Tuesday 14 April 2015

బ్రాహ్మణుణ్ణి సంస్కరించాలనే క్రైస్తవుల లక్ష్యం నుంచే బ్రాహ్మణ వాదం పుట్టింది?

     వసుధైక కుటుంబం అనే భావన కొందరు ఆశావాదుల్ని ఒకప్పుడు కొంచెం గట్టిగా సంకల్పిస్తే చాలు నిజమైపోతుందనే విధంగా ఎంతగానో మురిపించింది! ఇక యేదో ఒకనాటికి నిజం కాబోయే హెచ్చుతగ్గులు లేని ఒక సుఖసుందర భవిష్యదుజ్వల మానవజీవితం గురించి కలల్లో విహరింపజేసింది!ఇప్పటికీ కొందరికి ఆ భావన అధ్భుతంగానే అనిపిస్తుంది కాబోలు, కానీ కొందరు ప్రాక్టికాలిటీ యెక్కువగా వున్నవాళ్ళకి చాలాకాలం క్రితమే ఆ ఆశ నెరవేరడం అసంభవమని తెలిసి పోయింది!

     ఈ భూమి మీద మానవ సమూహమంతా ఒకే చోట చిక్కురొక్కురుగా పెనవేసుకుని బతకగలదా?వుండలేదు, యెందుకంటే ఈ భూమి మీద అన్ని ప్రాంతాలూ ఒక్కలాగా లేవు, జనావాసాలకి పనికిరాని యెడారులూ,పర్వతశ్రేణులూ,అగాధమయిన జలరాశులూ చాలా తక్కువగా వున్న మానవ నివాస యోగ్యమయిన భూమిని వేరు చేస్తున్నాయి.ఇది కేవలం భౌగోళికమయిన యెడబాటే కదా అనుకుంటే అంతకన్నా తెలివితక్కువ మరొకటి ఉండదు!

      తినే ఆహారం, కట్టే బట్టా, ఉండే ఇల్లూ అన్నీ తామున్న ప్రాంతంలో క్షేమంగా బతకడానికి అనువుగా వుండి తీరాలి,అక్కడి ఋతువుల మార్పుల కనుగుణంగా తమ అలవాట్లని తప్పనిసరిగా మార్చుకుంటూ ఉండాలి,ఆ జీవన విధానాని కవసరమయిన జ్ఞానాన్ని తమ తరవాతి తరం వారికి అందించాలి,లేదంటే ప్రతి తరం రెడ్డొచ్చె మొదలాడు అన్న చందాన అనాది కాలం నాటి అజ్ఞానపు దశలోనే వుండిపోతుంది!

     ఒక తరం నుంచి మరొక తరం వైపుకి ప్రవహించే జ్ఞానవాహిని యెందుకంత విలువైనదో తెలుసుకోవాలంటే పునరపి జనం పునరపి మరణం అన్నట్టు మళ్ళీ మళ్ళీ జరుగుతున్న సన్నీవేశాల్ని అతి దగ్గిర్నుంచి చూసి వాటిల్లో కనిపించే యేకత్వాన్ని చూడాలి!మనం పుట్టినప్పుడు చేతుల్లో ఇమిడిన మనల్ని చూసి మన తలిదండ్రులు యెంత అబ్బుర పడ్డారో మనల్ని యెంత బాధ్యతా యుతంగా పెంచి పెళ్ళి చేసి ఇంటివాళ్ళని చేసినట్టుగానే ఇవ్వాళ మన చేతుల్లో ఇమిడిన మన పిల్లల్ని చూసి అబ్బురపడుతున్నప్పుడు మనం కూడా అంత గొప్పగా తయారు చెయ్యాలంటే వాళ్ళు మనల్ని యెట్లా పెంచారో తెలుసుకోవాలి గదా?ఇవ్వాళ మనకొచ్చిన సమస్య చిన్నదే అయినా యెవ్వరితోనూ ఆలోచించకుండా ఉంటే భవిత భయంకరంగా కనబడి అర్ధంతరంగా జీవనప్రయాణం ముగించెయ్యాలన్నంత నిరాశ కలుగుతుంది,కానీ మనలాగే ఇదివరకే ఇలాంటి సమస్యనే ఎదుర్కుని దాన్ని తెలివిగా పరిష్కరించుకున్న అనుభవం ఇప్పుడు మనని అలాంటి తెలివితక్కువ పనులు చెయ్యకుండా కాపాడుతుంది - ఇందుకోసమే సాహిత్యం ఆవిర్భవించింది?!

     ప్రతి సమాజంలోనూ ప్రతి మనిషికి రెండు ముఖాలుంటాయి - లౌకిక ముఖం,ఆధ్యాత్మిక ముఖం!ఈ రెండూ పరస్పరాశ్రితాలు అంటే ఒక మనిషి తన ఆధ్యాత్మీక విషయాల్లో దేనిపట్ల మొగ్గు చూపుతాడో ఆ అంశం అతని లౌకిక విషయాల్లోనూ ప్రతిఫలిస్తుంది,అట్లాగే లౌకిక విషయాల్లో అతని అనుభవాలూ,భయాలూ,సంతోషాలూ అతని ఆధ్యాత్మికతని ప్రభావితం చేస్తాయి! అయితే విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు యేది యెక్కువగా రెండోదాన్ని ప్రభావితం చేస్తుందో తెలుసుకోవచ్చా?

     ఒక మనిషి తన ఇంటి గడప దాటి బజారులోకి అడుగుపెట్టేవరకు ఒంటరిగా వున్నప్పటి ఆలోచనలూ,జ్ఞాపకాలూ,ఆదర్శాలూ,అవహేళనలూ,నిరాశలూ,నిస్పృహలూ అతని ఆధ్యాత్మిక ముఖాన్ని తయారు చేస్తాయి!అయితే ఒకసారి గడప దాటి బయటి కొచ్చాక అతని సామాజిక స్థానం అతని లౌకిక ముఖాన్ని ప్రదర్శించేటందుకు రంగస్థలంగా పని చేస్తుంది!యెవరితో యేవిధంగా మాట్లాడాలి,యెవరిని స్నేహితులుగా తీసుకోవాలి,యెవరితో శతృత్వం ప్రకటించాలి అనేవన్నీ ఈ లౌకిక ముఖంతో చేస్తుంటాడు మనిషి,కానీ ఈ లౌకిక ముఖం ఆలోచనకి తావివ్వదు - అప్పటికప్పుడు యెదురయిన సన్నివేశంలో తప్పనిసరిగా యేదో ఒక విధంగా ప్రతిస్పందించాల్సి వచ్చినప్పుడు ఆలోచించటం కుదరదు గదా!సమయానికి తగు మాట తట్టినట్టయితే ఫరవాలేదు గానీ ఒక్కోసారి పూర్తిగా అతని సంస్కారానికి విరుధ్ధంగా ప్రవర్తించి ఇరుకున కూడా పడవచ్చు - అవునా?ఆ సంస్కారం అతను ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పటి అతని ఆలోచనల సారం కాబట్టి మనిషి ప్రవర్తనని యెక్కువగా ఆధ్యాత్మిక ముఖమే శాసిస్తుందనేది అనుభవం మీద ప్రతి మనిషికీ తెలిసే విషయమే!

     అందువల్లనే రాజ్యం చతుర్విధ ఉపాయాలతో కూడా చెయ్యలేని పనిని పురోహిత వర్గంతో చేయిస్తుంది!రాజశాసనాన్ని తేలికగా ధిక్కరించగలిగిన వాడు కూడా దైవశాసనాన్ని ధిక్కరించటానికి భయపడతాడు?సామాజికులలో ధర్మం పాదుకొనాలంటే రాజు బలంగా వుండి తీరాలి,ప్రజలు క్రమశిక్షణ కలిగి ఉండాలి!ప్రాచీన కాలంలోనే అన్ని కాలాలలోని ప్రజలకూ పనికివచ్చే విషయాలకి సంబంధించిన అన్ని చింతనల్లోనూ ప్రముఖ స్థానంలో ఉన్న  భారత డేశపు మేధావులు రాజ్యాన్నీ సమాజాన్నీ బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రులనే విధంగా విభజన చేస్తే ప్లాటో,అరిస్టాటిల్ లాంటి పాశ్చాత్య మేధావులు హేతువు, ధీరత్వము, ఇఛ్ఛ అనే మూడు ఉపాంగాలని రాజ్యానికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలుగా వూహించారు!విభజనలు అన్ని చోట్లా ఉన్నాయంటే అది సౌలభ్యం కోసం చేసినవని అర్ధమవుతున్నది గదా,అయినా ఇక్కడివాళ్లే క్రూరంగా ఇవన్నీ చేసినట్టు ఆరోపిస్తున్న వాళ్ళు బహుశా కూపస్థ మండూకాల్లాగ ఉండిపోయి అవన్నీ చదవ లేదనుకుంటాను?!

      మనుషులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రేండు సమయాల్లో వెళతారు - విహారానికీ వ్యాపారానికీ?దేనికోసం వెళ్ళినా మనిషి అనుకోకుండా చేసే మొట్టమొదటి పని తన ప్రాంతపు జీవన విధానంతో కొత్త ప్రాంతపు జీవన విధానాన్ని పోల్చుకోవడం!అట్లా పోల్చుకున్నప్పుడు వాళ్ళకన్నా మెరుగ్గా తమలో యేదయినా వుంటే గర్వంగా ఉంటుంది,తమకన్నా వాళ్ళలో యేవైనా మెరుగైనవి ఉంటే నేర్చుకోవాలనిపిస్తుంది!అట్లా నేర్చుకుంటూ నేర్పుతూ వుండే ఆదాన ప్రదానాలే మనుషుల్ని కలుపుతాయి,ఈ ఆదాన ప్రదానాల్లో భారతీయులు యేనాడూ వెనకబడి లేరు?!ఇతర్లకి కళ్ళు బైర్లు గమ్మే స్థాయిలో మహానౌకల నిర్మాణం చేసి ప్రపంచంలోని అన్ని విపణి వీధుల్ని కలియదిరిగిన వాళ్ళకి ఆదాన ప్రదానాల గురించి తెలియదనుకోవటం మూర్ఖత్వంతో కూడిన అజ్ఞానం నుంచి పుట్టే మొండితనం మాత్రమే?!

      ఆది యందు వాక్యము పుట్టెను - అంటుంది బైబిలు సూక్తి?విశ్వాండం భళ్ళున బద్దలైతే పుట్టిన ఓంకారం అనే బీజాక్షరమే తొలి శబ్దం అంటుంది వేదం!అట్లా చెప్పిన వాళ్ళు ఇద్దరిలో యెవరూ ఆ కాలానికి వెళ్ళి చూడలేదు,వారికా అవకాశమూ లేదు,కేవలం నేను ఇక్కడి ఇప్పటికి యెక్కణ్ణించి యెట్లా వచ్చాను అనే ప్రశ్నకి వీలున్నంతవరకూ తర్కబధ్ధంగా తమకి తోచిన జవాబు చెప్పుకుని సంతృప్తి పడిపోవడమే వారు చేసిందల్లా?!మన సంకల్పంతో సంబంధం లేకుండా పుట్టుకొచ్చిన మనకి ఈ విశాల విశ్వంలో మనకన్నా యెంతో కాలం ముందే పుట్టుకొచ్చి మన కంటికి కనిపించే ప్రతిదాన్ని గురించీ సాధికారికంగా తెలుసుకోగలగటం అసంభవం!మనిషి జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి,వుండి తీరాలి?ఒక మనిషి సమస్తాన్నీ తెలుసుకోలేడు,నా నేర్చిన యంత అని యెంతో కొంత అందరికీ చెప్తే అందులోంచి యెంత అర్ధమయితే అంత ఇతర్లు మరికొంతమందికి చెప్పగా ఆ తరం మొత్తానికి పోగుపడే జ్ఞానాన్ని తర్వాతి తరానికి అందించటం మాత్రమే చెయ్యగలడు!?

      ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు తొలిసారి ఈ భూమి నుంచి వెళ్ళిన వాళ్ళు సింధు ప్రాంతం వారు కావటం వల్లనో యేమో ఆ ప్రాంతపు పేరునే అందరికీ తగిలించి పలుకుబడి కోసం రూపం మార్చి హిందువులు అని పిలిచారు.తొలినాళ్లలో భరతుడి పేరున భరతఖండం అని కొన్ని చోట్లా ఆర్యావర్తం అని కొన్నిచోట్లా వ్యవహరించబడిన ఉదాహరణలు ఉన్నాయి కాని ఆఖరికి మాత్రం హిందూ దేశం అనేది స్థిరపడిపోయింది!యేడు ఖండాలుగా సాగరంతో విడదియ్యబడిన ప్రతి భూభాగంలోనూ అనేక దేశాలూ సంస్కృతులూ ఉండగా శీతనగం విడదియ్యటం వల్ల ఆసియా ఖండంలోని ఈ ఒక్క భూభాగమే ఉపఖండం అని చెప్పదగినంతగా అనేక జాతులతో విభిన్న సంస్కృతులతో కూడి వున్నప్పటికీ అందరూ బతికి బతికించే మనస్తత్వంతో వుండటం వల్ల ఆ పేరును గొప్పగానే నిలబెట్టుకుంది!

    ఇతర్ల కన్నా యెక్కువగా చేరిన సంపద మొదట బంధువుల్లో ఈర్ష్యని పెంచుతుంది, ప్రచారం యెక్కువైతే దొంగల్ని ఆకర్షిస్తుంది - భరత ఖండం పరిస్థితీ అదే!తొలిదెబ్బ క్రీ.శ 1024లో గజిని మొహమ్మద్ సోమనాధ దేవాలయాన్ని ధ్వంసం చెయ్యడంతో పడింది,మలిదెబ్బ క్రీ.శ 1399లో కుంటి తైమూర్ డిల్లీని పడగొట్టడంతో పడింది,ఆఖరి దెబ్బ తండ్రి వైపునుంచి తైమూరు వారసత్వాన్నీ తల్లి వైపునుంచి చెంఘిజ్ ఖాన్ వారసత్వాన్నీ అందుకున్న బాబరు క్రీ,శ 1525లో కేవలం 12,000 మంది సైనికులతో వచ్చి తన ముందరివాళ్ళు చేసినట్టు సుందరమైన నగరాల్ని ధ్వంసం చేసి అపారమైన ధనరాశుల్ని కొల్లగొట్టి స్వస్థలానికి తరలించుకుపోవడానికి బదులు ఇక్కడే ఉండాలనుకుని మొగలాయి పాలనకి ఆరంభం చుట్టడంతో పడింది!ఆ తర్వాత క్రీ,శ 1612లో జహంగీరు కాలంలో సూరత్ దగ్గిర గిడ్డంగులు కట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పొందటంతో ఈ దేశంలో అడుగుపెట్టి జాలితో గుడారంలో తల మాత్రమే పెట్టుకోనిస్తే యజమానినే బయటికి నెట్టిన ఒంటె లాగా క్రమంగా విస్తరించి క్రీ,శ 1947 వరకూ ఈ దేశాన్ని పీల్చి పిప్పి చెయ్యగా ప్రపంచంలోని యే జాతీ అనుభవించనంత సుదీర్ఘ కాలపు పరాధీనతని ఈ దేశప్రజలు అనుభవించి కూడా తమదైన వారసత్వంలో విలువైన వాటిని వేటినీ పోగొట్టుకోకుండా తమకి ద్రోహం చెసిన వారిని కూడా క్షమించి మిత్రభావాన్ని చూపిస్తూ నిలబడి ఉన్నారు?!

   ఈ అనంత కాలగమనంలో యెన్నో నాగరికతలు పుట్టాయి,పెరిగాయి,వైభవాన్ని చూశాయి,పతనానికి గురయ్యాయి,అంతరించి పోయాయి - ఇవ్వాళ వాటి గురించి చరిత్ర విధ్యార్ధులు చదువుకునే కధలే మిగిలాయి!చాలా తక్కువ కాలపు ప్రతికూలతలకే మేసపొటేమియా,ఈజిప్ట్,గ్రీసు నాగరికతలు ఇవ్వాళ కధావశిష్టమయినా సుమారొక 800 యేళ్ళ పాటు ఇంతటి పరాధీనతని అనుభవించిన తర్వాత కూడా సాంప్రదాయికమైన జీవన విధానం అవిఛ్చిన్నంగా కొనసాగుతూ వుండటం యెంత అద్భుతం?!ఈ దేశపు నదుల్లో పారే నీటికీ ఈ దేశపు శ్రమణులు నదీతీరాల్లో యెలుగెత్తి ధ్వనించిన ఓంకారానికీ ఈ దేశపు వనితలు వూడ్చి కళ్ళాపి జల్లిన నేలకీ ఈ దేశపు నైష్ఠికులు వ్రేల్చిన హోమాగ్నికీ ఈ దేశపు కర్షకులకు జీవనమైన నభస్సుకీ మనం సదా కృతజ్ఞులమై ఉండాలి - అవి బలంగా ఉండటం వల్లనే ఆ అద్భుతం జరిగింది!

