గత యేడాది డిసెంబర్ నెలలో ఒక ఉబర్ క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్లో ప్రయాణిస్తున్న ఒక మహిళపై అత్యాచారం జరిపాడు.ఆ అమ్మాయి ఆ సంఘటనకు ముందు చాలా ధైర్యస్తురాలు.2012 డిసెంబర్ గ్యాంగ్ రేప్ ఘటన తరవాత వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడమే కాకుండా తన కుటుంబాన్ని,స్నేహితుల్ని కూడా నిరసనలో పాల్గొనేలా ప్రేరేపించిన మనిషి!అంత ధైర్యం గల మనిషి కూడా కౌన్సిలింగ్ అవసరమయ్యేటంతగా యెందుకు భయపడిపోయింది?
డిసెంబర్ 5వ తేదీ రాత్రి స్నేహితులతో కలిసి డిన్నర్ చేసింది.రాత్రి సమయంలో తన స్నేహితుల్ని కానీ సహోద్యోగుల్ని కానీ ఇంటివరకు దింపమని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు.ఇంటికి సురక్షితంగా చేరుకునేందుకు పేరున్న క్యాబ్ అయితే మంచిదనుకుంది.రెండేళ్ళ క్రితం డిసెంబర్ 16వ తేదీన జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత మనదేశంలో వున్న ప్రతి అమ్మాయీ సెక్యూరిటీ విషయంలో యెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తున్నది,తీసుకుంటున్నది.ఇంతకు ముందు చాలాసార్లు తను ఉబర్ క్యాబ్ లో ప్రయాణించింది.అందుకనే ఆ క్యాబ్ సర్వీసు మీద నమ్మకంతో దాన్నే యెంచుకుంది.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అత్యాచారం జరిగింది!అయినా వీటిని గట్టిగా తల్చుకుంటే కంట్రోలు చెయ్యగలిగిన పోలీసు శాఖలోని అధికార్లూ ప్రజల జీవితాలకు రక్షణ కల్పిస్తామని ప్రమానం చేసి పదవుల నలంకరించిన గౌరవనీయులైన మంత్రివర్యులూ తదాదిగా గల అప్రకటిత నపుంసకత్వ రోగపీడితులూ ఆడపిల్లలకే దుస్తుల గురించీ ప్రవర్తన లోని క్రమశిక్షణ గురించీ లెక్చర్లు దంచారు, దంచుతున్నారు, దంచుతారు?
ఆ రోజు రాత్రి రోడ్డు మీద పోలీసు పెట్రోలింగ్ వాహనాలు కనిపించలేదు.తను యెంతగానో నమ్మిన ఉబర్ క్యాబ్ సర్వీసు నేర చరిత్ర ఉన్న వ్యక్తిని డ్రైవర్ గా నియమించింది.తరవాత తెలిసింది యేమిటంటే అంతకు ముందే నిధి షా అనే మహిళా ప్రయాణికురాలు ముద్దాయి అయిన డ్రైవర్ శివకుమార్ యాదవ్ ప్రవర్త్న బాగాలేదని ఫిర్యాదు చేసినా ఉబర్ సంస్థ పట్టించుకోలేదు.అతడిపై ఎటువంటి చర్యా తీసుకోలేదు.వాళ్ళు అప్పుడే సరిగా స్పందించి వుంటే ఈ రోజున తను,తన కుటుంబం బాధపడాల్సిన పరిస్థితియెదురయ్యేది కాదు.ఆ అమ్మాయి లాంటి యెంతోమంది ఆదపిలలు అడుగుతున్న పృఅశ్నలు ఇవి - సోదరుడు,భర్త లేదా యెవరో ఒక మగవాడు తోడుగా లేనిదే ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదా?అమ్మాయిలు ఇంట్లోనే కూర్చోవాలా?ఆడపిల్లలకి బయటికి వెళ్ళేందుకు,ఉద్యోగాలు చేసుకునే హక్కు లేదా!
ఆ అమ్మాయి తనవంతుగా కొన్ని కోరికల్ని చెప్పింది - ఆడవాళ్ళు నడిపే క్యాబ్ లు కావాలి,పెట్రోలింగ్ వాహనాలు,పోలీసుల సంఖ్య యెంత యెక్కువగా పెరిగితే ఆడవాళ్ళకు అంత సురక్షితంగా వున్నామన్న భావన కలుగుతుంది.అమ్మాయిలు ప్రయాణించే క్యాబ్ లను బాగా చెక్ చేయాలి.అలాగే ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి.మనలో యెక్కువమంది యేదయినా విషయంలో జోక్యం చేసుకుంటే పోలీసుల చుట్టూ తిరగాలి,కోర్టు కేసులు వుంటాయని ఆలోచిస్తారు.ఈ అమాయి తల్లికి తన స్నేహితురాలు ఫోన్ చేసి"మీఎరు కేసు ఎందుకు ఫైల్ చేశారు?మీకు చెడ్డ పేరు వస్తుంది!" అని అంటే ఆమె "ఆ పని చేసిన వాళ్ళకి చెడ్డపేరు వస్తుంది కానె మాకెందుకు వస్తుంది" అని జవాబు చెప్పిందట.ఇప్పుడు భారతదేశం పురుషాధిక్య సంస్కృతిలో వుంది.అందుకని ఆడవాళ్ళకు సమానావకాశాలు ఇస్తే మగవాళ్ళు ఆదవళ్ళని చులకనగా చూడటం మానేస్తారు.బుర్రలు సరిగా ఆలోచించాలంటే సరయిన విద్యావిధానం వుండాలి.
