Tuesday 20 February 2018

భవిష్యత్తులో రోబోట్లు నిజంగా మనుషుల మీద తిరగబడతాయా?అసలు యంత్రానికి స్వంతబుద్దిని ఇవ్వడమూ ఆలోచన నేర్పడమూ సాధ్యమా?


సనాతన ధర్మం మనుషుల్ని మూడు రకాల కింద కుదించింది - తామసులు,రాజసులు,సాత్వికులు అని!మీరు ఆన్‌లైన్ షాపింగ్ కోసం వెబ్ ముందు గానీ ఫోను ముందు గానీ కూర్చుంటే వాళ్ళు మీముందు రేడియో బటన్లూ చెక్ బాక్సులూ కలిపి ఒక వెబ్ ఫార్మ్ పెడతారు.మీ ముక్కూ మొహం వాళ్ళకి తెలియకపోయినా మీరు నొక్కిన బటన్లని బట్టి వాళ్ళు మీకు కావలసిన వస్తువుని మీకు పంపిస్తారు - లెక్క ప్రకారం పని జరిగిపోతుంది.వ్యాపారం చేసి లాభం పొందాలనుకున్నవాడు గానీ ఓట్లు సంపాదించి అధికారం పొందాలనుకునేవాడు గానీ ప్రతి మనిషినీ పట్టించుకోవాలంటే గిట్టుబాటు కాదుఅలాగని అసలు పట్టించుకోకపోతే మట్టానికి మునిగిపోతాడు.
ఇద్దరికీ సులువైన పద్ధతి యేంటంటే వాళ్ళు ఏ సమూహాన్ని సంతృప్తి పరచాలనుకుంటున్నారో ఆ సమూహాన్ని కొన్ని సామాన్య లక్షణాలను ప్రదర్శించే చిన్న చిన్న గ్రూపులుగా విడగొట్టి ఏ గ్రూపుకి ఏ అంశం నచ్చుతుందో తెలుసుకోవటం తేలిక.అయితే, తొలిప్రేలుడు సిద్ధాంతకర్తల లాగే అంతకుముందు ఏమీ లేదనీ ఉండటానికి వీల్లేదనీ అనుకున్నాడో యేమో కార్ల్ మార్క్స్ మానవ జాతి యొక్క తొలిదశ అని చెప్పిన ఆదిమ కమ్యూనిజపు కాలం నుంచీ ఇప్పటివరకూ మానవ సమూహాలు అన్నీ సనాతన ధర్మం చెప్పిన తామసం,రాజసం,సాత్వికం అనే మూడింటిలో ఏదో ఒక లక్షణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఎంత కఠినంగా విశ్లేషించినా నాలుగో గ్రూపు కనబడటం లేదు.
రోబోట్ల గురించి తలకట్టు పెట్టి వ్యాపారం,రాజకీయం అంటున్నానేమిటా ఆని ఆశ్చర్యపోతున్నారా?నేను ఇక్కడ కూర్చుని రాసినదాన్ని మీరు అక్కడ కూర్చుని చదివేలా చెయ్యగలుగుతున్న కంప్యూటర్ టెక్నాలజీ ఎందుకు ఉనికిలోకి వచ్చిందో రోబోట్ల వాడకం కూడా అందుకే ఉనికిలోకి వచ్చింది - వ్యాపారం కోసమే!వ్యాపారం అనగానే మూర్ఖపు కమ్యునిష్టుల మాదిరి ముఖం చిట్లించకండి,కస్టమర్ని మోసం చెయ్యని వ్యాపారం చాలా అవసరం - మనం జంతువుల నుంచి విడిపోయి ఒక ప్రత్యేకత సాధించడానికి కారణం మనకి వ్యాపార సూత్రాలు తెలియడమే!
మిగిలిన జంతువుల కన్న మానవుడిలో భిన్నమైన లక్షణం అత్యద్భుతమైన జ్ఞాపకశక్తి - ఇవ్వాళ తెలిసిన విషయాన్ని రేపటికి గుర్తుపెట్టుకోగలగడం వల్లనే మానవుడు ఇంత ప్రగతిని సాధించాడు. కార్ల్ మార్క్స్ దానికి ఆదిమ కమ్యూనిజం అనే పేరు పెట్టి తన సిద్ధాంతాన్ని అక్కడినుంచే మొదలుపెట్టడానికి కారణం కూడా వస్తువుల వినిమయం మొదలైన తొలిదశ కాబట్టి కావచ్చు - కానీ అతను దాన్ని మరీ ఎక్కువ ప్రేమించి మానవాళి అంతిమలక్ష్యం కూడా అదే అనటం మాత్రం అశాస్త్రీయమైన ప్రతిపాదనయే!
వ్యాపారం యొక్క ప్రయోజనమూ, దాని వెనక ఉన్న జ్ఞానసంచయం యొక్క అవసరమూ మనిషిని సుఖపెట్టటానికే, సుఖం అంటే సోమరితనం కాదు - అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ ఫలితాన్ని పొందడం. దీనికోసమే చక్రం అనే తొలియంత్రాన్ని కనిపెట్టాడు ఆది మానవుడు.ఇప్పటికీ మానవసమొహం ఉపయోగించే ప్రతి యంత్రంలోనూ ఈ చక్రమే రకరకాల రూపాల్లో ఒదిగిపోయి కనిపిస్తున్నది - ఒకే దైవం అనేక రూపాల్లో సాక్షాత్కరిస్తున్నట్టు!
ఇవ్వాళ మనం రూపాయి అని పిలుస్తున్నది దాన్ని సంపాదించడానికి మనం పడిన శ్రమకి గుర్తు.ఇక్కడ శ్రమ అనడం కన్న జ్ఞానం అనడం వల్ల విషయానికి మరింత స్పస్టత వస్తుంది.అవ్యక్తుడైన పరమాత్మను తెలుసుకోవడానికి ప్రతిమ ఎలా అవసరమో ఒక మనిషి నిన్నటి రోజున చేసిన శ్రమ వెనక ఉన్న జ్ఞానమే ఇవ్వాళ రూపంలోకి వచ్చి రూపాయి/డాలర్/రూబుల్ అనే పేర్లతో అతని ఆదాయం అవుతుంది.కేవలం దేహశ్రమతో చెయ్యలేని పనిని బుద్ధి చాతుర్యంతో చెయ్యగలిగితే ఆ బుద్ధి చాతుర్యమే ఎక్కువ ఆదాయాన్ని తెస్తుంది - అది సహజమే!ఒక మనిషి టన్ను బరువున్న ఇనపగుండుని తనొక్కడే యెత్తగలడా!చాలెంజి రాముడిలా కొన్ని సంవత్సరాల పాటు రకరకాల సాధనలు చేస్తే ఎత్తగలడేమో!కానీ కప్పీలూ గొలుసులూ తయారుచేసుకుని తెలివిని ఉపయోగిస్తే ఎన్నిసార్లు ఎత్తమన్నా ఎత్తగలడు -అదీ కొద్ది నిమిషాల్లోనే!
