Saturday 28 November 2015

మల్లీశ్వరి గొప్పదా?పాతాళ భైరవి గొప్పదా?

     మల్లీశ్వరి అనే సినిమా తియ్యకపోయి ఉంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే కవి కొందరికి మాత్రమే తెలిసి ఉండేవాడు!"వూర్వశి","కృష్ణ పక్షం" లాంటివి చదువు రానివాళ్ళకి యెలా తెలుస్తాయి?అవి చదవగలిగిన వాళ్ళు కూడా మల్లీశ్వరి తియ్యకపోయి ఉంటే కాళిదాసు మేఘసందేశంతో పోల్చదగిన "ఓ మేఘమాలా" పాటని యెట్లా ఆస్వాదించేవాళ్ళు?!
     కధ చాలా చిన్నది.నాగరాజు,మల్లీశ్వరి వరసైన వాళ్ళు.నాగరాజు శిల్పవిద్య నేర్చుకుంటున్నాడు.ఒకసారి తిరునాళ్ళకి వెళ్ళి తిరిగి వస్తూ మధ్యదారిలో వర్షం మూలంగా ఒక గుడిలో ఆగుతారు.అప్పటికే అక్కడ ఇద్దరు పెద్దమనుషులు ఉంటారు.మల్లీశ్వరి చేసిన నాట్యం చూసి యేదైనా వరం కోరుకోమంటే నాగరాజు వీళ్ళేమిటి రాజులకి మల్లే పోజులు కొడుతున్నారు అనిపించి రాణీవాసం పల్లకీ పంపించండి అని ఆటపట్టింపుగా అంటాడు.మల్లీశ్వరి కూడా అదే వరసలో రెచ్చిపోతుంది.వర్షం తగ్గి ఇంటికెళ్ళే దారిలోనే నవ్వుకుని అక్కడితో వాళ్ళని వీళ్ళు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోలేదు.పైగా అది నిజమైన కోరికే అనుకున్నారు - ఇంతకీ వాళ్ళు మారువేషంలో రాజ్యమంతటా తిరుగుతున్న శ్రీకృష్ణదేవరాయలూ ధూర్జటీ!ఇంటికెళ్ళిన తర్వాత కధ మలుపు తిరుగుతుంది.మల్లీశ్వరి తల్లికి నాగరాజు అంటే చిన్నచూపు ఉందని తెలియడంతో అత్త కళ్ళు భ్రమసేటంత ధనం సంపాదించుకు వస్తానని పంతం పట్టి వూరు వదిలి పోతాడు నాగరాజు!రాయలవారు పల్లకీ పంపించగా మల్లీశ్వరి రాణివాసం చేరుతుంది.వూరు వదలి వెళ్ళిన నాగరాజు అదృష్తవశాత్తూ తిమ్మరుసు అనుగ్రహానికి పాత్రుడై పనతం నెరవేర్చుకుని తిరిగి వస్తే ఈ కబురు తెలుస్తుంది.యెలాగైనా మల్లీశ్వరిని కలవాలని దొంగతనంగా వెళ్ళటం వల్ల అంతఃపురంలో పట్టుబడతాడు.మల్లీశ్వరి కోసం వచ్చాడని తెలిసి ఇద్దర్నీ ఖైదు చేస్తారు,కానీ సభలో విచారణ జరుగుతున్నప్పుడు రాయలవారు తాము మారువేషాల్లో ఉండటం వల్ల గుర్తుపట్టలేక తమాషాకి అన్నారని తెలుసుకుని వొదిలెయ్యటంతో కధ సుఖాంతమవుతుంది.కధకి ఒక ప్రముఖ పత్రికలో పడిన చిన్న కధ ఆధారమని చెప్తారు,కానీ కధ కన్నా సంభాషణల్లోని చమత్కారమూ,పాటల్లోని కవిత్వమూ ఒకదానితో మరొకటి పోటీ పడటం వల్లనే అజరామరమైన దృశ్యకావ్యంగా నిలిచింది."వెళ్ళు వెళ్ళు,కలకండ భక్తురాలు!" ,"ఇల్లల్లా కొడితే తట్టెడు మట్టయినా రాలదు,ఏం చూసి పిల్లనిస్తారూ?" లాంటి పదశయ్యా "నల్లని మబ్బులు గుంపులు గుంపులు,తెల్లని కొంగలు బారులు బారులు","పిలచినా బిగువటరా","భళిరా యెక్కడినుండి జారెనీ మెరుపుతీగ" లాంటి స్వరధునీ సాటిలేనివే!

