Tuesday, 6 January 2015

శిక్షాభయం కూడా లేకుండా కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళ మీద బలాత్కార ప్రయత్నం యెందుకు చేస్తున్నారు?

          గత యేడాది డిసెంబర్ నెలలో ఒక ఉబర్ క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్లో ప్రయాణిస్తున్న ఒక మహిళపై అత్యాచారం జరిపాడు.ఆ అమ్మాయి ఆ సంఘటనకు ముందు చాలా ధైర్యస్తురాలు.2012 డిసెంబర్ గ్యాంగ్ రేప్ ఘటన తరవాత వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడమే కాకుండా తన కుటుంబాన్ని,స్నేహితుల్ని కూడా నిరసనలో పాల్గొనేలా ప్రేరేపించిన మనిషి!అంత ధైర్యం గల మనిషి కూడా కౌన్సిలింగ్ అవసరమయ్యేటంతగా యెందుకు భయపడిపోయింది?

          డిసెంబర్ 5వ తేదీ రాత్రి స్నేహితులతో కలిసి డిన్నర్ చేసింది.రాత్రి సమయంలో తన స్నేహితుల్ని కానీ సహోద్యోగుల్ని కానీ ఇంటివరకు దింపమని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు.ఇంటికి సురక్షితంగా చేరుకునేందుకు పేరున్న క్యాబ్ అయితే మంచిదనుకుంది.రెండేళ్ళ క్రితం డిసెంబర్ 16వ తేదీన జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత మనదేశంలో వున్న ప్రతి అమ్మాయీ సెక్యూరిటీ విషయంలో యెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తున్నది,తీసుకుంటున్నది.ఇంతకు ముందు చాలాసార్లు తను ఉబర్ క్యాబ్ లో ప్రయాణించింది.అందుకనే ఆ క్యాబ్ సర్వీసు మీద నమ్మకంతో దాన్నే యెంచుకుంది.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అత్యాచారం జరిగింది!అయినా వీటిని గట్టిగా తల్చుకుంటే కంట్రోలు చెయ్యగలిగిన పోలీసు శాఖలోని అధికార్లూ  ప్రజల జీవితాలకు రక్షణ కల్పిస్తామని ప్రమానం చేసి పదవుల నలంకరించిన గౌరవనీయులైన మంత్రివర్యులూ తదాదిగా గల అప్రకటిత నపుంసకత్వ రోగపీడితులూ ఆడపిల్లలకే దుస్తుల గురించీ ప్రవర్తన లోని క్రమశిక్షణ గురించీ లెక్చర్లు దంచారు, దంచుతున్నారు, దంచుతారు?

          ఆ రోజు రాత్రి రోడ్డు మీద పోలీసు పెట్రోలింగ్ వాహనాలు కనిపించలేదు.తను యెంతగానో నమ్మిన ఉబర్ క్యాబ్ సర్వీసు నేర చరిత్ర ఉన్న వ్యక్తిని డ్రైవర్ గా నియమించింది.తరవాత తెలిసింది యేమిటంటే అంతకు ముందే నిధి షా అనే మహిళా ప్రయాణికురాలు ముద్దాయి అయిన డ్రైవర్ శివకుమార్ యాదవ్ ప్రవర్త్న బాగాలేదని ఫిర్యాదు చేసినా ఉబర్ సంస్థ పట్టించుకోలేదు.అతడిపై ఎటువంటి చర్యా తీసుకోలేదు.వాళ్ళు అప్పుడే సరిగా స్పందించి వుంటే ఈ రోజున తను,తన కుటుంబం బాధపడాల్సిన పరిస్థితియెదురయ్యేది కాదు.ఆ అమ్మాయి లాంటి యెంతోమంది ఆదపిలలు అడుగుతున్న పృఅశ్నలు ఇవి - సోదరుడు,భర్త లేదా యెవరో ఒక మగవాడు తోడుగా లేనిదే ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదా?అమ్మాయిలు ఇంట్లోనే కూర్చోవాలా?ఆడపిల్లలకి బయటికి వెళ్ళేందుకు,ఉద్యోగాలు చేసుకునే హక్కు లేదా!

          ఆ అమ్మాయి తనవంతుగా కొన్ని కోరికల్ని చెప్పింది - ఆడవాళ్ళు నడిపే క్యాబ్ లు కావాలి,పెట్రోలింగ్ వాహనాలు,పోలీసుల సంఖ్య యెంత యెక్కువగా పెరిగితే ఆడవాళ్ళకు అంత సురక్షితంగా వున్నామన్న భావన కలుగుతుంది.అమ్మాయిలు ప్రయాణించే క్యాబ్ లను బాగా చెక్ చేయాలి.అలాగే ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి.మనలో యెక్కువమంది యేదయినా విషయంలో జోక్యం చేసుకుంటే పోలీసుల చుట్టూ తిరగాలి,కోర్టు కేసులు వుంటాయని ఆలోచిస్తారు.ఈ అమాయి తల్లికి తన స్నేహితురాలు ఫోన్ చేసి"మీఎరు కేసు ఎందుకు ఫైల్ చేశారు?మీకు చెడ్డ పేరు వస్తుంది!" అని అంటే ఆమె "ఆ పని చేసిన వాళ్ళకి చెడ్డపేరు వస్తుంది కానె మాకెందుకు వస్తుంది" అని జవాబు చెప్పిందట.ఇప్పుడు భారతదేశం పురుషాధిక్య సంస్కృతిలో వుంది.అందుకని ఆడవాళ్ళకు సమానావకాశాలు ఇస్తే మగవాళ్ళు ఆదవళ్ళని చులకనగా చూడటం మానేస్తారు.బుర్రలు సరిగా ఆలోచించాలంటే సరయిన విద్యావిధానం వుండాలి.

          మరి ఇంత తెలివి గల ధైర్యమున్న అమ్మాయి అంత భయపడిపోవటానికి కారనమేమిటో తెలుసా?ఆ పశువు లొంగకపోతే రాడ్ వుపయోగిస్తా నన్నాడట?!అంటే పత్రికలలో ఆ పాత సన్నివేశం గురించిన వార్తలు అతడికి అందరూ చేస్తున్న ఆందోళనల్నీ నేరస్తుల పట్ల అసహ్యాన్నీ వాళ్ళకి పడిన శిక్షల్నీ కాకుండా మరో రకమయిన నీలి చిత్రాన్ని చూపించాయన్న మాట!చాలా చిన్నప్పట్నించీ ఈ రకమయిన వార్తల్ని చాలా కుతూహలంతో చదవగా నాకు అర్ధమయినది యేమిటంటే వాళ్ళు ఈ నేరాల్ని చెయ్యడం కేవలం లైంగిక పరమయిన కోర్కెలతో చెయ్యడం లేదు,యెదటి వాళ్ళని హింసించి ఆనందం పొందే మనస్తత్వం వుంటుంది వాళ్ళలో.ఆ మనస్తత్వం వున్నవాళ్ళు తను కూడా ఆ అపధ్ధతిని ఫాలో అయితే యెలా వుంటుంది అనే రకమయిన ఆలోచనలతో మరింత వుద్రేక పడతారే తప్ప  శిక్షలకి భయపదరు.ఇప్పటి వరకూ కోర్టులకి పనికొచ్చే న్యాయసూత్రాల్లో సివిలు,క్రిమినలు అనే రెండు రకాల విభాగాలే వున్నాయి.సివిలు అంటే ఆస్తి తగాఅలు,క్రిమినలు అంటే కక్షలు పెంచుకుని ఒకడి మీద మరొకడు దాది చెయ్యటం.ఈ రకమయిన కొత్త స్వభావం గల నేరాలు అందులో నిర్వచించనడక పోవటం నిర్భయ కేసు న్యాయశాస్త్ర కోవిదుల్లో కూడా యెంత గందరగోళాన్ని రేకెత్తించిందో మనకి తెలిసిందే.ఇప్పటికీ ఆ చట్టాలు పటిష్టంగా రూపు దిద్దుకోలేదు!

          మనుషుల తర్వాత కుటుంబ జీవనం సింహాలలోనే బలంగా వుంటుంది.కానీ వాటికి మనలాగా ఎగో ప్రాబ్లెంస్ లేకపోవటంతో అవి చాలా సుఖంగా తమ జీవితాల్ని గడిపేస్తాయి.మనుషులకి కుటుంబ జీవితం యెందుకు అవసరం అంటే మనిషి తప్ప మిగిలిన జంతువులన్నిట్లో పుట్టిన కొద్ది గంటల్లోనే పూర్తి చురుకుగా కదలగలిగి వుంటాయి.కానీ మనుషుల్లో శిశువులు తమ మెడని కూడా యెత్తలేనంత బలహీనంగా వుంటారు.ఆ మెడ కుదరనిదే కనీసం లేచి కూర్చోవడం కూడా సాధ్యపడదు.ఈ బాలారిష్టాలన్నీ గడిచి పూర్తి స్వతంత్రంగా బతకగలగటానికి ఇరవయ్యేళ్ళు పడుతుంది.ఈ కాలమంతా ఆ శిశువుకు పోషణా,భద్రతా,మనోగతమయిన సంస్కారం నేర్పడానికే ఒక స్త్రీ ఒక పురుషుడు ఆజీవపర్యంతం కలిసి బతికే వివాహ వ్యవస్థ యేర్పడింది.కానీ సుఖాల ననుభవించటం మీద వున్న దృష్టి బాధ్యతల్ని స్వీకరించడం మీద వుండనివ్వని ఇప్పటి సంస్కృతి దీన్ని సరిగా సాగనివ్వడం లేదు!ఇప్పుడు మనం ఆలోచిస్తున్న ఈ సమస్యకే కాకుండా ఇప్పటి కాలంలోని స్త్రీ పురుష సంబంధాలు అన్నిటికీ ఇదే మూలకారణం కాబట్ట్టి వివాహ వ్యవస్థని పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం వుంది!

          ప్రతి మనిషి వ్యక్తిత్వంలోనూ లైంగికతకు సంబంధించి ఆడ అయినా మగ అయినా "ఐడియల్ షి" మరియూ "ఐడియల్ హి" పట్ల ఆరాధన వుంటుంది.మగవాడు తను ఆ ఐడియల్ హి లాగా వుండాలని అనుకోవటంతో మొదలై వున్నాననే నమ్మకంలో స్థిరపడతాడు.ఈ ఐడీయల్ హి స్థానంలో సాధారణంగా సినిమా హీరోలు వస్తారు,ఆ తర్వాత క్రికెట్ ప్లేయర్లు వస్తారు.ఈ తాదాత్మ్యం వల్లనే కుర్రవాళ్ళు తమ అభిమాన హీరోలకి అంత వెర్రిగా అతని కతౌత్లకి కూడా పాలాభిషేకాలూ గట్రా చేస్తారు.ఐడియల్ హి లో తనని చూసుకుంటే ఐడియల్ షి తనకి భార్యగా రావాలని కోరుకుంటాడు.ఆడవాళ్లలో కూడా ఇలాగే వుంటుంది - తను తన ఐదీయల్ షి తో మమేకమై తన ఐడియల్ హి లాంటి భర్తని కోరుకుంటుంది.కానీ సమాజంలో ఒక ఐడియల్ హి లేక ఐడియల్ షి కనబదక ముందు తప్పనిసరిగా తమ తలిదండ్రులే ఐడియల్ షి మరియూ ఐడియల్ హి స్థానాన్ని ఆక్రమిస్తారు!ఇప్పుడు తను ఐడియల్ హి గా భావించే వ్యక్తి యెలా అయితే ఐడియల్ షి మీద పెత్తనం చేస్తున్నదో తనూ అలాగే చెయ్యాలనుకుంటాడు.తన ఐడియల్ షి యెట్లాగైతే అణకువగా వుంటుందో తనకు కనిపించిన ఆడవాళ్ళూ తనలో స్పందన కలిగించిన ఆడవాళ్ళు కూడా అట్లాగే వుండాలనుకుంటాడు.