ఈ రకమైన యంత్రాల వినియోగం పట్ల ఇపటివరకు ఎవరికీ అభ్యంతరం రాలేదు గానీ వీటికి కొంత ఆలోచన నేర్పుదామని అనుకునేసరికి కొందరు కంగారు పడిపోతున్నారు,అలా చేస్తే ఒకనాటికి అవి తెలివి మీరిపోయి మనిషి మీద తిరగబడి మానవజాతిని సర్వనాశనం చేస్తాయని భయపెడుతున్నారు, ఇదే మానవాళి యొక్క ఆఖరి ఆవిష్కరణ/పరిశోధన అని ఇతరుల్ని కూడా భయపెడుతున్నారు.
 నాస్తికులకీ హేతువాదులకీ ఆస్తికుల్నీ భక్తుల్నీ వీళ్ళు చేస్తున్న  తర్కవిరుద్ధమైన,అశాస్త్రీయమైన పనుల్ని చూసి హాచ్చెర్యం పడిపోయి వాళ్ళలో వాళ్ళు అనుక్కుని విసుక్కునే మూసమాటలు "ఈ యంత్రయుగంలో...?!", "ఈ రాకెట్ యుగంలో...?!", "ఈ కంప్యూటర్ యుగంలో...?!","ఈ ఇంటర్నెట్ యుగంలో...?!" అని తరాల పాటు వింటున్నా వీళ్ళు జాలిపడుతున్నవాళ్ళు సుబ్భరంగానే బతికేస్తున్నారు. వీళ్ళ విసుగుకి మాత్రం విసుగు రావటం లేదు.అయినా ముందు ముందు వీళ్ళు అసలు ఉండకపోవచ్చు - PEW వారి లెక్కల ప్రకారం మొదటినుంచీ మానవ సమూహాలలఓ నాస్తికులే అత్యల్ప సంఖ్యలో ఉంటూ వస్తున్నారనీ రాబోయే కాలంలో వీరి సంఖ్యలో మరింత తగ్గుదల కనిపించి ఒక శతాబ్దం తర్వాత వీరి అలికిడే ఉండదనీ తెలుస్తున్నది.అంటే,"ఈ రోబోట్ల యుగంలో...?!" అనేది మనం వినబోయే ఆఖరి వెక్కిరింత అన్నమాట - శుభం అందామా భశుం అందామా!
కొందరు యంత్రాలకు కృత్రిమమేధ ఇవ్వడం గురించి అంత భయపడడానికి బలమైన కారణమే ఉంది.ఇప్పటివరకు తను తన ఉపయోగం కోసం తను తయారు చేసుకుంటున్న యంత్రాలని తను చెయ్యమన్న పనిని మాత్రమే చేసి ఆగిపోయేటట్టు తయారు చేస్తున్నాడు.ఇప్పుడు తను ఫలానా పని చెయ్యమని చెప్పకుండానే స్వంత బుద్ధితో పనులు చేసేటట్టు తయారు చెయ్యాలనుకుంటున్నాడు - మనిషిలో లాగే ఆ బుద్ధి పెడదార్లు పట్టితే?
వీళ్ళ భయాలతో పని లేకుండా intelligent machines కోసం ప్రయత్నాలు కూడా చాలా కాలం నుంచే జరుగుతున్నాయి.ఆధునిక కాలంలో పూర్తి వివరాలతో రికార్డ్ అయి మనకి తెలుస్తున్న తొలి రోబో క్రీ.పూ 250లో సాక్షాత్కరించింది.Ctesibius అనే ఒక గ్రీకు ఇంజనీరు తను తయారుచేసిన ఒక నీటి గడియారంలో అవసరాన్ని అబ్ట్టి తమకు తామే కదిలి నీటి గడియారం ఆగకుండా చలించే యంత్రాలను ఇమిడ్చాడు.అయితే,ఇది కేవలం ఆశను రేకెత్తించిన వింతయే తప్ప దాన్ని అందిపుచ్చుకుని ఎవరూ హడావిడి చేసిన దాఖలాలు లేవు.అన్ని లెక్కలూ వేసుకుని పనిగట్టుకుని క్రీ.శ 1954లో George Devol అనే వ్యక్తి digitally operated and programmable robot అనేదాన్ని కనుక్కోవడంతో రోబోటిక్ ఇండస్ట్రీ అనేది ఉనికిలోకి వచ్చింది.
ఇవ్వాళ మనం వాడుతున్న సెల్ ఫోన్ల లాగే రోబోట్ల గురించి సైన్స్ ఫిక్షన్ రచయితలు చాలా కాలం నుంచే కలలు కంటున్నారు - వస్తే లైఫ్ ఇలా ఉంటుందని ఆశ పడ్డారు, మరోలా అవుతుంతుందేమోనని భయపడ్డారు, దీనితో మాత్రం ఒరిగేదేముందిలే అని విరక్తితో వేదాంతం చెప్పారు,
 మనలో చాలామందికి లీలగా తెలిసిన Frankenstein అనే భూతం క్రీ.శ 1818లో Mary Shelley రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలోని పాత్ర. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిందని మనం చెప్పుకునే సామెతలా ఆ నవలలోని ప్రధానపాత్ర అయిన Dr. Frankenstein చేసిన అత్యంత బలశాలిని సృష్టించే ఒక ప్రయోగం వికటించి ఆ భూతం తయారవుతుంది!దీని తర్వాత ఒక శతాబ్దానికి,అంటే క్రీ.శ 1921లో Karel Capek తను రాసిన R.U.R - (Rossum's Universal Robots) అనే నాటకంలో రోబోట్ అనే పేరు పెట్టాడు.ఈ కధలో కూడ రోబో తనని తయారుచేసినవాణ్ణి చంపేస్తుంది.క్రీ.శ 1927లో Fritz Lang తీసిన Metropolis ఆనె సినిమాలో మోద్టిసారి Maschinenmensch ("machine-human") రూపంలో రోబోట్ కనిపించింది.