మరి ఇంత తెలివి గల ధైర్యమున్న అమ్మాయి అంత భయపడిపోవటానికి కారనమేమిటో తెలుసా?ఆ పశువు లొంగకపోతే రాడ్ వుపయోగిస్తా నన్నాడట?!అంటే పత్రికలలో ఆ పాత సన్నివేశం గురించిన వార్తలు అతడికి అందరూ చేస్తున్న ఆందోళనల్నీ నేరస్తుల పట్ల అసహ్యాన్నీ వాళ్ళకి పడిన శిక్షల్నీ కాకుండా మరో రకమయిన నీలి చిత్రాన్ని చూపించాయన్న మాట!చాలా చిన్నప్పట్నించీ ఈ రకమయిన వార్తల్ని చాలా కుతూహలంతో చదవగా నాకు అర్ధమయినది యేమిటంటే వాళ్ళు ఈ నేరాల్ని చెయ్యడం కేవలం లైంగిక పరమయిన కోర్కెలతో చెయ్యడం లేదు,యెదటి వాళ్ళని హింసించి ఆనందం పొందే మనస్తత్వం వుంటుంది వాళ్ళలో.ఆ మనస్తత్వం వున్నవాళ్ళు తను కూడా ఆ అపధ్ధతిని ఫాలో అయితే యెలా వుంటుంది అనే రకమయిన ఆలోచనలతో మరింత వుద్రేక పడతారే తప్ప శిక్షలకి భయపదరు.ఇప్పటి వరకూ కోర్టులకి పనికొచ్చే న్యాయసూత్రాల్లో సివిలు,క్రిమినలు అనే రెండు రకాల విభాగాలే వున్నాయి.సివిలు అంటే ఆస్తి తగాఅలు,క్రిమినలు అంటే కక్షలు పెంచుకుని ఒకడి మీద మరొకడు దాది చెయ్యటం.ఈ రకమయిన కొత్త స్వభావం గల నేరాలు అందులో నిర్వచించనడక పోవటం నిర్భయ కేసు న్యాయశాస్త్ర కోవిదుల్లో కూడా యెంత గందరగోళాన్ని రేకెత్తించిందో మనకి తెలిసిందే.ఇప్పటికీ ఆ చట్టాలు పటిష్టంగా రూపు దిద్దుకోలేదు!
మనుషుల తర్వాత కుటుంబ జీవనం సింహాలలోనే బలంగా వుంటుంది.కానీ వాటికి మనలాగా ఎగో ప్రాబ్లెంస్ లేకపోవటంతో అవి చాలా సుఖంగా తమ జీవితాల్ని గడిపేస్తాయి.మనుషులకి కుటుంబ జీవితం యెందుకు అవసరం అంటే మనిషి తప్ప మిగిలిన జంతువులన్నిట్లో పుట్టిన కొద్ది గంటల్లోనే పూర్తి చురుకుగా కదలగలిగి వుంటాయి.కానీ మనుషుల్లో శిశువులు తమ మెడని కూడా యెత్తలేనంత బలహీనంగా వుంటారు.ఆ మెడ కుదరనిదే కనీసం లేచి కూర్చోవడం కూడా సాధ్యపడదు.ఈ బాలారిష్టాలన్నీ గడిచి పూర్తి స్వతంత్రంగా బతకగలగటానికి ఇరవయ్యేళ్ళు పడుతుంది.ఈ కాలమంతా ఆ శిశువుకు పోషణా,భద్రతా,మనోగతమయిన సంస్కారం నేర్పడానికే ఒక స్త్రీ ఒక పురుషుడు ఆజీవపర్యంతం కలిసి బతికే వివాహ వ్యవస్థ యేర్పడింది.కానీ సుఖాల ననుభవించటం మీద వున్న దృష్టి బాధ్యతల్ని స్వీకరించడం మీద వుండనివ్వని ఇప్పటి సంస్కృతి దీన్ని సరిగా సాగనివ్వడం లేదు!ఇప్పుడు మనం ఆలోచిస్తున్న ఈ సమస్యకే కాకుండా ఇప్పటి కాలంలోని స్త్రీ పురుష సంబంధాలు అన్నిటికీ ఇదే మూలకారణం కాబట్ట్టి వివాహ వ్యవస్థని పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం వుంది!
ప్రతి మనిషి వ్యక్తిత్వంలోనూ లైంగికతకు సంబంధించి ఆడ అయినా మగ అయినా "ఐడియల్ షి" మరియూ "ఐడియల్ హి" పట్ల ఆరాధన వుంటుంది.మగవాడు తను ఆ ఐడియల్ హి లాగా వుండాలని అనుకోవటంతో మొదలై వున్నాననే నమ్మకంలో స్థిరపడతాడు.ఈ ఐడీయల్ హి స్థానంలో సాధారణంగా సినిమా హీరోలు వస్తారు,ఆ తర్వాత క్రికెట్ ప్లేయర్లు వస్తారు.ఈ తాదాత్మ్యం వల్లనే కుర్రవాళ్ళు తమ అభిమాన హీరోలకి అంత వెర్రిగా అతని కతౌత్లకి కూడా పాలాభిషేకాలూ గట్రా చేస్తారు.ఐడియల్ హి లో తనని చూసుకుంటే ఐడియల్ షి తనకి భార్యగా రావాలని కోరుకుంటాడు.ఆడవాళ్లలో కూడా ఇలాగే వుంటుంది - తను తన ఐదీయల్ షి తో మమేకమై తన ఐడియల్ హి లాంటి భర్తని కోరుకుంటుంది.కానీ సమాజంలో ఒక ఐడియల్ హి లేక ఐడియల్ షి కనబదక ముందు తప్పనిసరిగా తమ తలిదండ్రులే ఐడియల్ షి మరియూ ఐడియల్ హి స్థానాన్ని ఆక్రమిస్తారు!ఇప్పుడు తను ఐడియల్ హి గా భావించే వ్యక్తి యెలా అయితే ఐడియల్ షి మీద పెత్తనం చేస్తున్నదో తనూ అలాగే చెయ్యాలనుకుంటాడు.తన ఐడియల్ షి యెట్లాగైతే అణకువగా వుంటుందో తనకు కనిపించిన ఆడవాళ్ళూ తనలో స్పందన కలిగించిన ఆడవాళ్ళు కూడా అట్లాగే వుండాలనుకుంటాడు.
