Monday 7 December 2015

కడుపుకి బుక్కెడు బువ్వ తినడం కోసం ఆవునే చంపాలా ఈ రచయిత గారు!హిందువుల్ని వెక్కిరించటానికి చట్టాల్ని కూడా ధిక్కరించాలా ఈ సెక్యులరిష్టులు?

     నేను కధలు రాయను గానీ మంచి కధ కనపడితే చదవటం బాగుంటే మెచ్చుకోవడం చెయ్య్యకుండా ఎలా ఉంటాను?ఈ మధ్యనే సారంగలో "బుక్కెడు బువ్వ" అనే ఒక కధ చదివాను.మొదటి కధ అంటున్నారు గాబట్టి నాకు కూడా శిల్పరీత్యా విశ్లేషించే పాందిత్యం కూడా లేదు గాబట్టి కధలో తప్పులు వెదికే పని చెయ్యను గానీ తీసుకున్న విషయం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రాజకీయ విద్వేషాలకి కారణమైన గోవధ!గోవధని ఇతివృతంగా తీసుకోవడంతో సహజంగానే అందరి దృష్టినీ ఆకర్షించింది.వివాదాస్పదమయిన అంశం కావడంతో వ్యతిరేకతా వస్తుంది,వాద ప్రతివాదాలూ జరుగుతాయి.అది రహస్యమేమీ కాదు.అయితే నా అభిప్రాయం మాత్రం ఎన్నిసార్లు వేసినా ప్రచురితం కావటం లేదు.రోజుకోసారి చొప్పున ఒక ఆయిదు రోజుల పాటు వేసి చూశను.అయినా ఒక్క కామెంటూ పబ్లిష్ అవ్వలేదు.మిగిలిన వారి కామెంట్లు పడుతూనే ఉన్నాయి,ఒకరు తన కామెంట్లకి వెంటవెంటనే జవాబులు రావడం గురించి ప్రస్తావించారు కూడాను. కామెంటు ఘాటుగా ఉండటం వల్ల నా అభిప్రాయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ప్రచురించకూడదనే ఉద్దేశంలో వారు ఉన్నట్టు అనుమానం వచ్చింది!పట్టు వదలకుండా పబ్లిష్ అయ్యేవరకూ మళ్ళీ మళ్ళీ వేద్దామంటే "పనిలేక"  బ్లాగు లాగానే ఇది కూడా మూతబడుతుందేమో ఎందుకొచ్చిన గోల, నా మూలంగా సారంగా కూడా నా సామిరంగా అయిపోతే ఇంకో పాపం చుట్టుకుంటుంది,ఏ దిక్కూ లేకుంటే అక్కమొగుడే దిక్కన్నట్టు ఎలాగూ నాకో సొంత బ్లాగు ఉందిగా అనిపించి అక్కడ ప్రచురితం కాని కామెంటుని ఇక్కడ వేస్తున్నాను.



     నాకు మొదటి నుంచీ ఒక విషయం చూచాయగా తెలియటం వల్ల వీరి వాదనల పట్ల కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉండేది - నాకు తెలిసింది ఏమిటంటే దేశంలో 1950ల నుంచే గోవధ నిషేధ చట్టాలు ఉన్నాయి!కొందరు ఇదివరలో పశువుల్ని చంపటం మాదిగలు చేసి వాటి చర్మంతో చెప్పులు కుట్టుకోవటం ఎప్పటినుంచో ఉంది కదా ఇప్పుడెందుకు కొత్తగా ఆవులకి గడ్డి పెట్టనివాళ్ళు,వాటి పేడ ఎత్తనివాళ్ళు గోల చేస్తున్నారు అని వాదిస్తున్నారు. వాళ్ళు చేసింది సహజంగా వృధాప్యానికి చేరిన వాటిని చంపటం గానీ సహజ మరణం వల్ల గానీ మాత్రమే వారు ఆ పనులు చేసేవారు, క్రయవిక్రయాలు జరిగేవి కావు!ఇప్పుడు ఇక్కడ వివాదాస్పదమవుతున్నది పెద్ద సంఖ్యలో వ్యాపారం కోసం చంపటం!అదీ ఆరొగ్యంగా ఉన్నవాటిని చంపి తినటం, హోటళ్లలో మెనూ ఐటంసుగా వడ్డించటం!కానీ ఈ రచయిత ఏమి సన్నివేశం కల్పించారు?ఒక బిచ్చగాడికి మూడు రోజుల్నించి ఎవరూ బిచ్చం వెయ్యకపోతే ఆకలికి తట్టుకోలేక ఆవుని చంపి తిన్నాడని?!నేను ఆ కామెంటులో ఆ చట్టాల విషయాన్ని ప్రస్తావించి వూరుకునే కంటే ఆధారాలు చూపించటం మంచిది కదా అనే వుద్దేశంతో ఆఖరి నిముషంలో అసలు నిజంగా చట్టాలు అంత గట్టిగా ఉన్నాయా లేవా అని వెతికితే పూర్తి ఆధారాలతో ఉన్న సమాచారం దొరికింది.బహుశా నేను చూపిస్తున్న ఆధారాలు బలమైనవి కావటంతో నా సమాధానాన్ని ప్రచురించే ధైర్యం వారికి రావటం లేదు కాబోలు!ఇదీ న్యాయానికి కట్టుబడి వాదిస్తున్నాం,హిందువుల అన్యాయాన్ని ఖండిస్తున్నాం అని చెప్పుకునే వీరి న్యాయవర్తన. సిగ్గు లేకపోతే సరి!


     అత్యంత భయానకంగా చెలరేగిపోతున్న "ISIS" తీవ్రవాదాన్ని విమర్శించే కధనంలో నిధులు ఎక్కణ్ణించి వస్తున్నాయో వివరించే భాగంలో పిగ్గీ బ్యాంక్ బొమ్మ ఉందని కనీసం ఎడిటర్ గారికి తమ అసంతృప్తిని తెలియజేసే మామూలు దారి ఉందని తెలియకనో తెలిసినా అంత సహనం లేకనో ఆ దారిలో వెళ్ళకుండా పత్రికాఫీసు మీద దాడి చేసినది ముస్లిములే!ఇలాంటివి ఎన్ని జరిగినా ఈ సోకాల్డ్ సెక్యులరిష్టులకి చీమ కుట్టినంత ఆందోళన అయినా రాదు,ఎందుకనో?ఇండియన్ మీడియాకి ఎటూ సిగ్గూ శరం పోయి చాలాకాలమైంది గదా!ఇంకో లక్ష సార్లు ఇలాంటివి జరిగినా వారికి ముస్లిముల్లో ఉన్న అసహనం కనపడదు.తస్లిమా నజ్రీన్ మీద జరిగిన దాడి ఎప్పటిది?అప్పుడు వీరి ప్రతిస్పందన ఎంత బలంగా ఉంది!



     హిందువులు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.వీరికి తమ చరిత్ర పట్ల ఉన్న నిర్లక్ష్యమే ఈరోజున ఎవరు దేని గురించి విమర్శించినా జవాబు చెప్పుకోలేక తెల్లమొహం వేస్తూ బితుకు బితుకు మంటూ బతకే దుస్థితికి కారణం!ఒకసారి ప్రపంచం మొత్తం జీరో భారతీయుల ఆవిష్కరణయే అని నిర్వివాదంగా ఒపుకున్నాక కూడా కొందరు యూరోపియన్ మేధావులు గ్రీకుల "ఒమిక్రాన్" నుంచి వచ్చినదని వాదించటం మొదలుపెట్టారు.భారతీయులకి ఈ గొప్పదనాన్ని ఇవ్వటం వారికి సుతరామూ ఇష్తం లేదు, ఏదో ఒక విధంగా ఈ గొప్పని భారతీయుల నుంచి తీసెయ్యాలి,అంతే!మన దేశంలోనే ఈ దేశాన్ని పొగడటానికి సిగ్గుపడే వారు ఉండగా వారెందుకు అలాంటి అవకాశాల్ని వదులుకుంటారు?ఆఖరికి గుజరాతులో క్రీ.శ 585 నాటి ఒక శాసనంలో శూన్యాంకం దర్శనమిచ్చాక గానీ వారు వెనక్కి తగ్గలేదు.ఈ రోజుకీ మనం వాడుతున్న అంకెలు పూర్తిగా భారతీయుల చేత కనుగొనబడినవే అయినప్పటికీ ఇంకా "అరబిక్ న్యూమరల్స్" అని వ్యవహరించటం అసలు విషయం తెలియకపోవడమే కారణం.వాటిని "భారతీయుల సంఖ్యామానానికి అంతర్జాతీయ రూపం" అని మాత్రమే వ్యవహరించాలి, మనవారి ఆవిష్కరణలకి గుర్తింపు రావాలి అనే పట్టుదల ఉంటే!



