Saturday 19 September 2015

ముగ్గురు మూర్ఖపుటమ్మల ఆడపెత్తనానికి విడిపోయిన తెలుగువాళ్ళు సాధించామనుకుంటున్న దానికన్నా పోగొట్టుకున్నదే యెక్కువ?!

     బీహారు యెన్నికల తర్వాత భారతదేశపు రాజకీయ సామాజిక ఆర్ధిక స్థితిగతులలో వూహించని మార్పులు సంభవించవచ్చు!ఈ దేశపు సీనియర్ యెన్నికల విశ్లేషకుల అంచనా ప్రకారం అక్కడ భూమిహార్లు అని పిలిచే అగ్రవర్ణ హిందువులు యెక్కువగా ఉన్నారు.మొదట్లో మోదీ ప్రధానమంత్రిత్వాన్ని వ్యతిరేకించి వేరుపడిన నితీశ్ కుమార్ చొరవతో యేర్పడిన మహాకూటమి పట్ల మోదీ వ్యతిరేకులూ భాజపా త్రువులూ చాలా ఆశలు పెట్టుకున్నారు గానీ రాను రానూ వారిలోని కుంజరయూధములే వారి వారి అహంభావాలను చంపుకోలేక దానినొక ఓటికుండలా తయారు చేశారు!అనూచానంగా జరుగుతూ వస్తున్న యెన్నికల సరళి ప్రకారం మహాకూమిలో ఉన్నవారిలో ఆర్జేడీకి వోటుబ్యాంకుగా ఉన్న యాదవులు 14%,జేడీ వారికి దన్నుగా నిలిచే కోయిర్లు 5%,కుర్మీలు 4%,ముస్లిములు 15%,యల్జేపీకి నికరంగా 6% అని వేసుకున్న లెక్కలు నాయకుల మధ్యన జరుగుతున్న చీలికలపేలికల కుమ్ములాటల వల్ల అర్ధం లేనివిగా తయారై వాటివల్ల నిక్కచ్చిగా ఫలితం ఉంటుందనే గ్యారెంటీ లేకుండా పోయింది.పైగా కాంగ్రెసు వ్యతిరేకతతో వూపు తెచ్చుకున్న ఆర్జేడీ లాల్లూ కాంగ్రెసు పక్కన చేరటం,చేరిన వాడు రాహుల్ గాంధీతో వేదిక పంచుకోనని భీష్మించటం,లాల్లూని భాజపాతో కలిసి పదవీచ్యుతుణ్ణి చేసిన నితీశ్ కుమార్ ఇప్పుడు అతనితో దోస్తీ కట్టటం,వీరందరికీ యేదో ఒక రకమైన చెరుపుకోలేని అవినీతి మరక ఉండటం - మరీ ముఖ్యంగా వీరి రాజకీయ ప్రాధమ్యాలలోని హిందూ వ్యతిరేకత భాజపాకి యెక్కువ అనుకూలతని చూపిస్తున్నది!

     ఆంధ్రాలో కమ్మ,రెడ్డి,కాపు సమీకరణల్ని చూసి మనమొక్కళ్లమే కులపిచ్చితో అఘోరిస్తున్నామని మనమీద మనమే విసుక్కుంటున్నాం గానీ కాంగ్రెసు మరియూ వారి పిలక పార్టీల చలవ వల్ల దేశమంతా ఇదే పరిస్థితి!అబ్బో,అక్కడ అక్షరాస్యత శాతం యెక్కువ అని ఈర్ష్యపడే కేరళలో కూడా అధికారానికి కులసమీకరణలే మూలమవుతున్నాయి!సాంకేతికంగా మైనారిటీలు అని పిలవబడే విభిన్న వర్గాలు,అంటే చర్చి యొక్క డైరెక్టు అజమాయిషీ కింద వున్న క్రైస్తవ సమూహమూ,ముస్లిం లీగ్ ప్రభావంతో ఉన్న ముస్లిం మతస్థులూ,మిగిలిన హిందువులో ప్రముఖమైన రెండు కులాలు నాయర్లూ,ఎఝావలూ యెన్నికలలో అధికారం యెవరికి దక్కుతుందనేది నిర్ధారిస్థారు!వర్గరహితసమాజం గురించి ప్రవచనాలు దంచే కమ్యునిష్టులు కూడా ఈ కులసమీకరణల లోపాయకారీ సర్దుబాట్లతోనే కేరళలో అధికారం చేజిక్కించుకున్నారు, వారెవ్వా యెంత చక్కటి కమ్యునిజం?ఇక తమిళనాట పెరియార్ మరియూ ఇతర ద్రవిడ ఉద్యమ నిర్మాతలు పైకి యెన్ని ఆదర్శాలు ప్రవచించినా గానీ కార్యాచరణలో కొన్ని కులాలు మాత్రమే పాల్గొని విజయవంతం చేయదం వల్ల అందరూ భ్రమపడుతున్నట్టు కులరహితం అయిపోలేదు!2012 నవంబరులో ఒక కులాంతర వివాహం జరిగిన సందర్భంలో 300 మంది దళితుల గృహాలు పరశురామప్రీతి అయిపోయాయంటే ఆలోచించుకోండి పరిస్థితి యెట్లా ఉందో!ఇప్పుడక్కడి రాజకీయ చిత్రపటం మీద కులానికో పార్టీ  తయారై కూర్చుంది కాబట్టి విక్రమార్కుడు జవాబు చెప్పలేని భేతాళుడి ఆఖరి ప్రశ్నలాగ యే కులం గురించీ ప్రత్యేకంగా చెప్పలేము - ఈ దిశలో తమిళియన్లు కొంచెం అభివృధ్ద్గి చెందాక గానీ పరిస్థితి స్పష్టంగా యేదో ఒక కులానికి అనుకూలంగా మారదు!కర్ణాటక రాజకీయ రంగమంతా లింగాయతులూ వొక్కళిగల మధ్యన తిరుగుతున్నది!ఇక మోదీ గారి గుజరాతులో పటేళ్ళు హవాలో ఉన్నారు,మోదీ ముఖ్యమంత్రి పదవిలో మంచిపేరు తెచ్చుకుని పర్సనల్ చరిస్మా వల్ల గట్టెక్కాడు గానీ పేరులో పటేల్ లేనివాడు గుజరాతులో ముఖ్యమంత్రి కావడం చాలా కష్టం!ఇదివరలో స్వచ్చంగా ఉన్న ఒరిస్సాలో కూడా ఖండాయతులు రాజకీయంగా యేకమవుతున్నారు!పట్నాయక్ అనే మరొక కులం కూడా ఉండటంతో కుర్చీ వీరిద్దరి మధ్యనే తిరుగుతూ ఉంటుంది!ఇక మధ్య భారతం,ఉత్తర భారతం,అగ్ర భారతం అంతా రాజ్పుట్,జాట్,యాదవ్,సింధియా,చౌహాన్ లాంటి కులాలతో కలగాపులగమైపోయి ఉంది - ఈ కుల కళంక మహా పాప పంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించుట యన్నది బ్రహ్మకైన రుద్రునికైన దాదాపు అసాధ్యమే!

     మహాకూటమికి ఇప్పుడున్న ప్రతికూలతలలో మొదటిది మాగ్ఝీని పదవీచ్యుతుణ్ణి చెయ్యటం వల్ల దళితులు దూరమవ్వటం,రెండవది లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క అవినీతితో నిండిన నిరంకుశమైన రాజకీయ చరిత్ర గెలిచిన తర్వాతనైనా కలిసి ఉంటారని చెప్పలేని అనిశ్చితి,మూవది బీహారులోని మెజార్టీ ప్రజల్లో ఇప్పటి రాజకీయ గందరగోళానికి పూర్తిగా నితీశ్ కుమార్ బాధ్యుదనే అభిప్రాయం ఉందటం - అన్నీ దుశ్శకునములే,!ఒకనాడు మహోజ్వల కీర్తిప్రభలతో ప్రధాని పదవికి మోదీకి దీటుగా అన్ని విధాలా అర్హుడే అనిపించుకున్న వాడు అణిగివుండి అవకాశం కోసం యెదురుచూసే సహనం లేక ఈర్ష్యాళువుగా పరిగణిస్తారని కూడా ఆలోచించకుండా వేసిన ఒక తప్పటడుగుతో నెమ్మది నెమ్మదిగా దిగజారి నేటికి పడబొయేది గళసీమని శోభితం చేసే వరమాలయో లేక రాజకీయ శిరచ్చేదం చేసే ఖడ్గప్రహారమో తెలియని దిక్కుమాలిన స్థితిలో నిలబడ్డాడు!మహాకూటమి గెలిచి అధికారం దక్కినా లాలూతో పోటీ తప్పదు!మహాకూటమి ఓడితే మిగతావాళ్ళు క్షేమంగానే ఉంటారు గానీ తను మాత్రం ఇక మళ్ళీ అధికారం గురించి ఆశించడానికే వీలు లేనంతగా ముఖం చెల్లని స్థితి దాపురిస్తుంది!

     ఈ యెన్నికల్లో గెలుపోటములు నితీశ్ భవిష్యత్తుతో పోలిస్తే భాజపా భవిష్యత్తుకి సంబంధించినంత వరకూ వెంటనే రాబోయే మార్పులేమీ ఉండవు, కానీ కాలక్రమంలో గెలుపొక రకంగా ఓటమి మరోరకంగా వ్యూహాల్ని మార్చుకునేలా ఒత్తిడిని కల్పిస్తుంది!ఓడితే మహాకూటమి అనుకూల మీడియా పోల్చినట్టు భాజపా అశ్వమేధపు యాగాశ్వాన్ని నిలువరించగలిగిన ప్రతీపశక్తులు మరింత విజృంభిస్తాయి!ఇటువైపు పటేల్ కులస్థుల రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం మరింత పెరగవచ్చు - మోదీని ఇరకాటంలో పెట్టి అతని దక్షతకి సవాలుగా దీన్ని యెగదోసే అవకాశం ఉంది.ఈ పతేళ్ళ ఉద్యమం రెండంచుల పదునైన కత్తిలా కనిపిస్తున్నది - మహాకూటమి ఓడితే మైనారిటీలు రాజకీయంగా బలహీనపడిన అవకాశం చూసుకుని దేశంలో ఉన్న అగ్రవర్ణ హిందువులు మరింత హుషారుగా ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశం కూడా ఉంది, యెంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు మంచి టైము చూసుకుని రగిలింది!ఈ ఉద్యమం తీవ్రరూపం దాలిస్తే అసలు రిజర్వేషన్ల వ్యవస్థ పునాదులే మొత్తంగా కదిలిపోయినా ఆశ్చర్యపోనక్కర లేదు!యెన్నికల్లో కులాలు వోటుబ్యాంకుగా మారటం తప్పించి అస్తవ్యస్తంగా ఇన్ని దశాబ్దాల పాటు కొనసాగించిన రిజర్వేషన్ల వల్ల ఆయా కులాలు సామాజికంగా బాగుపడింది కూడా లేదు!ఒక అర్ధవంతమైన చర్చ అంటూ జరిగితే క్రీమీలేయరు ప్రతిపాదనల్ని తిరస్కరించిన భాగోతాలన్నీ బయటికి వస్తే రిజర్వేషన్లని సమర్ధించేవారు కూడా నీళ్ళు నమలక తప్పదు గదా!వాస్తవంగా చూస్తే ఒక్కసారిగా అదృశ్యం కాకపోయినా రిజర్వేషన్ల పట్ల అన్ని వర్గాలలోనూ మరింత వ్యతిరేకత పెరగడం ఖాయం అయినప్పుదు రిజర్వేషన్ అనుకూల వర్గాలు కూడా వూరుకోవుగా - యెటు చూసినా పెద్ద స్థాయిలో హోరాహోరీ జగడం తప్పదనే అనిపిస్తుంది.

