Tuesday 31 July 2018

ప్రపంచంలోని క్రైస్తవు లందరూ కన్యాగర్భమున జన్మించిన దైవపుత్రుడని నమ్ముతున్న జీసస్ క్రీస్తు అసలు చారిత్రక వ్యక్తియే కాదా?


క్రీస్తు జననం గురించి గాబ్రియేలు మేరీకి సందేశం ఇచ్చే సన్నివేశం ఇది:
In the sixth month the angel Gabriel was sent from God to a city of Galilee named Nazareth, to a virgin betrothed to a man whose name was Joseph, of the house of David; and the virgin's name was Mary.

And he came to her and said, "Hail, O favored one, the Lord is with you!" But she was greatly troubled at the saying, and considered in her mind what sort of greeting this might be. And the angel said to her, "Do not be afraid, Mary, for you have found favor with God. And behold, you will conceive in your womb and bear a son, and you shall call his name Jesus. He will be great, and will be called the Son of the Most High; and the Lord God will give to him the throne of his father David, and he will reign over the house of Jacob forever; and of his kingdom there will be no end."

And Mary said to the angel, "How shall this be, since I have no husband?" And the angel said to her, "The Holy Spirit will come upon you, and the power of the Most High will overshadow you; therefore the child to be born will be called holy, the Son of God. And behold, your kinswoman Elizabeth in her old age has also conceived a son; and this is the sixth month with her who was called barren. For with God nothing will be impossible."

ఈ మొత్తం సన్నివేశాన్ని అర్ధం చేసుకోవాలంటే ఇందులోని కొన్ని భాగాల్ని విడిగా తీసి ఒక్కొక్క పాయింటునీ అర్ధం చేసుకుంటే అన్నీ కలిసినప్పుడు ఒక అవగాహన వస్తుంది.మొదట "a virgin betrothed to a man" అనే పాయింటును చూద్దాం.అంటే,మేరీకి ఆరవ మాసం నడుస్తున్నప్పుడు గాబ్రియేలు దర్శనం ఇచ్చేటప్పటికి కూడా జోసెఫ్ అనే డేవిడ్ వంశీయుడితో పెళ్ళి కాలేదు.Betrothel అంటే మనలో తాంబూలాలు పుచ్చుకోవటంతో సమానమైన వివాహ పూర్వ దశ నడుస్తున్నది.ఇంతవరకు దృశ్యం సాఫీగానే ఉన్నది.అయితే చదువుతున్నప్పుడు గానీ వింటున్నప్పుడు గానీ మనకు రావలసిన మొదటి ప్రశ్న "అప్పటికే 6 నెలల గర్భవతి అయిన మేరీని కన్య అని సంబోధించడం ఎట్లా కుదురుతుంది?" అని.గాబ్రియేలు చెప్పిన తర్వాతనే గద మేరీకి కూడా అది దేవుని వీర్యం వల్ల వచ్చిన గర్భం అని తెలిసింది,అంతకుముందు అందరి దృష్టిలోనూ అది ఏ పురుషుడి వల్ల వచ్చిందో తెలియని అక్రమగర్భమే కదా!Betrothel గర్భంతో ఉన్నదని తెలిశాక జరిగితే జోసెఫ్ అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదా?Betrothel జరిగిన తర్వాతనే మేరీకి గర్భం వచ్చిందని తెలిసినా జోసెఫ్ వైపు నుంచి కనీసం ప్రశ్నించే స్థాయి అభ్యంతరం కూడా వ్యక్తం కాలేదా?ఇవేవీ జరగలేదంటే అప్పటి Nazareth సమాజంలో అటువంటి విశృంఖలత సహజమేనా?

అంతే అనుకోవాలి - జోసెఫ్ యొక్క వంశ మూలపురుషుడైన డేవిడ్ ఒక రోజున వేళ కాని వేళలో నిదరనుంచి మేల్కొని కిటికీలో నుంచి చూస్తే ఆరుబయట స్నానఘట్టంలో సరిగంగ స్నానాలు చేస్తున్న సిగ్గెరగని ఒక మదవతి కనబడి పిచ్చెక్కిపోయాడు.ఆరా తీస్తే ఆమె తన సైన్యంలో ఒక మధ్యశ్రేణికి చెందిన వీరుడు.ఈ రాజుగారు వేళాపాళా లేకుండా నిద్రపోతూ లేస్తూ ఉన్న సమయంలో అ మదవతి భర్త ఆ రాజుగారి తరపున దేశం కోసం జరుగుతున్న యుద్ధంలో వీరోచితంగా పోరాడుతున్నాడు!మతిపోయిన రాజుగారు కబురు పెట్టడమూ మదవతి కులుక్కుంటూ రావడమూ పిచ్చ రొమాంటిగ్గా జరిగిపోయింది - ప్రికాషన్స్ తీసుకోకుండా రొమాన్స్ చేస్తే ప్రగ్నెన్సీ రాకుండా ఉంటుందా, వచ్చింది.మదవతి కడుపులో బిడ్డ పడినట్టే దావీదు గారి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది - ఎంత మోతుబరులయినా గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తే సమాజం ఏమీ చెయ్యలేదు గానీ దొరికిపొతే మాత్రం పంబ రేగ్గొడుతుంది!రంకు బయటపడ్డాక రాజే అయినప్పటికిన్నీ రాణీ అయినప్పటికిన్నీ తలొంచుకు నిలబడి కన్నీళ్ళు పెట్టుకుని క్షమించమంటే ఏమో గానీ పొగరు చూపిసే మాత్రం సహించదు గాక సహించదు!అప్పుడు దావీదూ మదవతీ నిలబడిన సన్నివేశం ఎట్లాంటిది?భర్త యుద్ధానికి వెళ్ళిన రోజు యెటూ తెలుస్తుంది గాబట్టి గర్భం వచ్చిన రోజు అ తర్వాతనే అనీ  తెలుస్తుంది కాబట్టి ఆడదాని రాళ్ళతో కొట్టి చంపెయ్యాలి.శిక్ష వెయ్యాల్సింది రాజుగారే - ఆక్రోశం పట్టలేక ఆమె బూతులు తిట్టినా రాజుగారు పడి తీరాలి!

విధి లేక సైన్యంలో ఒకడికి కబురుపెట్టాడు దావీదు ప్రభువు - ఆమె మొగుణ్ణి శత్రువుల మధ్యలోకి పోనిచ్చి మీరు వెనక్కొచ్చెయ్యండని దుర్మార్గపు సనదెసం పంపాడు.అదే జరిగింది.కడుపొచ్చిందని తెలిసేలోపు భర్త చచ్చిపోయాడని చెప్పి తను పెళ్ళి చేసేసుకున్నాడు.ఏసు లాగే దావీదును కూడా దేవుని చేత ఆశీర్వదించబడినవాడు అని చెబుతారు - అంతటి ఘనుదే నదురూ బెదురూ లేకుండా పాపం చేసి సుఖపడ్డాడు,తర్వాత ఘోరంగా దుఃఖ్ఖించేసి శిక్షనుంచి తప్పించుకున్నానని అనుకున్నాడు!ఒకనాడు ఒక పండితుడు కధ చెబుతూ కధలోని ఒక పెద్దమనిషి ఇంటికి వచ్చిన అతిధికి తన పెంపుడు జంతువుల్ని దాచుకుని పొరుగింటివాడు ప్రేమగా పెంచుకుంటున్న వాట్ని చంపి భోజనం పెట్టాడని చెబుతుంటే ఒళ్ళు మరిచిపోయి "ఎంత దుర్మార్గుడు?వాణ్ణి ఏం చేసినా పాపం లేదు!" అని ఆవేశపడిపోయి ఆ పండితుడు తననే వేలెత్తి చూపిస్తూ "అది నువ్వే మహారాజా!అది తప్పయితే అతనికి నువ్వు వెయ్యబోయే శిక్షని నువ్వూ అనుభవించాల్సిందే!" అని ముఖం మీదనే చెప్పేసరికి బిత్తరపోయాడు - పాపం!

మొదట నిగ్రహం కోల్పోయి తప్పు చెయ్యటం,తర్వాత దుఃఖ్ఖించి పాపక్షమాపణ పొందడం అనే విచిత్రమైన క్రైస్తవ ధర్మానుష్ఠానానికి ఆద్యుడు దావీదు మహారాజే!నిజానికి అమాయకత్వంతోనో అజ్ఞానంతోనో చేసిన తప్పులని పక్కన పెడితే తెలిసి చేసిన ఏ పాపానికైనా పరిహారం చెల్లించకుండా కేవలం పశ్చాత్తాపం పేరుతో ఎంత క్షోభ పడినా శిక్ష నుంచి తప్పించుకోలేరు - దావీదు పాపం చెయ్యడానికి వాడిన కత్తి అతని కుటుంబాన్ని సర్వనాశనం చసి కానీ వదల్లేదు - ప్రపంచంలోని పాపులందరి తరపునా యేసు శిలువ యెక్కడం వల్లనూ జరిగిపోయిన పాపాలకి ప్రతి ఆదివారమూ పొర్లిగింతలు పెట్టి యేడ్చే తమ దుఃఖంతోనూ పాపాలు కడిగివేయబడుతున్నాయని క్రైస్తవులు నమ్మడం కేవలం అజ్ఞానం నుంచి పుట్టిన భ్రమ మాత్రమే!

తమ నలుపు తెలుసుకోకుండా హిందువుల మతగ్రంధాలను గురించి అబద్ధాలు చెప్తున్న క్రైస్తవ మత ప్రచారకుల నుంచి వాళ్ళు చెప్తున్న అబద్ధాలను తెలుసుకోకుండా ఆ అబద్ధాలను విప్పి చెప్తున్న హిందువుల మీద ఎగిరెగిరి పడుతున్న క్రైస్తవ మతానుయాయుల వరకు తమ పాపాలకు పడాల్సిన శిక్షల నుంచి ఎవరూ తప్పించుకోలేరు - ఖబడ్దార్!

ఇక్కడే అందరి దృష్టినీ ఆకర్షించకుండా తప్పించుకుంటున్న ఒక విశేషం ఉంది.దాదాపు క్రైస్తవ మత ప్రచారకుల్లో ప్రతి ఒక్కరూ తరచుగా క్రీస్తుని ఒక సామాన్యుడైన గొర్రెల కాపరి అని చెప్తారు.కానీ అతను డేవిడ్, సాల్మన్, లోతు, వంటి రాజుల వంశంలోని వాడు.ఎదర ఉన్న ప్రేక్షకులని బట్టి గానీ తమ భక్త్యావేశాన్ని బట్టి గానీ ప్రచారకుల భాషలో ఒకసారి గొర్రెల కాపరిగానూ ఒకసారి రాజాధిరాజుగానూ రూపం యెత్తుతాడు!డేవిడ్ పొరుగువాడి భార్యని కామించడాన్ని అంత పట్టించుకోవాల్సినపని లేదు లోతు గారి కూతుళ్ళు చేసిన పని తెలిస్తే - ఘనుదైన తండ్రిగారి వీర్యం కోసం అతనికి ద్రాక్షరసం ఇచ్చి మత్తులో ముంచి సంభోగించారు!