      ఔరంగజేబు తప్ప మొఘల్ పాదుషాలు యెవ్వరూ ప్రజల రోజువారీ జీవన విధానాన్ని మూర్ఖంగా శాసించకపోవచ్చు - బాబరు,అక్బరు లాంటివాళ్ళు తిరుగుబాట్లు లేకుండా ఉంటేనే పరిపాలన సజావుగా జరుగుతుంది కాబట్టి ఉదారంగా పరిపాలించి ఉండవచ్చు!ఔరంగజేబుకు బదులు దారా షికో అధికారంలోకి వచ్చి ఉంటే యెలా ఉండేదో?కానీ ఆ కాలంలో ధ్వంసమైన హైందవ ధార్మిక క్షేత్రాల్ని కలిపి లెక్కించి మొత్తం మీద చూస్తే అంత దూరం నుంచి వచ్చి ఇక్కడి చరిత్రకి వారు నూతనంగా చేర్చినదేమిటి అని అంచనా వేస్తే అంత కష్టపడి వారిక్కడికి రాకపోయినా ఈ దేశపు సంస్కృతీ వైభవానికి యే లోటూ వుండేది కాదనిపిస్తుంది.

      కొన్ని వందల మంది తత్వవేత్తలు కొన్ని శతాబ్దాలు శ్రమించి నిర్మించిన భవంతిని కూడా ఒక గాడిద గంటలో కూల్చివెయ్యగలదన్న సామెత ప్రకారం అంత సుదీర్ఘకాలం పాటు  విదేశీయుల నుంచి దాడిని తట్టుకున్న ఈ దేశానికి అదేమి చిత్రమో స్వాతంత్ర్యానంతరం స్వదేశీయుల నుంచే కష్టాలు మొదలయినాయి!యే జాతి అయినా ఒకనాడు ప్రపంచ స్థాయిలోనే అప్రతిహతమైన వైభవాన్ని చూసి కాలవశాన దాన్ని పోగొట్టుకుని అంత సుదీర్ఘకాలం పాటు పరాధీనతని అనుభవించి తిరిగి స్వాతంత్ర్యాన్ని పొందితే తల్లి వొడిని వొదిలి కొంతకాలం గడిపి తిరిగి తల్లిని చేరినప్పటి లేగదూడ వలె తన పూర్వ వైభవాన్ని వీలయినంత తందరగా తిరిగి పొందడానికి ఉరకలు వేస్తుంది - కానీ ఇక్కడలా జరగలేదు?

    ఒపెన్ హీమర్ అనే ఆటం బాంబు తయారు చేసిన శాస్త్రజ్ఞుడు దాని ప్రయోగ సందర్భంలో తనకు కల్గిన అనుభూతిని "కాలోస్మిన్ లోకక్షయకృత్" శ్లోకంతో అనుసంధానించి వ్యాఖ్యానించిన సంస్కృతాన్ని మృతబాష అనీ దాన్ని పట్టుకు వేళ్ళాడ్డం వల్లనే మనం కాలంతో పాటు పరిగెత్తలేక వెనకబడి పోయామనీ ఇంగ్లీషులో మాట్లాడ్డం వల్లనే మిగతావాళ్ళు అంత ముందుకెళ్ళిపోయారనీ బానిస మాటలు మాట్లాడుతూ,కులభేదాలు అన్ని చోట్లా ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు దాచేసుకుని గౌరవనీయులుగా వేషాలు కడుతుంటే లోనారసి చూసి తెలుసుకోకుండా  దుష్టత్వం అంతా ఇక్కడే పోగుపడిపోయినట్టు విదేశీయుల కన్నా యెక్కువగా స్వదేశాన్ని అల్లరి పెట్టుకునే వికారపు సంస్కారం గొప్ప లౌకికాదర్శం అని భ్రమించే దివాంధాలు కొత్తగా పుట్టుకొచ్చారు?

     కార్యకారణ సంబంధం ప్రకారం ఆలోచిస్తే ఈ దుస్థితికి ప్రాచీనుల పాపమూ కొంత ఉంది,కొన్ని తప్పులు చేశారు!పరలోకం గురించి యెక్కువగా కలలు కని ఇహలోకం గురించి నిర్లక్ష్యం చేశారు.ప్రజలకి పధనిర్దేశం చెయ్యాల్సిన పరమయోగులు గుహల యందు జొచ్చి యేకాంతవాసానికి మళ్ళారు.ఒకనాడు ఉత్సాహంతో ప్రపంచమంతా చౌకళించిన వారు కాస్తా నిరాశా నిస్పృహల పొగలు కమ్మి వివేకాన్ని నశింపజేసుకుని సముద్రయానాన్ని నిషేధించుకున్నారు.పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు సోమరితనం వల్ల కలిగే దుష్ఫలితాల్లో ఒకటయిన పరస్పర హననం మొదలైంది?తొలినాళ్ళలో సమర్ధులైతే శూద్రులు కూడా రాజోచిత గౌరవాల్ని పొందటానికి తోడ్పడిన ఆదర్శవంతమైన కులవ్యవస్థ కందెన వెయ్యని ఇరుసులా బిగిసిపోయి స్వభావంలోని క్షాత్రం వల్ల రావలసిన క్షత్రియత్వమూ జ్ఞానం వల్ల రావలసిన బ్రాహ్మణ్యమూ గుణంతో పనిలేకుండా జన్మకి అంటుగట్టబడినాయి?స్వాభిమానంతో గౌరవంగా బతకడానికి అర్హత వున్నా శూద్రుడు దాసత్వానికే పరిమితం కావాలనడం నిజంగా అన్యాయమే!కానీ యెప్పటికప్పుదు ప్రాబడిన వస్త్రాల్ని విడిచినంత తేలిగ్గా గతంలోని తప్పుల్ని సవరించుకుని రెట్టించిన బలంతో పైకెగసిన గొప్ప ఆత్మవిమర్శనా పూరితమైన ప్రాతిగామి లక్షణం ఈ దేశప్రజల కున్నదని చరిత్రలో చాలాసార్లు నిరూపణ అయింది,తప్పకుండా మళ్ళీ మళ్ళీ నిరూపణ అవుతుంది!?

      హిందూత్వం అనేది ఒక జీవన విధానం!అసలుకి బయటి నుంచి తొంగి చూసిన వాళ్ళు ముందుగానే ఈ దేశానికి హిందూ దేశం అని పేరు పెట్టేసుకుని వచ్చి ఇక్కడి జీవన విధానంలోని సంక్లిష్ఠత అర్ధం కాక ప్రతి మనిషికీ కొత్తచోట కనిపించిన ప్రతిదాన్నీ తమ సొంతవాటితో పోల్చుకోవడం సహజం గనక హిందూ మతం అని పేరు పెట్టేశారు గానీ ప్రాచీనులు తాము పాటిస్తున్న దాన్ని సనాతన ధర్మం అని చెప్పుకున్నారు.నేను ఒక బ్లాగులో మొదటిసారి ఈ మాట చెప్పినప్పుడు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు.ఇప్పుడు చాలామంది సహ బ్లాగర్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, సంతోషం!అయినా ఇక్కడ మరోసారి వివరంగా చెప్తాను.ప్రపంచంలో ఉన్న చిన్నా చితకా మతాల నుంచీ అతి పెద్ద సంఖ్యలో భక్త సముదాయం గల మతాల వరకూ ఒక ప్రధాన దైవమూర్తి,ఒక పవిత్ర గ్రంధం,ఒక ప్రవక్త అనే మూడు అంశాలు ఖచ్చితంగా వుంటాయి!పుట్టుక,పెళ్ళి,చావు అనే మూడు అత్యంత ముఖ్యమైన సందర్భాలలో ఆచరించాల్సిన కర్మకాండలు తప్పనిసరిగా పాటించాల్సిన విధంగా శాసించబడి వుంటాయి!సామాజిక సంతులనం కోసం అవసరం గనక లౌకిక విషయాలయిన రెండవ శ్రేణి విషయాలు హిందువుల జీవన విధానంలోనూ వ్యవస్థీకరించబడి వున్నా మొదటి శ్రేణి విషయాలలో మాత్రం పూర్తి విభిన్నత వుంది ఈ దేశపు జీవన విధానంలో! దేవుడు లేదన్నా ఫరవాలేదు గానీ ధర్మాన్ని మాత్రం అతిక్రమించకూడదనే హెచ్చరికా,దేవుళ్ళు స్వయంగా మానవావతారం దాల్చి భూమికి దిగివచ్చినా ధర్మ తత్వ నిరూపణకే ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి వుదాహరణలుగా కనబడతాయి పరిశీలించి చూస్తే!బయటివాళ్ళకి అర్ధం కాకపోవడంలో విచిత్రం యేమీ లేదు గానీ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు కూడా యెందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారు?