     ఈ యెన్నికల్లో భాజపాకి యెదురుదెబ్బ తగిలితే అయోధ్య మళ్ళీ రంగం మీదకి వస్తుంది!ఇటీవలనే మూలసంస్థ సమావేశాల్లో సాధుసంతులు నిలదీసినట్టు తెలుస్తున్నది,వ్యతిరేకించే సాహసం చెయ్యరు గానీ సమయం సానుకూలతల కోసం ఆలోచిస్తున్నట్టు సర్దిచెప్పి బతిమాలుకుని ఉండొచ్చు.రాజకీయ నాయకులుగా మోదీ,నాయుడూ ఇతరులూ వొదిలేసినా సాదుసంతులు వదలరు కదా!బీహారులో గెలిస్తే సావకాశంగా జరిగేది ఓడితే అప్పటి చిక్కుల్ని తప్పించుకోవటానికి ముందుగానే జరుగుతుంది!డిల్లీ రాజకీయాల్లో యెప్పుడు అయోధ్య ప్రస్తావన వచ్చి పని సగంలో ఆగిపోయినా అప్పుడున్న ప్రభుత్వం యేదోరకంగా కూలిపోతుంది!ఇందిరా గాంధీ హత్య సరిగ్గా మొదటి రధయాత్ర జరిగిన మర్నాడు జరిగింది,రాజీవ్ గాంధీ ప్రభుత్వం అస్తవ్యస్తపు శిలాన్యాసంతో యెన్నికల్లో పరాజయం పాలైంది - తర్వాత వీపీ సింగ్,చంద్రశేఖర్,పీవీ హయాముల్లో జరిగిన తమాషాలు చూశారుగా!హేతువాదులకి ఇవి మూఢనమ్మకాలుగా కనిపించవచ్చు గానీ అక్కడున్నది పక్కా హిందువులు,కాదా?ఒకసారి భాజపా అధికారికంగా రామజన్మభూమికి అనుకూలంగా ప్రకటన చేశాక రామాలయ నిర్మాణానికి గానీ భాజపా ప్రబుత్వ పతనానికి గానీ చాలా తక్కువ సమయమే పడుతుంది.నాకు వ్యక్తిగతంగా తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం స్తంభాలూ,తదితర నిర్మాణాలూ దాదాపు అన్నీ పూర్తి ఆకారాల్ని సంతరించుకుంటున్నాయి!ప్రతీపశక్తులు కళ్ళు తెరిచి కాళ్ళూ చేతులూ కూడదీసుకుని దిగ్భ్రాంతులు వ్యక్తం చేసే లోపునే పాతాళభైరవిలోని మాయామహల్ మాదిరి పునాదుల నుంచి పైకప్పు వరకూ నిర్మాణం పూర్తయిపోయి కనిపిస్తుంది - పారా హుషార్!నెనిప్పుడిది చెప్పినా యెంతమంది గుండెలు బాదుకున్నా జరిగేది ఆగదు!ఒకప్పటి భాజపాకీ ఇప్పటి భాజపాకీ రెండు ముఖ్యమైన తేడాలు ఉన్నాయి.మొదటిసారికీ రెండవసారికీ నాయకుల వ్యక్తిగత సౌశీల్యంలో యే మార్పూ లేదు,అవినీతి మకిలి అంటించాలన్నా అంటించలేని సద్వర్తన ఇప్పటికీ కామనే!సుష్మా స్వరాజ్ కూడా డబ్బు తీసుకుని లలిత్ మోదీకి సాయం చేసిందని యెవరూ అనలేరు,అవునా!అయితే ఇప్పుడు వారు అధికారం పోకుండా ఉండటానికి వేసే యెత్తులలో ఆరితేరిపోయారు,అదే వారి ప్రతికక్షులకి ఉక్రోషాన్ని పెంచి మానసిక సమతౌల్యాన్ని కోల్పోయేలా చేస్తున్నది.వారి ప్రకటనల్ని విశ్లేషించి చూస్తే ఒక గొప్ప చరంగపు ఆటగాడు,అదీ అనతోలీ కార్పోవ్ లాంటి మేధావి ఆడే దూకుడు యెత్తులు వేస్తున్నారంటే వారెంత మొండిగా వున్నారో అర్ధం చేసుకోండి!బీహారులో గెలిచినా ఓడినా భారతదేశాన్ని హిందూ అనుకూల రాజ్యంగా మార్చడానికి బలంగా ప్రయత్నిస్తున్నారు - మతం పట్టు పెరిగితే కులం గుట్టు విడుతుంది కాబోలు!ఖడ్గాన్ని ఖడ్గమే రద్దు చేస్తుందన్న చాణక్యనీతి ప్రకారం ముస్లిం ఉగ్రవాదానికి హిందూ స్వాభిమానం నిండిన బజరంగదళం జవాబు చెప్తుందా?

     యెవరెట్లా పోతే మనకెందుకు లెండి, రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం పెరిగినా,అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగినా,క్రమంగా దేశం హిందూరాజ్యంగా మారినా మన తెలుగువాళ్ళకి ఒరిగేదీ లేదు తరిగేదీ లేదు!ఒకానొకప్పుడు కేంద్రంలో సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్ తర్వాత యెక్కువ మంది సభ్యులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అన్ని రాజకీయ పరిణామాలకీ భవిష్యసూచిగా ప్రత్యేకత ఉండేది!అసలు సనాతన ధర్మం దేశమంతటా ఒక్కతీరున విస్తరించడానికి ఆంధ్రశాతవాహనులే కారణం.యే కాలంలో అయినా ఆంధ్రులు ఇప్పుడున్నంత అనామకంగా యెప్పుడూ లేరు!అన్నీ అనుకూలించి అఖండ హిందూ చైతన్యం దేశమంతటా వెల్లివిరియటం గనక నిజంగా జరిగితే ఐక్యంగా ఉన్న తెలుగువాళ్ళు భౌగోళికంగా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత వల్ల రాజకీయంగా కీలకమైన స్థానంలోనే ఉండేవారని నా నమ్మకం.అప్పుడేమి వూడబొడిచారు,అంతగా బలం ఇచ్చినా రాష్ట్రానికి యేమి ఒరగబెట్టారని నిందించటం కూడా తప్పేనేమో!నెహ్రూవియన్ ఆర్ధిక విధానాల్లోని సాంకేతిక లోపం వల్ల దేశం యెన్నో వనరుల్ని సమర్ధవంతంగా వినియోగించుకోలేక యెదగాల్సినంతగా యెదగలేదు,అస్తవ్యస్తపు రిజర్వేషన్ల వల్ల ప్రజలు ఈర్ష్యాద్వేషాలు పెంచుకుని కలిసికట్టుగా యెదగడం సాధ్యపడలేదు,ఇప్పటికీ దేశమంతటా దరిద్రం తాందవిస్తుంటే మనమొక్కరం కేంద్రాన్ని పీడించితే జలగల్లాగ పీల్చుకు తిన్నారన్న చెడ్డపేరు వచ్చేది కాదా!ఈ దేశభాషల్లో యే ఒక్కటీ సరిగ్గా రాని ఆ సోనియాకి యేమి చెప్పి బుట్టలో వేశాడో గానీ థెలంగాణా ఇచ్చేస్తే చాలు అద్భుతాలు జరిగిపోతాయన్నట్టు పిచ్చెక్కిపోయింది మొదటి మహిళారత్నం!కాంగ్రెసు చేరిత్రలో యెప్పుడూ లేంది పార్టీవాళ్ళ కన్నా బయటివాడికి కాంగ్రెసు అధిష్ఠానం విలువనిచ్చిన సన్నివేశం ఇదొక్కటే,అదేమి తెలివో మరి?ఈ చిన్నమ్మని గుర్తుంచుకోండి అని తెలంగాణా వాళ్లని బతిమిలాడి ఆంధ్రావాళ్లని కన్నెత్తి గూడా చూదని సుష్మాస్వరాజ్ మరో మూర్ఖిణి!మోదీ బహిరంగంగానే చాలా ధీమాగా తన మాట్ అచెప్పాడు,అడ్వాణీ ఆఖరి నిముషాల్లో విభజన చట్టంలో ఉన్న గందరగోళాన్ని చూసి దీన్ని సమర్ధిస్తే వచ్చేది తామే గాబట్టి తలనొప్పులన్నీ తలుచుకుని వ్యతిరేకించినా ఈ చిన్నమ్మ పట్టుబట్టటం వల్లనే అయిష్టంగా ఒప్పుకోవలసి వచ్చింది - ఇంతకీ విభజన వల్ల భాజపాకి ఒరిగిన మేలు యేదన్నా ఉందా?ఆఖరికి చంద్రబాబు యెక్కే గడపా దిగే గడపా అన్నట్టు తిరిగి అన్ని రాజకీయ పక్షాల్నీ కలిసి బతిమిలాడటంతో మెడమీద తలకాయ ఉన్న మగమహారాజులంతా విభజనకి వ్యతిరేకంగా ఉన్నా అధికార పార్టీ సభ్యులే బిల్లుకి వ్యతిరేకత తెలుపుతూ నిరసనలు వ్యక్తం చేస్తుంటే బిల్లుకి సంబ్నధించిన నిజమైన మద్దతు యెంతో తెలిసి గూడా గందరగోళాన్ని అడ్డుపెట్టుకుని వ్యతిరేక వోట్లని కూడా సానుకూలం అని ఫిరాయించేసిన మీరాకుమారి అనబడు మరో మహిళా రత్నం పవిత్రమైన స్పీకరు పదవిని అపవిత్రం చేస్తూ రెచ్చిపోతే గానీ గర్భస్రావం వరకూ వెళ్ళి కూడా తల్లినిచంపి పుట్టే రాక్షసశిశువులా తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించింది?!అధికార పక్షానికి బిల్లును సజావుగా నెగ్గించగలిగే కనీసపు బలం కూడా లేదని తెలిసినా యెంత నెచానికి పాల్పడి అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తీరాల్సిందేనని మూర్ఖించిన ముగ్గురు మూర్ఖురాళ్ళ అధ్వర్యంలో కొన్ని లక్షల మంది భారతీయౌలకు ప్రతినిధులైన గౌరవనీయ పార్లమేంటు సభ్యులు మార్షల్స్ చెయ్యాల్సిన బంట్రోతు పన్లు చేసినా తప్పు లేదట గానీ ఇటువైపు వాళ్ళ మాట అస్సలు వినకూడదని భీష్మించుకున్న మొండితనానికి విసుగెత్తి చేసిన నిరపాయకరమైన పెప్పర్ స్ప్రే దాడిని మాత్రం పరమఘోరంగా చిత్రీకరించారు - అదీ హైదరాబాదులో ఒక సభ పెట్టుకుంటాం అని మర్యాదగా అడిగి పర్మిషన్లు తీసుకుని పెట్టుకుంటుంటే క్షేమంగా మిమ్మల్ని వూరు దాటనివ్వం అని బెదిరించిన వాళ్ళు సన్మార్గులట?! యెలాగైనా తమ ప్రాంతాన్నొక రాష్ట్రంగా మ్యాపులో విడిగా చూసుకోవాలనే రంధి తప్ప గట్టిగా యెందుకు విడిపోవాలనుకుంటున్నారో ధీమాగా చెప్పలేక రోజుకో నినాదం తలకెత్తుకుని వాళ్ళు చెప్పిన అబధ్ధాలు ఇవ్వాళ తెలుస్తున్నాయిగా,వాటన్నిటితో పోలిస్తే ఆ ఒక్క పెప్పర్ స్ప్రే సంఘటన యేపాటిది?