     ఇక,పాతాళ భైరవి మాయలూ మంత్రాలతో నిండిన ఒక  కట్టుకధ!నమ్మడానికి వీల్లేని విషయాల్ని నమ్మేటట్టు చేసే చాతుర్యం తప్ప ఇందులో కధ కూడా చిన్నదే!కధలో గానీ ఇతర అంశాల్లో గానీ పోల్చడానికి వీల్లేని రెండు సినిమాల్లో ఏది గొప్పది అంటే తేల్చడం కష్టమే,కానీ నా వోటు మాత్రం పాతాళ భైరవికే!
     ఎందుకంటే ఒక పిల్లదీ కుర్రాడూ ప్రేమించుకుని,విడిపోయి,కల్స్కోవటం అదే లైనులో ఉన్నవాళ్ళకీ భావుకత యెక్కువగా ఉన్నవాళ్ళకీ తప్ప మిగిలిన వాళ్ళకి కనెక్ట్ అవదు.అదే తోటరాముడు చూదండి - జత్గాడితో కలిసి అల్లరి చేస్తాడు, చాదసతపు తల్లిని ఆటపట్టిస్తాడు,రాజుగారి బామ్మర్దిని కూడా ముందూ వెనకా చూదకుండా పంబ రేగ్గొడతాడు,నచ్చిన ఆడపిల్ల ఉజ్జయిని రాకుమారై అయినా సరే పెళ్ళాడి తీరతానంటాడు.సమాజం కోసం కప్పుకున్న పరదాలు తీసేస్తే ప్రతివాడికీ ఉండే సరదాలు  ఉన్నవాడు యెవడికి నచ్చడు?తోటరాముడు ఆది సాహసి,నేపాళ మాంత్రికుడు కలవకపోయినా ఉజ్జయిని రాకుమారిని పెళ్ళాడగలిగిన సాహసం వాడిలో ఉంది!అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలని కలలు గనే ప్రతి ఒక్కరూ తోటరాముడిలో తమనే చూసుకుంటారు,చివరికి తోటరాముడికి జరిగినట్టే తను కోరుకున్నది తనకూ దక్కుతుందనే నమ్మకం కలుగుతుంది.ఒక కళారూపం వల్ల ప్రయోజనం ఉండాలంటే అది యెక్కువమందికి చేరువ కావడం ముఖ్యం - ఆ లక్షణం మల్లీశ్వరి కన్నా పాతాళ భైరవి లోనే ఎక్కువగా ఉంది.

     ఒకానొకప్పుడు నటుల్నీ విటుల్నీ ఒక్కటిగా చూసి పంక్తిబాహ్యుల్ని చేసేశారు.ఇప్పుడు సినిమాల్లో హీరో వేషాలు వేసే నటుల్ని దేవుళ్ళ లెక్కన చూసి వాళ్ళు తెరమీద యేం తింటే ఇంట్లో తమూ అదే తినాలనీ వాళ్ళు తెరమీద యే డ్రస్సు తొడిగితే తామూ అదే డ్రస్సు తొడగాలనీ డైలాగు రైటర్లు రాసిచ్చిన పంచ్ డైలాగులు తమ హీరోనే స్వయంగా చెప్తున్నాడనీ తాము కూడా ఆ మాదిరి ఫైట్లు చేసేసి అమ్మాయిలతో ఆ మాదిరి రొమాన్సు చెయ్యాలనుకునీ  పిచ్చెక్కిపోతున్నారు.కానీ ఆ నటులు హీరోల్లా కనపడటానికి హంగులు సమకూరుస్తున్న నిర్మాత,దర్శకుడు,కధాసంభాషణాదిగీతరచయితలు,నృత్యదర్శకులు,ఫొటోగ్రాఫర్లు లాంటి సాంకేతిక నిపుణులు మాత్రం ఇంకా నస్మరంతి గాళ్ళలాగే మిగిలిపోతున్నారు.దేవులపల్లి కృష్ణశాస్త్రిని మహాకవి అని నిస్సందేహంగా అనగలిగిన వాళ్ళు పింగళి నాగేంద్ర రావుని అనటానికి సందేహిస్తున్నారు, యెందుకు?కేవలం ఆయన సినిమాల ద్వారా పరిచయం కావడమే తప్ప మహాకవి అని పిలవడానికి కావలసిన అన్ని అర్హతలూ ఉన్నాయి!యెన్ని పదబంధాల్ని సృష్టించాడు?యెంత తాత్వికతని ఒలికించాడు?ఆజన్మ బ్రహ్మచారి అయి ఉండి ప్రేయసీ ప్రియుల మనసులో కదలాడే సుకుమారమైన భావాల్ని కూడా పట్టుకోవటానికి ఆత్మ యే స్థాయిలో కదలాలి?!
     నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29 న శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాంలో జన్మించాడు. ఆయన తండ్రి గోపాల క్రిష్ణయ్య యార్లగడ్డ గ్రామానికి కరణంగా ఉంటూ నాగేంద్రరావు జననానికి పూర్వమే కరణీకాన్ని వదులుకుని విశాఖలో ఉన్న ఆయన తమ్ముళ్ల దగ్గరికి వచ్చేశారు. నాగేంద్రరావు పినతండ్రులలో ఒకరు డిప్యూటీ కలెక్టర్ మరొకరు ప్లీడర్. నాగేంద్రరావు అన్న శ్రీరాములు 1913 లోనే భారతదేశాన్ని వదిలి 1926 నుంచి ఆస్ట్రేలియాలో పంచదార ఎగుమతి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. పింగళికి రెండేళ్ళ వయసులో ఆయన కుటుంబం బందరుకు వలస వెళ్లింది.నాగేంద్రరావు తల్లి మహాలక్ష్మమ్మది దివి తాలూకా. ఆయన చిన్నతనం నుంచీ కృష్ణా జిల్లాలోనే ఉంటూ ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కోపల్లె హనుమంతరావు ప్రభృతులు స్థాపించిన ఈ కళాశాలలో తొలి విద్యార్థుల బృందంలో నాగేంద్రరావు ఒకడు. మంగినపూడి పురుషోత్తమ శర్మ అనే సుప్రసిద్ధ కవీ, మాధవపెద్ది వెంకట్రామయ్య అనే ప్రఖ్యాత స్టేజీ నటుడు ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళే. ఆంధ్రకంతటికీ గర్వకారణంగా వెలసిన ఆంధ్ర జాతీయ కళాశాల యొక్క తొలి విద్యార్థులలో ఒకడైన కారణం చేత కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మొదలైన వారి పరిచయం లభించింది.

