణిస్తున్న ఒక మహిళపై అత్యాచారం జరిపాడు.ఆ అమ్మాయి ఆ సంఘటనకు ముందు చాలా ధైర్యస్తురాలు.2012 డిసెంబర్ గ్యాంగ్ రేప్ ఘటన తరవాత వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడమే కాకుండా తన కుటుంబాన్ని,స్నేహితుల్ని కూడా నిరసనలో పాల్గొనేలా ప్రేరేపించిన మనిషి!అంత ధైర్యం గల మనిషి కూడా కౌన్సిలింగ్ అవసరమయ్యేటంతగా యెందుకు భయపడిపోయింది?

          డిసెంబర్ 5వ తేదీ రాత్రి స్నేహితులతో కలిసి డిన్నర్ చేసింది.రాత్రి సమయంలో తన స్నేహితుల్ని కానీ సహోద్యోగుల్ని కానీ ఇంటివరకు దింపమని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు.ఇంటికి సురక్షితంగా చేరుకునేందుకు పేరున్న క్యాబ్ అయితే మంచిదనుకుంది.రెండేళ్ళ క్రితం డిసెంబర్ 16వ తేదీన జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత మనదేశంలో వున్న ప్రతి అమ్మాయీ సెక్యూరిటీ విషయంలో యెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తున్నది,తీసుకుంటున్నది.ఇంతకు ముందు చాలాసార్లు తను ఉబర్ క్యాబ్ లో ప్రయాణించింది.అందుకనే ఆ క్యాబ్ సర్వీసు మీద నమ్మకంతో దాన్నే యెంచుకుంది.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అత్యాచారం జరిగింది!అయినా వీటిని గట్టిగా తల్చుకుంటే కంట్రోలు చెయ్యగలిగిన పోలీసు శాఖలోని అధికార్లూ  ప్రజల జీవితాలకు రక్షణ కల్పిస్తామని ప్రమానం చేసి పదవుల నలంకరించిన గౌరవనీయులైన మంత్రివర్యులూ తదాదిగా గల అప్రకటిత నపుంసకత్వ రోగపీడితులూ ఆడపిల్లలకే దుస్తుల గురించీ ప్రవర్తన లోని క్రమశిక్షణ గురించీ లెక్చర్లు దంచారు, దంచుతున్నారు, దంచుతారు?

          ఆ రోజు రాత్రి రోడ్డు మీద పోలీసు పెట్రోలింగ్ వాహనాలు కనిపించలేదు.తను యెంతగానో నమ్మిన ఉబర్ క్యాబ్ సర్వీసు నేర చరిత్ర ఉన్న వ్యక్తిని డ్రైవర్ గా నియమించింది.తరవాత తెలిసింది యేమిటంటే అంతకు ముందే నిధి షా అనే మహిళా ప్రయాణికురాలు ముద్దాయి అయిన డ్రైవర్ శివకుమార్ యాదవ్ ప్రవర్త్న బాగాలేదని ఫిర్యాదు చేసినా ఉబర్ సంస్థ పట్టించుకోలేదు.అతడిపై ఎటువంటి చర్యా తీసుకోలేదు.వాళ్ళు అప్పుడే సరిగా స్పందించి వుంటే ఈ రోజున తను,తన కుటుంబం బాధపడాల్సిన పరిస్థితియెదురయ్యేది కాదు.ఆ అమ్మాయి లాంటి యెంతోమంది ఆదపిలలు అడుగుతున్న పృఅశ్నలు ఇవి - సోదరుడు,భర్త లేదా యెవరో ఒక మగవాడు తోడుగా లేనిదే ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదా?అమ్మాయిలు ఇంట్లోనే కూర్చోవాలా?ఆడపిల్లలకి బయటికి వెళ్ళేందుకు,ఉద్యోగాలు చేసుకునే హక్కు లేదా!

          ఆ అమ్మాయి తనవంతుగా కొన్ని కోరికల్ని చెప్పింది - ఆడవాళ్ళు నడిపే క్యాబ్ లు కావాలి,పెట్రోలింగ్ వాహనాలు,పోలీసుల సంఖ్య యెంత యెక్కువగా పెరిగితే ఆడవాళ్ళకు అంత సురక్షితంగా వున్నామన్న భావన కలుగుతుంది.అమ్మాయిలు ప్రయాణించే క్యాబ్ లను బాగా చెక్ చేయాలి.అలాగే ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి.మనలో యెక్కువమంది యేదయినా విషయంలో జోక్యం చేసుకుంటే పోలీసుల చుట్టూ తిరగాలి,కోర్టు కేసులు వుంటాయని ఆలోచిస్తారు.ఈ అమాయి తల్లికి తన స్నేహితురాలు ఫోన్ చేసి"మీఎరు కేసు ఎందుకు ఫైల్ చేశారు?మీకు చెడ్డ పేరు వస్తుంది!" అని అంటే ఆమె "ఆ పని చేసిన వాళ్ళకి చెడ్డపేరు వస్తుంది కానె మాకెందుకు వస్తుంది" అని జవాబు చెప్పిందట.ఇప్పుడు భారతదేశం పురుషాధిక్య సంస్కృతిలో వుంది.అందుకని ఆడవాళ్ళకు సమానావకాశాలు ఇస్తే మగవాళ్ళు ఆదవళ్ళని చులకనగా చూడటం మానేస్తారు.బుర్రలు సరిగా ఆలోచించాలంటే సరయిన విద్యావిధానం వుండాలి.

