Saturday 5 December 2015

నీహారికా ఆంటీకి శ్యామలీయం బ్లాగులో ఏదో అగుమానం జరిగిపోయిందని అగ్గగ్గ లాడి ముగ్గురు అంకుల్సు ఫూల్సు అయ్యారు - పాపం పిచ్చివాళ్ళు?!

ఈ పోష్టులో చదువర్లు నా మామూలు పధ్ధతిలో ఉండే విషయాన్ని ఆశిస్తే నిరాశ పడే ప్రమాదం ఉంది.ఒకానొక బ్లాగులో నేను పాల్గొన్న చర్చలోని కొన్ని భాగాల్ని ఇక్కడ ఇస్తున్నాను.ఇందులో ఉన్న విషయంలో హిందూ మతాన్ని ముఖ్యంగా రామాయణాన్ని విమర్శించే కొన్ని ముఖ్యమైన పాయింట్లకి నేను జవాబు చెప్పాను.చదువర్లు తెలుసుకుంటే తాము కూడా ఆ జవాబుల్ని తాము చేసే చర్చల్లో ఎక్కడయినా ఉపయోగించుకోవచ్చు.చర్చ మొదలై నేను పాల్గొన్న భాగం వరకూ ఒక వర్డ్ డాక్యుమెంటుగా కాపీ చేసుకున్నాను.ఈ రెందు రోజుల్లో కరెంటు పోయి మళ్ళీ వచ్చాక ఆ పోష్టు ఉండి ఉంటే అక్కడ కంటిన్యూ అయ్యేవాణ్ణి,కానీ పోష్టు లేదు గనక దాని సారాంశం ఇస్తున్నాను.విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు,చదువుతూ ఉంటే అర్ధం అవుతుంది.అర్ధం కాకపోతే వదిలెయ్యండి.వాదోపవాదాలు కొనసాగించాలని కూడా అనుకోవటం లేదు.అయిపోయిన పెళ్ళికి బాజా లెందుకు?ముగిసిపోయిందని బ్లాగు యజమాని తెర దించేశాక ఇక్కడ మళ్ళీ దారీ తేన్నూ ఉండని చర్చకి తెర యెత్తడం దేనికి!
---------------------------------------------------------------------------------------------------------

రావణుడు మనిషి కాదా ?
శ్యామలీయం వారి బ్లాగులో ఒక పద్యం రాసుకున్నారు. స్థూలంగా దాని భావం - "దేవతలు ఆనందంతో పాటలు పాడుతూ గెంతులేస్తుంటే రాముడు రావణున్ని చంపాడు" అని.

దానికి నీహారిక గారు ఒక ప్రశ్న అడిగారు. "ఒక మనిషిని చంపడానికి అంతమంది సంతోషంగా సహకరించి పాటలు పాడారా?" అని.

దానికి వారిచ్చిన సమాధానం క్రింద చిత్రంలో చూడండి.


వారిచ్చిన అమూల్యమైన ఆణిముత్యాల్లో కొన్ని ఇలా వున్నాయి.

రావణుడు మనిషి కాదు. ఒక రాక్షసుడు.
దేవతలు ధర్మానికి ప్రతీకలు.  మంచికి ప్రతీకలు. 
రాక్షసులు అధర్మానికి ప్రతీకలు. చెడుకు ప్రతీకలు.
త్రిలోక విద్రావణుడు కాబట్టి రావణుడు.  వీడు చెడుకు పరాకాష్ఠ.

వారు గొప్ప పండితులే అనడంలో నాకు సందేహం లేదు. కాని వారు చెప్పిన విషయాలు సరిగా అనిపించడం లేదు. రావణుడు పుట్టింది "పులస్త్య బ్రహ్మ" అన్న బ్రాహ్మణుడికి. అటువంటప్పుడు ఆయన కొడుకు కూడా మనిషే కావాలి కదా?

తల్లి రాక్షసి అనుకున్నా... రాక్షసి అంటే ఏమిటి రాక్షసాకారం గలది అని అని అర్థం. సాధారణ మనుషుల కన్నా ఆ మనుషులు పెద్దగా వుండడం వల్ల "రాక్షసులు"గా పిలవబడి వుండవచ్చు. అసలు తల్లి మనిషి కాకపోతే ఆ ముని కొడుకునెలా కన్నాడు?

ఇకపోతే రాక్షసులు చెడుకు ప్రతీకలు, దేవతలు మంచికి ప్రతీకలు అనడం... దేవతలు ఎంత తందనాలాడినా ఒకే, రాక్షసులు ఎంత నిష్టగా వున్నా లాభం లేదు... వారు చెడ్డవారే అని అర్థం చెప్పడం కాదూ?

త్రిలోక విద్రావణుడు అంటే అర్థం నాకు సరిగా తెలియకున్నా... త్రిలోకాలను జయించిన వాడో భయపెట్టిన వాడో అయుంటుందని నేననుకుంటున్నా. క్షాత్ర ధర్మం అనుసరించి... బలం వుంది కాబట్టి త్రిలోకాలను జయించడం తప్పే అయితే ఆ కాలం నాటి క్షత్రియులందరు చేసిందీ తప్పే కదా? ఇందులో రావణుడు మాత్రమే చేసిన తప్పేమిటీ? దేవతలను జయించడమా?

ఇక పోతే సీతను కిడ్నాప్ చేయడం లాంటి నేరాలు కూడా ఆ కాలంలో పరిపాటే! మంచివాళ్ళోహో అని ప్రచారం చేసే దేవతల్లో కూడా ఇంద్రుడు ఎన్ని రంకు పనులు చెయ్యలేదు? కిడ్నాప్‌లు కూడా చేశాడుగా?

ఈ ప్రశ్నలను వారి బ్లాగులోనే అడుగుదామనుకున్నాను. కాని వారి అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తూ చివరిగా "ఇకముందు ఇలాంటి అసందర్భవ్యాఖ్యలు ప్రచురించేది లేదు" అన్నందువలన అవి ఇక్కడ అడగాల్సి వస్తుంది.

సమాధానాలు వారు చెప్పినా సరే, ఇంకెవరైనా చెప్పినా సరే.
  1. https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEicfW0-OnET6o0WEj2L9q3cYJdask_Ip0gHBMb4d4sDro0CayA-THg9BOLe432A-hg_e98LWh6DUbj2TN4BCMNSxSKLf4ZOYsHp_XunIpvXBOz_8HypZGCa2RPyP4GM4IQEMvdXro3JN90/s35/*
ధన్యవాదాలు శ్రీకాంత్ చారి గారు, బాగా అడిగారు.అగ్రహారంలోకి ప్రవేశం లేదు అన్నపుడు సమాధానం ఇలా అయినా చెప్పకపోతే ఆయన వ్రాసిందే కరెక్ట్ అనుకుంటారు కదా ? 
Reply
అంటే మీరు ఇప్పుడు రావణాసురుడి కి వత్తాసు పలుకుతున్నారా? 
రాక్షసులు అంటే కోరలు , మీసాలూ, అసహ్యంగా ఉండాలని ఏమీ కాదు....మనస్సు , బుద్ధి, ప్రవర్తన,గుణం అనేవి మనుష్యుడిని రాక్షసుడి నుండి వేరు చేస్తాయ్. బ్రాహ్మణుడికి పుట్టాడు వాడు రాక్షసుడు కాడు అనేది మీ అమాయకత్వం. అసలు దేవతలు మరియు రాక్షసులు ఒకే తండ్రి కి(కష్యప ప్రజాపతి ) పుట్టారు. 
వాళ్ళ వాళ్ళ గుణ ధర్మాలు బట్టి వేర్వేరు జీవన విధానాల బట్టి వారు దేవతలు రాక్షసులు గా విభజన అయ్యారు.... 
ఒకే తండ్రి కి పుట్టిన ఇద్దరు కొడుకుల్లో ఒకడు డాక్టర్ అవ్వొచ్చు, ఇంకొకడు నేరస్తుడు అవ్వొచ్చు... అంత మాత్రన నేరస్తుడు ని శిక్షించ కుండా ఉండరు కదా! 
మీ వాదన ఎలా ఉందంటే , ఒసామా బిన్ లాడెన్ ని చంపినపుడు , కసబ్ ని ఉరి తీసినపుడు అందరూ సంతోషిస్తుంటే మీరు తెగ బాధ పడినట్లుంది....
Reply
మరి వాళ్ళని ఉరితీస్తే సంకలుకొట్టుకున్న మీరు, దాద్రి సంఘటన లో పాల్గొన్నవారిని ఉరి తీయమని అడగగలరా? 

దాద్రిలో చచ్చినవాడిదే తప్పు అని ఒక హిందువుచే నడపబడుతున్న బ్లాగులో పోష్టు చేస్తే, దానికి నేను ఇచ్చిన కామెంటు ఇది:

"
అక్కడ గోమాంసం తిన్నది హిందువు ఐతే ఇలానా ఈడ్చుకొచ్చి చంపేవాళ్ళా"

కామెంటుతో పాటు పొరపాటున నా ఐడితో బాటు వుస్మానియా యూనివర్సిటి అని పడిండి.


అప్పుడు దానికి వొచ్చిన రిప్లయ్ ఇది:

"
వుస్మానియా లో బీఫ్ ఫెస్టివల్ చేసిన వాళ్ళని నరికెయ్యలి అని"..

ఇప్పుడు చెప్పు వీడు తోటి హిందువు కాబట్టి నరికేస్తా అన్నోడు, నరికేసినవాళ్ళు లోక కల్యాణం చేసారంటావా.. 
-------------------------------------------------------------------
నేను ఇంకో చోటకూడా చెప్పాను.. నువ్వు రాముడి అభిమానివి కాబట్టి రావణుడిదే తప్పు అని రాసుకున్నవ్. అదే రావణుడి అభిమానివైతే, రావుణుడే పెద్ద హీరో.. రాముడు పెళ్ళాం కోసమే రావణుడ్ని చంపాడుగాని, లోక కల్యాణం కోసం కాదు అని రాసుకుంటావ్.. ఈ విషయం నీ బుర్రకి ఎక్కిందనుకుంటున్నాను.

@dhanunjayarao,
నేను నిజంగానే లాడెన్ ని కసబ్ ని చంపినపుడు చాలా బాధపడ్డాను. 22 ఏళ్ళ వయసులో ఏం తెలుస్తుందండీ ? మంచీ చెడూ తెలిసే వయసా ? ఉరి వేస్తే ఒక్క నిమిషంలో ప్రాణం పోతుంది. బ్రతికితేనే కదా జీవితం విలువ తెలిసేది ? అద్వానీ వల్ల ఎంతమంది చనిపోయి ఉంటారు ? అతన్నీ అలాగే చంపాలి కదా ?
"నిర్భయ ఉదంతం గుర్తుందా? ఆ దుర్మార్గంలో ఒక మైనర్ నిందితుడు ఉన్నాడు. మేజర్ గా మారటానికి కొన్ని నెలల వ్యవధిలో ఉన్నప్పటికీ.. నేరం చేసే నాటికి మైనర్ గా ఉండటంతో అతగాడు చేసిన దారుణానికి పడిన శిక్ష చాలా తక్కువ. నిర్భయను అత్యంత దారుణంగా హింసింది.. లైంగికంగా క్రూర చర్యకు పాల్పడటమే కాదు..ఆమె మరణానికి కారణం ఈ మైనర్ అన్న మాట అప్పట్లో వినిపించింది. అలాంటి కసాయిని చట్టంలో పేర్కొన్న ప్రకారం మైనర్ గా గుర్తించటంతో కఠిన శిక్ష నుంచి చట్టబద్ధంగా తప్పించుకున్న పరిస్థితి". వీడీకీ కూడ 17 years కదా వీడు కూడ అమాయకుడు కదా!!
@ Chiranjeevi మీరు చిన్న వారో పెద్ద వారో నాకు తెలియదు. ముందు అవతలి వారికి గౌరవం ఇవ్వడం మంచిది. 
నేను ఇక్కడ హిందు , ముస్లిం ప్రస్థావన తీసుకు రాలేదు. చెడ్డ వాడు హిందు అయితే ఏముంది, ముస్లిం అయితే ఏముంది? ఎవరికైనా శిక్ష ఒకేలా ఉండాలి. మీకు దేవుడు అంటే నమ్మకం లేకపొతే మీకు రామయణం తో పని ఏముంది?

"raakshasudu" aneedi oka jaati peru matrame. mana puraanaalu anni pakshapaata buddito raasinave. oka jaati vaadu maroka jaati ni dushtudu ga chitrinchaadu. ante kaani devatalu ani rakshasulu ani yemi ledu. puraanalu rasina vaadu tama vaaru devatalu ani, shatruvulani dayyalu ani raasadu. manam ade nijamani nammi batukutunnam. 

charitraku saakshyalu puraanaalu yeppatiki kaakodadu. andulo unnadanta myth. puraanali, ramayanam, mahabharatam chadivina vaaru 'dd koshambi' books kooda chadavandi. Oka vaipe chadivi ade nijam anukovaddu. prapancha saahityanni chadavandi. greek puraanali mana mahabharatam kanna takkuvemi kaadu. 

mana vaallu mana daggare samskruti undani, maname goppavaallamani anukuntu inka mooda nammakalato chastu batukutoo untaru.
aa bhaavadaaridraanni vadalandi.
Reply
రావణుడు దేవత మనిషి రాక్షసుడు ఇవేవీ కాదు, కేవలం ఒక పాత్ర (fictional character)
జై గారు,

పురాణాలన్నీ పుక్కిటి పురాణాలే. కాని ఆ మాట పండితోత్తములు ఒప్పుకోరు కదా? పైగా చిన్న ప్రశ్న వేస్తేనే జనం మీద విఱుచుకు పడతారు! Intolerance!!

అవి పూర్తి కల్పిత గాధలా, లేక ఎక్కడో కొంత జరిగితే exaggerate చేసి వ్రాసారా అన్నది చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు. కాని ఒక్కటి మాత్రం స్పష్టం. ప్రజల్లోంచి కొందరు దేవతలని గొప్పగా చూపించడం, కొందరు రాక్షసులని దుష్టులుగా చిత్రించడం మాత్రం జరిగింది. గత కొంతకాలంగా సినిమాల్లో జరిగిన తెలంగాణా ఆంధ్రా పాత్రల చిత్రణ గుర్తుకు తెచ్చుకుంటే, సరిగ్గా పోలిక కనపడుతుంది.

పురణాలు రచించిన వారి పక్షం వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే వాళ్ళు దేవతలు. వారికి ఏవేవో ఎక్సెప్షన్లు వుంటాయి. అదే ఇతరులకు మాత్రం ఎలాంటి ఎక్సెప్షన్లు వుండవు. ఒకోసారి మంచి చేయబోయినా దుష్టుడిగానే చిత్రీకరణ జరుగుతుంది.

ఎందుకనడిగితే వాడు రాక్షసుడు కాబట్టి చెడ్డవాడు, వీడు దేవుడు కాబట్టి మంచి వాడు అని సమాధానం వస్తుంది. సరిగ్గా పైన శ్యామలీయం గారు ఇచ్చిన మాదిరిగా అన్నమాట!

నీహారిక గారు మరిన్ని ఆలోచనాత్మక ప్రశ్నలు కూడా అడిగేరు - వారు వ్రాసేటప్పుడు అంత దీర్ఘం గా ఆలోచించి ఉంటారో లేదు నా కైతే తెలీదు ; కానీ ఈ ప్రశ్నలు నిజంగా నా వరకైతే ఆలోచనల కు పదును పెట్టేవి . చర్చలో పాల్గొన వలసినదిగా విజ్ఞప్తి .

నీహారిక సంధించిన మరి కొన్ని ప్రశ్నలు -> rarely possible to query such in-depth understanding questions . 

పదిమంది మనుష్యులను చంపినవాడు రాక్షసుడైతే పదిమంది రాక్షసులను చంపినవాడిని ఏమని పిలవాలి ?