     క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాడు పాణిని ప్రతిపాదించిన భాషాశాస్త్రసిధ్ధాంతం యొక్క గొప్పదనం మనవారికి తెలియకపోయినా విదేశీయులు అందులోని విశేషాన్ని గుర్తించడం వల్ల కంప్యూటరు వాడకానికి సంబంధించిన భాషారూపం అయిన "Backus-Naur form language" ఇప్పుడు "Panini-Backus form language" గా పేరును మార్చుకుంది, ఎంతమందికి ఇది తెలుసు?



     ఇప్పటికీ భారతీయుల చరిత్రని కేవలం 10,000 సంవత్సరాలు వెనక్కి జరపటానికే ఎన్నో సందేహాలు వెలిబుచ్చుతున్నారు.కానీ డి.యన్.ఏ పరిశోధనల ద్వారా భారతదేశంలో 45,000 సంవత్సరాల క్రితమే ఆవు మచ్చిక జంతువుగా ఉందని రూఢిగా తెలిసింది - అంటే, క్రీ.పూ 43.000 సంవత్సరాల వెనకటి నుంచీ అన్నమాట!1984లో "Evolution of Domesticated Animals" గ్రంధంలో  Epstein, H. & Mason, I. L ఆవు పశ్చిమాసియాలో మొదట పెంపుడు జంతువుగా మారి భారతదేశానికి వచ్చందని భావించారు.కానీ 1994లో Loftus చేసిన కొత్త పరిశోధనా ఫలితం వల్ల పశ్చిమాసియాతో సంబంధం లేకుండా ఇక్కడే మొదటిసారిగా మచ్చిక అయ్యి మానవ వినియోగంలోకి వచ్చిందని నిర్ధారించబడింది. ప్రపంచంలో జన్యు శాస్త్రం రీత్యా ఆవులలో రెండే రెండు జాతులు ఉన్నాయి.ఒకటి టారీన్,ఇది  యూరోప్,పశ్చిమాసియా,చైనా దేశాల్లో ప్రముఖంగా కనబడుతుంది.రెండవది జెబు,ఇది భారత్,మధ్య ఆసియా,దక్షిణ చైనాలలో ప్రముఖంగా కనబడుతుంది.2009లో Chen యొక్క పరిశోధనా ఫలితం ప్రపంచంలోని జెబు జాతి ఆవులన్నీ భారతదేశం నుంచే ఇతర ప్రాంతాలకి వెళ్ళాయని నిర్ధారణ అయ్యింది.ఆవుని మచ్చిక జంతువు చేసుకోవడం అంటే అప్పటికే స్థిరనివాసం ఏర్పడి ఉంటుంది.నాగరికత అనేది స్థిరనివాసం వల్లనే పెరుగుతుంది, ఇంక క్రీ.పూ 1500 నాటి హరప్పా కాలానికి అంతటి సర్వతోముఖమైన అభివృధ్ధిని సాధించటంలో ఆశ్చర్యం ఏముంది!



     భారతీయులకి గోవు పవిత్రంగా నిలబడటం అనేది ఒక్కరోజులో ఎవరో ఒకరు శాసించగా జరిగినది కాదు.కొన్ని వేల సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ ఆ జాతి యొక్క ప్రత్యేక లక్షణాలను విశ్లేషించుకుని చేసిన ప్రతిపాదన!గోజాతికి మానవ జీవితంలో ఉన్న ప్రాధాన్యత వల్ల ఆ జాతిని సంరక్షించుకునే ఉద్ద్దేశంతో ఈరోజు భారత ప్రభుత్వం పులిని జాతీయ జంతువుగా చేసిన అధికారికమైన ప్రకటన లాంటిదే,కాకపోతే ఇది సంస్కృతికి సంబంధించినది కావటంతో ఆ సంస్కృతిని గౌరవించే వారు పాటిస్తున్నారు.ఆ సంస్కృతి పట్ల ద్వేషం ఉన్నవారు దాన్ని ధిక్కరిస్తున్నారు.చారిత్రక వాస్తవాల్ని పరిశీలిస్తే ఔరంగజేబు కూడా గోవధని నిషేదిస్తూ శాసనాలు చేశాడని తెలిస్తే వింతగా ఉంటుంది,కానీ ఆ శాసనాలు అన్నీ అప్పటి కాలంలో ఆ జాతికి ఉన్న ఆర్ధిక ప్రాధాన్యతని బట్టి చేసినవి అని అర్ధం చేసుకోవాలి.ఇవ్వాళ గోసంరక్షకులు నిజంగా చెయ్యాల్సినవి రెండు పనులు:1.గోసంరక్షణ చట్టాలు ఉన్నాయి అని తెలుసుకుని గోవధ చేస్తున్న వారిని వ్యక్తిగత దాడులతో హింసించడం లాంటివి చేసి చెడ్డపేరు తెచ్చుకోకుండా చట్టానికి పట్టించి అది శిక్షార్హమైన నేరమని తెలియజెప్పే న్యాయపోరాటం ద్వారా ఎదుర్కోవడం.2.గోజాతికి ఆర్ధిక రంగంలో తిరిగి ప్రాధాన్యతని తీసుకురావటం.ట్రాక్టర్లు వచ్చాక ఎద్దులతో దుక్కి దున్ని చేసే వ్యవసాయం ఆగిపోయింది.శ్వేతవిప్లవం పేరుతో పాల సేకరణ కేంద్రాలలో లీటరుకి వెన్న శాతాన్ని బట్టి వెల నిర్ణయించడంతో గేదేలు ఆవుల స్థానాన్ని ఆక్రమించాయి.యెంత బలమయిన ఆహారం పెట్టినా ఆవుపాలలో వెన్న శాతం స్థిరంగానే ఉంటుంది,అదే గేదెలకి పెట్టిన తిండిని బట్టి వెన్న శాతం పెరుగుతుంది.కాఫీలూ టీలూ ఆవుపాలతో కన్నా గేదెపాలతో బాగుండటం కూడా జనం ఆవుపాల నుంచి గేదెపాలకి మారడానికి ఒక కారణం అనుకుంటున్నాను నేను!వ్యవసాయ రంగంలో మార్పులు తీసులు రావడం కష్టం గానీ ఆరోగ్యం రీత్యా చూస్తే గేదెపాల కన్నా ఆవుపాలు శ్రేష్ఠం,ఆ అవగాహన జనంలో పెరిగితే మళ్ళీ గోజాతికి పూర్వవైభవం రావచ్చు.కొన్ని వేల సంవత్సరాల పాటు భారతీయుల జీవనవిధానంలో మమేకమైన గోజాతి నేడు చంపి తినడానికి తప్ప ఇంకెందుకూ పనికిరానిదైపోయింది,యెంత విషాదం!

     ఇదివరలో గ్రామాలలో జరిగినది వేరు.అప్పుడు గోజాతికి ఆ వ్యవస్థలో ప్రాముఖ్యత ఉందేది.ఒక జాతిని సంరక్షొస్తూ మన అవసరాలకు తగినట్టు ఉపయోగించుకునే ఉభయతారకమైన పధ్ధతి - ఉదాహరణకి కోళ్ళ పెంపకం పూర్తిగా ఆహారం కోసమే చేస్తున్నాం!కొందర్రు బీఫ్ తినడం మా తిండిహక్కు,దాన్ని వద్దనడం, ఎప్పటినుంచో ఉన్నదాన్ని ఇవ్వాళ కొత్తగా వ్యతిరేకించడం కేవలం బ్రాహ్మణాధిక్యత,కాబట్టే వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. శాఖాహారాన్ని భారతదేశం లోని బ్రాహ్మణులే కాదు, ప్రపంచం లోని చాలా దేశాలలో ఎంతోమంది పాటిస్తున్నారు.ఆహారపు అలవాట్లలో ఉన్న రెండింటిలో ప్రతిదానికీ అనుకూలతలూ ప్రతికూలతలూ ఉన్నాయి.కానీ కొందరు వద్దంటున్నారు గాబట్టి మరింత ఎక్కువ జంతువుల్ని చంపి తింటూ పండగ చేసుకోవటం మానవత్వం ఉన్నవాడెవడూ చెయ్యదగిన పని కాదు!రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిస్వేచ్చలకే పరిమితులు ఉన్నప్పుడు మీరు తినడం కోసం ఆవుల్ని చంపే హక్కు ఎవరయినా ఇస్తారా?ఆవుల్ని చంపవద్దంటున్న వాళ్ళు మా ఇష్టమొచ్చిన తిండి తినే హక్కుని కాదంటున్నారు అని వీరంగాలు వేస్తూ "బీఫ్ ఫెస్టివల్" లాంటి హేయమైన పనులకి తెగబడుతున్న వాళ్ళు వారు తినడానికి చంపే వాటిలో ఏ ఒక్కదానికయినా తిరిగి ప్రాణం పొయ్యగలరా!చచ్చిన వాటిని బతికించ లేని మీకు మీ తిండి కోసం వాటిని చంపే హక్కు ఎట్లా వస్తుంది?ఎవరిస్తారు!మూర్ఖంగా ఎదటివారిని దుర్మార్గులుగా నిలబెట్టడం కోసం మీరు అనాగరికమైన పనులు చేస్తున్నారు తెలుసుకోండి!పులుల కోసం అభయారణ్యాలు నిర్దేశించినట్టు ఆవులకి కూడా రక్షణ మందిరాలు నిర్మించాల్సిన స్థితికి దేశాన్ని తీసుకు వెళ్ళకండి,వెనక్కి తగ్గండి!

