Friday 6 November 2015

ఏమిటీ అన్ని పార్టికిల్స్ లోనూ ఉండే "గాడ్ పార్టికిల్" యొక్క ప్రత్యేకత?ఆ ఒక్కటీ తెలిస్తే సృష్టిరహస్యం మొత్తం తెలిసిపోతుందా!

     మీ చుట్టూ కనబడే వాటిలో దేనిని తీసుకున్నా దాన్ని కనీసం రెండు ముక్కలు చెయ్యగలం అని తెలుస్తుంది,అవునా?కానీ,యెంతవరకు?ఒక బ్రెడ్డు ముక్కతో మొదలుపెట్టండి, లేదా ఒక ట్రాక్టరుతో నైనా సరే - అలా రెండుగా విడగొడుతూ వెళ్తే ఒక స్థాయికి చేరుకున్నాక ఇక దీన్ని రెండుగా విడగొట్టటం అసాధ్యం అనిపిస్తుంది.తమాషా యేంటంటే బ్రెడ్డు ముక్కతో మొదలు పెట్టినా ట్రాక్టరుతో మొదలుపెట్టినా చివరి అంశం ఒక్కటే అని యేది తెలుస్తుందో అది "కణము" లేదా "అణువు"  అని క్రీ.పూ 6వ శతాబ్దికి చెందిన భారతీయ రసవాద సిధ్ధాంతి కణాదుడు అన్నాడు.ఆ పదాల కర్ధం అవిభాజ్యమైనది అని.ఈ ప్రపంచమంతా కణములతో నిర్మితమైనది అన్న అతని సిధ్ధాంతం పేరు మీద అతన్ని ఆచార్య కణాదుడు అన్నారు.వ్యక్తిగత వివరాలు ఎవరికీ స్పష్టంగా తెలియవు.చాలామంది భారతీయ మేధావుల గొప్పదనం లాగే ఇతని కృషి గురించి తెలుసుకోవాలంటే జర్మనీ గానీ అమెరికా గానీ వెళ్ళాల్సిందే!పోనివ్వండి సత్యశోధనలో రాగద్వేషాలు మనకి దేనికి?క్రీ.శ 18వ శతాబ్దంలో "Theodor Schwannగారు చెప్పాక కణాదుడు చెప్పాడు గాబట్టి చచ్చినా ఒప్పుకోం అనేవాళ్ళు కూడా చచ్చినట్టు ఒప్పుకున్నారు గదా,ఇంక గొడవెందుకు?పేరు లేకపోయినా బతగ్గలం గానీ ప్యాంటు తొడక్కుండా బయట తిరగలేంగా!

     గాడ్ పార్టికిల్ అని టైటిలు పెట్టి మళ్ళీ కణాదుడు అని ఎత్తుకున్నాడు,హరిబాబు మహా క్రూరుడు సుమీ అని విసుక్కోకండి.గాడ్ పార్టికిల్ అనే దాని కోసం యెందుకు వెతుకుతున్నారు అనేది తెలుసుకోవాలంటే మూలం దగ్గిర్నుంచీ తెలుసుకోవాలి గదా!అన్ని రకాల భౌతిక రసాయనిక శాఖలలోని అనేకమైన చిక్కుముడుల్నీ ఈ ఒక్క గాడ్ పార్టికిల్ గారు బులబులాగ్గా విప్పెస్తారనీ ఇంతటితో దేవుడికి పూర్తిగా గెట్ ఔట్ చెప్పెయ్యొచ్చుననీ కొందరంటున్నప్పుడు నాలాంటివాడి కెలుకుడు కూడా భారీగా ఉండాలా ఆఖ్ఖర్లేదా?

     ఆ ష్వాన్ గారు భయ్యాలజీ వాడు గాబట్టి ఆయన్నొదిలేస్తే క్రీ.పూ 4వ శతాబ్దంలో డెమోక్రిటస్ అనే ఆయన మొదటిసారిగా "ఆటమస్" అని వూహ చేశాడు.తర్వాత మొదటిసారి క్రీ.శ 1766లో హెన్రీ క్యావెన్ డిష్ గారు కొన్ని లోహాల మీద కొన్ని రకాల ఆమ్లాలను ప్రయోగించి చేసిన ప్రయోగాల నుంచి ఉదజని తయారు చెయ్యడం గొప్ప మలుపు.నిజానికి అది కొత్తగా తయారు చెయ్యడం కాదు,కానీ వాళ్ళు అలాగే వర్ణించారు.అంతకు ముందరే బోయల్ లాంటివాళ్ళు ఉదజనిని తయారు చేసినా దాని గురించి యెక్కువ సమాచారం ఇచ్చిన వాడిగా క్యావెన్ దిష్ గారినే ఉదజని మూలకాన్ని కనుక్కున్న వ్యక్తిగా గుర్తించారు.తర్వాత క్రీ.శ 1781లో జోసెఫ్ ప్రిస్ట్లే ఉదజనిని ఆమ్లజని సమక్షంలో మండించి నీటిని తయారు చెయ్యడం మరొక ముఖ్యమైన మలుపు.క్రీ.శ 1873లో జొహాన్నెస్ వాన్ దెర్ వాల్స్ పర్మాణువుల మధ్యన గల బలహీనమైన ఆకర్షణ వల్లనే ప్రతి మూలకం యొక్క పరమాణువులు స్థిరమైన ధర్మాలని ప్రదర్సిస్తున్నాయని ప్రతిపాదించాడు.దీని తర్వాత చెప్పుకోదగిన మరో మలుపు క్రీ.శ 1896లో ఆంటోయిన్ బెక్వెరల్ యురేనియం మూలకం రశ్మ్యుద్గారకతని ప్రదర్శిస్తుందని కనిపెట్టటం.దీని తర్వాతనే ఇప్పుడు క్వాంటం మెకానిక్స్ పేరుతో వచ్చిన "విశ్వ తరంగ సిధ్ధాంతం" - మాక్స్ ప్లాంక్ చేత క్రీ.శ 1900వ సంవత్సరంలో ప్రవచించబడింది - హమ్మయ్య,వీళ్ళెవరూ భారతీయులు కాదు!