మనిషిని కానీ మరి ఎవరినైనా కానీ ప్రాణ,మానహాని తలపెట్టినపుడు చంపారంటే అర్ధం ఉంది.ముందుగా ప్లాన్ వేసుకుని చంపితే దేవుడా ? (This I see the utmost question if any one can answer suitably) 

ధర్మాన్ని రక్షించాలంటే ఒకరిని ఒకరు చంపుకోవలిసిందేనా ? (superb!) 

చెడు మీద మంచి విజయం సాధించాలంటే యుద్ధం తప్పదని మీరు బోధిస్తున్నట్లైతే అలీన ఉద్యమమెందుకు ?అణు ఒప్పందాలెందుకు ?

చీర్స్ 
జిలేబి
జిలేబీ గారు, 

మీరు మూడు సార్లు ప్రశ్నలు రిపీట్ చేసినా పండితుల్వ్వరూ రావడం లేదండీ, జవాబులివ్వడానికి! వారిదగ్గర జవాబులు లేవనుకుంటా!!
రైలుపెట్టకి నిప్పెట్టి కాలిస్తే అది వాళ్ళ గతకాలపు తప్పిదాలకి శిక్ష గాబ్ట్టి శాంతియుతంగా రోదించాలి!

కొన్ని వందలమంది కాస్మీరీ బ్రాహ్మణుక్లు దశాబ్దాల పాటూ తమ స్వస్థలాలకి దూరంగా ఉంటే అది వాళ్ళ హిందూ మతోన్మాదానికి అమాయకులైన ముస్లిములు ఇదివరకు తమకి జరిగిన అన్యాయాలకి తీర్చుకున్న ప్రతీకారం!

మీకు నచ్చినవాళ్ళని ఎవరు చంపినా అహింస గుర్తుకొస్తుందిం,జాలి పొంగుకొస్తుంది - నీహారికకి కసబ్ పట్ల పొంగుకొచ్చినట్టు!
అదే కసబ్ మాత్రం జాలీ దయా లేకుండా ఎంతమందిని చంపినా ఆ చచిన వాళ్ళు వాళ్ళ కాలం ఖర్మం కలిసిరాక చచ్చారు అనుకుని వూర్కోవాలి!లేఅంటే నీహారిక అప్పుడూ యేడ్చానండీ నేను అనిటికీ సమానంగానే యేడుస్తాను అంటే ఆవిశాళృద్యానికి నమోవాకాలు అర్పించాలి!


మీకు నచ్చినవాళ్ళు యెవర్ని చంపినా వాళ్ళు వీరత్వంతో చేశారు ఆ పన్లన్నీ,కాబటి వాళ్లని న్యాయానికి నిలబడ్డ అమరవీరులుగా పరీగ్ణించాలి,టెర్రరిస్టూలనే పేరు పెట్టి వురితియ్యకూడదు - పాపం చిన్నపిల్లాళ్ళు కదా!

మానవత్వము యొక్క మేధోవికసనం అంతా 1947 నుంచీ జరుగుతున్నప్పటికీ మీ పాండిత్య ప్రదర్శనకి పనికొచ్చే కొన్ని ర్యాందం సంగహ్తనల్ని తీసుకుని నువ్వెంతగా పెకి పాకంపెట్టగలవనేదాని మీఅనే ఆధారపడి ఉంటుంది!

ఒక వ్యక్తి తన బ్లాగులో రాసుకున్న వ్యక్తిగతమయిన వ్యాఖ్యల్ని అతని అనుమతి లేకుండా సంగ్రహించి రచ్చ రచ్చ చెయ్యటం మర్యాదస్తుల లక్షణం

ఈ విధంగా నీతుల్నీ,మర్యాదల్నీ పునర్నిర్వచిస్తున్న మేధావులకి వందన్నం,అభివందనం!

---------------------------------------------------------------------------------------------------------
ఇది అక్కడ నా మొదటి వ్యాఖ్య!నేను ఆయన గారు ఆపసోపాలు పడుతూ విమర్శిస్తున్న హిందూ మతోన్మాదం గురించి ఎన్నో విషయాల్ని స్పృశించాను.పనిలో పనిగా ఈ కాపీ/పేస్ట్/రచ్చ గురించి కూడా నిలదీశాను.దానికి సారు ఎంత ధీమాగా జవాబు చెప్పారో?
---------------------------------------------------------------------------------------------------------

>>> ఒక వ్యక్తి తన బ్లాగులో రాసుకున్న వ్యక్తిగతమయిన వ్యాఖ్యల్ని అతని అనుమతి లేకుండా సంగ్రహించి రచ్చ రచ్చ చెయ్యటం మర్యాదస్తుల లక్షణం

అవి వ్యక్తిగతమైన వ్యాఖ్యలు కావు. మరొక వ్యక్తి మర్యాదగా ప్రశ్న అడిగితే తూలనాడుతూ వ్రాసిన వ్యాఖ్యలు. అంతేకాక సదరు వ్యక్తి సమాధానం ఇచ్చే అవకాశం లేకుండా మూసివేసుకున్నారు. కాబట్టి ఇక్కడ వుంచడం జరిగింది.
---------------------------------------------------------------------------------------------------------
అసలు ధనంజయరావు ఐడి గల పెద్దమనిషీ తర్వాత రాజ్ ఐడితో ఒక పెద్దమనిషీ అడిగిన ప్రశ్నలకి తిన్నగా జవాబు చెప్తే అప్పుడే వీరికి జవాబు దొరికి ఉండేది,కానీ జవాబులు అర్ధం కాని పండితులు కదా వీళ్ళు:-)

బ్లాగు అంటే ఏమిటి?ఎవరు మనకి ఈ బ్లాగు లింకు ఇచ్చారు?ఎందుకు మనం బ్లాగు తెరిచాం?ఒకానొక బ్లాగ్స్పాట్ అనే థిర్డ్ పార్టీ సర్వీసు తన పాప్యులారిటీ పెంచుకొవడానికి రిజిస్టర్ అయిన ప్రతి యూజరుకీ కొంత మెమరీనీ,ఒక యూ.ఆర్.యల్ నీ ఇచ్చింది.మరలాంటప్పుడు ఒక సర్వీసుకి రిజిస్తర్డ్ యూజరుగా దానిమీద అతనికి హక్కు ఉండదా?తను ఒక అబిప్రాయం చెప్తే దానిని అవహేళన చేస్తూ ప్రశ్నలు వేస్తుంటే మర్యాదగా నన్ను విసిగించకండి అని చెప్పడం కూడా అమర్యాదేనా?

ఈ కలహకారిణి అక్కడ వేసిన ప్రశ్న యేమిటి?పుట్టించడం మాత్రమే దేవుడి పని అయినట్టు రూలు పెట్టి మాట్లాడుతుంది,మరి ఆ ప్రశ్న అడిగేతప్పటికి పుట్టినవాళ్ళు పుట్టినట్టే ఉంటున్నారా?చావు అనేది కూడా సృష్టిలో ఉన్నదనీ అది లేకపోతే మన తాతలూ ముత్తాతలతో సహా పుట్టిన ప్రతి ప్రాణీ చావకుండా ఉంటే యేమవుతుందో తెలియకనే ఇలా అడిగిందా ఈ ప్రశ్నని?ఇదే మనిషికి తన స్నేహితుడు సాయుధపోరాటం చేసి పెట్టుబడిదారుల్ని చంపి వర్గరహితసమాజం స్థాపించడం గురించి కబుర్లు చెప్తుంటేనూ తను కూడా అన్ని ఇజాలూ కమ్యునిజంలో కలుస్తాయి అంటున్నప్పుడూ అక్కడ కూడా ఇతర్లని చంపిన వాళ్లకి వీరతాళ్ళు వేస్తుంటారని తెలియకుండానే అడిగిందా ఈ ప్రశ్నని?

ఈ టైముస్టాంపు కామెంటు ప్రకారం గొడవ నెమలికన్ను బ్లాగు దగ్గిర మొదలైంది
-----------------------------------------------------------------------------------
శ్రీకాంత్ చారి గారూ,

శ్యామలీయం గారు తన వ్యాఖ్యని వెనక్కి తీసుకున్నారు కాబట్టి స్క్రీన్ షాట్ తొలగించమని ప్రార్ధన !

@
శ్యామలీయం గారూ,

నెమలికన్ను మురళి గారి బ్లాగులో మరమరాల గురించి చర్చ చేయబోనని మాట ఇచ్చానని మీకు తెలియక మీరు తూలనాడారు.ఆ ఒక్క పదం వల్ల నాకు కోపం వచ్చి తిట్టాను.ఒక్క పదం అన్నందువల్లనే యుద్ధాలు జరిగిన చరిత్ర మనది.మాట యొక్క విలువ మరమరాల భక్తులకు తెలియకపోయినా నాకు తెలుసు.మీ మనసు కష్టపెట్టినందులకు క్షమార్పణలు కోరుతున్నాను.
------------------------------------------------------------------------------------.
తెలివంటే ఇది!చెయ్యాల్సిన రచ్చంతా చేసేసింది.రచ్చ మొదలయ్యాక తీరిగ్గా శ్యామలీయం బాబాయి గార్కి క్షమాపణ కూడా చెప్పేసి తను యధావిధిగా గుడ్ గర్ల్ ఇమేజికి ఫిక్సయిపోయింది:-)ఈలోపు నేను ఈ జిలేబీ చేస్తున్న ఎంకరేజిమెంటు నచ్చక తాన బ్లాగులో కొంత నిలదీశాను.యధావిధిగా ఈ ముసలి జిలేబీ తన కర్రా విరగని పామూ చావని పక్షవాతపు జవాబే ఇచ్చింది.నేను కూడా జిలేబీ నించి ఎక్కువ ఆశించలేదు కాబట్టి ఇక్కడి రెస్పాన్సుకి నో రిగ్రెట్స్!

వాళ్ళెలా ఎదవ లయ్యారు?ఎప్పట్లాగే హరిబాబు మాకు భయపడి చర్చ మధ్యలో పారిపోయాడహో అని ఇదివరకటిలాగే డప్పు కొట్టుకుంటూ ఉండాలి ఈపాటికే అక్కడా ఇక్కడా!అక్కడ చర్చలో గూడా ఇట్లా నన్ను నిలదీస్తూనే ఉన్నారు గదా అనుకుంటున్నారా?
---------------------------------------------------------------------

>>> విష్యానికి సమబంధించి ఒకరు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పకుండా అర్ధవంతమయీన్ ఏ చర్చ అయినా ముందుకు వెళ్ళటం సాధ్యమా?

అదే మరి! నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏసిద్, దాడి అంటూ పొంతన లేని ప్రశ్నలు వేశావు. అవి ఎంత అసంబద్ధపువో అనలైజ్ చేసి మరీ చూపాను. దాంతో నీకు మరిన్ని ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సిన గతి పట్టింది. సరే ఆ ప్రయత్నం కానియ్యి. నీ అలావాటు ప్రకారం బూతులు రాస్తే మాత్రం కోత తప్పదు.
---------------------------------------------------------------------
ఇదండీ శ్రీకాంత్ చారి చురుకుదనం:-)పైన చెప్పిన నాకన్నా ముందు ఇద్దరు వేసిన ప్రశ్నలని వీళ్ళు శ్రధ్ధగా చదివితేనే వీళ్ళకి జవాబు దొరికి ఉండేది:-)నేను జిలేబీ దగ్గిర వేసిన కామెంటు తర్వాత ఇక్కడ వేసిన రెండవ కామెంటు ఇది నాకు గుర్తున్ననత వరకు:
-------------------------------------------------------------------------
విషయం అర్ధం కాలేదన్న మాట,నీ వాదనలో ఉన్న తప్పు యేమిటో అరటిపండు ఒలిచిపెట్టినటు చెప్పాలి గాబోలు?అది కూడా కుదరదు గదా నీ దగ్గిర,రెండు ముక్కల్లో తేల్చస్తే అర్ధం కాదు,విస్తారంగా చెప్తే లైన్లు లెక్కేసి మరీ చెత్త కింద తేలుస్తావు.నీకు అర్ధం అయ్యే విధంగా చెప్పడం నాకు కుదిరే పని కాదు గానీ నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను.

1.
చరిత్రకి సంబంధించి గానీ సమాజానికి సంబంధించి గానీ ఒక విషయాన్ని విశ్లేషించి తీర్మానాలు చెయ్యలనుకున్న వాల్ళు ఎవరూ కేవలం సాహిత్యాన్ని ప్రైమరీ ఎవిడెన్సుగా తీసుకోరు.మొదట తవ్వకాల పరంగా దొరికిన వటిని బట్టి చూసి ఆనాటి సాహిత్యంలో ఏవయినా ఆనవాళ్ళు దొరికితే సెకండరీ ఎవిడెన్సుగా సపోర్టు కోసమే వాడుకుంటున్నారు.మరి నువ్వు ఈ పిట్టకధల్ని పీకి పాకకం పెట్టి ఏ వాస్తవాల్ని నిరూపించగలవు?

2.
శ్యామలీయం రావణుణ్ణి రాక్షసుడు అనగానే దాని పూర్వపక్షం చెయ్యడానికి వాదన మొదలు పెట్టావు.
-------------------
ఒకే నేరం చేసినపుడు అందరికీ ఒకే శిక్ష కదా వుండవలసింది?

ఇంద్రుడు హిరణ్యకశిపుడి భార్యను కిడ్నాప్ చేస్తే విష్ణు ఏక్కడ నిద్రపోయాడు?
ఇంద్రుడు గౌతముడి వేషమేసుకుని వచ్చి అహల్యతో సంభోగిస్తే విష్ణు ఏ శిక్ష విధించాడు? 
రావణుడు చేసింది పైవాటికన్నా తప్పా?
--------------------
నువ్వు వేస్తున్న ఈ ప్రశ్నలు చాలా బాగున్నాయి,అందరికీ అన్ని చోట్లా ఒకే న్యాయం చెప్పాలి కదా అంటున్నావు.అక్కడ ఒక్కొక్క కధ ఒక్కొక్క వుద్దేశంతో రాసినది.అవి పుక్కిటి పురాణాలు అని యెందుకు ఒప్పుకోవడం లేదు.కవిత్రయం అనువదించే వరకు సంస్కృత సాహిత్యంలో యేదీ యే భాషలోనూ అనువదించి ప్రచారం చెయ్యలేదు,అయినా అతి సామాన్యులల్కి గూడా ఎట్లా తెలిసినాయి.ప్రతి చోటా పౌరాణికులు చెప్పగా వినడం ద్వారానే తెలుసుకున్నారు.పామరులు నై మనం అనుకునే వాళ్ళు కూడా కొన్ని అధ్భుతమైన కల్పనలు చెయ్యగా పండితులు వాటినీ ప్రస్తావించే సంప్రదాయం ఉంది.చాలామటుకు పురాణ్ అకధలన్నీ మౌఖికంగానే ప్రచారంలోకి వచ్చాయి.మూలగ్రంధంలో అసలు యేముందో తెలియకపోయినా కధా,పాత్రలూ ప్రతి ఒక్కర్నీ ఇన్స్పైర్ చెయ్యడానికి అదే కారణం.అటు చరిత్రకారులూ ఇటు పామరులూ కూడా అవి కధలేనని ఒప్పుకుంటుంటే ఎవరూ ఒప్పుకోవట్లేదని నీకు నువ్వే చెప్పేసుకుని దీర్ఘాలు తీస్తుంటే నీకు బోధపర్చగలిగిన వాళ్ళెవరు!