కానీ ఇక్కడ కనబడుతున్న వాళ్ళు ధీమాగా కనబడుతున్నారు.పైగా తను వుండాల్సిన చోట మరో మగాదు కనబడుతున్నాడు.మానసికంగా ఒక వైకల్యం మొదలైందీ అంటే అది ఇంక దేన్ని గురించీ ఆలోచించనివ్వదు - సమాజంలో తన స్థానం యేమయినా ఫర్వాలేదు,శిక్షకి గురయి చచ్చిపోయినా ఫర్వాలేదు ముందు తన కోరిల తీర్చుకోవడమే ముఖ్యం అనిపిస్తుంది.ఒక మగవాడు ఒక ఆదదాని ద్వారా లైంగిక సుఖాన్ని పొందడం అనేది బలంగా కనిపిస్తూ వుందతంతో ఈ రకమయిన నేరాలను గురించి ఆలోచించే వాళ్లందరూ వాళ్ళు లైంగిక సుఖాన్ని తీర్చుకోవటం కోసమే వాళ్ళు అత్యాచారం చేస్తున్నారని పొరబడుతున్నారు.వాళ్ళు అప్పటికే ఆడదాన్ని భయపెట్టదం ద్వారానే ఆనందం పొందే స్థితికి యెప్పుడో చేరుకున్నారు గనక లైంగికానుభవం వాళ్ళకి యేమాత్రం ఆనందం కలగజేయదు!భయపెడుతూ, బాధపెడుతూ ఆడవాళ్ళు యేడుస్తుంటే చూడటం లోనే వాళ్ళు ఆనందిస్తారు,అదీ ఈ రకమైన నేరాల అసలు దృశ్యం!ఈ మొత్తం వ్యవహార మంతా ఆ అమ్మాయి ఒంతరిగా కనబదిన క్షణంలో జరిగే మార్పులు అని మీరు నమ్మగలరా?సుదీర్ఘ కాలం పాటు అతను ఆ అమనస్తత్వం లోకి యెదుగుతాడు, తనున్న వాతావరణం అనుకూలంగా వుందటం వల్ల - it is not impulsive crime but an indulging crime?!
మరి వీటిని ఆపడం యెట్లా?నేరం జరిగాక విచారించి తీర్పు ద్వారా ఒకరికి శిక్ష వేసి మరొకరికి కవున్సిలింగులు ఇవ్వడం కన్నా అసలు జరగకుండా ఆపలేమా! అసలు ఈ నేరాలన్నీ యెప్పుడో గానీ యెక్కడో గానీ జరగవు, అందుకే కాబోలు నిత్యం నేరాల మధ్యనే గడిపే పోలీసుల్లో కూడా సరిగ్గా స్పందించలేని అలసత్వం?!ఇప్పుడిప్పుదు ఇలాంటివి పెరగడంతో కొంచెం చురుకుగా స్పందిస్తున్నారు.నూటికి తొంబై శాతం మంది మగవాళ్ళు బుధ్ధిమంతులే!కానీ చెదురుమదురుగా జరిగినా అవి మన మనసుల్లో కలిగించే భీభత్సం చాలా యెక్కువ,అదీగాక నిర్లక్ష్యం చేస్తే అది అలాంటివాళ్లని ప్రోత్సహించి నట్టవుతుంది! ఒకటి మాత్రం నిజం,శిక్షాభయం తప్ప చాగంటి వారి పరవచనాలూ,మల్లాది వారి పురాణ కాలక్షేపాలూ నేరాల్ని తగ్గించలేవు!కాబట్టి కీలెరిగి వాత అన్నట్టు యెవరిని శిక్షించాలి అనేది తెలిసి వీలెరిగి శిక్ష వుండాలి అని నా అభిప్రాయం.
ఈ రకమయిన సన్నివేశాలు వినగానే గగుర్పాటును కలిగించడం వల్ల యెంతటివాళ్ళ నయినా వుద్రేకానికి గురి చేస్తాయి.నేనూ వుద్రేకానికి లోనయి కొన్ని తప్పుడు అభిప్రాయాల్ని సమర్ధించాల్సి వచ్చింది.వచ్చిన విమర్శల్ని చూసి మరోసారి దానికి సంబంధించి విషయసేకరణ చెయ్యగా నాకు నా పొరపాటు యేమిటో తెలిసింది.అలాంటి వాటికి స్పందించాతప్పుడు వుద్రేకపడతంలో అప్పు లేదు.అసలు వుద్రేకపడే లఖణం లేకపోతే స్పందన కూడా వుండదు.కానీ పరిష్కారం గురించి ఆలోచించాల్సినప్పుడు మాత్రం రాగద్వేషాలు లేని నిండుమనస్సుతోనే వుండాలి!శిక్షలతో కన్నా సమాజం ఆలోచించే పధ్ధతుల్ని మార్చడం ద్వారానే వీటిని అరికట్టగలం.దీనికి వ్యక్తిగతంగా కుటుంబ స్థాయిలో మనం పిల్లల పెంపకంలో ఇప్పుడు పాటిస్తున్న దోరణుల్ని మార్చుకోవాలి.ఇక సామాజికంగా చూస్తే శాతిభద్రతలి కాపాడతం నేరాలు జరగకుండా నిరోధించటం అనేది ప్రభుత్వం చెయ్యాల్సిన పని కాబట్టి మంచి ప్రభుత్వాలన్ని సాధించుకోవతం అనే రెంటిలో దేన్నీ తాకువ చెయ్యకుండా రెంటికీ 50-50 ప్రాధాన్యత నివ్వాలి.