     అంత భీబత్సం చేసి అన్నేళ్ళు ఉద్యమం చేసి ఆఖరికి ప్రాణత్యాగాల లెక్కలు కూడా అబధ్ధాలు చేప్పి సాధించిన ఘనకార్యం యేమిటి?దెబ్బైవేల పుస్తకాలు చదివిన పెద్దమనిషికి లోకజ్ఞానం పెంచే పెద్దబాలశిక్ష లాంటివి దొరకలేదేమో పాపం, వాహనాల రీరిజిస్ట్రేషను నుంచి మొదలుకొని గుదుంబాకి విరుగుడుగా చీపులిక్కరు పెట్టటం వరకూ ఒక్కటంటే ఒక్కటి తెలివైన పని చెయ్యలేదు - అన్నీ వెర్రిబాగుల పన్లే!ఇంత గొప్ప రాష్ట్రమొకటి విడిపోగానే నదులన్నీ తమ దిశల్నీ ఉరవడినీ మార్చుకుని ప్రవహిస్తాయనుకున్నారు గాబోలు నీటి ఒప్పందాలు తిరగరాయాల్సిందేనని కోర్టులో కేసు ఏసేశారు డాబుసరిగా - కొత్తగా వచ్చేసారి ఒప్పందాలు కుదుర్చుకోవడం కుదురుతుంది గానీ నిన్న గాక మొన్న యేర్పాటు చేసిన ఒప్పందాలు రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టు మీ ఒక్కరి కోసం యెట్లా మారుస్తారు,బుధ్ధిగా పాత సమైక్య రాష్ట్రానికి ఎలాట్ చేసిన దాంట్లోనుంచి పంచుకోండని కోర్టు చివాట్లు పెట్టింది,ఆఖరికి మనస్తే తెలంగాణ కూడా మేము గుక్కపట్టి యేడిస్తే చెవులొగ్గి వింటామంది కోర్టు అని రాసుకునేసింది:-)ఇంతోటి దానికి కోర్టు దాకా వెళ్ళి యేడవాలా?నాలుగు రోడ్ల కూదలి దగ్గిర నిలబడి జనం ముందు యేడిస్తే చాలదూ!అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తండ్రిని మించిన తనయుడు తారకం బాబు 40 వేల కిలో మీటర్ల భూమి కొలత కన్నానాలుగు రెట్ల దూరం లక్షా ఏభై వేల కిలో మీటర్ల దూరం పైపు లైన్లు వేసి వాటర్ గ్రిడ్ పథకాన్నివిజయవంతం చేస్తాడంట:-)అయినా యెవడూ నవ్వడం లేదంటే తెలంగాణా వాళ్ళు నిజంగా ప్రత్యేకమైన వాళ్ళే సుమా!ముఖ్యమంత్రిని గట్టిగా విమర్శించుదామంటే యెక్కడ తెలంగాణ విఫలప్రయోగం అని పేరుపెట్టి  మళ్ళీ కలిపేస్తారేమోనని భయం కాదు గదా?అంతే,రాజమార్గంలో తెచ్చుకున్న దాని కన్నా దొడ్డిదారిన తెచుకున్న దాని పట్ల అదెక్కడ జారిపోతుందోనని బిత్త్రచూపులు చూస్తూ ఉండటం సహజమే కదా!మొదట్లో యేదో యేడుస్తున్నారు లెమ్మని విభజనకి సానుకూలంగా ఉన్నాను గానీ ఇప్పుడు మాత్రం తెలంగాణా నడిబొడ్డున రెండు రాష్ట్రాలని ఒక్కటి చెయ్యాలన్న సమైక్యవాదపు జండా యెగిరితే చూడాలని ఉంది!మొదటిసారి రాజశేఖర రెడ్డి నక్సలైట్ల సహాయం తీసుకుని తీరా అధికారంలోకి వచ్చాక అచ్చం చర్చలకి పిల్చి శివాజీని ఖైదులో పెట్టిన ఔరంగజేబు మాదిరి ద్రోహం చేస్తే పగబట్టి రాష్ట్రాన్ని చీల్చడంలో గట్టిగా కృషి చేసిన నక్సలైటులే తిక్క తిరిగితే ఆ పని కూడా చేస్తారేమో?

     పరిపాలన చూస్తే పిచ్చోడి చేతిలో రాయి!యే బిల్డింగు కాస్త పాతగా కనబడినా వాస్తు బాగా లేదనీ,పాతదనీ దీన్ని కూలగొతా దీని బాబు లాంటి దాన్ని కడతా అనటమే తప్ప ఒక్కదాన్నీ కూలగొట్టి చూపించడు!మైండులో ఒక వొడిసెలనీ రాళ్ళసంచినీ పెట్టుకుని నదరుగా బిల్డింగు కనబడినప్పుదల్లా గురి చూసి వొడిసెల్లో రాయి బిగించి లాగి వొదుల్తున్నట్టున్నాడు,పనీపాట లేని పిల్లగాడు అచ్చనగిల్లలు ఆడినట్టు పరిపాలిస్తన్నాడు - ఈ వైబోగం కోసమేనా ఇంతగా అంగలార్చింది!అదివర్లో రైతులు చస్తే పలకరించే వాళ్ళన్నా ఉందేవాళ్ళు,ఇప్పుడసలు వాళ్లని అనాధ పిండాల కింద తోసేస్తున్నారు తప్ప రైతుల కిందనే లెక్కెయ్యటం లేదు - రైతుల పరిస్థితిని చూసి ద్రవించి పోయానంటూ మీడియా ముందు దుఃఖించి ఉద్యమగురువు ఈమధ్యనే శంఖమూది కూడా మళ్ళీ సైలెంటయిపోయాడు,యెందుకనో? మనవాళ్ళు వ్యవసాయాన్ని తిండిగింజల కోసం తప్ప వ్యాపార పంటలకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు కాబట్టి వ్యవసాయానికి యెంత గాలి కొట్టినా అది రాష్ట్రం యొక్క సమగ్రాభివృధ్ధికి దోహదం చెయ్యదు.రాష్త్ర విభజన ద్వారా విద్యావంతులైన యువకులు ఆశించిన మెరుగైన ఉపాధి అవకాశాలు పెరగాలంటే పారిశ్రామికరంగం బలపడాలి!కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ దాని గురించి పట్టించుకోకుండా చెరువుల పూడికలు తీస్తూ కాలవలు శరవేగంగా నిర్మిస్తూ  కాలక్షేపం యెందుకు చేస్తున్నట్టు?ఖర్చు తప్ప ఆదాయం లేని గ్రామాల దత్తత స్వీకార పధకాల కోసం యింత మంది శ్రీమంతుల్ని రంగంలోకి దించి యెందుకు హడావిడి చేస్తున్నారు?గతంలో చంద్రబాబు అభివృధ్ధి నంతా హైదరాబాదు లోనే పిడకలు వేసినట్టు పోగెయ్యడాన్ని వెక్కిరించేవాళ్ళు ఇవ్వాళ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే బలిసిన హైదరాబాదుని ఇంకా బలిపిస్తానంటున్నా కిమ్మనడం లేదేమిటి?

     ఈ రెండు రాష్ట్రాల లోనూ పరిశ్రమలు అభివృధ్ధి కావడానికి తగిన పూర్వరంగం అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలికి బలపం గట్టుకుని దేశాలన్నీ తిరిగి బోల్డు కంపెనీల నుంచి యంవోయూలు సాధించానని చెప్తున్నా ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించే పనుల్లోకి యెందుకు దిగడం లేదో తెలుసా, హైదరాబాదులో తప్ప అంతర్జాతీయ స్థాయికి చెందిన సౌకర్యాలతో ఉన్న విమానాశ్రయాలు ఒకప్పటి సమైక్య రాష్ట్రంలో నైనా యెన్ని ఉన్నాయి?విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడ పరిశ్రమలూ వ్యాపారాలూ చెయ్యడానికి తగిన Infra Structure వాటికవే యేర్పాటు చేసుకునేటట్లయితే వాళ్ళకి గిట్టుబాటు కాదు,అందులోనూ ఇప్పుడు లోకల్ మార్కెట్ పరిధి కుంచించుకుపోయింది గదా!లోకల్ మార్కెట్ బలంగా ఉండి వెంటనే ఆదాయం వస్తుందని గ్యారెంటీ ఉంటే వాళ్ళు కొంత రాజీ పడతారు,అందుకే వాళ్ళు అంత గట్టిగా Infra Structure యేర్పాటు చేసే బాధ్యతని రాష్త్ర ప్రభుత్వాల మీదకే నెట్టేసి కూర్చున్నారు!రవాణా సౌకర్యాలు మెరుగు పడేటంత వరకూ,వారి వ్యాపార నిర్వహణకి అవసరమైన భూమిని సాధికారికంగా వారికి సమర్పించే వరకూ,పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు వస్తాయని గ్యారెంటీ లేనంత వరకూ ఈ రెండు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులూఒ యెంత గింజుకున్నా కొత్త పరిశ్రమల స్థాపనలో తొలి అడుగు పడదు - అది ఖాయం!దానికి కావలసిన పారిశ్రామిక రాయితీలు కేంద్రప్రభుత్వం ఇవ్వాలి.ఇదివరలో భాజపాకి మిత్రపక్షంగా ఉంటూ చంద్రబాబు చక్రం తిప్పడానికి కారణం భాజపా అప్పుడు 13 పార్టీల సంకీర్ణంలో ఉండటం.కానీ ఇప్పుడు మోదీ హవా వల్ల భాజపాకి పూర్తి మెజారిటీ వచ్చేసింది కాబట్టి అవసరం తిరగబడింది!యేమి తెచ్చుకున్నా గద్దించి అడిగే వీలు లేదు,బతిమిలాడుకునే తెచ్చుకోవాలి.మిత్రపక్షంగా ఉన్న బాబుకే ఇంత ఇరకాటంగా ఉంటే అసలెప్పుడూ దగ్గిరకే రాని రావు గారి ఇరకాటం మరీ యెక్కువ!