          మరి ఇంత తెలివి గల ధైర్యమున్న అమ్మాయి అంత భయపడిపోవటానికి కారనమేమిటో తెలుసా?ఆ పశువు లొంగకపోతే రాడ్ వుపయోగిస్తా నన్నాడట?!అంటే పత్రికలలో ఆ పాత సన్నివేశం గురించిన వార్తలు అతడికి అందరూ చేస్తున్న ఆందోళనల్నీ నేరస్తుల పట్ల అసహ్యాన్నీ వాళ్ళకి పడిన శిక్షల్నీ కాకుండా మరో రకమయిన నీలి చిత్రాన్ని చూపించాయన్న మాట!చాలా చిన్నప్పట్నించీ ఈ రకమయిన వార్తల్ని చాలా కుతూహలంతో చదవగా నాకు అర్ధమయినది యేమిటంటే వాళ్ళు ఈ నేరాల్ని చెయ్యడం కేవలం లైంగిక పరమయిన కోర్కెలతో చెయ్యడం లేదు,యెదటి వాళ్ళని హింసించి ఆనందం పొందే మనస్తత్వం వుంటుంది వాళ్ళలో.ఆ మనస్తత్వం వున్నవాళ్ళు తను కూడా ఆ అపధ్ధతిని ఫాలో అయితే యెలా వుంటుంది అనే రకమయిన ఆలోచనలతో మరింత వుద్రేక పడతారే తప్ప  శిక్షలకి భయపదరు.ఇప్పటి వరకూ కోర్టులకి పనికొచ్చే న్యాయసూత్రాల్లో సివిలు,క్రిమినలు అనే రెండు రకాల విభాగాలే వున్నాయి.సివిలు అంటే ఆస్తి తగాఅలు,క్రిమినలు అంటే కక్షలు పెంచుకుని ఒకడి మీద మరొకడు దాది చెయ్యటం.ఈ రకమయిన కొత్త స్వభావం గల నేరాలు అందులో నిర్వచించనడక పోవటం నిర్భయ కేసు న్యాయశాస్త్ర కోవిదుల్లో కూడా యెంత గందరగోళాన్ని రేకెత్తించిందో మనకి తెలిసిందే.ఇప్పటికీ ఆ చట్టాలు పటిష్టంగా రూపు దిద్దుకోలేదు!

          మనుషుల తర్వాత కుటుంబ జీవనం సింహాలలోనే బలంగా వుంటుంది.కానీ వాటికి మనలాగా ఎగో ప్రాబ్లెంస్ లేకపోవటంతో అవి చాలా సుఖంగా తమ జీవితాల్ని గడిపేస్తాయి.మనుషులకి కుటుంబ జీవితం యెందుకు అవసరం అంటే మనిషి తప్ప మిగిలిన జంతువులన్నిట్లో పుట్టిన కొద్ది గంటల్లోనే పూర్తి చురుకుగా కదలగలిగి వుంటాయి.కానీ మనుషుల్లో శిశువులు తమ మెడని కూడా యెత్తలేనంత బలహీనంగా వుంటారు.ఆ మెడ కుదరనిదే కనీసం లేచి కూర్చోవడం కూడా సాధ్యపడదు.ఈ బాలారిష్టాలన్నీ గడిచి పూర్తి స్వతంత్రంగా బతకగలగటానికి ఇరవయ్యేళ్ళు పడుతుంది.ఈ కాలమంతా ఆ శిశువుకు పోషణా,భద్రతా,మనోగతమయిన సంస్కారం నేర్పడానికే ఒక స్త్రీ ఒక పురుషుడు ఆజీవపర్యంతం కలిసి బతికే వివాహ వ్యవస్థ యేర్పడింది.కానీ సుఖాల ననుభవించటం మీద వున్న దృష్టి బాధ్యతల్ని స్వీకరించడం మీద వుండనివ్వని ఇప్పటి సంస్కృతి దీన్ని సరిగా సాగనివ్వడం లేదు!ఇప్పుడు మనం ఆలోచిస్తున్న ఈ సమస్యకే కాకుండా ఇప్పటి కాలంలోని స్త్రీ పురుష సంబంధాలు అన్నిటికీ ఇదే మూలకారణం కాబట్ట్టి వివాహ వ్యవస్థని పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం వుంది!

          ప్రతి మనిషి వ్యక్తిత్వంలోనూ లైంగికతకు సంబంధించి ఆడ అయినా మగ అయినా "ఐడియల్ షి" మరియూ "ఐడియల్ హి" పట్ల ఆరాధన వుంటుంది.మగవాడు తను ఆ ఐడియల్ హి లాగా వుండాలని అనుకోవటంతో మొదలై వున్నాననే నమ్మకంలో స్థిరపడతాడు.ఈ ఐడీయల్ హి స్థానంలో సాధారణంగా సినిమా హీరోలు వస్తారు,ఆ తర్వాత క్రికెట్ ప్లేయర్లు వస్తారు.ఈ తాదాత్మ్యం వల్లనే కుర్రవాళ్ళు తమ అభిమాన హీరోలకి అంత వెర్రిగా అతని కతౌత్లకి కూడా పాలాభిషేకాలూ గట్రా చేస్తారు.ఐడియల్ హి లో తనని చూసుకుంటే ఐడియల్ షి తనకి భార్యగా రావాలని కోరుకుంటాడు.ఆడవాళ్లలో కూడా ఇలాగే వుంటుంది - తను తన ఐదీయల్ షి తో మమేకమై తన ఐడియల్ హి లాంటి భర్తని కోరుకుంటుంది.కానీ సమాజంలో ఒక ఐడియల్ హి లేక ఐడియల్ షి కనబదక ముందు తప్పనిసరిగా తమ తలిదండ్రులే ఐడియల్ షి మరియూ ఐడియల్ హి స్థానాన్ని ఆక్రమిస్తారు!ఇప్పుడు తను ఐడియల్ హి గా భావించే వ్యక్తి యెలా అయితే ఐడియల్ షి మీద పెత్తనం చేస్తున్నదో తనూ అలాగే చెయ్యాలనుకుంటాడు.తన ఐడియల్ షి యెట్లాగైతే అణకువగా వుంటుందో తనకు కనిపించిన ఆడవాళ్ళూ తనలో స్పందన కలిగించిన ఆడవాళ్ళు కూడా అట్లాగే వుండాలనుకుంటాడు.