ఇదీ అక్కడ ప్రచురణకి నోచుకోని నా కామెంటు:
Openion the first:ముస్లింలు బాగుపడలేదు కనుక హిందూ మతాన్ని కూడా ఎవరూ విమర్శించకూడదు అనుకుంటే హిందువులు కూడా ముస్లింలలాగే వెనుకబడి ఉండిపోతారు. “మీరు ముస్లింలని ఎందుకు విమర్శించడం లేదు” లాంటి ప్రశ్నలు అడగడం అంటే “మేము ముస్లింల కంటే బాగుపడం, అలా ఉండడమే మాకు ఇష్టం” అని చెప్పుకోవడమే అవుతుంది. హిందువులకీ, ముస్లింలకీ మధ్య ఉన్నది వాళ్ళు పూజించే దేవుని విషయంలోనే తేడా తప్ప సాంఘిక దురాచారాల విషయంలో ఈ రెండు మతాల మధ్య పెద్ద తేడా లేదు.

Openion the secondLఇదే పెద్దమనిషి స్త్రీల విషయంలో హిందువుల కన్నా ముస్లిములే ఉదారంగా ఉన్నారు అని చర్చ మొదలుపెట్టి సరైన ఆధారాలు చూపించలేక హిందువులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకీ సూటిగా సమాధానాలు చెప్పలేక పోయారు

P.S::వీరి అసలు సిసలైన జీవిత లక్ష్యం ఏమిటంటే ఎవరిలో తప్పు ఉంటే వారిని విమర్శించడం కాదు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ హిందూమతాన్ని మాత్రమే విమర్శించటం,హిందూ మతమే ISIS తీవ్రవాదుల కన్నా భయంకరమైన తీవ్రవాదుల్ని సృష్టిస్తున్నదని జనాన్ని భయపెట్టడం.ఇలాంటివారినే సూడోసెక్యులరిష్టులు అంటారు.కానీ చందు తులసి గారు మాత్రం కొంచెం భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు,వారి అమూల్యమైన  ఈ రెండు అభిప్రాయాలూ చాలా న్యాయంగా ఉన్నాయి.కానీ వాస్తవంలో ఆ అభిప్రాయాలు వెలిబుచ్చటానికి అవసరమైన సన్నివేశాలలో జరుగుతున్నది మాత్రం మరొకలా ఉంది.

అభిప్రాయం 1: కొందరికి ఉన్న ఆవుమాంసం తినే హక్కుని 100% సమర్ధిస్తాను
హరిబాబు ప్రశ్న:ఎక్కడ?ఈ దశంలో 1950ల నుంచే గోబధ నిషేధానికి చట్టాలు ఉన్నాయి,అది తెలుసా మీకు?
-----------------------------------------------------------------------------------------
States where cow slaughter is legal:
13) Kerala
No restrictions.
23) West Bengal
No restrictions.
In these two states both public and govt are influenced by leftist ideology
16, 18) Other Northeast
No ban in Arunachal, Mizoram, Meghalaya, Nagaland, Tripura, Sikkim. In Manipur, Maharaja in 1939 decreed prosecution for cow slaughter, but beef consumed widely.
States where cow slaughter is banned:
1) Andhra Pradesh & Telangana Slaughter of cows, calves prohibited. Bulls, bullocks can be killed against “fit-for-slaughter” certificate, issued if animals can no longer be used for breeding; draught/agricultural operations. Violators face 6 months jail and/or Rs 1,000 fine.
2) Assam Cow slaughter banned except on issue of ‘fit-for-slaughter’ certificate, at designated places.
 3) Bihar Slaughter of cows, calves banned; of bulls, bullocks older than 15 years allowed. Violators face 6 months’ jail and/or Rs 1,000 fine.
 4) Chandigarh Killing a cow, storing/serving/eating beef banned; eating meat of buffalo, bullock, ox also banned.
5) Chhattisgarh Slaughter of cow, buffalo, bull, bullock, calf, and possession of their meat banned. Transport, export to other states for slaughter also banned; attracts same punishment of 7 years’ jail, fine up to Rs 50,000.
6) Delhi Slaughter of “agricultural cattle” — cow, calf, bull, bullock — and “possession of [their] flesh”, even if they are killed outside Delhi, banned. Buffaloes are not covered.
7) Gujarat Slaughter of cow, calf, bull and bullock; transport, sale of their meat banned. Punishment: Rs 50,000 fine, up to 7 years’ jail. Ban does not include buffaloes.
8) Haryana As per a 2015 law, “cow”, which includes bull, bullock, ox, heifer, calf, and disabled/diseased/barren cows, can’t be killed. Punishment: 3-10 years jail, fine up to Rs 1 lakh. Sale of canned beef and beef products, and export of cows for slaughter banned.
 9) Himachal Pradesh Slaughter of all bovines punishable by 5 years’ jail. Killing allowed in the interest of research, or if animal has contagious disease.
*10) Jammu & Kashmir Slaughter of cow and its progeny punishable by up to 10 years’ jail. Possession of “flesh of any [of these] slaughtered animal(s)” punishable by a year; killing of “he or she buffalo” punishable with fine five times the animal’s price.
11) Jharkhand Slaughter of cows and oxen; possession, consumption of their meat, banned. Violators face up to 10 years’ jail and/or Rs 10,000 fine.
 12) Karnataka Cows can be slaughtered if old or diseased. Possession not a crime. Bill proposed by BJP in 2010 made slaughter punishable by 7 years’ jail and Rs 1 lakh fine, but it did not become law.
14) Madhya Pradesh Slaughter of cow, progeny banned. Penalty raised to 7 years’ jail in 2012, burden of proof on accused. Buffaloes can be killed.
 15) Maharashtra Slaughter, consumption of meat of cow, bull, bullock banned since March 2015 after revision of existing law. 5 years’ jail and/or Rs 10,000 fine. Slaughter of buffaloes allowed.
Mizoram No restrictions.
17) Odisha 2 years’ jail, Rs 1,000 fine for cow slaughter. Old bulls, bullocks can be killed on fit-for-slaughter certificate; cow if it suffers from contagious disease.
19) Punjab “Beef” doesn’t include imported beef; “cow” includes bulls, bullocks, oxen, heifer, calves. Slaughter allowed for export, with government permit.
20) Rajasthan Slaughter of “cow, calf, heifer, bull or bullock” prohibited; possession, transport of their flesh prohibited. 10 years’ imprisonment and/or Rs 10,000 fine.
21) Tamil Nadu Cow, calf slaughter banned; up to 3 years’ jail and/or Rs 1,000 fine. Beef consumption and slaughter of economically worthless animals allowed.
22) Uttar Pradesh Slaughter of cow, bullock, ox banned. Can’t store or eat beef. 7 years’ jail and/or Rs 10,000 fine. Can import in sealed containers, to be served to foreigners. Buffaloes can be killed.
 * Jail terms 10 yrs for cow slaughter in Haryana, Jammu and Kashmir, Jharkhand and Rajasthan. Punishment up to varying terms in jail in other states.
* Hefty fine 1 lakh in Haryana, and Rs 50,000 in Chhattisgarh and Gujarat. Range of smaller fines for slaughter and related crimes in other states.
-----------------------------------------------------------------------------------------
     నేను చెప్పడం దేనికి వాటి గురించిన కుతూహలం ఉంటే ఒక్కో రాష్ట్రంలో ఉన్న శిక్షలూ అవీ రమారమి ఆరు నెల్ల నుంచీ ఏదేళ్ళ వరకూ జైలు శిక్ష వెయ్యదగ్గ నేరం!ఇవేవీ మీరు మెజార్టీ వాళ్ళు మైనార్టీ వాళ్ళ మీద బలవంతంగా రుద్దేశారు అని తిరిగి నామీద విరుచుకుపడడానికి వీలిచ్చే చట్టసభలు చేసిన శాసనాలు కావు,కోర్టుల ముందు ఇరు పక్షాలూ వాదించగా కోర్టులు గోసంరక్షకులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులు.ఆ వాదనల సందర్భంగా వారు ఎంత మొండిగా ఉన్నారో మీకు తెలుసా!మా మతంలో ఆవుల్ని చంపమని రాసి ఉంది కాబట్టి మేము చంపే తీరుతాం అన్నారు.ఆధారాలు చూపించలేకపోవటంతో వారి వాదన నెగ్గలేదు.”a Constitution Bench of the Supreme Court of India has clearly ruled that a total banon slaughtering of cow and cow progeny is absolutelyCONSTITUTIONAL and in accordance with the law of the land. The complete ban on cow slaughter does NOT violate any rights or laws as guaranteed by the Constitution of India to every Indian citizen.The Supreme Court of India has clearly held that Islam does not call for cow slaughter and there is no provision in any of the Islamic scriptures that require for cow slaughter on any day in general or on Bakri Eid in particular.” అనే ఈ సుప్రీం కోర్టు రూలింగు యొక్క అర్ధం ఏమిటో తెలుస్తున్నది కదా!అదీ పరిస్త్థితి, ఆవుల్ని చంపే తీరాలి అని వారికంత పట్టుదల, అంత పట్టుదల ఎందుకు అని అడిగీతే హిందువులది మతోన్మాదం - ఏమిటీ న్యాయం?