     ఒక్కసారిగా క్వాంటం ఫిజిక్స్ యేమి చెప్తుందో అనేవరకూ వెళ్తే అస్సలు తట్టుకోలేరు గాబట్టి అంతకు ముందరి విషయం ఏమిటో రేఖామాత్రంగా వివరిస్తాను.మన చుట్టూ కనబడుతున్న జీవ-నిర్జీవ పదార్ధాలన్నీ మూలకాలచే నిర్మితమైనాయి.ప్రతి మూలకానికీ వాటి లక్షణాల్ని నిర్దేశించేది వాటి పరమాణు నిర్మితి.ప్రతి మూలకం యొక్క పరమాణువులోనూ ధనాత్మకమైన ఒక కేంద్రకం ఉంటుంది.ఈ కేంద్రకం చుట్టూ ఋణాత్మకమైన అంశాలు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల వలె పరిభ్రమిస్తూ ఉంటాయి.కేంద్రకంలో ఉన్న ధనాత్మకమైన అంశాల్ని ప్రోటాన్లు అనీ చుట్టూ తిరుగుతున్న ఋణాత్మకమైన అంశాల్ని ఎలెక్ట్రాన్లు అనీ అన్నారు.కేంద్రకంలో యెన్ని ప్రోటాన్లు ఉంటే అన్ని ఎలెక్ట్రాన్లు ఉంటాయి.దీన్ని పరమాణు సంఖ్య అంటారు.అయితే కేంద్రకంలో న్యూట్రాన్లు అని విద్యుదావేశం లేని తటస్థమైన అంశాలు కూడా ఉంటాయి.ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల కలయిక వల్ల పరమాణు భారం పరమాణు సంఖ్య కన్నా భిన్నంగా ఉంటుంది.అయితే ఎలెక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ తిరగడం సూర్యుడి చుటూ తిరిగే గ్రహాల మాదిరి ఒక స్థిరకక్ష్యలో జరగదు.గాలిలో ధూళి చలించినట్టు ఉండే బ్రౌనియన్ చలనంలా ఉంటుంది,కానీ కొన్ని చోట్ల మాత్రం దట్టంగా గుమిగూడుతూ ఉంటాయి.న్యూక్లియస్ నుంచి అవి తరచు గుమిగూడే ఆర్బిటాల్స్ మధ్యన గల దూరాన్ని బట్టి వీటి ఆకారాలు కూడా విభిన్నంగా ఉంటాయి.ఆదమరిచి వాడితే మనకి షాకు తగిలించే ఎలెక్ట్రిసిటీ దగ్గిర్నుంచి హీరోషిమా దగ్గిర పేలిన లిటిల్ బాయ్ వరకూ ఎన్నో ఆవిష్కరణలకి ఈ మౌలిక నిర్మాణమే కారణం.ప్రోటానులూ ఎలెక్ట్రానులూ సరిసమానంగా ఉండాలి కదా,వాటి మధ్య ఉన్న ఆకర్షణలు బలహీనమైనవి కాబట్టి యేదైనా బాహ్యశక్తి పని చేసి చివరి ఎలెక్ట్రాను దూరంగా యెగిరిపోయిందనుకోండి, అప్పుడెట్లా?యేముందీ, "నన్ను వదిలి నీవు పోలేవులే,అదీ నిజములే" అని పాడుకుంటూ తనకి దగ్గిరగా యెక్కడ లాక్కోగలిగిన ఒంటరి ఎలెక్ట్రాన్ ఉంటే అక్కణ్ణించి కొట్టుకొచ్చేసి బ్యాలెన్సు సెటిల్ చేసుకుంటుంది.దూరంగా ఎగిరిపోయిన ఎలెక్ట్రాను కూదా ఒంటిగా ఉంలేదు పాపం,అది కూడా ఇంకొక చోటు చూసుకుని ఇరుక్కుని ఉంటుంది లెండి ఈపాటికే!ఈ ఎలెక్ట్రాన్లు జంటలుగానే ఉండాలిట!ఒకదాని పక్కన ఒకటి ఇరుక్కుని ఆపోజిట్టుగా గిరాం గిరామని తిరుగుతూ ఉండాలిట!మరి ఒక మూలకంలో బేసి సంఖ్యలో ఉంటే అప్పుడు వాటిల్లో జోడు లేని ఆఖరి ఎలెక్ట్రాను గతేంటి?ఏ మొగుడూ లేకుంటే అక్క మొగుడే దిక్కు అన్నట్టు ఇంకో బేసి సంఖ్యలో ఉన్న మూలకం యొక్క ఒంటరి ఎలెక్ట్రానుతో నీకు నాకు జోడు కుదిరెను గదనె ఛల్ మోహనరంగ అని మరో పాట లంకించుకుని జోడు కట్టటమే తప్ప మరోదారి లేదు,ఆ రకంగా వేర్వేరు మూలకాలు రకరకాల కాంబినేషన్లలో కలుస్తూ,విడిపోతూ ఉండే రాసక్రీడల సయ్యాటలే మనమూ ఒక భాగమైన ఈ ప్రపంచం ఇట్లా జవజీవాలతో తొణికిసలాడుతూ ఉండటానికి కారణం!