          కానీ ఇక్కడ కనబడుతున్న వాళ్ళు ధీమాగా కనబడుతున్నారు.పైగా తను వుండాల్సిన చోట మరో మగాదు కనబడుతున్నాడు.మానసికంగా ఒక వైకల్యం మొదలైందీ అంటే అది ఇంక దేన్ని గురించీ ఆలోచించనివ్వదు - సమాజంలో తన స్థానం యేమయినా ఫర్వాలేదు,శిక్షకి గురయి చచ్చిపోయినా ఫర్వాలేదు ముందు తన కోరిల తీర్చుకోవడమే ముఖ్యం అనిపిస్తుంది.ఒక మగవాడు ఒక ఆదదాని ద్వారా లైంగిక సుఖాన్ని పొందడం అనేది బలంగా కనిపిస్తూ వుందతంతో ఈ రకమయిన నేరాలను గురించి ఆలోచించే వాళ్లందరూ వాళ్ళు లైంగిక సుఖాన్ని తీర్చుకోవటం కోసమే వాళ్ళు అత్యాచారం చేస్తున్నారని పొరబడుతున్నారు.వాళ్ళు అప్పటికే ఆడదాన్ని భయపెట్టదం ద్వారానే ఆనందం పొందే స్థితికి యెప్పుడో చేరుకున్నారు గనక లైంగికానుభవం వాళ్ళకి యేమాత్రం ఆనందం కలగజేయదు!భయపెడుతూ, బాధపెడుతూ ఆడవాళ్ళు యేడుస్తుంటే చూడటం లోనే వాళ్ళు ఆనందిస్తారు,అదీ ఈ రకమైన నేరాల అసలు దృశ్యం!ఈ మొత్తం వ్యవహార మంతా ఆ అమ్మాయి ఒంతరిగా కనబదిన క్షణంలో జరిగే మార్పులు అని మీరు నమ్మగలరా?సుదీర్ఘ కాలం పాటు అతను ఆ అమనస్తత్వం లోకి యెదుగుతాడు, తనున్న వాతావరణం అనుకూలంగా వుందటం వల్ల -  it is not impulsive crime but an indulging crime?!

          మరి వీటిని ఆపడం యెట్లా?నేరం జరిగాక విచారించి తీర్పు ద్వారా ఒకరికి శిక్ష వేసి మరొకరికి కవున్సిలింగులు ఇవ్వడం కన్నా అసలు జరగకుండా ఆపలేమా! అసలు ఈ నేరాలన్నీ యెప్పుడో గానీ యెక్కడో గానీ జరగవు, అందుకే కాబోలు నిత్యం నేరాల మధ్యనే గడిపే పోలీసుల్లో కూడా సరిగ్గా స్పందించలేని అలసత్వం?!ఇప్పుడిప్పుదు ఇలాంటివి పెరగడంతో కొంచెం చురుకుగా స్పందిస్తున్నారు.నూటికి తొంబై శాతం మంది మగవాళ్ళు బుధ్ధిమంతులే!కానీ చెదురుమదురుగా జరిగినా అవి మన మనసుల్లో కలిగించే భీభత్సం చాలా యెక్కువ,అదీగాక నిర్లక్ష్యం చేస్తే అది అలాంటివాళ్లని ప్రోత్సహించి నట్టవుతుంది! ఒకటి మాత్రం నిజం,శిక్షాభయం తప్ప చాగంటి వారి పరవచనాలూ,మల్లాది వారి పురాణ కాలక్షేపాలూ నేరాల్ని తగ్గించలేవు!కాబట్టి కీలెరిగి వాత అన్నట్టు యెవరిని శిక్షించాలి అనేది తెలిసి వీలెరిగి శిక్ష వుండాలి అని నా అభిప్రాయం.

          ఈ రకమయిన సన్నివేశాలు వినగానే గగుర్పాటును కలిగించడం వల్ల యెంతటివాళ్ళ నయినా వుద్రేకానికి గురి చేస్తాయి.నేనూ వుద్రేకానికి లోనయి కొన్ని తప్పుడు అభిప్రాయాల్ని సమర్ధించాల్సి వచ్చింది.వచ్చిన విమర్శల్ని చూసి మరోసారి దానికి సంబంధించి విషయసేకరణ చెయ్యగా నాకు నా పొరపాటు యేమిటో తెలిసింది.అలాంటి వాటికి స్పందించాతప్పుడు వుద్రేకపడతంలో అప్పు లేదు.అసలు వుద్రేకపడే లఖణం లేకపోతే స్పందన కూడా వుండదు.కానీ పరిష్కారం గురించి ఆలోచించాల్సినప్పుడు మాత్రం రాగద్వేషాలు లేని నిండుమనస్సుతోనే వుండాలి!శిక్షలతో కన్నా సమాజం ఆలోచించే పధ్ధతుల్ని మార్చడం ద్వారానే వీటిని అరికట్టగలం.దీనికి వ్యక్తిగతంగా కుటుంబ స్థాయిలో మనం పిల్లల పెంపకంలో ఇప్పుడు పాటిస్తున్న దోరణుల్ని మార్చుకోవాలి.ఇక సామాజికంగా చూస్తే శాతిభద్రతలి కాపాడతం నేరాలు జరగకుండా నిరోధించటం అనేది ప్రభుత్వం చెయ్యాల్సిన పని కాబట్టి మంచి ప్రభుత్వాలన్ని సాధించుకోవతం అనే రెంటిలో దేన్నీ తాకువ చెయ్యకుండా రెంటికీ 50-50 ప్రాధాన్యత నివ్వాలి.