     రాజ్యాంగంలో సాంకేతికంగా రాష్ట్రాల రిపబ్లిక్ అని గొప్పగా నిర్వచించినా ఆచరణలో మాత్రం కేంద్రం పెత్తనం యెక్కువైన యూనిటరీ స్వభావమే కనబడుతున్నది,యెందుకనో!ఇప్పటికే మోదీ అధ్వర్యంలోని భాజపా ప్రభుత్వం క్రమక్రమంగా నెహ్రూవియన్ పధ్ధతులకి మంగళం పాడేస్తున్నది,బీహారు యెన్నికల్లో గెలుపు ఆ దిశలో మరింత హుషారుగా ముందుకెళ్ళ వచ్చు, బీహారు యెన్నికల్లో ఓడినా మొదలైన మార్పు వెనక్కి తిరగదు కదా!అన్ని సామాజిక మార్పులకీ ఆర్ధిక చట్రం పునాది అనే మార్కిస్టు సూత్రీకరణ ప్రకారం దేశంలో ఇప్పటి కన్నా విభిన్నమైన Social Order యేర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంది!మోదీ గారి మేక్ ఇన్ ఇండియా మంత్రం రూపురేఖలు స్పష్టమైన అవగాహనతో చూదగలిగిన వారికి అది ఖచ్చితంగా స్వదేశీ పెట్టుబడిదారులు విదేశీ పెట్టుబడిదారులతో మరింత పోటీ పడి నాణ్యతని పెంచుకునేలా ఒత్తిడికి గురి చేస్తుందని అర్ధమవుతుంది,ఆ లెఖ్ఖ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే security గురించిన భ్రమల్లో మునిగి తేలకుండా ప్రతివాడూ తన క్వాలిటీని మెరుగు పర్చుకునేటందుకు పోటీ పడటం తప్పనిసరి అని కూడా తెలుస్తుంది!

     SECURITY, DEVELOPMENT అనే రెండు మాటలూ DICTIONARYలో కలిసి ఉంటాయేమో గానీ వాస్తవ జీవితంలో అవి పొరపాటున కూడా ఒక ఒరలో ఇమడని రెండు పదునైన కత్తులు!సెక్యూరిటీని అతిగా కోరుకున్నవాడు డెవెలప్మెంటు గురించి మర్చిపోయి ఇల్లు దాటి కదలకుండా  ముసుగు తన్ని పడుకోవాల్సిందే!డెవెలప్మెంట్ కోరుకున్నవాడు సెక్యూరిటీ గురించి ఆలోచించకుండా రిస్కుకి సిధ్ధపడి ముందుకు దూకాల్సిందే!అట్టడుగు నుంచి బయలుదేరి అంబరాన్ని చుంబించిన యే సాహసి విజయగాధని చూసినా అది అక్షరసత్యమని తెలుస్తుంది,ఇది తెలియకనే ఆంధ్రాతో కలుస్తున్నప్పుడు అతిగా సెక్యూరిటీల కోసం పట్టుబట్టటం అనే ఒక చిన్న పొరపాటు ఇంతకాలం పాటు తెలంగాణా వాళ్ళని మొద్దునిద్ర పోయేలా చేసింది - ఇప్పటికీ తెలంగాణా పునర్నిర్మాణానికి ఆంధ్రావాళ్ళనే దేబిరించాల్సిన మానహీనత యెదురయ్యింది?!రిజర్వేషన్ల మీద భ్రమల్ని వొదులుకుని తమ స్థితిగతుల్ని మెరుగు పర్చుకోవడానికి చేసే నిజమైన ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు బుధ్ధిమంతులైన ముస్లిం సోదరులకీ తెలివైన దళిత మేధావులకీ నామాటలోని సత్యం బోధపడుతుంది!ఆర్ధీకచట్రం మారడం వల్ల సామాజిక ముఖచిత్రం కూడా మారి కులాల పేరిట కుమ్ములాటలూ మతాల పేరిట మారణహోమాలూ తగ్గి భారతదేశం నిజమైన శుభసుందర భవిష్యదుజ్వల సువర్లోకంలోకి సగర్వంగా ప్రవేశించి విశ్వగురువుగా వందనాలు అందుకోవటం ఖాయం - అన్నీ అనుకున్నట్టు జరిగితే?అప్పుడు తెలుగువాళ్ళు యెలా ఉంటారో తెలుసా!ఒకళ్ల నొకళ్ళు తిట్టుకుంటూ నువ్వు దొంగంటే నువ్వు దొంగని పోట్లాడుకుంటూ ఇప్పటికంటే అధమస్థాయికి దిగజారిపోయి ఉంటారు,యేమాత్రం సందేహం లేదు!నిన్నటి నుంచి చేసిన సుదీర్ఘమైన తప్పులతడక ప్రయాణం వల్ల ఇవ్వాళ్ళ ఇట్లా ఉన్నవాళ్ళు ఇవ్వాళ్టి నుంచి రేపటికి చేసే ప్రయాణం ఇంతకన్నా గొప్పగా యెట్లా ఉంటుంది?


జాతీయ స్థాయిలో ఆంధ్రుల ప్రాభవం ఇక గతజలసేతుబంధనమే!

45 comments:

  1. గర్భస్రావం వరకూ వెళ్ళి కూడా తల్లినిచంపి పుట్టే రాక్షసశిశువులా తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించింది?
    -----------------
    వావ్

    ReplyDelete
  2. నిన్నటి నుంచి చేసిన సుదీర్ఘమైన తప్పులతడక ప్రయాణం వల్ల ఇవ్వాళ్ళ ఇట్లా ఉన్నవాళ్ళు ఇవ్వాళ్టి నుంచి రేపటికి చేసే ప్రయాణం ఇంతకన్నా గొప్పగా యెట్లా ఉంటుంది?
    -------------
    ఇంకో ఆణి ముత్యం.

    ReplyDelete
  3. దేశం హిందూరాజ్యంగా మారటం అని అనటం లో తొందర పడుతున్నారు. హిందువులకు మతాధిరత చట్టం ఎమీ లేదు. ఇప్పుడు ఎవరైనా రాజ్యాంగ సవరణ చేసి మను స్మ్రుతిని చట్టం గా చేయమని అడిగారా? సంఘ్ పరివార్ వాళ్లకి కూడా ఆ కోరిక లేదు. రామాల్యం నిర్మాణం కొరకు ఒరయత్నం ప్రారంభిస్తే హిందూస్ప్ దేశమైపోతుందా?

    దేశానికి సెక్యులరి జం వలన కలిగిన లాభమేమి? ఎమెర్జెన్సి సమయం నుంచే కదా మన దేశం సెక్యులర్ గా ప్రకటించింది, అంతక మునుపు తో పోలిస్తీ సెక్యులర్ అయిన తరువాత పెనుమార్పులు ఎమైనా వచాయా? నా దృష్టి లో ఎమి లేదు. సెక్యులరిజం ముసుగూలో ప్రభుత్వం దేవాలయ ఆస్థులను స్వాహా చేసింది. గూండాలను , భూ కబ్జాదారులను పుట్టించింది. వేల, లక్షల కోట్ల ఆస్థులను మిస్ మానేజ్మెంట్ చేసింది.

    Regds

    SriRam

    ReplyDelete
  4. >>> అతిగా సెక్యూరిటీల కోసం పట్టుబట్టటం అనే ఒక చిన్న పొరపాటు ఇంతకాలం పాటు తెలంగాణా వాళ్ళని మొద్దునిద్ర పోయేలా చేసింది

    మొద్దు నిద్ర పోయామో, నిద్ర మేలుకుని ఉద్యమాలు చేసి సాధించుకున్నామో... ఆ సంగతి పక్కకు పెడదాం. తెలంగాణాతో కలుస్తామని ఆంధ్రా వారు దేబిరించి బ్రతిమిలాడుతుంటే తెలంగాణా వారు కండిషన్లు పెట్టి అవి ఒప్పుకుంటే కాని కలవమని పట్టుబట్టారన్న మాట! ఈ విషయం మేం మొదటినుండి చెప్తుంటే ఒప్పుకోలేదే!

    >>> ఇప్పటికీ తెలంగాణా పునర్నిర్మాణానికి ఆంధ్రావాళ్ళనే దేబిరించాల్సిన మానహీనత యెదురయ్యింది?

    ఇక్కడే పడుంటాం, సెక్షన్ 8 ద్వారా అదనపు సెక్యూరిటీ కావాలని దేబిరిస్తున్నది ఎవరు? అంతటి మానధనమే వుంటే ఇక ఆ దేబిరింతలు ఎందుకు?

    ReplyDelete
    Replies
    1. నువ్వు చేసిన ఉద్యమమేమిటి? అమాయకులు తగలబెట్టుకొంటే ఆత్మబలిదానం అని ముద్దు పేరు పెట్టి వారి చావులను ప్రోత్సహించటం. ఈ పిరికి చేష్టలను వీరోచిత పోరాటం లా మీడియాలో , సోషల్ మీడియా లో ప్రచారం చేశారు.

      బచ్చాగాడికి కూడా తెలుసు తెలంగాణ ఉద్యమాల వలన రాలేదు అని. సోనియా గాంధి, సుష్మా లదగ్గ జోలె పట్టుకొని, ప్రాణాచారం పడి దేబిరిస్తే వచ్చిందని. ఆత్మ గౌరవం , మానధనం పదాలకు అర్థమే తెలియని తెలంగాణా వారు మాట్లాడటమా! ఇసీ !!!

      Delete
    2. @sreekaant chaari

      Q1.తెలంగాణా వారు కండిషన్లు పెట్టి అవి ఒప్పుకుంటే కాని కలవమని పట్టుబట్టారన్న మాట

      hari ans:మీరు పెట్టిన కండిషన్ల స్వభావమేమిటి?ఆంధ్రావాళ్ళు ఇంగ్లీస్షు చదువులు చదివారు,మేము ఉర్దూఒ చదువులు చదివ్వాం,వాళ్ళతో మేము పోటీ పడలేం అని,అవునా కాదా?

      ఇప్ప్పుడు మాత్రం మీరు మేలుకున్నారా?నేను పుల్మడం కాదుగా,మీ వీఎర తెలంగాణా అసాంజి బ్లాగరు పోష్తులే చెప్తున్నాయిగా సాక్షాత్తూ మీఎ ప్రభ్య్త్వమే తెలంగాణా కంట్రాక్టర్ల క్వాలిటీ బాగుందదూ ఆంధ్రావాళ్ళే మెరుగు అంటున్నారని!మీ ముక్కుమంత్రే తెలంగాణా పునర్నిర్మాణానికి ఆంధ్రా పెట్టుబడిదారుల సాయం అడుగుతూ ప్రకటనలు కూడా చేశాడుగా,వినలేదా?

      అసలు తెలంగాణా తెచ్చుకున్నదే సొంతంగా తెలంగాణా వాళ్ళు యెదగాలని,ఆ విషయం మాకు అనవస్రం కాని మీకు కాదుగా - అయినా మీలో చలనం లేకుండా ఉంటే మీరు మేలుకుని ఉన్నారని నమ్మద మెట్లా?!

      Q2:ఇక్కడే పడుంటాం, సెక్షన్ 8 ద్వారా అదనపు సెక్యూరిటీ కావాలని దేబిరిస్తున్నది ఎవరు? అంతటి మానధనమే వుంటే ఇక ఆ దేబిరింతలు ఎందుకు?

      hari ans:అవి విభజన చట్టం ద్వారా మాకు హక్కుగా వచ్చిన సఔకర్యాలు.వాటికి ఒపుకున్నారుగా మీరు కూడా.అధికారికంగా దఖలు పడిన వాటిని ఉపయోగించుకోవటంలో మానహాని యేముంది?