     సైన్సు అంటే ఏమిటో అందులో బేసిక్స్ యెలా ఉంటాయో గూడా తెలియని వాళ్ళు సైన్సు దేవుడు లేడని చెప్తుందని అంటుంటే వాళ్ళ అఘ్ణాణం చూసి నవ్వాలో యేడవాలో తెలియడం లేదు నాకు:-)అసలు సైన్సు యొక్క ప్రధానమైన లక్ష్యం దేవుడు ఉన్నాడా లేడా అనేది తేల్చటం కాదు!అందుకే సైంటిష్టుల్లోనూ నాస్తికులు,ఆస్తికులు అనే రెండు రకాల వాళ్ళూ ఉన్నారు.మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన కర్ధం కానిదాన్ని అర్ధం చేసుకోవడం, దాని నుంచి మనకి ప్రయోజనం కలిగించే జీవనవిధానాన్ని యెంచుకోవటానికి సహాయపడటం,అంతే!ఇదే ముక్క చెప్పి కొంచెం గట్టిగా నిలదీస్తే ఇంకొకాయన చాలా తెలివిగా సైన్సు పుట్టి 400 యేళ్ళే గదా ముందు ముందు నిర్ధారణగా చెప్తుందేమో అని దీర్ఘాలు తీస్తున్నాడు!వారెవ్హా యేమి నీ జోకు,హి హి హి అనాలి ఈ మాటకి,యెందుకంటే ఇవ్వాళ గడియారం నుంచి విమానం వరకూ అన్నింటా తిరుగుతున్న చక్రం యెప్పుడు కనుక్కున్నారు,అదీ ఈ 400 యేళ్ళ లోపుదేనా!వ్యవసాయం సంగతేంట్రా నాయనా/అది శాస్త్రీయమైన ఆవిష్కరణ కాదా?మొత్తం ఆదిమ సమాజాలన్నీ వ్యవసాయం అనే దశలోకి అడుగుపెట్టిన తర్వాతనే స్థిరజీవనం,దానివల్ల నాగరికత పెరిగి ఇప్పటికి ఇట్లా ఉన్నాయి.ఇవ్వాళ మనం అలవాటు పడిపోయాం గాబట్టి తెలియడం లేదు గానీ ఒక ప్రదేశాన్ని యెంచుకుని మొలకల్ని తగినంత యెడంతో చాళ్ళు దీర్చి నాటి పోషించడం ద్వారా మళ్ళీ మళ్ళీ ఫలసాయం పొందవచ్చుననే ఆలోచన యెట్లా వచ్చి ఉంటుంది అనెది వూహిస్తే అన్ని ఆవిష్కరణలలోకి అదే అత్యంత సంక్లిష్తమైనది అని అర్ధం అవుతుంది!ఇవన్నీ పట్టించుకోకుండా సైన్సుని అభిమానిస్తున్నాం అంటూనే సైన్సు గురించి ముతగ్గా మాట్లాడితే నాబోటివాడికి వినడానికే అసహ్యంగా ఉంటుంది.

     ఒకే ఒక్కసారి చాలా సులువుగా జీవజాలమంతటిలోనూ రెండు రకాల ద్వంద్వాల మధ్యన నడుస్తూ ఉన్న ఒక వుయ్యాల జంపాల గురించి చెప్పి మళ్ళీ మన గాడ్ పార్టికిల్ గారి దగ్గిరకి తీసుకెళ్తా!కర్బనం ఆమ్లజని సమక్షంలో మండితే కర్బనద్వయామ్లజని యేర్పడుతుంది.ఉదజని ఆమ్లజని సమక్షంలో మండితే నీరు పుడుతుంది.మొక్కలు పత్రహరితం అనే నిర్మాణాల్ని యేర్పరచుకుని కాంతి నుంచి పుట్తే శక్తితో వీటిని కలిపి శక్తినిక్షేపాలుగా మార్చుకుంటాయి.కర్బనం,ఉదజాని,ఆమ్లజని - వీటికి మరొక సత్రకాయ నత్రజని కలిసి సమస్తమైన జీవజాలంలో జన్మవృధ్ధిజరామరణ చక్రం నడుస్తున్నది.
                    photosynthesis:6CO2 + 12H2O =>C6H12O6 + 6O2 + 6H2O
                    respiration:         C6H12O6 + 6O2 =>6CO2 + 6H2O
     అంటే కిరణజన్యసంయోగక్రియలో యే వస్తువులు కుడివైపున ఉండి వాటిమీద కాంతి నుంచి పుట్టిన శక్తి పనిచెయ్యటం వల్ల కుడివైపున ఉన్న పదార్ధాలుగా మారుతాయో అవి అంతీమగా శక్తి అవసరమైన చోట యెడమవైపుకి జరిగి చర్య కుడివైపుకి జరగటం పూర్తయ్యాక మొదటి చర్యలోని యెడమవైపున ఉన్న పదార్ధాలుగా విడిపోతూ మొదటి చర్యయే ఇక్కడ వ్యతిరేక దిశలో నడుస్తున్నట్టుగా ఉంది, చూశారా!ఈ కిరణజన్యసంయోగక్రియ జరగటానికి పత్రహరితం యేర్పడని ప్రాణులు మొక్కల్ని తినడం ద్వారా మొదటి సమీకరణంలోని శక్తినిక్షిప్తాల్ని సమకూర్చుకుంటాయి.ఈ చిన్న తేడాని మినహాయిస్తే మొత్తం జీవజాతి అంతా ఈ రెండు చర్యల మధ్యన పూర్తి సమతాస్థితిని చేరకుండా కొంచెం పక్కకి జరిగి ఉండటం కోసం పడే తంటాలు మాత్రమేనని తెలుస్తుంది - ఇదంతా స్టడీస్టేట్ ధర్మోడైనమిక్స్ సబ్జెక్టు, పూర్తిగా సమతాస్థితికి చేరుకోవటం అంటే హంస లేచిపోయిందన్నట్టు లెఖ్ఖ!అందుకే వ్యక్తిగత జీవితంలో గానీ సామాజిక జీవితంలో గానీ పూర్తి నిరామయమైన ప్రశాంతత కోరుకోకండి - అది అసంభవం,కాదంటారా?