      వ్యక్తిగతంగా కుటుంబస్థాయిలో మనం పాటిస్తున్న అసమానతలే సమాజం లోనూ వ్యక్తీకరించబడుతున్నప్పుడు మార్పు కూడా కుటుంబ వాతావరణం నుంచే మొదలవ్వాలి.కాబట్టి మగవాడికి ఇప్పటిలా కాకుండా ఆడదానితో సామరస్యంగా ప్రవర్తించి స్త్రీని సంతోష పెట్టగలగడమే నిజమయిన పురుష లక్షణం గానీ భయపెట్టి లొంగదీసుకుని ఆనందించడం కాదు అనే విషయాన్ని బోధపర్చాలి.ఆడపిల్లకి కూడా బెదిరిపోవటం భయపడటం స్త్రీ సహజ లఖణం అని కాకుండా ధైర్యాన్నీ సాహసాన్నె అలవాటు చెయ్యాలి.ఆత్మరక్షణ కోసం పోరాట కళల్ని పరిచయం చెయ్యటం కూడా మంచిదే!అసలైన విషయం యేమిటంటే ఈ నేరాలన్నీ ఒంటరిగా వున్నప్పుడు మాత్రమే జరుగుతున్నాయి.కాబట్టి మగపిల్లల్తో కూడా కలివిడిగా వుండటం అలవాటు చెయ్యాలి.బయట తిరగాల్సి వస్తే వీలున్నంత వరకూ నలుగురైదుగురికి తక్కువగా వుండకుండా తిరగాలి.ఆ నలుగురూ యెటువంటి వాళ్ళో కూడా తలిదండ్రులు తెలుసుకుని తీరాలి.మా అమ్మాయికి వున్న స్నేహితులంతా మాకు తెలుసు.మగపిల్లలు కూడా మా ఇంటికి కూడా వచ్చి గడుపుతారు.మన పిల్లల్ని మనం నమ్మితేనే వాళ్ళూ మనల్ని నమ్మి తమ విషయాలన్నీ మనకి చెబుతారు!ఇలాంటి వాతావరణం వుంటే అలాంటివి జరగవు,జరిగినా కొద్ది సమయంలోనే మళ్ళీ తేరుకోవచ్చు.మన తప్పు లేకుండా జరిగిన ఒక సన్నివేశం జీవితాన్నంతా ప్రభావితం చేసేటంత బలహీనంగా వుండకుండా బతకదం ఇవ్వాళ్టి పరిష్తితుల్లో తప్పనిసరి!

          ఇక ఇల్లు దాటి వెళ్తే అది ప్రభుత్వ వ్యవహారం కాబట్టీ మంచి ప్రభుత్వాల నెన్నుకోవడం తప్పని సరి.మంచి ప్రభుత్వాలు మాత్రమే మనం కోరుకున్న రక్షణ ఇవ్వగలవు.కానీ మనం మనపాటికి కులంపేరుతో మతంపేరుతో మనవాణ్ణే అధికారంలో చూడాలనే కులపిచ్చితో వుంటే ఈ భీభత్సాలు అనంతకాలం వరకూ జరుగుతూనే వుంటాయి.కానీ ఆ విషయంలో పరిస్థితి చాలా నిరాశావహంగా వుంది.సామాజిక శాస్త్రవేత్త అనే గురింపు పదాన్ని చేర్చుకుని తింగరి సిధ్ధాంతాలతో కులపిచ్చిని మతపిచ్చిని బాహాటంగా సమర్ధిస్తుంటే నిరక్షరాస్యుల నుంచి వివేకాన్ని యెలా ఆశించగలం?కుల దోపిడీని వ్యతిరేకిస్తూనే కులాల కుమ్ములాటల్ని మేధావులమని చెప్పుకుంటూనే సమర్ధిస్తే కులమతాల కతీతంగా ప్రజలందర్నీ సమానంగా రక్షించే మంచి ప్రభుత్వాలు యెట్లా వస్తాయి?తను కూడా తన కులానికి పెత్తనాన్నే కోరుకుంటూ అవకాశం వుంటే ఇతర కులాల్ని అణగదొక్కే మనస్తత్వంలో వుంటే ఇప్పటి అసమానతల వల్ల లాభపడే కులస్థుల్ని తప్పు పట్టి ప్రయోజన మేమిటి?యెన్నికల్లో నిలబడ్డ తన కులం వాడు అసమర్ధుదయినా తను కోరుకునేది మందబలం కాబట్టి అలాంటి వాళ్ళంతా తప్పనిసరిగా వాళ్ళ కులపోడికే వోటు వేస్తారు గదా!కాబట్టి ఆ రకమయిన మార్పు ఇప్పట్లో సాధ్యపడదు.ప్రభుత్వాల నుంచి శాంతిభద్రతలకి హామీని పొందలేము గనక వ్యక్తిగతంగా మరింత జాగ్రత్తగా వుండటం తప్ప గత్యంతరం లేదు?!

         మమతా బెనర్జీ గారి  కుడిభుజమో ములాయం సింగు గారి యెడమ భుజమో రేప్ కేసుల్లో ఇరుక్కున్నప్పుదు వాళ్ళు యెలా ప్రవర్తించారో గుర్తుందా?కంచె ఐలయ్య గారి లాంటి వాళ్ళు చెప్పే దళితవాదంతో వచ్చే ప్రభుత్వాలు కూడా అలానే అఘోరిస్తాయి!

Sunday, 4 January 2015

వీళ్ళు యేమి చదివారు?ఆ చదువు యేమి సంస్కారం నేర్పింది?



          యాబై అరవై యేళ్ళుగా తెలంగాణాకి ద్రోహం జరగడంలో తెలంగాణా రాజకీయవేత్తల ప్రమెయమే యెక్కువని అంత కాలం రాజకీయ జీవితం గడిపాక కూడా ఇతనికి నిజంగానే తెలియదా? ఈ మనుషుల బ్రోకరేజి వ్యాపారం చేసి పైకొచ్చిన వాడు పెద్ద నీతిమంతుదిలా పోజులు కొడుతూ ఆంధ్రా రాజకీయ వేత్తల్ని మాత్రమే అంటున్నాను సామాన్యుల్ని కాదు అని యెంత సమర్ధించుకున్నా కొన్ని లక్షల కోట్ల మంది ముందు సభావేదికల మీద పచ్చి బూతుల్ని కూడా అవి బూతులు కాదని తెగబడి యెలా మాట్లాడ గలిగాడు?