3.
నువ్వు అడిగిన ప్రశ్నలనే తిరిగి నీమీద సంధిస్తే నువ్వు యెటువైపు నిలబడతావు.అన్నిచోట్లా ఒక్కలాగే ఉండాలి కదా అని సందర్వ్భాలు వేరయిన కదల్ని చూపించి అడుగుతున్నావు.కానీ ఇక్కడ వాస్తవ జీవితంలో ఒక ఆడపిల్ల మీద ఆ అమ్మాయి ఇష్టాఇష్టాల్ని పట్టించుకోకుండా తనని ప్రేమించలేదని యాసిడ్ పొయ్యాలని వచ్చిన కుర్రాడు అమాయకుడైతే గదా రావణుడు రాక్షసుడు కాకుండా మంచివాడూ గౌరవించదగినవాడూ అయ్యేది!ఆ కుర్రాడు చేసింది రాక్షసమైన పని అయితే రావణుడు చేసిందీ అదే కదా!ఒకే రకమయిన ఈ రెండు సన్నివేశాల పట్లా నువ్వు ఒకే రకంగా స్పందించగలుగుతున్నావా?లేదే!శ్యామలీయం రాక్షసుడు ఆన్నాడూ గాబటి నువ్వు కాదంటున్నప్పుడు ఈ యాసిడ్ పోసిన వ్యక్తినీ సమర్ధించినట్టు కాదా?నీహారికకి ఒక మనిషిని చంపినందుకు రాముణ్ణీ కీర్తిసూ పాడిన పాటలు కర్ణకఠోరంగా అనిపిస్తుంటే ఇవ్వ్వాళ అతని చేత గాయాల పాలైన కుర్రాణ్ణీ పొగడకూడదు కదా!పైగా ఆ దయామయురాలు కసబ్ మీద జాలిపడినట్టు పాపం ముందూ వెనకా చూసుకోకుండా ఆమ్మాయీ అక్కడున్న వాళ్ళూ చితకబాదితే ముక్కూ మొహం యేకమ్యిన ఆ అమాయకుడి మీద కడవల కొద్దీ కన్నీళ్ళూ కార్చాల్సి ఉంటుంది,కారుస్తారా?

P.S:
ఎవరిని యెందుకు విమర్శించాలి యెవరిని యెందుకు ప్రశంసించాలి అనే దాని పట్ల మీకు స్పష్టత లేదు,కేవxghjgzxhcలం శ్యాంలీయం చెడ్డవాడు అన్నవాడీ నల్లా మంచివాడు అని నిరూపించాలి,శ్యామలీయం కీర్తించేవాళ్ళని దుర్మార్గులు అని నిరూపించాలి అనే రంధిలో వాస్తవ జీవితంలో తన కోరికను తిరస్కరించిన ఒక ఆడపిల్ల ముఖం మీద యాసిడ్ పొయ్యాలనుకున్న రావణ చేష్ట చేసిన వాణ్ణి మీరు విమర్శిస్తున్నారా,ప్రశంసిస్తున్నారా?తప్పు చేసి కూడా పదే పదే రాయబారాలు పంపించినా మూర్ఖంగా తోసిపుచ్చి యుధ్ధానికి తెగబడిన రావణుణ్ణి చంపినందుకు రాముణ్ణీ పొగిడితే భరించలేని నీహారిక ఒక మంచిపని చెయ్యబోయి గాయాల పాలైన కుర్రాణ్ణి యే ముఖం పెట్టుకుని పొగడగలదు?
-------------------------------------------------------------------------
November 29, 2015 at 9:34 AM టైము స్టాంపుతో ఇంత సూటిగా జవాబు చెప్తే December 1, 2015 at 2:14 AMలో కూడా ఇంకా జవాబు దొరక లేదంటున్నాడు.పైగా తనేదో ఉడ్డోలమైన లాజిక్కుతో ప్రశ్నలు వేసి నాకు మరిన్ని చెత్త ప్రశ్నలకి జవాబులు చెప్పుకునే గతి పట్టించాడు!నిజంగా ఈ స్థాయి వాళ్ళతో చర్చకి దిగి వీళ్లకి నాతో సమానస్థాయి ఇవ్వడం ఒక రకంగా నాకు దుర్గతియే - చేజేతులా నెత్తి మీదకి తెచ్చుకున్న పెంట!కానీ,ఇదివరకటి చర్చల్లో వీళ్ళని మరీ వెక్కిరించటం దేనికని జాలిపడి "మీ వాదనకి మీరు సాక్ష్యంగా తెచ్చుకున్న సిధ్ధాంతం తప్పు!ఆ వాదనతో ముందుకెళ్తే మీరు సపోర్టు తెచ్చుకున్న సిధ్ధాంతమే మీకు బెండు తీస్తుంది." అని క్లూ మాత్రం ఇచ్చి వదిలేసినందుకు ఆ సూచన అసలు అర్ధమే కాకపోగా నేను వాళ్ళ భీబత్సమైన తెలివితేటలకి భయపడి పారిపోయినట్టు అర్ధం తీస్కున్నారు.అందుకే ఈసారి గట్టిగా చివరి వరకూ నిలబడదామని నిశ్చయిచుకున్నాను.వర్షం వల్ల చెన్నయిలో కరెంటు పోవడం వీళ్ళకి మరోసారి డప్పాలు కొట్టుకునే అవకాశం ఇచ్చింది కాబోలు!

ఏమిటట ఈ మేధావి అంత గొప్పగా వేసిన నేను జవాబు చెప్పలేని ప్రశ్నలు?!
---------------------------------------------------------------------------------
>>> ఒక ఆడపిల్ల మీద ఆ అమ్మాయి ఇష్టాఇష్టాల్ని పట్టించుకోకుండా తనని ప్రేమించలేదని యాసిడ్ పొయ్యాలని వచ్చిన కుర్రాడు అమాయకుడైతే గదా రావణుడు రాక్షసుడు కాకుండా మంచివాడూ గౌరవించదగినవాడూ అయ్యేది!

హరిబాబూ, నువ్వు పూజించే దేవుడు నీకు బుర్రలో బొత్తిగా లాజిక్ పెట్టడం మరిచినట్టున్నాడు! నువ్వు మాత్రమే ఇలాంటి ఎందుకూ కొరగాని ఉదాహరణలు తెచ్చి వాదించ గలవు!

నీ వాదనలోని లోపాలు చెపుతా విను.

1.
రావణుడు ప్రేమించి రాలేదు, పగతో సీతను కిడ్నాప్ చేశాడు.
2.
తన ఆధీనంలో వున్నా కూడా రావణుడు సీతను బలాత్కరించకుండా తను ఇష్టపడే వరకు వేచి వున్నాడు తప్ప, యాసిడ్ దాడి లాంటి యెదవాలోచనలు చేయలేదు.

అదే రాముడి సంగతి చూద్దాం.

1.
ప్రేమించి వచ్చిన యువతిని హేళన చేశాడు
2.
తమ్ముడి దగ్గరికి వెళ్ళమని అన్న, అన్న దగ్గరికి వెళ్ళమని తమ్ముడూ పరాచికాలు...
3.
చివరికి కిరాతకంగా ప్రవర్తించి ముక్కూ చెవులూ ముక్కూ చెవులూ కోసి పంపించారు.

ఇక్కడ ఏసిడ్ పోసింది ఎవరు, రావణుడా, రాముడా? 
1.      
అంతేనా?

తీరా రావణుడి చెర వీడాక సీతతో ఏమన్నాడో చూద్దాం.

"
రావణుడి ఒళ్ళో కూచున్నావుగదా, నువ్వు పాడు కాలేదంటే ఎలా నమ్మేది?" ఇదీ రాముడి ఆలోచనా స్థాయి!
"
కాబట్టి నేను నిన్ను స్వీకరించలేను, లక్షణున్నో, భరతున్నో, శత్రుఘ్నున్నో తగులుకో". మరి ఈయనకు పనికి రానిది వారికెలా పనికొస్తుందో!!
"
వారూ కాదంటే ఆ కోతి సుగ్రీవుణ్ణో, రాక్షసుడు విభీషణూన్నో చూసుకో" ఇవండీ రాముడి మాటలు.

ఆ ఏసిడ్ దాడి క్రిమినల్ కూడా ఇంత నీచంగా ఆలోచించడనుకుంటా!

దీనికి తమరి దగ్గర సమాధానాలు వున్నాయా? నువ్వు పారిపోవడానికి బయటినుంది ఉదాహరణలు వెతుక్కోవాలి. నేను రామాయణం నుండే ఇలాంటివి వందల ఉదాహరణలు పట్టగలను.
2.      
Reekaat chaari
1.
రావణుడు ప్రేమించి రాలేదు, పగతో సీతను కిడ్నాప్ చేశాడు.

haribabu:
నీ ఈ సూత్రీక్రణ చూస్తే చాలు రామాయణం మీద నీకెంత అవగాహన ఉందో చెప్పటానికి.
నా దేవుడు నాకు బుర్రలో లాజిక్ పెట్తడం కాదు సైన్సుని నమ్మే నీలో శస్త్రీయత ఎంత ఉందో తెలుస్తుంది!

శూర్పనకహ ముక్కూ చెవులూ కోయించుకుని అచ్చి యేడుస్తూ కూడా "ఆ సీత చాలా అనదంగా ఉంటుంది,ఎత్తుకొచ్చి పందగ చేస్కో" అని సలహా ఇచ్చింది.అనతకు మునదె శుకుడు అనే దండకారణ్యంలో చారుడిగా ఉన్నవడొకడు రావణుడికి "మహారాజ!ఆ సీత చాలా అందగత్తె,కొటూకొచ్చేస్తే బాగుంట్టుంది" అని ఉబోస కూడా ఇచ్చి ఉన్నాడు.

వాల్మీకి చెప్పనివి కూడా రాముడికి అంతగట్టి రాస్తున్నావు,అందులోనే తెలుస్తుంది నీ స్థాయి యేమిటో!
నువ్వు కొటేషన్లలఓ పెట్టిన "రావణుడి ఒళ్ళో కూచున్నావుగదా, నువ్వు పాడు కాలేదంటే ఎలా నమ్మేది?" ముక్కలు రామాయణంలో ఎక్కద ఉన్నాయో చూపించగలవా?
3.      
Sreekaant chaari
2.
తన ఆధీనంలో వున్నా కూడా రావణుడు సీతను బలాత్కరించకుండా తను ఇష్టపడే వరకు వేచి వున్నాడు తప్ప, యాసిడ్ దాడి లాంటి యెదవాలోచనలు చేయలేదు.
haribabu:
నువ్వంటే పడి చచ్చిపోతున్నాను,నెలరోజులు తైమిస్తున్నాను,అప్పటికీ పక్కలోకి రాకపోతే కూరొండుకు తింటాను అనడం చాలా సంస్కారవంతమయిన ఆలోచన కాబోలు!

ఎక్కడికి పోతుంది నా రాజ్యంలో నా కాపలాలో ఉన్నది అన్న ధీమా ఉన్నవాదు రేప్ చెయ్యకుండా ఉందటం నీకు గొప్ప ఔన్నత్యంలా కనిపించింది,వహవ్వా యేమి లాజిక్కు?
4.      
Sreekaant chaari
1.
ప్రేమించి వచ్చిన యువతిని హేళన చేశాడు

haribabu:"
రా నన్ను పెళ్ళి చేసుకుని నాకు మొగుడివై నన్ను సుఖపేట్టు,నీకు తెలుసో లేదో నాకు రాణుడనే బలశాలి అయిన అన్న ఉన్నాడు" అని కోరికలు తీర్చమనటం తప్ప యే విధమయిన ఆప్యాయతనీ చూపించకుండా ఒప్పుకోకపోతే మా అన్న ఉన్నాడు అతనితో చెప్పి తన్నిస్తాను చూస్కో అని బెదీంచిన ఆదదానిలో నీకు సాత్విక ప్రేమ కనిపించిందా?

సీతని చూసీ చూడగానే ఇనత నదంగా ఉన్న సీత పెళ్ళాంగా ఉందబట్టే ఇలా నన్ను ఒప్పుకోవడం లేదనే కసితో చంపడానికి మీదకి పరిగెత్తిన మనిషిలో నీకు పవిత్ర ప్రేఅం అక్నిపిస్తుందా?వారెవ్వా యేమి గొప్ప ప్రణయామృత సర్వస్వం విశదీకరిస్తున్నావులే!
5.      

Sreekaant chaari
ఇక్కడ ఏసిడ్ పోసింది ఎవరు, రావణుడా, రాముడా?
haribabu:
నువ్వు ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయాన్ని చెప్పటానికి రాసిన రకరకాల కధలన్నిట్లోనూ ఒకే రకమయిన నీతిని యెందుకు పాటించ లేదు అని అడిగావు.నేను సరిగ్గా అక్కద రావణుడు యేమి చేశాడో స్వభావ రీత్యా ఫలితం రీత్యా పూర్తిగా మమేకమ అయిన ఒక వాస్తవ సన్నివేశాన్ని నీ ముందు నిలబెడితే చర్చకి సంబంధం లేనిది ఎట్లా అవుతుంది?

ఆ రెణ్టి మధ్యనా అని పెలికలు ఉండి అకక్ద రావణుణ్ణీ సమర్ధించహ్టానికి వాల్మీకి చెప్పని వాట్ని గూడా చెప్పినట్టూ నీ సొంత భాషలో రాసి వాదించహ్తం బూతులు మాట్లాడిన దాని కన్నా తప్పు కాదా?

సూఒటిగా రావణుడు సీతని అడిగింది పక్కలోకి రమ్మనే.పరస్త్రీ అని తనకీ నీకూ రూఒఢిగా తెలుసు.అలా రాకపోతె కూరొండుకు తింటాను అని అనటం కూడా నీకూ తెలుసు,అక్కద ఆ మాత లేదా?

అయినా రావనుడు మంచివాడూ రాముదే దుర్మార్గుడు అంటున్నావు,మరి వాస్తవ జీవితంలో అదే రకం సన్నివేశం స్వభావ రీత్యా,చేష్టాగతంగానూ నీ కళ్ళ ముందు నిలబడితే నీ వాదన ప్రకారం నువ్వు ఎవర్ని సమర్ధిస్తున్నట్టు?

సాహిత్య రూపాల్ని ఏ చరిత్రకారుడూ సామాజిక విషయాలకి సంబంధించి రుజువులుగా తీసుకోవడం లేదు అన్నది నిజం కాదా?అవి సెకందరీయే తప ప్రైమరీ ఎవిడెన్స్ కాదు అనేది అబధ్ధమా?

ఏ ఒక్క అంసంలోనూ నేను నువ్వు పాటించే శాస్త్రీయతని దాటకుండా హుందాగా ఉన్నాను.మరి నీ వాదన శాస్త్రీయంగా ఉందని చెప్పగలవా?

పోలికలు ఉంటాయి,వాదనలో తర్కంలో ఉదాహరణలు ఉండి తీరాలి.నువ్వు హిరణ్యకశిపుడు,మిగతాబి కొడ అకపనలే,కానీ నేను నీ ముందు పెట్టినది ఒక వాస్త్వమ!

ఆ వస్తవ సన్నివేశంలో నె వదనత్తో నువ్వు ఎవరి పక్షం వహించదలుచుకున్నావు?

Sreekaant chaari:ఇక్కడ ఏసిడ్ పోసింది ఎవరు, రావణుడా, రాముడా?

haribabu:
వాల్మీకి రాసిన రామాయణం నుంచి వాల్మీకి చెప్పిన అర్ధం తీసుకోకుండా వాల్మీకి చెప్పనివి అంటగట్టి నిజాలకి పులుముడు యాసిడ్ పులుముతున్నది నువు కాదా?
---------------------------------------------------------------------------------
ఇంత సూటిగా పాయింటు పాయింటుకీ పంబ రేగిపోయేటట్టు జవాబు చెప్పాక ఏ కొంచెం వివేకం ఉన్నా వెనక్కి తగ్గి ఉందేవాడు,అబ్బే బుర్ర నిండా నాకన్నీ తెలుసు,నేను ఎవడిలోనైనా దేన్లోనైనా తప్పులు పట్టగలను అనే అహం వున్నవాడు వెనక్కి తగ్గుతాడా?రావణుణ్ణి సమర్ధించడం ఇక కుదిరే పని కాదని రాముణ్ణి విమర్శించడానికి తగులుకున్నాడు.అంటే వీరందరికీ ఆదర్శప్రాయుడైన గిరీశం గారు చెప్పిన ఉపాయం "కుంచానికి చిల్లిపడితే అడ్డంగా తిప్పి కొలిస్తే కూసిని గింజలైనా లెక్కకి వస్తాయి గదా" అనే స్థితికి దిగజారాడు!