అభిప్రాయం 2: కావాలని ఎవరూ ఆవుమాంసం తినడం లేదు కదా!
హరిబాబు ప్రశ్న: అవునా!ఆవుమాంసం అమ్మ డం,కొనడమే కాదు దగ్గిర వుంచుకోవడం కూడా నేరమే అని మీకు తెలియకనో తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారో గానీ ఆవుమాంసం అమ్మేవాళ్ళకి తెలుసు.కోర్టు నుంచి అధికారులు తనిఖీకి రాబోయే ముందు కోర్టులు సాంకేతికంగా తమ తీర్పుల్లో "COW" అని రాయడం వల్ల ఇక్కడ లిస్టులో "OX" అని మార్చి "ఇక్కడ వడ్డిస్తున్నది ఎద్దుమాంసం మాత్రమే,ఆవు మాంసం కాదు" అని వాదిస్తున్నారు.

P.S: హిందువులు ముస్లిముల మనొభావాలకు ఇబ్బంది కలిగించకూడదు,మంచిదే!మీలాంటి వారు హిందువుల మనొభావాల్ని గాయపరచినా మౌనంగా ఉండిపోవాలి - అప్పుడే మీ దృష్టిలో హిందువులు మంచివాళ్ళు అవుతారు - అంతేనా?ఈ దశంలో ఇతర మతస్థుల మనోభావాలకు ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించే బాధ్యతని హిందువుల మీదే పెట్టారు,అధిక సంఖ్యాకులుగా అల్ప సంఖ్యాకుల పట్ల మర్యాదగా ఉండటం ఔన్నత్యమే కాబట్టి హందువులు కూడా కాదనడం లేదు!కానీ మీలాంటివారు హిందువుల మనోభావాల మీద ఎంత తెవ్ర స్థాయిలో దాడి చేసినా కనీసం అభ్యంతరం వ్యక్తం చెయ్యకుండా ఉండే బాధ్యతని కూడా హిందువుల మీదే పెట్టారు,ఎంత అన్యాయం?!తాము అనుసరించే మతం పట్ల ముస్లిములు కూడా హిందువుల మాదిరిగానే ఆలోచిస్తారు, వారి తరపున ఇంత అరిభీకరంగా చేస్తున్న మీ ఆందోళనల్లో వారు భాగం పంచుకోకపోవడానికి అదే కారణం!

     జీవితంలో ప్రతి ముస్లిమూ పదిమంది హిందువుల్ని చంపాలి,వందమంది హిందూస్త్రీలని చెరచాలి,వెయ్యి గోవుల్ని చంపాలి అని ప్రగల్భాలు పలికి పాల్పడిన హింసకి కూడా తరతరాలుగా హిందువులు ముస్లిముల పైన జరిపిన అకృత్యాలకి జవాబుగా చేశారు గాబట్టి అనే వంకతో వాటిని గూడా హిందుచుల ఖాతాలోనే వేశారు!ఇప్పటికీ కాశ్మీరు లో హిందూ పండితుల విషయంలో మీరు కనీసపు ప్రతిస్పందన కూడా వెలిబుచ్చరు,కనబడని లింకులూ పని చెయ్యని లింకులూ అని అనేవారు కాశ్మీరులో దశాబ్దాల నుంచీ జరుగుతున్నదానికి ఏనాడూ ప్రతిస్పందించగా మేమెవ్వరం చూదలేదు,చాటుగా యేమైనా గిణిగారేమో!

  నిజానికి మీకు చట్టం పట్ల న్యాయం పట్ల గౌరవం ఉంటే చట్టపరంగా నేరమని వారికే నచ్చజెప్పి కోర్టులు నిషేధించిన మాంసం తినకండని అవతలి వారిని ఎడ్యుకేట్ చెయ్యాలి,లేదా సకల విధాలుగా ప్రయత్నించి సమాచారాన్ని క్రోడీకరించుకుని సాంకేతిక పోరాటంతో కోర్టు తీర్పుల్ని రద్దు చేయించాలి.ఈ రెంటిలో ఏది చేసినా మీరు చాలా సమదృష్టితో ఆలోచిస్తున్నట్టు లెఖ్ఖ!కానీ మీరు అలా చెయ్యడం లేదు.కేవలం హిందువుల్ని మతోన్మాదులుగా చిత్రించడమే ఇక్కడ మేధావులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి దగ్గరి దారి అయ్యింది!హిందువులకి నచ్చని పని చెయ్యడానికి చట్టాన్నీ న్యాయాన్నీ మరి సభ్యతా పరిధుల్ని కూడా దాటడమే సెక్యులరిజమా?మీరిలాగే యేకపక్షపు నిరసనలతో పక్షవాతపు సెక్యులరిజాన్ని మరింత సమర్ధవంతంగా ఫాలో అయితే ఇప్పటివరకూ ఉదారంగా ఉన్న హిందువులకి కూడా సెక్యులరిజం మీద ఉన్న భ్రమలు నశించిపోయి పూర్తిగా హిందూత్వం వైపుకి జరుగుతారు.అది ఆల్రెడీ మొదలైంది,అందుకే మీలో ఇంత అసహనం కనపడుతున్నది.ఇంకా డోసు పెంచండి!

ALL THE BEST FOR INCULCATING GREATER HINDU UNITY!
----------------------------------------------------------------------------------------------------------------------------------------------శాలివాహన శకం 1937 మన్మధ నామ సంవత్సరం మార్గశిర మాసము 16వ తేదీ సోమవారము
(చిత్రాలు:గూగుల్ సౌజన్యం)

28 comments:

  1. సార్ హరిగారు. నమస్కారం. మొదట నా కత చదివి అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదములు.
    మీరు రాసిన కామెంట్లను నేను కావాలని ప్రచురించడం లేదని నా మీద అబాండం వేసినారు. సారంగ ఎడిటర్ ది బాధ్యత కానీ నాది కాదు.నేను కూడా కామెంట్లను మీలాగా చదవాల్సిందే. మీ అభిప్రాయం చెప్పే హక్కును గౌరవిస్తాను. మరి ఏం జరిగిందో సారంగ సంపాదకులను కనుక్కోవాలి.
    2. మరీ తీవ్రమైన ఆరోపణ నా కత మీద... ఆవును చంపడం. మీరు కథ చదవకుండానే ఆరోపణ చేసినట్లున్నారు. నా కథలో ఆవును చంపరు. అసలు ఆవు ప్రస్తావనే లేదు. కానీ మీరు సిగ్గు ....ఎగ్గు అంటూ తీవ్ర పదాలు వాడారు. అది మీ సంస్కారానికి
    సంబంధించిన అంశం.. మీ ఇష్టం.
    ఆఖరుగా నా వ్యక్తిగతంగా.... ఆవును చంపడాన్ని కచ్చితంగా వ్యతిరేకిస్తాను.. ఆవునే కాదు. ఏ జీవిని కూడా అకారణంగా చంపరాదు. కానీ ఆవు మాత్రమే గొప్పది...మిగతావి తక్కువ అంటే ఒప్పుకోను. ఇక మన దేశంలో వేల సంవత్సరాలుగా పశువులను చంపడం ఉన్నది. ఒక్కసారి గా ఆహారపు అలవాట్లు మారవు కదా... పైగా బలవంతంగానో, భయపెట్టో సంస్కృతిని మార్చలేం.

    ReplyDelete
  2. చందు తులసి గారూ,
    నేను కామెంటు పబ్లిష్ కాక్పోవడం గురించి మిమ్మల్ని గానీ మరెవరిని గానీ తప్పు పట్టటం నా ఉద్దేశం కాదు.జరిగిన విష్యం అట్లా అనుమానించదగ్గదిగా ఉంది.

    వరసగా వారం రోజుల పాటు రోజుకు ఒకసారి చొప్పున వేశాను.వేశాను.కామెంట్లు పబ్లిష్ కాకపోవటానికి మీరు బాధ్యులు అని నేను ప్రత్యేకించి అననూ లేదు,ఏవరు బాధ్యులో కూడా నాకు తెలియదు,నేను దాని గురించి మిమ్మల్ని గానీ వారిని గానీ నిందించినట్టుగానో నిలదీస్తున్నట్టుగానే మీరు భావించవద్దు,సారీ!అది కేవలం ప్రస్తావన మాత్రమే,అది కూడా మిగిలిన వారి కామెంట్లు పడుతూనే ఉన్నయి,ఒకరు తన కామెంట్లకి వెంటవెంటనే జవాబులు రావడం గురించి ప్రస్తావించహ్డం చదివాక నాకు ఆ అనుమానం వచ్చింది,అంతే!ఇప్పటికి కనీసం అయిదు సార్లయినా వేసి ఉంటాను,అది కేవలం నా అనుమానం మాత్రమే,నిందిస్తున్నట్టు మీకు అనిపిస్తే నేను నిజంగా క్షమాపణ చెబుతున్నాను!
    ఇక నేను పూర్తిగా చదవకుండా విషయం అర్ధం చహెసుకోకుండా విమర్శిస్తున్నానని అంటున్నారు.దాని గురించి వీవరంగా జవాబు చెప్తాను.