       ఇంతకు ముందు మాతృ రాష్ట్రం నుంచి విడిపోయిన రాష్ట్రాలు మొదట విడిపోవటానికి సభలో మెజారిటీ మైనారిటీ లెక్కలతో కొలిస్తే అంకెకి తక్కువే అయినా తమ శాసన సభలోనే విభజన ప్రతిపాదన చేసి ప్రతికక్షుల్ని కూడా వొప్పించి సోదర రాష్ట్రాలు రెండూ సాదరంగా విడిపోయాయని తెలిసి కూడా ఇక్కడ మేము అంకెకి తక్కువున్నాం మాకు న్యాయం జరగదు అని ఆర్టికిల్ మూడుని భుజానేసుకుని యెందుకు తిరిగాడు?ఆంధ్రోళ్ళని తిడుతూ విడిపోయే అమర్యాద కరమయిన పధ్ధతిలోనే తెలంగాణా తీసుకురావాలనే వూహ యెలా వచ్చింది ఇతనికి?

           ఒకసారి వాహనాల చట్టంప్రకారం రిజిస్టరు చేయబడిన వాహనానికి రెండవ రిజిస్ట్రేషన్ అనే చెత్త వూహ యెలా వచ్చింది?వాహనాల చట్టంలో యేమయినా అస్పష్టత వున్నదా?లేదే, కోర్టు ముక్క చివాట్లు పెట్టింది గదా?అప్పటికీ వెనక్కి తగ్గకుండా వాహనం మీద వుండే నంబరు ప్లేటు మీద మాత్రం మారిస్తే చాలుననే మొదటిదాని కన్నా చెత్త వూహ యెలా వచ్చింది?హత్యలూ దోపిడీలూ చేసి పారిపోయే వాళ్ళు చేసినట్టు యే వాహన యజమాని అయినా తప్పు నంబరు వాహనం మీద వేస్తే ట్రాఫిక్ పోలీసులు చూస్తూ వూరుకుంటారా?అలా వూరుకోమని ప్రభుత్వాధినేతగా లిఖిత పూర్వకంగా పోలీసులకి ఆదేశాలు జారీ చెయ్యగలడా?




       తెలంగాణా సిటిజన్ కార్డు గురించి మాట్లాడేటప్పుడు ఈ దేశమలో దేశమంతటా ఒకే రకమయిన పౌరసత్వం వుంటుందనీ యే రాష్ట్రంలోనూ రాష్ట్రం పేరుతో పౌరసత్వపు కార్డులు లేవనీ నిజంగానే తెలియదా?పదో తరగతి వరకూ జాగర్ఫీ, హిస్టరీ, సివిక్సు అనే పాఠాలు చదివిన వాళ్ళేవరికయినా తెలిసే విషయం ఈవిడ కెందుకు తెలియలేదు?

        ఒకప్పుడు దెయ్యాలకి భయపడి జనాలు "ఓ స్త్రీ రేపు రా" అని రాసుకున్నట్టు తెలంగాణాలో వుండాలనుకున్న ఆంధ్రా వాళ్ళంతా ఇంటి తలుపుల మీద ఆ విషయం ప్రత్యేకంగా వుల్లేఖించాలని యెలా అనగలిగింది?అది తెలంగాణేతరు లందరికీ చెప్పిందా,ఆంధ్రావాళ్లకి మాత్రమేనా?రాజ్యాంగ బధ్ధంగా యెన్నికయిన వాళ్ళు ఇలాంతి అసమానతల్ని ప్రజలకి ఆదేశించటం కుదరదని నిజంగానే తెలియదా??అంతకాలం మేము రాజకీయ నాయకులనే ద్వేషిస్తున్నాం అని చెప్పుకుంటూ ఆ మాట చెప్పింది మాత్రం సామాన్య ప్రజలకే గదా!

     కాశ్మీరు తో సహా పాకిస్తాను వాళ్ళు యేమి అడిగితే అది ఇచ్చేసి పాకిస్థానుతో స్నేహంగా వుండవచ్చు కదా యెందుకీ యెడతెగని కలహాలు అని భారత ప్రభుత్వానికి చాలా గొప్ప సలహాల్ని ఇచ్చిన ఈ మనిషి పొరుగు రాష్త్రం విషయంలో తన తండ్రికి ఆ సలహా ఇచ్చి అది అతను పాటించేటట్లు చెయ్యగలదా?పోనీ ఈ గొప్ప ఆలోచనతో ముందుకెళ్తే రేపు పాకిస్తాను వాళ్ళు నిజాము యెటూ నేను ఇండియాలో కలవను పాకిస్తానులో కలుస్తాను నాకు పాకిస్తాను వరకూ రోడ్డు మార్గం కావాలని అడిగాడు కాబట్టి ఆ నిజాము గారు పరిపాలించిన ప్రాంతాన్ని కూడా అడిగితే సంతోషంగా వొప్పుకుంటుందా?
     బ్రాహ్మణ సంస్కృతిని విమర్శించడానికి హేతువాది నంటాడు,బ్రాహ్మణీకపు హిందువులు  మతం పేరుతో గుడిగోపురాలు కట్టి యెన్నో దుర్మార్గాలు చేశారంటాడు,తన కులపోడికి స్మారక భవనం కడితే మాత్రం సమ్మగా వుంది ఈ హేతువాదికి?!పాముల నెందుకండీ రెండు నాల్కల విషజంతువులని తిడతాం,పాపం?! 

       మా ఇంట్లో పేర్లన్నీ మల్లయ్య,కొమురయ్య,కట్టయ్య్య,ఐలయ్య - ఈ దేవుడి పేరు నుంచి వచ్చినవే.కానీ వెలమల్లో ఈ పేరున్న ఒక్క మగ లేదా ఆద వ్యక్తి మనకి కనిపించడు.నరసింహా రావు,రామారావు,విద్యాసాగర రావు,రాజేశ్వర రావు అనే బ్రాహ్మణీయ దేవతల పేర్లతో,అణచివేతే ఆనందంగా గల సంస్స్కృతితో జీవించే వాళ్ళు మారుతున్న దాఖలాలు కూడా లేవు అంటాడు.అదే ప్రశ్న తిరగేసి మరి మీ కులంలో ఈ పేర్లు యెందుకు కనపడవు?మీ పేర్లు పెట్టుకోని ఇతర కులాల వాళ్ళంతా మీదృష్టిలో దురహంకారులా?అంటే మీ కులం గొప్పదని మీకు వుంది గాబట్టి మీ దేవుళ్ళ పేర్లు మాత్రమే పెట్టుకున్నా మీది కులపిచ్చి కాదు,యెదటి వాళ్ళు మాత్రం వాళ్ళ కులదేవుళ్ళకి బదులుగా మీ కులపు దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటేనే మీకు మంచివాళ్ళుగా కనబడతారు,మాస్టారూ మేం మీ కులపు పేర్లు పెట్టుకోము,కానీ మీరు మాత్రం మా కులపు పేర్లు పెట్టుకోవాలి అంటున్న ఇక్కడ పెత్తనం చేస్తున్నది యెవరంటారు?