ఆఖరికి ప్రఖ్యాత రష్యన్ సైన్స్ ఫిక్షన్ రచయిత Isac Asimov క్రీ.శ 1941లో robotics అనే మాటని అది ఉత్పత్తిరంగం అవుతుందనే సూచనతో వాడి ఇప్పటి స్థితిని కూడ వూహించాడు.ఈయన మంచి ఫ్యూచరిస్టు కూడా - భవిష్యత్తులో వచ్చే మార్పుల్నీ వాడకంలోకి వచ్చే వస్తువుల్నీ చాలామటుకు కరెక్టుగానే వూహించాడు - భవిష్యత్తును తెలుసుకోవడానికి అతీతశక్తులూ, మంత్రతంత్రాలూ, జ్యోతిషశాస్త్రమూ అక్కర్లేదని నిరూపించాడు!ఈయన Runaround కదలో సూత్రీకరించిన Three Laws of Robotics అనేవాట్ని రోబోటిక్స్ పరిశ్రమలో వాడుతున్నారో తెలియదు గానీ "I,Robot"తో సహా అన్ని రోబోట్లకి సంబంధించిన సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో నవలల్లో యధాతధం వాడుతున్నారు.నేను చూసిన రోబోట్లకి సంబంధించిన సినిమాల్ల్లో I,Robot కన్న bicentennial man అన్ని విధాల ఉన్నతమైన సినిమా!సినిమాలూ నవల్లూ ఎంత భయపెట్టి వెనక్కి లాగినా క్రీ.శ 1948లో Norbert Wiener అనే పెద్దమనిషి Cybernetics అనే పుస్తకం ప్రచురించడంతో రోబోటిక్స ఒక పరిశ్రమ అయిపోయింది.అదే సంవత్సరం William Grey Walter ఆనె British robotics Engineer మొదటిసారి Elmer, Elsie ఆనె రెండు రోబొట్లని తయారు చేశాడు.పవర్ అయిపోతున్నదని తమకు తామే తెలుసుకుని చార్జింగ్ హెడ్స్ ఎక్కడున్నాయో అవే వెతుక్కుని చార్జ్ చేసుకోవటం వాటి తెలివి:-)
ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చెయ్యాల్సి వస్తూ విసుగు పుట్టించే చోట intelligent robotsని వాడటం మంచిదే కదా!ఏ కొంచెం అడుగు తడబడినా చెయ్యి వొణికినా ప్రమాదాలు జరిగే పనుల్లో వీటిని వాడటం వల్ల మనుషుల ప్రాణాలను కాపాడవచ్చును కూడా.యంత్రాల వాడకం మనుషుల నిరుద్యోగితని పెంచుతుందని కొందరు భయపెడుతున్నారు గానీ సృజనాత్మకత ఉంటే మరో పనిని నేర్చుకుని మరో చోట ఉద్యోగం వెతుక్కోవచ్చు.అదీగాక ఈ యంత్రాలని కంట్రోల్ చేసే కీలకమైన నైపుణ్యాన్ని సాధిస్తే అట్లాంటి చోట పాతుకుపోయిన వ్యక్తులకి ఆదాయమూ ఎక్కువగానే ఉంటుంది. ఒక ప్రముఖ విమానాశ్రయం తమ విమానాలని పార్కింగ్ చెయ్యడం కోసం మనుషులకి బదులు intelligent system వాడటం వల్ల మిలియన్లలో ఆదా అవుతున్నదట - మానవ తప్పిదాలు కూడా దాదాపు శూన్యం!
కాల్పనిక సాహిత్యపు మేధావులు ఎంత భయపెట్టినా సైన్స్ ఫిక్షన్ రచయితలు ధైర్యం చెప్పడంతో మనిషి రోబోలని ఉనికిలోకి తీసుకురానే వచ్చాడు - నష్టం గురించిన భయాల కన్న లాభం గురించిన ఆశలే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మనిషిని ముందుకు నడిపిస్తున్నాయి.
మొట్టమొదటి కంప్యూటరును నడిపించిన తొలి ప్రోగ్రామర్ Lady Lovelace క్రీ.శ 1842లోనే అప్పటికి కొత్తొక వింతయిన కంప్యూటరు పని తీరు గురించి సందేహపడుతున్నవారికి,"The analytical engine has no pretentions to originate anything.It can do whatever we know how to order it to perform." అమి జవాబు చెప్పింది.ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పిన ఆ జవాబులోనే కృత్రిమ మేధకి సంబంధించిన ఆశలు ఇమిడి ఉన్నాయి.తర్వాత మళ్ళీ క్రీ.శ 1960లో Marvin Minsky అనే మేధావి "Steps Toward Artificial Intelligence" రాసిన పరిశోధనాపత్రం ఈ రంగంలో ఎంతో ముఖ్యమైన మలుపు. స్వలింగసంపర్కం ఆరోపణల వల్ల ఒతిడికి గురయి ఆత్మహత్య చేసుకున్నాడు గానీ లేనట్లయితే న్యూటన్, గ్రాహం బెల్, ఐన్స్టీన్ లాంటి వాళ్ళందరికన్న ఎక్కువ పేరు ప్రతిష్ఠలు వచ్చేవి!దీని తర్వాత కొద్ది కాలానికే Jim అనే పాక్షిక అంధుడైన ఒక మేధావి సాంకేతీకంగా artificial intelligenceకి మంచి prototype అనదగిన ఒక చిన్న ప్రోగ్రాం రాశాడు.దీనితో యంత్రాలకు కృత్రిమమేధని ఇవ్వగలం అని అందరికీ నమ్మకం కలిగింది.
మానవాళి చరిత్రని భయానకమైన విధ్వంసం నుంచి రక్షించే అపురూపమైన సన్నివేశాలలో నిలిచి పోరాడినవారు గానీ మానవుల సుఖజెవనానికి దారులు వేసే గొప్ప ఆవిష్కరణలలో పాల్గొన్నవారు గానీ - అందరూ మహాబలవంతులో అఖండప్రజ్ఞానిధులో ఆగర్భశ్రీమంతులో కాదు,తమ అవకరాల్నీ బలహీనతల్నీ పరిమితుల్నీ దాటుకుని ముందుకు వచ్చి కీర్తివంతులయ్యారు!ఇవన్నీ ఈతర దేశాలలో జరుగుతున్న కధలు - మన దేశంలో మాత్రం మూడువేల యేళ్ళ క్రితం బ్రాహ్మణులు మా తాతల్ని చదువుకోనివ్వకపోవడం వల్లనే ఇవ్వాళ మేము వెనకబడిపోయామని కొందరూ రెండు వందల యేళ్ళ క్రితం ఇంగ్లీషువాళ్ళ అణిచివేత వల్లనే ఇవ్వాళ మేము వెనకబడిపోయామని కొందరూ గతాన్ని తవ్వుకుంటూ నిలబడుతున్నారే తప్ప ఇప్పటికైనా కదిలి రేపటికి తప్పకుండా ముందుకెళ్తాం అనే హుషారుని చూపించలేకపోతున్నారు.