వ్యక్తిగతంగా కుటుంబస్థాయిలో మనం పాటిస్తున్న అసమానతలే సమాజం లోనూ వ్యక్తీకరించబడుతున్నప్పుడు మార్పు కూడా కుటుంబ వాతావరణం నుంచే మొదలవ్వాలి.కాబట్టి మగవాడికి ఇప్పటిలా కాకుండా ఆడదానితో సామరస్యంగా ప్రవర్తించి స్త్రీని సంతోష పెట్టగలగడమే నిజమయిన పురుష లక్షణం గానీ భయపెట్టి లొంగదీసుకుని ఆనందించడం కాదు అనే విషయాన్ని బోధపర్చాలి.ఆడపిల్లకి కూడా బెదిరిపోవటం భయపడటం స్త్రీ సహజ లఖణం అని కాకుండా ధైర్యాన్నీ సాహసాన్నె అలవాటు చెయ్యాలి.ఆత్మరక్షణ కోసం పోరాట కళల్ని పరిచయం చెయ్యటం కూడా మంచిదే!అసలైన విషయం యేమిటంటే ఈ నేరాలన్నీ ఒంటరిగా వున్నప్పుడు మాత్రమే జరుగుతున్నాయి.కాబట్టి మగపిల్లల్తో కూడా కలివిడిగా వుండటం అలవాటు చెయ్యాలి.బయట తిరగాల్సి వస్తే వీలున్నంత వరకూ నలుగురైదుగురికి తక్కువగా వుండకుండా తిరగాలి.ఆ నలుగురూ యెటువంటి వాళ్ళో కూడా తలిదండ్రులు తెలుసుకుని తీరాలి.మా అమ్మాయికి వున్న స్నేహితులంతా మాకు తెలుసు.మగపిల్లలు కూడా మా ఇంటికి కూడా వచ్చి గడుపుతారు.మన పిల్లల్ని మనం నమ్మితేనే వాళ్ళూ మనల్ని నమ్మి తమ విషయాలన్నీ మనకి చెబుతారు!ఇలాంటి వాతావరణం వుంటే అలాంటివి జరగవు,జరిగినా కొద్ది సమయంలోనే మళ్ళీ తేరుకోవచ్చు.మన తప్పు లేకుండా జరిగిన ఒక సన్నివేశం జీవితాన్నంతా ప్రభావితం చేసేటంత బలహీనంగా వుండకుండా బతకదం ఇవ్వాళ్టి పరిష్తితుల్లో తప్పనిసరి!
ఇక ఇల్లు దాటి వెళ్తే అది ప్రభుత్వ వ్యవహారం కాబట్టీ మంచి ప్రభుత్వాల నెన్నుకోవడం తప్పని సరి.మంచి ప్రభుత్వాలు మాత్రమే మనం కోరుకున్న రక్షణ ఇవ్వగలవు.కానీ మనం మనపాటికి కులంపేరుతో మతంపేరుతో మనవాణ్ణే అధికారంలో చూడాలనే కులపిచ్చితో వుంటే ఈ భీభత్సాలు అనంతకాలం వరకూ జరుగుతూనే వుంటాయి.కానీ ఆ విషయంలో పరిస్థితి చాలా నిరాశావహంగా వుంది.సామాజిక శాస్త్రవేత్త అనే గురింపు పదాన్ని చేర్చుకుని తింగరి సిధ్ధాంతాలతో కులపిచ్చిని మతపిచ్చిని బాహాటంగా సమర్ధిస్తుంటే నిరక్షరాస్యుల నుంచి వివేకాన్ని యెలా ఆశించగలం?కుల దోపిడీని వ్యతిరేకిస్తూనే కులాల కుమ్ములాటల్ని మేధావులమని చెప్పుకుంటూనే సమర్ధిస్తే కులమతాల కతీతంగా ప్రజలందర్నీ సమానంగా రక్షించే మంచి ప్రభుత్వాలు యెట్లా వస్తాయి?తను కూడా తన కులానికి పెత్తనాన్నే కోరుకుంటూ అవకాశం వుంటే ఇతర కులాల్ని అణగదొక్కే మనస్తత్వంలో వుంటే ఇప్పటి అసమానతల వల్ల లాభపడే కులస్థుల్ని తప్పు పట్టి ప్రయోజన మేమిటి?యెన్నికల్లో నిలబడ్డ తన కులం వాడు అసమర్ధుదయినా తను కోరుకునేది మందబలం కాబట్టి అలాంటి వాళ్ళంతా తప్పనిసరిగా వాళ్ళ కులపోడికే వోటు వేస్తారు గదా!కాబట్టి ఆ రకమయిన మార్పు ఇప్పట్లో సాధ్యపడదు.ప్రభుత్వాల నుంచి శాంతిభద్రతలకి హామీని పొందలేము గనక వ్యక్తిగతంగా మరింత జాగ్రత్తగా వుండటం తప్ప గత్యంతరం లేదు?!