          కానీ ఇక్కడ కనబడుతున్న వాళ్ళు ధీమాగా కనబడుతున్నారు.పైగా తను వుండాల్సిన చోట మరో మగాదు కనబడుతున్నాడు.మానసికంగా ఒక వైకల్యం మొదలైందీ అంటే అది ఇంక దేన్ని గురించీ ఆలోచించనివ్వదు - సమాజంలో తన స్థానం యేమయినా ఫర్వాలేదు,శిక్షకి గురయి చచ్చిపోయినా ఫర్వాలేదు ముందు తన కోరిల తీర్చుకోవడమే ముఖ్యం అనిపిస్తుంది.ఒక మగవాడు ఒక ఆదదాని ద్వారా లైంగిక సుఖాన్ని పొందడం అనేది బలంగా కనిపిస్తూ వుందతంతో ఈ రకమయిన నేరాలను గురించి ఆలోచించే వాళ్లందరూ వాళ్ళు లైంగిక సుఖాన్ని తీర్చుకోవటం కోసమే వాళ్ళు అత్యాచారం చేస్తున్నారని పొరబడుతున్నారు.వాళ్ళు అప్పటికే ఆడదాన్ని భయపెట్టదం ద్వారానే ఆనందం పొందే స్థితికి యెప్పుడో చేరుకున్నారు గనక లైంగికానుభవం వాళ్ళకి యేమాత్రం ఆనందం కలగజేయదు!భయపెడుతూ, బాధపెడుతూ ఆడవాళ్ళు యేడుస్తుంటే చూడటం లోనే వాళ్ళు ఆనందిస్తారు,అదీ ఈ రకమైన నేరాల అసలు దృశ్యం!ఈ మొత్తం వ్యవహార మంతా ఆ అమ్మాయి ఒంతరిగా కనబదిన క్షణంలో జరిగే మార్పులు అని మీరు నమ్మగలరా?సుదీర్ఘ కాలం పాటు అతను ఆ అమనస్తత్వం లోకి యెదుగుతాడు, తనున్న వాతావరణం అనుకూలంగా వుందటం వల్ల -  it is not impulsive crime but an indulging crime?!

          మరి వీటిని ఆపడం యెట్లా?నేరం జరిగాక విచారించి తీర్పు ద్వారా ఒకరికి శిక్ష వేసి మరొకరికి కవున్సిలింగులు ఇవ్వడం కన్నా అసలు జరగకుండా ఆపలేమా! అసలు ఈ నేరాలన్నీ యెప్పుడో గానీ యెక్కడో గానీ జరగవు, అందుకే కాబోలు నిత్యం నేరాల మధ్యనే గడిపే పోలీసుల్లో కూడా సరిగ్గా స్పందించలేని అలసత్వం?!ఇప్పుడిప్పుదు ఇలాంటివి పెరగడంతో కొంచెం చురుకుగా స్పందిస్తున్నారు.నూటికి తొంబై శాతం మంది మగవాళ్ళు బుధ్ధిమంతులే!కానీ చెదురుమదురుగా జరిగినా అవి మన మనసుల్లో కలిగించే భీభత్సం చాలా యెక్కువ,అదీగాక నిర్లక్ష్యం చేస్తే అది అలాంటివాళ్లని ప్రోత్సహించి నట్టవుతుంది! ఒకటి మాత్రం నిజం,శిక్షాభయం తప్ప చాగంటి వారి పరవచనాలూ,మల్లాది వారి పురాణ కాలక్షేపాలూ నేరాల్ని తగ్గించలేవు!కాబట్టి కీలెరిగి వాత అన్నట్టు యెవరిని శిక్షించాలి అనేది తెలిసి వీలెరిగి శిక్ష వుండాలి అని నా అభిప్రాయం.

          ఈ రకమయిన సన్నివేశాలు వినగానే గగుర్పాటును కలిగించడం వల్ల యెంతటివాళ్ళ నయినా వుద్రేకానికి గురి చేస్తాయి.నేనూ వుద్రేకానికి లోనయి కొన్ని తప్పుడు అభిప్రాయాల్ని సమర్ధించాల్సి వచ్చింది.వచ్చిన విమర్శల్ని చూసి మరోసారి దానికి సంబంధించి విషయసేకరణ చెయ్యగా నాకు నా పొరపాటు యేమిటో తెలిసింది.అలాంటి వాటికి స్పందించాతప్పుడు వుద్రేకపడతంలో అప్పు లేదు.అసలు వుద్రేకపడే లఖణం లేకపోతే స్పందన కూడా వుండదు.కానీ పరిష్కారం గురించి ఆలోచించాల్సినప్పుడు మాత్రం రాగద్వేషాలు లేని నిండుమనస్సుతోనే వుండాలి!శిక్షలతో కన్నా సమాజం ఆలోచించే పధ్ధతుల్ని మార్చడం ద్వారానే వీటిని అరికట్టగలం.దీనికి వ్యక్తిగతంగా కుటుంబ స్థాయిలో మనం పిల్లల పెంపకంలో ఇప్పుడు పాటిస్తున్న దోరణుల్ని మార్చుకోవాలి.ఇక సామాజికంగా చూస్తే శాతిభద్రతలి కాపాడతం నేరాలు జరగకుండా నిరోధించటం అనేది ప్రభుత్వం చెయ్యాల్సిన పని కాబట్టి మంచి ప్రభుత్వాలన్ని సాధించుకోవతం అనే రెంటిలో దేన్నీ తాకువ చెయ్యకుండా రెంటికీ 50-50 ప్రాధాన్యత నివ్వాలి.

      వ్యక్తిగతంగా కుటుంబస్థాయిలో మనం పాటిస్తున్న అసమానతలే సమాజం లోనూ వ్యక్తీకరించబడుతున్నప్పుడు మార్పు కూడా కుటుంబ వాతావరణం నుంచే మొదలవ్వాలి.కాబట్టి మగవాడికి ఇప్పటిలా కాకుండా ఆడదానితో సామరస్యంగా ప్రవర్తించి స్త్రీని సంతోష పెట్టగలగడమే నిజమయిన పురుష లక్షణం గానీ భయపెట్టి లొంగదీసుకుని ఆనందించడం కాదు అనే విషయాన్ని బోధపర్చాలి.ఆడపిల్లకి కూడా బెదిరిపోవటం భయపడటం స్త్రీ సహజ లఖణం అని కాకుండా ధైర్యాన్నీ సాహసాన్నె అలవాటు చెయ్యాలి.ఆత్మరక్షణ కోసం పోరాట కళల్ని పరిచయం చెయ్యటం కూడా మంచిదే!అసలైన విషయం యేమిటంటే ఈ నేరాలన్నీ ఒంటరిగా వున్నప్పుడు మాత్రమే జరుగుతున్నాయి.కాబట్టి మగపిల్లల్తో కూడా కలివిడిగా వుండటం అలవాటు చెయ్యాలి.బయట తిరగాల్సి వస్తే వీలున్నంత వరకూ నలుగురైదుగురికి తక్కువగా వుండకుండా తిరగాలి.ఆ నలుగురూ యెటువంటి వాళ్ళో కూడా తలిదండ్రులు తెలుసుకుని తీరాలి.మా అమ్మాయికి వున్న స్నేహితులంతా మాకు తెలుసు.మగపిల్లలు కూడా మా ఇంటికి కూడా వచ్చి గడుపుతారు.మన పిల్లల్ని మనం నమ్మితేనే వాళ్ళూ మనల్ని నమ్మి తమ విషయాలన్నీ మనకి చెబుతారు!ఇలాంటి వాతావరణం వుంటే అలాంటివి జరగవు,జరిగినా కొద్ది సమయంలోనే మళ్ళీ తేరుకోవచ్చు.మన తప్పు లేకుండా జరిగిన ఒక సన్నివేశం జీవితాన్నంతా ప్రభావితం చేసేటంత బలహీనంగా వుండకుండా బతకదం ఇవ్వాళ్టి పరిష్తితుల్లో తప్పనిసరి!

          ఇక ఇల్లు దాటి వెళ్తే అది ప్రభుత్వ వ్యవహారం కాబట్టీ మంచి ప్రభుత్వాల నెన్నుకోవడం తప్పని సరి.మంచి ప్రభుత్వాలు మాత్రమే మనం కోరుకున్న రక్షణ ఇవ్వగలవు.కానీ మనం మనపాటికి కులంపేరుతో మతంపేరుతో మనవాణ్ణే అధికారంలో చూడాలనే కులపిచ్చితో వుంటే ఈ భీభత్సాలు అనంతకాలం వరకూ జరుగుతూనే వుంటాయి.కానీ ఆ విషయంలో పరిస్థితి చాలా నిరాశావహంగా వుంది.సామాజిక శాస్త్రవేత్త అనే గురింపు పదాన్ని చేర్చుకుని తింగరి సిధ్ధాంతాలతో కులపిచ్చిని మతపిచ్చిని బాహాటంగా సమర్ధిస్తుంటే నిరక్షరాస్యుల నుంచి వివేకాన్ని యెలా ఆశించగలం?కుల దోపిడీని వ్యతిరేకిస్తూనే కులాల కుమ్ములాటల్ని మేధావులమని చెప్పుకుంటూనే సమర్ధిస్తే కులమతాల కతీతంగా ప్రజలందర్నీ సమానంగా రక్షించే మంచి ప్రభుత్వాలు యెట్లా వస్తాయి?తను కూడా తన కులానికి పెత్తనాన్నే కోరుకుంటూ అవకాశం వుంటే ఇతర కులాల్ని అణగదొక్కే మనస్తత్వంలో వుంటే ఇప్పటి అసమానతల వల్ల లాభపడే కులస్థుల్ని తప్పు పట్టి ప్రయోజన మేమిటి?యెన్నికల్లో నిలబడ్డ తన కులం వాడు అసమర్ధుదయినా తను కోరుకునేది మందబలం కాబట్టి అలాంటి వాళ్ళంతా తప్పనిసరిగా వాళ్ళ కులపోడికే వోటు వేస్తారు గదా!కాబట్టి ఆ రకమయిన మార్పు ఇప్పట్లో సాధ్యపడదు.ప్రభుత్వాల నుంచి శాంతిభద్రతలకి హామీని పొందలేము గనక వ్యక్తిగతంగా మరింత జాగ్రత్తగా వుండటం తప్ప గత్యంతరం లేదు?!

         మమతా బెనర్జీ గారి  కుడిభుజమో ములాయం సింగు గారి యెడమ భుజమో రేప్ కేసుల్లో ఇరుక్కున్నప్పుదు వాళ్ళు యెలా ప్రవర్తించారో గుర్తుందా?కంచె ఐలయ్య గారి లాంటి వాళ్ళు చెప్పే దళితవాదంతో వచ్చే ప్రభుత్వాలు కూడా అలానే అఘోరిస్తాయి!

Sunday, 4 January 2015

వీళ్ళు యేమి చదివారు?ఆ చదువు యేమి సంస్కారం నేర్పింది?



          యాబై అరవై యేళ్ళుగా తెలంగాణాకి ద్రోహం జరగడంలో తెలంగాణా రాజకీయవేత్తల ప్రమెయమే యెక్కువని అంత కాలం రాజకీయ జీవితం గడిపాక కూడా ఇతనికి నిజంగానే తెలియదా? ఈ మనుషుల బ్రోకరేజి వ్యాపారం చేసి పైకొచ్చిన వాడు పెద్ద నీతిమంతుదిలా పోజులు కొడుతూ ఆంధ్రా రాజకీయ వేత్తల్ని మాత్రమే అంటున్నాను సామాన్యుల్ని కాదు అని యెంత సమర్ధించుకున్నా కొన్ని లక్షల కోట్ల మంది ముందు సభావేదికల మీద పచ్చి బూతుల్ని కూడా అవి బూతులు కాదని తెగబడి యెలా మాట్లాడ గలిగాడు?

       ఇంతకు ముందు మాతృ రాష్ట్రం నుంచి విడిపోయిన రాష్ట్రాలు మొదట విడిపోవటానికి సభలో మెజారిటీ మైనారిటీ లెక్కలతో కొలిస్తే అంకెకి తక్కువే అయినా తమ శాసన సభలోనే విభజన ప్రతిపాదన చేసి ప్రతికక్షుల్ని కూడా వొప్పించి సోదర రాష్ట్రాలు రెండూ సాదరంగా విడిపోయాయని తెలిసి కూడా ఇక్కడ మేము అంకెకి తక్కువున్నాం మాకు న్యాయం జరగదు అని ఆర్టికిల్ మూడుని భుజానేసుకుని యెందుకు తిరిగాడు?ఆంధ్రోళ్ళని తిడుతూ విడిపోయే అమర్యాద కరమయిన పధ్ధతిలోనే తెలంగాణా తీసుకురావాలనే వూహ యెలా వచ్చింది ఇతనికి?

           ఒకసారి వాహనాల చట్టంప్రకారం రిజిస్టరు చేయబడిన వాహనానికి రెండవ రిజిస్ట్రేషన్ అనే చెత్త వూహ యెలా వచ్చింది?వాహనాల చట్టంలో యేమయినా అస్పష్టత వున్నదా?లేదే, కోర్టు ముక్క చివాట్లు పెట్టింది గదా?అప్పటికీ వెనక్కి తగ్గకుండా వాహనం మీద వుండే నంబరు ప్లేటు మీద మాత్రం మారిస్తే చాలుననే మొదటిదాని కన్నా చెత్త వూహ యెలా వచ్చింది?హత్యలూ దోపిడీలూ చేసి పారిపోయే వాళ్ళు చేసినట్టు యే వాహన యజమాని అయినా తప్పు నంబరు వాహనం మీద వేస్తే ట్రాఫిక్ పోలీసులు చూస్తూ వూరుకుంటారా?అలా వూరుకోమని ప్రభుత్వాధినేతగా లిఖిత పూర్వకంగా పోలీసులకి ఆదేశాలు జారీ చెయ్యగలడా?