     సాహిత్యసృజనలో యేమాత్రం ప్రతిభ లేకుండా,లోకవృత్తపరిశీలన చెయ్యకుండా చలనచిత్ర రంగానికి వచ్చి ఉంటే "ఆడువారి మాటలకూ అర్ధాలె వేరులే","రాగములో అనురాగములో చిందిన","లాహిరి లాహిరి లాహిరిలో ఈ జగమే వూగెనుగా","ఔరౌర గారెలల్ల,అయ్యారె బూరెలిల్ల" లాంటి అత్యధ్భుతమైన పదబంధాల్ని సృష్టించడం సాధ్యమయ్యేదేనా?కృష్ణాజిల్లా లోని ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు.కోపల్లె హనుమంతరావు ప్రభృతులు స్థాపించిన ఆంధ్రుల కందరికీ గర్వకారణంగా వెలసిన ఆంధ్ర జాతీఊ కళాశాల యొక్క తొలి విద్యార్ధులలో ఒకడైన కారణం చేత ఆనాటికి ప్రముఖులైన కోపల్లె హనుమంతరావు,భోగరాజు పట్టాభి సీతారామయ్య,మట్నూరి కృష్నారావు మొదలైన వారి పరిచయం లభించింది.1918లో చదువు పొర్తి చేసి ఖర్గపూరులోని రైల్వే వర్కుషాపులో అప్రెంటిస్ పని కొంత కాలం చేసి ఆరొగ్యపరమయిన ఇబ్బందుల వల్ల ఆఫీసుపనిలోకి మారాడు.ప్రసిధ్ధ వ్యాయామవేత్త హరిరామజోగారావుగారి ఉత్తేజభరితమైన జాతీయోద్యమ ప్రసంగాలకి ప్రభావితుడై 1920లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఉత్తరదేస యాత్రకి శ్రీకారం చుట్టాడు.ఖర్గపూరులో ఉన్నప్పుడే దివ్యజ్~ఞానసమాజంలో సభ్యుడుగా నంపెదు అయ్యాడు.అలా యెక్కడికెళితే అకక్డ దివ్యజ్ఞానసమాజం వారి ఆశ్రమాల్లో బసచేస్తూ ఉతరదేశంలో చాలాభాగం పర్యటించి సబర్మతి చేరుకున్నాడు.స్వభావ్తః బ్రహ్మచారి,ప్రవృత్తి రీత్యా సన్యాసి అయినప్పటికీ సన్యాసం ఇవ్వకుండా పదిహేను రోజుల తర్వాత ఇతను ఆశ్రమవాసిగా కన్నా కాంగ్రెసు సంస్థలో చేరితే దేఅససేవ చేయగలుగుతాదని నిర్ణయించారు!

     దీనికి సానుకూల పడేటందుకు కాకా కలేల్కర్ గారు అప్పటి కృష్ణాజిల్లా కాంగ్రెసు అధ్యక్షులు ధన్వాడ హనుమంతరావు గారికి పరిచయపత్రం రాసి ఇవ్వడంతో నాగేద్రరావుకు కాంగ్రెసు ఆర్గనైజరు వుద్యోగం జీతభత్యాలతో సహా లభించింది.ఈ వుద్యోహ్గంలో ఉండగానే కొన్ని దేశబహ్క్తి గీతాల్ని "జన్మభూమి" పేరుతో పుస్తకంగా ప్రచురించాడు.దీనికి గాను అరెస్టయి కూడా జిల్లా కలెక్తరు కేవలం మందలిచి వదిలేశాడు.తర్వాత మళ్ళీ పట్టాభి సీతారామయ్య గారు ఆర్ధికస్థోమత ఉన్నవాళ్ళే కాంగ్రెసుకి ఎక్కువ సేవ చెయ్యగలరు కానీ బతుకుదెరువు కోసం కాంగ్రెసు మీద ఆధారపడిన వాళ్ళు పార్టీకి భారం అవుతారనే సూచన నచ్చడం వల్ల ఆ ఉద్యోగాన్ని వదిలేసి పత్రికారంగంలోకి ప్రవేశించాడు.సరిగ్గ్గా ఇదే సమయంలో బందరులో కౌతా శ్రీరామశాస్త్రి మోడ్రన్ రివ్యూ,ప్రవాసి వంటి పత్రికల స్థాయిలో తెలుగులో కూడా ఒక పత్రిక తేవాలని అనుకుంటుంటే పట్టాభి గారు నాగేంద్రరావుని సిఫార్సు చేశారు.1923లో శారద అనే పేరుతో మొదలైన ఈ పత్రిక 1924లో నిలిచిపోయేవరకొ శ్రీరామశాస్త్రికి సహాయంగా ఉంటూ తనవంతు సాయం తనూ చేశాడు.ఈ కాలం నాటి నాటక రచనలనూ సాహిత్యసృజననూ పింగళీయం అనే పేరుతో చేశాడు.