      Delete
    3. తెలంగాణా రాష్ట్రం సాధించుకున్న తరువాత కూడ స్వతంత్ర దినోత్సవం లాంటి విమోచన దినాన్ని అధికారికంగా జరుపుకోలేకపోవడం దురదృష్టం.

      Delete
    4. >>> అతిగా సెక్యూరిటీల కోసం పట్టుబట్టటం అనే ఒక చిన్న పొరపాటు ఇంతకాలం పాటు తెలంగాణా వాళ్ళని మొద్దునిద్ర పోయేలా చేసింది

      ఇంతమంది కంఠశోష పడ్డా ఈ వాక్యాన్ని ఎవరూ సమర్థించుకోలేక పోయారన్నమాట!

      మేం కండిషన్లు పెట్టింది వాస్తవం అని ఒప్పుకున్నట్టేగా? మీరు తప్పనిసరై ఒప్పుకోవడం జరిగిందా లేదా? ఎవరు మానం విడిచి ఇతరులు పెట్టీన కండిషన్లు ఒప్పుకుని రాజీ పడ్డారు? దీనికి జవాబు చెప్పండి. మీరు స్వభావరీత్యా తిట్టే తిట్లు, శాపనార్థాలూ మామూలేలే. వాటిని పట్టించుకోను.

      Delete
    5. @sreekaant chaaei
      Q1:మీరు స్వభావరీత్యా తిట్టే తిట్లు, శాపనార్థాలూ మామూలేలే. వాటిని పట్టించుకోను.

      Q2:మేం కండిషన్లు పెట్టింది వాస్తవం అని ఒప్పుకున్నట్టేగా? మీరు తప్పనిసరై ఒప్పుకోవడం జరిగిందా లేదా?
      harbabu:
      A1:ఇది తప్పు అని చెప్తున్న ప్రతి పాయింటుకీ కారణాలు చెప్తున్నా!సకలజనుల సర్వే నాకు మంచిదనిపించింది,చాలా సరదాగా దానికి సమర్ధనగానే ఒక పోష్టు వేసా - పూర్తి ద్వేషంతో ఉంటే అటువంటి పోష్టు వెయ్యగలనా?ఈ మధ్యాలంలో నాకు బాగా నచ్చిన కవిత "భస్మ సారంగి",అందులోని చాలా భాగం కంఠగతంగా వచ్చు - అది కూడా స్వభావరీత్యా తిట్టడానికి మాత్రమే చూసేవాడు చేసే పనియేనా?బుధ్ది చెప్పువాడు గుద్దితేఅనేమయా అని వేమన్న చాలా గుద్దులు గుద్దాడు కదా,ఆ గుద్దుల్లో ఉన్నవి శాపనార్ధాలు అని చెప్పగలవా?వేమన్న లాగా గుద్దులు గుద్దేతంతటి పాండిత్యం నాకు లేదు గానీ మీరు చేస్తున్న పొరపాట్ల వల్ల మీరు నష్టపోయి మమ్మల్ని తిట్టింది మీరు కదా,నాకు తిట్టడం అంటగడితే యెలా!

      A2:రెండు ప్రాంతాల్లోని కాంగ్రెసువాళ్ళూ ఆలోచించుకుని ఇవతలివారు ప్రతిపాదించగా అవతలి తెలంగాణ ముఖ్యమంత్రి మెజార్టీ సభ్యుల ఆమోదంతో తీర్మానం వల్ల కలిస్తే అది కూడా అంధ్రవాళ్ళు మెదలు వంచటమే అవుతుందా?అవును మెదలు వంచటమేనన్నా కాదు ఇస్టాపూర్తిగా కలిశారన్నా అది కూడా మీ తెలివితక్కువనే చూపిస్తుందిగా!

      Delete
    6. సీ 'కంతా ' చారీ ,

      తమరి బొంద మరియు తమరి పేస్. మానాభిమానాలు, conditions గురించి తమరు మాట్లాడితే దానికి మించిన కామెడీ ఈ పెపంచకం మీద ఎక్కడా ఉండదు. మీరూ, మీ దిక్కుమాలిన ఏడుపుగొట్టు పనులూ. ఒక రెండు నెలల క్రితమేనా మీ తొక్కలో ముక్కుమంత్రి తందానా తాని తందానా అని తోడు దొంగల్లాగా నువ్వు ఆ తొక్కలో ముక్కలా తెగ వాగారు ఎంట్రీ టాక్స్ గురించి. మరి ఇవాళ పరిస్థితి ఏంటి వచ్చి మా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు వద్దు దేవుడో తీసేద్దాం అని. సిగ్గు లేని మీ మొకాలకి మళ్ళీ మానాభిమానం గురించి వాగుడు ఒకటి. ఇంతకీ రైతులకి ఎయిడ్స్ వచ్చి పోతన్నారని చెప్పినట్లు మీలాంటి వత్తాసు వాగుడుగాళ్ళకి ఏ నోటి డయేరియో నో అని చెప్తాడేమో మీ దొర ఆ శుభదినం దాకా వెయిట్ చేద్దాం.

      Delete
    7. మీరు స్వభావరీత్యా తిట్టే తిట్లు, శాపనార్థాలూ మామూలేలే

      ఆంధ్రోళ్లు మీ పిడి వాదనకు విసుగెత్తి తిట్లు ఎత్తుకొంటారేమో, మీరు ఘోరి కడతాం కొడకో నైజం సర్కరోడా అని పాటలు కట్టి పాడుకొంటారు. ఆ విషయం మరచి పోయినట్లున్నవు.

      Delete
  5. పార్లమెంట్ ఎన్నికలకీ అసెంబ్లీ ఎన్నికలకీ ఉన్నతేడాని గమనించే స్థాయి మన దేశ ఓటర్లకి ఉంది. అందుకే దిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో మోదిని, అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ని గెలిపించారు. బిహార్‌లో ముఖ్యమంత్రి పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నితీష్‌కి కొంత అనుకూలత ఉంటుంది. అలాగే కుల సమీకరణాలు కూడ నితీష్‌కి అనుకూలంగా ఉన్నాయి. అయినా మంచి మెజారిటీ రాకపోవచ్చు. ఫలితంగా ప్రభుత్వం పతనమై, రాష్ట్రపతి పాలన, మళ్ళీ ఎన్నికలు రావచ్చు.
    నితీష్ NDA నుండి బయటకు రావడం సరైన నిర్ణయమా కాదా అన్నది ఈ ఎన్నికలలో తెలిసిపొతుంది.

    ReplyDelete
  6. విభజన విషయంలో తప్పు కాంగ్రెస్, బిజెపిలది మాత్రమే కాదు. ప్రజలది కూడ ఉంది. 2004లో చంద్రబాబు తన పార్టీలోని తెలంగాణా వాళ్ళని కూడ ఒప్పించి సమైక్యవాదంతో ఎన్నికలకి వెళ్ళాడు. కాని ఆంధ్ర ప్రజలు ముందు జాగ్రత్త లేకుండా టిడిపిని ఓడించారు. అంటే ఆంధ్ర ప్రజలు కూడ విభజనకి అనుకూలం అని అనుకోవచ్చు కదా. తీరా విభజన చేసాకా రోడ్లెక్కి ఉద్యమాలు చెయ్యడం వలన ప్రయోజనం లేకుండాపోయింది. సామాన్య ప్రజలకి అంత అవగాహన లేదనుకున్నా, ఉద్యోగులు కూడ యధాశక్తీ కాంగ్రెసు గెలవడానికి కృషి చేసారు. ఇప్పుడు వాళ్ళకే అందరికన్నా ఇబ్బందులు ఎక్కువయ్యాయి.

    ReplyDelete
  7. బాబూ శ్రీకాంత్ చారీ! ఆంధ్రానాయకులు ఎవరినీ దేవిరించలేదు నాయనా! దేవిరించినట్లు ఆధారాలు చూపితే బావుంటుంది. విలీనం అనేది వాస్తవంగా నెహ్రూ ఆలోచనే. ఆంధ్రావాళ్ళ ఆలోచన కాదు. కొత్తగా ఇండియన్ యూనియన్ లో చేర్చుకున్న హైదరాబాద్ సంస్థానంలోని కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని అణచివేయాలంటే ఏం చేయాలా ? అని ఆలోచించి ఆయన ఆంధ్రా-తెలంగాణాల విలీనం ఐడియాకి మొగ్గుచూపాడు. ఒక పెద్ద ప్రాంతమైన ఆంధ్రాలోకి, కాంగ్రెస్ ప్రాబల్యంలో ఉన్న ఆంధ్రాలోకి కమ్యూనిస్టు తెలంగాణాని విలీనం చేస్తే చిన్నగీత పక్కన పెద్దగీత గీసినట్లు ఉంటుందని ఆయన ఆలోచించాడు.

    అంటే విలీనం వాస్తవంగా ప్రాంతాల ప్రయోజనాల కోసం జరిగినది కాదు. పార్టీల ప్రయోజనం కోసం జరిగినది మాత్రమే, ఇప్పటి విభజన లాగే. ఇందులో ఏ ప్రాంతప్రజలకీ ఏ విధమైన ప్రమేయమూ లేదు. వాళ్ళనెవరు లెక్కజేశారు? నిజంగా లెక్కచేస్తే ఆర్టికిల్- తోనూ, కోస్తా-సీమల్లో భారీయెత్తున పారామిలిటరీ డిప్లాయ్ మెంట్ తోనూ, సొంతపార్టీకి చెందిన ఎమ్పీలనే వెలిపెట్టడంతోనూ, పార్లమెంట్లో మార్షల్స్ తోనూ, టీవీ ప్రసారాల్ని బంద్ చేయడంతోనూ అవసరమేంటి? ప్రజలకిష్టం లేని ఓ బలవంతపు విభజనకే కదా ఇవన్నీ అవసరం.

    ఇహపోతే, పెద్దమనుషుల ఒప్పందం అనేది - విలీనం జరిగిపోవడానికి జస్ట్ బిఫోర్ - అప్పటికప్పుడు అర్ధరాత్రిపూట తెలంగాణ నాయకుల డేస్పరేట్ మెదళ్ళలో పుట్టిన ఆలోచన.

    తెలంగాణవాళ్ళని ఆంధ్రావాళ్లు గౌరవించలేదనే వాదన. నీ దగ్గర ఓనమాలూ, ఎక్కాలూ చదువుకున్నవాడికి నీతో సమానంగా పీట వేసి కూర్చోబెట్టలేవు. నీ వల్ల పైకొచ్చినవాడికి నువ్వు గౌరవం ఇవ్వలేవు. నీ మీద ఆధారపడ్డవాణ్ణి నువ్వు సీరియస్ గా తీసుకోలేవు. నీ ఆర్థిక హోదా కన్నా ఎన్నోరెట్లు తక్కువగా ఉన్నవాడికి నువ్వు నీ కూతురునిచ్చి పెళ్ళిచెయ్యలేవు. వాడి భాషనీ, family culture నీ నువ్వు సుపీరియర్ గా పరిగణించలేవు. ఇదంతా ప్రకృతిసహజం నాయనా! ఇది మానవ మనస్తత్త్వం. ఏ ఉద్యమాలూ, వేర్పాటువాదాలూ ఈ మనస్తత్త్వాన్ని మార్చలేవు. నువ్వు బాధపడ్డా సరే, ఇది నిజం.