ముందు నుంచీ ఈ బుతసలు పట్టే చొప్పదంటు వంకలన్నిటికీ జవాబులు చెప్పగలను అనే ధీమా ఉన్నాసరే సాంకేతికంగా నేను వేసిన మొదటి కామెంటు చాలా మర్యాదగా నచ్చజెప్పే పధ్ధతిలోనే వేశాను.అది ఇది:
---------------------------------------------------------------------------------
శ్రీకాంత్ చారి,

ఒక్క విషయం సావధానంగా ఆలోచించు,ఇతర్ల బ్లాగులోని కంటెంటుని అతని అనుమతి లేకుండా ఇక్కడ ప్రచురించటం కనీసపు సంస్కారం ఉన్నవాడెవ్వడూ చెయ్యగూదని పని.ఇప్పుడు కారణం మరె అంత హానికరం కాదని తెలిసింది గనక సర్దుకుపోయాను గానీ నీహారిక ఒకప్పుడు నా బ్లాగు కంటెంటు పట్ల చేసిందీ తప్పే!భావాలకి కాపీ రైటు లేకపోవచ్చు,కానీ ఆ భావాల్ని సొంత పదాల్లో చెప్పినపుడు మాత్రం అవి ఆ వ్యక్తికి చెందిన్ అభాగాలు.అసలు కాపీఎరైతే ఉందరాదనుకుంటే అస్తువులకి లక్షలు,కోట్లు వెచ్చించి పేటెంట్లు యెందుకు తీసుకుంటూన్నారు?తనదైన దాని పట్ల ప్రతి వ్యక్తికీ ఉండే మమకారాన్ని తస్కరించటానికి నీకు అధికారం లేదు!

నువ్వు చేసిన పనిని సమర్ధించుకోవటానికి మాకు కారణాలు చెప్పకుండా ఒంతరిగా కూర్చుని యేది తప్పు?యేది ఒప్పు! అనే సదసద్వివేచనతో ఆలోచించు!

కారణాలు యేవయినా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు.
యేమాత్రం నిగ్రహం లేకుండా ఒక వ్యక్తి బ్లాగులోని కంటెంటుని కొట్టుకొచ్చేసి దానిమీద పాండిత్యం చూపించాలనుకుంటున్న నీకు ధర్మాధర్మ జ్ఞానాలకి సంబంధించిన చర్చలో పాల్గొనే అర్హత ఉంటుందా?

ఇతరుల్లో తప్పులు పట్టాలనుకుంటున్నవాడు తీసుకోవలసిన మొదటి ఆఖరి జాగ్రత్త తనవైపు నుంచి తప్పు లేకుండా చూసుకోవటం - ఆ జాగ్ర్తతని నువ్వు గాలికొదిలేశావు!ఇంకా వాదన పెంచకు,నీకే నష్తం!

P.S:
ఇప్పటికి దిగజారింది చాలు,ఇంకా దిగజారకు - శెలవు?!
నేను చెప్పాల్సింది చెప్పేశాను,ఆలోచించుకో!తప్పు తెల్సుకో?
నేనుం మాత్రం ఇంకెన్నడూ నేతో వాదించటం చెయ్యగూడదని తీఎర్మాఇంచుకున్నాను - శుభం!
1.     
ఈ విషయంలో హరిబాబుకే నా వొటు
2.      
హరిబాబూ

కంటెంటు గురించి నీదగ్గర సుద్దులు చెప్పించుకునే స్థితిలో నేను లేను. ఏం నువ్వు రాసే బ్లాగులో ఏ ఇతర కంటెంటూ వాడవా? పోనీ వాడిన ప్రతి కంటెంటుకీ పర్మిషన్లు తీసుకున్నావా? నీకు తెలియదేమో... కంటెంటు అంటే కామెంటు ఒక్కటే కాదు, పద్యం, గద్యం, శ్లోకం, చిత్రం అన్నీ వస్తాయి. 

నేనేమీ వారు రాసిన అద్భుతమైన కంటెంటు నా కంటెంటుగా చెప్పుకుని గ్రంధచౌర్యం చేయలేదే? చర్చ జరిగేది ఆ కామెంటు గురించే కాబట్టి యధాతథంగా వుంచాను. నేను పెట్టింది ఒక స్క్రీన్ షాట్. ఆ స్క్రీన్ షాట్ వారు చిత్రించిన బొమ్మ కాదు, అభ్యంతరం చెప్పడానికి.

నీకు వాదించడానికేమీ లేక ఇలాంటి టెక్నికల్ రంధ్రాన్వేషణ చేస్తున్నవని తెలుస్తూనే వుంది.
3.      
Sreekaant chaari
ఏం నువ్వు రాసే బ్లాగులో ఏ ఇతర కంటెంటూ వాడవా? పోనీ వాడిన ప్రతి కంటెంటుకీ పర్మిషన్లు తీసుకున్నావా? నీకు తెలియదేమో... కంటెంటు అంటే కామెంటు ఒక్కటే కాదు, పద్యం, గద్యం, శ్లోకం, చిత్రం అన్నీ వస్తాయి. 

haribabu:
ఒక విషయాన్ని చదివి అర్ధం చేసుకుని నా మాటల్లో నేను చెప్పడమే తప్ప ఇతర్ల అనుమతి లేకుండా ఏ ఒక్క అంశాన్నీ నేను యధాతధంగా ఎత్తిపెట్టలేదు!న అపోష్టులో నేను రాసిన ప్రతీక్షరానికీ ఆధారాలు,అవసరమైతే పుస్తకాలతో సహా సేకరించి ఉంచుతాను.అది కూడా డవున్లోడ్ అచేసుకునే సౌకర్యం వారు ఇచ్చినవే!

చిత్రాలకి సౌజన్యం చెప్తూనే ఉన్నాను.నా పోష్టుల్లో సంగ్రహించిన భాగాన్ని గానేఎ తస్కరించిన భాగాన్ని గానీ నువు చూపగలవా?
4.      
>>> ఇతర్ల అనుమతి లేకుండా ఏ ఒక్క అంశాన్నీ నేను యధాతధంగా ఎత్తిపెట్టలేదు!

చిత్రాల సంగతో? అవి యధాతథంగా చూపక, తమరు తిరిగి చిత్రించారా, లేక ఫోటో తీశారా?

>>>
అది కూడా డవున్లోడ్ అచేసుకునే సౌకర్యం వారు ఇచ్చినవే!

డవున్‌లోడ్ సౌకర్యం వుంటే డవున్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట! ఇకనేం? 

>>>
చిత్రాలకి సౌజన్యం చెప్తూనే ఉన్నాను.

ఎన్ని చిత్రాలకి చెప్పావో. ఉత్తినే ఊకదంపుడు మాట్లాడితే లాభం లేదు ఇక్కడ! నీ వాదన ప్రకారం సౌజన్యం చెప్తే లాభం లేదుగా? అనుమతి తీసుకోవాలిగా? ఇప్పుడు నేను ప్రదర్శించిన బొమ్మకి సౌజన్యం చెప్పలేదంటావా? కాస్త మోకాలు మాని బుర్ర ఉపయోగించు.

హరిబాబూ, కంటెంటు గురించి నీదగ్గర సుద్దులు చెప్పించుకునే స్థితిలో నేను లేను. Repeat!
5.       

Sreekaant chaari
చిత్రాల సంగతో? అవి యధాతథంగా చూపక, తమరు తిరిగి చిత్రించారా, లేక ఫోటో తీశారా?

haribaabu:
చిత్రాలు గూగుల్ సోఉజన్యం అని చెప్తూనే ఉన్నానుగా!ఎక్కడయినా మర్చిపోయి ఉండొచ్చు!నేనుమంచి ఫొటెగ్రాఫర్నీ చిత్రకారుణ్ణీ నాకవసరమయిన బొమ్మల్ని నేనే వేసుకోగలను అని గొప్పలు చెప్పుకోవటం లేదు. !పోష్టులో అవసరమయితే బొమల్ని చూపించడం కోసం పనిలేక బ్లాగరు దగ్గిర్నుంచి అందరూ చేసిన పనే కదా!ప్రత్యేకించి నేనేమయినా వేరే బ్లాగరు కంటెంటు నుంచి కొట్టుకొచ్చానా నీలాగా?

"
అక్కల్ట్ కెమిస్ట్రీ","షిల్బ సూతర్",,"చరక సహిత" - ఇవన్నీ వాళ్ళు తమ వ్యాసాల్లో మీరు నిర్భయంగా దవున్ లోడ్ చేర్సుకోవచ్చు ఇక్కడ్ అనొకి అని లింకులు ఇచ్చినవే తీసుకున్నాను.
---------------------------------------------------------------------------------
ఇక్కడ నాకు ప్రతిస్పర్ధిగా ఉన్న చిరంజీవి కూడా నా వాదననే సమర్ధించినప్పుదైనా ఆలోచించుకుని ఉండాల్సింది ఒకసారి,రావణాసురుణ్ణి విమర్శించడానికీ వాడు చేసింది తప్పని నా మాటల్తో గాకుండా రామాయణం నుంచే ఎత్తి చూపించొచ్చు. రావణుణ్ణి వాడి తమ్ముడు కుంభకర్ణుడు తిట్టిన తిట్లని ఇక్కడ కాపీ/పేష్టు చేస్తే చాలు!రాముడు సీతని "నువ్వు రావణుడి ఒళ్ళో కూచున్నావు,అందుకే నేను నిన్ను స్వీకరించను,ఎవడితో కావలిస్తే వాడితో పో" అన్నాడు అని నిరూపించి అల్లరి చెయ్యడానికి పనికొచ్చేది కాపీ/పేష్టు చెయగలిగిన వాడు ఆ కుంభకర్ణుడు తిట్టిన భాగం ఒకసారి చూస్తే తెలిసేది రావణుడు చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ సమర్ధించలేని దుర్మార్గమే అని!

ఇంతకీ శ్రీకాంత్ చారి రాముడు సీతని నిన్ను నేను స్వీకరించను అని చెప్పే సన్నివేశం గురించి నాకు తిలియదనీ ఈ దెబ్బతో హరిబాబు నోరుమూసుకుని పోతాడనీ అనుకున్నాడా!మధ్యలో పుల్లలు పెట్టటానికి ముసలి జిలేబీ మామి ఉందిగా,తను "అంబిలీవబుల్" అని తనూ హడావిది చేసింది.అప్పుదు శ్రీకాంత్ చారి ఇచ్చిన రామాయణం లోని ఆ భాగం యొక్క ఫుల్ టెక్స్ట్ ఇది:
--------------------------------------------------

జిలేబీ మాతా, నాతో చెప్పిస్తావేమమ్మా!

रावणाङ्कपरिक्लिष्टां दृष्टां दुष्टेन चक्षुषा |
कथं त्वां पुनरादद्यां कुलं व्यपदिशन् महत् || ६-११५-२०

20. vyapadishan = while mentioning about; mahat kulam = my great lineage; katham = how; aadadyaam = can I accept; punaH = again; tvaam = you; raavaNaaN^ka parikliShTaan = who were harassed in Ravana's lap while being borne away by him) dR^iShTaam = and who were seen (by him) duShTena chakShuShaa = with evil looks?

"While mentioning greatly about my lineage, how can I accept again, you who were harassed in Ravana's lap (while being borne away by him) and who were seen (by him) with evil looks?"

तदद्य व्याहृतं भद्रे मयैतत् कृतबुद्धिना |
लक्ष्मणे वाथ भरते कुरु बुद्धिं यथासुखम् || ६-११५-२२

22. bhadre = O gracious lady!; tat = therefore; etat = this; vyaahR^itam = has been spoken; mayaa = by me; adya = today; kR^ita buddhinaa = with a resolved mind; kuru buddhim = set your mind; lakShmaNe = on Lakshmana; atha = or; bharate = on Bharata; yathaa sukham = as per your ease.

"O gracious lady! Therefore, this has been spoken by me today, with a resolved mind. Set you mind on Lakshmana or Bharata, as per your ease."

शत्रुघ्ने वाथ सुग्रीवे राक्षसे वा विभीषणे |
निवेशय मनः सीते यथा वा सुखमात्मनः || ६-११५-२३

23. siite = O Seetha!; niveshaya = set; manaH = your mind; shatrughne vaa = either on Shatrughna; atha = or; sugriiva = on Sugreeva; vibhiiShaNe va = or on Vibhishana; raakShase = the demon; aatmanaH yathaa sukham = or according to your own comfort.

"O Seetha! Otherwise, set your mind either on Shatrughna or on Sugreeva or on Vibhishana the demon; or according to your own comfort."

ఇది కూడా copy theft అంటాడేమో హరిబాబు, ఖర్మ!
--------------------------------------------------
హ్హహ్హహ్హ!ఈ మేతావి ఇప్పుడు వేస్తున ప్రశ్నకి నేను ఎప్పుడో పుష్కర కాలం క్రితమే జవాబు చెప్పేశాను:-)అసలు రామాయణాన్ని యేకెయ్యడానికి తగులుకున్న ప్రతి చెత్తవెధవా అన్ని బాణాలూ పుచ్చిపోతే ఎక్కుపెట్టే ఆఖరి అమ్ము ఇదే!అందుకే హిందూ ధర్మ ప్రహేళికలు అనే అయిదు భాగాల సీరియల్ రాశాను.మొదటి భాగం మొత్తం హిందూ ధర్మానికి సంబంధించిన రేఖామాత్రపు పరిచయం అయితే మిగిలిన నాలుగు భాగాలూ రామాయణంలో అందరికీ అర్ధం కాక గొడవగా అనిపించే ప్రతి సనివేశాన్నీ తీసుకుని ఆ గొడవలన్నిటికీ పరిష్కారాలు చెప్పాను.అందులో ఎక్కువ భాగం ఈ సన్నివేశానికే కేటాయించాను.అయినా ఈ మనిషికి లింకులు ఇస్తే చదివి అర్ధం చేసుకుని నిజాలు ఒప్పుకునే సాహసం చెయ్యడని నాకు తెలుసు.కాబట్టి ఇక్కడ చర్చలో మరోసారి విస్తారంగా చెప్పాను.
----------------------------------------------------
రావణుడు "నువ్వంతే పడి చచిపోతున్నాను,ఒప్పుకోకపోతే కూరొండుకు తింటాను" అన్న తర్వాత కూడా రావ్నుడు మంచివాడే అన్నవాడికి ఈ భాగం దొర్కడమలో ఆశ్చర్యం ఏముంది?ఇప్పుడు కాదు చాలా కాలం క్రితమే ఇదే భాగాన్ని నా పోష్టులో ప్రస్తావించాను.ఇవ్వాళ నీ ప్రస్తావన తర్వాత అక్కడ ఐక్కడా సపోర్టులు తెచ్చుకుని చెప్తున్న జవాబు కాదు ఇది!

ఈ లింకులో అదే కాదు రామాయణ సౌరభాలు నే పేరుతో ఒక సంస్కృతం తెలిసిన వాడు పట్టిన తప్పుల్ని కూడా యెందుకు అవి తప్పులు కావో వాల్మీకి రామాయణం పునాదిగా చేసుకుని చెప్పాను.

ఇక్కడి అన్ని భాగాల్లో ఈ భాగంలో ఉంది, చూసి అప్పుడు వాదన కొనసాగించు.ఆధారం కావలేమో అని ఒక పుస్తకం నా సరవరు లో ఉంచుతున్నానని చెపినా అటుకేసి పోకుండా తప్పుకున్నావు:-)ఇప్పుదట్లా చెయ్యకు:-(
1.     