     ఈ దేశపు సామాజిక వాతవరణంలో ప్రతికూలతలు యెన్ని ఉన్నా ఇప్పుడు ఆకాశమెత్తు యెదిగి కనబడుతున్న వటవృక్షం కూడా మొలకగా వుండి భూమిని చీల్చుకుని వచ్చే తొలిదశలో సున్నితంగా వున్నట్టు యెందరో సంస్కర్తలు లోపలివారుగా వుంటూనే సహనంతో సాటివారికి గురుత్వం వహించి వైద్యుడు శస్త్రచికిత్స చేసినంత లాఘవంగా లోపాల్ని సరిదిద్ది హిందూధర్మాన్ని తలయెత్తుకు నిలబడేలా చేశారు గానీ పెరియార్ లాంటివాళ్ళు మాత్రం సిగ్గుతో తలదించుకునేలా చేశారు!"తమిళనాడులోని మొత్తం జనాభాలో బ్రాహ్మణులు 2.75శాతం ఉన్నారు,క్రిస్టియన్లు 4శాతం ఉన్నారు,ముస్లిములు 5శాతం ఉన్నారు,మళయాళీలు 8శాతం ఉన్నారు,కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు సుమారుగా 5శాతం వరకూ ఉన్నారనుకుందాం - మనం గనక వీటినన్నిట్నీ కలిపినట్లయితే తమిళనాడు  రాష్ట్ర జనాభాలో తమిళులు కానివారు 25శాతం మాత్రమే వుండినారని తెలుస్తుంది,అయినప్పటికీ ఉద్యోగాలలో 75శాతం ఈ తమిళేతరులే ఉన్నత స్థానాలలో ఉన్నారు" అనే రకంగా మాట్లాడి తమిళులలో ప్రాంతీయాభిమానాన్ని పెంచి వారి గౌరవాన్ని అపారంగా పొందాడు.ఇవ్వాళ సమాచారాన్ని హక్కుగా చేశారు గానీ ఈ అమాయకపు జనాభా లెక్కల సమాచారం యెంతపని చేసిందో చూడండి?చాలా తెలివిగా పెరియార్ బ్రాహ్మణేతర, దళితేతర,మతేతర అగ్రవర్ణాలలోని ఆర్ధికంగా వెనకబడిన వారిని బుట్టలో వేయ్యడానికి మైనార్టీ బ్రాహ్మణులు మెజార్టీ మీద పెత్తనం చేస్తున్నారు అనేది చెప్పడానికి తొలిసారిగా హిందూ సనాతన ధర్మానికి బ్రాహ్మణ మతం అనే పేరు పెట్టాడు!తను యెవరిని ఆకర్షించాలనుకున్నాడో ఆ వర్గం తప్ప మిగిలిన వర్గాల లోని ప్రజల పట్ల అతనికి ఉన్న చిన్నచూపు చూస్తే ఇట్లాంటివాణ్ణీ సజ్జనుడు అని అనగలమా అని సందేహం వస్తుంది?అంబేత్కర్ "ప్రతి సమాజంలోనూ గ్రూపులు ఉంటాయి,కానీ ఆయా గ్రూపుల మధ్య సంబంధాలు అన్నిచోట్లా ఒక్కలా ఉండవు.ఒక అసమాజంలో కొన్ని చోత్ల విభేదించి కొన్ని చోట్ల సహకరించుకోవచ్చు.కానీ ఈ దేశంలో మాత్రం అవి శాశ్వత ద్వేషంతో ఉన్నాయి" అనే సూత్రీకరణ చేసి అప్పటిదాకా తమ మీద జరిగిన దుర్మార్గాల్ని అనుభవించిన వాడు గనక మెజారిటీ దురహంకారులకి అడ్డుకట్ట వెయ్యకపోతే అప్పటికి కింద వున్న కులాలు యెప్పటికీ పైకి రాలేవని మైనార్టీ డిక్లరేషన్ ద్వారా 54.68 శాతం ఉన్న హిందువులకి 40 శాతం,28.5 శాతం ఉన్న ముస్లిములకి 32 శాతం,1.16 శాతం ఉన్న క్రిస్టియన్లకి 3 శాతం వరకూ,1.49 శాతం ఉన్న శిఖ్ఖులకి 4 శాతం ప్రాతినిధ్యాన్ని ప్రతిపాదించినప్పుడు హిందువుల కన్నా బ్రాహ్మణుల కన్నా గట్టిగా వ్యతిరేకించాడు,"యే నిర్వచనం ప్రకారమయినా సరే జనాభా పరంగా గానీ మతపరంగా గానీ మైనార్టీగా వున్నవాళ్ళు అధికారాన్ని చేపట్టినట్లయితే అది ఆ సమాజానికి చడునే తీసుకొస్తుంది.యే రూపంలో నైనా సంఖ్యలో తక్కువగా వున్నవాళ్ళు సంఖ్యల్లో యెక్కువగా ఉన్నవాళ్ళ మీద పెత్తనం చెయ్యడాన్ని నేను యెట్టి పరిస్థితుల్లోనూ సహించను" అనే వాదనతో?అసలు విషయం,"సాయిబులు వాళ్ళ వాటా అంటూ కొంత తీసుకుపోతే దళితులు వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుపోతే ఓ శూద్రుడా!ఓ తమిళుడా,నీకేమి మిగులుతుందయ్యా?" అని పెద్దాయన భావం?పళ్ళెంలో ఉన్నదంతా తనకి నచ్చినవాడికే కావాలి,తనకి నచ్చని వాడు అడుక్కు తిన్నా నీలిగి చచ్చినా ఆయనకి జాలి పుట్టదన్న మాట!తను యేమి మాట్లాడినా జనం యెదురు చెప్పని స్థానంలో ఉన్న ధీమా వల్లనో యేమో కనీసం ఉదాశీనంగా నన్నా ఉండకుండా "ఉండటానికి ఈ దేశజనాభాలో కేవలం 6శాతమే ఉన్నా,కూలీనాలీ లాంటి కష్టపు పనులేమీ చెయ్యకపోయినా,అడుక్కుతినే స్థితిలో వున్నా కూడా మన చూపులు తగలకుండా వాళ్ళ ఆడవాళ్ళకి ముసుగులు కప్పేసుకున్నా ఈ దేశంలో గొప్పగానే బతికేస్తున్నారులే?!" అని వంకర మాటలు మాట్లాడినా అతను గౌరవనీయుడే అయ్యాడు గానీ ఇలాంటి మాటలేవీ మాట్లాడని సంస్కారులైన హిందువులు మాత్రం ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా రాముని బిడ్డలేనని సాదరంగా అన్నా జనాలకి విపరీతార్ధాలే తోస్తున్నాయి,యెందుకనో?

     హిందూమతంలో ఉన్న క్రూరత్వానికి గాయపడ్డామని చెప్తూ దానిమీద పోరాటానికే తమ జీవితాన్ని అంకితం చేశామని చెప్పుకునేవాళ్ళు తామే ఇతర్ల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నప్పుడు కనీసం ఆత్మ పరిశీలన కూడా చేసుకోకపోవడం యెంత విచిత్రం?ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రాంతంలో తను హందూమతం ద్వారా అణిచివేయబడ్డాననీ అందుకే నేను హిందువుగా వుండదల్చుకోలేదని చెప్పుకునే కంచె ఐలయ్య గారు ఉత్తర దేశంలో అదే విధమైన పరిస్థితులలో కూడా సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న లోహియానీ,గాంధీని బనియాల సంస్కృతి అంటూ అవహేళన చేస్తూ కాష్మీరీ బ్రాహ్మణుడైన నెహ్రూని మాత్రం అంబేద్కరుని అర్ధం చేసుకోవడానికి పనికొచ్చాడనే చెత్తాతి చెత్త వాదనతో నెత్తికెత్తుకుంటున్న సన్నివేశంలో తను ద్వేషించే బ్రాహ్మణత్వాన్ని ధిక్కరిస్తున్నట్టా అనుకరిస్తున్నట్టా అనేది స్పష్టంగా అర్ధమవుతూనే ఉన్నది గదా!అంబేద్కరుని అర్ధం చేసుకోవడానికి అంబేద్కరు పుస్తకాలు చదివితే చాలు గదా నెహ్రూని పొగడాల్సిన అవసరమేమిటి?