       తెలంగాణా సిటిజన్ కార్డు గురించి మాట్లాడేటప్పుడు ఈ దేశమలో దేశమంతటా ఒకే రకమయిన పౌరసత్వం వుంటుందనీ యే రాష్ట్రంలోనూ రాష్ట్రం పేరుతో పౌరసత్వపు కార్డులు లేవనీ నిజంగానే తెలియదా?పదో తరగతి వరకూ జాగర్ఫీ, హిస్టరీ, సివిక్సు అనే పాఠాలు చదివిన వాళ్ళేవరికయినా తెలిసే విషయం ఈవిడ కెందుకు తెలియలేదు?

        ఒకప్పుడు దెయ్యాలకి భయపడి జనాలు "ఓ స్త్రీ రేపు రా" అని రాసుకున్నట్టు తెలంగాణాలో వుండాలనుకున్న ఆంధ్రా వాళ్ళంతా ఇంటి తలుపుల మీద ఆ విషయం ప్రత్యేకంగా వుల్లేఖించాలని యెలా అనగలిగింది?అది తెలంగాణేతరు లందరికీ చెప్పిందా,ఆంధ్రావాళ్లకి మాత్రమేనా?రాజ్యాంగ బధ్ధంగా యెన్నికయిన వాళ్ళు ఇలాంతి అసమానతల్ని ప్రజలకి ఆదేశించటం కుదరదని నిజంగానే తెలియదా??అంతకాలం మేము రాజకీయ నాయకులనే ద్వేషిస్తున్నాం అని చెప్పుకుంటూ ఆ మాట చెప్పింది మాత్రం సామాన్య ప్రజలకే గదా!

     కాశ్మీరు తో సహా పాకిస్తాను వాళ్ళు యేమి అడిగితే అది ఇచ్చేసి పాకిస్థానుతో స్నేహంగా వుండవచ్చు కదా యెందుకీ యెడతెగని కలహాలు అని భారత ప్రభుత్వానికి చాలా గొప్ప సలహాల్ని ఇచ్చిన ఈ మనిషి పొరుగు రాష్త్రం విషయంలో తన తండ్రికి ఆ సలహా ఇచ్చి అది అతను పాటించేటట్లు చెయ్యగలదా?పోనీ ఈ గొప్ప ఆలోచనతో ముందుకెళ్తే రేపు పాకిస్తాను వాళ్ళు నిజాము యెటూ నేను ఇండియాలో కలవను పాకిస్తానులో కలుస్తాను నాకు పాకిస్తాను వరకూ రోడ్డు మార్గం కావాలని అడిగాడు కాబట్టి ఆ నిజాము గారు పరిపాలించిన ప్రాంతాన్ని కూడా అడిగితే సంతోషంగా వొప్పుకుంటుందా?
     బ్రాహ్మణ సంస్కృతిని విమర్శించడానికి హేతువాది నంటాడు,బ్రాహ్మణీకపు హిందువులు  మతం పేరుతో గుడిగోపురాలు కట్టి యెన్నో దుర్మార్గాలు చేశారంటాడు,తన కులపోడికి స్మారక భవనం కడితే మాత్రం సమ్మగా వుంది ఈ హేతువాదికి?!పాముల నెందుకండీ రెండు నాల్కల విషజంతువులని తిడతాం,పాపం?! 

       మా ఇంట్లో పేర్లన్నీ మల్లయ్య,కొమురయ్య,కట్టయ్య్య,ఐలయ్య - ఈ దేవుడి పేరు నుంచి వచ్చినవే.కానీ వెలమల్లో ఈ పేరున్న ఒక్క మగ లేదా ఆద వ్యక్తి మనకి కనిపించడు.నరసింహా రావు,రామారావు,విద్యాసాగర రావు,రాజేశ్వర రావు అనే బ్రాహ్మణీయ దేవతల పేర్లతో,అణచివేతే ఆనందంగా గల సంస్స్కృతితో జీవించే వాళ్ళు మారుతున్న దాఖలాలు కూడా లేవు అంటాడు.అదే ప్రశ్న తిరగేసి మరి మీ కులంలో ఈ పేర్లు యెందుకు కనపడవు?మీ పేర్లు పెట్టుకోని ఇతర కులాల వాళ్ళంతా మీదృష్టిలో దురహంకారులా?అంటే మీ కులం గొప్పదని మీకు వుంది గాబట్టి మీ దేవుళ్ళ పేర్లు మాత్రమే పెట్టుకున్నా మీది కులపిచ్చి కాదు,యెదటి వాళ్ళు మాత్రం వాళ్ళ కులదేవుళ్ళకి బదులుగా మీ కులపు దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటేనే మీకు మంచివాళ్ళుగా కనబడతారు,మాస్టారూ మేం మీ కులపు పేర్లు పెట్టుకోము,కానీ మీరు మాత్రం మా కులపు పేర్లు పెట్టుకోవాలి అంటున్న ఇక్కడ పెత్తనం చేస్తున్నది యెవరంటారు?

     ఈయనకి "సామాజిక శాస్తవేత్త" అనే బిరుదు నామం కూడా వుందండోయ్!తనలోనూ యెదటివాళ్లలోనూ వున్న ఒకే లక్షణం - స్వకులాభిమానం అనేది తనలో వుంటే గొప్ప అనీ యెదటి వాడిలో వుంటే చెత్త అనీ అనడం డబల్ మొరాలిటీ అవుతుందని వున్నత విద్యావంతుడూ సామాజిక శాస్త్రవేత్తా అయిన ఈ పెద్దమనిషికి యెట్లా తెలియలేదబ్బా?

   నేను "మీసాల సుహాసిని" అని ఎటకారంగా పిలుచుకునే రాధాకృష్ణ గారు ఈయనగారి తెలివితేటలకి మెచ్చుతునక అనబడే మరో విషయం చెప్పాడు?"చర్చ్ ఫాదర్ నా పుండును ఆప్యాయంగా కడిగి శుభ్రం చేస్తాడు. హిందూ మతానికి చెందిన స్వాములు నన్ను స్పృశిస్తారా?" - అని అఅడిగాడట!వినగానే ఈ ప్రశ్న ఢాం ఢమేల్ మనిపించేటంత ఇంటిలిజెంట్ అనిపిస్తుంది,కానీ వైద్య సదుపాయం ఇంతగా అభివృధ్ధి చెందిన ఈ రోజుల్లో కూడా పుండుని కడిగించుకోవటానికి డిస్పెన్సరీకి వెళ్ళి ఆయింట్మెంటు పూయించుకుని బ్యాండేజి వేయించుకుని ఆంటిబయాటిక్ ఇంజక్షన్లు చేయించుకోవటం తెలివైన పనా ఫాదర్ దగ్గిరకో స్వామీజీ దగ్గిరకో కెళ్ళి ఆయన మన  పుండు కడుగుతుంటే మనం ఆయన ముఖంలోకి చూసి పరవశించడం తెలివైన పనా?

      ఇంత మూర్ఖపు ఆలోచనల్ని కూడా గొప్పగా భ్రమింప జేసే ఈ పెద్దమనిషి యేదయినా అగ్రకులంలో పుట్టి వుంటే ఇప్పుడు తనే విమర్శిస్తున్న వాళ్ళని మించి దురహంకారాన్ని ప్రదర్శించే వాడేమో గదా!
------------------------------------------------------------------------------------------------------------------

Friday, 2 January 2015

తన కులపోడికి గుడికడితే గొప్పగా మురుసుకుంటున్న కంచెకులతిలకుడి విచ్చిన పొట్టలోని పురుగుల్ని లెక్క పెడదామా?

     "బహుశా ఏసు పుట్టక ముందనుకుంట..ఈ ప్రాంతంలో మల్లయ్య అనె గొర్రెల కాపరి పుట్టాడు.ఆయన పుట్టిన తేది మెట్టిన తేది లెవ్వు.ఆయన కాపులో మంద మంచిగున్నదని,పాలు,పెరుగు,చల్ల సమృధ్ధిగా దొరికాయని,మాంసం మస్తుగా తినగలిగేవారని,చలిని చంపే గొంగళ్ళు బోలెడుండేవని,బహుశా మల్లన్న మరణించిన కొరెళ్ళిలో కురుమ-గొల్ల లంతా గుడి కట్టుకున్నారు.ఈ మల్లన్నకు తెలంగాణలో మరో రెండు గుళ్ళు కూడా వున్నాయి. అవే ఐలోని మల్లన్న,కట్ట మల్లన్న గుళ్ళు.ఈ గుళ్ళు ఐలోని పేరులోనే నా పేరు కూడా వుంది.కట్ట మల్లన్న పేరులో మా అవ్వ |కంచె కట్టమ్మ| వున్నది.మా తాత పేరు కంచె మల్లయ్య.ఈ అందరి దేవతల పునాది పేరది.ఈ విధంగా దేవుడైన మా ముత్తాత ముత్తాత దగ్గర ఒక దేవుడిగా ఎలిసిన"కొమురెళ్ళి మల్లన్న గుడి దగ్గర ముఖ్యమంత్రి దొడ్డి కొమ్రయ్య భవనం కట్టిస్తానని ప్రకటించాడు" - ఇది సుప్రసిధ్ధ రచయిత కంచె ఐలయ్య గారి స్వకులాభిమానం!ఈ విధంగా తన కులం వాళ్ళకి యేదయినా మర్యాద జరిగితే ఆయనా మరియూ ఆయన కులం వాళ్ళు మాత్రమే పొంగి పోవాలి.కమ్మ వాళ్ళకీ,రెడ్లకీ వెలమలకీ అలాంటి హక్కు లేదు?ఒకవేళ వాళ్ళు అలా పొగుడుకుంటే ఈ కంచెకులతిలకుడికి కోపమొస్తుంది - ఈ కంచెకులతిలకుడు ఇదివరలో తీర్మానించినట్టు వాళ్ళది కుల దురహంకారం అని అర్ధం చేసుకోవాలి,తెలిసిందా?

     ఈయనకి "సామాజిక శాస్తవేత్త" అనే బిరుదు నామం కూడా వుందండోయ్!తనలోనూ యెదటివాళ్లలోనూ వున్న ఒకే లక్షణం - స్వకులాభిమానం అనేది తనలో వుంటే గొప్ప అనీ యెదటి వాడిలో వుంటే చెత్త అనీ అనడం డబల్ మొరాలిటీ అవుతుందని వున్నత విద్యావంతుడూ సామాజిక శాస్త్రవేత్తా అయిన ఈ పెద్దమనిషికి యెట్లా తెలియలేదబ్బా?ఇంతకీ వీరి ముత్తాత గారు దేవుడవటానికి వీరు చెప్తున్న కారణమేమిటో తెలుసా - వారి గొర్రెలు పాలు యెక్కువ ఇవ్వటం,వారి గొర్రెల మాంసం రుచిగా వుండటం,వారి గొర్రెల వున్ని మరింత దళసరిగా వుండటమూ నట?!ఆ లెక్కన ఇవ్వాళ్టి డయరీ ఫారముల వాళ్ళకి యెన్ని గుళ్ళు కట్టాలి?

     ఒకే గుక్కలో రెండు రాగాలు పలికించగలగటానికి యెంత ప్రజ్ఞ కావాలో తెలుసా?ఈ కంచె వంశాంబుధి చంద్రుడికి అది పుష్కలంగా వుంది!గుడి కట్టడం ఇష్టమే ట!కానీ ఇప్పుడు మాత్రము వద్దు ట!యెందుకు ట!వాళ్ళకి స్మారక భవనం/గుడి కట్టిన దాని కన్నా ఈ 25 కోట్లు కరువు కాటకాల్లో,అప్పుల ఆవేదనలో,ఆకలి కోరల్లో వున్న తెలంగాణా ప్రజల్ని ఆదుకోవటానికి వుపయోగిస్తేనే ఆ దేవుళ్ళు సంతోషిస్తారు ట! ఈ విధంగా కరువులో వుండగా కట్టవద్దని నాలుగో పేరాలో హెచ్చరించిన ఈయనే నెక్సుటు పేరాలో కరువులోనే మెదక్ చర్చిని కట్టడాన్ని పొగుడుతారు.పైదానికి పూర్తి వ్యతిరేక కారణాలతో దాన్ని కూడా సమర్ధించేశారు,ఆ కట్టడంలో వేలాదిమందికి మంచిగా పని కల్పించారు ట!ఒక బ్రహ్మాండమైన చర్చి చరిత్రలో గొప్పగా నిలిచింది ట!మరి ఇప్పుడూ వేలాదిమందికి పని దొరుకుతుంది కదా అని మనం తింగరి దీర్ఘాలు తియ్యగూడదు!మరి ఇప్పుడూ బ్రహ్మాండమైన స్మారక భవనం/గుడి లేస్తుంది కదా అని మనం వంకర మాటలు మాట్లాద కూడదు!ఒకే గొంతుతో రెండు రాగాలు,వారేవ్వా యేమి ప్రజ్ఞండీ?!