>>> "నువ్వంతే పడి చచిపోతున్నాను,ఒప్పుకోకపోతే కూరొండుకు తింటాను"

దీనికి ఆధారం చూపగలవా? సీస పద్యపు అనువాదాల్లో కాదు, వాల్మీకి రామాయణంలో.
----------------------------------------------------
త్రిలోకవిద్రావణుడు అనే మాటకి అర్ధం తెలియదంటూనే తనకి తెలియంది రామాయణంలో ఉండనే ఉండదనీ హరిబాబుకి తెలియనే తెలియదనీ ఎంత ధీమా ఈ కుపండితుడికి?మొత్తం మూడు సన్నివేశాలతో లింకు కలుపుకుంటే తప్ప అలాంటిలాంటి రామభక్తులకి కూడా అర్ధం కాని సన్నివేశానికి సంబంధించిన రహస్య విషయాల్ని కూడా సంబంధాన్ని చూపించి విశ్లేషించి చెప్పగలిగిన హరిబాబు తను చేసిన పాటి కాపీ/పేష్టు పని చెయ్యలేడని అనుకుని ఇంత ధీమాగా నిలదీసినట్టున్నాడు.ఇదిగో చూడండి మీరు కూడా స్పష్టంగా!

సుందరకాండ 22వ సర్గ 8వ, 9వ శ్లోకాలు.
द्वौ मासौ रक्षितव्यौ मे योऽवधिस्ते मया कृतः |
ततः शयनमारोह मम त्वं वरवर्णिनि || ५-२२-८
రెండు నెలలు (దవౌ మాసౌ) నీకు నా నుండి రక్షణ ఉంది. అప్పటికి నీవు నా పర్యంకానికి రావాలి.

ऊर्ध्वं द्वाभ्यां तु मासाभ्यां भर्तारम् मामनिच्चतीम् |
मम त्वां प्रातराशार्थमालभन्ते महानसे || ५-२२-९
ఆ రెండు నెలల గడువులో (ద్వాభ్యాంతు మాసాభ్యాం) నీవు నన్ను వరించకపోతే నా వంటింట్లో నిన్ను వండి నాకు ప్రాతఃకాల భోజనంగా సమర్పిస్తారు.:


అయినా ఇదివరకు నా వాదనకి ఆధారాలు చూపిస్తూ లింకులు ఇస్తే చూడకుండా కొడలరావుని కామెంట్లు డెలిట్ చెయ్యమని అడిగిన వీరుడు ఇప్ప్పుడు మాత్రం లింకు చూస్తాడో చూడడో, అనిపించి, ఇక్కడ చర్చని ఫాలో అవుతున్న మిగతావాళ్ళకి గూడా తెలియాలి గదా అని ఆ విశ్లేషణ అంతా మళ్ళీ ఇక్కడ కూడా చేశాను.
---------------------------------------------------------------------
శీలపరీక్ష సన్నివేశానికీ సీతాపహరణం సన్నివేశానికీ సంబంధం ఉంది.

సీతాపహరణం అనేది ఎట్లా జరిగింది?

మొదటి నుంచీ వాడి ప్లాను రామ లక్ష్మణుల్ని అక్కడి నుంచి దూరంగా పంపించి యెదురుపడి యుధ్ధం చేసి తెచ్చుకోవడం కాకుండా దొంగతనంగా యెత్తుకొచ్చెయ్యడమే.ఒక కధలో డ్రామా పరంగానే కాకుండా వాస్తవ జీవితంలో ఒకడు రావణుడిలా ఆలోచిస్తే ఆ దారి తప్ప మరోదారి లేదు.యెందుకంటే,నిజంగా రావణుడు గనక నాకు సీత మీద మోజు పుట్టింది,రాముడి మీద యుధ్ధానికి రండి అని పిలిస్తే తర్వాత కుంభకర్ణుడు తిట్టినట్టు వాడి మంత్రులే వాణ్ణి తిట్టి ఉండేవాళ్ళు.

అయినా లక్ష్మణుడు మాత్రం అక్కదే ఉండిపోయాడు,అతన్ని తప్పించడం యెట్లా అనే దానికి "హా సీతా!హా లక్ష్మణా!" అనే వ్యూహం పన్నారు యెట్లా పని చేస్తుంది?ఇవ్వాళ నేను చెన్నయ్ లో ఒక్కణ్ణే ఉండి తను ఆంధ్రాలో ఉంటే ఒంటిగంటజి ఠంచనుగా ఫోను చేస్తుంది, "అన్నం తిన్నావా?" ఆని.అందులో ఉన్నది యేమిటో నీకూ తెలుసు!సీత రాముడికే "వైరము లేని హింస" గురించి బోధలు చేసిన తెలివైనదే,కానీ ఆ సమయంలో బుధ్ధి పనిచెయ్యకుండా హృదయం పని చేస్తే దాన్ని నువ్వు అది సీత వెర్రితనం అనగలవా?

అది వాల్మీకి కధా సంవిధానం!అప్పుదు లక్ష్మణుణ్ణి సీత అన మాతలనే ఇప్పుడు రాముడు సీతకి గుర్తు చహెశాడు.ఆ రెండు సన్నివేశాలకీ నేను పులుముడు ద్వారా సంబంధం కప్లుపుతున్నాను అనై అంటే ఇక చెప్ప్పటానికి యేమీ లేదు!

P.S:
గతంలో ఇట్లాగే ప్రవీణ్ నీకన్నా భెకరంగా వాదిస్తుంటే "జానకి విముక్తి కధని తీసుకుని నేను ఆ జాంకి వాల్ళు మాకు మూడిళ్ళ అవతలే ఉంతారండి,నాకు బాగా తెలుసు,ఆ అమ్మాయికి కనిపించిన వాడికల్లా కను కొట్టే అలవాటు ఉంది,అందుకే అత్తా మొగుడూ అలా తిడుతున్నా కొడుతున్న అకుక్కినపేను లాగా పడి ఉంటుంది అని మార్చి విమర్శిస్తే నా వాదన కరక్టే నటావా?" అని అడిగాక ఇప్పుడు తగ్గాదు,నువ్విప్పుడు వాల్మీకి రామాయణానికి నీ సొంత పులుముడులూ ముక్కలు ముక్కలుగా చూపించే వందల కొదీ ఉదాహరనలు కూడా అలాంటివే!
1.     
ఈ ఊకదంపుడు ఎందుకులే గానీ, తమరివద్ద విషయం లేదని అర్థమైంది. ఆధారాలతో సహా అడిగిన ప్రశ్నలకి ఒక్కదానికి కూడా సమాధానం లేదు, అనవసరమైన సోది తప్ప.

>>>
అది వాల్మీకి కధా సంవిధానం!అప్పుదు లక్ష్మణుణ్ణి సీత అన మాతలనే ఇప్పుడు రాముడు సీతకి గుర్తు చహెశాడు.

వాల్మీకి రచనా సంవిధానం తమరికి బాగానే తెలుసన్నమాట! పై వాక్యానికి వాల్మీకంలో ఆధారం చూపగలరా, అది కేవలం తమరి పులుముడేనా?
2.      
This comment has been removed by the author.
3.      
సీత ఖచ్చితంగా రావణుడికి పరస్త్రీ అని నీకు తెలుసు!యుధ్ధం చేసి ధీమాగా తీసుకెళ్ళకుండా దొంగతనంగా ఎత్తుకెళ్ళాడనీ తెలుసు!అయినా రావణుడు నీఉ కేవలం రేప్ చేయ్యకుండా ఉన్నాడు అన్న ఒక్క పాయింటు మీద మర్యాదస్తుడూ మాననీయుడూ అయిపోయాడు.రావణుడు మంచివాడు ఆన్నవాడికి రాముడు ఖచ్చితంగా దుర్మార్గుడి గానే కనపడతాడు,కనపడాలి కూడా యెందుకంటే వాళ్ళ మధ్య యుధ్ధం జరిగింది,వాళ్ళిద్దరూ మంచివాళ్ళయినా వళ్ళిద్దరూ చెడ్డవాళ్ళయినా ఆ యుధ్ధం జరిగే అవకాశం లేదు కాబట్టి రావణుడు మంచివాదయితే రాముడు దుర్మార్గుదే అవుతాడు!

లింకు చదివావా?అబ్బే చదివి ఉందవు!అందుకే ఇక్కడ కూడా వివరించి చెప్పాను,అయినా పులుముడు అంటున్నావు.పరస్త్రీని దొంగతనంగా ఎత్తుకొచ్చిన వాడూ,నన్ను వరించు లేకపోఅతే కూరొండుకు తింటాను ఆన్నవాడు కేవలం రేప్ చెయకుండా ఉన్నందుకు సజ్జనుడు అన్నటం మాత్రం పులుముడు కాదు,అంతేనా?

కధలో ఉన్న లింకుల్ని చూపిస్తున్న నాది వూకదంపూదు,కధలో ఉన్నదానికి నీ సొంత అర్ధం తీసి నిజాలకి యాసిడ్ పూసేసినా అతమరు సుద్ద పీసు!
---------------------------------------------------------------------
ఈ జవాబు తర్వాత మిగతావాళ్ళు నన్ను కొంత డైవర్ట్ చేస్తే వాళ్ళకి ఒక రెండు మూడు ఝాడింపులు ఇచ్చాక కరెంటు పోయింది.మీరు టీవీల్లో చూస్తూనే ఉండి ఉంటారు చెన్నై పరిస్థితి.ఇప్పటికీ ఇంకా పూర్తిగా వర్షం తగ్గి మామూలు స్థితి వస్తుందనే నమ్మకం లేదు.తిరిగి కరెంటు రాగానే కంప్యూటరు ఓపెన్ చేసే పాటి తీరిక రాగానే తిన్నగా అకడికే వెళ్ళాను,బహుశా హరిబాబు వాళ్ళ ప్రతాపానికి తట్టుకోలేక మళ్ళీ మధ్యలోనే పారిపోయాడని చాలా డప్పాలు కొట్టుకుని ఉంటారు.రెండు సార్లు ఆ మాట పడ్డాక ఈసారి గూడా పడాలా?అదీగాక నీతో ఇక చర్చల్లో పాల్గొనను అని ఖరాఖండిగా తెగేసి చెప్పాక గూడా దాన్ని మరుసటి చర్చలకి వాయిదా వేసి మరీ వాళ్ళతో యుధ్ధానికి దిగి ఉన్నవాణ్ణి సగంలో వదిలేస్తే కుదరదు గదా! అదీగాక చదువరుల్లో ఉన్న రామభక్తులు కూడా ఈ సందేహాల్ని తీర్చుకోగలుగుతారు కదా - ఈ రెండు ఉద్దేశాలతో ఇదంతా కొనసాగిస్తున్నాను.

రావణుని సీతాపహరణం,హనుమంతుని సీతా సందర్శనం,సీత అగ్నిప్రవేశం అనే ఈ మూడు సనివేశాలకీ ఉన్న సంబంధాన్నీ వాల్మీకి సంవిధానం గురించీ  మరికొంత వివరిస్తాను.సీత లక్ష్మణుణ్ణీ అన్నది చాలా క్రూరమైన మాట,"మీ అన్నగారు చనిపోతే నువ్వు నన్ను చేపట్టాలని అనుకుంటున్నావు" అని?!రాముడి మీద తనకున్న ఆపేక్షతో కొంత విహ్వలత్వానికి లోనై అన్నదని పైన వివరించాను గదా!దీనికి ప్రతిధ్వని మళ్ళీ సీత నుంచే వినబడుతుంది.హనుమంతుడు సీతని చూసే సమయానికి అప్పుడే రావణుడు వచ్చి "రా!నన్ను స్వీకరిచు" అనే తరహా సుత్తి ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు.సీతకి ప్రతిరోజూ ఈ జాతర వినాలనే అసహ్యమూ రాముడు తనని విడిపించటం సాధ్యపడదేమో అనే నిరాశా కమ్ముకొచ్చేసి తన చీర చెంగుతోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూ దైవప్రార్ధనగా ఒక శ్లోకం చెప్పుకుంటుంది.దాని భావం,"మనకు వచ్చిపడే కష్టాలన్నీ ఒక విషయం మీద గానీ వ్యక్తి మీద గానీ వ్యామోహం ఉండి, అది దూరమవుతుందనే భయం వల్ల చేసే తప్పుల వల్ల.అలాంటి వ్యామోహాలు లేని సత్పురుషులందరికీ నమస్కారం!" అనే పరమసత్యం.ఈ రామద్వేషు లంతా రామాయణాన్ని ఎంత పీకి పాకం పెట్టినా మరో విధంగా అయినా ఈ ఒక్క విషయమూ నేర్చుకుంటే చాలు బుధ్ధిగా వాళ్ళ బతుకు వాళ్ళు బతకగల్గుతారు.నా స్వానుభవంలో ఈ పరమసత్యం నాకెప్పుడూ తెలుస్తూనే ఉన్నది.వాల్మీకి తన సంవిధాన చాతుర్యంతో సీతకి తన స్వానుభవం ద్వారా తెలియడం వల్లనే అంత సూటిగా మనకి బోధించగలిగిందా అనిపిస్తుంది.

రామాయణంలో ఈ ముక్క ఉందని తెలియని చిన్నతనంలో ఒక పాశ్చాత్య మేధావి ద్వారా "Most of our sorrows are the results of our mistakes and They were ultimately were the result of our weaknesses " అని అర్ధం వచ్చే ఒక కొటేషను చదివాను,పేరు కూడా గుర్తు లేదు గనక ఆయన ఎవరో రామాయణం చదివి తెలుసుకుని చెప్పాడో లేక సొంత జీవితానుభవంలో నేర్చుకుని చెప్పాడో ఎలియదు గానీ అప్పుదే ఈ భావం నాకు అద్భుతమనిపించింది!శ్రీకాంత్ చారికి తను తెలివైన వాడు కావటం వల్లనే సైన్సుని నమ్ముతూ దేవుడు లేడని అనగల్గుతున్నాననీ శ్యామలీయం లాంటివాళ్ళు అజ్ఞానులు గనకనే దేవుడూ దెయ్యాలూ అని వూరికే పిచ్చిగా బతికేస్తున్నారనీ ఒక మూఢనమ్మకం ఉండిపోయిది.శ్యామలీయం రాసే రామకీర్తనల్ని చదివినప్పుదల్లా తన పాండిత్యం నిరూపించుకోవాలన్న దురద రేగుతూ ఉంటుంది కాబోలు.ఆ వ్యామోహం లేకపోతే ఈ రచ్చ మొదలుపెట్టి ఉండేవాడు కాదు గదా!

ఎంత అహంకారమో చూడండి?ఈ భూ ప్రపంచం మీద ప్రతిదాన్నీ ప్రతి పుస్తకాన్నీ విమర్శించే హక్కు తనకి ఉందట,దాన్ని ఉపయోగించుకుని తీరతాడట!మరి తనకి యెంతో ఇష్టమైన తెలంగాణని ఎవరో "దక్షిణ పాకిస్తానం" అన్నారని వీళ్ళు మాట్లాడేది "తౌరక్యాంధ్రం" అన్నారని అంత రోషం వచ్చి ఎందుకు గొదవ చేశాడు?అంటే నీకు సంబంధించినవీ ఇష్టంగా అనిపించేవీ అయిన దేన్నయినా ఎవరూ విమర్శించగూడదు,నీకు ఇతర్లకి ఇష్తమైన వాటిని కెలికే హక్కునీ వొదులుకోవు -అబ్బో,నిజాము గూడ ఇంత జబర్దస్తుగా పెత్తనం జేసి ఉండడుగా ఇతర్ల మీద!ఈ పెతందార్లు గొప్ప ప్రజాస్వామిక వాదులూనూ,వీళ్ళు ఎన్నిసార్లు కెలికినా "ఎందుకు నాయనా మమ్మల్ని కెలుకుతారు?మీ నమ్మకాలు మీరు పాటించుకోండి!మేము ఏమాత్రం అడ్డు చెప్పం." అంటున్నశ్యామలీయమూ హరిబాబూ వగైరా వగైరా హిందూ మత దురహంకారులు - ఇంతకన్నా పైత్యకారి తనం ఇంకెక్కడయినా ఉంటుందా?