      మొట్టమొదట ఈ దేశంలో మత ప్రచారానికి వచ్చిన క్రైస్తవులు బ్రాహ్మణులతో స్నేహశీలంగా వుంటూ వారి సాయంతో యెదగడానికి ప్రయత్నించారనే చరిత్ర ఐలయ్య గారి బుర్రకి యెక్కదు కాబోలు!వాళ్ళు మొట్టమొదట వ్యతిరేకించిన జంతుబలుల లాంటి క్రూరమైన ఆచారాలు పప్పూ నెయ్యీ తినే శాకాహారులైన బ్రాహ్మణులవి కావనీ తమ వెనకటి తరం వాళ్ళవేననీ సామాజిక శాస్త్రవేత్త అయిన ఐలయ్య గారికి తెలియకుండానే ఇవ్వాళ క్రైస్తవంలో పునీతమవుతున్నారా?పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టుగా పోయి పోయి తమ పూర్వీకులని అనాగరికులని తిట్టిన వాళ్లలో చేరాడు పాపం ఇప్పటికీ తన తాతకి గుడి ఉందని మురుసుకునే ఒకటిన్నర హిందువు!ఒకప్పుడు గురజాడ లాంటి బ్రాహ్మణులే ఇంగ్లీషువాళ్ళని ఇంగ్లీషు భాషనీ పరిధికి మించి మెచ్చుకున్నారు,అప్పటికే సామాజికంగా పై స్థాయిలో ఉన్న వెసులుబాటుతో మొదట ఇంగ్లీషు నేర్చుకుని మొదట వాళ్ళ దగ్గిర ఉద్యోగాలు చేస్తూ పైకొచ్చి ఆధునికతని సంతరించుకున్నారు!ఇవ్వాళ కంచె ఐలయ్య గారి విపరీత వాదనలలో కూడా అప్పటి బ్రాహ్మణులు యేమి చేసి పైకొచ్చారో మనమూ అదే చేసి పైకొద్దామనే ఇమిటేషను తప్ప ఒరిజినాలిటీ లేదు?ఒకే ట్రిక్కు రెండు సార్లు పని చెయ్యదు - అప్పటికీ ఇప్పటికీ కాలం చాలా మారింది, ఇవ్వాళ దళితులు పైకి రావడానికి కొత్తగా ఆలోచించాల్సిందే?!

      అప్పటి పెరియార్ లాగే ఇప్పటి ఐలయ్య కూడా ముస్లిములని కించపరుస్తూనే ఉన్నాడు!ముస్లిములలో మేధావులు తక్కువగా వున్నారంటాడు,ఇస్లాముని సంస్కరించదగిన అనాగరిక మతంగానూ ముస్లిములని క్రైస్తవుల దగ్గిర పాఠాలు నేర్చుకోదగిన వారుగానూ అభివర్ణిస్తాడు - క్రైస్తవమే గొప్ప మతం అంటాడు!బ్రాహ్మణ దేవుళ్ళ కన్నా తనకులపు దేవుళ్ళు గొప్పవాళ్లని గర్వంగా చెప్పుకునే ఐలయ్య ఒకనాడు కొత్తగా ఇంగ్లీషు చదివి పాశ్చాత్య జాతీయవాదం నుంచి స్పూర్తి పొంది ముస్లిములకి వ్యతిరేకంగా విశాల హిందూ ఐక్యత గురించి కలలు గన్న అప్పటి అతివాదహిందూబ్రాహ్మణుల వలెనే మతవ్యాప్తి కోసం క్రైస్తవులు చూపించే ఉదారవాదపు ముఖాన్ని మాత్రమే చూసి బొక్కబోర్లా పడిపోయి తన కులవారసత్వాన్ని ప్రొటెస్టెంటు క్రైస్తవులకి తాకట్టు పెట్టేసుకున్నాడు?!క్రైస్తవులు ప్రపంచమంతటా వున్నారు గాబట్టి వాళ్ళలో కలిస్తే తొందరగా ప్రపంచమంతటా తెలుస్తామనీ ఇంగ్లీషు భాష ప్రపంచమంతటా వ్యాపించి వుంది గనక ఇంగ్లీషు వస్తే చాలు ప్రపంచంలో యెక్కడయినా నెగ్గుకు రావచ్చుననే తరహా మూఢనమ్మకాలతో తను ఆప్యాయంగా చూసుకోవాల్సిన వారసత్వాన్నే వొదులుకుంటూ యెంత పొరపాటు చేస్తున్నాడో యెప్పటికి తెలుసుకోగలుగుతాడో - పాపం!

     ఒకప్పుడు బ్రాహ్మణుల్ని క్రైస్తవీకరించి వ్యాపించుదామని ప్రయత్నించి ఆ యెత్తు బెడిసికొట్టడంతో రూటు మార్చి మొదట్లో జంతుబలులతో పూనకాలతో అనాగరికంగా వుంటున్నారని చిన్నచూపు చూసిన కింది కులాల వాళ్ళకి ఒకప్పుడు తాము స్నేహంగా ఉన్న  బ్రాహ్మణుల్ని శత్రువులుగా చూపించడం మొదలు పెట్టారనేది క్రైస్తవం ఈ దేశంలో యెట్లా యేదిగిందనేది చారిత్రక దృష్టితో పరిశీలించిన వారెవరికయినా చాలా తేలికగా బోధపడే వాస్తవం. ముస్లిముల విషయంలో కూడా ఐలయ్య అభిప్రాయాలు పూర్తిగా తప్పు.ముస్లిములు ప్రపంచ రాజకీయ రంగస్థలం మీద అధిపత్యం కోసం ఆమేరికా కనపడుతూనే ఆడుతున్న జగన్నాటకానికి బలవుతూ అపార్ధాలకి గురవుతున్నారు!నిజానికి మలాలాకి శాంతి బహుమతి నివ్వడం లాంటి చిన్న చిన్న ట్రిక్కులతో ప్రపంచమంతటి దృష్టిలో క్రైస్తవులు చప్పట్లు కొట్టించుకున్నారు గానీ ముస్లిముల మతవిశ్వాసాల మీద దాడి చేస్తూ చాపకిందనీరు లాగా అమెరికా యూరప్  దేశాలు నడుపుతున్న దివాళాకోరు రాజకీయ విధానాల వల్లనే ముస్లిములు విధిలేని పరిస్థితుల్లోనే ఉగ్రవాదానికి తెగబడుతున్నారని యెంతమంది తెలుసుకోగలుగుతున్నారు?జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో బౌధ్ధంపై కంచె ఐలయ్య రాసిన పుస్తకం గురించి వ్యాఖ్యానిస్తూ, "ఏ మతమైనా ఒకటే!ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే యే పధ్ధతి అనుసరిస్తే యేమిటి?మతాలన్నీ అసమానతలకి నిలయాలే." అని వ్యాఖ్యానించి అన్ని మతాలూ సమానత్వం పునాదులపై నిర్మించబడాలని సూచించిన ముస్లిం మేధావి జావేద్ అఖ్తర్ ఐలయ్య కన్నా వాస్తవికంగా ఆలోచించగలుగుతున్న గొప్ప ఆదర్శవంతుడైన భారతీయుడు!

       హిందువుల్ని దుర్మార్గులుగా చిత్రించాలనుకుని హిందూ మతంలోని చెడుకి బలయినట్టుగా తనకి తనే ముద్ర కొట్టుకుని అదే నోటితో బనియాలనీ ముస్లిముల్నీ చిన్నచూపు చూస్తున్నా ఇతని పట్ల యేమాత్రమూ వ్యతిరేకత రాకపోవడం ఇతడి అదృష్టమూ ఇలాంటి పనులేవీ చెయ్యక పోయినా హిందువులు మతోన్మాదులుగా కనబడటం హిందువుల దురదృష్టమూ కావచ్చునా?

   ఒకనాడు హిట్లర్ అవతరించడానికి కారణమైన ప్రొటెస్టెంటు క్రైస్తవానికి మళ్ళీ గాలికొట్టి వూపిరులూదుతున్నారు?తప్పనిసరై తమ ఆస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం దానిమీద పోరాడుతున్న ముస్లిముల్ని అపార్ధం చేసుకుంటున్నారు!హిందువులు ఈ మాయలో పడరాదు.ముస్లిముల్ని ద్వేషించ కూడదు.యేది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమైనదో అదే సుందరమూ అవుతుంది!