నిన్నటి తరం గొప్పదనాన్ని చెప్పుకోవటంతో సరిపెట్టేస్తూ ఉంటే ఏ తరమూ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు.వెనకబడిన విషయాన్ని ఒప్పుకుని ముందుకు వెళ్ళటానికి తిందరపడాలి.మన దేశంలో తప్ప ప్రపంచం మొత్తం AI చుట్టూ తిరుగుతున్నది.కొందరు భయపెడుతున్నట్టు యంత్రాలు మనిషిని మించిపోయి తిరగబడే ప్రమాదం ఏమీ లేదు.వాళ్ళ పిచ్చి గానీ మనిషి ఇప్పటికే మచ్చిక చేసుకున్న కుక్కగుర్రంఏనుగు లాంటి జంతువులు జీవమూ ఆలోచనా ఉన్నవే కదా - అవే తిరగబడనప్పుడు యంత్రాలు తిరగబడటం ఎట్లా జరుగుతుంది? తిరగబడితే సాటి మనుషులన్న కనికరం కూడా లేకుండా వేలు,లక్షలు, మిలియన్ల సంఖ్యలో నిలువునా హతమార్చి మీసాలు మెలివేసిన చరిత్ర గల సామ్రాజ్యవాద సిద్ధాంతులకి యంత్రాలని అణిచివెయ్యడం ఒక లెక్కా!
అసలు artificial intelligency ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?అయితే Patrick Winston ఇస్తున్న లెక్చరు  వీడియో చూడండి.ఈ వీడియో మొత్తం చూదగలిగితే మంచిదే గానీ ప్రస్తుతం ముఖ్యమైన విషయం 1:16/49:55 నుంచి 6:42/49:55 వరకు ఉంటుంది.అక్కడ చూపిస్తున్నది తొలిదశలో రాసిన ప్రోగ్రాము.ఏం చేస్తున్నది అది?చెప్పింది చెప్పినట్టు చెయ్యడమే కాకుండా ఫలానా పని ఎందుకు చేశావు అంటే కారణం చెబుతున్నది,అదే తను చెయ్యని పనిని గురించి అడిగితే "Did I do it?" అని రెట్టిస్తున్నది - ఎవరిది ఆ ఘనత, ప్రోగ్రామరుది కాదూ!మనవాళ్ళు కూడా మరీ వెనకబడి లేరు లెండి,ఒక సిక్కు కుర్రాడు పాత Farmer-Fox-Goose-Grain పజిలుని తీసుకుని ఎంత సుదీర్ఘమైన సుత్తి వేశాడో చూదండి - ఆఖర్న artificial intelligent program కూడా రాసేశాడు.కొద్దిమంది అత్యద్భుతమైన విజయాల్ని నమోదు చెయ్యడం తప్పిస్తే ప్రపంచ ఆర్ధిక రంగంలో భారతదేశం యొక్క స్థానం చెప్పుకోదగిన స్థాయిలో లేదు.ప్రపంచ వేదిక మీద రాజకీయపరమైన దౌత్యపరమైన అంశాల్లో మన మాట చెల్లుబడి కాకపోవటానికి ప్రపంచ విపణి మీద మనకి పట్టు లేకపోవటమే అతి ముఖ్యమైన కారణం.
ఈ వెనుకబాటుకి ముఖ్యమైన కారణం మన విద్యావ్యవస్థయే!ప్రస్తుతపు విద్యావిధానం మెకాలే నాటి కాలపు మూస పద్ధతిలోనే నడుస్తూ బిళ్ళ బంట్రోతుల్నీ చిన్న గుమాస్తాల్నీ పెద్ద ఉద్యోగుల్నీ తయారు చెయ్యటానికి తప్ప ఇవ్వాళ్తి పరిశ్రమలకి పనికివచ్చే క్రియేటివ్ కుర్రాళ్ళని పుట్టించటానికి పనికిరాదు,నిజమే - అయినప్పుడు దాన్ని మార్చుకోవాలి, మార్చుకుని బాగుపడాలి!ప్రవచనకారులు ఎన్ని నీతులు చెప్పినా, శాస్త్రజ్ఞులు ఎన్ని గొప్ప వస్తువులు కనుక్కున్నా, కళాకారులు ఎంత వినోదాన్ని పంచినా మనిషి తనకు గౌరవప్రదమయిన జీవనోపాధినీ సంతృప్తికరమయిన ఆదాయాన్నీ ఎవరు ఇస్తారో వారికి మాత్రమే అధికారాన్ని కట్టబెడతాడు - వ్యాపారం,ఆధ్యాత్మికం,రాజకీయం వేరు వేరు కాదు.మనుషులు వాటిని విడివిడి అస్తిత్వాలు అని పొరబడుతున్నారు,అంతే!ధనం యొక్క సృష్టికి వ్యాపారమే మూలం.ఉద్యోగులు కూడా తమ శ్రమని యజమానికి అమ్ముతున్నారు నెలవారీగా- అందుకే ఉద్యోగాలు ఇవ్వడానికీ తెచ్చుకోవడానికీ మధ్య జరిగే వ్యవహారాల్ని కలిపి జాబ్ మార్కెట్ ఆనె పదం పుట్టింది.సంపదని సృష్టించే ప్రతి చోటా అమ్మకందారు, వస్తువు, ఖరీదు, కొనుగోలుదారు, లాభం, నష్టం, అనే అంశాలు ఉండి తీరుతాయి. కొన్నిచోట్ల ప్రస్ఫుటంగా కనబడుతూ అన్నిచోట్లా అంత స్పష్టంగా కనిపించని ఏదో సింహంలా అదనపువిలువ కూడా దాక్కుని ఉంటే ఉందవచ్చు ఆర్ధిక శాస్త్రం మొత్తం ఎవరు దేన్ని ఎంతకి అమ్ముతున్నారు, ఎవరు దేన్ని ఎక్కువ కొంటున్నారు అనే దాని చుట్టూ తిరుగుతుంది తప్ప మతాన్నీ కులాన్నీ ప్రాంతాన్నీ చూడదు.కులానికీ మతానికీ ప్రాంతానికీ అంటుకుపోయి భారతీయులు వ్యాపార సంస్కృతికి దూరం కావదం వల్లనే మన రూపాయి బలహీన పడింది.