పాపం,యోసేపు గారికి కడుపు రగీపోయి అదేమని అడిగితే మేరీ తరపువాళ్ళు దావీశూ కర్ణలో ఎంటీవోడి మాదిరి "మీ తాతల ముత్తాతల బామ్మల రంకుతో మీ వంశము ఏనాడో కుళ్ళిపోయినది!అతి జుగుప్సాకరమైన వంశమున బుట్టి మా పరిశుద్ధ కన్యనే అవమానింతువా?" అని నిలదీస్తే ఏమని జవాబు చెప్పగలడు?కాబట్టి  దైవపుత్రుడనే పులుముడు లేకపోయినా యేసేపు గారు మరియని అనుమానించక భరించి ఉండాలి - గాబ్రియేలు గారి ప్రకటనతో హాయిగా వూపిరి పీల్చుకుని ఉండాలి.

పైపైన తడిమిన నాకే తెలిసిన నిజాలు బైబిలు పఠనంలో మునిగితేల్తున్న మత ప్రచారకులకి తెలియదా యేమిటి?"Of course, not every woman in Jesus' lineage is so clean. There was Bathsheba the adulteress and Tamar who seduced her father-in-law. These things can be forgiven, as many of you have discovered. But don't overlook the importance of Mary. When God chose a mother for his Son, he chose a virgin. Virginity before marriage is important because the recipient of God's best gifts ought to be pure."అని సమర్ధించేసుకుంటున్నారు లెండి!

కంగారు పడుతున్న మేరీకి ధైర్యం చెప్పటానికి గాబ్రియేలు ఉదహరించిన Elizabeth కుమారుడు John the Baptist  క్రీస్తుకి తొలిసారి దీక్ష ఇచ్చిన ప్రముఖుడు!బైటివాళ్ళం గనక మనకి తెలియదు గానీ క్రైస్తవంలోని శాఖల మధ్యన వివాదాలకి కారణమవుతున్న అంశాల్లో ఇది కూడా ఒకటి!విచిత్రం యేమిటంటే, హేతువుకి కట్టుబడి క్రైస్తవ మత సాహిత్యపు యదార్ధత మీద పరిశోధనలు చేస్తున్నవారిలో చాలామంది నీళ్ళ మీద నడవటం,పునరుద్ధానం వంటివాటిని కట్టుకధలుగానే ఒప్పుకుంటూ యదార్ధం కావచ్చునని చెబుతున్న రెండే రెండు సన్నివేశాలు క్రీస్తు జాన్ దగ్గిర బాప్తిజం దీక్ష తీసుకోవటం,రెందు సంవత్సరాల తర్వాత శిలువ మీద మరణించడం మాత్రమే!"how does Luke help Theophilus (and us) in Luke 1–2 know the securely locked-down, unchangeable nature of the reality of what he’s been taught? He does it by weaving together the stories of Jesus and John the Baptist — the announcement of their births, the way they were both conceived, the way they were both born, the songs that their parents sang over them, and even an encounter between them while they were still in the wombs of their mothers.And in telling these stories of John and Jesus, Luke makes clear and solid the most important realities in the universe: God, Christ, salvation, and faith." అంటున్న ఒక క్రైస్తవ పండితుడి విశ్లేషనలో He does it by weaving together the stories of Jesus and John the Baptist అనే వాక్యం నాకు అంతకుముందు ఇతర్లకి తోచని పోలికలు అతడి అల్లిక తర్వాతనే గోచరం అయ్యాయని అనుమానం వచ్చేలా చేస్తున్నది.అయితే జీసస్ చారిత్రకతని నిర్ధారించే అంత ముఖ్యమైన సన్నివేశం అయినప్పటికీ దైవపుత్రుడికి దీక్ష ఇవ్వడం ద్వారా జాన్ జీసస్ కన్న అధికుడని అనుకోవడానికి కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి - పాపం!

John P. Meier అనే యూదు జాతికి చెందిన క్రీస్తుచారిత్రకతానిర్ధారణాపరిశోధకుడు "the crucifixion of Jesus as historical fact and states that based on the criterion of embarrassment Christians would not have invented the painful death of their leader." అని విశ్లేషించదంలో painful death of their leaderని the criterion of embarrassment ఉండటం వల్ల Christians would not have invented అన్నది అనకి ఎలా అర్ధం అవుతుంది?అది కూడా వాస్తవం కాకపోవచ్చుననే అల్లసాని వారి అల్లిక కావచ్చుననీ అనిపించడం లేదా! అట్లాగే "The criterion of embarrassment is also used to argue in favor of the historicity of the baptism of Jesus by John the Baptist as it is a story which the early Christian Church would have never wanted to invent." కూడా వాస్తవం కాకపోవచ్చుననే అల్లసాని వారి అల్లిక కావచ్చుననీ అనిపించడం లేదా!

అసలు క్రైస్తవమతసాహిత్యాన్ని రూపకల్పన చేసిన పండితులు జీసస్ క్రీస్తుకి దేవుని వీర్యంతో కన్యాగర్భమున జన్మించడం వల్లనే గొప్పదనం వచ్చిందనే విషయాన్ని ప్రస్తుతించడంలో అంత పట్టుదలగా ఎందుకు శ్రమిస్తున్నారు?నాకు తోచిన కారణం యేమిటంటే క్రీస్తు యొక్క గొప్పదనం అతని పాండిత్యం వల్ల వచ్చిందని చెబితే అదే పాండిత్యాన్ని సాధిస్తే ఎవరయినా క్రీస్తుతో సమానుడు కావచ్చు.కానీ క్రైస్తవమతసాహిత్యాన్ని రూపకల్పన చేసినవారి ఉద్దేశం ఆ మతాన్ని అనుసరించేవారిని క్రీస్తుతో సమానుల్ని చెయ్యడం కాదు,క్రీస్తులో లీనం చెయ్యడమూ కాదు - మహా కోపిష్టి అయిన యెహోవ దేవుణ్ణి గురించి వర్ణించి బయపెట్టి అతని కోపానికి గురి కాకుండా ఉండాలంటే ఒక రక్షకుణ్ణి చూపించి ఇతన్ని మీరు రక్షకుడిగా ఒప్పుకుంటే యెహోవా కోపం నుంచి తప్పించుకోవచ్చుననే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి ధైర్యం చెప్పటం! ఇందులోని వెసులుబాటు యేమిటంటే పాపాలు చెయ్యడం ద్వారా వచ్చే సుఖభోగాలను తనివితీరా అనుభవించేసి అప్పుడు పశ్చాత్తాపం పేరుతో దుఃఖించి యేసును శరణు వేడి యెహోవ కోపం నుంచి తప్పించుకోవచ్చును- ఆశ్చర్యంగా ఉందా?

నేను హిందువుని కాబట్టి క్రైస్తవం గురించి పాపాన్ని సమర్ధిస్తున్నదనే నేరారోపణ చేస్తున్నానని అనుమానంగా ఉందా?అయితే ఈ మధ్యనే సెయింట్ అయిన  మదర్ ధెరీసా జీవనసాఫల్యతాకార్యక్రమం ఏమిటి?కలకత్తాని కార్యక్షేత్రం చేసుకుని అనాధల్నీ అసహాయుల్నీ చేరదీసి సాకిందని అందరికీ తెలుసు.అయితే, కొందరు ఆమె సంస్థలో పని చేసినవారే బయటకొచ్చి చెబుతున్న దాని ప్రకారం అదంతా మతమార్పిడి కోసమేనని తెలుస్తున్నది.కొందరు వైద్యం చేయించితే బతికే స్థితిలో ఉన్నవాళ్ళకి కూడా వైద్యం చేయించేది కాదట - ఆమె వాళ్ళని తీసుకొచ్చింది రోడ్డు మీద చావకుండా వీళ్ళ మధ్యన చావడానికేనట!అదీగాక చావబోయేముందు మతం మారడానికి ఒప్పుకోని వాళ్ళకి తెలియకుండా వెనకనుంచి తల తుడుస్తూనో మరో పని చేస్తూనో బాప్తిజం తతంగాన్ని నడిపించేసి వాళ్ళని క్రైస్తవులుగా మార్చడం అక్కడ మామూలు వ్యవహారం. ఆవిడ కొందరు ప్రభుత్వాధినేతల్నీ ధనవంతులైన వ్యాపారుల్నీ కూడా కలిసేది - వాళ్ళు పాపాలు చేస్తున్నారని తెలిసినా పాపాలు చెయ్యకండని చెప్పినట్టు నేనెక్కడా వినలేదు.ఆవిడ అడిగేదల్లా తమ కార్యక్రమాలకి డబ్బు ఇమ్మని, దానికి బదులు ఆమె వీళ్ళు చేసిన పాపాలకి వీళ్ళ తరపున ప్రార్ధిస్తుంది - అంటే, నువ్వు ఎంతటి పాపాత్ముడివైనా సరే ఆమె నువ్వు పాపం చెయ్యకుండా నిరోధించదు, నువ్వు ఆమె మతమార్పిడికి డబ్బు సహాయం చేస్తే చాలు నీ పాపాలకి నీకు శిక్ష పడకుండా కాపాడుతుంది!

ఈ సంక్లిష్టమైన అమరిక తెలియని అమాయకులకి తమ పక్కనే కొందరు పాపాత్ములు చర్చి ఇచ్చిన గ్యారెంటీతో తమని రాచి రంపాన పెడుతున్నా సహించి వూరుకునే విధేయతని అలవాటు చెయ్యాలి.ప్రశ్నించడానికే వీల్లేని స్థాయిలో రక్షకుడి పట్ల విధేయత పుట్టాలంటే ఆ రక్షకుడు తమకు చేరరాని ఎత్తులో ఉండాలి.ఎంత కష్టపడి అల్లినప్పటికీ అబద్ధాలు గనక తర్కానికి దిగితే వాటి డొల్లతనం తెలిసిపోతూనే ఉంటుంది.అందుకే, క్రైస్తవమతప్రచారకుల ప్రసంగాలు పదాలలో ఆడంబరమూ ఆంగికానికి సంబంధించిన హడావిడితో నిండి వుంటాయి."If you took all the greatest thinkers of every country and every century of the world and put them in a room with Jesus, they would shut their mouths and listen to the greatness of his wisdom. All the greatest generals would listen to his strategy. All the greatest musicians would listen to his music theory and his performance on every instrument. There is nothing that Jesus cannot do a thousand times better than the person you admire most in any area of human endeavor under the sun. Words fail to fill the greatness of Jesus." అని వీళ్ళు చెప్పుకుంటున్న ప్రశంసలోని పాండిత్యమే అతనికి ఉంటే ఆనాటి తన ప్రతికక్షులని పాండిత్యంతో మెప్పించి సన్మానించబడేవాడు గానీ నిస్సహాయుడై తల దించుకుని నిలబడిపోయి శిక్షకి గురై దయనీయమైన చావుని కొని తెచ్చుకునేవాడు కాదు గదా!