     నాగేంద్రరావుకు చిన్నతనం నుంచీ రచనలో ప్రవేశం ఉంది,ముఖ్యంగా నాతక రచన అనతనికి చాలా ఇష్తమైనది.దానితో శారదలో పనిచేసే రోజులోనే ద్విజేంద్రరాయ్ బెంగాళీ నాటకాలు "మేవాడ్ పతన్" పాషాణీ తర్జుమా చేస్తే కృష్ణా పత్రికలో ప్రచురించారు.తన సొంత రచనలైన నాటకాలు "జేబున్నీసా","వింధ్యరాణి" కృష్ణాపత్రికలో ధారావహికలు గానూ "నా రాజు" భారతిలోనూ పరచ్రించబడినాయి."జేబున్నీసా" నాటకాన్ని ప్రదర్శించకుండా ఆపటానికి మహమ్మదీయులు ఉద్యమాలు చేస్తుండేసరికి హిందూ-ముస్లిం ఘర్షణలకు దారితీస్తుందనే ఉద్దేశంతో 1923లో మద్రాసు ప్రభుత్వం ఈ నాటకాన్ని నిషేధించింది.అకారణంగా శారద నిలిచిపోగానే అప్పటికి నాతకరంగంలో లబ్ధప్రతిష్టుదైన డి.వి.సుబ్బారావు గారి ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో సెక్రెటరీ ఉద్యోగం దొరికింది!1946 వర్కూ అక్కడే వుండి నాతకరచన లోని మెళకువలనూ,ప్రేక్షకుల అభిరుచులలోని వైవిధ్యాల్ని పసిగట్టే నేర్పునూ - ముఖ్యంగా చెప్పాల్సిన భావాన్ని రూపం మార్చి అయినా సరే ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా పోతూనే యెట్లా యెక్కించాలి అనేది ఇక్కడే నేర్చుకున్నాడు,సినీ రచనలో ఇతని ప్రత్యేకత కూడా అదే కదా!అంతటి ప్రతిభాశాలి గనకనే నేపాళ మాంత్రికుడి చేత కళాకారు లందరికీ వర్తించే "జనం కోరింది మనం శాయడమా?మనం చేసింది జనం చూడడమా!" అనే సందేహాన్ని బయటపెట్టించాడు?!

     అక్కడ సందర్భానికి అది ఒక గారడీ వాడు తను చెయ్యాలనుకుంటున్న ట్రిక్కిలకి శిష్యుణ్ణీ కొంటెగా అడిగిన అతి మామూలు తింగరి ప్రశ్నలా అనిపిస్తుంది గానీ ఒకానొక ప్రముఖ సాహితీ విమర్శకుడు అది రచయిత,గాయకుడు,చిత్రకారుడు,నటుడు,శిల్పి అనే భెదం లేకుండా ప్రతి కళాకారుడి ముందూ తన జీవితకాలంలో యేదో ఒక మలుపులో ఎదురయ్యే ఒక గంభీరమైన ప్రశ్నగా తీర్మానించారు!తన మనస్సులో ఉన్న భావాల్ని చెప్పి జనాన్ని తను చెప్పిన విషయం కొత్తగా ఉన్నా సరే మెచ్చుకునే విధంగా ప్రేక్షకుల్ని వశంవర్తులని చేసుకోగలొగిన స్థాయి ఉన్నవాళ్ళు రెండో పధ్ధతి యెన్నుకుంటారు!జ్ఞాధికులైన తాత్వికులకి మాత్రమే అది సాధ్యపడుతుంది గాబట్టి ఆ శక్తి లేని ఇప్పటి సినిమా రచయితల మాదిరి జనంలో ఉన్న మాయరోగాల్ని కెలికుతూ నరాల్ని ఉద్రేకపరిచే తక్కువస్త్జాయిదైన మొదటి రకంతో సరిపెట్టుకుంటారు!

     పింగళి నాగేంద్రరావు కిటుకు తెలిసినవాడు గనక్ రెంటినీ సమానంగా నడుపుకు రాగలిగాడు,అందువల్లనే "నారాజు","వింధ్యరాణి" అధ్భుతమైన విజయాన్ని సాధించాయి.వింధ్యరాణి నాటకం యెంత పేరు ప్రఖ్యాతులు సాధించిందంటే  బందరు నివాసి అయిన డాక్టర్ వి.దుర్గా నాగేశ్వరరావు ఆ నాటకాన్ని డివి.సుబ్బారావునే నాయక్య్డిగా పెట్టి సినిమా తియ్యడానికి వైజయంతి ఫిలంస్ సంస్థని స్థాపించాడు!ఈ సంస్థ స్థాపించిన కొద్ది కాలానికే ఎన్.జగన్నాధ అనె అతను వచ్చి చేరాడు.అతను ఇంతకుమునుపే "తారుమారు" అనే ఆరురీళ్ళ సినిమాని తీసి ఉన్నాడు.మరో పదివేల అడుగుల సినిమా తీసి రెంటినీ కలిపి విడుదల చెయ్యటంలో తనకి సహాయం చేస్తే బాగుంటుందనీ, ఆ చిన్న సినిమా నిర్మాణంలోని అనుభవంతో వింధ్యరాణి అనే పెద్ద సినిమా తియ్య్యవచ్చుననీ దుర్గా నాగేశ్వరరావుని ఒప్పించాడు.జగన్నాధ్ రెండో సినిమాగా తియ్యాలనుకున్నది మోలియర్ రచనకి అనువాదమయిన "భలే పెళ్ళి",ఇదే సాంకేతికంగా నాగేంద్రరావుకి సినిమా అరచయితగా మొదటి అవకాశం అయింది.అయితే ఈ సినిమా నాగేంద్రరావుని సినిమాల్లో నిలబెట్టలేదు,రెందవ ప్రపంచయుధ్ధం కమ్ముకొచ్చి మద్రాసు అంతా ఖాళీ అయిపోయిన రోజుల్లో సినిమాలు ఆడటం అసంభవమైపోయి తియ్యటం మహాకష్టం అయిపోగా మళ్ళీ నాగేంద్రరావు బందరు వెళ్ళిపోయాడు.వైజయంతి ఫిలింస్ వారు పట్టు వదలకుండా జెమిని స్టూడియో వారి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించింది.దీనికి సి.పుల్లయ్య గారు దర్శక్యులు.అలా 1946loe మళ్ళీ నాగేంద్రరావు తిరిగి మద్రాసు వచ్చి సి.పుల్లయా గారి పర్యవేక్షనలో వింధ్యరాణి స్క్రిప్టు తయారు చహెశాడు.ఆ తర్వాత ఇంక 1971లో విడుదలయిన రాజకోత రహయం వరకూ మటల్లో పాటల్లో తెలుగుబాషని చిందులు తొక్కించాడు,బోడి సిన్మా కవిత్వం అనుకునే రోజుల నుంచీ సినిమా పాటల్లోనూ మహాకవులకి తీసిపోని శబ్దాలంకారం, భావాలంకారం రెంటితోనూ ఆటాడేసుకుని తెలుగుభాషనీ తన పేరులో ఉన్న నాగేంద్రుడి నాగేంద్రుడి నడకలో ఎన్ని మెలికలు ఉంటాయో అన్ని మెలికలూ తిప్పి చూపించాడు!