మమతా బెనర్జీ గారి కుడిభుజమో ములాయం సింగు గారి యెడమ భుజమో రేప్ కేసుల్లో ఇరుక్కున్నప్పుదు వాళ్ళు యెలా ప్రవర్తించారో గుర్తుందా?కంచె ఐలయ్య గారి లాంటి వాళ్ళు చెప్పే దళితవాదంతో వచ్చే ప్రభుత్వాలు కూడా అలానే అఘోరిస్తాయి!
డిసెంబర్ 5వ తేదీ రాత్రి స్నేహితులతో కలిసి డిన్నర్ చేసింది.రాత్రి సమయంలో తన స్నేహితుల్ని కానీ సహోద్యోగుల్ని కానీ ఇంటివరకు దింపమని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు.ఇంటికి సురక్షితంగా చేరుకునేందుకు పేరున్న క్యాబ్ అయితే మంచిదనుకుంది.రెండేళ్ళ క్రితం డిసెంబర్ 16వ తేదీన జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత మనదేశంలో వున్న ప్రతి అమ్మాయీ సెక్యూరిటీ విషయంలో యెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తున్నది,తీసుకుంటున్నది.ఇంతకు ముందు చాలాసార్లు తను ఉబర్ క్యాబ్ లో ప్రయాణించింది.అందుకనే ఆ క్యాబ్ సర్వీసు మీద నమ్మకంతో దాన్నే యెంచుకుంది.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అత్యాచారం జరిగింది!అయినా వీటిని గట్టిగా తల్చుకుంటే కంట్రోలు చెయ్యగలిగిన పోలీసు శాఖలోని అధికార్లూ ప్రజల జీవితాలకు రక్షణ కల్పిస్తామని ప్రమానం చేసి పదవుల నలంకరించిన గౌరవనీయులైన మంత్రివర్యులూ తదాదిగా గల అప్రకటిత నపుంసకత్వ రోగపీడితులూ ఆడపిల్లలకే దుస్తుల గురించీ ప్రవర్తన లోని క్రమశిక్షణ గురించీ లెక్చర్లు దంచారు, దంచుతున్నారు, దంచుతారు?
ఆ రోజు రాత్రి రోడ్డు మీద పోలీసు పెట్రోలింగ్ వాహనాలు కనిపించలేదు.తను యెంతగానో నమ్మిన ఉబర్ క్యాబ్ సర్వీసు నేర చరిత్ర ఉన్న వ్యక్తిని డ్రైవర్ గా నియమించింది.తరవాత తెలిసింది యేమిటంటే అంతకు ముందే నిధి షా అనే మహిళా ప్రయాణికురాలు ముద్దాయి అయిన డ్రైవర్ శివకుమార్ యాదవ్ ప్రవర్త్న బాగాలేదని ఫిర్యాదు చేసినా ఉబర్ సంస్థ పట్టించుకోలేదు.అతడిపై ఎటువంటి చర్యా తీసుకోలేదు.వాళ్ళు అప్పుడే సరిగా స్పందించి వుంటే ఈ రోజున తను,తన కుటుంబం బాధపడాల్సిన పరిస్థితియెదురయ్యేది కాదు.ఆ అమ్మాయి లాంటి యెంతోమంది ఆదపిలలు అడుగుతున్న పృఅశ్నలు ఇవి - సోదరుడు,భర్త లేదా యెవరో ఒక మగవాడు తోడుగా లేనిదే ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదా?అమ్మాయిలు ఇంట్లోనే కూర్చోవాలా?ఆడపిల్లలకి బయటికి వెళ్ళేందుకు,ఉద్యోగాలు చేసుకునే హక్కు లేదా!
ఆ అమ్మాయి తనవంతుగా కొన్ని కోరికల్ని చెప్పింది - ఆడవాళ్ళు నడిపే క్యాబ్ లు కావాలి,పెట్రోలింగ్ వాహనాలు,పోలీసుల సంఖ్య యెంత యెక్కువగా పెరిగితే ఆడవాళ్ళకు అంత సురక్షితంగా వున్నామన్న భావన కలుగుతుంది.అమ్మాయిలు ప్రయాణించే క్యాబ్ లను బాగా చెక్ చేయాలి.అలాగే ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి.మనలో యెక్కువమంది యేదయినా విషయంలో జోక్యం చేసుకుంటే పోలీసుల చుట్టూ తిరగాలి,కోర్టు కేసులు వుంటాయని ఆలోచిస్తారు.ఈ అమాయి తల్లికి తన స్నేహితురాలు ఫోన్ చేసి"మీఎరు కేసు ఎందుకు ఫైల్ చేశారు?మీకు చెడ్డ పేరు వస్తుంది!" అని అంటే ఆమె "ఆ పని చేసిన వాళ్ళకి చెడ్డపేరు వస్తుంది కానె మాకెందుకు వస్తుంది" అని జవాబు చెప్పిందట.ఇప్పుడు భారతదేశం పురుషాధిక్య సంస్కృతిలో వుంది.అందుకని ఆడవాళ్ళకు సమానావకాశాలు ఇస్తే మగవాళ్ళు ఆదవళ్ళని చులకనగా చూడటం మానేస్తారు.బుర్రలు సరిగా ఆలోచించాలంటే సరయిన విద్యావిధానం వుండాలి.