యంత్రాలకి కొత్త బుద్ధి వస్తుంటే భారతీయులకి ఉన్న బుద్ధి పోయింది - వీళ్ళకన్న యంత్రాలే నయం!

17 comments:

  1. సత్త్వరజస్తమో గుణాలతో మొదలుపెట్టి బాగా రాశారు. ఇప్పటిదాకా మనిషి existing creatures ని ఆధీనం చేసుకున్నాడు. కానీ, రోబోలనబడేవి మానవమేధో నిర్మితం. వాటికంటూ ఒక inbuilt consciousness మరియు ఒక enhanced conscience ఉంటే (మానవుడే అందిస్తే,), వాటినెలా utilize చేస్తాయనే దాన్ని బట్టి మన భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఇప్పటిదాకా మానవ కేంద్రం గా జరిగిన అభివృద్ధి (anthropocentrism) , తన locus మార్చుకోవచ్చేమో! ఆ సందర్భంలో మన ఈ రోబో యత్నం భస్మాసుర హస్తం అవుతుందా?

    ReplyDelete
    Replies
    1. @Venkatesh Prasad
      వాటికంటూ ఒక inbuilt consciousness మరియు ఒక enhanced conscience ఉంటే (మానవుడే అందిస్తే,), వాటినెలా utilize చేస్తాయనే దాన్ని బట్టి మన భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

      hari.S.babu
      మీరు మర్చిపోతున్న విషయం ఒకటి ఉంది.ఈ రోబోటిక్స్ ఆనేది కొంతమంది సైన్స్ ఫిక్షన్ రచయితలు కలలు కన్నారనో మానవజాతి యొక్క అద్భుతమైన విజయాల లిస్టులోకి యెక్కించాలనే సరదా వల్లనో పుట్టుకు రాలేదు.

      ఒక్క రోబోని కూడా ఫ్రీగా ఎవరికీ ఇవ్వడం లేదు,సబ్బు,సైకిలు,విమానం లాంటి అమ్మకానికి పెట్టిన వస్తువులే!మ అరోబోకి consciousness కూడ ఔంది.మీరు ఎవణ్ణి చంపమంటే వాణ్ణి చంపుతుంది,ఏదా చంపడానికి ప్లానులిస్తుంది అంటే కుదరదు కదా!ఇవే కాదు మరో విధంగానైనా కొనేవాళ్ళకి నష్టం/ప్రమాదం వచ్చేటట్లయితే దాన్ని కొనేవాడూ ఉండడు,కొనేవాడు లేకపోతే తయారు చెసేవాళ్ళూ ఉండరు.

      మొట్టమొదట తయారైన రోబో నుంచి ఇప్పటివరకు అన్నింటినీ లాభం కోసమే తయారు చేస్తున్నారు.సోఫియా జనాలకి నమ్మకం కలిగించడానికి వాడుకుంటున్న ఆటబొమ్మ మాత్రమే!మిగిలినవి కూడా కొనుకోలుదారులకి సౌకర్యం అందించే అమ్మకానికి పెట్టిన వస్తువులే,కస్త ప్రత్యెకమైనవి - పని తీరు కొంచెం ప్రత్యేకం,అంతే!

      Delete
    2. నిజమే సార్. Demand-Supply dimension లో నేను ఆలోచించలేదు. Market will correct its fallacies . కాకుంటే, ఇదే market economy కోణంలో మనం చర్చిస్తే , ఒక కొనుగోలు చేయబడ్డ వస్తువు అమ్మకందారు ఇచ్చే product specifications ప్రకారం ఉంటుంది.producer కి తెలియకుండా తన స్వభావాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా transact చేయబడ్డ products వేటిలోనూ మానవ స్థాయి ఆలోచన లేదు. Soap లాంటివైతే full-fledged non living things.. మరి కొన్ని living things ని కూడా మనం ఇప్పటి దాకా transact చేశాము. ( పెంపుడు జంతువులు మొద ।।) కానీ ఇవేవీ తమ అమ్ముకుంటారు/తయారీదారు ఊహల్ని మించవు. కాబట్టి, caveat Emptor నెపంతో consumer పూర్తిగా liable అవుతాడు..
      మధ్య యుగాల్లో నెరిపిన slave trade లో మాత్రమే, ఒక conscious being (sentient అనవచ్చేమో) commodity మాదిరిగా transact చేయబడ్డాడు. అయినప్పటికీ, బానిస ఒక constrained consciousness కి లోబడి ఉంటాడు. ( తిరగబడే వరకైనా) robot కూడా ఇలాంటి compressed spring లాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే, తన inherent potential తెలుసుకునే వరకే అది మనకు లోబడి ఉండి," అనువుగాని చోట అధికులమనరాదు.." అన్నరీతిలో time కోసం wait చేసి మనకు నష్టం కలిగిస్తే liability fixation గురించి ఆలోచించాలి. Inventor liability ఎంత, seller liability ఎంత, user liability ఎంత, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి.. అదే మామూలు tool అయితే నేను చెప్పినట్లు చేస్తుంది. అగ్గిపుల్ల వల్ల పాక కాలిపోతే, matchstick company మీద మనం case వెయ్యం. ఎందుకంటే అది అగ్గిపుల్ల తనకుతానే చేసిన పని కాదు. మరి robot అలా కాదు కదా!! మరి sample showpiece Sophia నీటముంచునో పాలముంచునో ?