     1949లో విడుదలైన గునసుందరి కధ షేక్స్పియర్ కింగ్ లియర్ కధలోని మూలసూత్రాన్ని తీసుకుని ఆయ పాత్ర్లకి తెలుగుదనాన్ని అద్ది  అసలు కధ కింగ్ లియర్ వేదనతో సమాప్తమై దుఃఖాంతం కాగా అతిమానుష శక్తుల ప్రమేయంతో సుఖాంతం అయ్యింది.ఇందులోని హీరో పాత్ర పేరు దైవాధీనం!పేరుకి తగ్గట్టుగానే కంటిచూపు కూడా లేని ముసలితనంలో రాజకుమార్తెనే పెళ్ళాడేస్తాడు.దుర్మార్గులైఅన్ ఇద్దరు అకటావు=ఇకటపు తోడల్లుళ్ళ పేర్లు హరమతి,కాలమతి - పింగళివారు తప్ప ఇంకెవరయినా ఆ అపేర్లని వూహించగలరా?

195లో విడుదలైన పాతాళ భైరవి అయితే ఎప్పుడు చూసినా గొప్పగా అనిపించే కాలం తెలియని నాటి కధ!మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కథలులోని ఒక కథ, అల్లాఉద్దీన్ అద్భుత దీప కథ, బాల నాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారం గా ఈ సినిమాకి కథను అల్లుకున్నారు.అప్పట్లోనే 28 కేంద్రాల్లో సతదినోత్సవం జరుపుకున్న సినిమా ఇది.నందమూరి తారక రామారావు నవయవ్వనంలో ఉండి తోటరాముడు ఇట్లాగే ఉంటాదేమో అనిపించేటట్టు కుదిరాడు!దర్సకత్వం కె.వి.రెడ్డి< నేపధ్యగానంఘంటసాల - అందరూ అతిరధ మహారధులే!మొదట్లో ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును హీరోగా, గోవిందరాజుల సుబ్బారావును కానీ, ముక్కామలను కానీ ప్రతినాయకుడిగా పెడదామనుకున్నారు. కానీ, వాహినీ ప్రాంగణంలో ఎన్టీయార్, ఏయన్నార్ల మధ్య టెన్నీస్ ఆట చూసిన దర్శకుడు కె.వి. రెడ్డి తమ చిత్ర కథలోని నాయకపాత్రకు ఎన్టీయారే తగినవాడని ఆయనను ఎంచుకోవడం జరిగింది - మనోడు యెంటీవోడు పటకాకత్తి లాంటోడు గందా,టెన్నిసు బ్యాటుని కూడా కత్తిలా ఝళిపించేసుంటాడు మరి:-) 

"ఎంత ఘాటుప్రేమయో!" అంటూ "ఘాటు ప్రేమ" అనే ఒక కొత్త పదబంధాన్ని సృష్టించారు పింగళి వారు!"ఇతిహాసం విన్నారా!ఆది సాహసులే ఉన్నారా?" పాతలో నాకు వీరులెవ్వరొ తెల్పుడీ అన్న దేశభక్తి గీతంలోని చాలెంజి కూడా వినాబడుతుంది!"కలవరమాయె మదిలో నా మదిలో" పాటలోని పదాలన్నీ యుక్తవయస్సులో ఉన్న యువతీ యువకులలో తొలిప్రేమ నాటి కలవరాన్ని సూచించే లలితమైన పదాలతో పొదిగారు, "ప్రేమకోసమై వలలో పడెనే పాపం అపసివాడు" అంటూ చిక్కని కన్నీటినీ,గోరువెచ్చని జాలినీ కురిపించారు!"వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు" అని ఇప్పటి ఐటెం సాంగులకి తీసిపోని విధంగా మత్తెక్కించినా "తాళలేనే నే తాళలేనే" అంటూ రేలంగికి తగ్గట్టుగా హాస్యాన్ని చిందించినా వారికి వారే సాటి అన్నంతగా వీర విహారం చేశారు పింగళి ఈ సినిమాకి సంబంధించినంత వరకూ!

1954లో విడుదలైన చంద్రహారం సినిమాకి పింగళి నాగేంద్రరావు రచయితగా పనిచేశాడు.అయితే విజయా వారు పాతాళ భైరవి తర్వాత ఆ స్థాయిలో నిలిచిపోవాలనుకుని ఈ సినిమా తీసినా, అందుకు తగట్టు మంచి ప్రచారం చేయించినా, ఆంధ్ర ప్రాంతంలోని అన్ని కేంద్రాల్లోనూ సినిమాను విడుదల చేసినా అలాగే ప్రివ్యూ షోలో సినిమాను చూసిన సినీ జనమంతా పాతాళ భైరవి మించిపోతుందని అందరూ అనుకున్నా వాస్తవంలో వారి అంచనాల్ని తల్లకిందులు చహెస్తూ చిత్రం ఘోర పరాజయం పాలైంది -కొన్ని సినిమా లంతే!