    తినడానికి ముందు ఎవరో ఒకరు చంపాలి గదా,బిచ్చగాడయినా ముందుగా పార్టీ చేసుకున్నవాళ్ళయినా!అతను వేసిన ప్రశ్న దానికి సంబంధించిన ధైర్యం మీదనే కదా వేసింది?ఎవరు చంపినా తప్పే కదా,దానిని హైలైట్ చేస్తూనే ఉంది గదా కధ,మిగతా వ్యాఖ్యాతల కామెంట్లు గూడా ఇప్పుడు సంచలనం అని అనుకుంటున్న గోవధ,గోమాంస భక్షణ మీదనే జరిగింది కదా!
    TO BE CONTINUEING

    ReplyDelete
  3. CONTINUING FROM ABOVE
    ----------------------------
    HUMAYUN SANGHEER
    గొడ్డు కూర తినడం నాటి నుండి సాగుతోంది. ఇందులో ఏదో ఉద్దేశం వుందని వాళ్ళు కొన్ని శక్తులను ఉసిగొల్పుతున్నారు.
    GAGANA SEETAA PATI
    అరె నాకు జెర సమజ్ గాదు .. కోళ్ళు , బాతులు , మ్యాకలు , పొట్టేళ్ళు , అడవి పందులు , ఊర పందులు , గుర్రాలు , ఒంటెలు , కుక్కలు , ఉడుములు , కాకులు , గద్దలు, పిట్టలు , గాడిదలు, గడ్డి గాదం … సమస్తం దినొచ్చు గాని గీ గొడ్డు కూర తినొద్దంటరు ఏందిరా బై ?
    చందు తులసి
    NOVEMBER 13, 2015 AT 6:00 AM
    నా కథ సారాంశం మూడు ముక్కల్లో చెప్పారు మీరు. అవును ఆవేశంలోనే కథ రాశాను…తమ్మీ అన్నారు . థాంక్యూ అన్నా..
    PV SUNIL KUMAR
    NOVEMBER 12, 2015 AT 11:18 PM
    నేరుగా చెప్పాలనుకున్న విషయాన్నిచెప్పారు. ఫోకస్ అటు ఇటు పోలేదు .. అభినందనలు
    REPLY
    • చందు తులసి
    NOVEMBER 13, 2015 AT 6:11 AM
    సునీల్ సార్.. కథ చదివినందుకూ..
    స్పందించినందుకూ ధన్యవాదాలు..
    మీ థూ కథ ఎన్నిసార్లు చదివానో….
    చందు తులసి
    NOVEMBER 13, 2015 AT 6:49 AM
    అనన్య గారూ..మీ స్పందనకు ధన్యవాదాలు. మొదట ఈ కథ ఆవు మాంసం గురించి కన్నా బుక్కెడు బువ్వ గురించి రాసినదండీ..
    ఇక ఆవు గురించే ఎందుకూ…పంది మాంసం గురించి రాయరెందుకన్నారూ..అది ఆవు మాంసమా పంది మాంసమా అని కాదండీ. ఒక వ్యక్తి తనకిష్టమైనది తింటే…అవతలి వ్యక్తికీ లేదా రాజ్యానికి తినొద్దని చెప్పే నైతిక హక్కు ఉందా…?
    మీరన్నట్లే పంది మాంసం తినే వాళ్లే కాదు, ఎలుకలు, పిల్లులు , కప్పలూ, పాములు, కుక్కలూ తినేవాళ్లూ ఉన్నారు.
    ఇక పంది మాంసం తినని వాళ్లున్నారు…కానీ తినొద్దు అనే వాళ్లున్నారా…? అలా ఎవరైనా అంటే ఎవరైనా వ్యతిరేకించాల్సిందే…
    చందు తులసి
    NOVEMBER 13, 2015 AT 6:52 AM
    శ్రీధర్ సార్.. థాంక్యూ
    – నిజమే సార్..ఏదైనా నచ్చింది తినడానికి ధైర్యమెందుకూ…ఆకలి చాలు కదా?
    తిండి పెట్టని వానికి వద్దనే హక్కెక్కడిదీ…?
    చందు తులసి
    NOVEMBER 14, 2015 AT 6:47 AM
    చంద్రిక గారు…మొదట నేను మీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. చాలా మంది ఈ కథ చదివి ఫోన్ మెసేజ్ పెట్టారు కానీ..ఇక్కడ రాయలేదు. కారణం ఏమిటో అందరికీ తెలుసు. కానీ తాము నమ్మింది చెప్పాలనుకున్నది..కూడా స్నేచ్చగా చెప్పటానికి వెనుకంజ ( భయపడుతున్నారు కూడా నేమో..) వేస్తున్నారు.
    కానీ మీకు నచ్చకున్నా…మీ అభిప్రాయం చెప్పారు. అదే కదా ప్రజాస్వామ్యం.
    నాకు తెలిసీ నేను ఎవరినీ ..ఎవరి మనోభావాలని కించపరచలేదు మేడమ్.. తెలీక చేస్తే సారీ చెప్నాపడానికి… తప్పుదిద్దుకోవడానికి నేను సదా సిద్ధం.
    ఇక ఈ కథలో అసలు అంశం..బీఫ్ కాదండీ….
    బువ్వ. ఎవరి తిండి వాళ్లు తింటారు… వద్దనే హక్కు ఎవరికైనా ఎలా ఉంటుందండీ….?
    ఆవును ఇవాళ కొత్తగా తినడం లేదండీ…కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నదే..మరి ఇవాళే ఎందుకు గొడవ అవుతోంది..? మీకు అభ్యంతరం ఎప్పుడు ఉండాలంటే…అందరూ తినాల్సిందే అని ఎవరైనా బలవంతం చేస్తే…
    కానీ వేల సంవత్సరాలుగా తింటున్నట్టే ఇవాళ కూడా తింటున్నారు కదా.. మరి వాళ్లని తినొద్దు అని చెప్పడం..ఆఖరికి చంపడం న్యాయమేనా.‌?
    ….ఆవును పూజిద్దాం…ఎద్దునూ పూజిద్దాము ..మనిషి పురోగతికి సాయపడే ప్రతి పురుగునూ పూజిద్గాం. అంతకన్నా ముందు…ఎదుటి మనిషి అభిప్రాయాలనీ…ఆకలినీ గౌరవిద్దాము..
    మీ విలువైన స్పందనకు ధన్యవాదాలు…
    ----------------------------
    ఇవీ స్థూలంగా అకక్డ కామెంట్లలో ఇతర్ల ప్రస్తావనలూ మరియూ మీ ప్రతిస్పందనలూ,అవునా?

    బీఫ్ అనే మాటలో ఆవుతో పాటూ గేదె మరియూ ఇతర జంతువ్లౌ కూడా కలుస్తాయేమో!

    కానీ విషయానికి తీసుకునది మాత్రం అక్కడా ఆవు అని ఉందటం ఇప్పుడు జరుగుతున్న సమకాలీన రాజకీయ పరిస్థితి అలాగె ఉన్నప్పుడు ఎటు తిరిగీ సమస్య అంతా గోమామస భక్షనకి హినువులు తెలుపుతున్న నిరసనలను క్రూరంగా చూపించహ్దమే కదా అసలు ఉద్దేశం,కాదా?

    సుప్రీం కోఋతు గోవదహ నిషేధం అనేది మరి యే ఇతర ప్రాధమిక హక్కులనూ వ్యతిరేకించినట్టు కాదు అనై అంత స్పష్తంగా చెప్పాక్ గూడా మీఉ "తిండి హక్కు" ప్రస్తావన తీసుకొస్తున్నారు,దాని అర్ధం ఏమిటి?

    డైరెక్టుగా ఆవుని చంపమని మీరే కాదు ఏ మేధావీ అనడు,నేనూ ఒప్పుకుంటాను!వ్యక్తుగతంగా అవుని చంపడాన్ని వ్యతిరేకిస్తామంటారు,కానీ సామజంలో నిలబడినప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు దేనికి పనికొస్తాయి?తిండిహక్కుకి ముడిపెట్టి గోవధని సమర్ధిస్తూనే ఉనారు గదా!