      Delete
    3. ఇందాకటి comment కి కొనసాగింపు....
      అది చేసిన నష్టానికి మనం reciprocate అయ్యే లోగా, loss యొక్క range మన చేదాటిపోవచ్చు. ఖాండవవనం అగ్గినెక్కాక అర్జనుడైనా ఆపలేడు కదా!

      Delete
  2. ఇదెక్కడి న్యాయం ?
    February 15, 2018
    మను ధర్మ శాస్త్రం -2

    ఎం.వి.ఆర్. శాస్త్రి

    అనుమానం అక్కర్లేదు. ఈ మాట ఒప్పుకోవటానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండనక్కరలేదు.

    " మనుస్మృతి " పేర ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్రంథాల్లో ఎవరు వేసింది , లేక ఎవరు రాసింది చదివినా , అందులో శూద్రుల పట్ల , చండాలాది అంత్య జాతుల పట్ల కొట్టవచినట్టు కనపడే క్రూరత్వం , దుర్వివక్ష లను చూస్తె మనిషన్న ప్రతి ఒక్కడికీ వొళ్ళు మండుతుంది. మరీ ఇంత అమానుషమా అని తీవ్రమైన జుగుప్స కలుగుతుంది. కడగొట్టు జాతులను ఉద్దేశించి అందులో నిర్దేశించిన శిక్షలను గానీ , వాటి వెనుక ఉన్న బ్రాహ్మణాధిక్య భావజాలాన్ని కానీ ఈ కాలం లో ఎవరూ సమర్ధించరు. సమర్ధించ కూడదు.

    అదే సమయంలో సో కాల్డ్ " మనుస్మృతి ' ని సాక్ష్యం గా చూపెట్టి , అందులో పేర్కొన్న దుర్మార్గపు శిక్షలు , వివక్షలు అన్నిటినీ హిందూ సమాజం లేక హిందూ మతం అనాదిగా , యుగ యుగాలుగా కింది వర్ణాల పట్ల అమలు జరిపిందని ఆరోపించటం తప్పున్నర తప్పు.

    ఈ సందర్భంలో ముఖ్యంగా గమనించవలసిన వాస్తవాలు కొన్ని ఉన్నాయి.

    1. మను ధర్మ శాస్త్రం వేరు. ఆధునిక కాలంలో " మనుస్మృతి " పేర చలామణి లో ఉన్న అతుకుల బొంత , తప్పుల తడక పుస్తకాలు వేరు.

    2. రామాయణం లో , మహాభారతం లో మనువు , అతడు నుడివిన మానవ ధర్మం ప్రస్తావన అత్యంత గౌరవ పూర్వకంగా, పరమ ప్రమాణంగా కనిపిస్తుంది. శ్రీరాముడి పూర్వీకులైన రఘువంశం రాజులు అందరూ మనువును అనుసరించి ధర్మపాలన చేశారని " రఘువంశం " లో కాళిదాసు పేర్కొన్నాడు.
    ఈ మధ్య రామసేతు కు సంబంధించి వెలువడిన ఒక శాస్త్రీయ రుజువును బట్టి చూసినా రాముడు కనీసం 7 వేల ఏళ్ళ కిందటి వాడు. చరిత్రకారులు చాలామంది తేల్చిన ప్రకారం మహాభారత యుద్దం క్రీస్తు శకానికి వెనుక 3102 సంవత్సరంలో అంటే కనీసం 5 వేల ఏళ్ళ కింద జరిగింది. దీన్ని బట్టే మనువు , మనుధర్మం ఎన్నో వేల ఏళ్ళుగా సుప్రసిద్ధమైనవని స్పష్టం.

    3. ఇక మనం చూస్తున్న ' మనుస్మృతి " సంగతి. ఇది ఏకాలం లో రాసింది అన్నదాని మీద చరిత్రకారులు తలా ఒక రకంగా చెబుతారు. కొందరు ఇది క్రీ. పూ. 2 వ శతాబ్దం నాటిది అంటారు. మరికొందరు క్రీ.శ.3 వ శతాబ్దం నాటిది అని చెబుతారు. అందరు చెప్పెదీ చూసినా ఇది మహా అయితే అటూ ఇటూగా 2000 సంవత్సరాల నాటిది.

    4. పోనీ ఈ 2 వేల ఏళ్ళుగా అయినా వ్యవహారం లో ఉన్న మనుస్మృతి ఇదీ అని కచ్చితంగా చెప్పగలమా?

    Over fifty manuscripts of the Manusmriti are now known, but the earliest discovered, most translated and presumed authentic version since the 18th century has been the "Calcutta manuscript with Kulluka Bhatta commentary". Modern scholarship states this presumed authenticity is false, and the various manuscripts of Manusmriti discovered in India are inconsistent with each other, and within themselves, raising concerns of its authenticity, insertions and interpolations made into the text in later times.

    [ Wikipedia , quoting Patrick Olivelle in "Manu's Code of Law", Oxford University Press ]

    ReplyDelete
  3. ( మనుస్మృతి కి సంబంధించి 50 కంటే ఎక్కువ రకాల రాతప్రతులు బయటపడ్డాయి . కనుగొన్నవాటి అన్నిటిలోకీ పాతదీ, ఎక్కువగా అనువదించబడ్డదీ , ప్రామాణికమని 18 వ శతాబ్దం నుంచీ ఊహించబడినదీ కుల్లూక భట్టు వ్యాఖ్యానంతో కూడిన " కలకత్తా రాతప్రతి ". దాని ప్రామాణికత కూడా అబద్ధమని ఆధునిక విద్వాంసులు తేల్చారు. భారతదేశం లో కనుగొన్న వివిధ రాతప్రతుల్లో ఒకదానికీ ఇంకొకదానికీ పొంతన లేదనీ, ఒక ప్రతిలో చెప్పినవాటి విషయాల్లోనే పొంతనలేదనీ పరిశోధకులు చాటారు. దీనివల్ల ఏ రాతప్రతికి ఆ రాతప్రతి ఎంత వరకూ అసలైనది . అనంతర కాలాల్లో వాటిలోకి చేర్చిన , చొప్పించిన ప్రక్షిప్తాలు ఏమిటి అన్న అనుమానాలు రేకెత్తాయి. )

    కాళిదాసు కవిత్వం కొంత , నా పైత్యం కొంత అన్నట్టు ఒక్కో కాలంలో ఒక్కకరు , తమకు తోచినట్టు, ఇష్టం వచ్చినట్టు లేనిపోనివి జోడించి గ్రంథం పెంచుకుంటూ పోవటంతో ఇప్పుడు మనం మనుస్మృతి అనుకుంటున్నది నానా పైత్యాల , నానా చేతివాటాల కంగాళీ గా తయారయింది.