     ఈయనకి "సామాజిక శాస్తవేత్త" అనే బిరుదు నామం కూడా వుందండోయ్!తనలోనూ యెదటివాళ్లలోనూ వున్న ఒకే లక్షణం - స్వకులాభిమానం అనేది తనలో వుంటే గొప్ప అనీ యెదటి వాడిలో వుంటే చెత్త అనీ అనడం డబల్ మొరాలిటీ అవుతుందని వున్నత విద్యావంతుడూ సామాజిక శాస్త్రవేత్తా అయిన ఈ పెద్దమనిషికి యెట్లా తెలియలేదబ్బా?

   నేను "మీసాల సుహాసిని" అని ఎటకారంగా పిలుచుకునే రాధాకృష్ణ గారు ఈయనగారి తెలివితేటలకి మెచ్చుతునక అనబడే మరో విషయం చెప్పాడు?"చర్చ్ ఫాదర్ నా పుండును ఆప్యాయంగా కడిగి శుభ్రం చేస్తాడు. హిందూ మతానికి చెందిన స్వాములు నన్ను స్పృశిస్తారా?" - అని అఅడిగాడట!వినగానే ఈ ప్రశ్న ఢాం ఢమేల్ మనిపించేటంత ఇంటిలిజెంట్ అనిపిస్తుంది,కానీ వైద్య సదుపాయం ఇంతగా అభివృధ్ధి చెందిన ఈ రోజుల్లో కూడా పుండుని కడిగించుకోవటానికి డిస్పెన్సరీకి వెళ్ళి ఆయింట్మెంటు పూయించుకుని బ్యాండేజి వేయించుకుని ఆంటిబయాటిక్ ఇంజక్షన్లు చేయించుకోవటం తెలివైన పనా ఫాదర్ దగ్గిరకో స్వామీజీ దగ్గిరకో కెళ్ళి ఆయన మన  పుండు కడుగుతుంటే మనం ఆయన ముఖంలోకి చూసి పరవశించడం తెలివైన పనా?

      ఇంత మూర్ఖపు ఆలోచనల్ని కూడా గొప్పగా భ్రమింప జేసే ఈ పెద్దమనిషి యేదయినా అగ్రకులంలో పుట్టి వుంటే ఇప్పుడు తనే విమర్శిస్తున్న వాళ్ళని మించి దురహంకారాన్ని ప్రదర్శించే వాడేమో గదా!
------------------------------------------------------------------------------------------------------------------

Friday, 2 January 2015

తన కులపోడికి గుడికడితే గొప్పగా మురుసుకుంటున్న కంచెకులతిలకుడి విచ్చిన పొట్టలోని పురుగుల్ని లెక్క పెడదామా?

     "బహుశా ఏసు పుట్టక ముందనుకుంట..ఈ ప్రాంతంలో మల్లయ్య అనె గొర్రెల కాపరి పుట్టాడు.ఆయన పుట్టిన తేది మెట్టిన తేది లెవ్వు.ఆయన కాపులో మంద మంచిగున్నదని,పాలు,పెరుగు,చల్ల సమృధ్ధిగా దొరికాయని,మాంసం మస్తుగా తినగలిగేవారని,చలిని చంపే గొంగళ్ళు బోలెడుండేవని,బహుశా మల్లన్న మరణించిన కొరెళ్ళిలో కురుమ-గొల్ల లంతా గుడి కట్టుకున్నారు.ఈ మల్లన్నకు తెలంగాణలో మరో రెండు గుళ్ళు కూడా వున్నాయి. అవే ఐలోని మల్లన్న,కట్ట మల్లన్న గుళ్ళు.ఈ గుళ్ళు ఐలోని పేరులోనే నా పేరు కూడా వుంది.కట్ట మల్లన్న పేరులో మా అవ్వ |కంచె కట్టమ్మ| వున్నది.మా తాత పేరు కంచె మల్లయ్య.ఈ అందరి దేవతల పునాది పేరది.ఈ విధంగా దేవుడైన మా ముత్తాత ముత్తాత దగ్గర ఒక దేవుడిగా ఎలిసిన"కొమురెళ్ళి మల్లన్న గుడి దగ్గర ముఖ్యమంత్రి దొడ్డి కొమ్రయ్య భవనం కట్టిస్తానని ప్రకటించాడు" - ఇది సుప్రసిధ్ధ రచయిత కంచె ఐలయ్య గారి స్వకులాభిమానం!ఈ విధంగా తన కులం వాళ్ళకి యేదయినా మర్యాద జరిగితే ఆయనా మరియూ ఆయన కులం వాళ్ళు మాత్రమే పొంగి పోవాలి.కమ్మ వాళ్ళకీ,రెడ్లకీ వెలమలకీ అలాంటి హక్కు లేదు?ఒకవేళ వాళ్ళు అలా పొగుడుకుంటే ఈ కంచెకులతిలకుడికి కోపమొస్తుంది - ఈ కంచెకులతిలకుడు ఇదివరలో తీర్మానించినట్టు వాళ్ళది కుల దురహంకారం అని అర్ధం చేసుకోవాలి,తెలిసిందా?