నిజాము దేహాల మీదనే పెత్తనం చేసి ఉంటాడు,ఇతను మాత్రం ఇతర్ల నమ్మకాల మీదనే పెత్తనం చెయ్యాలని చూస్తున్నాడు,అయినా తను గొప్ప ప్రజాస్వామ్యవాదినని అనుకుంటున్నాడు,ఇంకొక చోట వ్యాసుదు చాతుర్వర్ణం స్వభావజంగా చేశాను అంటేనే కాదు స్వభావజం అని అన్నా గానీ చేసింది పుట్టుకతోనే, పుట్టుకని బట్టి మంచివాళ్ళూ చెడ్డవాళ్ళూ అని బ్రాహ్మణాధిపత్యంతో సూత్రాలు చెప్పటం అన్యాయం,అక్రమం అని ఇంతెత్తున విరుచుకుపడ్డవాడు ఇక్కడ మాత్రం రావణుడు పులస్త్యబ్రహ్మ కొడుకు గదా రాక్షసుడెట్లైతడూ అని దీర్ఘాలు తీస్తున్నాడు - ఎప్పటి కెయ్యది పనికొస్తే అది వాడుకునే రెండు నాల్కల ధోరణి చూపించినా ఇతను చేసిన ప్రతి వాదనా శాస్త్రీయమే అని మనం నమ్మాలి.

ఇంక రాముడు అట్లా అనకపోతేనేం తన భార్యని పదిమందిలో ఉతికి ఆరెయ్యకుండా గమ్మునుండొచ్చు కదా అనేవాళ్ళకి దాంపత్యజీవితం అంటే పాపపుణ్యాలు రెంటినీ పంచుకోవడం అయినప్పుడు ఒకరు చేసిన తప్పులు మరొకర్ని కూడా బాధిస్తాయి గాబట్టి మనం కూడా ఒకరు తప్పు చెయ్యబోతే రెండవ వారుగా వారిస్తూనే ఉన్నాం కాబట్టి తన భార్య చేసిన తప్పుకి తను పరిహారం సూచించే హక్కు రాముడికి ఉంది!

సకల శాస్త్రాలూ కరతలామలకమే నట,దేని గురించయినా చర్చకి రమ్మని నాకు తక్కిన ఇద్దరూ సవాళ్ళు విసరటం,యేమి వీరత్వం?యేమి ధీరత్వం?యేమి ప్రాగల్భ్యం?!
--------------------------------------------------------------------------------------------
నిజానికి.. రామ అనేది థాయిలాండ్ రాజుల వంశం.. అంతేగాని, భారత దేశ రాజుకాదు. అక్కడ ఆ వంశరాజులని రామ1, రామ2.. అనిపిలుస్తారు. వాల్మీకి అక్కడ వాల్లు రాసుకున్న రామాయనాణ్ణి భారతదేశ వాతావరణానికి తగ్గట్టు మార్చి రాసుకున్నాడు. మనవాళ్ళు ఇతర భాషల నుంచి సినిమాలలోని కతలు తీసుకోని మనతగ్గట్టుగా మార్పులు చేసి ఇక్కడ రిలీజ్ చేసినట్టు.

రామాయణం గాని, భారతంగాని ఎలాంటి గ్రంధాలైనా మనము చదివితే అప్పటి వారి జీవిత విధానం తెలుస్తుంది. అక్కడిదాకా వెల్తే ఇబ్బందిలేదు. అంతేగాని.. అతిగా వూహించుకోని.. రాజకీయ/మత నాయకుల ఉచ్చులో పడి నరికేస్తాం.. చంపేస్తాం.. ఇంకులు పొసేస్తాం అన్నప్పుడు.. ఇలా నిజాలు బయటపెట్టక తప్పదు. తాత ముత్తాతల కాలం నుంచి నరనరాల్లో జీర్ణించుకున్నది తప్పు అని ఒప్పుకోవాలంటే చాలా కష్టం అని నాకు తెలుసు. కానీ నిజం ఎప్పటికీ నిజమే.. పురణాల్లో మన హీరోలు ఎదవపనులు చేసి, దానికి యేదొ పూర్వజన్మ శాపాలని పైపూత పూసి దాచేద్దామన్నా, ఒక జాతి వారు ఇవ్వన్ని ఒప్పుకోకపోతే శపిస్తాం అని గోల చేసినా అది నిజం ఐపోదు..
పై కామెంటుకు దమ్ముంటే చూపించు... తొక్క.. తోటకూర అంటూ చాలెంజిలు వొద్దు.. తెలుసుకోవాలంటే పరిశోధించి తెలుసుకోండి
  1. https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiHNSBmGTQKI3UQBdjMpW3ptP-aWlLPMUWr0-QFf7Ro4dQYFGtYtIVJ6yhgOUu62qAlwX-pHvxFiwVvfZRuBn-mAQ4XmtWhtPLzoZ2jpnzLM_qD-LyklPKAfZlEKiKkvXVHwxxHklSEAkqL/s35/Zilebi.jpg
ఆహా ! నీలి కేకు వారు జ్ఞానమే జ్ఞానము :) 
కేక :) 

మొత్తం రామాయణ బేక్ డ్రాప్ ని థాయ్ ల్యాండ్ కి మార్చేసారు :)- 

ఈ థియరీ కూడా బాగుందే ! వాల్మీకి కూడా 'థాయోడే' నే మో మరి :)

చీర్స్
జిలేబి

అమ్మా జిలేబీ! ముందే చెప్పాకదా.. నరన్నరాల్లో జీర్నించుకున్న వాళ్ళకు ఇలానే అనిపిస్తుందని...
--------------------------------------------------------------------------------------------
ఇది బ్లూకేక్కు గారి పాండిత్యం!నిజంగా ఈ పుచ్చొంకాయ వేస్తున్న సీరియల్ కామెంట్లలో మొదటి కామెంటు చూడగానే ఫకాల్న నవ్వొచ్చింది.నిజంగా ఇది ముఖాముఖి చర్చ అయి ఉంటే నా నవ్వుకే సిగ్గుపడి మూసుకుని పోయి ఉందేవాడు.ఈయనగారు చెప్తున్న ధాయిలాండ్ రామ1,రామ2 క్రీ.శ 17వ శతాబ్దం వాళ్ళు,మరి వాల్మీకి ఎప్పటి వాడు?క్రీ.శ 1వ శతాబ్దం వాడు,మీరూ నవ్వారా?పైగా ఎంత ధీమాగా "తొక్కా తోలూ అనకుండా పరిశోధించి తేల్చుకోండి" అని మనకి వార్నింగులు ఇస్తున్నాడు,వారెవ్వా యేమి పాండిత్యం?ఈ మేధావియే నన్ను దేని గురించయినా చర్చకి రమ్మని పదేపదే చాలెంజిలు చెయ్యటం చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గాని కెగరటం,రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడగటం - ఇంకా ఇలాంటి పోలికల్ని ఎన్ని తెచ్చుకుని ఈ అజ్ఞానకుక్షి యొక్క వెర్రిపుల్లాయితనాన్ని వెక్కిరించినా చాలదేమో అనిపిస్తుంది గదూ :-)పైన ఆల్రెడీ ఇంకోచోట ఇదివరకు తమ వాదనకి బెండు కొట్టే సిధ్ధాంతం సపోర్టుకి తెచ్చుకోవటం గురించి వెక్కిరిస్తూనే ఉన్నాను,మళ్ళీ ఇంకో ముందూ వెనకా చూసుకోకుండా కొట్టుకొచ్చే అమాంబాపతు యవ్వారం చేశాడు.బూకరిస్తే ఎదటివాడు ఇంత ధీమాగా చెప్తున్నాడు గాబట్టి నిజమేనని నమ్ముతాడని దైర్నం?!

మీకేమయినా అనుమానం ఉంటే మీ అంతట మీరే గూగుల్ బాక్సులో ధాయిలాండ్ రామా అని కీవర్డ్ ఎంటర్ చేసి సెర్చి చెయ్యండి.అట్లాగే వాల్మీకి గురించి కూడా అతని కాలం చరిత్రకారులు యెప్పుడని నిర్ధారించారో మీరు స్వయంగా వెతికి తెలుసుకోవచ్చు.నాకు ఇదివరకే ఈ యవ్వారమంతా తెలుసు గనక ఇక్కడ లింకులు గూడా ఇవ్వటం లేదు.ఈ కాపీ/పేస్టు గాళ్ళు హిందూ ధర్మశాస్త్రాల్ని విమర్శించటం అంటే నక్క నాకానికి వెళ్ళడం లాంటిది.ఇప్పటికి ఇద్దరు ఫూల్సు అయ్యారని నిర్ద్వంద్వంగా తెలిసిపోయింది గదా!మూడో మేతావి చిరంజీవికి బుర్ర తక్కువ దూకుడెక్కువ - మొదలుపెట్టటమే ఇట్లా మొదలు పెట్టాడు!
--------------------------------------------------------------------------
హరిబాబూ! నేను నీబ్లాగులో ఇంతకుముందే అడిగాని.. ప్రపంచంలో వున్న అన్ని రామాయణాలు చదివావా అని. నాకు నాదేశంలో వున్న రామాయణమే ముఖ్యం.. ఇంకొడి దేశంతో సంభంధం లేదు అన్నావ్? అలాంటి నువ్వు నీ బావిలోనే కూర్చోక,, ఈ సముద్రాన్ని గురించి కామెంటు ఎందుకు చేస్తావ్? సమాధానం చెప్పలేక బ్లాక్ చెయ్యడానికి ఇది నీ బ్లాగు కూడా కాదే.. ఐనా కూడా ఒక నిర్మాణాత్మకమైన చర్చచేద్దామంటే చేద్దాం. అంతేగాని.. నేను ఇలానే ఫిక్స్ అయ్యాను.. నువ్వుకూడా అల్లానె ఫిక్స్ ఐపో లేకపొతే నీ మీద పాకిస్తానోడు అని ముద్రేస్తాను అంటే దయచేసి మళ్ళీ ఇటురాకు..


--------------------------------------------------------------------------
ఇక్కడేదో జ్ఞానసముద్రం అలలు అలలుగా ఎగసిపడుతున్నట్టు "నువ్వు నీ బావిలోనే కూర్చోక,, ఈ సముద్రాన్ని గురించి కామెంటు ఎందుకు చేస్తావ్?" అంటున్నాడు చూదండి!"సమాధానం చెప్పలేక బ్లాక్ చెయ్యడానికి ఇది నీ బ్లాగు కూడా కాదే." అని గూడా అంటున్నాడు,ఏమి గొప్ప చమత్కారం,ఇహిహి:-)

ఇదే పెద్దమనిషి
-------------------------------

మీకు అసలు మాటర్ అర్ధం కాలేదు.. నేను వొచ్చాక.. హరిబాబు ఇంకా ఇక్కడ వుంటాడని ఎందుకనుకుంటున్నారు? చాలా గౌరవంగా(అని అనుకుంటూన్నాడు) పారిపొయ్యాడు..
-------------------------------
అని కూడా అనేశాడు,ఒహ్హొహ్హో:-)

-----------------------------------------------------------
>>తప్పు చేసి కూడా పదే పదే రాయబారాలు పంపించినా మూర్ఖంగా తోసిపుచ్చి యుధ్ధానికి తెగబడిన రావణుణ్ణి చంపినందుకు రాముణ్ణీ

హరిబాబూ! రాయబారం ఫలించివుంటే సీత పూర్వజన్మ శాపం ఏమైవుండేదీ?? ఇది కూడా చెప్పు.. అమ్మాయిలని దొంగతనంగా అనుభవించే ఇంద్రుడు అన్ని శిక్షలనుభవించాక కూడా ఇంకా దేవతల రాజుగా ఎలా వున్నాడు? నేరచరితులకు పదవుండకూడని అక్కడ దేవతలకి రిజర్వేషన్ యేమైనా వుందా??
ఇంకొక సందేహం.. దేవతల జెనరేషన్ కుమారస్వామి సమకాలీనులతో ఆగిపొయిందేమి?? అంతకుముందుదాకా వాళ్లకొడుకు, వీళ్ళకొడుకు(గమనిక: మెయిన్ దేవతలందరికీ కొడుకులే పుడతారెందుకో?) అంటూ వొచ్చి, ఫామిలీ ప్లానింగ్ ఆపరెషన్ అందరూ ఒక్కసారే చెయించుకున్నట్టు ఎందుకు ఆగిపొయిందో చెప్పు??
1.      
నువిక్కడ రావణుడి మంచితనం,దుష్టుతనం గురించి తేల్చదలుచుకున్నావా?సీత పూర్వజన్మల గురించి తేల్చదలుచుకున్నావా?
2.      
మొన్న చెట్టెక్కుతుంటే ....


మొన్న చెట్టెక్కావా.. నిన్న చెట్టు దిగావా.. అస్సలు దిగావా.. ఎక్కావా... ఇవన్ని ఎవడడిగాడొయ్ నిన్ను.. ఆ దెబ్బ ఎలా తగ్లిందొ చెప్పు..


అదే నండీ చెబుతున్నా.. చెట్టుమీద పట్టుజారి..

పట్టుకున్నావా.. జారిపొయ్యావా.. ఎవన్నీ ఎవడదిగాడోయ్ నిన్ను.. ఆ దెబ్బ ఎలా తగిలిందో చెప్పు..
3.      
ఇతర్లని దెబ్బలు కొట్టి సంతోషించే శాడిజం నీకుందని నాకు బాగా తెలుసులే!నాకు కావలసిన దాని విషయంలో నా అపట్టు ఎప్పుడూఒ జారిపోదు!నాకు అఖ్ఖర్లేని విషయాల జోలికి పోను గాబట్టి ణంగపడి నిరాశపడి దు~హ్ఖిన్వ్హే ప్రసక్తి అసక్లే ఉండదు.నాకెందుకు బాధలు ఉంటాయి?
-----------------------------------------------------------
అర్ధమయిందిగా యెంత తెలివి తక్కువ వాదనతో చర్చని డైవర్ట్ చెయ్యాలని చూస్తున్నాడో!
-----------------------------------------------------------------------------
హరిబబూ! వాదనకాదుగానీ, దేనిగురించి చర్చించడానికి ఇక్కడికి వొచ్చావో దానిగురించే మాట్లాడదాం. నీకు ఓకే నా??

అరుంధతీ వ్యాఖ్యల గురించి ఎందుకు చెప్పానో నీకింకా అర్ధంకాలేదా బాబూ?? నీపొస్టులు ఒకసారి చూడు.. నీ అభిప్రాయాన్ని ఖండించానని నన్ను కూడా దేశాన్ని వొదిలి పొమ్మన్నావ్.. మళ్ళీ ఆ ఉగ్రవాద బుద్ది ఇక్కడ చూపకుండా గుర్తుచెయ్యడమన్నమాట.. నువ్వు ఇంకా పారిపోతాను అంటే, ఎవ్వడూ బొట్టెట్టి బతిమాలడు
1.     
"మీకు అసలు మాటర్ అర్ధం కాలేదు.. నేను వొచ్చాక.. హరిబాబు ఇంకా ఇక్కడ వుంటాడని ఎందుకనుకుంటున్నారు? చాలా గౌరవంగా(అని అనుకుంటూన్నాడు) పారిపొయ్యాడు.." అని చంకలు గుద్దుకున్న నువ్వు నేను భయపడిపోయేతంత ఘొప్ప ప్రశ్న యేమడిగావు,నువు ఇక్కడ్ అపీకిందేమిటి?