    5. మహమ్మదీయులకు షరియత్ లాంటిది కాదు హిందువులకు మనుస్మృతి. అది ధర్మ శాస్త్రమే తప్ప శిక్షా స్మృతి ఎంతమాత్రమూ కాదు. నేటి ఇండియన్ పీనల్ కోడ్ వలె దానిలో సూచించిన శిక్షలకు చట్టప్రతిపత్తి లేదు. శాసనపరమైన ఆమోదమూ లేదు. హిందూ దేశంలో ఏ కాలంలో ఏ రాజూ మనుస్మృతి ని ఆధికారిక , ఏకైక రాజ్యాంగం గా ప్రకటించిన దాఖలా కంచు కాగడాతో వెతికినా ఒక్కటీ కనపడదు. పూర్వకాలంలో ఏ జాతికి ఆ జాతి, ఏ జనపదానికి ఆ జనపదం తన ఆచారం, సంప్రదాయం, ఆలోచనా విధానాన్ని బట్టి నేరాలకు శిక్షలను నిర్ణయించడమే తప్ప మన కాలంలో వలె మొత్తం రాజ్యమంతటికీ కలిపి ఒకే న్యాయవిధానం , ఒకే శిక్షాస్మృతి ఉండేవి కావు.

    6. రామాయణం , భగవద్గీత ల వలె మనుస్మృతి హిందువులకు పవిత్ర మతగ్రంథం ఎన్నడూ కాదు. "మనుస్మృతి" విధిగా పాటించి తీరవలసిన , అనుల్లంఘనీయమైన ధర్మ శాసనమని అది వ్యవహారంలోకి వచ్చిన ఈ 2 వేల ఏళ్ళలో ఏనాడూ హిందూ సమాజం భావించలేదు. అది ధర్మశాస్త్రమే తప్ప న్యాయశాసనం ఏనాడూ కాదు. అటువంటి ధర్మశాస్త్రాలు యాజ్ఞ్యవల్క్య స్మృతి , గౌతమస్మృతి వంటివి మనకు ఇంకా డజన్ల కొద్దీ ఉన్నాయి.

    కృతేతు మానవాః ప్రోక్తా :
    త్రేతాయాం గౌతమ స్మృతి :
    ద్వాపరే శంఖ లిఖితౌ
    కలౌ పారాశర స్మృతి :

    ReplyDelete
  4. కృతయుగంలో మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమ స్మృతి , ద్వాపరంలో శంఖలిఖిత స్మృతి , కలియుగం లో పారాశర స్మృతి ఆచరణీయమని పెద్దల మాట. మనం ఉన్న కలియుగం లో మనుస్మృతిని పాటించాలని ఎంతటి చాందసుడూ చెప్పలేడు . ఈ యుగంలో ఏనాడూ ఎవరూ పాటించని, ఎన్నడూ నెత్తిన పెట్టుకోని మనుస్మృతి లో ఎవరో ఎప్పుడో బనాయించిన దుర్మార్గపు రాతలకు మొత్తం హిందూ మతాన్ని, హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని నిందించటం ఎంతవరకు న్యాయం ?

    6. మనుస్మృతిలో మనకు కనపడుతున్న శూద్ర , దళిత ద్వేషం గానీ , కడజాతులను అన్యాయంగా , అమానుషంగా కాల్చుకు తినడం గానీ కలియుగానికి ముందు వేదకాలపు, పౌరాణిక యుగాలలోనైనా ఉన్నదా అంటే నిర్దిష్టమైన ఆధారం ఒక్కటీ కనపడదు.

    తపస్సు చేస్తున్నందుకు రాముడు శూద్ర శంబూకుడిని చంపాడు.
    ఆదివాసి ఏకలవ్యుడి బొటన వేలును ద్రోణుడు తెగగొట్టాడు.
    కర్ణుడిని సూతపుత్రుడా అని అవమానించారు.
    హరిశ్చంద్రుడు ఆలిని అమ్మాడు.
    ధర్మరాజు భార్యను జూదంలో పణం పెట్టాడు.
    రాముడు సీతను అడవికి గెంటాడు.

    ఎవరు ఎప్పుడు ఎన్ని తీర్ల ఎంత తిట్టిపోసినా , అనాదిగా జరిగినవనబడే అన్యాయాలకు దృష్టాంతంగా చూపించేవి ప్రధానంగా ఇవే కదా? ఇవన్నీ , వ్యక్తిగతమైన , వ్యక్తుల పరంగా జరిగిన అరుదైన ఘటనలే కాదా ? వీటిని పట్టుకొని, ఆ కాలాల్లో రాజులందరూ శూద్రులను చంపారు ;అస్త్రవిద్య నేర్చిన గిరిజనులందరి బొటన వెళ్ళు తెగగొట్టారు ; శూద్రులందరినీ అవమానించారు ; భర్తలందరూ కట్టుకున్న పెళ్ళాలను అమ్ముకునేవారు ; వారిని జూదంలో పణం పెట్టేవారు ; అనుమానం రాగానే భార్యలను కారడవులకు గెంటేసేవారు .. అని జనరలైజ్ చేయటం సమంజసమేనా ?
    అలాంటి చెదురుమదురు ఘటనలే తప్ప ..

    వేదం వినిన శూద్రుడి చెవుల్లో సీసం మరగబెట్టి పోశారనీ ...
    వేదం చదివిన శూద్రుడి నాలుక కోశారనీ..
    బ్రాహ్మడిని తిట్టినా శూద్రుడి నోట్లో సలసల కాలే ఇనుప కడ్డీని దోపారనీ ..
    బ్రాహ్మలిని ఏ అంగంతో శూద్రులు అవమానిస్తే ఆ అంగాన్ని నరికేశారనీ ..