     ఈయనకి "సామాజిక శాస్తవేత్త" అనే బిరుదు నామం కూడా వుందండోయ్!తనలోనూ యెదటివాళ్లలోనూ వున్న ఒకే లక్షణం - స్వకులాభిమానం అనేది తనలో వుంటే గొప్ప అనీ యెదటి వాడిలో వుంటే చెత్త అనీ అనడం డబల్ మొరాలిటీ అవుతుందని వున్నత విద్యావంతుడూ సామాజిక శాస్త్రవేత్తా అయిన ఈ పెద్దమనిషికి యెట్లా తెలియలేదబ్బా?ఇంతకీ వీరి ముత్తాత గారు దేవుడవటానికి వీరు చెప్తున్న కారణమేమిటో తెలుసా - వారి గొర్రెలు పాలు యెక్కువ ఇవ్వటం,వారి గొర్రెల మాంసం రుచిగా వుండటం,వారి గొర్రెల వున్ని మరింత దళసరిగా వుండటమూ నట?!ఆ లెక్కన ఇవ్వాళ్టి డయరీ ఫారముల వాళ్ళకి యెన్ని గుళ్ళు కట్టాలి?

     ఒకే గుక్కలో రెండు రాగాలు పలికించగలగటానికి యెంత ప్రజ్ఞ కావాలో తెలుసా?ఈ కంచె వంశాంబుధి చంద్రుడికి అది పుష్కలంగా వుంది!గుడి కట్టడం ఇష్టమే ట!కానీ ఇప్పుడు మాత్రము వద్దు ట!యెందుకు ట!వాళ్ళకి స్మారక భవనం/గుడి కట్టిన దాని కన్నా ఈ 25 కోట్లు కరువు కాటకాల్లో,అప్పుల ఆవేదనలో,ఆకలి కోరల్లో వున్న తెలంగాణా ప్రజల్ని ఆదుకోవటానికి వుపయోగిస్తేనే ఆ దేవుళ్ళు సంతోషిస్తారు ట! ఈ విధంగా కరువులో వుండగా కట్టవద్దని నాలుగో పేరాలో హెచ్చరించిన ఈయనే నెక్సుటు పేరాలో కరువులోనే మెదక్ చర్చిని కట్టడాన్ని పొగుడుతారు.పైదానికి పూర్తి వ్యతిరేక కారణాలతో దాన్ని కూడా సమర్ధించేశారు,ఆ కట్టడంలో వేలాదిమందికి మంచిగా పని కల్పించారు ట!ఒక బ్రహ్మాండమైన చర్చి చరిత్రలో గొప్పగా నిలిచింది ట!మరి ఇప్పుడూ వేలాదిమందికి పని దొరుకుతుంది కదా అని మనం తింగరి దీర్ఘాలు తియ్యగూడదు!మరి ఇప్పుడూ బ్రహ్మాండమైన స్మారక భవనం/గుడి లేస్తుంది కదా అని మనం వంకర మాటలు మాట్లాద కూడదు!ఒకే గొంతుతో రెండు రాగాలు,వారేవ్వా యేమి ప్రజ్ఞండీ?!

     ఇంతకీ ఇప్పుడు కొందరు ప్రజలు బీదరికంలో వున్నారు గాబట్టి వొద్దంటున్నాడు,కొందరు ప్రజలు బీదరికంలో వుండటం కొన్ని శతాబ్దాల తర్వాత కూడా వుంటుంది కదా?అసలు కట్టవద్దంటున్నట్టా?ఆయనకే తెలియాలి!ఒక ఇంట్లో శుభమా అని ఒక కుర్రాడికి పెళ్ళీడు వచ్చిందనుకోండి,పెళ్ళీ చేశారనుకోండి,సరిగ్గా శొభనం గదిలో కొత్త పెళ్ళి కూతురు పాలగ్లాసుతో అడుగు పెట్టిన వేళ మా పక్కింట్లో కుటుంబం అర్ధాకలితో మాడిపోతున్నది గాబట్టి వాళ్ళు ఆ దరిద్రం నుంచి బయటపడే దాకా నేను నిన్ను ముట్టుకోను అని ఆ పెళ్ళికొడుకు ఆ అమ్మాయితో అంటే ఆ అమ్మాయి అతన్ని యెలా చూస్తుంది?ఇప్పుడు మనం ఈయన్ని కూడా అలాగే చూడాలి!

    బ్రాహ్మణ సంస్కృతిని విమర్శించడానికి హేతువాది నంటాడు,బ్రాహ్మణీకపు హిందువులు  మతం పేరుతో గుడిగోపురాలు కట్టి యెన్నో దుర్మార్గాలు చేశారంటాడు,తన కులపోడికి స్మారక భవనం కడితే మాత్రం సమ్మగా వుంది ఈ హేతువాదికి?!పాముల నెందుకండీ రెండు నాల్కల విషజంతువులని తిడతాం,పాపం?! గుడి లాంటి స్మారక భవనం కడతానన్న వాణ్ణి కూడా పూర్తిగా సమర్ధించడు - వేరే కులపోడు గదా?!

     మా ఇంట్లో పేర్లన్నీ మల్లయ్య,కొమురయ్య,కట్టయ్య్య,ఐలయ్య - ఈ దేవుడి పేరు నుంచి వచ్చినవే.కానీ వెలమల్లో ఈ పేరున్న ఒక్క మగ లేదా ఆద వ్యక్తి మనకి కనిపించడు.నరసిమ్హా రావు,రామారావు,విద్యాసాగర రావు,రాజేశ్వర రావు అనే బ్రాహ్మణీయ దేవతల పేర్లతో,అణచివేతే ఆనందంగా గల సంస్స్కృతితో జీవించే వాళ్ళు మారుతున్న దాఖలాలు కూడా లేవు అంటాడు.అదే ప్రశ్న తిరగేసి మరి మీ కులంలో ఈ పేర్లు యెందుకు కనపడవు?మీ పేర్లు పెట్టుకోని ఇతర కులాల వాళ్ళంతా మీదృష్టిలో దురహంకారులా?అంటే మీ కులం గొప్పదని మీకు వుంది గాబట్టి మీ దేవుళ్ళ పేర్లు మాత్రమే పెట్టుకున్నా మీది కులపిచ్చి కాదు,యెదటి వాళ్ళు మాత్రం వాళ్ళ కులదేవుళ్ళకి బదులుగా మీ కులపు దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటేనే మీకు మంచివాళ్ళుగా కనబడతారు,మాస్టారూ మేం మీ కులపు పేర్లు పెట్టుకోము,కానీ మీరు మాత్రం మా కులపు పేర్లు పెట్టుకోవాలి అంటున్న ఇక్కడ పెత్తనం చేస్తున్నది యెవరంటారు?