అది అడిగితేనే రధం కాలేదు నీకు!ఇంక్ అసీరియస్ చర్చలా?

బ్లాగు యజమాని నన్ను "యేడిస్తే చాలు" అంటున్నాడు యేదవటం నాకు రాదు గనక సెలవు పుచ్చుకుంటూణ్న్నాను,ఆ పెదమనిషి కార్చే యేకపక్ష సొల్లు నీమీద కూడా పోసుకుని తరించు,నీతోనూ వారితోనూ చర్చించే పాటి అజ్ఞానం+మొండితం+తింగరి తనం నాకు లేదులే!

మినిమం సంస్కారం కూడా లేనివాళ్ళు ధర్మశాస్త్ర చర్చలు చేస్తున్నారు - చీ!
2.      

chiranjeevi
నీ అభిప్రాయాన్ని ఖండించానని నన్ను కూడా దేశాన్ని వొదిలి పొమ్మన్నావ్
haribabu:
అక్కడ నేను రాసిందేమిటో నువ్వు నాకు గుర్తు చెయ్యనఖ్ఖర లేదు.నేను ప్రస్తావించినది ఇండియన్ సైన్సు గురించి,కులాల కుమ్ములాటల గురించి కాదు,అస్పృస్యత గురించీ కాదు!కుల సమస్య లేదని నేనన్నానా?ప్రతి దేశచరిత్రలోనూ మంచీ ఉంటుంది చెడూ ఉంటుంది - చెడుని విమర్శించహ్టం తప్పు లేదు,కానీ దానికి సంబంధం లేకుండా విదెశీయులు కూడా మేచ్చుకునేటంత గొప్ప విజయాల్ని సాధించిన మనవాళ్ళని మనం పొగుడుకుంటే తప్పేమిటి?దానికి కూడా సిగ్గుపడుతున్నవాళ్ళని గురించి అన్నాను,నీకూ ఆ లక్షణం ఉంటేనే నేను ప్రత్యేకంగా నిన్ను అన్నట్టు!

నీలో ఆ లక్షణం లేకపోతే అది నీకెందుకు తగుల్తుంది?
-----------------------------------------------------------------------------
ఇదో పాతముచ్చట,మనవాళ్ళు కొన్ని శతాబ్దాల ముందే కనుక్కున్నా మనకి గుర్తింపు రాలేదు అని నేనొక పోష్టు వేస్తే అందులో నేను కనీసం న్యూటను గారిని అవమానించే విధంగా ఒక్క మాట మాట్లాడకపోయినా వాళ్ళని ఇన్సల్టు చేసేసినట్టు పేట్రేగిపోయాడు ఈ పెద్దమనిషి,ఈయన గారి ఆత్మబంధువు నెవర్నో నేను బందబూతులు తిట్టినంతగా గిలగిల్లాడిపోయాడు,అప్పుడే జవాబు చెప్పాను, పాయింటు అర్ధమయితే ఈ కామెంటు ఇక్కద మళ్ళీ వేస్తాడా!నేను వాడిన సరళ గ్రాంధికమే అర్ధం కాక ఇలా గింజుకుంటున్నవాళ్లకి సంస్కృతం ధారాళంగా వచ్చుననీ ఆ పాండిత్యంతోనే వాటిల్లో  తప్పులు పట్టగలమనే ధీమా వీళ్లలో ఉన్నదనీ అంటే మనం నమ్మాలా, హవ్వ:-)
---------------------------------------------------------------------
నువ్వెందుకు హిదువులందరికీ ప్రతినిధి అని ఫీల్ అవుతున్నావో నాకు అర్ధం కాదు ఎప్పుడూ.. ధర్మశాస్త్రం అంటే ఏమిటంటే నీకెందుకంటావెంటి? ఏం? మేము చదివితే నీకు, లేకపోతే నీ జాతికి సంబందించిన ఏ రహస్యాలు బయటపడతాయి? నువ్వడిగే ప్రతి ప్రశ్నకి నాదగ్గర సమాధానం వుంది.. ముందు నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు.
1.      

chiranjeevi
ముందు నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు.
haribabu:
ముందు పైన బాక్సు కట్టి మరీ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు.అవి శ్రీకాంత్ చారి మొదలుపెట్టిన చర్చకి సంబంధించినవే!
---------------------------------------------------------------------
అడిగిన దానికి జవాబు చెప్పినా "అదే మరి!" అన్న శ్రీకాంతు లాగే ఈయనగారి బుధ్ధి ఎంత చురుకైనదో తెలిపే అజ్ఞానసకలం ఇది.ఒక మూడు కామెంట్లకి ముందరనే మళ్ళీ డైవర్ట్ చెయ్యబోతుంటే బాక్సు కట్టి మరీ నిలదీసి ఉన్నాను ,అయినా ఇదే వరస - వీళ్ళ బండతనం చూస్తుంటే ముసలః కిసలాయతే వ్యంగ్యం గుర్తుకొస్తే తప్పా?

ఇతని మొదటి కామెంటులో ఇంతవరకూ జవాబు చెప్పకుండా వొదిలేసిన ఒక విషయం తీసుకుని వీళ్ళింత ద్వేషం వెళ్ళగక్కుతున్నారని తెలిసినా కూడా నావైపు నుంచి మళ్ళీ సయోధ్యకి ప్రయత్నిస్తూ హితబోధ చేస్తే ఇతని రెస్పాన్సు ఎలా ఉందో చూడండి?.
---------------------------------------------------------
Chiranjeevi Y
నేను ఇంకో చోటకూడా చెప్పాను.. నువ్వు రాముడి అభిమానివి కాబట్టి రావణుడిదే తప్పు అని రాసుకున్నవ్. అదే రావణుడి అభిమానివైతే, రావుణుడే పెద్ద హీరో.. రాముడు పెళ్ళాం కోసమే రావణుడ్ని చంపాడుగాని, లోక కల్యాణం కోసం కాదు అని రాసుకుంటావ్.. ఈ విషయం నీ బుర్రకి ఎక్కిందనుకుంటున్నాను. 

haribabu:
రష్యన్ సాహిత్యం లోని "అమ్మ" నవల లాగే వాల్మీకికి రామాయణం రాయడంలో ఒక ఎజెండా ఉంది.రామూడికి అభిమానిగా ఉంటే ఒకలాగా శత్రువుగా ఉంటే ఒకలాగా రాయడానికి వాల్మీకి పిచ్చోడు కాదు!అది నీకు ఎప్పటికీ ఎక్కదు,పోయి విషవృక్షం చదువుకుని తరించు!


రావణుడు చాలా మంచివాడు అని ఇక్కడ మాత్రమే అనగలరు,లేదా మీలాంటి సేం గ్రూపు దగ్గిరే చెప్పుకోగలరు.నేను ఉదహరించిన వాస్తవ జీవితంలో తన మీద యాసిడ్ పొయ్యాలనుకున్న వాణ్ణి చెప్పుతో కొట్టిన ఆ అమ్మాయి ముందు గానీ ఆ రాక్షస చేషట చేసిన వాణ్ణి తన్ని పోలీసుల కప్పగించిన జనం ముందు గానీ ఈ ధియరీలు చెప్పగలరా?

నేను మొదటి నుంచీ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇదే!దానికి మీరు ఇంతవరకూ జవాబు చెప్పలేదు గానీ రామాయణం లోని శ్లోకాల్ని కొన్ని వందలు ఇక్కడ గుమ్మరిస్తాము అని అంటున్నారు,వాస్తవ జీవీతంలో చీ కొట్టించుకునేటందుకు తప్ప దేనికి పనికొస్తుంది నీ పాండిత్యం - మ్రంనా కన్నా గొప్పెళ్ళా మీరు?!

నేకేమన్నా మెంటలా?? అన్నీ నువ్వె అడుగుతావ్.. సమాధానం చెబితే కుప్పలు కుప్పలు శ్లోకాలు పోసారంటావ్... మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా నేడిగినదానికి సమాధానం లేదంటావ్.. అస్సలు నువ్వెమడగదల్చుకున్నావో సొల్లు లెకుండా ఒక్క వాఖ్యంలో అడుగు .. నేను చెబుతాను
---------------------------------------------------------
మళ్ళీ మొదటి కొచ్చాడు:-)ఇతనొక్కడే కాదు వీళ్ళంతా ఇంతే - తెడ్డుశ్రీలు!తెడ్డు చూదండి పానకం కలిపినాక నాకితే తియ్యగా ఉంటుంది,వూరగాయ జాడీలో కలియబెట్టి తీశాక నాకితే కారంగా ఉంటుంది, సుబ్బరంగా కడిగాక నాకితే ఏ రుచీ ఉందదు - వీళ్ళు గూడా అంతే చదివింది ఏదీ బుర్రలోకి ఎక్కించుకోరు.కాపీ/పేష్తు చెయ్యడం,ముందుగానే తమకి పోటుగాడని ఇమేజి పడిపోయిన వాడెవడో చెప్పింది చెప్పినట్టు నమ్మటం తప్ప సొంతంగా ఆలోచించి ముందూ వెనకా చూసి విశ్లేషించుకునే సామర్ధ్యం ఉండదు - పాపం!

నాకు ఇప్పటి వరకూ మిగిలిన వాళ్ళకన్నా శ్రీకాంత్ చారి అంటే కొంత అభిమానం ఉందేది.అందుకే చర్చ మొదలు పెట్టటమే ఇక్కడి వరకూ సాగదియ్యకుండా మంచి సలహా తోనే మొదలు పెట్టాను.ఆఖరి విడతలో జరిగిన  తెలంగాణా ఉద్యమంలో ఉన్న సంక్లిష్టత వల్ల తెలంగాణా అలా తప్ప మరోదారిలో రాదు గనక తప్పనిసరై ఆంధ్రావాళ్ళని తిట్టి రాష్త్రం తెచ్చుకోవడం అనే కేసీఆర్ అండ్ కో దిక్కుమాలిన వ్యూహం ప్రభావానికి గురయి ఒక్కసారిగా బయటపడలేకుండా ఉన్నాదని అనుకునే వాణ్ణి,కానీ శ్యామలీయం ఎక్కడ కామెంటు వేసినా అక్కడి కల్లా వెళ్ళి రచ్చ రచ్చ చేసి ఇప్పుడీ విధంగా అతన్ని బద్నాం చెయ్యాలని చూశాక నా అభిప్రాయం మార్చుకోక తప్పలేదు.చేసింది రహస్యంగా ఏమీ చెయ్యలేదు గదా, వాల్మీకి రాసిన భాగాలు ఊదాహరించినా అవన్నీ శ్యామలీయం సొంత అభిప్రాయాలు అయినట్టు అన్ని వెటకారాలూ ఆడి నాకు వ్యక్తిగత ద్వేషం లేదని అంటే ఎవరు నమ్ముతారు?

ఇప్పటికీ నేను ఒకటే చెప్తున్నా,శ్యామలీయం మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు,ఒక రకంగా ఇదివరకు నా మెయిల్ బాక్సు ద్వారా "మీరు ప్రవీణ్ మరియూ శ్రీకాంత్ చారి వాళ్లతో చర్చలలో పాల్గొనకండి,వాటి వల్ల యేమీ తేలదు" అని సలహా ఇచ్చినా మీ ఉబోసలు నాకు అఖ్ఖర్లేదు అని కొట్టి పారేశాను.పోష్టులు వేసినా,కామెంట్లు వేసినా.చర్చల్లో పాల్గొనా నాకున్న ఎజెండా ప్రకారమే చేస్తున్నాను.కాకపోతే తనిచ్చిన మర్యాదైన సలహాకి నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా చెప్పాను - వినాలా అఖ్ఖర్లేదా అనేది అతను వొత్తిడి చెయ్యనూ లేదు, నాకిష్తమైనదే నేనూ చేశాను.అయితే శ్యామలీయం,శ్రీకాంత్ చారి,చిరంజీవి,బ్లూకేక్,హరిబాబు వగైరా వగైరా వీళ్ళంతా వాస్తవ జీవితంలో యెలా ఉంటారో ఒకరికొకరికి తెలియదు,తెలియాల్సిన అవసరం కూడా లేదు.ఇక్కడ తమ బ్లాగులో ఏమి రాస్తున్నారు.కామెంట్లలో యే విధమైన వాటిని ప్రస్తావిస్తున్నారు అన్నది మాత్రమే ముఖ్యం,కదా!

తన పాటికి తను కవిత్వం రాసుకుంటున్నాడు,భాషకి సంబంధించి పరిజ్ఞానం ఉంది కాబట్టి తప్పులు చేస్తున్నారు అనిపించినప్పుడు మర్యాదగానే చెప్తున్నాడు,అది కూడా నేరమేనా?పోనీ చెప్తున్నదేమయినా నేను చెప్తున్నాను గాబట్టి మీరు విని తీరాలని పెత్తనం చేస్తున్నాడా,అదీ లేదే!మరింక ఇన్ని రోజులుగా ఇన్ని నెలలుగా ఈ హడావిడి చేసి మీరు ఏమి సాధించాలనుకున్నారు?యేమి సాదించగలిగారు?ఇదే విధంగా మీ సమయాన్నీ ఇతర బ్లాగర్ల సమయాన్నీ కొన్ని సంవత్సరాల పాటు మీచుట్టూ తిప్పుకున్నాక గూడా మీరేమి సాధించగలరు?

శ్రీకాంత్ చారీ!నువ్వొక వేళ పనిగట్టుకుని పత్తేదారు పనిచేసి ఈ శ్యామలీయం బ్లాగుల్లో ఇట్లా రామభక్తి కీర్తనలు రాస్తున్నాడు గానీ నిజజీవితంలో చాటుగా బూతు ఫిల్ములు చూస్తాడు అని రుజువు చెయ్యగలిగితే నాతో సహా మొత్తం బ్లాగర్ల మందరమూ కూడా నీ శ్రమని మెచ్చుకుంటాం,ఎందుకంటే అది సత్యాన్ని వెలికి దియ్యడం అనే పవిత్రమైన కార్యక్రమం గనక!ఒకవేళ అలా పరిశోధన చేసినా చెయ్యకపోయినా నిజజీవితంలో శ్యామలీయం కనీసం బ్రాహ్మణాధిక్యత గూడా లేని ఇతర్లకి సహాయం చేసి నిస్వార్ధంగా ఉండగలిగిన ఒక మంచి మనిషి అని తేలితే అంత మంచి మనిషిని ఇట్లా హింసించినందుకు ఫీలవ్వాలి,అవునా కాదా?నీహారిక వూరికే తెలివి తక్కువగా క్షమాపణ చెప్పిందనుకున్నావా?ఈ ప్రశ్న వస్తే తట్టుకోవడానికీ తన వైపు నుంచి తప్పు లేకుండా చూసుకోవడానికీ ముందు జాగర్త - నీకు అదీ లేకపోయింది?!

ఇప్పటికీ శ్రీకాంత్ చారికి హితవరిగానే ఒక సలహా ఇస్తున్నా - పేరులో "కాంత" ఉండగానే సరిగాదు,మగాళ్లని పొగిడి బుట్టలో వేసుకుని పిచ్చోళ్ళని చేసి తమ చేతికి మట్టంటకుండా పనుల్ని చేయించేసుకుని తమ అవసరం తీరిపోయాక కూరలో కరివేపాకులా తీసిపారెయ్యగలిగిన "కాంత"ల మాయాజాలాన్ని గురించి తెలుసుకుని జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి!గొడవ మొదలెట్టిన మనిషి గొడవ జరుగుతుండగానే గొడవకి కారణమూ చెప్పింది,తనవైపు నుంచి క్షమాపణ చెప్పేసి గుడ్ గర్ల్ ఇమేజి తెచ్చేసుకుని సెటిలైపోయింది!మీకు మీరు ఇప్పటికీ ఇరగదీసేశాం అనుకుంటూ ఉంటే చెప్పలేను గానీ స్థిమితంగా కూర్చుని ప్రశాంతంగా ఆలోచిస్తే ఆవిడ తరపున రెచ్చిపోయి మీరు ఫూల్సు అయ్యారు.