     ఇక 1957లో విడుదలైన మాయాబజార్ ప్రపంచ చలనచిత్ర  చరిత్రలోనే అద్భుతం అనే మాటకి పర్యాయపదంగా నిలిచిపోయిన చిత్రరారం!ఇదే కథ తో 1936 సంవత్సరం లో శశిరేఖా పరిణయం పేరు తో ఒక చిత్రం రూపొందించబడింది. దానికి మాయాబజార్ అని మరొక పేరు. అదే పేరుని ఈ చిత్రానికి కూడా పెట్టడం జరిగింది. ఇక కథ విషయానికి వస్తే, మహాభారతం లో జరగని ఒక కల్పిత గాథ, ఈ చిత్ర కథావస్తువు. దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుని తో వివాహం నిశ్చయమైన శశిరేఖ ను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుని తో వివాహం జరిపించడం, తాను మాయా శశిరేఖ అవతారం దాల్చడం, కౌరవుల ను ముప్పుతిప్పలు పెట్టడం, కృష్ణుడు వీటన్నిటికి పరోక్షంగా సహకరించడం, ఇవి ఈ చిత్రంలోని ముఖ్య ఘట్టాలు. సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే, ఈ చిత్రము ఒక మహాద్భుతమని చెప్పవచ్చు.అభిమన్యుడి పెళ్ళి చుట్టూ మూడు గంటల సేపు కథ నడిస్తే పాండవులెక్కడా కనిపించకపోయినా వాళ్ళేమయారనే అనుమానమెక్కడా ప్రేక్షకులకు రాలేదంటే అది దర్శకుడు పన్నిన మాయాజాలమే!

     లక్ష్మణ కుమారుని హాస్యగానిగా చూపడం మహాభారత కథలో అతని పాత్రకు అనుగుణంగా లేదు. కాని ఇది "మాయ" బజార్ కదా?.రేలంగి పైజమా(పేంటు వంటిది) ధరించటం వింతగానే అనిపిస్తుంది. అయితే పాత్ర ఔచిత్యాన్ని గురించి మహారచయిత పింగళి నాగేంద్రరావు సమంజసనీయంగానే సమర్థించుకున్నారు. అంత పెద్ద విలన్ అయిన రారాజు కొడుకు ఇంత చీప్ గా ఉండడం ఏమిటి? అన్న విమర్శలకి పింగళి చెప్పింది ఏమిటంటే... నిజమే!రారాజు కొడుకు ఇంత అసమర్థుడిగా వెర్రివెంగళాయిలా ఉండడం కొందరికి నచ్చకపోవచ్చు. అయితే లక్ష్మణకుమారుడు నిజంగా కూడా అంత సమర్థుడేం కాదు... యుద్ధంలోకి అడుగుపెట్టీ పెట్టగానే చనిపోయాడు. భారతంలోని ఈ పాయింట్ని ఆధారంగా చేసుకుని వినోదం కోసం కొంత కల్పన చేశాను . - ఇదీ పింగళి చెప్పినది.ఏదేమైనా రేలంగి కేరక్టర్... ముఖ్యంగా దర్పం, అమాయకత్వం, బింకం, వెర్రితనం... అన్నీ కలసిన అతని సైకాలజీ న భూతో న భవిష్యతి!పింగళి రేలంగి లక్ష్మణకుమారుడి కారెక్టర్ని ఇలా డీల్ చేయడాన్ని తిరుగులేని విధంగా యాక్సెప్ట్ చేశారు జనం. పవర్ ఫుల్ విలన్లకి వెర్రివెంగళప్ప లాంటి కొడుకులు ఉండే టైపు కామెడీకి శ్రీకారం చుట్టింది పింగళినాగేంద్రరావేనంటే అతిశయోక్తి కాదు. తరువాత మనం స్టార్ డైరెక్టర్లనుకున్నవారంతా ఇదే ఫాలో అయ్యారు.

     మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు అజరామరంగా నిలుస్తాయి. ఈ చిత్రంలో రచయిత పింగళి నాగేంద్రరావు తస్మదీయులు, దుష్టచతుష్టయం , జియ్యా , రత్న గింబళీ, గిల్పం, శాఖంబరి దేవి ప్రసాదం, వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తాడు. రసపట్టులో తర్కం కూడదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు వంటి సంభాషణలు మనల్ని గిలిగింతలు పెట్టిస్తాయి. మాటలు లేని చోటుల్లో  మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం మరింత అద్భుతంగా పని చేస్తుంది. ఉదాహరణకు చిన్న పిల్ల గా ఆడుకుంటున్న శశిరేఖ ఉద్యానవనంలో ఒక కొలని గట్టున అలవోకగా కూర్చుంటుంది. కెమెరా ఆమె మొహమ్మీదనుంచి మెల్లగా పాన్ అయి కొలనులోని తామరమొగ్గను చూపిస్తుంది. గడచి పోతున్న కాలానికి గుర్తుగా కొలనులో అలలు రేగడమూ, ఆ మొగ్గ మెల్లగా విచ్చుకోవడమూ, ఆ తర్వాత కెమెరా మెల్లగా వెనక్కి తిరిగి శశిరేఖ మొహాన్ని చూపడమూ జరుగుతాయి. ఇప్పుడక్కడ నవయవ్వనవతి యైన శశిరేఖ అంటే సావిత్రి ఉంటుంది! చమత్కారమేమిటంటే ఈ పాటల పల్లవులు తర్వాతి కాలంలో సినిమా పేర్లుగా వాడుకోబడ్డాయి!