     ఇంతకీ ఇప్పుడు కొందరు ప్రజలు బీదరికంలో వున్నారు గాబట్టి వొద్దంటున్నాడు,కొందరు ప్రజలు బీదరికంలో వుండటం కొన్ని శతాబ్దాల తర్వాత కూడా వుంటుంది కదా?అసలు కట్టవద్దంటున్నట్టా?ఆయనకే తెలియాలి!ఒక ఇంట్లో శుభమా అని ఒక కుర్రాడికి పెళ్ళీడు వచ్చిందనుకోండి,పెళ్ళీ చేశారనుకోండి,సరిగ్గా శొభనం గదిలో కొత్త పెళ్ళి కూతురు పాలగ్లాసుతో అడుగు పెట్టిన వేళ మా పక్కింట్లో కుటుంబం అర్ధాకలితో మాడిపోతున్నది గాబట్టి వాళ్ళు ఆ దరిద్రం నుంచి బయటపడే దాకా నేను నిన్ను ముట్టుకోను అని ఆ పెళ్ళికొడుకు ఆ అమ్మాయితో అంటే ఆ అమ్మాయి అతన్ని యెలా చూస్తుంది?ఇప్పుడు మనం ఈయన్ని కూడా అలాగే చూడాలి!

    బ్రాహ్మణ సంస్కృతిని విమర్శించడానికి హేతువాది నంటాడు,బ్రాహ్మణీకపు హిందువులు  మతం పేరుతో గుడిగోపురాలు కట్టి యెన్నో దుర్మార్గాలు చేశారంటాడు,తన కులపోడికి స్మారక భవనం కడితే మాత్రం సమ్మగా వుంది ఈ హేతువాదికి?!పాముల నెందుకండీ రెండు నాల్కల విషజంతువులని తిడతాం,పాపం?! గుడి లాంటి స్మారక భవనం కడతానన్న వాణ్ణి కూడా పూర్తిగా సమర్ధించడు - వేరే కులపోడు గదా?!

     మా ఇంట్లో పేర్లన్నీ మల్లయ్య,కొమురయ్య,కట్టయ్య్య,ఐలయ్య - ఈ దేవుడి పేరు నుంచి వచ్చినవే.కానీ వెలమల్లో ఈ పేరున్న ఒక్క మగ లేదా ఆద వ్యక్తి మనకి కనిపించడు.నరసిమ్హా రావు,రామారావు,విద్యాసాగర రావు,రాజేశ్వర రావు అనే బ్రాహ్మణీయ దేవతల పేర్లతో,అణచివేతే ఆనందంగా గల సంస్స్కృతితో జీవించే వాళ్ళు మారుతున్న దాఖలాలు కూడా లేవు అంటాడు.అదే ప్రశ్న తిరగేసి మరి మీ కులంలో ఈ పేర్లు యెందుకు కనపడవు?మీ పేర్లు పెట్టుకోని ఇతర కులాల వాళ్ళంతా మీదృష్టిలో దురహంకారులా?అంటే మీ కులం గొప్పదని మీకు వుంది గాబట్టి మీ దేవుళ్ళ పేర్లు మాత్రమే పెట్టుకున్నా మీది కులపిచ్చి కాదు,యెదటి వాళ్ళు మాత్రం వాళ్ళ కులదేవుళ్ళకి బదులుగా మీ కులపు దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటేనే మీకు మంచివాళ్ళుగా కనబడతారు,మాస్టారూ మేం మీ కులపు పేర్లు పెట్టుకోము,కానీ మీరు మాత్రం మా కులపు పేర్లు పెట్టుకోవాలి అంటున్న ఇక్కడ పెత్తనం చేస్తున్నది యెవరంటారు?

     తమ కులంలో తాతలూ ముత్తాతలూ తనూ తిరగేసి మరగేసి తమ కులపు దేవుళ్ళ పేర్లనే పెట్టుకున్నట్టు యెదటి కులాల వాళ్ళు తమ కులపు దేవుళ్ళ పేర్లని పెట్టుకుంటే తమది స్వకులాభిమానం గానూ యెదటి వాళ్ళ్ళది కుల దురహంకారం గానూ కనబడటం అంటే యెమిటో మళ్ళీ చెప్పాలా?అనగనగా పంచతంత్రం కధలో ఒక టవును నక్క జనం తంతుంటే పరుగులు పెడుతూ రంగుల డబ్బాలో మునిగి రంగులంటించుకుని అడివిలోకి దవుడు తీస్తే ఆ పిచ్చి జంతువు లన్నీ కంగారు పడి రాజుని చేసుకుంటే, ఒక రోజు సాటి నక్క వూళవేస్తే వొళ్ళ్ళు మరిచిపోయి తనూ వూళవేసి అసలు రంగు బయట పెట్టుకున్నట్టు - తన కులపోడికి గుడి కడుతున్నారన్న సంబరంలో తన కులపిచ్చిని బట్టబయలు చేసిన ఈ మేడిపండుకి ఇప్పుడు రెండే రెండు దారు లున్నాయి.ఒకటి:తన సామాజిక శాస్తవేత్త అనే గుర్తింపుని రద్దు చేసుకుని కంచెకులతిలక నామధేయంతో ఆ గుడిలో పూజారి/గైడు బతుకు బతకటం!రెండు:తనకు వున్నట్టే స్వకులాభిమానం వెలమలకీ,కమ్మలకీ,రెడ్లకీ వుండటం సహజమే అని వొప్పుకుని ఇకనుంచీ నోరు మూసుకోవటం!తొక్కలే అని అహంకరించి ఇప్పట్లాగే కొనసాగాడనుకోండి,"పోవాయ్ శుంఠాయ్,నువ్వొక డబుల్ మొరాలిటీ వెధవ్వి - నీకూ బెబ్బెబ్బే నీ సుత్తికీ బెబ్బెబ్బే" అని మొహం మీదే అంటాడు యెవడో ఒకడు!ఇంత వయసొచ్చి ఒక కుర్రవెధవతో అలా అనిపించుకోవడం తెలివైన పని కాదు గదా!


     "చాకలి ఐలమ్మ ఒక్క చాకలోళ్ళ హీరోయినే కాదు,తమ హక్కుల కోసం ,ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసే స్త్రీలకు-పురుషులకు ఆమె ఆదర్శం.కొమురం భీం ఒక్క ఆదివాసుల హీరోనే కాదు,మొత్తం మానవజాతికి ఆయన ఆదర్శం." మిగతా కులాల్లో యెంత మంచివాళ్ళు వున్నా వాళ్ళ కులాలకే పరిమితం చెయ్యాలే తప్ప మొత్తం మానవజాతికి ఆదర్శప్రాయం అంటే నువ్వు వొప్పుకోవు,సవాలక్ష వంకలు పెడతావు.యేమయ్యా ఐలయ్యా,మా కులాల్లో పుట్టినోళ్ళని గొప్పోళ్ళని వొప్పుకోలేక నక్కలు బొక్కలు వెతుకునన్న తీర్న వంకలు పెడుతున్న నీ కులంలో పుట్టిన గొప్పోళ్ళని నెత్తిన పెట్టుకునే దురద మాకెందుకయ్యా!

     తనకి నచ్చని హిందూ మతం చెడ్డది,తనకి నచ్చిన యేసుమతం మంచిది అని భ్రమించే ఈ మేధావికి హ్యారీ పోటరు సినిమాలో మనం కూడా చూసి సరదాగా ఫీలయిన మంత్రగత్తెలు చీపుర్ల మీద తిరగుతారనే పిట్టకధకి మూలకధ యెంత క్రూరంగా వుంటుందో తెలుసా!యేసు ప్రవచనాల్ని పైగన్లు అనే జాతిమీద రుద్దటానికి చేసిన భీభత్సానికి ఒక సభ్యతాయుతమయిన ముసుగు అది!ఆ జాతిలో మాతృస్వామ్య వ్యవస్థ వుండేది.పైగా వైద్యంలోనూ నాగరిక జీవన విధానంలోనూ అఖండులైన వాళ్ల దగ్గిర రోగమొచ్చిన వాళ్ల దగ్గిర చేరి మా యేసుని ప్రార్ధిస్తే మీరోగం నయమవుతుందని మోసం చెయ్యడం కుదరకపోవదం వల్ల ఆ ఆదవాళ్ళని మంత్రగత్తెలుగా ముద్రవేసి చంపేశారు!మనవాళ్ళు చీపురుని యెంత పవిత్రంగా చూస్తారో మీకెవరికయినా గుర్తుందా?పదిమంది తిరుగుతూ కాళ్లతో తొక్కేచోట వుంచగూడదు!యెక్కడ వుంచినా నిలువుగా నిలబెట్టాలే తప్ప అడ్డదిడ్దంగా పడెయ్యకూదదు!శుభ్రతే సౌభాగ్యం అని తెలియడం వల్లా చీపురులో లక్ష్మీదేవి వుంటుందనే నమ్మకం వల్లా అలా చేసే వాళ్ళు!అలాంటి నమ్మకమే వున్న పైగన్లని పరమ దుర్మార్గంగా వెక్కిరించారు!అన్ని దుర్మార్గాలు చేసిన క్రీస్తుమతం వుదారమైంది,హిందూమతం మాత్రమే క్రూరమైనది?!

యెవడ్రా ఈ కులపిచ్చి గాడికి సామాజిక శాస్తవేత్త అనే గుర్తింపు నిచ్చింది?!

Wednesday, 31 December 2014

హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా వైభవం!

     రామాయణం యెందుకు చదవాలి?రామాయణం యెవరు చదవాలి?రామాయణం యెవరు చదవకూడదు?రామాయణం చదవకపోతే నష్టమేమైనా వుందా?రామాయణం కొందరికి కల్పవృక్షం లాగానూ కొందరికి విషవృక్షం లాగానూ కనబడటానికి కారణ మేమిటి?ఈ ప్రశ్నలకి వరసగా వెనక నుంచి ముందుకు జవాబులు చెప్తాను!

     జంబూద్వీపే భరత వర్షే అని బ్రాహ్మణులు వుభయ సంధ్యల్లో సంకల్పం చెప్పుకుంటూ ఇవ్వాళ్టి ఆఫ్ఘనిస్థాన్ వరకూ విస్తరించిన ప్రాచీనకాలం నుంచీ ఇక్కడ అధిక సంఖ్యాకులైన ప్రజలు పాటిస్తున్న సనాతన సాంప్రదాయాన్ని విదేశీయులు ఈ భూభాగాన్ని హింద్ అని పేరుపెట్టి గుర్తించాక దానినే ఆ సాంప్రదాయానికీ కూడా తగిలించి హిందూ మతం అని పేరు పెట్టారు!కానీ నా దృష్టిలో దీన్ని మతం అని పిలవటం తప్పు. ధర్మం అని పిలవడమే సరయినది! యెందుకంటే ఇది కాక ఇవ్వాళ మతాలుగా గుర్తించబడిన వాటికి ఒకే ప్రధాన దైవం,ఒకే పవిత్ర గ్రంధం,ఒకే సూత్రధారి అనే మూడు ఖచ్చితమయిన విభాగాలు వున్నాయి.పాటించవలసిన విధి నిషేధాల కయితే అవి ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అనే ఒత్తిడీ,,పాటించకపోతే మతం నుంచి బహిష్కరించే పెత్తనమూ కేంద్రీకృతమయిన మతాధికార్లకి కట్టబెట్టబడి వుంది! 