మరి ఇంత తెలివి గల ధైర్యమున్న అమ్మాయి అంత భయపడిపోవటానికి కారనమేమిటో తెలుసా?ఆ పశువు లొంగకపోతే రాడ్ వుపయోగిస్తా నన్నాడట?!అంటే పత్రికలలో ఆ పాత సన్నివేశం గురించిన వార్తలు అతడికి అందరూ చేస్తున్న ఆందోళనల్నీ నేరస్తుల పట్ల అసహ్యాన్నీ వాళ్ళకి పడిన శిక్షల్నీ కాకుండా మరో రకమయిన నీలి చిత్రాన్ని చూపించాయన్న మాట!చాలా చిన్నప్పట్నించీ ఈ రకమయిన వార్తల్ని చాలా కుతూహలంతో చదవగా నాకు అర్ధమయినది యేమిటంటే వాళ్ళు ఈ నేరాల్ని చెయ్యడం కేవలం లైంగిక పరమయిన కోర్కెలతో చెయ్యడం లేదు,యెదటి వాళ్ళని హింసించి ఆనందం పొందే మనస్తత్వం వుంటుంది వాళ్ళలో.ఆ మనస్తత్వం వున్నవాళ్ళు తను కూడా ఆ అపధ్ధతిని ఫాలో అయితే యెలా వుంటుంది అనే రకమయిన ఆలోచనలతో మరింత వుద్రేక పడతారే తప్ప శిక్షలకి భయపదరు.ఇప్పటి వరకూ కోర్టులకి పనికొచ్చే న్యాయసూత్రాల్లో సివిలు,క్రిమినలు అనే రెండు రకాల విభాగాలే వున్నాయి.సివిలు అంటే ఆస్తి తగాఅలు,క్రిమినలు అంటే కక్షలు పెంచుకుని ఒకడి మీద మరొకడు దాది చెయ్యటం.ఈ రకమయిన కొత్త స్వభావం గల నేరాలు అందులో నిర్వచించనడక పోవటం నిర్భయ కేసు న్యాయశాస్త్ర కోవిదుల్లో కూడా యెంత గందరగోళాన్ని రేకెత్తించిందో మనకి తెలిసిందే.ఇప్పటికీ ఆ చట్టాలు పటిష్టంగా రూపు దిద్దుకోలేదు!
మనుషుల తర్వాత కుటుంబ జీవనం సింహాలలోనే బలంగా వుంటుంది.కానీ వాటికి మనలాగా ఎగో ప్రాబ్లెంస్ లేకపోవటంతో అవి చాలా సుఖంగా తమ జీవితాల్ని గడిపేస్తాయి.మనుషులకి కుటుంబ జీవితం యెందుకు అవసరం అంటే మనిషి తప్ప మిగిలిన జంతువులన్నిట్లో పుట్టిన కొద్ది గంటల్లోనే పూర్తి చురుకుగా కదలగలిగి వుంటాయి.కానీ మనుషుల్లో శిశువులు తమ మెడని కూడా యెత్తలేనంత బలహీనంగా వుంటారు.ఆ మెడ కుదరనిదే కనీసం లేచి కూర్చోవడం కూడా సాధ్యపడదు.ఈ బాలారిష్టాలన్నీ గడిచి పూర్తి స్వతంత్రంగా బతకగలగటానికి ఇరవయ్యేళ్ళు పడుతుంది.ఈ కాలమంతా ఆ శిశువుకు పోషణా,భద్రతా,మనోగతమయిన సంస్కారం నేర్పడానికే ఒక స్త్రీ ఒక పురుషుడు ఆజీవపర్యంతం కలిసి బతికే వివాహ వ్యవస్థ యేర్పడింది.కానీ సుఖాల ననుభవించటం మీద వున్న దృష్టి బాధ్యతల్ని స్వీకరించడం మీద వుండనివ్వని ఇప్పటి సంస్కృతి దీన్ని సరిగా సాగనివ్వడం లేదు!ఇప్పుడు మనం ఆలోచిస్తున్న ఈ సమస్యకే కాకుండా ఇప్పటి కాలంలోని స్త్రీ పురుష సంబంధాలు అన్నిటికీ ఇదే మూలకారణం కాబట్ట్టి వివాహ వ్యవస్థని పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం వుంది!
ప్రతి మనిషి వ్యక్తిత్వంలోనూ లైంగికతకు సంబంధించి ఆడ అయినా మగ అయినా "ఐడియల్ షి" మరియూ "ఐడియల్ హి" పట్ల ఆరాధన వుంటుంది.మగవాడు తను ఆ ఐడియల్ హి లాగా వుండాలని అనుకోవటంతో మొదలై వున్నాననే నమ్మకంలో స్థిరపడతాడు.ఈ ఐడీయల్ హి స్థానంలో సాధారణంగా సినిమా హీరోలు వస్తారు,ఆ తర్వాత క్రికెట్ ప్లేయర్లు వస్తారు.ఈ తాదాత్మ్యం వల్లనే కుర్రవాళ్ళు తమ అభిమాన హీరోలకి అంత వెర్రిగా అతని కతౌత్లకి కూడా పాలాభిషేకాలూ గట్రా చేస్తారు.ఐడియల్ హి లో తనని చూసుకుంటే ఐడియల్ షి తనకి భార్యగా రావాలని కోరుకుంటాడు.ఆడవాళ్లలో కూడా ఇలాగే వుంటుంది - తను తన ఐదీయల్ షి తో మమేకమై తన ఐడియల్ హి లాంటి భర్తని కోరుకుంటుంది.కానీ సమాజంలో ఒక ఐడియల్ హి లేక ఐడియల్ షి కనబదక ముందు తప్పనిసరిగా తమ తలిదండ్రులే ఐడియల్ షి మరియూ ఐడియల్ హి స్థానాన్ని ఆక్రమిస్తారు!ఇప్పుడు తను ఐడియల్ హి గా భావించే వ్యక్తి యెలా అయితే ఐడియల్ షి మీద పెత్తనం చేస్తున్నదో తనూ అలాగే చెయ్యాలనుకుంటాడు.తన ఐడియల్ షి యెట్లాగైతే అణకువగా వుంటుందో తనకు కనిపించిన ఆడవాళ్ళూ తనలో స్పందన కలిగించిన ఆడవాళ్ళు కూడా అట్లాగే వుండాలనుకుంటాడు.