     తమ కులంలో తాతలూ ముత్తాతలూ తనూ తిరగేసి మరగేసి తమ కులపు దేవుళ్ళ పేర్లనే పెట్టుకున్నట్టు యెదటి కులాల వాళ్ళు తమ కులపు దేవుళ్ళ పేర్లని పెట్టుకుంటే తమది స్వకులాభిమానం గానూ యెదటి వాళ్ళ్ళది కుల దురహంకారం గానూ కనబడటం అంటే యెమిటో మళ్ళీ చెప్పాలా?అనగనగా పంచతంత్రం కధలో ఒక టవును నక్క జనం తంతుంటే పరుగులు పెడుతూ రంగుల డబ్బాలో మునిగి రంగులంటించుకుని అడివిలోకి దవుడు తీస్తే ఆ పిచ్చి జంతువు లన్నీ కంగారు పడి రాజుని చేసుకుంటే, ఒక రోజు సాటి నక్క వూళవేస్తే వొళ్ళ్ళు మరిచిపోయి తనూ వూళవేసి అసలు రంగు బయట పెట్టుకున్నట్టు - తన కులపోడికి గుడి కడుతున్నారన్న సంబరంలో తన కులపిచ్చిని బట్టబయలు చేసిన ఈ మేడిపండుకి ఇప్పుడు రెండే రెండు దారు లున్నాయి.ఒకటి:తన సామాజిక శాస్తవేత్త అనే గుర్తింపుని రద్దు చేసుకుని కంచెకులతిలక నామధేయంతో ఆ గుడిలో పూజారి/గైడు బతుకు బతకటం!రెండు:తనకు వున్నట్టే స్వకులాభిమానం వెలమలకీ,కమ్మలకీ,రెడ్లకీ వుండటం సహజమే అని వొప్పుకుని ఇకనుంచీ నోరు మూసుకోవటం!తొక్కలే అని అహంకరించి ఇప్పట్లాగే కొనసాగాడనుకోండి,"పోవాయ్ శుంఠాయ్,నువ్వొక డబుల్ మొరాలిటీ వెధవ్వి - నీకూ బెబ్బెబ్బే నీ సుత్తికీ బెబ్బెబ్బే" అని మొహం మీదే అంటాడు యెవడో ఒకడు!ఇంత వయసొచ్చి ఒక కుర్రవెధవతో అలా అనిపించుకోవడం తెలివైన పని కాదు గదా!


     "చాకలి ఐలమ్మ ఒక్క చాకలోళ్ళ హీరోయినే కాదు,తమ హక్కుల కోసం ,ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసే స్త్రీలకు-పురుషులకు ఆమె ఆదర్శం.కొమురం భీం ఒక్క ఆదివాసుల హీరోనే కాదు,మొత్తం మానవజాతికి ఆయన ఆదర్శం." మిగతా కులాల్లో యెంత మంచివాళ్ళు వున్నా వాళ్ళ కులాలకే పరిమితం చెయ్యాలే తప్ప మొత్తం మానవజాతికి ఆదర్శప్రాయం అంటే నువ్వు వొప్పుకోవు,సవాలక్ష వంకలు పెడతావు.యేమయ్యా ఐలయ్యా,మా కులాల్లో పుట్టినోళ్ళని గొప్పోళ్ళని వొప్పుకోలేక నక్కలు బొక్కలు వెతుకునన్న తీర్న వంకలు పెడుతున్న నీ కులంలో పుట్టిన గొప్పోళ్ళని నెత్తిన పెట్టుకునే దురద మాకెందుకయ్యా!

     తనకి నచ్చని హిందూ మతం చెడ్డది,తనకి నచ్చిన యేసుమతం మంచిది అని భ్రమించే ఈ మేధావికి హ్యారీ పోటరు సినిమాలో మనం కూడా చూసి సరదాగా ఫీలయిన మంత్రగత్తెలు చీపుర్ల మీద తిరగుతారనే పిట్టకధకి మూలకధ యెంత క్రూరంగా వుంటుందో తెలుసా!యేసు ప్రవచనాల్ని పైగన్లు అనే జాతిమీద రుద్దటానికి చేసిన భీభత్సానికి ఒక సభ్యతాయుతమయిన ముసుగు అది!ఆ జాతిలో మాతృస్వామ్య వ్యవస్థ వుండేది.పైగా వైద్యంలోనూ నాగరిక జీవన విధానంలోనూ అఖండులైన వాళ్ల దగ్గిర రోగమొచ్చిన వాళ్ల దగ్గిర చేరి మా యేసుని ప్రార్ధిస్తే మీరోగం నయమవుతుందని మోసం చెయ్యడం కుదరకపోవదం వల్ల ఆ ఆదవాళ్ళని మంత్రగత్తెలుగా ముద్రవేసి చంపేశారు!మనవాళ్ళు చీపురుని యెంత పవిత్రంగా చూస్తారో మీకెవరికయినా గుర్తుందా?పదిమంది తిరుగుతూ కాళ్లతో తొక్కేచోట వుంచగూడదు!యెక్కడ వుంచినా నిలువుగా నిలబెట్టాలే తప్ప అడ్డదిడ్దంగా పడెయ్యకూదదు!శుభ్రతే సౌభాగ్యం అని తెలియడం వల్లా చీపురులో లక్ష్మీదేవి వుంటుందనే నమ్మకం వల్లా అలా చేసే వాళ్ళు!అలాంటి నమ్మకమే వున్న పైగన్లని పరమ దుర్మార్గంగా వెక్కిరించారు!అన్ని దుర్మార్గాలు చేసిన క్రీస్తుమతం వుదారమైంది,హిందూమతం మాత్రమే క్రూరమైనది?!

యెవడ్రా ఈ కులపిచ్చి గాడికి సామాజిక శాస్తవేత్త అనే గుర్తింపు నిచ్చింది?!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...