     1961లో విడుదలైన జగదేకవీరుని కధ అయితే యన్.టి.రామారవు ఒక వ్యక్తి కాదు,నిజంగానే జగదేకవీరుడు అని భ్రమపడేతంతగా ప్రేక్షకుల్లో అతనికి విపరీతమయిన అభిమానాన్ని సాధించిపెట్టింది!ఈ చిత్రంలో పింగళి గారు మాటల రూపంగా తమాషాలు చెయ్యకపోయినా,అప్పటి దాకా యెన్నో సినిమాల్లో క్రూరత్వంతో బహయపెట్టిన రాజనాలని ఇందులో హాస్యగాడిగా చూపించి మెప్పించారు,ఇతనికి తోడు బాదరాయణ ప్రగ్గడ అనే తమాషా పేరుతో "హే రాజన్!" అంటూ సియెస్సార్ తోడయ్యాడు - ఈ ఇద్దరితోనూ ఆడవేషాలు వెయ్యడంతో సహా ఎన్నో తమాషాలు చేయించారు!పాటల్లోనూ మంచి పనితనం చూపించి తనదైన మార్కుతో "ఓ సఖీ ఒహో చెలి ఒహో మదీయ మోహినీ!",,"వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా?", "జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా(?)వంటి అజరామరమైన పాటల్ని అందించారు - ముఖ్యంగా పూర్తి శాస్త్రీయంగా ఉండే "శివశంకరీ... శివానందలహరీ చంద్రకళాధరి ఈశ్వరీ" పాట ఒక్కటి చాలు!పాత్రల పేర్లతో చేసిన తమాషా ఏకాశ,రెండు చింతలు పాత్రలు - గిరిజ రేలంగి జంట మొదలైంది ఈ సినిమా తోనే కావచ్చు!

     1962లో పింగళివారు చిత్రానువాదం చేసిన గుందమ్మ కధ అయితే అప్పటికీ ఇప్పటికీ హాస్య చిత్రాలకి మాతృకగా చెప్పుకోదగిన గొప్ప సినిమా!హాస్యాన్ని సృష్టించడానికి పనికివచ్చే రెండు ప్రక్రియలు సందర్భోచితమైన హాస్యం,సంభాషణోచితమయిన హాస్యం రెంటికీ ఉదాహరణలుగా నిలిచే దృస్యాలు చిత్రమంతటా పరుచుకుని ఉంటాయి.జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనె తుంబిద హెణ్ణు పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర నిర్మాణానికి విఠలాచార్య నిర్మాత, వాహినీ స్టూడియోస్ అధినేత బి.నాగిరెడ్డి సహకారం పొందారు. ఆ కృతజ్ఞతతో నాగిరెడ్డి అడగగానే సినిమా హక్కుల్ని విఠలాచార్య ఆయనకి ఇచ్చేశారు. మనె తుంబిద హెణ్ణు సినిమాలో గుండమ్మ అనే గయ్యాళికి, నోరుమెదపలేని భర్త ఉంటాడు. ఆమె తన సవతి కూతురుని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తుంది. ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగబడతాడు. అతను గుండమ్మ స్వంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ జైలుపక్షికి ఇచ్చి పెళ్ళిజరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు. ఇలా సాగుతుంది ఆ సినిమా. అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ, నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి. దాంతో విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ రీమేక్ చేసేందుకు సిద్ధపడ్డారు.

     సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్-విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని, జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు. చివరికి విజయా వారి నిర్మాణంలో మాయాబజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కె.వి.రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు.సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే "ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్" అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది.గుండమ్మకథ సినిమా జూన్ 7, 1962న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది.నేనూ ఆ సవత్సరంలో పుట్టానండోయ్,హందుకే నాకింత క్యామిడీ అబ్బింది కాబోలు:-)

     సినిమాలో నటించిన ఇద్దరు కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు. సినిమా విడుదల సమయంలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందువేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి. అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి, తర్వాత ఒకేసారి సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు వేశారు.అప్పట్నించే ఉందన్న మాట ఈ ఎవడు పెద్ద ఎవడు చిన్న అనే పిచ్చ?!

     1963లో పింగళి నాగేంద్రరావు చిత్రానువాదం నిర్వహించిన శ్రీకృష్ణార్జున యుధ్ధం గయోపాఖ్యానం కధకి కడు చక్కని చిత్రరూపం!ఈ చిత్రంలో ప్రఖ్యాత నటులు ఎన్.టి.ఆర్ కృష్ణుడిగా అధ్బుతమైన పాత్రను పోషించగా, ఏ.ఎన్.ఆర్ అర్జునిడిగా తన ప్రతిభను చూపారు. ఆనాటి ఇద్దరు ప్రముఖ కథా నాయకులు ఒకే తెర పై తమ పాత్రలని అధ్బుతంగా పండించి పలువురి ప్రశంశలు పొందారు. బి.సరోజా దేవి సుభద్ర పాత్రను, ఎస్.వరలక్ష్మి సత్యభామ పాత్రలను పోషించారు. కృష్ణార్జునుల యుద్ధానికి కారణమైన ముఖ్యమైన గయుడి పాత్రను ధూళిపాళ పోషించారు. మాయాబజార్ చిత్రంలో దుర్యోదనుడి పాత్రను పోషించిన ముక్కామల ఈ చిత్రంలో కూడా తిరిగి దుర్యోదనుని పాత్రలో నటించారు."అన్నీ మంచి సకునములే","మనసు పరిమళించెనే తనువు పరవశించెనే" వంటి భావగర్భితమైనవీ "అంచెలంచెలు లేని మోక్షము" వంటి సరదా పాటలూఒ ఉన్న్నాయి!సినిమాగా ఎప్పటికీ అజరామరమైనదే!