ప్రపంచంలో గతంలోనీ ప్రస్తుతంలోనీ భవిష్యత్తులోనీ అందరి పాపుల కోసమూ యేసు ఒక్కడే ఒక్కసారి మాత్రమే శిలువ యెక్కడం వెనక ఉన్న హేతుబద్ధత యేమిటో నాకు యెంత తన్నుకున్నా అర్ధం అయ్యి చావడం లేదు!కొందరు అమాయకులైన క్రైస్తవులు తమ ఫాదర్లు చెప్పగా నమ్మి మనకి "ఆనాడు యేసు శిలువ మీద అనుభవించిన బాధని మనమూ అనుభవిస్తే మనస్సు పరిశుద్ధమై పాపాలు చేయకుండా ఉంటా"మని చెబుతారు కానీ క్రైస్తవులలోని పాపాత్ములకి మాత్రం ఈ బాధలు పడాల్సిన ఖర్మ లేదు - వారికోసం మదర్ ధెరీసా లాంటివాళ్ళు ఉన్నారు కదా!

జీసస్ పుట్టుకని గురించే క్రైస్తవమతసాహిత్యం నొక్కి చెప్తూ వుండటం వల్ల ఈ బైబిలు వాక్యం చుట్టూ ఇంత విశ్లేషణ చెయ్యాల్సి వచ్చింది - అసలు జీసస్ ఒక యదార్ధ వ్యక్తి అని నిర్ధారించి చెప్పాలంటే అతనికి "దేవుని వీర్యం వలన కన్య గర్భము నందు జన్మించుట" అనే మహత్వాన్ని కూడా తిరస్కరించాల్సి వస్తుందని అతని చారిత్రక యదార్ధతని నిరూపించాలని ఉత్సాహపడుతున్న క్రైస్తవులకి తెలియటం లేదు!చారిత్రక యదార్ధతను గురించి పరిశోధిస్తున్న క్రైస్తవ పరిశోధకులు కూడా నీటిమీద నడవతం లాంటి వాటిని కట్టుకధలని ఒప్పుకుంటున్నప్పుడు దీన్ని కూడా కట్టుకధ అని ఒప్పుకోవాలి కదా!

అలాంటప్పుడు క్రీస్తు కూడా పెరుమాళ్ మురుగన్ తన నవల్లో చెప్పినట్టు సంతానలేమితో బాధపడుతున్న ఆదవాళ్ళు తీర్ధయాత్ర పేరుతో పరపురుషులతో గర్భం దాల్చి దేవుడి ప్రసాదం అని చెప్పుకున్న అనేకమంది శిశువుల వంటివాడే అవుతాడు - కాబట్టి జీసస్ క్రీస్తు యదార్ధ వ్యక్తి అని చెప్పుకోవటం అంటే అతడు అక్రమసంతానం అని ఒప్పుకోవటమే అవుతుంది - అవునా కాదా?ఎందుకంటే,చరిత్రలో క్రీస్తు జననకాలంగా చెప్పబడుతున్న సమయానికి మానవజాతిలో ఒక శిశువు పుట్టాలంటే మానవజాతికి సంబధించిన పురుషుడి వీర్యం మానవజాతికి సంబంధించిన స్త్రీ అండాన్ని కలవడం ద్వారా తప్ప మరొకలా జరగడం అసంభవం!ఈ మెలిక అర్ధం కాని అమాయక క్రైస్తవులు అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలివైన యూదుల కుట్రకు లోనై ఈ చర్చలో పాల్గొని జీసస్ క్రీస్తు చారిత్రక వ్యక్తియేనని నిర్ధారించి శత్రువుల నోళ్ళు మూయించాలని వీరావేశంతో విజృంభిస్తున్నారు!

క్రైస్తవమతాభిమానులు కూడా ఒప్పుకుంటున్న "All extant sources that mention Jesus were written after his death. The Christian Testament represents sources that have become canonical for Christianity, and there are many apocryphal texts that are examples of the wide variety of writings in the first centuries AD that are related to Jesus.Many scholars have questioned the authenticity and reliability of these sources, and few events mentioned in the gospels are universally accepted." అనే విశ్లేషణ ప్రకారం ఈనాడు మనం చూస్తున్న సాహిత్యం మొత్తం జీసస్ చనిపోయిన తర్వాత కూర్చబడినదని తెలుస్తున్నది.అదీ గాక వాటిని బట్టి జీసస్ చారిత్రక వ్యక్తీ అని నిర్ధారించడానికి క్రైస్తవ పండితులే సందేహిస్తున్నారంటే అవన్నీ విశ్వసించదగినవి కావని కూడా తెలుస్తున్నది!

బైబిలు మీద సవివరమైన పరిశోధనలు చేసినవారు "The historical reliability of the gospels refers to the reliability and historic character of the four New Testament gospels as historical documents. Little in the four canonical gospels is considered to be historically reliable.The Synoptic Gospels are the primary sources of historical information about Jesus and of the religious movement he founded. These religious gospels–the Gospel of Matthew, the Gospel of Mark, and the Gospel of Luke–recount the life, ministry, crucifixion and resurrection of a Jew named Jesus who spoke Aramaic. There are different hypotheses regarding the origin of the texts because the gospels of the New Testament were written in Greek for Greek-speaking communities, and were later translated into Syriac, Latin, and Coptic. The fourth gospel, the Gospel of John, differs greatly from the Synoptic Gospels." అనీ "Since there are more textual variants in the New Testament (200–400 thousand) than it has letters (c. 140 thousand), scholars use textual criticism to determine which gospel variants could theoretically be taken as 'original'. To answer this question, scholars have to ask who wrote the gospels, when they wrote them, what was their objective in writing them, what sources the authors used, how reliable these sources were, and how far removed in time the sources were from the stories they narrate, or if they were altered later. Scholars may also look into the internal evidence of the documents, to see if, for example, a document has misquoted texts from the Hebrew Tanakh, has made incorrect claims about geography, if the author appears to have hidden information, or if the author has fabricated a prophecy. Finally, scholars turn to external sources, including the testimony of early church leaders, to writers outside the church, primarily Jewish and Greco-Roman historians, who would have been more likely to have criticized the church, and to archaeological evidence." అనీ చెబుతుండటాన్ని బట్టి క్రైస్తవులు మాది ఒకే పుస్తకం, ఒకే సత్యం,ఒకే మార్గం అని పొగుడుకోవటం కూడా అబద్ధమేనని తెలుస్తున్నది కదా!

వాళ్ళు గాస్పెల్స్ అని పిలిచే వాటిలోనే అనేక వెర్షన్లు ఉండటం వల్ల ఒకదానికొకటి పొంతన లేని అసమన్వయ సుత్తి  పరుచుకుని ఉన్నదనేది నిష్ఠిర సత్యం!అన్నింటిలోనూ కనిపిస్తున్న సామాన్యమైన కధనాలు రెండే రెండు - ఒకటి జీసస్ జాన్ నుండి బాప్తిజం దీక్ష తీసుకుని పరిశుద్ధుడు కావటమూ, అది జరిగిన రెండు లేక మూడు సంవత్సరాల లోనే పిలాతు హయాములో శిలువ మీద మరణించడమూ మాత్రమే.ఈ రెండింటికీ అప్పటి రోమన్ ప్రభుత్వ దైనిక ఉల్లేఖనలలో రెండూ యూదుల మత చారిత్రాక ఉటంకింపులలో రెండూ సాక్ష్యాలు కనబడుతున్నాయి.ఈ నాలుగూ తప్ప క్రీస్తు గురించి సాక్షాత్తూ క్రైస్తవులే నియోగించిన ఒక అధికారికమైన పరిశోధనా బృందం కొన్ని దశాబ్దాల పాటు కృషి చేసినా మరొక సాక్ష్యాన్ని బైటికి తియ్యలేకపోయింది!

ఈ నాలుగూ మాత్రం క్రీస్తు చారిత్రకంగా ఒకనాడు రక్తమాంసాలతో నడయాడిన  చారిత్రక వ్యక్తియే అని నిర్ధారించడానికి తిరుగులేని సాక్షాలే నన్నది యదార్ధం!అయితే నాస్తికులు దాదాపు 200 యేళ్ళ క్రితమే లేవదీస్తే యూదులు అందిపుచ్చుకుని మొదలుపెట్టిన ఈ వివాదంలోకి వీరావేశంతో దిగిన  క్రైస్తవులు ఇంత కష్టపడి క్రీస్తు యొక్క చారిత్రక రూపాన్ని తెలుసుకుని యేమి సాధించారో అర్ధమైన బుర్రలో పాదరసం లాంటి చురుకైన సరుకున్న  నాలాంటివాళ్ళకి పగలబడి నవ్వాలనిపిస్తుంది:-)కొంచెం క్రైస్తవం పట్ల స్నేహశీలత ఉన్నవాళ్ళకి జాలితో హృదయం ద్రవించిపోతుంది:-(

పరిశోధకులు "The Roman historian Tacitus, in his Annals (written ca. AD 115), book 15, chapter 44,[45] describes Nero's scapegoating of the Christians following the Fire of Rome." అని కనుక్కున్నదాన్ని బట్టి నీరో ఫిడేలు వాయిస్తూ రోముని తగలబెట్టాడని ఇప్పుడు మనం వింటున్న కధకి ముక్తాయింపుగా నీరో అప్పటి అగ్నిప్రమాదాన్ని క్రీస్తుజనుల మీదకి తోసేసి వాళ్ళ్లఓ కొంతమందిని చంపించాడనే వివరంలో ఒక సాక్ష్యం దొరుకుతుంది. ఒంకా ముందుకెళ్తే, "He writes that founder of the sect was named Christus (the Christian title for Jesus); that he was executed under Pontius Pilate; and that the movement, initially checked, broke out again in Judea and even in Rome itself." అని పేర్కొనటాని బట్టి

తర్వాత జీసస్ క్రీస్తుకు వేసిన శిక్షను అమలు చేసిన రోమన్ ప్రభుత్వాధికారి తనచేత నిర్వర్తించడిన కర్తవ్యాన్ని నెరవేర్చినట్టు నమోదు చేసిన వివరం కూడా బలమైన సాక్ష్యమే!మళ్ళీ అంతలోనే "Some scholars question the historical value of the passage on various grounds." అన్న సూత్రీకరణ కనబడి ఈ రోమన్ రికాఎడుకు కూడా అంత బలమైన సాక్ష్యం కాదేమోనని అనిపిస్తుంది.అయితే, యూదుల మతసాహిత్యంలో కనిపించే రెండు సాక్ష్యాలలో ఒకటి చాలా సుదీర్ఘమై వుంటుంది, కానీ క్రైస్తవమతాభిమానులైన పండితులు కూడా తిరస్కరిస్తున్నారు.ఎందుకంటే, క్రీస్తు పట్ల వ్యతిరేకతని ప్రదర్శించే యూదుల వైఖరికి విరుద్ధంగా క్రీస్తు పట్ల ప్రశంసలు కురిపించే ధోరణిలో ఉన్నాయి - అక్కడ క్రైస్తవుల దిద్దుబాటు తప్పులతడక పాండిత్యం కొట్టొచ్చినట్టు కనబడుతుండటంతో ఎల్లరూ దాన్ని తిరస్కరించేశారు.ఇంక రెండవది చాలా క్లుప్తంగా ఉంటుంది,అదీ గాక క్రీస్తుని పరోక్షంగా మాత్రమే ప్రస్తావిస్తుంది. అయితేనేం, సాక్ష్యం బలమైనదే!