     సైన్సు అనేది చెప్పే పరమసత్యాలు ఇట్లా ఉంటాయి - నువ్వేదో పోటుగాణ్ణి,పెత్యేకం అనుకోమాకు నువ్వూ ఈ జంతుసమూహంలో ఒకడివిరా నాయనా అహంకరించకు అని చెప్తుంది.ప్రాణం అంటే కూడా అదేదో అద్భుతం,అగమ్యం,అగోచరం కాదు అది కూడా ప్రకృతి ధర్మాలను బట్టి చూస్తే మామూలు విషయమే అని మత్తును వదల్చుతుంది.మూఢత్వాన్ని తొలగిస్తుంది.దానిపేరుతో గూడా మూఢత్వాన్ని తగిలించుకుంటే ఇంక ఆ మనిషికి యేవరూ యేమీ చెప్పనఖ్ఖ్కర లేదు,తనకి తను తెలుసుకునే మార్గం చూపించి వొదిలెయ్యటం తప్ప చెయ్యగలిగింది లేదు!సైన్సుని అభిమానిస్తున్నాం అనుకునే వాళ్ళు గూడ ప్యాంటులు తొడగటం సైన్సు వల్లనే,పిజ్జాలు తినగలగటం సైన్సు వల్లనే,కార్లలో విమానాల్లో తిరగడం సైన్సు వల్లనే అనుకుంటే అదీ తప్పే!కార్లూ విమానాలూ కనిపెట్టలేదు గాబట్టి భారతీయ విజ్ఞాన శాస్త్రం పనికిరానిది,సుఖాల్ని తెచ్చిపెడుతున్నది గాబట్టి మోడర్న్ సైన్సు గొప్పది అనుకోకుండా రెంటికీ ఉన్న ప్రధమ్యాలు వేరు అనేది గమనిస్తే దేని ప్రాధమ్యాన్ని బట్టి అది నిరంతరం మెరుగుపడుతూనే ఉందనేది తెలుసుకోవాలి!రెండూ ఖచ్చితంగా యెదుగుతున్న దశలోనే ఉన్నాయి,ఇంకా యెదుగుతాయి.నూతన విజ్ఞాన శాస్త్రం కూడా భారతీయులకీ అంటరానిది కాదు,గాడ్ పార్టికిల్ అని ముద్దుగా పిలుచుకుంటున్న కొత్త అతిధి గారి అసలు పేరు హిగ్స్-బోసాన్ - దీనికి కారణం ఈ వూహ కదలటానికి కారణమైన తొలి వ్యక్తి సత్యేంద్రనాద్ బోస్!

     కాంతి యొక్క తరంగ స్వభావం గురించి దాదాపు క్రీ.శ 17వ శతాబ్దం నుంచే ఒక అవగాహన ఉన్నా క్రీ.శ 1803లో ధామస్ యంగ్ చెసిన రెండు చీలికల ప్రయోగం కాంతి యొక్క తరంగ సవభావాన్ని నిర్ద్వంద్వంగా నిరూపించింది.దీని తర్వాత క్రీ.శ 1838లో మైఖేల్ ఫ్యారడే క్యాధోడ్ కిరణాల్ని కనిపెట్టాడు.క్రీ.శ 1859లో గుస్టావ్ కిర్చాఫ్ నుంచి కేవలం యురేనియం లాంటి రశ్మ్యుద్గారక మూలకాలే కాకుండా అన్ని రకాల మూలకాల నుంచి బలహీనమైన స్థాయిలోనే అయినప్పటికీ శక్తిప్రసరణ జరుగుతున్నదనే ప్రతిపాదన వచ్చింది - దీనినే బ్లాక్ బాడీ రేడియేషన్ అన్నారు.క్రీ.శ 1877లో లుడ్విగ్ బోలిజ్మాన్ శక్తి కొన్ని నిష్పత్తులలో విడుదల అవుతున్నట్టు సూచించగా దాన్ని కొంచెం విస్తరించి క్రీ.శ 1900వ అసంవత్సరంలో మాక్స్ ప్లాంక్ క్వాంటం సిధ్ధాంతం పేరుతో పూర్తి రూపాన్ని ఇచ్చాడు.ఇట్లా మొదలైన మొదటి మోడల్ అనేకమంది శాస్త్రజ్ఞులు వారి వారి లెక్కల్ని జోడించాక మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మరింత విస్తృతమైన రూపంలో రెలేటివ్ క్వాంటం ఫీల్డ్ ధియరీగా రూపు దిద్దుకున్నది.ఈ మొత్తం అణుభౌతికశాస్త్ర పరిశోధనలు ఆధునిక విజ్ఞానశాస్త్రం విశ్వసృష్టికి తొలి బిందువుగా చెప్తున్న మహావిస్ఫోటన సిధ్ధాంతంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనల చుట్టూ తిరుగుతున్నాయి.ప్రస్తుతానికి ఇంతకన్నా హేతుబధ్ధమైన మోడల్ యెవరికీ తట్టకపోవటం వల్ల కొనసాగిస్తున్నారు గానీ ఈ ప్రతిపాదనలోనే ఒకదానికొకటి పొసగని వైరుధ్యాలు అనెకం ఉన్నాయి.మచ్చుకు ఒకటి:శక్తిని కొత్తగా సృష్టించలేము,నాశనం చేయలేము అనే మొదటి నియమానికే ఇది విరుధ్ధం!అయితే ప్రేలుడు శూన్యం నుంచి జరిగిందని వారూ అనడం లేదు - సింగ్యులారిటీ,డార్క్ మ్యాటర్,యాంటి మ్యాటర్ లాంటి రకరకాల పారిభాషిక పదాలు ఉన్నాయి,కానీ అవన్నీ ప్రతిపాదనలే - వాటికి సాక్ష్యాలు లేవు.అసలీ మహావిస్ఫోటనం సిధ్ధాంతంలో ఉన్న మొదటి పారిభాషిక పదం సింగ్యులారిటీ అనేది ఒక కల్పన మాత్రమే.దీని ఆస్తిత్వానికి సంబ్నధించిన ఆధారాలు లేవు.అయితే వీటి గురించి చెప్పే మాటల్లో ఒకటి మాత్రం నిజం మనం నూటికి నూరుపాళ్ళు ఖచ్చితమ నుకుంటున్న స్థల,కాల,బుధ్ధి చైతన్యాల జ్ఞానం యేదీ దీన్ని వర్ణించలేదు.సృష్టి 13.7 బిలియన్ల ముందు ఆవిర్భవించిందని నిర్ధారించి దానికి ముందరి స్థితికి సింగ్యులారిటీ అని పేరు పెట్టారు,అంతే!భౌతికంగా వీటికి అస్తిత్వం లేదా అంటే ఉంది,కృష్నబిలాలు సరిగ్గా ఈ ధర్మాలనే ప్రదర్శిస్తున్నాయి.ఒకానొక పరిమితికి దాటిన నక్షత్రం తనలోని ఇంధనం అంతా దహించబడినాక అది కృష్నబిలం అవుతుంది.ఈ పరిమితిని కనుక్కున్న భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖరన్ పేరున చంద్రశేఖ్రన్ లిమిట్ అంటారు.ఐన్స్టీన్ సాపేక్ష సింతాతం ప్రాచుర్యం పొందాక కూడా విశవావిర్భావానికి ముందు యేమీ లేదు సింగ్యులారిటీ తప్ప అంటున్నారు.మరి ఈ సింగ్యులారిటీ దేని నుంచి వచ్చింది అంటే ఎవరికీ యేమీ తెలియదు, దాని గురించి యేమీ తెలియకుండా ఉందని ఎలా అంటున్నారు?అదేదో సినిమాలో శ్రీలక్ష్మి క్యామెడీగా చెప్పినట్టు ఒప్పుకోకపోతే బాగుందదు అని ఒప్పుకుంటున్నట్తున్నారు!దేవుడు స్వయంభువు అంటే అశాస్త్రీయం అని నమ్మరు,కానీ సింగ్యులారిటీని మాత్రం శాస్త్రీయం అని నమ్ముతున్నారు - యేమిటీ గందరగోళం?