    P.S:"కానీ ఆవు మాత్రమే గొప్పది...మిగతావి తక్కువ అంటే ఒప్పుకోను." - మెలిక బాగుంది.కోర్టులు గూడా ఆ చట్టాలు చేసింది ఒక్క ఆవు గురించే కాదు,పశు సంరక్షణ గురించి - అందులో ఆవుని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు దానికున్న సామాజికార్ధికసాంస్కృతిక ప్రాధాన్యతని గుర్తించడం వల్ల!

    ReplyDelete
  4. ఇక్కడ నేను వ్యాసంలో గూడా వేల సంవత్సరాల నుంచీ కొందరు తింటూ ఉండటం గురించి ప్రస్తావించాను.కానీ మీరు కధలో ఏ జంతువునైనా పెట్టొచ్చు గానీ ఆవు అని పెట్టడం వల్ల్ల రగడ గోవధ మీదకి వెళ్ళినా చట్టాలు చేసిన కోర్టులకి అది తెలియదా?అవన్నీ నాకూ తెలుసు!

    కానీ గొదవ జరుగుతున్నది పనిగట్టుకుని అదే తినాలి,కోర్టులు శిక్షార్హమైన నేరం అని చెప్పినా సరే "మా మతంలో ఆవును చంపమని ఉంది,కాబట్టి మేము చంపి తీరుతాం" అనడం యాదృచ్చికంగా జరగడం లేదు కదా!సుప్రీం కోర్టు అంత గత్టిగా రూలింగు ఎందుకు ఇచ్చింది?

    నిజానికి అసలు ప్రతిస్పందించాల్సిన ముస్లిములు ఎందుకు మాట్లాడటం లేదు?మీరు ముస్లిములు భయం వల్ల ముందుకు రావటం లేదు అని ఒక అభిప్రాయం వెలిబుచ్చారు.దానికి నా సమాధానం ఇక్కద చెప్పాను,"తాము అనుసరించే మతం పట్ల ముస్లిములు కూడా హిందువుల మాదిరిగానే ఆలోచిస్తారు, వారి తరపున ఇంత అరిభీకరంగా చేస్తున్న మీ ఆందోళనల్లో వారు భాగం పంచుకోకపోవడానికి అదే కారణం!".మీరు దీనితో ఏకీభవించరని నాకు తెలుసు.కానీ మతపరమయిన విషయాలలో సూటిగా తమ అభిప్రాయాలు పంచుకునే సందర్భం ఇరుమతస్థుల మధ్యనా వస్తే ముస్లిములు కూడా హిందువుల సెంటిమెంట్లని గౌరవిస్తారు.కానీ మధ్యలో వకాల్తీ సాహెబులు కలవనివ్వటం లేదు.

    ReplyDelete
  5. chandu tulasi:
    కానీ మీరు సిగ్గు ....ఎగ్గు అంటూ తీవ్ర పదాలు వాడారు. అది మీ సంస్కారానికి
    సంబంధించిన అంశం.. మీ ఇష్టం.
    haribaabu:
    1.సమస్తం దినొచ్చు గాని గీ గొడ్డు కూర తినొద్దంటరు ఏందిరా బై ?
    2.బిచ్చ గాడు కట్టె దీసుకొంగనే ఎట్ల ఉడాయించిన్రో సూసినవా ?(what a sadistic pleasure on a character running out of fear?)
    3.గీ డోస్ ఉండాలే తమ్మీ !లేకపోతే మాటినరు –(what this means.much more agresssion required!)
    4.బీఫ్ మీద ఎద‌వ ఏషాలేసే ఏ నాయ‌కుడి గ‌తైనా ఏమ‌వుతుందో(So,no body should object even it was crime against law?!)
    5.దేవుడు అనే పదార్థమే ఉనికిలో లేదు. ఉనికిలో లేని పదార్థాల పేర్లు చెప్పి ఆహార నియమాలు ఒకటి!(he is passing sarcasm on hindus customs and beliefs)
    వాటిల్లో ఉన్నది 360 రోజులూ తినకుండా కొన్ని రోజుల్లో ఆపడం.ఆ కొన్ని రోజుల్లో తినకూదదు అన్నందువల్ల అంతమేరకి జంతుహింస తగ్గుతుంది గదా అనే ఆలోచన లేని వెక్కిరింత!
    6.శాఖాహార ఫాసిజం చేస్తున్న దాడిని చక్కగా రాసారు(see,whata asarcastic labelling for vegetaerianijm)

    ఇవన్నీ పరమ శాంతమయిన కడుచక్కని విశాల భావాలు గలవారి ప్రతిస్పనదన అయితే నా భిప్రాయాలు నిజంగా నేను పునరాలోచిచుకోదగిన మాటలే!

    ReplyDelete

  6. హరిబాబు గారు,

    ఎప్పట్లా మీ టపా మరో సూపర్ టపా ! ఇంత విషయం తెలుసుకుని , ఒక రిసెర్చ్ లా వ్రాయటం చాలా బాగుంది !

    మీ టపా చదువుతూంటే రాబోయే కాలం లో ఇక జనాలు ఫోటో ల లో నే ఆవు ని చూడాలేమో మరి ! (అందుకే ననుకుంటా మీరు జబర్దస్త్ అయిన ఆవుల ఫోటోలు పట్టి పెట్టేసుకున్నారు ఇప్పుడే !)

    ఆ కథ చదివా (చందు తులసి గారిది)-> జిలేబి లాగా సమయానుకూలం గా వ్రాసినదా లేక యాదృచ్చికం గా ఆ కథ రావడం దేశం లో ని సంఘటనలు జరగటం అన్నది ఒకే సమయాన జరిగిందా అన్నది తెలీదు ;

    ఇక మీ కామెంట్లు అక్కడ వేయక పోవడం గురించి --> సారంగ ని మీరు 'సామిరంగా' గా మర్చేస్తారేమో అని వారికి భయ్యం పట్టుకుని ఉంటుందనుకుంటా :) జేకే !


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  7. హరిబాబు గారు, ఎంతో శ్రమించి చక్కని టపా రాసారండీ, మీకు ధన్యవాదాలు.

    1. చాలామంది అడుగుతున్నారు - ఆవుకు ఒక్కదానికే ఈ స్పెషల్ treatment దేనికి, ఏ జంతువును చంపినా అంతే తప్పు కదా అని? ఆవు ప్రత్యేకం ఎందుకంటే, మన సంప్రదాయ వ్యవసాయం లో ఆవు చేసే మేలు మరే జంతువు చెయ్యలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆవు అన్నదాతకు జీవన దాత. ఆవు పేడ, ఆవు మూత్రం వ్యవసాయానికి ఎంతో ఉపయోగం. శ్రీ సుభాష్ పాలేకర్ దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ విషయం మీద ఎంతో పరిశోధనలు చేసిచేస్సారు, దేశమంతటా ఎన్నో workshops నిర్నిర్వహిస్తున్నారు. ఆయన vedios ఎన్నో YouTube లో ఉన్నాయి. ఆయన ఎంతో స్పష్టంగా ఎన్నో సార్లు చెప్పారు - భారతీయ ఆవు పేడ , మూత్రంలో ఉన్న మంచి గుణాలు మరే ఇతర దేశాల ఆవులలో లేవు . అందుకే ఇవి వ్యవసాయానికి అంత ఉపయోగకారులు. ఆయుర్వేదంలో కూడా అందుకనే గోమూత్రం కు అంత ప్రాధాన్యత. British వారి హయాంలో maintain చేసిన records లో కూడా ఇది record అయి ఉంది - తమిళనాడు ధర్మపురి జిల్లాలో దాదాపు 150 సంవత్సరాల క్రితం రైతులు గో ఆధారిత వ్యవసాయంతో రికార్డు harvest సాధించారు. ఈమధ్యనే ఎందరో రైతులు పాలేకర్ గారి inspiration తో గోఆధారిత వ్యవసాయం మొదలు పెట్టి ఎన్నో మంచి ఫలితాలను సాధిస్తున్నారు, fertilizers, pesticides కొనీ కొనీ దివాళా తీసినవారు అప్పుల ఊబి నుండి బయటకు వస్తున్నారు. మన గో సంపద నశిస్తే తిండి కోసం బయటి దేశాల మీద అధారపదవలసినదే.

    2. తులసి గారు ఈ కధ ఇప్పుడే రాయడం ఉద్దేశపూర్వకమో, కాకతాళీయమో తెలియదు కాని, ఇవ్వాల్టి రాజకీయ వాతావరణంలో ఇది కచ్చితంగా సూడో/లెఫ్ట్ ముఠాలకు సహాయకారిగా పనికి వస్తుంది.

    3. తులసి గారు తస్లిమా నస్రీన్ గారి గురించి గాని, సిరియాలో దారుణాలకు గురి అవుతున్న Yazdi బాలికల గురించి గాని కథలు రాతే చదవాలని ఉంది.

    4. నేను కూడా దాదాపు గత 30 సంవత్సరాలుగా ఎన్నో న్యూస్ పేపర్స్ రోజూ చదువుతున్నాను - హిందువులు victims గా ఉన్న ఏఒక్క విషయంలోనూ ఈ సూడో/లెఫ్ట్ 'మేధావులు' నోరెత్తితే ఒట్టు - ఒకవేళ ఒకటో అరో ముక్క రాసినా, ఆవి కేవలం lip service లాంటివే.