సత్యం శివం సుందరం

48 comments:

  1. I do not agree with several aspects but this is no doubt a very interesting analysis.

    ఒక్క చిన్న సూచన. మీరు ?! లాంటి punctuation marks కొంచెం ఎక్కువ వాడారేమో? దీని వల్ల అప్పుడప్పుడు చదవడానికి ఇబ్బంది కలిగింది.

    ReplyDelete
    Replies
    1. @jai
      వేటితో విభేదిస్తున్నారో చెప్పండి తెలుసుకుంటాను.పోష్టులు రాస్తున్నదే అందుకోసం గదా!

      Delete
  2. Hinduism: Religion or Way of Life?

    https://www.youtube.com/watch?v=VH3lhfJ-BC0

    ReplyDelete
  3. తమిళ నాడులో తెలుగు వారి సంఖ్య సుమారు 30% - 40% ఉంట్టుందని ఒకసారి పేపర్లో చదివాను. వీళ్లంతా తెలుగు రాజులు పాలిస్తున్నపుడువెళ్ళి అక్కడస్థిరపడిపోయారు. చెన్నై,కోయంబత్తురు లో వైశ్య,నాయుడు కులాల వారు ఎక్కువగా కనిపిస్తారు. కరుణానిధి ఇంట్లో తెలుగు మాట్లాడుతాడని చెప్పుకొంటారు.
    ఈరోడ్ లో ఒక దేవాలయానికి మైంటైనెన్స్ లో ఉత్తమ అవార్డ్ వచ్చేది. ఆ దేవాలయన్ని చక్కగా నిర్వహించేది మరేవరో కాదు పెరియారే. ఆయన వంశపార్యపర వారసత్వంగా తండ్రి తదనంతరము, దేవాలయనికి ధర్మకర్త గా వ్యవహరించేవాడు :) కరుణానిధి కుటుంబ సభ్యులు పరిస్థితి బాగా లేనపుడు శ్రీకాళహస్తి లో రాహుకేతు పూజలు చేయించారు.

    ReplyDelete
  4. సత్యం నమ్మకం కావచ్చు ...కాని మీరు నమ్మకాల్ని సత్యాలు గా రాసినట్టు అనిపించింది...
    for more info try to read "annihilitation of castes "by ambedkar చదవండి

    ReplyDelete
  5. http://postimg.org/image/becoynqij/

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. మీరిచ్చిన లింక్ చదివాను. ఆ రాసిన వారి ఉద్దేశం ఎమిటి? హిందువులు అనాగరికులు, వారికి చదువు, సంధ్యా లేదు, సైదాపురం మొద్దురాచిప్పలని, వాళ్ల కసలికి చరిత్రే లేదు ! ఇదే గదా వాళ్లు చెప్పాలనుకొనేది. అందులో ఒక్క నిర్దుష్టమైన ఆరోపణ ఎమీ లేదు. ఆ రాతలకు టిస్యు పేపర్ కున్న విలువ కూడలేదు. డస్ట్ బిన్ లో వేయాల్సిన పేపర్ ను, కొత్త విషయం కనుగొన్న పరిశోధానా పత్రంలా చదవమని అడిగితే చికాకు వేస్తుంది. అటువంటి వారు రాసిన దానిని చదివి మీరు ఆనందీంచాలనుకొంటే ఆనందించండి. లింక్ ఇచ్చి ఇతరులను చదవమని చెప్పటం చిన్నపిల్లల చేష్టలు.

      ప్రతి దేశస్థుడు వాడి చరిత్రను వాడు ప్రచారం చేసుకొంటాడు. హిందువుల చారిత్రక విజయాలను అంతర్జాతీయ వేదికలపై ప్రచారం చేసుకొంటాం, కొంట్టున్నాము. ఇప్పటి వరకు వాళ్ల విజయాలను,కంట్రిబ్యుషన్ ప్రచారాన్ని చాలెంజ్ చేసిన విదేశీయుడు ఎవడు లేడు. దీనర్థం ఎమిటి హిందువులు చెప్పేవి వాస్తవాలే అని.

      గణితంలో, సైన్స్ లో హిందువుల కంట్రిబ్యుషన్ ఎంతో ఉంది. గతాన్ని అలా ఎగతాళి చేస్తున్నారు కదా! వర్తమానంలో రామచంద్రన్ లాంటివారి విజయాల గురించి ఎమంటారు?. న్యురో సైన్స్ దశ దిశా మార్చేశాడు రామచంద్రన్. ఆయన కంట్రిబ్యుషన్ ఎంతో ఉండబట్టే రిచర్డ్ డాకిన్స్ మార్కో పోలొ తో పోల్చాడు. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఇవ్వవచ్చు.

      VS Ramachandran: The Marco Polo of neuroscience
      http://www.theguardian.com/theobserver/2011/jan/30/observer-profile-vs-ramachandran

      Aesthetic Universals and the Neurology of Hindu Art - Vilayanur S. Ramachandran
      https://www.youtube.com/watch?v=7ZTvHqM-_jE

      Delete
    3. భారతీయులకు దక్కాల్సిన పేరుప్రఖ్యాతులను దక్కనివ్వకుండా గట్టిగా అడ్డుపడేవారు ఉన్నారు. ఉదాహరణకు మొన్నామధ్య, ఈ మైల్ సిస్టం ను కనుకొన్న శివ అయ్యాదురై విజయాన్ని గుర్తించకుండా వివాదాలు సృష్టిస్తు అడ్డుపడితే , అతను ప్రజల మద్దతు కోరాడు. నోం చాంస్కి వంటి మేధావులు కూడా అండగా నిలచారు.

      http://www.inventorofemail.com/

      Email ‘inventor’ Shiva Ayyadurai seeks public support against his detractors, avoids legal action for now
      http://articles.economictimes.indiatimes.com/2014-09-05/news/53602124_1_shiva-ayyadurai-inventor-inter-office-mail-system

      https://www.youtube.com/watch?v=nPvbwBjzFTQ

      Delete
    4. అది టిష్యూ పేపర్ అయితే మీరు ఇంతగా స్పందించాల్సిన అవసరం లేదు..
      ఎందుకంటే అందులో కొంత మేటర్ ఉంది
      నేను కూడా భారతీయున్నే...
      భారతీయున్ని అయినందుకు నేను గర్విస్తాను
      కాని మూడ నమ్మకాలతో కుల్లుబట్టిన వ్యవస్థను మనం అర్ధం చేసుకొని సరిదిద్దుకోక పోతే దాని ఫలం మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే
      రోగం ఉన్నగాని , లేదనుకునే వాడిని ఎం చెయ్యలేము

      Delete
    5. మీరిచ్చిన సమాచారం హిందువులను ఎగతాళి చేయటం తప్పించి, ఆ వాదన వల్ల ఈ దేశానికి ఎమైనా ఉపయోగం ఉందా? ఇటువంటి విమర్శకులను ఎవరు పట్టించుకోరు. అందులో మేటర్ ఎమీ లేదు. నేను ప్రతిస్పందించటానికి కారణం, ఎమీ తెలియని వారు (చిన్న పిల్లలు చేసే) ఆరోపణల వలే ఉంది అది. అది చదవటం ఇక్కడ ఇవ్వవలసిన లింక్ కాదది అనిపించింది.

      పైన నేను చెప్పిన రామచంద్రన్ అమెరికా, లండన్ ల లో ఆ సెమినార్ ఇచ్చాడు. ఒకప్పుడు హిందూ చిత్రకళ, విగ్రహాల ను ఎగతాళి చేసిన తెల్లవారి ముందు నిలుచుని, ఆ రోజుల్లో మీకేమి తెలియకపోయినా, తెలిసిన వారిలా మమ్మల్ని మా కళలను ఎగతాళి చేశారు. వాస్తవానికి వెనుకుబడింది మీరే అని వారి మొహాన, వారి ఊళ్లోనే చెప్పాడు. ఒక్కడు నోరెత్తలేదు. రామచంద్రన్ ను వారు చాలెంజ్ చేసి ఉంటే వారికి పూర్తి స్థాయి లో వాస్థవాలను విప్పిచెప్పే సామర్థ్యంగల వాడు. అందుకని అందరు గప్ప్ చుప్ గా ఉండి, వారి అజ్ణానికీ వాళ్లు నవ్వుకొన్నారు.