     మహావిస్ఫోటనం లోని ముఖ్యమైన విషయం ప్రేలుడు జరిగిన సమయంలో మొదట శక్తి రూపంగానే వ్యాపనం జరిగింది,తర్వాత దశలో ఆ శక్తి పదార్ధంగా మారి ఈ దృశ్యమాన ప్రపంచం యేర్పడింది.శాస్త్రజ్ఞులు పరిశీలించిన ఈ విశ్వంలోని కొన్ని అంశాలు పూర్తిగా శక్తి లక్షణాల్ని ప్రదర్శిస్తున్నాయి,కొన్ని పూర్తి ద్రవ్య లక్షణాల్ని ప్రదర్శిస్తున్నాయి,మరికొన్ని ఒకేసారి రెండు లక్షణాల్నీ ప్రదర్శిస్తున్నాయి.ద్రవ్యరాశి ఉండటానికీ లేకపోవటానికీ కారణమైన ఒక అంశమే ఈ గాడ్-పార్టికిల్ అనే ముద్దుపేరుతో ఉన్న హిగ్స్ బోసాన్!ఈ అస్తిత్వాంశం దేనిలోనైనా ఆంతర్భాగమైతే దానికి ద్రవ్యరాశి యేర్పడుతుంది,దృశ్యమాన ప్రపంచంలో కనిపిస్తుంది,అందులో నుంచి తప్పుకుంటే దాని ద్రవ్యరాసి శూన్యమై శక్రిగా మారుతుంది.ఒక వూహగా క్రీ.స 1924నాటి బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ రూపంలో జరిగింది.అసలు బోసుగారు కుర్రాళ్ళకి ఒక లెక్చరు ఇస్తూ ప్లాంక్ సిధ్ధాంతం తప్పు అని ప్రూవ్ చెయ్యాలనుకుని ఆ ప్రయత్నంలో చిన్న పొరపాటు చెయ్యగా ఫలితం ప్లాంక్ సిధ్ధాంతం కరెక్ట్ అని చూపించింది.కానీ బోసుగారు తను చేసిన పొరపాటుని కనిపెట్టాడు,కానీ తొలిసారి అది ప్లాంక్ సిధ్ధాంతం అత్ప్పు కూడా కాదనీ ప్లాంక్ సిధ్ధాంతాన్ని కొంచెం మోడిఫై చేస్తే సరిపోతుందనే లైటు వెలిగింది.తను చేసిన తప్పుతో సహా నిజాయితీగా అక్కడి లెక్చర్ నోట్సుని ఒక మ్యాగజైనుకి పంపించాడు.మ్యాగజైన్ ప్రముఖమైనదే అయినా తిరక్కొట్టేశారు.అయినా సరే నీరసపడకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఐన్స్టీన్ గారికి పంపిస్తే ఆయన స్వయంగా జర్మనీలోకి అనువదించి ప్రచురణకి పంపిస్తే అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది.తను కూడా బోస్ పరిశోధనలకి సపోర్టుగా కొంత రాసి రెంటినీ కలిపి ప్రచురించమని అభ్యర్ధిస్తే అది బోస్-ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ పరిశోధనా పత్రం అయింది.బోసుగారు లెక్కలో చేసిన చిన్న పొరపాటు ఈ కొత్తా దేముడు గార్ని బయటికి లాగింది - హాత్తెరికీ, గొప్పవాళ్ళని ఒక్కోసారి వాళ్ళు చేసిన తప్పులు గూడా ఇంకా గొప్పవాళ్ళని చేస్తాయి గాబోలు:-)