    సోనియా గాంధీ ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చినది పార్టీ ప్రయోజనాల కోసం కూాడా కాదు. చాలామంది అలాగే అనుకుని బోల్తాపడుతున్నారు. సొంతపార్టీవాళ్ళని ఒప్పించడం కోసం అది ఆమె ఉపయోగించుకున్న కుంటిసాకు మాత్రమే. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయాక అడిగితే, "దానివల్ల గెలుస్తామని కాదు. తెలంగాణ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నాం అంతే." అన్నది. అసలీవిడ ఎప్పుడు తెలంగాణకొచ్చింది? ఎప్పుడు మాటిచ్చింది? ఆ దేవుడికే తెలియాలి.

    అసలు విషయం అది కాదు. ఆవిడ రాజీలేని, వీరావేశం కలిగిన (fanatical) క్రైస్తవ మతాభిమాని. తద్ద్వారా ఆవిడ SC, ST వర్గాల అభిమాని కూడా. అందుకని అప్పట్లో కేంద్ర కాంగ్రెస్ కమిటీకి బాగా కావాల్సినవాళ్ళయిన గుడిసెల వెంకటస్వామిలాంటి క్యాండిడేట్లు ఆంధ్రా-తెలంగాణల గురించి ఆవిడ ముందు ఓ డిఫరెంట్ పిక్చర్ ఆవిష్కరించారు. అది మీడియాలో బహిర్గతం కాలేదు. వాళ్ళు ఆవిడకి లోపాయికారీగా చెప్పినది ఏంటంటే - "ఆంధ్రా 90% శాతం హిందూ ప్రాంతం. అక్కడ హిందూ అగ్రకులాలదే అన్నిరంగాల్లోనూ ఆధిపత్యం తెలంగాణ కేవలం 80% శాతమే హిందూ. పైగా తెలంగాణాలో ఎస్సీ ఎస్టీ వర్గాల జనాభా చాలా ఎక్కువ. కాబట్టి తెలంగాణ ఇస్తే ఒక ఎస్సీ-ఎస్టీ-మైనారిటీల ఆధిపత్యం గల రాష్ట్రాన్ని సృష్టించినట్లవుతుంది" అని! మేడమ్ ఈ ప్రతిపాదనకి చాలా ఇంప్రెస్ అయిపోయింది. అందుకనే ఏం చేశైనా సరే, ఖచ్చితంగా తెలంగాణా ఇవ్వాలనే ఆవిడ దృఢంగా నిశ్చయించుకుంది. వాస్తవానికి ఈ దృఢనిశ్చయం ఆవిడలో 2007-2008 ప్రాంతంలోనే ఏర్పడింది. అయితే 2009 లో ఈ నిశ్చయాన్ని ఆవిడ రాజశేఖరరెడ్డి ముందు (ఆయన కూడా క్రైస్తవుడు కావడం చేత తనలాగే ఎగిరి గంతేస్తాడనుకుని) వ్యక్తం చేసినప్పుడు, ఆయననుంచి ఆవిడకి అనుకోని విధంగా తిరుగుబాటు ఎదురైంది. అంతటితో ఇద్దరి మధ్యా సంబంధాలు శాశ్వతంగా బెడిసికొట్టాయి. ఇక ఆ తరువాత జరిగినదంతా హిస్టరీ. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు అందుకే "హిందూ ఆంధ్రా" పట్ల అంతులేని క్రూరత్వాన్ని ప్రదర్శింంచింది.

    ఈ విభజనకి అసలు కారణం - ఇది జరిగేనాటికి తెలుగుజాతికి ఒక బలమైన నాయకత్వం (ఎన్టీయార్, వైయెస్సార్ లాంటిది) లేకపోవడం. నాయుడు గొప్ప నాయకుడే కానీ వాళ్ళకి తెలుగు ప్రజల్లో ఉన్న ఎమోషనల్ పుల్, అటాచ్ మెంట్ ఈయనకి లేదు. అదే పెద్ద డిసడ్వాంటేజి. ఈయన ఎంతసేపూ వ్యూహాలతో నెట్టుకొద్దామని చూస్తూంటాడు. కానీ ఎమోషనల్ అటాచ్ మెంట్ కి ప్రత్యామ్నాయం లేదు.

    ReplyDelete
    Replies
    1. Superb analysis!You touched with elegance what I left.about the scaricity of leaders with emotional attchment,still we are at a loss - what to do?

      Delete
    2. ఈ హిందూ క్రైస్తవ యాంగిల్ నేను అసలు విననే లేదు!మీరు రాజశేఖర రెడ్డి తెలంగానని వ్యతిరేకించాదంటున్నారు,కానీ యెన్నికల్లో కలిసి పోటీ చెయ్యడం,మొదట తీర్మానం తన హయాములోనే జరగటం గురించిన వార్తలు ఉన్నాయి గదా!

      కొంచెం విసదీకరించగలరు.

      Delete
    3. ప్రజలోను, ఎక్కడ పడితే అక్కడ పనికిమాలినవాళ్ళతో పెట్టుకోవడానికి మీకు వేరే పనేమీ లేదా?
      పట్టించుకొనేవాళ్ళు లేకపోతే విసుగెత్తి వాళ్ళే పోతారు. మీకెందుకు దురద?

      Delete
    4. హరిబాబుగారికి, నేను సెప్టెంబరు 20 న కామెంటిన అనానిమస్ ని.

      సార్! ఇది విశదీకరిస్తే అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఇది మాకు వ్యక్తిగతంగా చేరిన కాన్ఫిడేన్షియల్ సమాచారం. "చాలా పెద్దలెవెల్ వాళ్ళ ద్వారా" తెలిసింది.

      ఇహపోతే రాజశేఖరరెడ్డి మొదట్నుంచీ రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. కానీ టీడీపీని వ్యతిరేకించే పేరుతో - అక్కణ్ణుంచి బయటికొచ్చిన కేసీయార్ ని ప్రోత్సహించి మోరల్ సపోర్ట్ ఇవ్వాలనే అధిష్ఠానం వైఖరికి ఎదురుచెప్పలేకపోయాడు. చాలామందిలాగే అతను కూడా "ఇదో తాత్కాలిక వ్యూహమేను. కేసీయార్ ని మన పార్టీ అధికారంలోకొచ్చేదాకా వాడుకుని అవతల పారేసే ప్లాన్ మాత్రమేను. ఇది టీడీపీని బలహీనం చేసే మార్గం" అని నమ్మాడు. అప్పటికి తమ పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు కాబట్టి "అంత సీన్ లేదులే" అనుకున్నాడు.

      కానీ 2009 లో సోనియా తన మనసులోని మాట బైటపెట్టేసరికి అతని కూష్మాండాలు బద్దలయ్యాయి. ఆ క్షణంలో అతను ఆవేశం ఆపుకోలేకపోయాడు. "సరే మేడమ్! మీరు ఇస్తే ఇవ్వండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నేను మాత్రం పార్టీలో ఉండను. నా సొంత పార్టీ నేను పెట్టుకుంటాను" అని తెగేసి చెప్పేశాడు. ఇది నా కల్పన కాదు. ఇదంతా ఢిల్లీలో తెలంగాణా కాకా కీ.శే. గుడిసెల వెంకటస్వామి వింటూండగా జరిగిన సంభాషణే. అతను బ్రతికున్న రోజుల్లో స్వయంగా బయటపెట్టినదే. పేపర్లో కూడా వచ్చింది.

      మీరు ప్రస్తావించిన ఎన్నికల పొత్తూ, రాజశేఖరరెడ్డి హయాములో తీర్మానం ఇవన్నీ అతనికి ఇష్టమై జరిగినవి కాదు. వీటి వెనక అతని సంకల్పం ఉన్నట్లు కనపడదు. ఇవి ఆంధ్రా పార్టీల పరస్పర బ్లేమ్ గేమ్ లో భాగమూ, ముఖ్యంగా టీడీపీ విమర్శల తూణీరంలో తురుపుముక్కలే తప్ప అసలు పిక్చర్ వేరుగా ఉంది.

      Delete
    5. వీ హనుమంతరావు గారు 2012 లో నాకు స్వయంగా చెప్పినదాని ప్రకారం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 40 మంది తెలంగాణా ఎం ఎల్ ఏ లను 2004 ఎలక్షన్లకు ముందు మేడం వద్దకు తీసుకెళ్ళి తెలంగాణా ఇవ్వాలని డిమాండ్ చేసారనీ అనూహ్యంగా చంద్రబాబు గారిని ఓడించడంతో తెలంగాణా అంశం పక్కన పెట్టారనీ,ఒకవైపు మందిని ఢిల్లీ కి తీసుకెళ్ళిందీ వారే,ఆ తరువాత వద్దన్నదీ వారే అనీ,తెలంగాణా అంశాన్ని మేడం కి చెప్పినవాళ్ళు ఇపుడు తెలంగాణా ఇవ్వవద్దని ఆప(న)లేరని నాతో చెప్పారు.కాకా చెప్పింది కరెక్టా వీ హెచ్ చెప్పినది కరెక్టా అన్నది మీరే తేల్చుకోండి.

      Delete
  8. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకి దారి తీసిన అసలు కారణాల గురించి మన కోస్తావాళ్ళ హిస్టారికల్ వెర్షన్ మనకుంటే బావుంటుంది. ఎంతసేపూ తెలంగాణావాళ్ళ తప్పుడు వెర్షనే ప్రచారంలోకి వస్తోంది. కోస్తామేధావులమంతా కలిసి ఓ సారి ఈ విషయమై ఓ పెద్ద పుస్తకాన్ని రూపొందించే అంశం మీద చర్చించుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. అమలు చేయదగిన చక్కటి సలహా. భావితరాలకి సరైన అవగాహన కలిగించడం కోసం అటువంటి వెర్షన్ తయారు చెయ్యడం ఎంతైనా అవసరం. ఆ వెర్షన్ ని ఆంధ్రప్రదేశ్ లో స్కూల్, కాలేజ్ పాఠ్యపుస్తకాల్లో కూడా చేర్చాలి. ఈ సలహాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి.
      (మంచి సలహా ఇచ్చేవారు, మంచి విశ్లేషణలతో కూడిన వ్యాఖ్యలు వ్రాస్తున్న కొందరు అజ్ఞాతలుగా ఉండడం ఎందుకు?)

      Delete
    2. పాపం! వీళ్ళు హైదరాబాదువాళ్ళనుకుంటా. అందుకే ! సుమారు 60 లక్షలమంది ఆంధ్రా వలసదారులున్నారు తెలంగాణా మొత్తమ్మీద ! అక్కడ కల్చర్ కాస్తో కూస్తో పాజిటివ్ గా మారిందంటే ఆ పుణ్యం వాళ్ళదే.

      Delete
    3. మంచి సలహా ఇచ్చేవారు, మంచి విశ్లేషణలతో కూడిన వ్యాఖ్యలు వ్రాస్తున్న కొందరు అజ్ఞాతలుగా ఉండడం ఎందుకు?