     కానీ ఇక్కడ అలాంటివి లేవు. గ్రామ దేవతలతో సహా యెవరు యెవర్ని యెంచుకున్నా ఆ దైవమే ప్రధాన దైవం భక్తులకి!వేదాలూ, వుపనిషత్తులూ,అష్టాదశ పురాణాలూ - ఇవన్నీ కూడా వేటికవే సమానమయిన పవిత్రత కలిగినవే!ధర్మగ్లాని సంభవించినప్పుడు దైవసంకల్పంతో ప్రభవించిన అవతారపురుషు లంతా యెవరికి వారు సొంత వ్యక్తిత్వం కలిగి వుండి కూడా సమానంగానే పూజనీయు లయ్యారు! అలా అవతరించిన వారు కూడా ప్రజలకి ధర్మబధ్ధంగా బతకడం యెలాగే నేర్పటం కోసం తాము కూడా ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చి వాటిని తాము ఆచరించి చూపించి వుదాహరణగా నిలిచారు!ఋషి పరంపర అనేది ఒకటి వున్నా ప్రజల్ని ఐచ్చికంగా పాటించేలా చెయ్యడమే తప్ప బలవంతంగా పైనుంచి రుద్దకుండా వుండటం వల్ల్ల ధార్మిక వికేంద్రీకరణ అనేది సహజసిధ్ధమై కుదిరింది!దీనికి సాక్ష్యంగా సాయిబాబా గురించి ఒక పీఠాధిపతి నిషేధాజ్ఞలు జారీ చేసినా సాయిబాబా భక్తులు యే మాత్రమూ సందేహించకుండా వాట్ని బేఖాతరు చేసిపారేసి ధైర్యంగా తమ నమ్మకానికే నిలబడటాన్ని చెప్పుకోవచ్చు!ఇంత ప్రజాస్వామికమైన పధ్ధతిని మరో మతంలో చూడగలమా?కానీ ఇంత ప్రజాస్వామ్య బధ్ధమయిన సాంప్రదాయంలో కూడా ఒక రెంటికి మాత్రం వాటి విశిష్థతని బట్టి మోనాపలీ వచ్చేసింది!ఒకటి అన్ని పవిత్ర గ్రంధాల సారాన్నీ సంకలించిన భగవద్గీత,రెండు అన్ని ధర్మాలనీ ఒకచోట గుదిగుచ్చి ఒక కధలో ఇమిడ్చిన రామాయణం.హిందూ ధర్మాన్ని పాటించేవాళ్లలో ఈ రెంటి పట్లా వున్న ఆప్యాయతని బద్దలు కొట్టకుండా వారి భావజాలాన్ని వ్యాపింపజేయలేము అని రూఢిగా తెలుసుకుని యెలాగయినా సరే ఇక్కడ వ్యాపించాలనే మూర్ఖత్వం యెక్కువగా వున్నవాళ్ళకి గీత హింసని ప్రబోధిస్తున్నట్తు వినబడుతుంది,రామాయణం విషవృక్షం లాగా కనబడుతుంది.

     చాలాకాలం క్రితం "అంతరార్ధ రామాయణం" అని ఒక పుస్తకాన్ని కొంచెం తిరగేసాను!బెజవాడ లయోలా కాలెజిలో చదివేటప్పుడు బీసెంటు రోడ్డు దరిదాపులకి వస్తే తీరిక అంటూ వుంటే పుస్తకాల షాపుల్ని చుట్టడం, మంచి పుస్తకం కనబడినట్టాయెనా సరిపడా దబ్బులుంటే అప్పుడే కొనెయ్యడం - లేదంటే ఇరవై నాలుగ్గంటల్లో మళ్ళీ పైకంతో సహా తిరిగొచ్చి అప్పుడు కొనడం చేసేవాణ్ణి!ఈ పుస్తకం మాత్రం యెందుకో నచ్చాక గూడా నాచేతికి రాకుండా తప్పించేసుకుంది!అయినా రుచి చూసేటప్పుడే చాలామటుకు లాగించేశాను యెందుకయినా మంచిదని!రాసింది మన తెలుగాయనే,వేదుల సూర్యనారాయణ శర్మ గారనుకుంటాను!రామాయణానికే గాదు,భారతానికీ,భాగవతానికీ గూడా అంతరార్ధాన్ని విప్పిచెప్పారు గానీ నేను రామాయణం గురించి మాత్రమే చదివాను!

     ఇవ్వాళ మిలిటరీ వాళ్ళు రహస్య సందేశాల్ని వాళ్ళు యెవరికి తెలియజెప్పాలో వాళ్లకి తప్ప మిగిలిన వాళ్ళకి అర్ధం కాని ఒక కోడ్ లాంగ్వేజిని వాడుకుని పంపించటం అనే పధ్ధతి ఫాలో అయినట్టు పాత్రలకి పెట్టిన పేర్లని విడగొట్టీ ,వుపకధల సన్నివేశ కల్పనలో మూలకధకున్న ప్రాధాన్యతని కనిపెట్టీ పైకి కనిపించని మరో కధ దాగి వున్నట్టు నిరూపించారు!"అయోధ్యా నగరానికి రాజు దశరధుదు" అంటే మన మనస్సులోని చపల స్వభావం గురించి చెప్తున్నట్టు లెక్క!యెలా అంటే, యోధులకి జయించ శక్యం కానిది అని కదా అర్ధం - మనల్ని మనమె నాశనం చేసుకోవాలి తప్ప ఇతరులెవరూ మనని నాశనం చెయ్యలేరు కదా!మన మనస్సుని కూడా మనం మచ్చిక చేసుకోగలమే కానీ గెలవలేం కదా!ఇక దశరధ అనే మాటకి పదివైపులకీ పరిగెత్తగలిగిన రధాలు అని అర్ధం,చపలత్వానికి పర్యాయ పదం!కౌసల్య,కైకేయి,సుమిత్రలకి గూడా ఇలాగే వున్నాయి గానీ రాముడు అంటే రమింపజేయువాడు అని అర్ధం.సీత అనే పదానికి ఆయన చెప్పింది నాకు గుర్తు లేకపోవతంతో సొంతంగా పరిశ్రమిస్తే "అసీద్" అనగా "యేదయితే వున్నదో అది" అనే "బ్రహ్మసత్యం జగన్మిధ్య" అనే మంత్రార్ధం కనబడింది!ఇప్పుడు మనం రాముణ్ణి అధికుడిగా నిలబెట్టాడనీ సీతని అతని భార్యగా నిలబెట్టి రెండో స్థానం ఇచ్చాడనీ అనుకునే దానికి పూర్తి విరుధ్ధం.సీతయే ఆరాధనీయమయిన దైవశక్తి కాగా రాముడు దైవ్వసాన్నిధ్యం కోరుకునే సాధకు డవుతాడు!మిగతా కధలో వచ్చే సన్నివేశాల్ని ఆ పధ్ధతిలోనే వర్ణించి ఆయన కూడా నా వూహనే సమర్ధిస్తున్నారు?శివ ధనుర్భంగం అనేది సాధకుడి ఓంకార సాధన ఫలితమిచ్చి తొలిసారిగా దైవ సంశ్లేషణం జరగటానికి గుర్తు!శివ ధనువు విరిగినప్పటి భీబత్సపు వర్ణనలన్నీ అప్పుడు యోగిలో కలిగే అలజడిని వర్ణించే మార్మిక విషయాలతో నిండి వుంటాయి!

     అలా మొదటిసారి దైవసంస్పర్శన సుఖాన్ని అనుభవించి కూడా కైక పాత్ర పరంగా చెప్పబడిన దుర్గుణం సాదకుణ్ణి భయంకరమయిన రాక్షస ప్రవృత్తులతో నిండిన ప్రకృతి శక్తుల మధ్యకి విసిరేస్తే పంచేంద్రియాలు పంచవికారాలతో కలిసి రావణం చేస్తూ వచ్చి అతన్ని దైవానురక్తి నుంచి దూరం చేస్తాయి!ఒకసారి సాధించి కోల్పోయిన దాన్ని తిరిగి మరింత గట్టిగా సాధించాలంటే ఇప్పుదు అతనికి ఒక సద్గురువు చాలా అవసరం!ఆ స్థానంలో హనుమంతుల వారు వస్తాడు?ఆ పాత్ర కధలో ప్రవేశించడమే "మా భయ మా సంవిక్త" అనే మహావాక్యంతో ప్రవేశిస్తుంది!గురువు శిష్యుడికి చేసే సహాయం కూడా అదే - భయాన్నీ ఆందోళననీ వదలగొట్టి సరయిన దారిలో నడిపించటం! కధలో కూడా హనుమంతుడు ప్రవేశించేవరకూ రాముడే ఇవ్వాళ్టి సినిమాల్లో వున్నట్టు డైనమిక్ హీరోలా వుంటాడు,కానీ ఒకసారి హనుమంతుడు ప్రవెశించాక కధలోని ప్రతి సన్నివేశంలోనూ హనుమంతుడే ప్రధానంగా కనపడి వ్యవహారాన్ని చక్కబెదతాడు!అది కూడా అతని ఆచార్యత్వాన్ని నిర్ధారించే విషయమే!

    సీతా సందర్శనం చేసి రాగానే నేను నీకు ఇవ్వగలిగింది ఇదే అని రాముదు హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు.అది మామూలు కౌగిలి కాదు, శిష్యుడు గురువుతో అభేధస్థితిని సాధించటానికి చిహ్నం!యుధ్ధం ముగిశాక సీత అగ్నిప్రవేశ ఘట్టం మరో అధ్బుత సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది!ఈ సకల చరాచర జగత్తునీ శాసించగలిగిన వాడు తనని మోహానికి గురి చేసి అనాధలా వొదిలెయ్యటం పట్ల అతని ఆక్రోశాన్ని వ్యక్తీకరించటం,ఆ అవేశంలో దైవాన్ని కూడా అధిక్షేపించడం అనే చిత్రమయిన దృశ్యం కనబడుతుంది!రామదాసు "యెవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు" అని గద్దించి మళ్ళీ "అబ్బా, దెబ్బల బాధ కోర్వలేక తిట్టితినయ్యా" అన్నప్పుడూ అన్నమయ్య బ్రహ్మాండ నాయకుణ్ణి చిన్న పిల్లాణ్ణి చేసి జోలపాటలు పాడినప్పుడూ వాళ్ళు అంత గట్టిగా దైవం మీద అధికారం సాధించి యెలాంటి మానసిక స్థితిలో వున్నారో సీత అగ్నిప్రవేశం జరిగిన సన్నివేశంలో రాముడి మనస్థితి కూడా అలాగే వుంటుంది! 

     అంటే ఇది ఒక రాజుగారబ్బాయి కధ కాదు,మన మనస్సులో నిత్యం జరిగే "యేది పాపం?యేది పుణ్యం" అనే సంఘర్షణకి ప్రతిరూపం అన్నమాట!సామాన్యత్వం నుంచి అసామాన్యత్వానికి ప్రయాణం చేసిన ప్రతి వ్యక్తీ అంతరంగంలో ఈ సన్నివేశాల మీదుగానే ప్రయాణిస్తాడు,ఈ అనుభూతుల నన్నిట్నీ అనుభవించి తీరుతాడు!అందుకే వాల్మీకి అవతారికలో అంత ధీమాగా "ఈ ప్రపంచంలో పర్వతాలు స్థిరంగా వున్నంత వరకూ నదులు ప్రవహిస్తున్నంత వరకూ నా రామకధ నిలిచి వుంటుంది" అని చెప్పుకోగలిగాడు?!అనునిత్యం మనలో జరిగే కధని మనం తెలుసుకోకపోతే నష్టం యెవరికి - మనకే!

   జవహర్ లాల్ నెహ్రూ గొప్పవాడు,మంచివాడు అనే భావం వున్నవాళ్ళలో యెవరూ రామాయణాన్ని చదవకూడదు.దానివల్ల వాళ్ల మనోభావాలు దెబ్బతిని అశాంతికి గురయి వాళ్ళ మానసికారోగ్యం చెడుతుంది!తండాల సంస్కృతిలో పెరిగి మూకుమ్మడి దొమ్మీల లాంటి కిరాతక యుధ్ధాల్తో మునిగితేలిన చెంగిజ్ ఖాన్ మరియూ తైమూరు లంగ్ అనే క్రూరుల్లో ఆ గాంధీగారి ప్రధమ శిష్యుడికి గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడ్దాయి,బహుశా రక్త సంబంధం యేదయినా వుందేమో!వాళ్ళని పొగడటానికి యెన్నో విశేషణాల్ని వాడాడు.కానీ రాముణ్ణి గురించి పొగిడినట్టు లేదు?జిజియా పన్నులు వేసిన ఔరంగజేబు కాలం లోనే తన రాజ్యంలో హిందూ ముస్లిముల్ని సమానంగా చూసిన శివాజీ మహరాజ్ అతనికి గొప్ప నాయకత్వ లక్షణాలు వున్నవాడిగా కనపడ లేదు,పొగడటానికి చాలా ఇబ్బంది పడిపోయాడు,యెందుకనో!కాబట్టి వారు ఈరోజున లేకపోయినా వారి మానసపుత్రులు వున్నారు గనక వారికి నేను చేస్తున్న విజ్ఞప్తి - "అయ్యా!తమరు దయ వుంచి రామాయణం చదవకండి!చదివినా వెంఠనే మర్చిపొండి!మీకు తోచిన పిచ్చి అర్ధాలు వెతికి మమ్మల్ని కూడా మీలాగ తయారు చేసి వుధ్ధరించుదామని అస్సలు ప్రయత్నించకండి!మేము మా ఆత్మారాముడితో అనుబంధాన్ని వొదులుకుని ప్రేతాత్మల్లాగ బతకడానికి సిధ్ధంగా లేం!"