     కధ అప్పుదే అయిపోలేదు,కొసమెరుపు కొంచెం మిగిలి ఉంది.అట్లా బోసు గారు అసలు ప్లాంక్ సిధ్ధాంతాన్ని సరిచెసిన వూహని పట్టుకుని ముందుకెళ్ళి క్రీ.శ 1964లో పీటర్ హిగ్స్ తొలిసారిగా పూర్తి స్వభావచిత్రణతో దీనిని ప్రతిపాదించాడు.ఆ తర్వాత సుమారొక అర్ధశతాబ్ది పాటు వూరించి వూరించి అప్పుడు యశోద చేతులకి చిక్కి రోకటికి కట్టుబడ్డ బాలకృష్ణుడిలా 2012 జులై 4న దాని యొక్క ఉనికికి సంబంధించిన సాక్ష్యం కనపడింది.ఆ తర్వాత అది అప్పటి వరకూ దాని చుట్టూ శాస్త్రజ్ఞులు అల్లిన గణిత సూత్రాల కన్నిటికీ న్యాయం చేస్తూ బుధ్దిగా నడుచుకుంటున్నది.అయితే మోడర్న్ సైన్సు ఇక్కడితో ఆగిపోతుందా?కాదు,,హనుమంతుడి తెకలా దీనికి ఈ ప్రత్యేక లక్షణం యెట్లా వచ్చింది అనే ప్రశ్నతో మరో గొడవ అప్పుదే మొదలైంది కూడా.హమ్మయ్య,గాడ్ పార్టికిల్ కధ యేంటో తెలిసింది,ఇంక పోష్టు పూర్తయిపోయింది,హరిబాబు యే బాంబూ వెయ్యకుండా దేన్నీ కెలక్కుండా పోష్టు పూర్తి చేశేశాడు అనుకుంటున్నారు కదూ!ఇక్కడ వేస్తున్నా ఫినిషింగ్ బ్లాస్ట్!

     1909లో సాధారణ వ్యక్తులకి తెలియక పోయినా అణు భౌతికశాస్త్ర పరిశోధకులకి పనికివచ్చే "అతీంద్రియ రసాయనిక శాస్త్రం" అనే ఒక పుస్తకాన్ని ధియొసాఫికల్ సొసైటీ ప్రచురించింది.ఈ ధియొసాఫికల్ సొసైటీ అనేది మేదం బ్లావట్స్కీ అనే రష్యన్ వనిత అధ్యక్షతన న్యూయార్కులో క్రీ.శ 1875లో ఏర్పరచబడింది.క్రీ.శ 1890లో అనీ బిసెంట్ బ్లావ్ట్స్కీని కలవడంతో అప్పటికే ఇతర కారణాలతో ప్రసిధ్ధురాలైన బెసెంట్ ధియొసాఫికల్ సొసైటీలో చేరడం సొసైటీకి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది.తర్వాత కాలంలో ప్రసిధ్ధుడైన జిడ్డు కృష్ణమూర్తి వీరి ఆదరణతో పెరిగినవాడే.మొదట్లో ఇతన్ని ప్రపంచపు తొలి గురువు మైత్రేయుని ఆఖరీ అవతారం అని ప్రచారం చేసినా పెరిగి పెద్దయ్యాక అతను వీటికీ ధెఒసాఫికల్ సొసైటీకి దూరంగా జరిగి తన సొంత దారిలోనే యెంతో మందిని ప్రభావితం చేశాడు.Occult Chemistry ఒక రకంగా అప్పటి వరకూ తాము 1892 నుంచి చేస్తున్న పరిశోధనల్ని తమ సొంత మ్యాగజైనులో ప్రచురించిన వ్యాసాలకి పుస్తక రూపం.ఇందులో అప్పటికి పదేళ్ళ తర్వాత రూధర్ఫర్డ్ చెప్పీన తర్వాత మాత్రమే మిగతా ప్రపంచానికి తెలిసిన పరమాణువుల అంతర్భాగాలని గురించి అవి యేయే వర్ణాలతో యే విధమైన ఆకారాలతో ఉంటాయో తెలిపే చిత్రపటాలతో సహా వివరించారు!తర్వాతి కాలంలో కనిపెట్తబడిన X-రే డైఫ్రాక్షన్,ఎలెక్ట్రాన్ మైక్రోస్కోపీ,గొప్ప సాకేతికత అవస్రమైన పరమాణు విచ్చిత్తి యంత్రాలు యేమీ లేకుండానే వీటిని కళ్లతో చూసినట్టు వర్ణించారు.తొక్కలే,ఇందులో వింతేముంది అనుకుంటే మీరు పప్పులోనో తప్పులోనో కాలేసినట్టే!వాళ్ళు యోగశక్తితో తమ సూక్ష్మదేహానికి ఉన్న అంతర్నేత్రంతో వాటిని చూశారు.The medhod of investigation they took is ANIMA of ancient Indian yoga, the man who has trained in this technique can make himself infinitismally small at will?!ఆ మాట చెప్పినవాళ్ళు ఆషామాషీ వ్యక్తులు కాదు గాబట్టి ఆనాటి అణుభౌతికశాస్త్రవేత్తలు కూడా వాటి యదార్ధాన్ని కాదనలేక పోయారు.ఆ మొత్తం పరిశోధనల్లో పాలు పంచుకున్న వ్యక్తులలో మొదటి వ్యక్తి - చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ ప్రముఖ క్రైస్తవ మతప్రచారకుడు,రెండవ వ్యక్తి - శ్రీమతి అన్నీ బిసెంట్ అనేక రంగాల్లో విశేషకృషి చేసినందువల్ల చాలామందికి తెలిసిన మనిషే!వీరికి అప్పటి అణుభౌతిక శాస్త్రవేత్తలతో సాన్నిహిత్యం కూడా ఉంది.వీరు హైడోజన్ పరమాణువులో ఉన్నాయని చెప్పిన అన్ని అంతర్భాగాలూ తర్వాత కనుక్కోవటం ద్వారా వీరు చూసి వర్ణించిన నిర్మాణం నిజమేనని తెలిసింది.ఇక అధునాతన సిధ్ధాంతం విశ్లేషించిన 4-యఫ్ ఆర్బిటాల్స్ నిర్మాణ చిత్రాలు కూడా వీరు వర్ణించిన విధంగానే ఉన్నాయి!ఇప్పటికీ జరుగుతున్న నూతన ఆవిష్కరణలు వారు అంతర్నేత్రంతో చూసి వర్ణించిన నిర్మితిని బలపరుస్తున్నాయే తప్ప విభేదించడం లేదు.The laborious work of Besant and Leadbeater has been studied in great depth by Dr.Stephen Philips, a qualified theoritical physicist who is fully conversant with the status of modern nuclear physics. Dr.philips has taken graet pains to show in the book titled "ESP of Quarks and Superstrings" that the exhaustive studies of besant and Leadbeater cannot be brushed away lightly!