మీ కాపీ/పేష్టులకి భయపడేందుకు హరిబాబు కుందేలు కాదు - అసలు సిసలైన ఏషియాటిక్ లయన్!

27 comments:

  1. Mee opika ki nijangaa joharlu anna.. yentha sahanam, orpu unte thappa intha detailed ga mail raayaleru.
    :venkat

    ReplyDelete
  2. >>Mee opika ki nijangaa joharlu anna.. yentha sahanam, orpu unte thappa intha detailed ga mail raayaleru.

    I agree with this

    ReplyDelete
  3. >>నువ్వొక వేళ పనిగట్టుకుని పత్తేదారు పనిచేసి ఈ శ్యామలీయం బ్లాగుల్లో ఇట్లా రామభక్తి కీర్తనలు రాస్తున్నాడు గానీ నిజజీవితంలో చాటుగా బూతు ఫిల్ములు చూస్తాడు అని రుజువు చెయ్యగలిగితే నాతో సహా మొత్తం బ్లాగర్ల మందరమూ కూడా నీ శ్రమని మెచ్చుకుంటాం

    ఒకవెళ అది నిజమే ఐనా.. అది అతని పర్సనల్.. నువ్వు నీ బ్లాగర్లు దానికి శునకానందం పొదవలిసిన అవసరం లేదు. ఒక వేళ ఎవడైనా ఆనందపడ్డాడు అంటే, వాడో పెద్ద సైకో అయ్యుండాలి

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు మీ ముగ్గురూ పొందింది శునకానందం కాదా?

      రావణుడికి సీత పరస్త్రీ అవుతుందని రాఅణుడికే కాదు,మీకూ తెలుసు - అయినా డెలిబరేట్ మొండి వాదనలతో ఆ రాక్షస చర్య చేసినవాణ్ణి సమర్ధిస్తున్న మీరు ఇక్కడ వాస్తవ జీవితంలో మీరు ఆ యాసిడ్ పోసిన వాణ్ణి సమర్ధిస్తున్నట్టు అవుతందా లేదా?

      నేను మిమల్ని అడిగిన ఈ సూటి ప్రశ్నకి జవాబు చెప్పారా?అది టాపిక్కుకి సంబంధించినది కాదా?ముందు ఇక్కడైనా సరే దానికి జవాబు చెప్పి తర్వాత్ మిగతావాటి సంగతి తేల్చుకో!తెలుగే అర్ధం కాదు,జవాబు చెప్పాక గూడా "మరదె!" అని అమాయకపు వెర్రి ఫీలింగు పెదతాడొకడు!మరొకడు కొట్టుకొచ్చిన వివరంలో ఏది ముందూ ఏది వెనకా అనేది కూడా చూసుకోడు!మీ స్థాయికి మీకు హిందూ ధర్మ శాస్త్రాల గురించి పీకి పాకం పెట్టే పాండిత్యం ఉందంటే మేము నమ్మాలి,మీతో వాదించాలి.

      ముందు నేను అక్కడి మీ రచ్చలో మీకు సూటిగా వేసిన ప్రశ్నకి జవబు చెప్పే దమ్ముందా!ఇక్కడ వాగినట్టు ఆ అమ్మాయి దగ్గిరో ఆ జనం దగ్గిరో వాగితే వాడితో పాటు మిమ్మల్ని కూడా నాలుగు తంతారు.అది తెలుసా నీకు?

      త్రిలోకవిద్రావణుడు అంటే తెలియదు అంటూనే కట్టలు కట్టలు శ్లోకాలు కొట్టుకొచ్చి కాపీ/పేష్టు చేస్తాడట?!

      నీ సంగతేంటి?అక్కడ చర్చ్ఝకి సంబంధించి మాట్లాడకుండా వెర్రిమొర్రి సాకులతో దైవర్ట్ చేస్తావెందుకు?సూటిగా జవాబు చెప్పు అక్కడి ప్రశ్నకి.అక్కడిలా చెత్త మాట్లాడితే కుదరదు - ఖబడ్దార్!

      Delete
  4. రావణ కాష్టం ఎప్పుడూ ఆరదు అంటే ఇదేనేమో :)

    ఏమండీ హరి బాబు గారు,

    వాల్మీకి ఒకటవ శతాభ్దం వారంటారు ? వాల్మీకి రాముల వారి సమకాలికుడు కాదా? సమకాలికుడు అయితే రాముల వారు కూడా ఒకటవ శతాబ్దం వారా ? విశదీకరించ గలరు .

    ఇట్లు
    'ముసలి' జిలేబి మామి :)

    ReplyDelete
    Replies
    1. రాముడి కాలం గురించి ఇక్కడ చెప్పాను.అయితే అవన్నీ లెకలు సరిపోవడమే తప్ప నిర్ధారణగా మాత్రం తెలియదు.ప్రస్తుతానికి వాల్మీకి వర్ణించిన రాముదే మనకి వాస్తవం.
      ఏ లెక్క ప్రకారం చూసినా వాల్మీకి రాముడికి సమకాలికుడు ఎట్లా అవుతాడు?
      రాముడి అవతార పరిసమాప్తి కూడా జరిగిపోయాక నారదుదు చెప్పిన దాన్ని అబ్ట్టి కదా రామాయణం వ్రాసింది!బ్రహ్మ,నారదుడు ఇద్దరూ ఒకప్పుడు రాముడు అనే నువ్వు ఆశించిన లక్షణాలు ఉన్న పూర్ణపురుషుడు ఉండేవాడు అని గదా చెప్పింది?

      Delete
    2. Valmiki composed twenty four thousand verses and taught them to Lava and Kusha, the sons of Rama and Seetha. The two youngsters sing the ballad among the assemblages of sages and saints, and win laurels. Rama on seeing the boys singing on the streets and king's ways of Ayodhya, brings them to his palace, and summons all his brothers and ministers to listen to the ballad

      http://www.valmikiramayan.net/utf8/baala/sarga4/bala_4_frame.htm

      According to above I see Valmiki is contemporary of Rama.

      cheers

      zilebi

      Delete
    3. These details arae references in the poem.

      asa a matter of history,rahul sankrtyaayan anad other historians assessed tahat valmiki is contempoaray of pushyamitra of Shunga Dynasty.

      If you believe each and letter of the epic as true,I don't mind.But there is a saying that "ఉత్తరే రామచరిత్రే భవభూతిర్విశిష్యసి".would you find any proof that this secod part was written by valmiki?

      Delete
    4. చారిత్రక కోణం నుంచి చూస్తే వాల్మీకి 1వ శతాబ్దం వాడే - అన్ని ఆధారాలనీ మరోసారి వెతికాను!పుష్యమిత్రుడు కూడా ఇతని సమకాలికుడే!

      కానీ వీరిద్దరికీ సంబంధం ఉందా?వాల్మీకి పుష్యమిత్రుడి ఆస్థాన కవి కావచ్చా!

      ఇవి మాత్రం రూఢిగా తెలియదు నాకు.

      Delete
    5. @ 'ముసలి' జిలేబి మామి :)

      ... నేను 'మొసలి జిలేబి మామి :)
      గా చదువుకుంటాను.
      (ఏ బ్లాగులో హరిబాబు గారుంటే
      ఆ బ్లాగుకెళ్ళి విడవకుండా మొసలి
      పట్టు పడుతున్నారు గదా ... అందుకని ...
      :-)

      Delete
    6. ... నేను 'మొసలి జిలేబి మామి :)
      గా చదువుకుంటాను.
      (
      :-)

      Delete

    7. భంశు !

      మొసలి కూడా అటక ఎక్కాసినదేమో టపా మూట కట్టి బెట్టి !

      జిలేబి

      Delete
    8. వొద్దొద్దు జిలేబె మామి:-(
      నువ్వు లేకుంటే బోర్బోరు!

      Delete
    9. zilebi
      మొసలి కూడా అటక ఎక్కాసినదేమో టపా మూట కట్టి బెట్టి !
      haribabu
      అల్లరిపిల్లలు,ఆళ్ళట్లా అంటూ ఉంటారు - అదో సర్దా, అంతే!
      ఇయ్యన్ని మనలాంటి ముసలాళ్ళు పట్టించుకోగూడదుస్మీ.

      Delete
    10. @ haribabu
      అవునవునుస్మీ ... అదో సర్దా, అంతే!
      నిజం ... నిజం ...
      "అవును - ఆవును"
      "లాలిపాప్ - తాలిబాన్"
      "ముసలి - మొసలి"
      లోల (lol) :-)

      Delete
  5. నువ్వెంత వేస్ట్ గాడివో.. నువ్వు పబ్లిష్ చెయ్యకుండా వొదిలేసిన కామెంటులు చూస్తే అర్ధం అవుతుంది

    ReplyDelete
    Replies
    1. నువ్వెంత వేస్ట్ గాడివో అడిగిన దానికి జవాబు చెప్పకుండా అదీ ఇదీ కెలకడంలోనే తెలుస్తుంది.మొదటి నుంచీ నా పధ్ధతి "సూటిగా చెప్పు సుత్తి లేకుండా" అని.అడిగిన దానికి తిన్నగా జవాబు చెప్పగలిగితే చెప్పు,లేదా మూసుకు పో!

      Delete
  6. దమ్ము గురించి కావలిసిన రిప్లయ్లు మాత్రమే ప్రచురించే నీలాంటి వాడు, ఈ దెశంలో హిందువులు మాత్రమే, అది కూడా మోఢీ కి ఓటేసేవాడే హిందువనే http://saveindiansnow.blogspot.in/ లాంటి వాళ్ళే మాట్లాడాలి మరి

    ReplyDelete
    Replies
    1. తనమీద యాసిడ్ పోసిన రాక్షసకర్మ చేసినవాణ్ణి చెప్పుతో కొట్టిన ఆదపిల్ల ముందుకెళ్ళ్ళీ ఈ రావణుణ్ణి కేవలం రేప్ చెయ్యనందుకే మహానుభావుదని కీర్తిస్తున్నవారూ నువ్వూ వెళ్ళి పొగిడి చూడు,అదీ నిజమైన దమ్మంటే,సూటిగా చెప్పు సుత్తి లేకుండా అని నెత్తి మీద కొట్టి అడుగుతున్నా అసలు ప్రశ్నకి ఒక్కడి నుంచీ జవాబు రాదు గానీ కొట్టుకొచ్చిన విషయం అబధ్ధమా నిజమా గూడా తేల్చ్చుకోకుండా "తొక్కా తోలూ అనకుండా పరిశోధించి చూసుకో" అని వాగే అజ్ఞానకుక్షి గాడివి నీ దగ్గిరేదో మ్యాటర్ ఉన్నట్టు నీ ప్రతి చెత్త కామెంటూ వెయ్యాలా,పో పో!ఇక్కడెవరికీ చెయ్యి ఖాళీ లేదు.

      ఔనూ,అక్కద థాయిలాండు,అరామ1రామ2 అని చదవగానే ఇక్కడ వాల్మీకీ రామాయన్మ రాయడం గుర్తుకొచ్చేసి "హింకేముందీ.ఆ వాల్మీకి గాడు దీన్నే కాపీ/పేష్టు చేసేసి ఉంటాడూ,దీంతో ఈ హరిబాబు గాడి లాంటి వాళ్ళ తిక్క కుదిర్చేస్తా!" అని చంకలెగరేసుకుంటూ రాకపోతే కాస్త ఎవరు ముందు ఎవరు వెనకా అని చూసుకుని యాడవొచ్చుగా:-)

      పైగా "అమ్మా జిలేబీ! ముందే చెప్పాకదా.. నరన్నరాల్లో జీర్నించుకున్న వాళ్ళకు ఇలానే అనిపిస్తుందని..." అట,హ్హహ్హహ్హ!

      ఈ ముక్క నేన్లెక్కెట్టుకోనని జెప్పుంటావ్ - ఓరి పిచ్చి నా పువ్వా నన్నీలాగ సోంబేరి ఎదవని గాదు, పెతి అడ్డగాడిదనీ లెక్కజెయ్యటానికీ పెతి పక్కోడి పెళ్ళాన్ని ఎత్తుకెళ్లేవోడి అబిమానికీ తలుపుల్దెరవటానికీ,ఒల్లకోవో!

      Delete
  7. http://bharathagadda.blogspot.in/2015/12/blog-post_5.html

    ReplyDelete
  8. ఎమిటి హరిబాబు ఇదంతా! మన తెలుగు బ్లాగులో ఉన్న ఒక్కాగానొక్క, పూనం పాండే ను ఎంత మాటలేసి అంట్టున్నావు? పాపులారిటి కోసం ఆమే పాట్లేవో ఆమె పడుతున్నాది. అంటొంట్ళతో వాదనకు దిగితే దానిని వారి కనుకూలంగా పాపులరిటి పెంచటం కోసం ఉఒపయోగించుకొంటారు.

    ReplyDelete
    Replies
    1. మన తెలుగు బ్లాగులో ఉన్న ఒక్కాగానొక్క, పూనం పాండే

      haribaabu:
      అయ్యయ్యో,ప్రాచీనురాలైన సీతనైనా అవమానించొచ్చు గానీ అస్సలు కామన్ సెన్సు కూడా లేకుండా "పూనం పాండే" లాంటి ఆధునిక నారిని అగుమానిస్తానా?

      ఎవరిని మీరు అలా రిఫర్ చేస్తున్నారో తెలిస్తే ఇకమీదట జాగ్రత్త పదతాను!ఈ తరం వాణ్ణి కాదు గదా కాస్త చురుకు తక్కువ.

      Delete
  9. అయ్యలారా,అమ్మలారా - చూడగా చూడగా నాకొక సందేహము కలుగుచున్నది. రాముణ్ణి ఇటువేపునున్న శ్యామలీయం, హరిబాబు అనే వాళ్ళు నెత్తికెత్తుకున్నారని, ఆ వేపునుంచి రావణున్ని భుజాలమీద మోస్తున్నట్లుగా అని-సారీ-కనిపిస్తోంది. హతవిదీ ! రామున్ని ఆంధ్రాకి నేట్టేశారా కొంపదీసి! రావణున్ని తప్పని సరి పరిస్తుతులలో గానీ ఓన్ చేసుకున్నారా పాపం సీమాన్దురుల మీది కక్షతో (అందరూ కాదులెండి-కొందరు)? అదే పైవాళ్ళు గానే రావణున్ని చంకేక్కిన్చుకుంటే vice versa సీన్ అయ్యేదేమో? మొత్తం మీద ఇరు పక్షాలలో ఘనాపాతీలేందరో తెలియదు గానీ కలిసికట్టుగా రామాయణాన్నిప్రతిష్టని భ్రష్టు పట్టిస్తున్నారనిపిస్తోంది, తమ తమ, వ్యక్తిగతము కలగలసిన hateful వాదనలతో. దయచేసి రామాయణాన్ని రాముదికోదిలేయండి, మీరు ఎప్పట్లానే విభజన బురదలు చల్లుకోంది, రాముడికి బురద పూయదాన్ని ఆపి. ప్లీజ్.

    ReplyDelete
  10. శ్యామలీయం గారు నిఖార్సయిన రామభక్తులు. ఈ హరిబాబు తింగరి వెధవలా అన్నిటిలో దూరుతాడు. కత్తికి లేని దురద కందకు ఎందుకు? బాబాయి గారు లైటు తీసుకున్నాక వీడికి ఈ ఏడుపులు ఎందుకో ఏమో

    ReplyDelete
    Replies
    1. నిజమే నండి, బాగా చెప్పారు!ఇట్లా గడ్డి పెట్టేవాళ్ళు లేకనే పేట్రేగిపోతున్నానేమో?

      Delete
  11. Haribabu , apaatradanam cheyya koodadu .

    ReplyDelete
    Replies
    1. what is this apaatradanam you are refering about?Please clarify me!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...