      అజ్ణాతం గా రాయటానికి అజ్ణాతల కారణాలూ వారికి ఉన్నాయి. బ్లాగులో కనీస పరిజ్ణానం లేకుండా పుచ్చొంకాయ వాదనలు చేసేవారికి కొదవ లేదు. మచ్చుకి ప్రవీణ్ శర్మ, వారి అనుంగు సోదరుడు పల్లాఅ కొండల రావు అగ్రగణ్యులు. ప్రపంచం నశించినా వీరి మూర్ఖత్వం నశించదు. చానా మంది కొండల రావు ని ప్రవీణ్ తో పోల్చటం అతి గా అనిపించొచ్చు. బాగా ఆలోచిస్తే ప్రవీణ్ భావ ప్రచారం ఆయన బ్లాగులో కన్న ఎక్కువ ప్రజ బ్లగు లోనే జరిగిందన్న విష యం మరచిపోకుడదు. కొండలరావు దృష్టికి ప్రవీణ్ రాసే నాన్ సెన్స్ తీసుకు వస్తే, వాడిని భావ స్వేచ్చ ముసుగు లో సమర్దిస్తూ వచ్చాడు.

      కొండల రావు మార్కిసిజం కోణం లో నుంచి హిందూ సంస్కృతి ని అర్థం చేసుకోవటానికి విఫల కొండల యత్నం చేస్తూ, హిందూ మతం మూల హవల్నూ వక్రీకరిస్తూ, అది తట్టుకోలెక పేజీల కొద్ది సమాధానాలు ఇచ్చిన ఆగక శ్యామలీయం మైండ్ ను, మరిని ప్రశ్నలతో భోజనం చేశాడు. అయినా ఆయన మారింది ఎమీ లేదు. ఇప్పటి ప్రవీణ్ ప్రశ్నలు అక్కడ ఎక్కువగా (95%) కనిపిస్తూంటాయి. మీదు ముఖ్యంగా పిన్నిని పెళ్లి చేసుకొనుట, హిందూ మతం కన్నా ఇస్లాం లో మహిళలకు స్వేచ్చ ఎక్కువ అని వాదిస్తూంటారు.

      కమింగ్ టు ది పాయింట్, ప్రవీణ్, కొండల రావు అంత కాకపోయినా కొన్ని సార్లు తెలంగాణా వీరులు పిచ్చ వాదన చేయటం లో తక్కువ తినలేదు. వాళ్లకి వర్తమానం కన్నా గత చరిత్ర మీద అవగాహన ఎక్కువ. గతం లో జీవించటానికి ఇష్టపడతారు. వర్తమానం లో ఇంత మంది చస్తూంటే ఈ తెలంగాణా వీరులు చిన్న నిరసన కూడా తెల్ప లేదు. వీళ్లు ఎమి పని చేసి పొట్టపోసుకొంటారో తెలియదు గాని, వీరితో వాదిస్తూ కూచుంటే ఉన్న ఉద్యోగాలు మానుకొని ఆ పని మీదే కూచోవాలి. పేరు పెట్టి రాస్తే , కౌంటర్ ఇవ్వవలసిన బాధ్యత ఉంట్టుంది. అజ్ణాతం గా రాస్తే మనం చెప్పాలనుకొన్నది చెపుతాము. మంచి పాయింట్ ఉంటే , కామన్ సెన్స్ ఉన్న వాళ్లకి సారం అర్థమౌతుంది. వాదన పొడిగించ వలసిన అవసరం ఉండదు. సమయం లేకపోతే అజ్ణాతం గా రాయటం , సమయం ఉంటే పేరు తో రాసి, వాదన కు దిగడం ఉత్తమము.

      Delete
  9. నేను తెలంగాణా వాణ్ణే. కానీ ఆంధ్రులను అభిమానించే వాణ్ణి. నేను మాట్లాడే భాష ఆంధ్రమని నమ్ముతాను.

    తెలంగాణ అబద్ధాలతో నిలబడ్డదని నమ్ముతాను. అన్ని అవకరాలు ఒక దగ్గర పోగుపడటమే అతిశయం.

    అటువైపు వాళ్ళకు ఈ పోలికలు రాకూడదని కోరుకుంటున్నాను.

    మా చావు మేము చావక తప్పదని తెలుసు.
    తెలంగాణ పచ్చి జూదగాండ్లు , తార్పుడుగాండ్ల చేత చిక్కింది. ఒకడు ఆచార్యుడట ఒకడు జర్నలిస్టట. ఒకడు ఇంకేమోనట.

    ఇప్పటికి మా ఘనత ఏందంటె - మా ఆత్మహత్యలు మావే , మా ఎన్ కౌంటర్లు మావే .

    ReplyDelete
  10. ఎప్పుడు అమరావతి పూర్తవుతుందా? ఎప్పుడు ఎగిరిపోదామా? అని చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని టెన్షన్ గా కూర్చుంది టాలీవుడ్. ఆ సంగతి తెలీక చిత్రనగరీ, పితృనగరి అని తెగ ఉత్సాహపడిపోతున్నాడు తెలంగాణా జాతిపిత. విభజన వల్ల ఏమేం జరగబోతున్నాయని తెలివి గల ఆంధ్రావాళ్ళు ఊహించారో అవన్నీ వీసమెత్తు తేడా లేకుండా జరిగాయి. జరుగుతూన్నాయి. జరగబోతున్నాయి. అయ్యప్ప సొసైటీ మీద ప్రభుత్వదాడితో టాలీవుడ్ కి అన్ని భ్రమలూ తొలగిపోయాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోబట్టి ప్రస్తుతానికి కాల్పుల విరమణ అమలవుతోంది. కానీ వాతావరణం ఏ కాస్త అనుకూలించినా మళ్లీ ప్రాంతీయ ఛాందసవాదుల గన్నులు గర్జిస్తాయి. ఆ సంగతి టాలీవుడ్ కి తెలుసు. అయ్యప్ప సొసైటీలోని మహా మహా ఆంధ్రా జమీందార్లకే దిక్కులేనప్పుడు మన సంగతేంటని హైదరాబాదులోని తతిమ్మా ఏరియాలవాళ్ళు అనుకుంటున్నారని విజయవాడకి చేరుతున్న సమాచారం. అందుకే సినీనటుడు నాగార్జునా ఒక్కొక్క ఆస్తీ అమ్మేసుకుంటూ వెళుతున్నాడు. మిగతావాళ్ళంతా కూడా ఆ బాటలోనే ఉన్నారు. చాలామంది అక్కడో కాలూ ఇక్కడో కాలూ పెట్టి పరిణామాల్ని స్టడీగా గమనిస్తున్నారు.

    ReplyDelete
  11. ఇది నిన్న వాట్సప్‌లో వచ్చిన మెసేజ్.

    Nice funda.

    After the BJP won the elections with full majority on 16 May 2014, one Modi fan fainted with happiness and then went into coma...

    After 12 month he suddenly came out from the coma...

    Returning to his senses he asked the following questions to the attending doctor...

    How do you feel in corruption free India?

    Robert Vadra is in which jail?

    Rahul and Sonia are in jail or escaped to Italy?

    Should I book ticket for bullet train to Lucknow or should I go by plane?

    How much black money did we get back from the Swiss banks?

    After every Indian received 15 Lacs each from Modiji... there must be 'NO POVERTY'.

    Has the rate of us dollar dropped to 35 rupees?

    How happy are Indians after Modiji subsidized and freed cooking gas, vegetables, tomatoes, onions, potatoes ?

    After Pakistan getting frightened and returning Dawood, what happened to him?

    Are the farmers happy at being returned the land forcibly acquired by congress?

    Listening to these questions the poor doctor has gone into coma... and the Modi Fan is lodged in the Mental Asylum at Agra!

    This is absloutely brilliant.... we have to salute d person who compiled this note

    ఇందులో చాలా అతిశయోక్తి ఉన్నా, కొంత నిజం కూడ ఉంది.
    ఇదే తరహాలో బంగారు తెలంగాణా చేస్తానన్న వాళ్ళ గురించి కూడ ఎవరైనా రాస్తే బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. I salute you for praising the person composed it!!
      Innocence..... !!
      To ruine India so called composer gave 65years, to set everything right he expect result in 12 months ....12 months is more than 1Year!! (12>1)
      Barrow some brain.
      Swiz money was not kept in Savings account ... Just to go and draw it so easily.

      Daawood took 15 years to become DAWOOD DON, staying in Pak since 20+ years Pakistan is not Congress wife ... Just handover its Illegal husband so easily!!!
      Even though Modi ji appointed Best option NSA Diwal ji.

      Think before accepting SHIT.

      Delete
    2. Congress Wife : Before stating the negative side of somebody,not appreciating the positive things they accomplished is morally/ethically unfair.

      Delete
    3. Rahul Gandhi : We go into this model where you have the one guy who will come and fix everything. He is going to come on a horse, that’s the model, that’s the Indian model. He is going to come on the horse, the Sun is in the background. There are a billion people waiting. He is coming and everything is going to be fine. Yes. It’s going to work like that."

      Delete
    4. Reg Congress wife (Comment): ఉంపుడు గత్తెలని ఇంగిలీషు లో ఏమంటారో తెలియక వైఫ్ అన్నాను సారియే!! left parties always 'keep' of congress ... Just always bootlickers and make people fools by acting as fighting with 60yrs Ruling Party Congress.

      Regarding RaGa (coment) : రాజివ్ గాంధి అలానే భారథ రాజకీయాలలోకి వచ్చాడు(గుర్రం పై టపీమని ఊడిపడ్డాడు)!! ...


      సోనియమ్మని అందరు అలానే యు.పి.ఏ చైర్ పర్సన్ గా చెసారు.... అలా సూర్యున్ని వెనకాల వెసికొని ఊడిపడే రకం ఆ గంధీ కుటింబీకులు!!
      ఫప్పు స్టేట్మెంటు కోట్ చెసారంటే ఇంకేం మాట్లాడలేము నవ్వడం తప్ప!!


      Modi ji came to power by showing his Performance in Gujrath .. He has a best Team and team work is Going on ....

      Delete
    5. According to Hindu mythology do you know who is the 'keep' of Mr. Ravan ?

      ఉంపుడు గాడిని "మిండగాడు" అని తెలుగులో అంటారని శర్మగారు చెప్పారు,ఇంగ్లీష్ లో ఏమంటారో తెలియదు.

      మోడీ అంత సమర్ధుడే అయితే కాంగ్రెస్ గురించి భయపడడమెందుకు ?

      Delete
    6. పాప తెలంగాణ భాషలో లో మిండెడు అంటారు ...

      అంటే పక్కలో ...ఆ పక్కలో (బూథు బూథేమరి ...) పడుకోబెట్టే వాడు
      .... ఆ లెక్కన రావణుడు చానా మందికి మిండెడు ...ఆ లెక్కలు చెల్లివైన శూర్పనఖ కి బాగా తెలియాలి!!.

      ఖాంగిరేసుకి ఎవరూ భయపడటం లేదు చీదరించుకుంటున్నారు!!

      బల్లిని ... కాక్రోచ్ ని చూసి అరిచేది భయం తో కాదు అసహ్యం థో !!


      Congress will get same punishment wich "minDeDu" RavaNa got .... But here Communists whole heartesly enjoys Congress company on Indian political BED!!
      (But never accepts they belongs 1 family ..... Akrama sambandham in Democracy)
      Hahaha .... What ever the topic you drag Raamayan ....paapa neeku moaksham tathyam !!

      Delete
    7. What ever the topic you drag Raamayan .... meeku moaksham tathyam !!"

      Thanks a Ton !