     సైంటిఫిక్ ప్రపంచం అంటే యెలా ఉంటుందో అది యెలా కొత్త విషయాల్ని కనుక్కుంటున్నదో తెలియని వాళ్ళు హరిబాబుని ఇడియట్ అని చాలా చాలా పెద్ద తప్పు చేశారు.కొన్ని పరిశోధనలు ఆ శాస్త్రజ్ఞులకి కలలో కనబడినాయి,ఆ కల రాకపోయి ఉంటే ఆ ప్రయోగం అలాగే చెయ్యాలని నాకు అసలు తట్టేదే కాదు అని ఆ పెద్దమనిషే ఒప్పుకున్నాడు అని సాక్ష్యం కూడా చూపిస్తే నమ్మకుండా నేను గాలిలో గంతులు వేస్తున్నానని అన్న పెద్దమనిషి దీనికి యేమి చెప్తాడో!ఓ నన్ను ఇడియట్ అన్న తిక్కనేని వదరుబోతు రెడ్డీ!ఇప్పుడెవరు ఇడియట్ అయ్యింది?నువ్వు నన్ను అంటే దానికి నువ్వు సాక్ష్యాలు చూపించలేకపోయావు గాబట్టి యెవడయినా సరే నీది నోటిదూల అని మాత్రమే అంటాడు.ఇప్పుడు సాక్ష్యాలతో సహా నిన్ను ఇడియట్ అంటూన్నాను,నువ్వు కూడా కాదనలేనంత గట్టిగా!


HARIBABU IS REALLY GENIUS - YOUNG VAATSYAAYANA!
-----------------------------------------------------------------------------------------------------------------

ఈ ప్రసంగం శాలివాహన శకం 1937 కార్తీక మాసము 16వ తేదీ శనివారము నాడు ప్రచురించబడినది.

18 comments:

  1. some more inf about lead beater please

    ReplyDelete
    Replies
    1. I also don't know much about him.My interest was the book "Occult Chemistry",which reveals ANIMA of indian yoga is possible even in 20th century.

      you can find more about leadbeater here:
      https://en.wikipedia.org/wiki/Charles_Webster_Leadbeater

      Delete

  2. హరిబాబుగారూ, మీ వ్యాసం బాగుంది. కాని, అధునికవిజ్ఞానశాస్త్రపరిభాషతో పరిచయం అతిస్వల్పం ఐనవారికి మీ వ్యాసం అవగాహనలోనికి రావటం కష్టం. అందుచేత మీరు ఇటువంటి వ్యాసాల్ని బాలలకోసం అన్నట్లుగా వ్రాసిన పక్షంలో అదిఎక్కువమందికి అర్థం అయ్యే అవకాశం ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. అర్ధం అవ్వాల్సిన వాళ్ళకి అర్ధం అయితే చాలు మాస్టారూ,పిల్లల కోసం రాయాలంటే నేను 40 యేళ్ళు చిన్నవాణ్ణి అవ్వాలి,కష్టం:-)

      Delete
    2. శర్మగారు చిన్నపిల్లవాడు కాదు కానీ ఆయన సైన్సు విద్యార్థికూడా కాకపోవచ్చును. అందుచేత సామాన్యపాఠకులకోసం విజ్ఞానశాస్త్రవిషయాలని కాస్త వీలైనంతలో ద్రాక్షాపాకంలో వ్రాయాలని అభ్యర్థించటం. శాస్త్రజ్ఞులకోసం ఐతే మీ వ్యాసం అంత అవసరం కాదు కదా.

      Delete
  3. ఒక విషయం:ధియొసాఫికల్ సొసైటీ నుంచి బయటికి వచ్చిన జిడ్డు కృష్ణమూర్తిని "జేకే" అని పిలుస్తారు.జిలేబీ కామెంట్లలో వాడే "జేకే" ఇదేనా?ఎన్న జిలేబీ మ్యాడం?!

    ReplyDelete
    Replies
    1. ఈ 'జేకే' అంటే ఏమిటి తల్లీ, అని అడిగితే జిలేబీగారు జవాబు చెప్పనే లేదు. (((అ)నవసరంగా) ఆలోచించగా) నాకు స్ఫురించినది ఏమిటంటే Just Kidding అని. దీన్ని పొట్టిగా J.K అంటూ అదీ తెలుగులిపిలో జేకే అని జిలేబీగారు వ్రాస్తున్నారన్నమాట. ఆ జిడ్డు కృష్ణమూర్తి గారికి ఏపాపం తెలియదండి. ఇప్పుడు మీరు ప్రస్తావించారు కాబట్టి మన వ్యాఖ్యానందులు ఆయన మీదా దాడిచేస్తారేమో (ఆయన) ఖర్మ.

      Delete
    2. మీకీ మధ్యన అనవసరమైన వ్యాలోచనలు(?) యెక్కువైపోతున్నాయి,కొంచెం తగ్గించుకోండి:-)

      Delete
    3. అవునండీ హరిబాబుగారూ అనవసరమైన ఆలోచనలు ఇహమా? పరమా?. అందుకే, రాముణ్ణి తప్ప ఇతరులను ఆట్టే పట్టించుకోవటం మానేస్తున్నాను - మీరూ గమనించే ఉండాలే!

      Delete
    4. కానీ మాస్టారూ.భవం ఉన్నంతవరకూ భవబంధాలు కూడా తగులుకుంటూనే ఉంటాయి.శూర్పణఖ ఫ్యానస్ మిమల్ని యెట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉందనివ్వరు:-)

      నేనంటారా,రాముడి కన్నా కాముడు బెటర్ అని శృంగారం వైపు వెళ్దామనుకుంటున్నాను.మూడో పురుషార్ధం - కుర్రాళ్ళని మచ్చిక చేసుకోవచ్చు:-)

      Delete
  4. హరిబాబు వాత్సాయణుడు ఎలా అయ్యాడు ? ఆ క్రమంబెట్టిది ? వివరింపుడు !