    లాభం వస్తుందని రూఢిగా తెలిసినప్పుడు మంచిపనులు చేస్తూ నష్టం వస్తుందని అనుమానం రాగానే దొంగపనులకి దిగుతూ అవకాశవాదిగా బతకాలనుకోకుండా నష్టం వచ్చేటప్పుదు వెనక్కి తగ్గుతూ మంచిపనులు మాత్రమే చెయ్యాలనుకునేవాళ్ళు అందుకు వుత్తేజితులు కావడం కోసం రామాయణం తప్పనిసరిగా చదవాలి!యెడ్వినా పట్ల వ్యామోహంతో అభాసు పాలయిన జవహర్ లాల్ నెహ్రూ లాగా కాకుండా మరోలాగ బతకాలనుకునేవాళ్ళకి రామాయణం వుత్సాహాన్ని ఇస్తుంది.రాముడే స్వయంగా చెప్పినట్టు "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అనే భావం ప్రకారం ఈ దేశాన్ని మాతృదేశంగా భావించేవాళ్ళు కులమతప్రాంతాలతో సంబంధం లేకుండా రామాయణాన్ని చదవాలి?!

     ఇక్కడితో రామకధా వైభవం పూర్తయింది!మొదట ఇంత విస్తారంగా ఇదంతా చెబుదామనుకోలేదు.చిన్న ప్రస్తావనతో సరిపెట్టి అసలు కధలో వుండే ప్రహేళికలనే తిన్నగా యెత్తుకుందామనుకున్నాను,తీరా మొదలు పెట్టాక అనుకోకుండా ఇంతగా విస్తరించింది?అయినా ఇవన్నీ తెలిస్తేనే కధలోపలి విశేషాలు మరింత చక్కగా అర్ధమవుతాయి లెండి!కానీ ఇక్కడే అవి కూడా చెబితే పోష్టు చాలా పెద్దదయ్యేలా వుంది,కనుక "హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విశ్లేషణం" అనే తరవాతి భాగం కోసం మీరు కొంచెం వేచివుండాలి!
_______________________________________________________________
చారిత్రక విషాదం   రామకధా వైభవం రామకధా విశ్లేషణం రామకధా విమర్శనం  రామకధా విజృంభణం

Tuesday, 30 December 2014

ఆంధ్రప్రదేశ్ కి విభజన కష్టాలు మొదలయ్యాయా?చంద్రబాబు నిజంగా వీట్ని పరిష్కరించగలడా!

    హుద్ హుద్ తుఫానుకు ప్రధాని మోదీ ప్రత్యక్షంగా చూసి చలించిపోయి ప్రకటించిన 1000 కోట్ల సాయంలో నికరంగా వచ్చేది 620 కోట్లు మాత్రమేనని తెలుస్తున్నది!కేంద్రం తన వాతాగా ఇప్పటికి 400 కోత్లు మాత్రమే ఇచ్చిందనీ,మహా అయితే ఇంకో 105 కోత్లు ఇచ్చి సరిపెట్తేస్తారనీ,అంతకంటే యెక్కువ ఆసలు పెట్తుకోవద్దని కేంద్ర అధికారులు తెగేసి చెప్పారనీ మీసాల సుహాసిని లాంటి నయా మీడియా సలహాదారు ఒక కధనాన్ని జనం మీదకి వొదిలాడు.

     హుద్ హుద్ తుఫాను నష్టంపై రాష్త్ర ప్రభుత్వమే రెండు రకాల నివేదికల్ని పంపింది.తొలుత 40 వేల కోట్ల పైనే నష్టం జరిగిందని తెలిపారు.ఆ తర్వాత 21 వేల కోట్ల నష్తం జరిగిందంటూ గణాంకాలతో మరో నివేదిక వెళ్ళినట్టు తెలిసింది.రెండు రకాల నివేదికలతో గందరగోళానికి గురయి సాయాన్ని నిర్ణయించే బాధ్యతను పూర్తిగా కేంద్ర బృందానికే వదిలేసింది.ఆ బృందం తను సొంతంగా మళ్ళీ తిరిగి చూసి కొండని తవ్వి యెలకని పట్తినట్టుగా తుఫాను సాయం కింద రూ.620 కోట్లు ఇస్తే సరిపోతుందని తేల్చేసింది.మరోవైపు ప్రధానమంత్రి ప్రకటించినట్లుగా వెయ్యి కోట్లు ఇవ్వక్కర్లేదని రూ.400 కోట్లు ఇస్తే సరిపోతుందని కేంద్ర హోం శాఖ పరిధిలోని జాతీయ విపత్తు విభాగం సిఫారసు చేసింది.దీనికి కేంద్ర ఆర్ధిక శాఖ కూడా ఆమోద ముద్ర వేసింది.ఈ మొత్తానికి రాష్ట్ర విపత్తు నిధి నుంచి తన వాటాగా రూ.115 కోట్లను చేర్చి మొత్తం రూ.515 కోట్లను కేంద్ర సాయంగా చూపించ వచ్చు.ప్రస్తుతానికి ఇదే కేంద్రం నుంచి నికరంగా అందే తుఫాను సాయం?కేంద్ర బృందం సిఫారసు యెంత గరిష్ఠంగా లెక్క వేసినా రూ.620 కోట్లు మించదు.అంటే ప్రధాని ప్రకటించిన సాయంలోనే రూ.495 కోట్లకు కోత పడిందన్న మాట!

     ఈ మొత్తం వ్యవహారం ఇంత నిష్ఫూచీగా జరుగుతుంటే కేంద్ర మంత్రివర్గంలోనే వున్న నలుగురు తెదెపా సభ్యులూ భాజపా వెంకయ్య నాయుడూ యేమి చేస్తున్నట్టు?అంత భయంకరమయిన తుఫానుకి ప్రధాని బహిరంగంగా చేసిన వాగ్దానానికి సంబంధించిన నిధుల్నే సమర్ధవంతంగా రాబట్టలేని వాళ్ళు రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లూ, రాష్త్ర పునర్నిర్మాణానికి అవసరమయిన మరిన్ని లక్షల కోట్లూ యెట్లా సాధించగలరు?ఆడలేని సానిది మద్దెల ఓడన్నట్టు వీళ్ళ అసమర్ధత నంతా జాతీయ విపత్తు విభాగంలోని ఒక అధికారి మీదకి మళ్ళించాలని మీసాల సుహాసిని సుకుమారమైన కధలు చెప్తున్నాడు!

     ఆడలేని సానిది మద్దెల ఓడన్నట్టు ఈ అసమర్ధత నంతా జాతీయ విపత్తు విభాగంలోని ఒక అధికారి మీదకి మళ్ళించాలని మీసాల సుహాసిని సుకుమారమైన వింత వింత కధలు చెప్తున్నాడు!సరయిన నివేదికలు పంపకపోవడం,అక్కడి నుంచి వచ్చే సమాచారాన్ని రాష్ట్ర  ప్రభుత్వానికి నివేదించక పోవడం,సుకుమారుని వింతయిన వ్యవహార శైలి అనీ రకరకాల సాహిత్య పదకోశంతో వార్తని నింపేసింది.నిజానికి నాకిది రాష్త్ర ప్రభుత్వంలో సర్వం సహాధికారి అయిన మిత్రుడూ కేంద్రంలోనూ వున్న ఆ మిత్రుని పార్టీ సభ్యులూ ఇబ్బంది పడకుండా చక్రం అడ్డువెయ్యటం లాగా కనిపిస్తున్నది!

     హుద్ హుద్ సాయం రప్పించే బాధ్యత నంతా ఆ ఒక్క అధికారికే రాష్త్ర ప్రభుత్వం కట్టబెట్టిందా?ప్రబుత్వంలో ఇంకెవరూ తుఫాను సాయం గురించి పట్టించుకోలేదా?సాక్షాత్తూ కేంద్ర మంత్రివర్గంలోనే వున్న వాళ్ళకి కూడా తుఫాను సాయం పని యెంత వరకూ వచ్చింది అనే ఆరా కూడా లేకుండా పోయిందా?నిక్కచ్చిగా రావాల్సిన సాయాన్నే తెచ్చుకోలేని రాష్త్రప్రభుత్వం అసలు రాత పూర్వకంగా నికరమయిన హామీయే లేని ప్రత్యేక హోదాని యెలా సాధించుకుంటుంది?ఇప్పటికే సుజనా రాగం మారింది!ఇదివరలో వున్న ప్రణాళికా సంఘం ప్రకారం అయితే ప్రధానికి విశేషాధికారాలు వుండేవి - ఆ ఒక్కణ్ణి బతిమాలుకుంటే సరిపోయేది,ఇప్పుదు మోదీగారు దాని స్థానంలో ముఖ్యమంత్రుల కౌన్సిలు చేతిలో పెట్టాడు ఆ పనిని?!భయం గల కోడి బజారులో గుడ్డు పెట్టినట్టు ఒక్క మనిషి నిర్ణయమే అనుకూలంగా వుంటుందో లేదో తెలియని విషయం ఇప్పుడు అంతమంది చేతిలో పడింది!

హిందూ ధర్మ ప్రహేళికలు-చారిత్రక విషాదం!

      అసలు హిందూ ధర్మమే ఒక వైపు నుంచి చూస్తే చాలా సరళంగానూ మరోవైపు నుంచి చూస్తే గహనంగానూ కనిపిస్తుంది!బట్టనెత్తి బాలయ్య అట్టకన్నా దిట్టమయిన విగ్గు పెట్టి "ఒక వైపే చూడు!రెండో వైపు చూడకు - తట్టుకోలేవ్,చచ్చిపోతావ్" అంటే అది సినిమా గాబట్టి డయరెక్టరు చెప్పాడు గాబట్టి అమ్రిష్ పురి అయినా సరే దడుచుకున్నట్టు నటించాల్సిందే,అట్టా చెయ్యకపోతే నిర్మాత డబ్బులిస్తాడా?కానీ పాపం హిందూ ధర్మానికి ఆ రకం సీను లేదాయె!ప్రతీ అడ్దగాడిదకీ లేకువైపొయింది?

      ఒకప్పుడు విదేశీయుల దృష్టిలో ఇది - పాముల నాడించే వాళ్ళ దేశం?కావమ్మ మొగుడంటే కామోసని అందరూ నమ్మేసారు, కాదని వాదించేవాడు లేడు గదా!కానీ చరిత్ర మరొక పిక్చరు చూపిస్తాంది?ఇంగ్లీషోడు మనని ఆక్రమించుకున్న కొత్తల్లోనే మన దేశం నుంచి వెళ్ళిన ఒక నౌకకి అక్కడ లంగరెయ్యగానే అక్కడి వాళ్లకి గుండెలు గుభేలు మన్నయ్,ఇంత పెద్ద నౌకని చూట్టం వాళ్ల జన్మకదే మొదటి సారి మరి!దాంతో ఇంగ్లీషోళ్ళు మనల్ని దెబ్బతియ్యటానికి చేసిన మొదటి పని మన నౌకల్ని నిషేధించటం!

    ఇంగ్లీషు వాళ్ళకన్నా ముందు ప్రపంచ దేశాల్లో "మేడిన్ ఇండియా" అనే మాటకి ఇవ్వాళ "మేడిన్ అమెరికా" మరియూ "మేడిన్ జప్యాన్" అనే మాటల కన్నా యెక్కువ దమ్ము వుంది!మహానౌకలు అని పిల్చేవాళ్ళు భారతీయ నౌకల్ని!వాళ్లలా దేశాల్ని రాజకీయంగా ఆక్రమించి తమకి అనువుగా ప్రభుత్వాల్ని మార్చుకుని చేసిన దివాళాకోరు వ్యాపారం కాదు మనం చేసింది,సరుకులో నాణ్యత చూపించి సాధించిన మోనోపలీ అది!

     17వ శతాబ్దంలో జాన్ డాల్టన్ కనుక్కున్న అణుధర్మ శాస్త్రం గురించి డాల్టన్ కన్న 2,500 సంవత్సరాలకి పూర్వమే ఆచార్య కణాదుడు ఇక్కడ ప్రతిపాదించాడు!అది యేదో భంగు మత్తులో వుండి వాగిన సొల్లు కాదు,అతని అసలు పేరు కశ్యపు డయితే ఈ సిధ్ధాంతం పేరు మీద కణాదు డనేది బిరుదుగా వచ్చింది!ఈ ఋషి క్రీ.పూ 600లో ఇప్ప్పటి గుజరాతు లోని అప్పటి ప్రభాస క్షేత్రంలో జన్మించాడు.ఈ విశ్వమంతా అతి చిన్న అంశమయిన కణములు లేదా అణువులతో నిర్మించ బడింది అనీ,ఆ కణాన్ని అంతకన్నా చిన్న భాగాలుగా విడగొట్టలేము అనీ సిధ్ధాంతం లాగా వివరించి చెప్పాడు.కానీ మనం మాత్రం అణుధర్మ శాస్త్ర పితామహుడిగా జాన్ డాల్టన్ మహాశయుణ్ణే కీర్తిస్తాం.