మరి ఇంత స్పష్టంగా సాక్ష్యాలు చూపించి క్రైస్తవులు పండగ చేసుకోవాల్సిన విషయాన్ని చెప్తూ మళ్ళీ నేను క్రైస్తవుల మీద ఎందుకు జాలిపడుతున్నానో తెలియాలంటే "Jesus was a Galilean Jew.His activities were confined to Galilee and Judea." అని క్రైస్తవులే ఒప్పుకుంటున్న వాస్తవాల ప్రకారం  యూదులు తమ జాతిలో పుట్టి తమకు ఖ్యాతిని తీసుకురావాలని చూస్తున్న జీసస్ క్రీస్తుని ఎందుకు ద్వేషించారనే అనుమానం రావాలి, వచ్చిందా?ఇంతవరకు ఆ కోణంలో ఆలోచించని క్రైస్తవ పండితులు ఇకముందు ఈ పీటముడిని కూడా విప్పాల్సి ఉంటుంది.కొండని తవ్వి యెలకని పట్టినట్టు దైవపుత్రుడనే అందమైన కల్పనను తొలగించుకుని అక్రమసంతానం అని ఒప్పుకోవాలి.

ఆనాటి జీసస్ క్రీస్తు అంటే, చిల్లర మల్లర కనికట్లు చేస్తూ స్వజనం చేతనే దూషించబడుతూ యవ్వనం వచ్చాక జాన్ వల్ల తన జన్మసంబంధమైన అపరిశుద్ధతను తొలగించే దీక్షను పుచ్చుకుని ,అది జరిగిన రెండు మూడేళ్ళకే రాజద్రోహ నేరం ఆపాదించబడి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే పాండిత్యం లేక రోమన్ పండితుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక శిక్షకు గురై శిలువ మీద మీద నిస్సహాయుడిగా మరణించిన గలిలీ,జుడియాలు దాటితే ఎవరికీ తెలియని ఒక అనామకుడనే వాస్తవాన్ని గుండె చిక్కబట్టుకుని ఒప్పుకుని తట్టుకోవాలి.

Dale Allison, Bart Ehrman, Amy-Jill Levine and Geza Vermes లాంటి భక్తశిఖామణులైన చరిత్రకారులు కూడా "Christ Myth Theory"ని తమ శాయశక్తులూ ఉపయోగించి కొట్టిపారెయ్యగలిగినప్పటికీ "the historical Jesus as a Jewish preacher who never claimed to be God nor had any intention to found a religion" అనే సూత్రీకరణ చెయ్యక తప్పలేదంటే సామాన్య క్రైస్తవులు జీసస్ క్రీస్తు యొక్క చారిత్రక యదార్ధ రూపాన్ని చూసి గర్వించడానికి ఏమి ఉంది?

ఇవ్వాళ క్రైస్తవులు జీసస్ యొక్క చారిత్రక యదార్ధతను గురించి పట్టుబడితే కన్యగర్భమున జన్మించడం దగిర్నుంచి పునరుత్ధానం వరకు గల సమస్తమైన మహిమల్నీ పిట్టకధల కింద తేల్చిపారేసి వాటిని నమ్మడం మానెయ్యాలి,ఆ మహిమలే ముఖ్యం అంకుంటే అతడు కల్పితవ్యక్తి అని ఒప్పుకోవాలి - ఇప్పుడేం దారి దేవుడా!

ముందూ వెనకా చూసుకోకుండా జీసస్ క్రీస్తు యొక్క చారిత్రక యదార్ధతని నిరూపించటానికి ఇంత దూరం వచ్చేసిన క్రైస్తవులు వెనక్కీ వెళ్ళలేని ముందుకీ వెళ్ళలేని ఇరకాటంలో అడకత్తెరలో పోకచెక్కలా ఇరుక్కుపోయారు.
ఆమెన్, హల్లెలూయా, కుయ్యోమొర్రో!

36 comments:

  1. పాత పుస్తకం (old testament) నిండా ఎన్నెన్నో భవిష్య వాణులు (prophecies) ఉన్నాయి. రానురాను ఈ జోస్యాలు ప్రజల మనసులలో ముద్ర పడ్డాయి.

    తర్జుమా సమస్యలు షరా మామూలే.

    వీటన్నిటి ప్రభావం ప్రత్యక్ష సాక్షుల మీద పడుతుంది. ఏతావాతా గత జోస్యాలు నెరవేరాయని రాయడం, భావి తరాలు దాన్ని నమ్మడం పరిపాటి.

    Self fulfilling prophecies are thus common in religious literature.

    ReplyDelete

  2. శ్రీవారి ఆభరణాలపై భక్తులలో అనుమానం లేపుతున్నారే :)


    జిలేబి

    ReplyDelete
  3. Oh my God!!
    దేవుని బిడ్డ గా పిలవబడే జీసస్ జననం వెనుక ఇంత కథ ఉందా..
    ఒక evolutioner గా,నాలుగు మంచి మాటలు చెప్పిన వ్యక్తి గా జీసస్ అంటె గౌరవం ఉంది గాని జీసస్ పేరుతో మత మార్పిడులు చేసే వారి పట్ల నాకు ఏ మాత్రం గౌరవం లేదు..సార్
    Its purely my personal opinion ..ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదు..

    ReplyDelete
  4. హరిబాబు గారూ, డా. అంబేడ్కర్ గారిపై మీరు చేసిన విమర్శ మీకూ వర్తిస్తుంది కదా?

    ReplyDelete
    Replies
    1. మీ ఉద్దేశం నాకు అర్ధం అయ్యింది!

      అంబేద్కర్ రాముడి గురించి చేసిందీ నేను జీసస్ గురించి చేసిందీ పూర్తి వ్యతిరేకం కాబట్టి నా కామెంటు నాకే తగలడం అనేది జరగదు.

      ఇక్కడ నాకుగా నేను అతని పుట్టుకను గురించి ఎలాంటి నిందార్హమైన మాటనీ వాడలేదు.పాండిత్యానికే తప్ప పుట్టుకకీ గొప్పదనానికీ సంబంధం లేదనే అంటున్నాను.నేను ఎత్తి చూపించినది యేమిటంటే క్రీస్తు పాండిత్యం చేత గొప్పవాడయ్యాడు అని చెప్పకుండా కన్య గర్భమున దేవుని వీర్యం ద్వారా జన్మించడం చేత గొప్పవాడయ్యాడు అని క్రైస్తవులు చెప్పుకోవటాన్ని మాత్రమే.

      నేను ఎక్కువ సాగదీసి చెప్పకపోయినా క్రైస్తవులు కూడా చెబుతున్న "అన్ని వెర్షన్లలోనూ కామన్ అయినవి బాప్తిజమూ,శిలువ వెయ్యబడటమూ అనే రెండు మాత్రమే!" అని అర్ధం అయితే అతడు ఖచ్చితంగా అక్రమసంతానమే అని తీర్మానించడం కుదరదనే అనిపిస్తున్నది నాకు.కానీ ఇతర మతాల ప్రవక్తల కంటేనూ తమ అంతంలోనే అందరి కంటేనూ తమ జీసస్ క్రీఎస్తుని అధికుడిగా నిలబెట్టాలనే దురదతో వాళ్ళు పులుముకున్న కధలోనే ఆ అర్ధం వచ్చే అవకాశం ఉన్నది!

      నా ఉద్దేశం మీకు అర్ధం అయ్యిందా?

      Delete
    2. మీ ఉద్దేశ్యం నాకు అర్ధం అయింది. కాకపొతే కొంచెం లోతుకు వెళ్తేనే తెలుస్తుంది.

      Delete
    3. ఇంకా లోతుకి వెళ్తే నేను ముణిగిపోతానండి - అసలే పొట్టి బుడంకాయని:-)

      Delete
  5. ఒక విషయం గురించి రాస్తుంటే, కనీసం ఆమేరకు విషయ పరిజ్ఞానం తెచ్చుకోవాలి. మీరు రాస్తున్న జోసెఫ్, దావీదు కథలగురించి మీరు బైబిలు కనీసం ఆమేరకైనా చదవకుండానే రాసినట్టుగా అర్ధం ఔతోంది. దీన్నిబట్టి మీరు ఖురాన్ కూడా ఎవడో చెప్పిందే రాసారని, మీరు ఏమీ చదవలేదని అనుకోవొచ్చు.

    "18 యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.
    19 ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.
    20 అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటక
    21 తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.
    22 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
    23 అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. "

    ReplyDelete
    Replies
    1. @Chiranjeevi Y1 August 2018 at 21:04
      ఒక విషయం గురించి రాస్తుంటే, కనీసం ఆమేరకు విషయ పరిజ్ఞానం తెచ్చుకోవాలి. మీరు రాస్తున్న జోసెఫ్, దావీదు కథలగురించి మీరు బైబిలు కనీసం ఆమేరకైనా చదవకుండానే రాసినట్టుగా అర్ధం ఔతోంది. దీన్నిబట్టి మీరు ఖురాన్ కూడా ఎవడో చెప్పిందే రాసారని, మీరు ఏమీ చదవలేదని అనుకోవొచ్చు.

      hari.S.babu
      నేను రాసిన ఒక వ్యాసానికే మీకు ఇలా అనిపించింది కదా, మరి,ఈ దేశంలో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచీ క్రైస్తవ మత ప్రచారకులు తిరువళ్ళువార్ బైబిలుని కాపీ కొట్టి తిరుక్కురల్ రాశాడని చెప్పటం దగ్గిర్నుంచి ఇప్పుడు బ్రహ్మకీ సరస్వతికీ రంకును కనిపట్టినట్టు వీడియోలు పెట్టి చెబుతున్న అబద్ధాలను గురించి మాకెంత కోపం రావాలి?వాళ్ళు మాత్రం హిందూ గ్రంధాలన్నీ పూర్తిగా చదివి అర్ధం చేసుకునే మాట్లాడుతున్నారా?

      బ్రహ్మకీ సరస్వతికీ తండ్రీ కూతుళ్ళ వరస కలిపి వాళ్ళ మధ్యన శ్రంగారం జరిగిపోయిందని చెబుతూ అది ఘోరం,నేరం,దారుణం,అనైతికం,హిందూమతం యొక్క కామకండూతికి నిదర్శనం అంటున్నప్పుడు వాళ్ళకి లోతు కుమార్తెల విషయం గుర్తుకు రాలేదా?