      వందల ఏళ్లుగా హిందువులను అణచివేసినా, మధ్యతరగతి హిందువులు ఎన్నో కష్ట నష్టాలకోర్చి విదేశాలకు వెళ్లి చదువుకొని గొప్ప శాస్రవేత్తలైనారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తేచ్చారు. బ్రిటీషోడు పాలించిన మిగతా దేశాల నుంచి (ఆఫ్రికా, గల్ఫ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్) ఎంతమంది శాస్రవేత్తలు పుట్టి ఉన్నత స్థానలకు చేరి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వారున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? వారికి రావలసిన క్రెడిట్ రాకుండా( శివ అయ్యాదురై విషయం చూశారు కదా!), మీకేమి తెలియదు మాథ్స్,సైన్స్ లలో వెనుకబడినవారు. అంతా మాకే తెలుసు అని అడ్డుపడితే హిందువులు వాళ్ల గత విజయాల డబ్బా వారు కొట్టుకొంటారు. అంతేకాదు ప్రధాని మోడి చేత కూడా డబ్బా కొట్టిస్తున్నారు. ప్రధాని నోటి గుండా వస్తే ప్రపంచ వ్యాప్తంగా పబ్లిసిటి మరింత ఎక్కువగా వస్తుంది. అది చూసి కొంతమంది అవసరానికి మించి ఎక్కువగా స్పందిస్తున్నారు.

      Delete
    6. మూడనమ్మకాలను చెప్తే హిందువులను ఎగతాళి చేయటం అని చర్చ ను పక్కదారికి పట్టిస్తున్నారు...
      హిందువులను ఎవ్వరు అనిచివేయ్యరు...
      మనల్ని మనమే అనిచివేసుకుంటున్నాము
      మీకు మీ నమ్మకాలే ముఖ్యం మీరు ఆ నమ్మకం నుండి బయటకి వచ్చి చూడండి
      వివేకానంద గారే సముద్రాన్ని దాటకూడదన్న నమ్మకాన్ని వదిలేసి వచ్చాడు
      (ఆఫ్రికా, గల్ఫ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్)ల లోనే పుట్టాలా గొప్పోల్లు ?
      మిగతా ప్రపంచం లేదా ?చైనా జపాన్ ,రష్యా etc
      ఒకటే జవాబు చెప్పండి:మన మూడ నమ్మకాలు నిజం కావా?
      జవాబు మాత్రం పాకిస్తాన్ లోని మూడ నమ్మకాల గురించి మాత్రం చెప్పకండి
      ఎందుకంటే అది మనకనవసరం ..
      మన ఇల్లు మనం చక్క దిద్దుకుందాం ...తర్వాత పక్కోడి ఇల్లు

      Delete
    7. అబ్బే భారతీయులు సముద్రంలో కాలే పెట్టలేదు. సముద్రానికి రోజు పువ్వులు, టెంకాయలు తీసుకేళ్లి పూజచేశారు. ఎమిటండి మీ వాదన? సముద్రాన్ని దాటకుండానే భారతీయులు వాంకోవర్ లో దేవాలయాన్ని కట్టారా? భారతీయులకి ఫిజి,మారిషస్,ఆఫ్రికా, యురోప్ ఖండాలతో ఎప్పటి నుంచొ సంబంధాలు ఉన్నాయి. సముద్రం దాటకుండా అక్కడి ఎలా వెళ్లగలిగారు? యురప్ నుంచి వచ్చిన వాస్కోడా గామా కన్నా పెద్ద ఓడ భారతీయులదగ్గర ఉండేది. వివేకానందుడు సన్యాసులకు ఉన్న నిబంధనలను చదివి అందరు సముద్రం దాట కుండానే మనదేశంలో ఉండిపోయారనుకొంటే ఎలా?
      ఎవరో రాసిన పుస్తకాలను చదివి మీరు ప్రశ్నలు వేస్తూ కూచొంటే జవాబులిస్తూండటం అయ్యేపని కాదు. ఇతరులను ప్రశ్నించే ముందర కొంత అన్నా ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకొని ఉండాలి. స్కుల్ బాయ్ లాజిక్ ప్రశ్నలు వేస్తే జవాబివ్వటం కుదిరేపనికాదు.


      మూఢ నమ్మకాలో అని వర్రీ అయిపోతున్నారు కదా! టివి లో గత ముప్పై ఏళ్లుగా ఫైర్ అండ్ లవ్లీ పూసుకొంటే మూడు నెలలలో తెల్లపడిపోతాం అని గంటగంటకి ప్రచారంచేస్తున్నారు. వేల కోట్లను సంపాదిస్తున్నారు. క్రీములు పూసుకొంటే మనుషులు తెల్లబడే పనైతే ఈపాటికి భారత దేశం అంతా తెల్లగా మారి ఉండాలి కదా! మరి ఫైర్ అండ్ లవ్లీ మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నాదని, ఆ కంపెని పై ఎంత మంది తగవుకు వెళ్ళారు?

      Delete
    8. నమ్మకాల్ని వదిలేయ్యఋ మీరు ?
      స్కూల్ బాయ్ ప్రశ్న లేక్ జవాబు లేదు మీ దగ్గర?
      సబ్జెక్టు ఎవరికీ పూర్తిగా తెలియదు ...అందుకే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం
      మీకు పూర్తిగా తెలుసనీ అర్దమయ్యింది
      ఎవరు రాసిన బుక్స్ చదివాను అంటున్నారు ...మరి మీది మీ సొంత తెలివా?
      అలాంటప్పుడు ఎవరెవరివో వీడియో లింక్ లు ఎందుకు మాష్టారు ?
      నీ ఇల్లు చక్క దిద్దుకో బాబు అంటే మల్లి పక్కోడి మీదకు వెళ్తారు ఫెయిర్ అండ్ లవ్లీ అని
      మీ ఉద్దేశ్యం వాదనే అయితే వాదన వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు
      దురదృష్ట వశాత్తూ ఈ బ్లాగ్ లోకం లో కూడా మను వ్యవస్థ నే ఆధిపత్యం చెలాయిస్తుంది
      మీకొక నమస్కారం
      శుభం భూయాత్!

      Delete
    9. This comment has been removed by the author.

      Delete
    10. మహాత్ములెందరు సహాయపడినా మంచి జరగలేదు. జాతి వైద్యులే కోత కోసినా నీతి బ్రతకలేదు అని ఒక పాట ఉంది. మనిషికి చచ్చే వరకు ఎదో ఒకనమ్మకం ఉంట్టునే ఉంట్టుంది. అది కొంతమందికి మూఢనమ్మకంగా అనిపించవచ్చు. నమ్మకాలు,మూఢ నమ్మకాలు లేని ప్రపంచం నేను చూడలేదు. అవి ఎలా పోతాయో నాకు తెలియదు. అవి పోతే అసలికి ప్రపంచమే పోతుందేమో! ఇక నేను హిందువుల గురించి వాదించటానికి మతపరమైన కారణం కన్నా భారతీయుల కు చెడ్డపేరు అనవసరంగా రాకుడదనే ఉద్దేశం. ఆత్మ విమర్శ మరీ ఎక్కువైతే ఏ పని చేయలేము,కాంఫిడేన్స్ దెబ్బ తింట్టుంది. ఈ రోజుల్లో లక్షల మంది విదేశాలకు పోతున్నారు. అక్కడ పని చేస్తున్నారు. మనల్ని మనమే తక్కువ అంచానవేసుకొంటే ఎవ్వరు లెక్క చేయరు. మనకేమి తెలివితేటలు లేకపోతే వారు ఉద్యోగాలెందుకు ఇస్తారు? మనలో టాలేంట్ ఉండబట్టే కదా వారు ఉద్యోగాలు ఇవ్వటం.

      హిందువులు వారి ఇళ్లను వారు బాగా చక్కదిద్దుకొంట్టున్నారు. ఏ అన్యమతం వారితో పోల్చినా మెరుగ్గా ఉన్నారు. ఇతరుల తో పోలికవద్దనుకొంటే అసలికి మూఢనమ్మకాలన్న పదమే ఉండదు గదా! అప్పుడు అది ఒట్టి నమ్మకం అంతే. సామాజికంగా వెనుకబడిన వర్గాల వారైన దళితులు,మహిళలు అభివృద్ది పథంలో నడుస్తున్నట్లు ఈ వార్తలు చదివితే అర్థమౌతుంది. నాకు తెలిసింది చెప్పాను. మీకు అర్థమైనంతే సరే, లేకపోతే నన్ను వదిలేయండి. మీకొక నమస్కారం.

      Pandharpur temple allows women, men of all castes as priests
      http://www.thehindu.com/news/national/other-states/pandharpur-temple-allows-women-men-of-all-castes-as-priests/article6038635.ece

      Big Jump in Dalit Girls Entering TN Engineering Colleges

      http://www.newindianexpress.com/states/tamil_nadu/Big-Jump-in-Dalit-Girls-Entering-TN-Engineering-Colleges/2014/08/11/article2373666.ece?