     "భూమికి గల ఆకర్షణ వల్ల వస్తువులు భూమి పైన పడుతున్నాయి.ఇదే ఆకర్షణ వల్ల భూమి,ఇతర గ్రహాలు,నక్షత్ర సమూహాలు,సూర్యుడు,చంద్రుడు తమ తమ కష్యలలో పరిభ్రమిస్తున్నాయి" - ఇది మనం న్యూటన్ పేరు మీద గురుత్వాకర్షణ శక్తి నియమంగా చదువుకుంటున్నాం.కానీ ఈ మాటలు క్రీ.శ 400-500 మధ్యన జీవించిన భాస్కరాచార్యు డనే భారత దేశపు ఖగోళ శాస్త్రవేత్త రచించిన "సూర్య సిధ్ధాంత" మనే గ్రంధం లోనివి!ఇది మనకి ఐజాక్ న్యూటన్ ద్వారా 1200 సంవత్సరాల తర్వాత తెలిసింది?

   పాశ్చాత్య శరీరధర్మశాస్త్రం ఇంకా శైశవదశలోనే వున్న వెనకటి కాలంలోనే ఇక్కడి వాడయిన ఆచార్య చరకుడు ఎనాటమీ,ఎంబ్రియాలజీ,ఫార్మకాలజీ శాఖలకి సంబంధించిన యెన్నో విషయాల్ని విపులంగా చెప్పాడు!మధుమేహం, హృదయ సంబంధమయిన వ్యాధుల గురించి యెన్నో విషయాలు చెప్పాడు!ఇక క్రీ.శ 499లోనే తన "ఆర్యభటీయం"లో గ్రహగతుల గురించీ గ్రహణాలు యేర్పడే విధం గురించీ వ్యాఖ్యానించాడు!కోపర్నికస్ ద్వారా మనం తెలుసుకున్న దానికి 1000 సంవత్సరాలకు ముందే భూమి గుండ్రంగా వుంటుందనీ అది సూర్యుడి చుట్టూ ఒక అక్షం మీద పరిభ్రమిస్తుందనీ చెప్పాడు?2600 సంవత్సరాలకు పూర్వమే శుశ్రుత మహర్షి సిజేరియన్,క్యాటరాక్ట్,ప్లాస్టిక్ సర్జరీ,బ్రైన్ సర్జరీ లాంటి యెన్నో క్లిష్తమయిన శస్త్ర చికిత్సలు చేశాడు!

      శ్రీమధ్భాగవతం లోని 3వ కాండ 30వ అధ్యాయంలో వర్ణించిన తల్ల్లి గర్భంలో శిశువు యెదిగే దశల్ని ఇవ్వాళ మనం చూసే ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ వివరాలతో పోల్చి చూస్తే రెంటిలోనూ యెన్నో పోలికలు కనపడతాయి!గురు పాదుకా స్తవంలో శక్తిని "నాద బిందు కళాధరీ" అని కీర్తించారు!చందస్సుకి సరిపోతుందని వేసిన వ్యర్ధ పదం కాదది - ఇవ్వాళ బౌతిక శాస్త్రవేత్తలు మూలకాల్ని గుర్తు పట్టటానికి రిసొనేటింగ్ ఫ్రీక్వెన్సీ, స్పెక్త్రోఫోటోమెట్రీ, అటామిక్ వెయిట్  అనే మూడింటిని పరీక్షలుగా తీసుకుంటున్నారు!

   వేదగణితం గురించి కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ చేసిన గొడవ ఇంకే దేశంలో నైనా యెవరయినా చేస్తే జాతిద్రోహుల కింద జమకట్టి  జనమే తన్ని తగలేసే వాళ్ళు!ఇక్కడ గాబట్టి మేధావులుగా చెలామణీ అవుతూ గౌరవాలు పొందుతున్నారు?అసలు ఇవ్వాళ ప్రపంచంలో మనం ఫాలో అవుతున్న అంకగణితంలో మనవాళ్ళు చేసింది కేవలం సున్నాని కనిపెట్టట మొక్కటే కాదు - ప్రాధమిక నియమాలు కూడా మనవాళ్ళు చెప్పినవే!

    సున్నాని కనిపెట్టడం కూడా ఆర్కిమిడ్డీసు లాగా నీళ్లతొట్టెలో పడుకుని వూగుతుండగా హట్ఠాత్తుగా తెలిసొచ్చి "యురేఖా తకమిఖా" అని పాడుకుంటూ వొంటిమీద బట్ట వుందాలేదాని కూడా చూసుకోకుండా రెచ్చిపోయినట్టు జరగలేదు!దైవానికీ జీవుడికీ వుందే సంబంధాన్ని అందులో నిక్షేపించారు!శూన్యాంకం మరియూ పూర్ణాంకం అని రెండు పేర్లతోనూ పిలిచే ఈ గుర్తుకి సొంతంగా విలువ లేదు,కానీ మరొక అంకెకి కుడిపక్కన అంటే ముందువైపుకి చేరితే దాని విలువని పదింతలు పెంచుతుంది.భగవంతుణ్ణి చూడగలిగిన మనిషి విలువ గురించిన సూచన అది!అసలు 1 నుంచి 9 వరకూ వున్న అంకెలన్నీ 1కి బహురూపాలే!అంటే అక్కడ వున్నవి రెండే రెండు - '1" మరియూ "0".ఇవ్వాళ కంప్యూటర్లలో వాడుతున్న బూలియన్ ఆల్జీబ్రా చెప్పే "బీయింగ్" మరియూ "నథింగ్" అనే సిధ్ధాంతానికి మూలరూపం కూడా ఇందులోనే వుంది?!అలాంటిది యెంత కష్టమయిన లెక్కనయినా పేపరు మీద వేసుకుని అంచెల వారీగా చెయ్యాల్సిన పని లేకుండా,కనీసం కాలిక్యులేటరు కూడా వాడకుండా మనస్సులోనే చెయ్యగలగడం వల్ల మన పిల్లలు యెంత చురుగ్గా తయారవుతారు అనేది కూడా పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యతిరేకించారు,యేమి దౌర్భాగ్య మిది?

     ఇతర్లు కనుక్కున్న వాట్ని మనవాళ్ళు ముందే కనుక్కున్నా ఇంకా ఇతర్ల పేరు మీదనే చదువుతున్నాం.ఈ దగుల్బాజీ తనం పేరు సెక్యులరిజం,మోడర్నిటీ!ఒక ఫ్రెంచ్ మహిళ - పెద్దగా పేరున్న మనిషి కూడా కాదు,మన దేశంలోని ప్రాచీన విజ్ఞానం గురించి కొంచెం తెలియగానే "ఇదే మా దేశపు వాళ్ళు కనిపెడితే ప్రపంచం పొలిమేరలు గింగురుమనేలా అరిచి గోల చేసయినా సరే గుర్తింపు తెచ్చుకునేవాళ్ళం" అనేసింది!

    నేను ఈమధ్యన ఒక తెలివితక్కువ పని చేశాను!ప్రజ బ్లాగులో గీత గురించి ఒక ప్రశ్న వేస్తే కొందరితో వాదన మొదలెట్టాక క్షేమంగా ఇందులోంచి బయట పడగలనా,యెరక్కపోయి ఇరుక్కున్నాను గదా అని పరితపించాల్సిన దుస్థితి యెదుర్కొన్నాను?మొత్తం విషయాన్ని తెలుసుకుంటే కానీ అర్ధం కాని విషయాన్ని గురించి ముక్కలు ముక్కలుగా తెలుసుకుని అసలు మొత్తం యేమి అర్ధాన్ని ఇస్తుందో ముందు ముందయినా తెలుసుకోవాలనుకోకుండా రెండు మూడు ముక్కల్ని, అది కూడా వాట్ని విమర్శించడం ద్వారా అసలు రచయితల కన్నా నేను తెలివయిన వాణ్ణి అని తమ పాండిత్యాన్ని చూపించుకోవాలనే రకం వాదనలు నాకు గీత గురించిన చర్చల్లో యెదురయినాయి.

     Einstein విశ్వంలో వంపుదారే తిన్ననిదారి అని చెప్పాడు అని ముక్తాయించి వొదిలేస్తే యెలా వుంటుంది?ఆ వొక్క ముక్క చుట్టూరా ఆయన యేం చెప్పాడో దాన్ని యెలా సమర్ధించాడో తెలియకపోతే ఆ ముక్క అర్ధమవుతుందా యెవరికయినా!మనకి సాంప్రదాయికంగా వున్న పండగల్లో ప్రతిదానికీ ఒక నక్షత్రం క్షితిజం మీదకి రావటం వుంటుంది కదా!అది అక్కడికి యెందుకొస్తుంది?విశ్వంలో సూర్యమండలం,నక్షత్రరాశులూ వాటి సొంత వేగాలతో వాటి మానాన అవి పరిభ్రమిస్తుంటే భూమి మీద నుంచి చూస్తే మాత్రం ఆ రెండూ ఒకే రేఖ మీదకి వచ్చినట్టు కనిపిస్తాయి.దాన్ని సూర్యుడు ఆ నక్షత్ర రాశిలో ప్రవేశించడం అంటారు.కోపర్నికస్ అనేవాడు భూమి గురించి ఒక నిజం చెప్పినందుకు సజీవదహనం చేసిన వాళ్లకన్నా చాలా ముందుగానే ఆయా విషయాలన్నిట్నీ ఒక శాస్త్ర స్థాయిలో అభివృధ్ధి చేసిన వాళ్ళకి సరిగ్గా ఆ సమయానికి వాతావరణంలో జరిగే మార్పులు కూడా తెలుసు!ఆ రోజు దేవుడి పేరు మీద చెయ్యమని చెప్పిన పూజల్లోనూ వండివార్చి ఆరగింపు చేసి మనం తినాల్సిన నైవేద్యాల లోనూ ఆ వాతావరణానికి దేహంలో జరిగే మార్పులకి ప్రతిక్రియలుగా పనిచేసే ఔషధాల్ని సమకూర్చటం అనే ఆయుర్వేద సూత్రాలు వున్నాయని తెలియకపోతేనే అవి మూఢనమ్మకాలు అవుతాయి!

   ఒక వైపున చంద్రుడు క్షీరసముద్రంలో లక్ష్మీదేవికి సోదరుడుగా పుట్టుకొచ్చాడు,అతను ఓషధుల కధిపతి,మనస్సును భ్రమింప జేస్తాడు అనే పిట్టకధలూ చెప్పారు, మరొక వైపున చంద్రుడు అనేది గోళాకారంగా వున్న గ్రహం,అది భూమి చుట్టూ తిరుగుతుంది అని వ్యాసార్ధాన్ని కూడా కొలిచి సిధ్ధాంతాలూ చెప్పారు?బైబిలుకి విరుధ్ధంగా చెబితే చంపేసిన వాళ్ళు శాస్త్రీయ దృష్టి గలవాళ్ళూ ఆధ్యాత్మికతలోనూ శాస్త్రీయతని ఇముడ్చుకున్న వాళ్ళు అనాగరికులా?మామూలుగా చెప్తే బోరు కొట్టించే విషయాల్ని కల్పిత కధలుగా చెప్పే పురాణ సాహిత్యం అన్ని జాతుల్లోనూ వుంది!నక్షత్ర రాశులు యెలా పుట్తాయి అనే దాని చుట్టూ అల్లిన "క్లాష్ ఆఫ్ థ టైటాన్స్"కి నాలుగో వెర్షన్ ఇప్పుదు హాలీవుడ్డులో నడుస్తాంది?"జాక్ అండ్ థ బీన్ స్టాక్" అనే పేరుతో మనమూ చిన్నప్పుడు చదువుకున్న చిక్కుడు మొక్కతో ఆకాశంలోకి వెళ్ళే కధనే ఇప్పుడు మళ్ళీ "జాక్ అండ్ థ జైంట్ స్లేయర్" పేరుతో మళ్ళీ తీసుకుని సరదాగా సూపర్ హిట్టు చేసుకున్నారు?మనవాళ్లకి ఇదేమి మాయరోగమో మన పురాణ కధల్లో బూతులూ తప్పులూ తప్ప ఇంకెమీ కనబడ్దం లేదు?!ఇంటి ఈగ శ్లేష్మం మీదా తేనెటీగ పువ్వు మీదా వాలినట్టు వీళ్ళ బుధ్ధిలో వున్నదాన్నే అక్కడ చూస్తున్నారా?రామాయణంలో నైనా భారతంలో నైనా మతి తప్పిన భౌతిక్క వాదమూ స్త్రీవాద దళితవాద పైత్యకారి పాండిత్యాలకి పనికొచ్చే అంశాలూ వెతుకుతారు,అవి లేనిదంతా చెత్త అని తీర్మానించేస్తారు?