      బ్రహ్మకీ సరస్వతికీ మధ్య కనీసం దేహస్పర్స కూడా జరగలేదే!హిందువుల దృష్టిలో ఆ దేవుళ్ళే కాదు మీరూ మేమూ కూడ జ్ఞానం యొక్క వ్యక్త రూపాలు.లక్ష్మీ నారాయణుల లోనూ పార్వతీ పరమేశ్వరుల లోనూ కనబడేది మనలాంటి దాంపత్యశృంగారంతో కూడుకున్న వివాహసంబంధం కాదు.

      నేనిదివరకు ఓక పోలిక చెప్పాను.మళ్ళీ అదే చెబుతున్నాను.కుండ అనేది కంటికి కనబడాలంటే కుండను తయారు చెయ్యడానికి దానితో అవసరం ఉన్న మనిషికి కుండను చెయ్యగలిగిన జ్ఞానం ఉండాలి.అంటే,కుండ ఆనెది ఆ మనిషిలోని కుండను చెయ్యగలిగిన జ్ఞానానికి వస్తురూపం.ఇది అర్ధమయ్యింది కదా!
      ఇది అర్ధం కాకపోతే మీరు ఇక్కడ మళ్ళీ మళ్ళీ కామెంట్లు వేసి ఉపయోగం లేదు. అర్ధం అయితే అనంతకోటి విశ్వాల్లో మనం ఉంటున్న విశ్వంలో మనతో సహా వృక్షజాతులూ పశుపక్ష్యాదులూ రూపాలు ధరించడానికి అవసరమైన జ్ఞానరాశి యొక్క దృశ్యరూపమే బ్రహ్మ!అయితే, వస్తురూపాలు వాటిలో అవి జ్ఞానాన్ని పంచుకోవటానికి వాక్కు చాలా అవసరం కదా!.ఈ వాక్కు కూడా మొదత ఆ జ్ఞానరాశిలోనే దాక్కుని ఉండి తర్వాత్ విడివడి పక్కకి వచ్చి వస్తురూపాలలో చేరి సృష్టి చలనానికి ఆవసరమైన భాషని ప్రసాదిస్తుంది., సృజించబడిన వాటిలో ప్రవేశిస్తుంది.తనయొక్క కీలకమైన ఈ ప్రాధాన్యాత వల్ల తన జన్మకి కారణమైన జ్ఞానస్వరూపానికి కూడ మోహాన్ని పుట్టించగలిగిన ప్రభావశీలమైనది ఈ శక్తిస్వరూపం. అందుకే, మీవాళ్ళు ఉదహరించి గోల చేస్తున్న కధలోని తర్వాతి మలుపులో బ్రహ్మ తన తప్పు తెలుసుకుని తనని మోహానికి గురి చేసిన ఆ రూపాన్ని వదిలి మరో రూపాన్ని ధరించి ఆమెనే ప్రార్ధించి తనకి తోడుగా ఉంచుకుని సృష్టికార్యాన్ని కొనసాగించుతాడు.బ్రహ్మ సృష్టి సృష్టిని మొదలుపెట్టే జ్ఞానానికి ప్రతిరూపం అయితే విష్ణువు రక్షించే జ్ఞానానికి ప్రతిరూపం.అయితే,జ్ఞానం రూపం కింద మారాలంటే శక్తి పని చెయ్యాలి గాబట్టి శక్తిస్వరూపాలుగా లక్ష్మి, సరస్వతి పక్కన ఉంటారు అని హిందూమతసాహిత్యసృష్టికర్తలు చెబుతున్నారు.

      ఇవి చాలా గంభీభీరమైన విషయాలు.ఇలాంటి విషయాల్ని అర్ధం చేసుకోవటానికి కూడా కొంత స్థాయిలో ధర్మాధర్మవిచక్షణజ్ఞానం ఉండాలి.అది లేని మీవాళ్ళకి అందులో లోతు కుమార్తెల రంకే కనపడింది.దానినే అందరికీ టముకేసి చెబుతున్నారు - ఎందుకు?హిందూమతం నుంచి భక్తుల్ని లాగి సంఖ్యని పెంచుకోవాలంటే హిందూమతం కన్న క్రైస్తవమతం గొప్పదని నిరూపించాలి.సూటైన పద్ధతిలో హిందూమతం కన్న క్రైస్తవమతం గొప్పదని చెప్పలేక చిల్లిపడ్ద కుంచానికి వేలడ్డం పెట్టి కొలిచినట్టు హిందూమతాన్ని దిగలాగడం లాంటి చెత్తపనులు మీవాళ్లు చెయ్యకుండా ఉంటే నేను క్రైస్తవం మీద ప్రతిదాడిని మొదలుపెట్టేవాణ్ణి కాదు.

      నేనూ నాలాంటి నిజమైన హిందువులూ "ఇతరులు నీకు యేది చేస్తే బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యకపోవటమే అన్ని ధర్మాలలోకీ ఉత్తమమైనది" అనే సంప్రదాయానికి కట్టుబడి ఉన్నాం గనకనే ఇంత సుదీర్ఘమైన నిరంతరాయమైన దాడి జరుగుతున్నప్పటికీ నిగ్రహంతో ఉన్నాము.ఎప్పటినుంచో .మీవైపునుంచి ఆగకుండా జరుగుతున్న దాడికి ఇది ప్రతిదాడి మాత్రమే!

      మేము చేస్తున్న ప్రతిదాడి అన్యాయమనిపిస్తే మీరూ మీవాళ్ళూ చేస్తున్న తొలిదాడి కూడా అన్యాయమే కావాలి కదా - ఏమంటారు?

      Delete
  6. బైబిల్ నిజాలు
    https://www.facebook.com/BibleRevealedNow

    ReplyDelete


  7. హరిబాబు నిన్ను ప్రభువా !
    చురకత్తిని చేగొని పొడి చూరుగ వాయిం
    చి రవణము చెందు చుండెను !
    పరలోకపు తండ్రి ! నీ కృపను జూపుమయా!

    జిలేబి
    ఆమెన్ :)

    ReplyDelete
  8. voiceofbible.blogspot.com

    ReplyDelete
  9. voiceofbibleinfo.blogspot.com

    ReplyDelete
  10. దావీదు అంటే వడిసెలతో రాక్షసుడిని చంపిన (David-Goliath fight) వీరుడేనా?

    ReplyDelete
  11. @chirunjeevi Y
    "అని universal rationalist పోజు పెట్టి జారుకోవటం - ఇదివరకు చాలామంది చాలాసార్లు చేసిన పనే.ఎవడికి తెలియదు ఇవి తప్పుకుపోయే ఎత్తుగడలని?"

    ఎర్రి పప్పలు అనే మాటకంటే ఇది మాత్రం చాలా గౌరవంగా వుందా? అవతలి వ్యక్తి చర్చించడానికి ఒచ్చినప్పుడు మీరు తోపు అనిపించుకోవాలి అంటే.. ఇలా మాట్లాడితే సరిపోతుందనుకుంటూన్నారా?
    >
    >
    >
    ఇక దావీదు విషయంలో, అతను చేసిందాన్ని తప్పు అని బైబిల్ చెబుతోంది అని చూపించాను. మీరేమో బైబిల్ ప్రకారం అది కర్రక్టే అని చూపించడానికి పూర్తిస్థాయిలో ప్రయత్నించారు. దానికి సమర్ధనగా "మీ వాళ్ళు మా గ్రంధాలని వక్రీకరించలేదా" అంటూ.. నావికూడా వక్రీకరణలే అని ఒప్పేసుకుంటారు.
    >
    >
    >
    తప్పుల్ల్లేని మతం గాని, మత గ్రంధంగాని చూపమంటే.. కమూనిజం మీద పడి, దాన్లో తప్పుల్లేకపోతేనే హిందూ గ్రంధాల్లో తప్పుల్లేవని చూపిస్తానని చాలెంజిలు విసురుతారు. అలా మీరే మత గ్రంధాలన్ని తప్పులతడక అని ఒప్పేసున్న >
    >
    >
    ఓ వర్గం గురించి నేను రాసింది, బ్రాహ్మణ వర్గం గురించి అని మీరు బుజాలు తడుకోవాల్సిన అవసరంలేదు. బ్రాహణులలో కూడా చదువుచెప్పేవాల్లు, పనులు చేసేవాల్లు లేరా? పూజారి వర్గం అనేది, ప్రతి మతం, ప్రతి కులంలో వుంది. పని పాటా లేకుండా ఊర్క కూర్చోని తినడమెలా అనే దాన్ని బేస్ చేసుకోని, కొత్త కొత్త ఆచారాలు శృష్టించడమే ఆవర్గం పని.

    hari.S.babu
    మళ్ళీ మీరు "తోపు" అనే మాట వాదేశారు.నొదటినుంచి ఎత్తుకుని వివరమైన జవాబు రాస్తున్నాను.కొంచెం జాగ్రత్తగా చదవండి.

    మొదట మీ ఇప్పటి కామెంటులోని తప్పుల్ని చూపిస్తాను.
    1."ఇక దావీదు విషయంలో, అతను చేసిందాన్ని తప్పు అని బైబిల్ చెబుతోంది అని చూపించాను. మీరేమో బైబిల్ ప్రకారం అది కర్రక్టే అని చూపించడానికి పూర్తిస్థాయిలో ప్రయత్నించారు." అని అంటున్నారు కదా,నా వ్యాసం మొత్తంలో దావీదు చేసిన పనిని తప్పు కాదని చెప్పి అతన్ని సమర్ధిస్తున్న ఒక్క వాక్యాన్ని చూపించగలరా?అక్కద అనేను చెప్పింది అతను చేసిన దుర్మారగాన్ని ఎండగట్టడమే కదా!నేను దావీదుని సమర్ధిస్తున్నట్టు ఎట్లా అర్ధం అయ్యింది మీకు?నేను రాసిన నాలుగైదు వాక్యాలే అర్ధం కాక నేను చెప్తున్న భావానికి వ్యతిరేకమైన భావాన్ని నాకు అంటగడుతున్నారు, మళ్ళీ మీరు నేన్ బబిలు మొత్తం చదవకపోవటం వల్లనే బైబిలుకి విరుద్ధమైన విషయాలు రాస్తున్నానని అంటున్నారు - ఇది సమంజసమేనా?