    ఏ పురాణంలో నైనా , ఏ ఇతిహాసంలో నైనా, ఏ చరిత్ర గ్రంథంలోనైనా ఎక్కడైనా ఉందా ?
    లేనప్పుడు.. మనుస్మృతిలో కనపడుతున్నాయి కాబట్టి అలాంటి క్రూరమైన , అమానుషమైన శిక్షలన్నీ పూర్వం అన్ని కాలాల్లో అమలు జరిగే ఉంటాయని ఊహించటం , మొత్తం హిందూ మతాన్ని శూద్ర వ్యతిరేకిగా , దళిత ద్వేషిగా ముద్రవేయటం సబబేనా ? మనకాలంలో అనేకానేక కారణాల వల్ల వెర్రితలలు వేసి , సమాజంలోని , అట్టడుగు కులాలను, బడుగు బలహీన వర్గాలను కాల్చుకు తింటున్న కుల రక్కసి చేస్తున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు అన్నిటికీ మనుధర్మాన్ని ముద్దాయిని చేయటం న్యాయమేనా?

    [ తరువాయి భాగం : ఏది ప్రక్షిప్తం ? ఏది మను ధర్మం ? ]

    ReplyDelete
  5. సార్, ఈ మరమనిషి తెలివితేటలు దాని సృష్టికర్త వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందా ?

    ReplyDelete
    Replies
    1. లేదు,ఇక్కడ వ్యక్తిత్వం కాదు ముఖ్యమైనది.ఎవరు తయారు చహెసినా ఒకే ఒక మనిషి ఒంటరిగా కూర్చుని అన్నీ తనే సమకూర్చుకుని తయారు చెయ్యడు.పని చేసేది గ్రూపు అయినప్పుడు ఎవడి వ్యక్తిత్వాన్ని దానిలో పెడితే ఎవడు వూరుకుంటాడు?

      Delete
  6. ఈ సోఫియా ఇస్తున్న జవాబులు ఇంతకుముందే ఫీడ్ చేసిన మెమొరీ నుండి ఇస్తున్న జవాబులేనా ? లేదా కొత్తగా/సొంతంగా ఆలోచించి ఇస్తోందా ?

    ReplyDelete
    Replies
    1. Patrick Winston ఇస్తున్న లెక్చరు వీడియోచూశారా?ఎవరు ఏ వైపు నుంచి ఏ ప్రశ్న అడుగుతారో వూహించడం కష్టం కదా!సోఫియా కూడా పాట్రిక్ గారి ప్రోగ్రాము లాగే సొంతంగా ఆలోచించి చెబుతున్నది.చలాకంపెనీలు ఫ్రొంట్ ఆఫీసుల్లో హ్యూమనాయిడ్ రోబోస్ వాడుతున్నారు.అవి కూడ మనం ఏది అడిగినా సరైన జవాబు చెబుతున్నాయి.

      Delete
  7. Its better to publish content related or any topic which may be useful to all(Its a request only)

    ReplyDelete
  8. సార్, మరమనిషిని సృష్టిస్తున్న శాస్త్రవేత్తలు రేపు మానవ క్లోనింగ్ ద్వారా మనుషులను సృషిస్తే పరిస్థితులు యెలా ఉంటుంది.
    https://en.wikipedia.org/wiki/The_Island_(2005_film)

    ReplyDelete
    Replies
    1. మరమనుషుల్ని సృష్టించడమూ మానవ క్లోనింగూ వేరు వేరు - వీటి వెనక ఉన్న ఉద్దేశాలు కూడా పూర్తి విభిన్నం!మరమనుషులు మనకి పనులు చేయడానికి అయితే క్లోనింగ్ అనేది జన్యులోపాల అవ్ల్ల వచ్చే రోగాల్ని కుదిరితే మాయం చెయ్యడం లేదంటే తీవ్రతన్ని తగ్గించడం కోసం జరుగుతున్నాయి.వాటి వల్ల కూడా భాయంకరమైన ప్రమాదాలు ఏమీ రావు.ఒక హిట్లరుని క్లోన్ చేసి వెయ్యి మంది హిట్లర్లని పుట్టిస్తారేమో అనే లాంటి భయాలు అనవసరం.హిట్లరుని క్లోన్ చెయ్యగలిగితే బుద్ధుణ్ణి కూడా క్లోన్ చెయ్యవచ్చు!

      Delete


  9. క్లోనింగన్న నదేల భీతి ! నరుడా! కోతిన్, భళా హిట్లరున్
    నానా రీతి జిలేబులన్ సృజన‌ చానా చేతురో?బుద్ధుడిన్
    తానే జేయగలండతండు గదరా! ధైర్యమ్ముగా బొమ్మురా!
    యేనాడైనను దిక్కు దేవుడు గదా యెవ్వారికైనన్ ! హరీ!


    జిలేబి

    ReplyDelete
  10. ee jilObhi gaari kapitalatO visugetti pOtOndanDi, nijangaa!

    ReplyDelete
  11. Founder Dr. Narendra Dabholkar

    Dr. Ambedkar and Brahmins By - Justice R.A. Jahagirdar (Retd)


    Rakshit Sonawane’s account of how Dr. Babasaheb Ambedkar’s son and the so-called followers of Babasaheb treated Dr. Savita Mai makes very sad reading (Indian Express, Friday, 30th May, 2003). The devotion with which Babasaheb’s Brahmin wife looked after him in his fading life and health went totally unheeded; worse, even Babasaheb’s appreciation of the way she nursed him and cared for him was sought to be erased by his followers.

    When Babasaheb’s The Buddha And His Dharma was posthumously published, it was published without the Preface written by Babasaheb. The Preface which was written on 15th March, 1956 contained touching references to the help he had received from his wife. After the great leader’s death, his widow had become persona non grata to his followers and the publishers suppressed the Preface and along with it, Babasaheb’s expression of his fine feelings for his wife


    When Babasaheb was under a siege while piloting the Hindu Code Bill, which was opposed tooth and nail by the Kayastha President of India, it was two Brahmins — Hridaynath Kunzru and N.V. Gadgil — who made strong speeches in its support in the Lok Sabha. Incidentally it should be noted that Gadgil had been seriously injured while trying to force entry in a temple at Poona along with the untouchables. However, it must also be mentioned that the Bengali Brahmin, Dr. Shyama Prasad Mookerji, denounced the Bill as the one which would destroy the Hindu society.


    http://www.thoughtnaction.co.in/dr-ambedkar-and-brahmins/

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...