    ReplyDelete
  5. “మన వ్యాఖ్యానందులు ఆయన మీదా దాడిచేస్తారేమో (ఆయన) ఖర్మ.”

    ఈ వ్యాఖ్యానందుల గురించి మరీ ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడుచేసుకోకండి శ్యామలీయం గారు. ఏదో మీకు అలవాటైన విధంగా, కనబడిన బ్లాగులోకల్లా జొరబడి అచ్చు తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ అప్పుడప్పుడూ ఎవడు ఏ క్షేత్రంలో ఎలా బీజం నాటితే పుట్టినవాడు బ్రాహ్మణుడౌతాడో ధర్మశాస్త్రబద్ధంగా తీర్పులు చెపుతూ మీ శేషజీవితాన్ని గడిపేయండి. వేరేవాడి తప్పులు ఎత్తిచూపడం పెద్దగా శ్రమలేని పని కదా… ఏ పనీపాటాలేని వ్యాఖ్యానందులు పొరపాటున ఎప్పుడైనా మీ తప్పులు ఎత్తిచూపిస్తే, ఉద్యోగబాధ్యతలు ఎలాగూ అక్కరకొస్తాయి తప్పించుకోవడానికి.

    ReplyDelete
    Replies
    1. తప్పును చూపిస్తే సవరించుకోవటం ఔన్నత్యానికి గుర్తు.అది లేనివాళ్లకి యెదటివాళ్ళు తప్పులు పట్టేవాళ్ళుగా కనిపిస్తే ఎవరేమి చెయ్యగలరు?చెవిటి వాడి ముందు శంఖం వూదటం తెలివితక్కువ పనే,కానీ చెవిటితనాన్ని నటించటం సంగతేమిటి?

      Delete
  6. ********************

    శ్యామలీయం గారి మూల వ్యాఖ్యలు:

    హరికాలం బ్లాగులో:

    “వేదవ్యాసుడు బ్రాహ్మణుడేనండీ.
    ( సత్యవతి ఉపరిచరుడనే రాజర్షికుమార్తె. అమె బెస్తయువతి కాదు. పరాశరుడు భ్రాహ్మణుడనటం సరైనదే. )
    ఈ విషయంలో శ్రీవనం జ్వాలానరసింహారావుగారి బ్లాగులో కొద్దిరోజుల క్రిందటే సవివరంగా వ్రాసాను. అక్కడి వ్యాఖ్యను పరిశీలించగలరు.”

    జ్వాలాస్ బ్లాగులో:
    “పరాశరుడికి మత్సగ్రంథి యందు ఉద్భవించిన వ్యాసుడు బ్రాహ్మణుడు. నిజానికి మత్సగ్రంధి ఉపరిచరుడనే రాజర్షికూతురు కాబట్టి క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబటి క్షేత్రాధికారిగా మరొకక్షత్రియుడు లేడక్కడ.”

    జిలేబి గారి బ్లాగులో :
    “నేను క్షేత్రాధికారం అన్నాను కాని బీజప్రదాతను బట్టి అనలేదు. ”

    ********************

    మత్సగ్రంధికి క్షేత్రాధికారి లేడు. బ్రాహ్మణుడైన పరాశరుడికి క్షేత్రాధికారం లేకపోయినా, బీజం నాటి బిడ్డని పుట్టించాడు. మరి, వ్యాసుడు బ్రాహ్మణుడెలా అయ్యాడు?

    శ్యామలీయం గారి వ్యాఖ్యల్లోని పరస్పర విరుద్ధమైన లాజిక్ ని ఎత్తి చూపితే, సవరించుకొనే ప్రయత్నం జరిగిందా? మీరు ఇతరులనించి ఆశించే తప్పు సవరించుకొనే ఔన్నత్యం శ్యామలీయం గారిలో ఇక్కడ కనపడిందా?

    ReplyDelete
  7. Edge11 November 2015 at 08:27
    శ్యామలీయం గారి వ్యాఖ్యల్లోని పరస్పర విరుద్ధమైన లాజిక్ ని ఎత్తి చూపితే, సవరించుకొనే ప్రయత్నం జరిగిందా? మీరు ఇతరులనించి ఆశించే తప్పు సవరించుకొనే ఔన్నత్యం శ్యామలీయం గారిలో ఇక్కడ కనపడిందా?

    haribabu:క్షేత్రాధికారి,బీజప్రదాత - ఈ ఇద్దరూ వేరు వేరు కావచ్చు.కుంతికి యమధర్మరాజు బీజప్రదాతగా ధర్మరాజు పుట్టినా ఆ కుంతికి క్షేత్రాధికారి పాండురాజు కాబ్ట్టి పాండురాజు కొడుకే అయ్యాడు,కదా!

    శ్యామలీయం మాటల్లో వైరుధ్యం నాకైతే కనపదలేదు.క్షేత్రాధికార్మ నగానే దున్నడమ నే అర్ధం పీకి శ్యామలీయమే అద్రికని దున్నుకోమన్నట్టు మీరు పులుమి సంతోషపడితే యెవరెం చెయ్యగలరు?భార్యాభర్త ఇద్దరూ తమకి సంతానం కావ్లాని అనుకున్నారు.భర్తకి సంతాన్యోగ్య్త లేదు కాబట్టి తప్పనిసరై ఒక ఆల్టర్నేటివ్ ఫాలో అయ్యారు.అయినా కుంతి పాండురాజు భార్య కాబట్టి కుంతికి వేరేవాడి ద్వారా పుట్టిన అతన్ని పాండురాజ నందనుదు అనే అంటున్నారు గానీ మాటి మాటికీ యముడికి పుట్టినవాడు అనై రిఫర్ చెయ్యటం లేదుగా!కాబ్ట్టి అక్కడ్ అక్షెత్రాధిపతీ,బీజ ప్రదాతా వేరు వేరు అయ్యారు కదా!

    మీరు కావలని దున్నడం,వాడుకోవ్దమ ని యెన్ని పెదర్ధాలు లాగినా విషయం మారదు కదా.

    P.S: no more discussions here.If you want to continue copy/paste it on praja discussion page.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...