    ReplyDelete
  8. హరిబాబు గారు, ఎంతో శ్రమించి చక్కని టపా రాసారండీ, మీకు ధన్యవాదాలు.

    1. చాలామంది అడుగుతున్నారు - ఆవుకు ఒక్కదానికే ఈ స్పెషల్ treatment దేనికి, ఏ జంతువును చంపినా అంతే తప్పు కదా అని? ఆవు ప్రత్యేకం ఎందుకంటే, మన సంప్రదాయ వ్యవసాయం లో ఆవు చేసే మేలు మరే జంతువు చెయ్యలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆవు అన్నదాతకు జీవన దాత. ఆవు పేడ, ఆవు మూత్రం వ్యవసాయానికి ఎంతో ఉపయోగం. శ్రీ సుభాష్ పాలేకర్ దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ విషయం మీద ఎంతో పరిశోధనలు చేసిచేస్సారు, దేశమంతటా ఎన్నో workshops నిర్నిర్వహిస్తున్నారు. ఆయన vedios ఎన్నో YouTube లో ఉన్నాయి. ఆయన ఎంతో స్పష్టంగా ఎన్నో సార్లు చెప్పారు - భారతీయ ఆవు పేడ , మూత్రంలో ఉన్న మంచి గుణాలు మరే ఇతర దేశాల ఆవులలో లేవు . అందుకే ఇవి వ్యవసాయానికి అంత ఉపయోగకారులు. ఆయుర్వేదంలో కూడా అందుకనే గోమూత్రం కు అంత ప్రాధాన్యత. British వారి హయాంలో maintain చేసిన records లో కూడా ఇది record అయి ఉంది - తమిళనాడు ధర్మపురి జిల్లాలో దాదాపు 150 సంవత్సరాల క్రితం రైతులు గో ఆధారిత వ్యవసాయంతో రికార్డు harvest సాధించారు. ఈమధ్యనే ఎందరో రైతులు పాలేకర్ గారి inspiration తో గోఆధారిత వ్యవసాయం మొదలు పెట్టి ఎన్నో మంచి ఫలితాలను సాధిస్తున్నారు, fertilizers, pesticides కొనీ కొనీ దివాళా తీసినవారు అప్పుల ఊబి నుండి బయటకు వస్తున్నారు. మన గో సంపద నశిస్తే తిండి కోసం బయటి దేశాల మీద అధారపదవలసినదే.

    2. తులసి గారు ఈ కధ ఇప్పుడే రాయడం ఉద్దేశపూర్వకమో, కాకతాళీయమో తెలియదు కాని, ఇవ్వాల్టి రాజకీయ వాతావరణంలో ఇది కచ్చితంగా సూడో/లెఫ్ట్ ముఠాలకు సహాయకారిగా పనికి వస్తుంది.

    3. తులసి గారు తస్లిమా నస్రీన్ గారి గురించి గాని, సిరియాలో దారుణాలకు గురి అవుతున్న Yazdi బాలికల గురించి గాని కథలు రాతే చదవాలని ఉంది.

    4. నేను కూడా దాదాపు గత 30 సంవత్సరాలుగా ఎన్నో న్యూస్ పేపర్స్ రోజూ చదువుతున్నాను - హిందువులు victims గా ఉన్న ఏఒక్క విషయంలోనూ ఈ సూడో/లెఫ్ట్ 'మేధావులు' నోరెత్తితే ఒట్టు - ఒకవేళ ఒకటో అరో ముక్క రాసినా, ఆవి కేవలం lip service లాంటివే.

    ReplyDelete
  9. జిలేబీ గారూ నమస్కారం. మీ జిలేబులు నాకు చాలా ఇష్టం. కథ సమయానుకూలంగా రాసినదేనండీ...
    మీరు సీనియర్లు. మా లాంటి నవ భిక్షకకులకు మంచీ చెడూ చెప్పాలి..

    ReplyDelete
  10. రాజ్యాంగం బీఫ్ నిజంగానే బాన్ చేసిందా?? మరి దేశమంతటా వున్న కల్యాణి బిర్యాని పాయింటులకి పర్మిషన్ రాజ్యాంగబద్దంగా ఎలా ఒస్తొంది?? బీఫ్ గురించి రాజ్యాంగం ఎం చెబుతుందో మీలాంటి మేదావులకి తప్ప మాలాంటి సామాన్యులకి ఎందుకు చేరదు? ఎవరికైనా దీనిగురించి రాజ్యంగంలో ఆర్టికల్ తెలుస్తే రిఫరెన్సు ఇక్కడ పెట్టండి. దానితోపాటు బీఫ్ షాపులు, బిర్యాని సెంటర్లకు ఏ బేస్ మీద పర్మిషన్ ఇస్తారో కూడా తెలపండి.

    ReplyDelete
    Replies
    1. నేను రాజ్యాంగం బ్యాన్ చేసిందని రాశానా?అవన్నీ తమ సన్నిధికి వచ్చిన కేసుల్ని వాదప్రతైవాదనల్ని రికార్డు చేసి వాటి మీద కోర్టులు ఇచ్చిన తీర్పులు.ఇవ్వాళ్టి చట్టాలూ న్యాయసూత్రాలూ సమస్తమూ రాజ్యాంగంలో ఉండి తీరాలా!కోఋతులు తీర్పులు ఇచ్చాయి అంటే అవి వాటికి ఉన్న న్యాయసూత్రాలనూ రాజ్యాంగ సూత్రాలనూ పటించుకోకుండా తీర్పుల్ని ఇస్తాయని మీరు అనుకుంటున్నారా?

      పైగా అవన్నీ కేవలం ఆవుల్ని గురించే కాదు ఇతరమైన జంతుజాతుల్ని కూడా తీర్పులలో పేర్కొన్నాయి.నేను ప్రస్తావించిన ఏ అంశమూ రహస్యంగా నాకు మాత్రమే తెలిసినది కాదు.ఆసక్తిని బట్టి తెలుస్తాయి. ఆ కోర్టు తీర్పుల సంకలనం కూడా నాకు నిజంగా తీర్పులు అంత కఠినంగా ఉన్నాయా,లేక నా వాదన అశాస్త్రీయంగా ఉంటుందా అని సందేహం వచ్చి వెతికితే దొరికినదే!

      మీకు ఆసక్తి ఉంతే తెలుసుకుని ఒకవేళ అవన్నీ నిరాధారమని గానీ ఆ చట్టాలు ఇప్పుడు కొట్టివేయబడినాయని గానీ రుజువు చెయ్యగలిగితే మిగిలిన వారి సంగతి నాకు తెలియదు గానీ నేను మాత్రం నా వాదన చెల్లనిదేననీ ఒప్పుకుంటాను.

      నేను గోసంరక్షకులకు ఇచ్చిన సలహా కూడా అదే,కోర్టులో కేసు గనక వేస్తే అవి ఇప్పుడు చెల్లుతాయా లేదా, వాటికి న్యాయపరమయిన వ్యాలిడిటీ ఉందా లేదా అని కోర్టులే తేల్చి చెప్తాయి కదా!

      నాకు సత్యమే ప్రమాణం. అసత్యాలతో నన్ను నేను సమర్ధించుకోవడం ఎన్నటికీ జరగదు - ప్రయత్నించహండి,శుభం!

      Delete
  11. నేను నీ వ్యాఖ్యల్ని నిరాధారం అని కొట్టెయ్యడానికి అడగటం లేదు. దాని గురించి తెలుసుకుందామనే అడిగాను

    ReplyDelete
    Replies
    1. అర్ధమయింది,ఓకే!అంతకన్నా నాకూ తెలీదు.నా వాదన కరెక్టా కాదా అని తేల్చుకోవడానికి వెతికితే దొరికిన సమాచారం అది.సుప్రీం కోర్టు రూలింగు కూడా ఖచ్చితమైన సమాచ్గారమే,అది కోర్టులూ చట్టాలకి సంబంధించిన అసైటే,హిందూత్వ వారి ప్రాపగాండా సైటు కాదు.

      Delete
    2. Gujarat v. Mirzapur Moti Kureshi Kassab, 2005
      http://indiankanoon.org/doc/101278772/

      Delete
    3. jai
      thanks,I got a different site.It is not this much full notes.only brief intros for various judgements.anyway refers the same case.
      thanks again!