కానీ ఇక్కడ కనబడుతున్న వాళ్ళు ధీమాగా కనబడుతున్నారు.పైగా తను వుండాల్సిన చోట మరో మగాదు కనబడుతున్నాడు.మానసికంగా ఒక వైకల్యం మొదలైందీ అంటే అది ఇంక దేన్ని గురించీ ఆలోచించనివ్వదు - సమాజంలో తన స్థానం యేమయినా ఫర్వాలేదు,శిక్షకి గురయి చచ్చిపోయినా ఫర్వాలేదు ముందు తన కోరిల తీర్చుకోవడమే ముఖ్యం అనిపిస్తుంది.ఒక మగవాడు ఒక ఆదదాని ద్వారా లైంగిక సుఖాన్ని పొందడం అనేది బలంగా కనిపిస్తూ వుందతంతో ఈ రకమయిన నేరాలను గురించి ఆలోచించే వాళ్లందరూ వాళ్ళు లైంగిక సుఖాన్ని తీర్చుకోవటం కోసమే వాళ్ళు అత్యాచారం చేస్తున్నారని పొరబడుతున్నారు.వాళ్ళు అప్పటికే ఆడదాన్ని భయపెట్టదం ద్వారానే ఆనందం పొందే స్థితికి యెప్పుడో చేరుకున్నారు గనక లైంగికానుభవం వాళ్ళకి యేమాత్రం ఆనందం కలగజేయదు!భయపెడుతూ, బాధపెడుతూ ఆడవాళ్ళు యేడుస్తుంటే చూడటం లోనే వాళ్ళు ఆనందిస్తారు,అదీ ఈ రకమైన నేరాల అసలు దృశ్యం!ఈ మొత్తం వ్యవహార మంతా ఆ అమ్మాయి ఒంతరిగా కనబదిన క్షణంలో జరిగే మార్పులు అని మీరు నమ్మగలరా?సుదీర్ఘ కాలం పాటు అతను ఆ అమనస్తత్వం లోకి యెదుగుతాడు, తనున్న వాతావరణం అనుకూలంగా వుందటం వల్ల - it is not impulsive crime but an indulging crime?!
మరి వీటిని ఆపడం యెట్లా?నేరం జరిగాక విచారించి తీర్పు ద్వారా ఒకరికి శిక్ష వేసి మరొకరికి కవున్సిలింగులు ఇవ్వడం కన్నా అసలు జరగకుండా ఆపలేమా! అసలు ఈ నేరాలన్నీ యెప్పుడో గానీ యెక్కడో గానీ జరగవు, అందుకే కాబోలు నిత్యం నేరాల మధ్యనే గడిపే పోలీసుల్లో కూడా సరిగ్గా స్పందించలేని అలసత్వం?!ఇప్పుడిప్పుదు ఇలాంటివి పెరగడంతో కొంచెం చురుకుగా స్పందిస్తున్నారు.నూటికి తొంబై శాతం మంది మగవాళ్ళు బుధ్ధిమంతులే!కానీ చెదురుమదురుగా జరిగినా అవి మన మనసుల్లో కలిగించే భీభత్సం చాలా యెక్కువ,అదీగాక నిర్లక్ష్యం చేస్తే అది అలాంటివాళ్లని ప్రోత్సహించి నట్టవుతుంది! ఒకటి మాత్రం నిజం,శిక్షాభయం తప్ప చాగంటి వారి పరవచనాలూ,మల్లాది వారి పురాణ కాలక్షేపాలూ నేరాల్ని తగ్గించలేవు!కాబట్టి కీలెరిగి వాత అన్నట్టు యెవరిని శిక్షించాలి అనేది తెలిసి వీలెరిగి శిక్ష వుండాలి అని నా అభిప్రాయం.
ఈ రకమయిన సన్నివేశాలు వినగానే గగుర్పాటును కలిగించడం వల్ల యెంతటివాళ్ళ నయినా వుద్రేకానికి గురి చేస్తాయి.నేనూ వుద్రేకానికి లోనయి కొన్ని తప్పుడు అభిప్రాయాల్ని సమర్ధించాల్సి వచ్చింది.వచ్చిన విమర్శల్ని చూసి మరోసారి దానికి సంబంధించి విషయసేకరణ చెయ్యగా నాకు నా పొరపాటు యేమిటో తెలిసింది.అలాంటి వాటికి స్పందించాతప్పుడు వుద్రేకపడతంలో అప్పు లేదు.అసలు వుద్రేకపడే లఖణం లేకపోతే స్పందన కూడా వుండదు.కానీ పరిష్కారం గురించి ఆలోచించాల్సినప్పుడు మాత్రం రాగద్వేషాలు లేని నిండుమనస్సుతోనే వుండాలి!శిక్షలతో కన్నా సమాజం ఆలోచించే పధ్ధతుల్ని మార్చడం ద్వారానే వీటిని అరికట్టగలం.దీనికి వ్యక్తిగతంగా కుటుంబ స్థాయిలో మనం పిల్లల పెంపకంలో ఇప్పుడు పాటిస్తున్న దోరణుల్ని మార్చుకోవాలి.ఇక సామాజికంగా చూస్తే శాతిభద్రతలి కాపాడతం నేరాలు జరగకుండా నిరోధించటం అనేది ప్రభుత్వం చెయ్యాల్సిన పని కాబట్టి మంచి ప్రభుత్వాలన్ని సాధించుకోవతం అనే రెంటిలో దేన్నీ తాకువ చెయ్యకుండా రెంటికీ 50-50 ప్రాధాన్యత నివ్వాలి.