     1965లో విడుదలైన సి.ఐ.డి అనే సినిమాకి పింగళి నాగేంద్రరావు రచయితగా పని చహెశారు."నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులేఅనే మధురగీతమూ ఉంది,ఇప్పటికీ అమ్మాయిలు తమవైపొకసారి చూస్తేనే సొల్లు కార్చుకునే కొందరు అబ్బాయిలకి తగిలేతట్టు వెక్కిరింతగా ఉండే "యువతులు చూసి చూడకముందే ఐసౌవుతావా అబ్బాయి" అంటూ సాగే సరదా పాట కూడా ఉంది. ఈ సినిమా లోని "ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో" అనే పాట ఒకరకంగా భక్త రామదాసు ఆవెదనకి ప్యారడీగా చెప్పుకోవచ్చు.సన్నివేశం కూడా సరదాగానె ఉంటుంది,అభినయం యన్.టి రామారావు - ఇంక చెప్పాలా!

     1971లో విడుదలైన రాజకోట రహస్యం గంగరాజు నిర్మాతగా విఠలాచార్య దర్శకత్వంలో నిర్మితమైన జానపదచిత్రం. పింగళి నాగేంద్రరావు చిత్రరచన చేశాడు.ఆ తర్వాత ఈ కవిపింగళం అస్తమించడంతో తెలుగు సినీఎ వినీలాకాశంలోని ఒక ఢృవతార రాలిపోయినట్టయింది.గుణసుందరి కథలో కె.వి.రెడ్డికి మరొక రచయిత హంమతి, కాలమతి వగైరా అరడజను హాస్యపాత్రలను యివ్వగలిగి ఉండడు పాతాళభైరవిలో సీను, అంజి, డింగరి పాత్రల విజయమూ, నేపాళమాంత్రికుడి పాత్ర యొక్క అపురూపకల్పన, నాగేంద్రరావు ప్రతిభకు తార్కాణాలు.చంద్రహారం చిత్రంలో ధూమకేతు, నిక్షేపరాయడు, "ఎంతచెబితే అంతేగాళ్ళు", బుజ్జాయి, చిన్ని మొదలైనపాత్రలు అంతవరకు సినిమాప్రేక్షకులు చూసిన ఏపాత్రకూ తీసిపోవు!


కొందరు బతికిన కాలం తిరిగిరానిది!పింగళిది కూడా అలాంటి జీవితమే!
-----------------------------------------------------------------------------------------------------------------ఈ నాడు శాలివాహన శకం 1937 మన్మధ నామ సంవత్సరం మార్గశిర మాసము 7వ తేదీ శనివారము
-----------------------------------------------------------------------------------------------------------------
ఒక విన్నపం:కొన్ని చోట్ల విషయవివరణ బాగుందటంతో మళ్ళీ నేను వేలుపెట్టడం దేనికిలెమ్మని వికీపీడియా లోని కొన్న్ భాగాల్ని యధాతధంగా ఉంచేశాను - కొన్ని చోట్ల మాత్రమే,ముఖ్యంగా పింగళి నాగేంద్రరావు గారి ప్రతిభని కాలానుక్రమణీకంగా ఉంచాలనుకున్నాను,అంతే!

6 comments:

  1. మధుబాల గొప్పదా? సావిత్రి గొప్పదా?

    ReplyDelete
  2. మీకెంత ఓపికండీ ?

    ReplyDelete
  3. నేపాళమాంత్రికుడి/పింగళినాగుడి మరో డైలాగు - "యువకులంతా ముందుకి రండి, నడుము వంగిన నాయకులంతా గడబిడ చేయక వెనకనుండండి"

    ReplyDelete
  4. aavuni kobbarichettuki kattesaru, bagundi.

    ee rendu cinemalu goppavikavu, devadase goppadi

    ReplyDelete
  5. ఇవ్వాళ బ్లాగుల్లో మరమరాలు కూడా నిప్పు కణికెల్లా కాల్తున్నయ్!
    సందట్లో సడేమియా అంటూ తిరిగే నాకు కూడాను తగులుకున్నయ్?

    ఆ చచ్చిన పాముని తీసుకెళ్ళి నేను జనమేజయుడిలా జిలేబికి చుట్టా!
    సర్పయాగం మొదలవుతుందా?శాంతమార్గం ఏర్పడుతుందా?

    ReplyDelete
  6. వర్గరహితసమాజం స్థాపించి సకలజనుల్నీ స్వర్గానికి నడిపంచడం కోసం పుట్టిన చైనా కమ్యునిష్టు ప్రభుత్వం ఆధికారికంగా ప్లాస్టిక్ బియ్యాన్ని ఆసియా దేశాల మీదకి వొదుల్తున్నది!అక్కద యెలా తయారు చేస్తారో వారికి ఎంత ఖర్చవుతుందో తెలియదు గానీ చాలా చాలా చబ్వగ్గా అమ్మడంతో అలాంటి సౌకర్యం కోసమే ఎదురు చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని కల్తీ వ్యాపారులకి అది సువర్ణావకాశం అయ్యింది.

    పోనీ ప్రభుత్వం అమాయకమైనదే,లాభం కోసం కక్కుర్తి పడెవాళ్ళు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు అనుకుందామంటే కంచుకోట లాంటి సైధ్ధాంతీక నియంతృత్వం ఉన్నచోట అది సాధ్యమా?

    భారతీయ కమ్యునిష్టులకి కేవలం హిందూ మతంలోని అసహనం గురించే తప్ప ప్రజలకి అతి ముఖ్యమైన ఆరోగ్యవిషయాలు పట్టవు గాబోలు!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...