      Delete
    4. This is the full judgement text. Just reading summary is sometimes not helpful

      Delete
  12. ప్రత్యామ్నాయపు ఆలోచలనల పేరుతో మేథావులు చెత్తంతా ఏరుకుని పారబోసేది ఆ సైటులోనే! ఇంతకన్నా దుర్మార్గంగా రాసిపారేసిన చెత్త అక్కడ చాలానే ఉంటుంది. వాదించే ఓపికలు లేక ఆ పక్కకు వెళ్ళటమే మానుకున్నా. By the way, as usual a well written article. Now you may get an invite from that site to putforth your POV :)

    ReplyDelete
  13. kondamudi
    ప్రత్యామ్నాయపు ఆలోచలనల పేరుతో మేథావులు చెత్తంతా ఏరుకుని పారబోసేది ఆ సైటులోనే! ఇంతకన్నా దుర్మార్గంగా రాసిపారేసిన చెత్త అక్కడ చాలానే ఉంటుంది.

    haribabu
    మీ భావం అర్ధం కాలేదు?ఆ సమాచారం తప్పంటారా?నాకు అలా అంపిచ లేదే!అదీ గాక ఇక్కడ ఒక సైటు అని రిఫర్ చేశానే గానీ చాలాచోట్ల ఉందే గోవధ నిషేధం గురించి ఎక్కద అచదివిన అచట్టాలు ఎప్పుడో చేసారని తెలుస్తుంది గదా!

    ReplyDelete
  14. @kondamudi
    నా ట్యూబులైటు ఇప్పటికి వెలిగినట్టుంది,మీరు వ్యాఖ్యానించింది సారనగ్ గురించి అనుకుంటాను,కొంచెం విసదీకరించహండి!
    నాకు ఏదయినా సందేఅహం వస్తే అది తీరేవరకూ నిద్రపట్టి చావదు,నాకు గొదవలు వస్తున్న్నది కూడా ఆ సందేహాల వల్లనే,ఏంటో ఈ ఖర్మ?

    ReplyDelete
  15. ఇదివరలో గ్రామాలలో జరిగినది వేరు.అప్పుడు గోజాతికి ఆ వ్యవస్థలో ప్రాముఖ్యత ఉందేది.ఒక జాతిని సంరక్షొస్తూ మన అవసరాలకు తగినట్టు ఉపయోగించుకునే ఉభయతారకమైన పధ్ధతి - ఉదాహరణకి కోళ్ళ పెంపకం పూర్తిగా ఆహారం కోసమే చేస్తున్నాం!కొందర్రు బీఫ్ తినడం మా తిండిహక్కు,దాన్ని వద్దనడం, ఎప్పటినుంచో ఉన్నదాన్ని ఇవ్వాళ కొత్తగా వ్యతిరేకించడం కేవలం బ్రాహ్మణాధిక్యత,కాబట్టే వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు .శాఖాహారాన్ని భారతదేశం లోని బ్రాహ్మణులే కాదు, ప్రపంచం లోని చాలా దేశాలలో ఎంతోమంది పాటిస్తున్నారు.ఆహారపు అలవాట్లలో ఉన్న రెండింటిలో ప్రతిదానికీ అనుకూలతలూ ప్రతికూలతలూ ఉన్నాయి.కానీ కొందరు వద్దంటున్నారు గాబట్టి మరింత ఎక్కువ జంతువుల్ని చంపి తింటూ పండగ చేసుకోవటం మానవత్వం ఉన్నవాడెవడూ చెయ్యదగిన పని కాదు!రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిస్వేచ్చలకే పరిమితులు ఉన్నప్పుడు మీరు తినడం కోసం ఆవుల్ని చంపే హక్కు ఎవరయినా ఇస్తారా?ఆవుల్ని చంపవద్దంటున్న వాళ్ళు మా ఇష్టమొచ్చిన తిండి తినే హక్కుని కాదంటున్నారు అని వీరంగాలు వేస్తూ "బీఫ్ ఫెస్టివల్" లాంటి హేయమైన పనులకి తెగబడుతున్న వాళ్ళు వారు తినడానికి చంపే వాటిలో ఏ ఒక్కదానికయినా తిరిగి ప్రాణం పొయ్యగలరా!చచ్చిన వాటిని బతికించ లేని మీకు మీ తిండి కోసం వాటిని చంపే హక్కు ఎట్లా వస్తుంది?ఎవరిస్తారు!మూర్ఖంగా ఎదటివారిని దుర్మార్గులుగా నిలబెట్టడం కోసం మీరు అనాగరికమైన పనులు చేస్తున్నారు తెలుసుకోండి!పులుల కోసం అభయారణ్యాలు నిర్దేశించినట్టు ఆవులకి కూడా రక్షణ మందిరాలు నిర్మించాల్సిన స్థితికి దేశాన్ని తీసుకు వెళ్ళకండి,వెనక్కి తగ్గండి!

    ReplyDelete
  16. >>చచ్చిన వాటిని బతికించ లేని మీకు మీ తిండి కోసం వాటిని చంపే హక్కు ఎట్లా వస్తుంది?
    ఇలా ఆవేశంతో సెల్ఫ్ గోల్సు వేసుకోవడం నీ తర్వాతే ఎవరైనా

    ReplyDelete
    Replies
    1. bluecake:
      ఇలా ఆవేశంతో సెల్ఫ్ గోల్సు వేసుకోవడం నీ తర్వాతే ఎవరైనా
      haribabu:
      ఇదే లాజిక్ గొడ్డుమాంసం తిన్నందుకు ఒకణ్ణి చంపితేనే "మాకు తిండి పెట్టనివాళ్లకి మేము తింటుంతే అడ్డు వచ్చే హక్కు ఎక్కడిది?" అని అడిగే వాళ్లకీ వర్తిస్తుంది!ఒకణ్ణీ చపితే యేడ్చినవాళ్ళు బీఫ్ ఫెస్టివల్సు పేరుతో మరో పది జంతువుల్ని చంపుతూ పండగ చేసుకుంటున్నవాళ్ళు సెల్ఫ్ గోలు చేసుకుంటున్నట్టు అవదా?

      పెతిదానికీ నాకు సెల్ఫుగోలు చేసుకోవటాన్ని అంతగట్టే తొందరలో మళ్ళీ ముందూ వెనకా చూసుకోవటం మర్చిపోయినట్టుంది:-)

      Delete
    2. Do you think I made that statement foolishly?
      If you think like that,you are a king of fools!

      Delete
  17. >>పెతిదానికీ నాకు సెల్ఫుగోలు చేసుకోవటాన్ని అంతగట్టే తొందరలో మళ్ళీ ముందూ వెనకా చూసుకోవటం మర్చిపోయినట్టుంది:-)

    అస్సలు నేను ఎందుకన్నానో కూడా అలోచించకుండా.. రిటార్ట్ ఇవ్వల్సిందే అని ఫిక్స్ ఐపోతే ఇంకేం మాట్లాడతాం...

    ReplyDelete
    Replies
    1. bluecake:
      అస్సలు నేను ఎందుకన్నానో కూడా అలోచించకుండా..
      haribabu:
      ఇందులో ఆలోచించదాని కేముంది తమరి ముఖం!ముందూ ఎనకా రిఫెరెన్సులు గూడా ఇచ్చాను.ఆ ఒక్క వాక్యమే ఎత్తి చూస్తే నీ మట్టిబుర్రకి నేను సెల్ఫుగోలు వేసుకున్నట్టే ఉంటుంది.

      కానీ శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించినవని తెలిసి కూడా కాంగ్రెస్ అమ్రియూ ములాయం పాలీత్ రాష్ట్రాల్లో జరిగినవాటిని కూడా డిల్లీలో ఉన్న మోదెకి అనట్గట్టే పిచ్చితనం నెకు మేధావి తనంలా కనిపిస్తేనే నేను సెల్ఫ్ గోలు వేసుకున్నట్టు.

      మొత్తం టాపిక్ చదివితే చట్టప్రకార్మ్ కేసు వేస్తే చాలు,గొడ్డళ్ళ తో దాడి చెయ్యనూ అఖ్హ్కర్లేదు.కాశ్మీరులో చేసినట్టు అల్లరీ చెయ్యనఖ్ఖర్లేదు అని చెప్పాను.సాంతం చదివినట్టు లేదు.

      నువ్వ్ గొడ్డలి దాడి గురించి వాగుతున్నావని తెలుసులే.సాంతం చహ్దివితే నేను పూర్తి స్ప్ర్హలోనే ఉండి దేన్ని సమర్ధించాలై దేన్ని విమర్సించాలైఅ నై తెలిసే రాశాను.

      నీకులా శ్లేషం మీదనే వాలే ఈగలా ఆలఓచిస్తే నేను సెల్ఫ్ గోలు చేసుకున్నట్టే అర్ధం అవుతంది.

      మీ వాదనకి సపోర్టుగా మీ బెండుంకి బెండు తీసే ధియరీని తెచ్చుకున్నట్టు ఆలోచించడానికి హరిబాబు బ్లూకేకు కాదు.

      Delete
  18. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. ఓరేయ్ అన్వేష్!
      నీకు బూతులు వాడాలని దురదగా ఉంటే మరో బ్లాగ్ వెతుక్కో!
      మర్యాదగా నాలుగు ముక్కలు మాట్టాడ్డం చాతగాని ప్రతి అడ్డ గాడిదకీ ఇక్కడ జాగా లేదు.
      తిన్నగా మాట్టాడితే మాట్టాడు,లేదంటే ఇటు రాకు - మెంటలు మంద:-)

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...