వ్యక్తిగతంగా కుటుంబస్థాయిలో మనం పాటిస్తున్న అసమానతలే సమాజం లోనూ వ్యక్తీకరించబడుతున్నప్పుడు మార్పు కూడా కుటుంబ వాతావరణం నుంచే మొదలవ్వాలి.కాబట్టి మగవాడికి ఇప్పటిలా కాకుండా ఆడదానితో సామరస్యంగా ప్రవర్తించి స్త్రీని సంతోష పెట్టగలగడమే నిజమయిన పురుష లక్షణం గానీ భయపెట్టి లొంగదీసుకుని ఆనందించడం కాదు అనే విషయాన్ని బోధపర్చాలి.ఆడపిల్లకి కూడా బెదిరిపోవటం భయపడటం స్త్రీ సహజ లఖణం అని కాకుండా ధైర్యాన్నీ సాహసాన్నె అలవాటు చెయ్యాలి.ఆత్మరక్షణ కోసం పోరాట కళల్ని పరిచయం చెయ్యటం కూడా మంచిదే!అసలైన విషయం యేమిటంటే ఈ నేరాలన్నీ ఒంటరిగా వున్నప్పుడు మాత్రమే జరుగుతున్నాయి.కాబట్టి మగపిల్లల్తో కూడా కలివిడిగా వుండటం అలవాటు చెయ్యాలి.బయట తిరగాల్సి వస్తే వీలున్నంత వరకూ నలుగురైదుగురికి తక్కువగా వుండకుండా తిరగాలి.ఆ నలుగురూ యెటువంటి వాళ్ళో కూడా తలిదండ్రులు తెలుసుకుని తీరాలి.మా అమ్మాయికి వున్న స్నేహితులంతా మాకు తెలుసు.మగపిల్లలు కూడా మా ఇంటికి కూడా వచ్చి గడుపుతారు.మన పిల్లల్ని మనం నమ్మితేనే వాళ్ళూ మనల్ని నమ్మి తమ విషయాలన్నీ మనకి చెబుతారు!ఇలాంటి వాతావరణం వుంటే అలాంటివి జరగవు,జరిగినా కొద్ది సమయంలోనే మళ్ళీ తేరుకోవచ్చు.మన తప్పు లేకుండా జరిగిన ఒక సన్నివేశం జీవితాన్నంతా ప్రభావితం చేసేటంత బలహీనంగా వుండకుండా బతకదం ఇవ్వాళ్టి పరిష్తితుల్లో తప్పనిసరి!
ఇక ఇల్లు దాటి వెళ్తే అది ప్రభుత్వ వ్యవహారం కాబట్టీ మంచి ప్రభుత్వాల నెన్నుకోవడం తప్పని సరి.మంచి ప్రభుత్వాలు మాత్రమే మనం కోరుకున్న రక్షణ ఇవ్వగలవు.కానీ మనం మనపాటికి కులంపేరుతో మతంపేరుతో మనవాణ్ణే అధికారంలో చూడాలనే కులపిచ్చితో వుంటే ఈ భీభత్సాలు అనంతకాలం వరకూ జరుగుతూనే వుంటాయి.కానీ ఆ విషయంలో పరిస్థితి చాలా నిరాశావహంగా వుంది.సామాజిక శాస్త్రవేత్త అనే గురింపు పదాన్ని చేర్చుకుని తింగరి సిధ్ధాంతాలతో కులపిచ్చిని మతపిచ్చిని బాహాటంగా సమర్ధిస్తుంటే నిరక్షరాస్యుల నుంచి వివేకాన్ని యెలా ఆశించగలం?కుల దోపిడీని వ్యతిరేకిస్తూనే కులాల కుమ్ములాటల్ని మేధావులమని చెప్పుకుంటూనే సమర్ధిస్తే కులమతాల కతీతంగా ప్రజలందర్నీ సమానంగా రక్షించే మంచి ప్రభుత్వాలు యెట్లా వస్తాయి?తను కూడా తన కులానికి పెత్తనాన్నే కోరుకుంటూ అవకాశం వుంటే ఇతర కులాల్ని అణగదొక్కే మనస్తత్వంలో వుంటే ఇప్పటి అసమానతల వల్ల లాభపడే కులస్థుల్ని తప్పు పట్టి ప్రయోజన మేమిటి?యెన్నికల్లో నిలబడ్డ తన కులం వాడు అసమర్ధుదయినా తను కోరుకునేది మందబలం కాబట్టి అలాంటి వాళ్ళంతా తప్పనిసరిగా వాళ్ళ కులపోడికే వోటు వేస్తారు గదా!కాబట్టి ఆ రకమయిన మార్పు ఇప్పట్లో సాధ్యపడదు.ప్రభుత్వాల నుంచి శాంతిభద్రతలకి హామీని పొందలేము గనక వ్యక్తిగతంగా మరింత జాగ్రత్తగా వుండటం తప్ప గత్యంతరం లేదు?!
మమతా బెనర్జీ గారి కుడిభుజమో ములాయం సింగు గారి యెడమ భుజమో రేప్ కేసుల్లో ఇరుక్కున్నప్పుదు వాళ్ళు యెలా ప్రవర్తించారో గుర్తుందా?కంచె ఐలయ్య గారి లాంటి వాళ్ళు చెప్పే దళితవాదంతో వచ్చే ప్రభుత్వాలు కూడా అలానే అఘోరిస్తాయి!