    వాళ్లు యెటూ అవి మాకక్కర్లేదని చెప్పేశారు గాబట్టి వాళ్లకి పనికి రాకపోయినా అసలు అక్కడేముందో తెలుసుకోవాలనుకునే బుధ్ధిమంతులకి కనీసం వాళ్ళ గందరగోళపు వాదాలకి మతి తప్పకుండా వుండటానికి పనికొస్తాయనే వుద్దేశంతో పౌరాణిక సాహిత్యంలో నిగూఢంగా వున్నవాట్ని గురించి నాకు తెలిసిన విషయాల ఆధారంతో వ్యాఖ్యానించాలని పూనుకున్నాను.రామాయణంలో వాలిని రాముడు అన్యాయంగా చంపేశాడని పొర్లి పొర్లి యేడుస్తున్న వాళ్ళు ఇప్పటికీ వున్నారు?ఇక భారతంలో కర్ణుడికీ యేకలవ్యుడికీ అయితే ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా వున్నాయి?అవి నిజంగా తప్పులేనా,అసలు అక్కడ మనం తెలుసుకోవలసినదేమిటి అనేవి వివరిస్తాను!

     అర్ధ పాండిత్యం అంటారు గదా, పాండిత్యంలో సగం వుంటుందా?వుంటుంది!దేన్ని గురించయినా యెందుకు తెలుసుకోవాలి?తెలుసుకుని యేమి చేయాలి?మనకి పనికొచ్చేదాన్ని గురించే మనం తెలుసుకోవాలి!తెలుసుకున్నదాన్ని ఆచరణలోకి అనువదించుకోవాలి!అక్కడ వున్నదాన్ని అర్ధం చేసుకోవడం, అర్ధమయిన దాన్ని వుపయోగించుకోగలగడం అనే రెందూ కలిస్తేనే పూర్ణ పాండిత్యం,ఆ రెంటిలో యే ఒక్కటి లోపించినా అర్ధపాండిత్యమే?అంతే తప్ప పాండిత్యంలో 100% మరియూ 50% అంటూ పెర్సెంటేజిలు వుండవు!పౌరాణిక సాహిత్యం పూర్తిగా నైతిక సంబంధమయిన సందేహాల్ని నివృత్తి చెయ్యడానికి వుద్దేశించినవి!వాటిల్లో అనవసరమయిన విషయాల్ని వెదకటమంటే రామాయణంలో పిడకల వేటలా వుంటుంది!అర్ధమయినదాన్ని పనికొచ్చేలా వుపయోగించుకోవటం,అర్ధం కాకపోయినా పనికొస్తుందేమో అనిపిస్తే పూర్ణపండితుల్ని అడిగి తెలుసుకోవటం,అంతే - చెంబు కొద్దీ గంగ!
_______________________________________________________________
చారిత్రక విషాదం   రామకధా వైభవం  రామకధా విశ్లేషణం రామకధా విమర్శనం  రామకధా విజృంభణం

Friday, 26 December 2014

తెలంగాణా మేధావులకి నా వైపునుంచి శ్రీరామప్రసాద గీత!

             "కులరీత్యా,ప్రాంతరీత్యా,భాషరీత్యా వెనుకబడిన ప్రజలూ,లైంగికంగా అనగదొక్కబడిన స్రీలూ అప్పటికే అభివ్ర్ధ్ధి చెందిన వారితో యెలా పోటీ పదగలరు?" అన్న ప్రస్న సరైంది కాదు.వెనుకబడిన వాళ్ళు అభివృధ్ధి చెందిన వాళ్ళతో ఒకానొక సంబంధంలోకి వచ్చినప్పుడు మాత్రమే "వెనుకబడినవాళ్ళు"గా గుర్తించబడుతున్నారు.ఈ తారతమ్యం సాపేక్షమైనది.యెవరయినా గానీ "మేము మీకన్నా అభివృధ్ధి చెందినవాళ్ళం.మీరు మాకన్నా వెనుకబడిన వాళ్ళు" అని అంటున్నప్పుడు వెనుకబడిన వాళ్ళు ఆ అభివృధ్ధి చెందిన వాళ్ళతో సంబంధాన్ని తెంచేసుకున్నప్పుడు ఆ తేడాల వునికే అదృశ్యమౌతుంది.

         అభివృధ్ధి చెందిన వాళ్ళు వెనుకబడిన వాళ్ళ అభివృధ్ధి క్రమాన్ని గుర్తించటానికి నిరాకరించినప్పుడు,వాళ్ళ ఆత్మగౌరవాన్ని నలిపివేస్తున్నప్పుడు వెనుకబడిన వాళ్ళు అభివృధ్ధి చెందిన వాల్లతో తమ సంబంధం యొక్క పరిమితులను కుదించే ప్రయత్నం చెయ్యాలి.బ్రిటిష్ దేశమూ, ఇంగ్లీషు భాషా యెంత ఆధునిక స్థాయికి అభివృధ్ధి చెందినవైనప్పటికీ వారు మనల్ని పీడిస్తున్నప్పుడు వారి ఆధిక్యాన్ని నిరోధించే లక్ష్యంతో స్వాతంత్ర పోరాటాలు సాగాయి.అవన్నీ వాళ్ళు పాలకులు,మనం పాలితులు అనే సంబంధాన్ని రద్దు చెయ్యటానికి జరిగాయి.

          అంటే,అభివృధ్ధి చెందిన వాళ్ళ అతివృధ్ధిని నిరోధించే విధంగానే వెనుకబడిన వాళ్ళ అభివృధ్ధి జరగాలన్న మాట!అభివృధ్ధి చెందిన వారి స్థాయికి యెదగాలన్నా,వారి ఆధిక్యాన్ని నిరోధించాలన్నా వెనుకబడిన ప్రజలు ఇప్పటికే అభివృధ్ధి చెందినవారి కంటే వేగంగా కదలాల్సి వుంటుంది.ఈ పధ్ధతిలోనే అభివృధ్ధి పేరున జరిగే పరాయీకరణని కూడా వెనుకబడిన ప్రజలు క్రమేణా తొలగించుకోగలుగుతారు.కాబట్టి అభివృధ్ధి చెందినవారి కన్నా అదనపు చైతన్యం పొందీతే తప్ప వారిని మించిపోయి గెలిచే లక్ష్యం సిధ్ధించదు!

   మాక్కాస్త పేరు ప్రతిష్ఠలు సంపాయించి పెట్టండి బాబూ అని యెవరూ యెవర్నీ దేబిరించనక్కర్లేదు.పేరు ప్రతిష్ఠలు ఏయే మార్గాల్లో వస్తాయో తెల్సుకుని వాట్ని సాధించే కృషిని నమ్ముకుంటే వాటంతటవే వస్తాయి.మేము బలహీనవర్గానికి చెందిన వాళ్లం కాబట్టి మా తరపున మీరు పోరాడి ఫలితాన్ని మాకు దక్కించండని యెవ్వర్నీ ప్రాధేయ పడవద్దు.అట్లా చేసేవాళ్ళు రెండే విధాలు:మాఫియా గ్యాంగులు,నక్సలైటు వర్గాలు - యెవ్వర్ని మీరు సంరక్షకులుగా యెంచుకున్నా మీకు దక్కేది తాత్కాలిక రక్షణే!
                                                                                                                       -------B.S.రాములు & కలెకూరి ప్రసాద్
-----------------------------------------------------------------------------------------------------------------
          ఇది యెప్పుడో నాకు నచ్చి నా పర్సనల్ కలక్షన్ లోకి యెక్కించుకున్న ఒక విశ్లేషణ.ఇందులోని సారాంశ మేమిటంటే అబివృధ్ధి చెందటం,వెనకబడటం అనేవి సాపేక్షాలు.వెనకబడిన వాళ్ళు అనే మాటకే అసలు అర్ధం లేదు  యెవరి కన్నా వెనకబడిన వాళ్ళో చెప్పకపోతే!ఈ రకమయిన అవగాహన నాలో మొదటినుంచీ గట్టిగా వుండటం వల్లనే రాష్త్ర విభజన విషయంలో తెలంగాణా వాదుల్ని నేను అంత గట్టిగా సమర్ధించాను.

          ఆ విశ్లేషణలో రెండు కీఎలకమయిన అంశాలు వున్నాయి.ఒకటి,అభివృధ్ధి చెందిన వాళ్ళు వెనకబడిన వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఆ సంబంధాన్ని తెంచేసుకోవటం,వెనుకబడిన వాళ్ళు అభివృధ్ధి చెందిన వాళ్ల కన్నా వేగంగా కదలటం. మొదటిది సాధించారు,కానీ రెండవది సాధించ గలరా?

          యెందుకంటే నాకు మొదటి నుంచీ తెలంగాణా వుద్యమవీరులు చేస్తున్న వాదనల్లో ఒక సందేహం ఇప్పటికీ మిగిలి పోయింది!అసలు ఒక ప్రాంతం లోని మేధావు లంతా యాభయ్యేళ్ళ పాటు తమ ప్రాంతం వాళ్ళు వెనకబడితే యెందుకు నిస్తేజంగా వుండి పోయారు?వుద్యోగాల కయితే చదువులూ డిగ్రీలూ కావాలి,కానీ వ్యాపార పారిశ్రామిక రంగాల్లో పైకి రావాలంటే కేవలం పెట్టుబడీ చొరవా మాత్రం చాలు గదా!ఆంధ్ర వలసవాదుల దోపిడీలూ,ఆంధ్రోళ్ళ దుర్మార్గపు కబ్జాలూ లాంటి పనికిమాలిన వాదనల్ని తీసేస్తే తెలంగాణాలో వ్యాపార పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి పెట్టి యెదగ గలిగిన వాళ్లే లేరా?

          యెంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందన్నట్టు దేశానికి స్వాంత్ర్యం రావడమేమో గానీ  తెలంగాణాలో మాత్రం పెద్ద సైజు గందరగోళాన్ని రగిలించింది?!నిజాము ఈ దేశంలో కలవనని మంకు పట్టు పట్టటం, ఆ ప్రభుత్వాన్ని పోలీసు చర్య ద్వారా కలిపేసుకోవటం,పనిలో పనిగా ఆ వుద్యమానికి నాయకత్వం వహించిన కమ్యునిష్టుల్ని కూడా యేరి పారెయ్యటంతో మొత్తం తెలంగాణా అంతటా హఠాత్తుగా ఒక శూన్యం యేర్పడింది!ప్రజల్ని చైంతన్యవంతుల్ని చేసిన కమ్యునిష్టులు శవప్రాయులై నెహ్రూ భక్తులుగా మారిపోవటంతో నాయకత్వ లేమి యేర్పడింది!అప్పటి దాకా ప్రజల్ని పీడించి అపార ధనరాసుల్ని పోగు చేసిన వాళ్ళు దేశం వొదిలి పారిపోవటంతో ఆర్ధికపరమయిన యెదుగుదల వెనకబడింది!ఆ శూన్యాన్ని ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు భర్తీ చేశారు.అది కావాలని ఆంధ్రోళ్ళు కుట్ర పూరితంగా చేసింది కాదు గానీ ఒక మోనోపలీ అనేది స్థిరపడి పోయింది!

          ఒకసారి మోనాపలీ యేర్పడితే దాన్ని వొదులుకోవటానికి యెవడూ ఇష్టపడడు!రేపు తెలంగాణా రాష్త్రం నుంచి యెదిగే వాళ్ళు కూడా దీనికి అతీతంగా వుండరు!యేమయితేనేం రాజకీయ పరమయిన విభజన జరిగింది!కానీ అసలు ప్రశ్న యేమిటంటే:ఆంధ్రావాళ్ళు వచ్చి బాగుపడిన చోట తామూ బాగుపడేటందుకు అవకాశాలు వున్నాయని తెలిసినప్పుడు, అక్కడికెళ్తే యెదుగుదల సాధ్యమని తెలిశాక ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కోస్తా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?

         యెక్కువ అభివృధ్ధి చెందటం తక్కువ అభివృధ్ధి చెందటం అనే సాపేక్షతని రద్దు చేసే విధంగా ఈ యాబయ్యేళ్లలో యెందుకు కదల లేకపోయారు?అలా కదల లేని మీలోని  అశక్తతని వొదిలించుకోకుండా  మామీద ద్వేషంగా పెంచుకుని ఇప్పటికీ చావు వార్తలకి తక్కువ కవరేజీ ఇచ్చారు అనే పుచ్చొంకాయ్ తెలివితేటల్తో నెగటివ్ పధ్ధతుల్లో కాకుండా పాజిటివ్ దారిలో వెళ్తే తెలంగాణాలో అభివృధ్ధి జరగకపోయేదా?

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...