      Delete
    8. Congress will get same punishment which "minDeDu" RavaNa got ....

      According to Hindu Mythology RavaNa got Moksha, Congress deserve the same....Thanks a lot !

      Delete
    9. Communists whole heartedly enjoys with TDP,TRS,MIM,YSRCP,CP but not with sickular BJP. Communists can't enjoy or forcefully rape the sick people.

      Delete
  12. నాకు తెలంగాణ సామాన్య ప్రజానీకాన్ని చూస్తుంటే విపరీతమైన జాలి వేస్తున్నది!తిండి లేక చచ్చిపోవడం అంటే అర్ధం చేసుకోగలం.కల్తీ కల్లు - మామూలు కల్లు ఆరోగ్యానికి మంచిదని కొందరంటుంటారు,అది కూడా కాదు కావాలని కల్తీ చేసి అమ్ముతున్నది - దొరక్క పిచ్చెత్తినట్టు ప్రవర్తించడం చూస్తుంటే జాలి కన్నా భయం వేస్తున్నది!ఒకటిన్నర సంవత్సరాల కొత్త ప్రభుత్వాన్ని నిందించి ప్రయోజనమేమిటి?ఇప్పటికన్నా పరిస్థితి బయటపడుతున్నది గాబట్టి కొంత రసాభాస జరిగినా పరిష్కారం తొందర్లోనే దొరకవచ్చునేమో?!

    కానీ గత యాభై యేళ్ళ నుంచి ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులకి ఈ పరిస్థిత్తి తెలియదా?ఒక MLA కానీ MP కానీ ఇవేవీ తెలియని అజ్ఞానంలో ఉంటాడని నమ్మాలా?ప్రజల్లో ఉన్న ఈ దురలవాట్లని పోగొట్టాలని వాళ్ళకెప్పుడూ అనిపించలేదా?తెలంగాణ ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యానికి ఆంధ్రప్రాంతం వాళ్ళు కారణమెట్లా అవుతారు?మా ప్రాంతంలో ఈ సమస్య ఉంది అని వాళ్ళు హైలైట్ చేస్తేనే గదా దాన్ని పరిష్కరించాలనే దిశగా ముందడుగు పడేది!ఇన్ని దశాబ్దాలుగా కనీస ప్రయత్నం కూడా చెయ్యలేదా?

    యెన్నో ప్రశ్నలు!యెంతో అయోమయం,నా పోష్టులో నేను నక్సలైట్ల గురించి చెప్పిన అభిప్రాయాన్నే మొన్న కంచె ఐలయ్య నకసలైట్లకి ఒక సూటిప్రశ్నగా వేశాడు.ప్రజల్ని వర్గరహితసమాజం వైపు నడిపించాలనే మహదాశయం గల మావోఇష్టులు ఒక ప్రానతపు ఒక కులపు ఆధిపత్యం వల్లనే తెలంగాణా వెనకబడిందనే అర్ధసత్యాలతో వాళ్ళే కేసీఆర్ ద్వారా ఈ రాష్ట్రవిభజన అనే పరిష్కారాన్ని ముందుకు తెచ్చారంటున్నాడు.అలాంటి చెత్త వ్యూహాలకు బదులు ప్రజల్ని ఈ దురలవాట్ల ఉంచి విముక్తం చేసే ఆదర్శాన్ని పాటించి ఉంటేఅ యెంత బాగుండేది!

    అధికారం కోసం అలమటించే మామూలు రాజకీయ వేత్తలు తప్పులు చెయ్యడం సహజమేలెమ్మనుకున్నా ఉన్నతమైన సిధ్ధాంత నేపధ్యం ఉన్నవాళ్ళు కూడా నేలబారు రాజకీయాలు చేస్తున్నారే!ఇదెక్కడి విప్లవం?ఇదెక్కడి విమోచన!తాము పెంచి పోషించి అధికారంలోకి తెచ్చిన ఇద్దరూ - రాకశేఖర రెడ్డి,చంద్రశేఖర రావు - తమనే అణిచిపారెయ్యడానికి రాస్క్షసశక్తిని ప్రదర్శిస్తుంటే తమ వ్యూహాత్మక లోపాన్ని తెలుసుకోకుండా వరవరరావు వ్యవస్థని అంత గంభీరంగా నిందించి ప్రయోజనం యేమిటి?సమర్ధుడు యెదటివాళ్ళని కూడా తప్పులు చెయ్యనివ్వకుండా కాపాడగలడు, అసమర్ధుడు తన తప్పులకి యెదటివాళ్ళని నిందిస్తాడు - అది కూడా తెలియదా అతనికి?!

    ReplyDelete
    Replies
    1. అయ్యా ! మీరు చెప్పినవన్నీ ఒక సూత్రం తో కట్టబడి ఉన్నాయా అన్న జాగరూకత వహించుటలేదు.

      మీరు తెలంగాణవాళ్ళు వింతజాతి అన్నట్లు ఉదహరిస్తున్నారు. ఒక హీరమండలం ఇంకొక పెనుగొండ కూడ మీకు వింతస్థలాలని నా ఊహ.

      హైద్రాబాదు తప్ప తెలంగాణ జిల్లాల పట్ల మీ ఈ వింత చూపే తెలుగు ఐక్యతకు పునాది లేమిని సృష్టించింది.

      ఇప్పుడున్న నవ్యాంధ్ర జిల్లాలను త్రికరణశుద్ధి గా కలుపుకు నడవండి.

      తెలంగాణ జిల్లాలలో కల్లు సేవనమటుంచి , గోదావరి గుంటూరు జిల్లాలలో అసహ్యమైన నగ్ననృత్యాలను మీ నాయకులు ఆపిన్రా

      సంస్కృతీ రాహిత్యం మన ఉమ్మడి ఆస్తి అని మరువరాదు.

      నదీమ్ అన్సారి

      Delete
    2. @Anonymous30 September 2015 at 07:45
      of "మీరు తెలంగాణవాళ్ళు వింతజాతి అన్నట్లు ఉదహరిస్తున్నారు. ఒక హీరమండలం ఇంకొక పెనుగొండ కూడ మీకు వింతస్థలాలని నా ఊహ.

      హైద్రాబాదు తప్ప తెలంగాణ జిల్లాల పట్ల మీ ఈ వింత చూపే తెలుగు ఐక్యతకు పునాది లేమిని సృష్టించింది."

      haribabu:మరీ ఇంత అజ్ఞానమా అని ఆశ్చర్యపోవడం కూడా మీకు ఐక్యతలేమిని సృష్టించడంలా యెందుకు కనపడింది?

      నవ్యాంధ్ర జిల్లాలకేం!తెలంగాణ నాయకుల మాదిరి అంతమంది కల్తీకల్లు తాక్కపోతే చచ్చిపోయే విధంగా జనం ఉన్నా కనీసం పలకరించడం గానీ యేళ్ళ తరబడి జనాన్ని పట్టించుకోకుండా గానీ ఉండటం లేదుగా!

      యెందుకండీ వాస్తవం చెప్తుంటే ఉలిక్కిపడి ఇదిగో ఇందువల్లే మేం కలవలేకపోయాం అంటారు?అవును,తెలంగాణ గురించి నాకు తెలియకనే గదా యెందుకిట్లా ఉంది పరిస్థితి అని ఆశ్చర్యపోతున్నది,అది కూడా వెక్కిరినతగా కనబడటం అంటే మీ రెస్పాన్సు ఓవరే?!

      Delete
    3. Haribabu, this is nothing but "withdrawal symptoms" experienced by addicts when deprived of their fix. Glad Telangana is clamping on down dangerous adulterated toddy is atleast now. Andhra should also do so even though there are temporary costs.

      Delete
    4. అయ్యా !

      మీ మీద పూర్తి గౌరవంతో రాస్తున్నాను.

      తెలంగాణ పట్ల మీ విసుగు సహజమే. "మీ వింత చూప"న్నది , తోటి తెలుగువాళ్ళయిన అందరిని ఉద్దేశించినది. వాగ్దోషం. మన్నించండి.

      మీ శైలి రంగనాయకమ్మను పోలి భీతి గొల్పుచున్నది.

      నదీమ్ అన్సారి

      Delete
    5. @nadeem ansaari!
      మీరు అందర్నీ ఉద్దేశించి అన్నారని తెలుసు.కానీ ఇటువంటి మాటల్లో స్పష్తత లేకపోవడం వల్లనే గతంలో తౌరక్యాంధ్రం గురించీ తెలంగాణాలో కవులున్నారా అనదం గురించీ చాలా గొడవలు జరిగాయి!

      తెలంగాన పట్ల నాకు విసుగు లాంటిది యేమీ లేదు,కుతూహలం - బండి సరైన దిశలోనే వెళ్తుందా లేదా అనే టెన్షన్!

      Delete
  13. అవును , నిజంగా జాలిగొలిపేవె .
    కల్తి కల్లు గురించి ఒక్క mla , నాయకుడు కూడా నోరు విప్పడం లేదు .
    చాలా ఆశ్చర్యంగా ఉంది . ఆ కల్లు దుకాణం యజమానులని ఎందుకు అరెస్ట్ చేయడం లేదో . ప్రజల ఆరోగ్యం ఇంత తేలికగా ఎలా తీసుకుంటారు .
    అన్నింటికీ మించి తెరాస నాయకుల విధానం మతి పోతుంది నాకు .

    ReplyDelete
  14. తెలంగాణవాళ్ళు ఇప్పుడు దేశానికి కొత్తగా స్వాతంత్ర్యం వచ్చినంత గ్రేట్ మూడ్ లో ఉన్నారు. టి.ఆర్.ఎస్. దిగజారుడు రాజకీయాల్నీ, వాళ్ళ అసమర్థ పరిపాలననీ, వాళ్ళు కట్టిచూపిస్తున్న గాలిమేడల్నీ గ్రహించలేనంతగా కళ్ళకి దట్టమైన గంతలు కట్టేసుకున్నారు.పొరపాట్న వాళ్ళకేదైనా అనుమానం వస్తోందన్న అనుమానం కేసీయారుకొస్తే వెంటనే ఆంద్రోళ్ళని తిడుతూ కొత్త బూతులు లంకించుకుని వాళ్ళ దృష్టి మళ్ళిస్తాడు.అందుకు తగ్గట్లే మన నాయుడు కూడా సమయానికల్లా ఏదో ఒక తెలివితక్కువపని చేసి కేసీయార్ కి కావాల్సిన మందుగుండు అందిస్తూంటాడుఎలాంటి తెలంగాణవాళ్ళని ఎలా తయారు చేశాడు కేసీయార్ అని తల్చుకుంటే బాధ కలుగుతుంది. పదిహేనేళ్ళ క్రితం మేము హైదరాబాద్లో ఉన్న రోజుల్లో మాకూ మా తెలంగాణ మిత్రులకీ ఈ ప్రాంతీయ గొడవలు అసలు తెలీనే తెలీవు. బంధువుల్లా కలిసిపోయేవాళ్లం. అతనొక్కడే కాదు ఇందులో కాంగ్రెస్ పాత్ర కూడా చాలా పెద్దది...

    ReplyDelete
  15. Pls read below article

    Does it matter now if someone was an Aryan: Romila Thapar

    http://indianexpress.com/article/cities/delhi/does-it-matter-now-if-someone-was-an-aryan-romila-thapar

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...