    2."తప్పుల్ల్లేని మతం గాని, మత గ్రంధంగాని చూపమంటే.. కమూనిజం మీద పడి, దాన్లో తప్పుల్లేకపోతేనే హిందూ గ్రంధాల్లో తప్పుల్లేవని చూపిస్తానని చాలెంజిలు విసురుతారు." అనేదానికి నేను పైన వేసిన కామెంటులోని "మీకు కమ్యునిష్టులు ఎర్రిపప్పగాల్లయినా పోష్టులో వాళ్లని గురించి మీరేమి వేసినా నాకనవసరం.నేను అడుగుతున్నది మీరు వాడిన మాటలను గురించే.అది కూడా నా చాలెంజిలోనే చెప్పాను.ఇప్పుడూ చెబుతున్నాను.మీరు వాడిన మాటల అర్ధం యేమిటో తెలియకుండానే వాడారా! తెలిసి వాడితే వాటిని విశదీకరించి చెప్పడానికి అభ్యంతరం ఏమిటి?నేను మిమ్మల్ని అడుగుతున్నది కమ్యునిజం యొక్క శాస్త్రీయతని నిరూపించమని కాదు.అది కమ్యునిష్టుల్ని అడిగానని మీకు చెప్పాను.అంతే!" అనే జాబు సరిపోతుంది కదా!

    ఇక్కడే దీని గురించి కొంచెం విశదీకరిస్తాను,అర్ధం చేసుకోండి!మీరూ నేనూ ఎర్రిపప్పగాల్లు అని మనకి మనం చెప్పేసుకున్నంత మాత్రాన ఎర్రిపప్పలు అయిపోరు.

    కుర్రాళు ఆర్యన్ ఇమిగ్రేషన్/ఇన్వేజన్ గురించి నిలదీస్తే రొమిల్లా ధాపర్ "who cares now!" అన్న తరహాలో జవాబు చెప్పింది.దాని అర్ధం అచ్చతెలుగులో చెబితే అది అబద్ధం అయినా సరే, మేము ఆ అబద్ధం ఎందుకు చెప్పామో ఆ లక్ష్యం నెరవేరింది కదా,ఇంక ఇవ్వాళ అది అబద్ధం అని తేలితే మాత్రం ఎవడు పట్టించుకుంటాడు అనే గర్వమే తప్ప పశ్చాత్తాపం ఏమీ లేదు.అంటే, మనం ఈ అబద్ధం ఇలా చెప్తే హిందువులు నమ్ముతారు, వాళ్ళలో వాళ్ళు తన్నుకుంటారు, ఒకసారి తన్నుకోవటం మొదలయ్యాక ఇక ఎప్పటికీ కలవరు అని నిర్ధారించుకున్నాకనే వాళ్ళు ఆ అబద్ధాలు చెప్పారు,దాని ఫలితాన్ని సాధించారు, ముందుముందు కూడా అదే ఉపాయాన్ని మళ్ళీఎ అమ్ళ్ళీఎ వాడుకూఎ ధోరణిలోనే ఇప్పటికీ ఉన్నారు.అంత గొప్పగా తమ ప్రయత్నంలో సక్సెస్ అయినవాళ్లని మీరు ఎరిపపలు అని ఎట్లా అనగలుగుతున్నారో!

    మీకు ఈ ఒక్క పోష్టులో నేను దావీదు గురించి తిడుతూ రాస్తే పొగిడినట్టు అర్ధమయ్యింది కానీ నాకు మాత్రం నా అన్ని పోష్టుల్లోనూ అన్ని పేరాగ్రాఫుల్లోనూ ఉన్న సమస్తమూ గుర్తుంటుంది.ఎక్కడా కాంట్రడిక్షన్ రానివ్వను.ఇప్పటికీ కమ్యునిష్టుల్ని తక్కువ అంచనా వెయ్యటానికి వీల్లేదు.
    TO BE CONTINUED

    ReplyDelete
  12. CONTINUED FROM THE ABOVE
    ఇక ఇప్పుడు మీ అన్ని కామెంట్లలోని అన్ని ఆరోపణలకీ కలిపి జవాబులు ఇస్తున్నాను.

    మొదట మీరు ""ఒక విషయం గురించి రాస్తుంటే, కనీసం ఆమేరకు విషయ పరిజ్ఞానం తెచ్చుకోవాలి. మీరు రాస్తున్న జోసెఫ్, దావీదు కథలగురించి మీరు బైబిలు కనీసం ఆమేరకైనా చదవకుండానే రాసినట్టుగా అర్ధం ఔతోంది. దీన్నిబట్టి మీరు ఖురాన్ కూడా ఎవడో చెప్పిందే రాసారని, మీరు ఏమీ చదవలేదని అనుకోవొచ్చు" అన్న మీ తొలి వ్యాఖ్యలోని ఆరోపణ దేనికి సంబంధించినదో అర్ధం కాక కన్‌ఫ్యూజ్ అయ్యాను.ఎప్పటి వరకు?మీరు తర్వాత "@ haribabu
    "Betrothel జరిగిన తర్వాతనే మేరీకి గర్భం వచ్చిందని తెలిసినా జోసెఫ్ వైపు నుంచి కనీసం ప్రశ్నించే స్థాయి అభ్యంతరం కూడా వ్యక్తం కాలేదా?ఇవేవీ జరగలేదంటే అప్పటి Nazareth సమాజంలో అటువంటి విశృంఖలత సహజమేనా"@reality" అనే భాగాన్ని చూపించేవరకూ వ్యాసం మిగతా చోట్ల వెతుక్కుంటూ దారి తప్పాను.ఆ వెతుకులాటలో ద్వితీయోపదేశం 22:21,20 అనే రిఫరెన్సుతో కొటేషన్ కనపడింది మొదటిసారి చూసినప్పుడు అన్ని వివరాలూ నోట్ చేసుకోలేదు,వెబ్ లింక్ కూడా గుర్తుంచుకోలేదు.ఇప్పుడు అదే లింకు రావడం లేదు..ఒక విషయం చెప్పండి క్రీస్తు బైబిలు చెప్పిన ప్రకారం దైవపుత్రుడు అని నమ్మాలంతే అతను చారిత్రక వ్యక్తియా కాదా అన్నది అవసరమా?లేదే,బైబిలుని నమ్మితే సరిపోతుంది,అవునా!మరి క్రైస్తవులు ఎందుకు క్రీస్తు యదార్ధవ్యక్తి అని రుజువు చెయ్యడం కోసం అంత కష్టపడుతున్నారు?గొప్ప కోసం!హిందువులని మీ దేవుళ్ళు కధల్లోని కల్పిత పాత్రలు, మా దేవుడు చరిత్రలో కనిపించి తన పుట్టుకకి అటూ ఇటూ అని చరిత్రని శాసించే మహానుభావుడు,ఆయన కాలాన్నే మీరూ పాటిస్తున్నారు అని జబ్బలు చరుచుకోవడం మీరు సోషల్ల్ మీడియాలో చూడటం లేదా?ఆ గర్వాన్ని తుత్తునియలు చెయ్యడానికే నేను ఈ పోష్టు వేశాను."క్రీస్తు చారిత్రక వ్యక్తి అని నిరూపించాలనుకుంటే తను పుట్టాదని చెబితున్న కాలానికి ఆ మహిమాన్వితమైన అభూత అల్పన జరగడానికి వీల్లేర్దు కాబట్టి అతని పుట్టుకని హేతువికి జోడిస్తే తను అక్రమసంతాం అవుతాడా కాదా?" - నేను స్పష్టం చెయ్యదల్చుకున్న ఈ పాయుంటుకీ ఆ సూక్తి బైబిలులో ఉందా లేదా అనేది పనికొస్తుందా?

    మీరు మరీ పట్టుదలగా దానిమీదే రెట్టిస్తే దావీదు కధలో అతను ఆమె భర్తని చంపించాల్సిన అవసరం ఎందుకొచ్చిందో చెబుతూ మీ క్రైస్తవ పండితుడే "ఆమె గర్భం భర్త వల్ల రాలేదని తెలిస్తే శిక్షకి గురవుతుంది!" అని చెప్పాడు కదా,అది మీకు తెలియని విషయం కాదే!మీరు జోసెఫుకి దేవదూత సందేశం ఇచ్చాడని చెప్పిన భాగంలో కూడా మరియకి వచ్చిన గర్భం తనవల్ల వచ్చినది కాదని తెలిసి కోపగించుకున్నా పబ్లిక్ చేస్తే శిక్ష పడుతుందని జాలిపడి రహస్యంగా వదిలేద్దామని అనుకున్నట్టు తెలుస్తుంది కదా!ఆ కొతేసను ముక్కస్య ముక్క బైబిలులో లేకపోయినా సమాజం యొక్క స్వభావం అలాగె ఉంది.

    మొదటినుంచీ నేను చెప్తూనే ఉన్నాను.మళ్ళీ చెప్తున్నాను.దావీదు కధని అందులో సున్నితమైన విషయాలు లేవు కాబట్టి నాకు తోచిన తెలుగులో ఉదహరించాను,కానీ మరియకి వచ్చిన గర్భం విషయంలో నేనెక్కడా కధనం రాయలేదు అని.అసలు నేను కధనమే రాయనప్పుడు అది బైబిలుత్ కధనంతో విభేదించడం ఎట్లా సాధ్యం?అవన్నీ నేను వేసిన ప్రశ్నలు మాత్రమే - అదీ మీతో వాటికి జవబౌఉ చెప్పించడం కోసం వేశాను ఆ ప్రశ్నల్ని అన్ నెత్తీ నోరూ కొట్టుకుని మొత్తుకుంటున్నాను..
    TO BE CONTINUED

    ReplyDelete
  13. CONTINUED FROM THE ABOVE
    అది అర్ధం అయితే సంతోషం.ఇంత చెప్పినా "ఆ ఒక్కటీ ఎందుకు మార్చి రాసారు?కాబట్టి నా దృష్టిలో మీరు దుర్మార్గులే!" అంటే నేను చెయ్యగలిగినది లేదు.

    ఇంక చివర్లో మీరు ఆ మాట వాడినది బ్రాహ్మణుల గురించి అని స్పష్టం చేశారు గాబట్టి దానికి సంబంధించి మీకు కొన్ని విశ్లేషనలూ ప్రశ్నలతో కూడిన జవాబు విడిగాచెబుతాను(If it is too large,I will publish it as new posyt).సరేనా!ఇంకేమైనా ఉందా నేను జవాబు చెప్పాల్సినది?

    P.S:"మీదగ్గర విషయం లేనప్పుడల్లా అవతలివాడ్ని ఇలా ఎగతాలి చేసి సైడ్ ట్రాక్కి లాక్కెల్లడం మీకు వెన్నతోపెట్టిన విద్య అని ప్రతి ఒక్కడికీ తెలుసుగాని, ఇక తప్పుల్లేని గ్రంధమేదో చూపించండి." - ఇది పూర్తిగా అత్ప్పు.నేను ఏ విషయంలోనూ సైడ్ ట్రాక్ అవ్వను,ఇతర్లని పోనివ్వను.ఇక్కద నేను కమ్యునిష్టుల ప్రస్తావన తీసుకురాగానే నేను మిమ్మల్ని కమ్యినిజం గురించి అడుగుతున్నానని పొరపాటు పడి సైడ్ ట్రాక్ అయ్యింది మీరు.గతంలో వాళ్ళు కూడా మొదట్ అరిభ్హెకారంగ అకమ్యునిష్టులేమో అని అనుమానం వచ్చేటట్టు మాట్లాడి నేను కమ్య్నిజం గురించి అడగ్గానే బ్బెబ్బెబ్బే న్నెన్నేను కమ్యునిష్టుని కాను అంటూ జారుకున్నారు."వర్గరహితసమాజం","వర్గస్వభావం","వర్గశత్రునిర్మూలనం" - వీటితో ఎక్కువ ఆడుకునది వాళ్లే కదా,మరి మీరు కూడా ఆదె మాత వాడితే నేను అనుమానించడంలో నా తప్పేమి ఉంది?చెప్పండిఇప్పుడు మీరు వర్గం అంటున్నది బ్రాహ్మణ వర్గం అని చెప్పారు గాబట్టి దానికి సంబంధించిన జవాబు చెబుతానని అన్నాను.ఇంక నేను విషయం లేకపోవడం వల్ల సైడ్ ట్రాక్ అయ్యింది ఎకడ?ముందే చెప్తున్నా,భాష విషయంలో జాగర్తగా ఉండండి ముందరి వాదనల్లో.సరిపోయింది కదా!వరస ప్రకారం మొదటి చాలెంజి పూర్తయ్యాక రెండోది యెత్తుకోవాలి.ఆలెక్కలో వర్గం అనే దాని గురించిన చర్చ మొదలైంది కదా.దీని తర్వాత అది చూద్దాం.అయితే ఒక చిన్న క్లూ మాత్రం ఇస్తాను.అది చాలా క్లిష్టమైనపని కాబట్టి మీరూ కొంత హోమ్‌వర్క్ చెయ్యాలి.చేసే ఓపిక ఉందా?

    కాసుకోండి!ఈ ప్రపంచంలో తప్పులు లేని మతసాహిత్యం ఏదైనా ఉంది అంటే అది వేదం మాత్రమే!
    ఋగ్వేదం,సామవేదం,యజుర్వేదం,అధర్వణవేదం అనే ఈ నాలుగింటిలో మీరు ఒక్క తప్పును కనిపెట్టినా లక్ష డాలర్లు ఇస్తామని ఆల్రెడీ చాగంటి వెంకట్ అనే పెద్దమనిషి ప్రకటించి ఉన్నారు.మరి,కనీసం తప్పులు పట్టటానికైనా హిందూమతసాహిత్యంలో మీకున్న పాండిత్యం ఎంత?

    So,I have aswered the satire that I am trying to side track to cover up my ignorance.

    ReplyDelete
  14. మరొక బ్లాగు యుధ్ధం!
    విమర్శలూ ప్రతివిమర్శలూ అన్నీ బ్లాగర్ల మధ్యనే! చదువరులూ కేవలం బ్లాగుప్రపంచజీవులే.
    ఐనా ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లు ప్రపంచంలోని అన్నింటికీ అనేక దూషణభూషణాలంకారాలు తప్పవు.
    ఓపికున్న వాళ్ళు ఇవన్నీ చదువుతారు. మిగతా వారు ప్రక్కన బెడతారు. తమాషా ఏమిటంటే ఆ చదివే వారూ ఇవతల వ్యక్తి ఏమి వ్రాసాడో పూర్తిగా చదవకుండానే విమర్శలకు దిగటమూ, పైపైన ఏవో రెండు మాటలు పట్టుకొని అసలు చదవబోయిన దానికి నాలుగురెట్లు తమతమ వచోవిలాసం ప్రదర్శించటమూ కద్దు.

    విషయం లేని వారితోనూ విషయానికి కట్టుబడని వారితోనూ వాదించా బ్లాగర్లు? ఎందుకు?
    ఇదంతా అవసరమా?

    అసలు వచ్చిన వ్యాఖ్యల్లో యోగ్యమైనవి అనుకున్నవి అన్నీనో కొన్నో ప్రచురిస్తే చాలు. చర్చలు దండగంటే దండగ.

    అసలు నేనీ మాటను వెయ్యోసారి చెప్పటమూ దండగే ననుకోవచ్చును లెండి.

    ReplyDelete
  15. ఇండస్ మర్టిన్ తెల్లవారిని (క్రైస్తవులను) విమర్శిస్తూ ఒక పోస్ట్ రాశాడు. దానికి ప్రకాశ రావు అనే అతను విమర్శిస్తే అతనికి ఇండస్ మర్టిన్ కొన్ని ప్రశ్నలు వేశాడు. అవి మీరు చదవండి.

    ఫిరంగి రోగం Wednesday, August 1, 2018

    https://www.facebook.com/indusmartin/posts/10215232538140957


    Prakash Rao 1835 లో బాబాసాహెబ్ ఉన్నాడా మూర్ఖుడా ? అప్పుడు అస్పృశ్యులకు ఎవరు విద్య యిచ్చారు ?

    Indus Martin Prakash Rao ప్రకాష్ అన్నా...

    మొదట ఈ ప్రశ్నలకు జవాబుచెప్పు
    1. 1835 లో ఎందరు అశ్పృశ్యులు విధ్యాధికులు అయ్యారు?
    2. అదే సమయంలో ఇంగ్లీషు చదువుల వలన పై కులాల వారు ఎందరు లబ్ధి పొందారు?
    3. ఇంగ్లీషు విధ్య కేవలం అంటరాని జనాల కోసమే అని ఎక్కడైనా ఇంగ్లీషు వాళ్ళు ప్రకటించారా?
    4. తెల్లవాళ్ల కొలువులో ప్రధాన పధవులు అలంకరించింది అంటరాని వాళ్లా లేక పై కులాలవాళ్ళా?
    5. తెల్లవాళ్ళ చెప్పులు తుడిచింది భారత బ్రాహ్మణులా లేక అంటరాని దళితులా?
    6. మొదట క్రైస్తవ మతంలోకి ఆహ్వానించబడింది భారత అగ్రకులాలా లేక దళితులా?
    7. ఆంగ్లేయుల విధ్యా, వైధ్యాలయాల్లో అత్యధికశాతం మేలు పొందింది అంటరానివాళ్లా లేక పెద్దకులాలా?
    8. దళిత మూలవాసులకు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వనందుకు అంబేద్కర్ బ్రిటీష్ వాళ్ళను ఎందుకు నిలదీస్తూ వాళ్ళు కృతఘ్నులు అని పేర్కొన్నాడు?
    9. 1843 బ్రిటీష్ బానిసత్వ నిర్మూలనా చట్టం తరవాత దళితులు నిజంగా దాన్నుండి బయటపడగలిగారా? మా తండ్రుల తరం కూడా ఎలా జీతగాళ్ళుగా బ్రతికారు? కానీ కేవలం భారత రాజ్యంగం అమలుపరచబడిన అనతికాలంలోనే ఆ పరిస్థితి దాదాపు ఎలా అంతరించిపోయింది? ఇందులో ఎవరికి ఆ క్రెడిట్ ఇవ్వాలి?
    10. ఒకవేళ దళితోద్దరణే బ్రిటీష్ వాళ్ళ ఆశయమైతే కులాన్ని నిర్మూలిస్తూ, కుల వివక్షకు తగిన దండన విధిస్తూ చట్టం ఎందుకు చెయ్యలేదు? ఎలాగూ వారే పరిపాలకులు కదా... మొత్తం అధికారం వారి చేతుల్లోనే వుంది కదా?
    11. ఒకపక్క నిమ్నులు అమానవీయ జీవితం గడుపుతుంటే బ్రిటీష్ వాళ్ళు భారత రాజప్రాసాదాల్లో, జమీందార్ల కోటల్లో విందూ వినోదాల్లో తూగుతూ, వాళ్ళు తార్చిన శూద్ర దళిత స్త్రీలతో పొర్లుతూ, ఆ రాజులకు 'బిరుధులూ, పట్టాలూ' ఎలా కట్టబెట్టారు?
    12. బ్రిటీష్ పాలనలో ఉన్నత స్తానంలో పనిచేసిన దళిత జీవుల పేర్లు ఒక పది చెప్పగలరా? అదే పాలకుల ఇళ్ళల్లో పంఖా మనుషులుగా, చెప్పులు కుట్టేవాళ్ళుగా, పారిశుధ్య పనివారుగా, పీతిగుడ్డలు ఉతికే వారిగా పనిచేసిన లక్షలమందిని చూపిస్తా.
    13. ఇంగ్లీషువాళ్ళు దళితుల్ని అసలు అలాంటి పనిలోకైనా రానివ్వడమే గొప్ప మేలు అని మీరంటారా?
    14. బ్రిటీష్ దొరసానులు అనేకమంది అగ్ర కులాల పురుషుల్ని, జమీందారుల్నీ ప్రేమించి వరించారు. అలా ఎవరైనా దళితుల్ని పెళ్ళాడిన దాఖలాలు వున్నాయా? ఎన్ని వున్నాయి? నేను కనీసం 600 ఉదాహరణలు చూపిస్తా.

    ReplyDelete
  16. @Chiranjeevi Y2 August 2018 at 19:37
    ఓ వర్గం గురించి నేను రాసింది, బ్రాహ్మణ వర్గం గురించి అని మీరు బుజాలు తడుకోవాల్సిన అవసరంలేదు. బ్రాహణులలో కూడా చదువుచెప్పేవాల్లు, పనులు చేసేవాల్లు లేరా? పూజారి వర్గం అనేది, ప్రతి మతం, ప్రతి కులంలో వుంది. పని పాటా లేకుండా ఊర్క కూర్చోని తినడమెలా అనే దాన్ని బేస్ చేసుకోని, కొత్త కొత్త ఆచారాలు శృష్టించడమే ఆవర్గం పని.

    hari.S.babu
    ఓకే,నేను అందరు బ్రాహ్మల్నీ తిట్టటం లేదు - పూజారులుగా ఉండి కూర్చుని తింటున్నవాళ్ళని మాత్రమే విమర్శిస్తున్నాను అన్నారు,బానే ఉంది.

    కానీ మీరు వర్గం అనే మాటకి ఏ క్యాటగిరీని చెప్పినా దానికి తగిన జవాబులు చెప్పడమూ కౌంటర్ ప్రశ్నలు వెయ్యడమూ తప్ప నేను భుజాలు తడుముకోవాల్సిన ఆవసరం లేదు - నేను ఎప్పుడూ బుద్ధి బ్రాహ్మణూలే గౌరవిస్తాను కానీ పుట్టు బ్రాహ్మణుల్ని గౌరవించను అని చెప్తూనే ఉన్నాను.మీరు "హరిబాబు బ్రాహ్మణ పక్షపాతి కాబట్టి నేను బ్రాహ్మణూల పేరు చెప్పి తిడతానని అనుకుంటున్నాడేమో!" అని భుజాలు తడుముకున్న్నది మీరే:-)

    మీరు ఏ జవాబు చెప్పినా భుజాలే కాదు ఏదీ తడుముకోవాల్సిన పనే లేదు నాకు.మీరు భుజాలు తడుముకుంటూ సేఫ్ సైడ్ చూసుకుని చెప్పినా హిందువులకి పూజారి వర్గం స్థానంలో ఉన్నది బ్రాహ్మణులే కదా!


    దీనికి కొత్త పోష్టు అక్కర్లేదు.మరీ పొడుహాటి కామెంటు కూడా వెయ్యను.సూక్ష్మంలో మోక్షంలా అలా అలా తేల్చేస్తాను.రేపు చూస్తాను దాని పని.నా సొంతపని ఎక్కువ ఉంది.

    P.S:ప్రతి దానికీ కౌంటర్ ఇస్తున్నాడు మరీ వాయించ్జేస్తున్నాడేమో అనుకోకుండా స్మైలీ వేశాను.ఇది సరదా రిప్లై మాత్రమే - గుర్తించగలరు.

    ReplyDelete

  17. జీసెస్ పోయె! బ్రాహ్మడు బకరా అయ్యే :)


    జిలేబి

    ReplyDelete
  18. Mr.Chirunjeevi Y,

    శ్యామలీయం నిన్ను ప్రత్యేకించి ఏమన్నా అనండా అది పబ్లిష్ చేసినందుకే నాతో సహా హిందువులు మర్డర్ల బ్తాచ్చి అనేవరకు వెళ్ళావు?

    అతను అన్నదీ నేను నీకు తల ప్రాణం తోకకోచ్చేటంత శ్రమపడి నీకు బోధపరిచిందీ నువ్వు చేసిన ఘనకార్యమేగా - రెండు కూడ చూపించానే!ఉన్న మాటేగా అన్నది!

    ఎదటివాడు నిన్నేమీ అనకపోయినా అన్నాడనేసుకుని యెందుకు వూరికే ఆయాసపడిపోతావు.అర్ధం పర్ధం లేని కామెంట్లని నేను పబ్లిష్ చెయ్యను.ఫో ఫో నీలాంటివాళ్లని చాలామందిని చూశాను.

    GET LOST
    AND
    NEVER COME BACK!

    ReplyDelete
  19. Replies
    1. It confirms my openion that gandhi,nehru,patel,malaviya - why to name a few,all those politiceans were did whatever we name it a struggle or a abargain is not for the broader public but for personal gain again whether you name it is money,power or popularity.popularity

      Delete
    2. Can you share your opinion post? I will read once again

      Delete
    3. కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (బాల గంగాధర తిలక్)

      It is the first part of the series.I have covered upto Indira Gandhi.After that I have diverted with other topics.Next in the Sequence will be Rajiv Gandhi,Sonia Gandhi and Concluding part is Rahul Gandhi.

      Actually I think next series are not so important as there are not new topics left for me to wrute on them.

      Delete
  20. వ్యాసం ఆలోచింపచేసేదిగా ఉంది. చర్చిలో రోజూ పాడే పాట "దావీదు తనయా హోసన్న.... యూదుల రాజా యేసన్నా..." కేవలం యూదుల రాజుగా పేర్కొన్న జీసస్ ని, యూదులే తిరస్కరించిన వ్యక్తిని ప్రపంచం మీద రుద్దుతున్న వాళ్ళెవ్వరు? ప్రస్తుతం చర్చి ఫాదర్లు చేస్తున్న 'సెక్సువల్ హెరేస్మెంట్లకి', 'మీరు చేసే నీచ పనులను ఎప్పుడో మన్నింపబడినవని' అన్న నమ్మకానికి సంబంధం ఉందంటారా? వారు జనులను గొఱ్ఱెలను చేయుచు గొఱ్ఱెలకి బుర్ర ఉండకూడదని చెప్పడం కరెక్టు కాదు. ఇటువంటి విశ్లేషాత్మక వ్యాసాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాము. చర్చి పండితులుకూడా కొన్ని విషయాలను అంగీకరించవలసి ఉంటుంది ముఖ్హ్యంగా క్రీస్తు జననం, వివాహం, ఇశ్రాయెలీయుల రాజుగా పంపబడడం .....

    ReplyDelete
  21. చిరంజీవి గారు, మీరు నన్ను గౌరవించినా మానినా అది మీ యిష్టం. నాకు వచ్చిన ఇబ్బంది యేమీ లేదు. ఈ వయస్సులో ఇంకా నేను ఇతరుల మెప్పుకోసం తాపత్రయపడుతున్నా నని భావిస్తున్నారా? మన్నించండి. దయచేసి మరొకసారి నిదానంగా నా వ్యాఖ్యను ప్రశాంతమైన మనస్సుతో చదువుకొన ప్రార్థన. మిమ్మల్ని ఉద్దేశించి ఏమీ అనలేదు. హరిబాబుగారికి ఇచ్చిన సలహా వలె కనుపించేది అయినా అది జనాంతికంగా అందరు బ్లాగర్లను ఉద్దేశించి యుద్ధ్హోద్రేకాల వలన ప్రయోజనం ఉండదు కాబట్టి శాంతంగా విషయాలు మాట్లాడుకొమ్మని చెప్పటమే కాని మరొక విధంగా వ్రాయలేదు. అందరూ అక్షరజ్ఞానం సంపాదించుకొంటున్నా చదువరులు కాలేరని విశ్వనాథ గారు అన్నది అక్షరసత్యం. (ఇలాగు అన్నానని మీరు విశ్వనాథను కూడా గౌరవించనని ప్రకటించితే దానివలన ఆయనకు వచ్చే ఇబ్బంది యేమీ లేదని గమనించండి.)

    ReplyDelete

  22. *******************************************
    Nazism originated in Christian Socialism
    *******************************************

    Nazism originated in Christian Socialism

    ReplyDelete
  23. Book review: Arun Shourie's 'Harvesting Our Souls'
    ____________________________________________________

    Christian expansionism was a two-track affair. A secular empire capturing colonies, turning humans into slaves; and missionaries harvesting them for intellectual and soul slavery.


    Both used deceit to achieve their objectives: denying expansionism, saying they were merely trying to help out, creating and encouraging our internal rivalries, claiming to be separate from each other while helping each other; in short both lying through their teeth. We ran a powerful independence movement trying to get rid of the former; but despite an occasional fulmination by leaders like Swami Vivekananda and Mahatma Gandhi, we basically left the latter alone.


    Arun Shourie's Harvesting Our Souls, a sequel to his Missionaries in India, may mark the beginning of a movement for the independence of our intellect and our souls. Coming as it does after Pope John Paul II's call to Christian missionaries to intensify their mission of harvesting our souls, it has arrived just in time.

    Rising communal tension between locals and Christian missionaries has focused our mind on the threat to social harmony the activities of missionaries pose. The way Christian converts in East Timor were helped by powerful Christian governments to gain independence from Indonesia has also awakened many of us.

    ReplyDelete
  24. NEXT WRITE UP IS ON INQUISITION OF GOA AND INQUISITION ALL OVER THE WORLD.

    IF ANYBODY HAS ALREADY HAS VALUABLE INFO AT THEIR DESK,YPU ARE WELCOME TO SHARE HERE!

    ReplyDelete
  25. ప్రతి హిందువు చదవాల్సినవి ఈ 15 పోస్టులు. కాబట్టి ఓపిక ఉన్నవారు చదివండి

    https://www.facebook.com/hinduchristiancharcha/posts/1399621653515314

    ReplyDelete
  26. మనకు తెలియని 'భయంకరమైన చరిత్ర'
    "గోవా మారణకాండ"

    https://m.facebook.com/story.php?story_fbid=1395933003884179&id=1085974001546749

    ReplyDelete
  27. Many people may not like the YSRCP. Knowingly or unknowingly it had played a master stroke of the issue, the special status for the AP state. The TDP got in the trap.The YSRCP successfully driven the TDP into the congress fold, and driven a wedge between the BJP and TDP.
    In this process the TDP is the only looser. The BJP nothing to loose in AP. The result of the new alignment of TDP with congress started giving results for the TDP. The first of it is the defeat of the opposition candidate in the Rajyasabha, even though the opposition is in majority. Wisely the Sivasena and AAP abstained from the house. The YSRCP also abstained from voting thus making way for the success of the NDA candidate. The TRS aligned with NDA

    ReplyDelete
  28. రచ్చబండ అనే సైట్ లో మీ వాదనని చూస్తున్నాను. మూర్ఖులతో వాదించి గెలవడం కష్టం. మీ సైట్ లో వాదించనని అతనన్నప్పుడు, అహ్మద్ చౌదరికి ఒక టాపిక్ ని ఇచ్చి అక్కడ పబ్లిష్ చెయ్యమన్నప్పుడు, ఒక గంట లోనే అతను పబ్లిష్ చెయ్యడం ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే ఇంతకు ముందెప్పుడొ చౌదరి తను నెట్ ని రెగ్యులర్ గా చెక్ చెయ్యనని, నాలుగురోజుల కొకసారి చూస్తానని కామెంటినట్టు గుర్తు (ఇంతకు ముందు దొరికి పోయినప్పుడు). జనరల్ గా ఇలాంటి టాపిక్ ని పంపింఛడం, పబ్లిష్ చెయ్యమని అభ్యర్ధించడం కొండలరావు బ్లాగ్ పని, అది అందరికీ తెలిసిందే, ఈవ్యక్తి రచ్చబండ కెందుకొచ్చాడో!! పోనీ అక్కడేమైనా ఊడపొడుస్తాడనుకుంటే అతని వాదన చదువుతుంటే ప్రపంచంలో ఇలాంటి మూర్ఖులు కూడా ఉంటారా అనిపిస్తుంది, best funny moments in life ;-) మొత్తానికి అహ్మద్ పంట పండినట్టుంది ��, జీవితంలో చూడనన్ని కామెంటులు, ఈ వేడి ఇప్పట్లో తగ్గించే ఉద్దేశ్యం అతనికి ఉన్నట్టు లేదు ����

    ReplyDelete
    Replies
    1. నేను కూడా పెద్ద సీరియస్ ధోరణిలో వెళ్ళలేదు లెండి!వాదన కూడా పిచ్చ సరదాగా నవ్వుకుంట్టూ చేశాను.

      శ్యామలీయం తనని ఎలా చర్చిస్తాడని అన్నాడో అక్కడ పేష్టు చేసి చూపించి మరె అచ్జ్చు గుద్దినట్టు అలాగే వాదించి తనని తనే ఎదవని చేసుకోవటం మీకు చూడముచ్చటగా లెదూ!ఉలాంటి గొట్టాం గాళ్ళకా న్నాళ్ళూ హిందువులు భయపడింది?వీళ్ళని మెప్పించాలనా తొక్కలో సెక్యులరిజాన్ని నెత్తిన మోసింది - ఎంత సిగ్గు చేటు!

      ఆ చెత్తనంతా చూపిస్తూ వాడెంత బేవకూఫో రచ్చబండ టముకేసి చెప్పటం భలే క్యామెడీగా ఉంది.

      అంతా గ్జేవియర్ బ్యాచ్చి!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...