      Delete
    11. This comment has been removed by the author.

      Delete
    12. "నమ్మకాలు,మూఢ నమ్మకాలు లేని ప్రపంచం నేను చూడలేదు. అవి ఎలా పోతాయో నాకు తెలియదు. అవి పోతే అసలికి ప్రపంచమే పోతుందేమో! "
      మూడనమ్మకాల లోకం సోక్రటీస్ ను చంపేసాయి..
      కాని ఇప్పుడు ఏమైంది ఆ మూడ నమ్మకం పోయింది ప్రపంచం పోలేదు కదా !
      మీరు మూడ నమ్మకాలను నమ్ముతారు అని తెలియక
      మీతో ఇప్పటి వరకు చర్చిన్చినందులకు క్షమించగలరు
      ఇప్పటికైనా ఒప్పుకున్నారు


      కళ్ళున్న కళ్ళు మూసుకున్న ద్రుతరాష్ట్రులు ఇంకా ఉన్నారు
      కాన్ఫిడెన్సు కావాలి ఓవర్ కాన్ఫిడెన్సు కాదు
      ది హిందూ లో PANDHARPUR, May 23, 2014 నాడు వచ్చిన ఆర్టికల్ ఇచ్చారు కదా మీకొక అనుమానం రాలేదా ?
      indepenance వచ్చి 60 yrs పైన అయినా కూడా 2014 వరకు ఆ సంఘటన ఎనుకు జరగలేదో అలోచిన్చాలేకపోయారా సార్?
      ఇంకా కూడా వివక్ష జరుగుతుంది
      ఒక్క సారి గూగుల్ చెయ్యండి "caste oppression ఇన్ ఇండియా " లక్షల ఆర్టికల్స్ వస్తాయి
      మనకు తెలివి తేటలు లేవు అని ఎవరన్నారు ?

      Delete
  6. మూడనమ్మకాల లోకం సోక్రటీస్ ను చంపేసాయి.

    నాకేమో ఇతరులతో పోల్చుకోకు, పాకిస్థాన్ లో అలా ఉంది అని చెప్పకు అని, మీరు సోక్రటీస్ ను మూఢనమ్మకాలు చంపాయి అని ప్రస్థావించటం ఎమిటి? సోక్రటీస్ ఇండియావాడా? సైన్స్ గురించి మాట్లాడినవారిని ఇండియాలో ఎవరు చంపలేదు.
    ఇక్కడ రాసింది చదివి నా వ్యక్తిత్వం పై అంచనాకు రాకండి. మీరేదో ఊహించుకొంటే, అది మీకే ఇబ్బంది. నా గురించి ఎమి తెలుసని నన్ను మూఢ నమ్మకాలను నమ్ముతావని అనుకొంటారు.
    మీ ప్రశ్నలకి జవాబులివ్వటం నా వలన అయ్యేపని కాదు. హరిబాబు గారంత నాలేడ్జ్ లేదు. నాకిప్పుడు అంత ఆసక్తి లేదు.

    ReplyDelete
  7. సోక్రటేస్ గురించి చెప్పింది నిజం..నమ్మకం కాదు
    సరే ఇండియన్ రాజారాం మోహన్ రాయ్ ఎదుర్కొన్న విషయాలు చెప్పమంటారా?
    ఇండియా ఒక గొప్ప దేశం ఇక్కడ ఎన్నో రకాల వివిద నేల స్వరూపాలు ఉంటాయి
    ఏ దేశం పైన ఎలాంటి వనరులకోసం ఆధారపడని దేశం మనది
    ఇక్కడి ప్రజల జీవన సంస్కృతి భిన్నం అయినా ఏకత్వం ఉంటుంది
    ఇక్కడే బుద్దుడు జన్మించాడు
    0 కనుక్కున్నఆర్యభట్ట ఇక్కడే పుట్టాడు
    ప్రపంచ మేధావి అంబేద్కర్ కూడా ఇక్కడే పుట్టాడు
    చాల మంది గొప్పవాళ్ళు పుట్టారు ఇక్కడ

    ఇక్కడే గొప్పదైన సిందు నాగరికత వెలువడింది

    ఆ తర్వాతే ఇక్కడ అసలు కథ మొదలైంది
    ఆ అమానుషమైన కథ ను ఇప్పుడు చెరిపి వెయ్యలనేదే సంకల్పం
    కాని ఆ కథనే కంటిన్యూ చెయ్యకూదదనేది నా భావన
    అంతే గాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు
    నమ్మకాలను వదిలి సత్యాన్ని మాత్రమే తెల్సు కొనే ప్రయత్నం మాత్రమే చేసాను
    కేవలం ఇక్కడి అసమానత్వం మన జీవన విధానం లో మన శరీరం లో ఒక పార్ట్ లా చేరింది

    ReplyDelete
    Replies
    1. @srinu the boss
      మీరు నమ్మకాల మీద ఆధారపడి సత్యాన్ని వొదిలేశానేమో నన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు, అనుమానాలు వ్యక్తం చెయ్యటం తప్పు కాదు.కానీ నా బాధ్యతగా మరోసారి నా పోష్టును నేనే యెంత జాగ్రత్తగ చదివినా నమ్మకాల మీద ఆధారపడి నేనెక్కడా రాసినట్టు నాకు కనపడలేదు.సిధ్ధాంత గ్రంధాల మాదిరి పోస్టులో రెఫెరెన్సు లింకులు ఇవ్వడం బాగుండదని ఇవ్వలేదు గానీ ప్రతి విషయానికీ పరిశోధన జరిగింది.

      మొదట వసుధైక కుటుంబం అనే కాల్పనిక భావనతో మొదలు పెట్టాను.యే ప్రాంతాని కాప్రాంతం ఎందుకు ఆచార వ్యవహారాల్లో విబిన్నతలు ఉంటాయో చెప్పాను.ప్రతి సమాజానికీ సాంప్రదాయం యెందుకు అవసరమో చెప్పాను,ఇవన్నీ కేవలం హిందువులలోనూ భారతీయులలోనూ మాత్రమే ఉన్నవి కావు,అన్ని సమాజాల్లోనూ ఈ అంశాలు కనబడుతూనే ఉన్నాయి కదా!

      ఆదాన ప్రదానాలకీ మనవాళ్ళ మహానౌకల గురించీ "periplus of the erytriyan sea" అనే చాలా పాతకాలం నాటి విదేశీ నావికా గ్రంధంలో సాక్ష్యాలు ఉన్నాయి!ఇక్కడి చాతుర్వర్ణం లాంటి భావాన్నే చెప్తున్న హేతువు ధీరత్వం ఇచ్చా అనేవి నా కల్పన కాదు గదా!

      అన్ని మతాల్లోనూ సృష్టి జరిగిన పధ్ధతి గురించీ తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించీ వీలయినంత వరకూ హేతుబధ్ధంగానే ఉండలని ప్రయత్నించడం ఆయా మతగ్రంధాలని పైపైన చదివినా తెలుస్తుంది గదా!

      ఇక ముస్లిముల దండయాత్ర వల్ల భారతదేశపు చరిత్రకి జరిహిన అపకారాని విదేశీ చరిత్ర కారూలే ఒప్పుకున్నారు!"…the Islamic conquest of India is probably the bloodiest story of history. It is a discouraging tale,for its evident moral is that civilization is precious good,whose delicate complex order and frredam can at any moment be overthrown by barbarians invading from without and multiplying from within." ఈ అబిప్రాయం భారతీయ చరిత్ర కారుడిది కాదు,విల్ డ్యురాంట్ అనే బారతదేశపు చరిత్రని తులనాత్మకంగా అధ్యయనం చెసిన వ్యక్తి యొక్క పరిశీలన అది!

      ఒపెన్ హెమర్ కేవలం ఒక రెండు మూడు కొటేషన్లు ముక్కున బట్టి అప్పజేప్పిన సాదాసీదా అబిమాని కాదు.యెప్పుడూ చేతికందుబాటులో ఉండేలా గీతని తన రీడింగ్ తేబుల్ దగ్గిర పెట్టుకుని చదివి అభిమానించాదు.

      మీరు చెప్తున్న రాజా రామ మోహన రాయ్ నుంచి జ్యొతిబ అపులే వరకూ ఇన్సైడర్లుగానే ఉన్నారు.పేర్లు ప్రస్తావించకుండా సంస్కర్త్ల కృషి గురించి చెప్పిన భాగం చాలామంది గొప్పవాళ్ళకే వర్తిస్తుంది కదా!

      క్రిస్టియానిటీ భారతదేశంలో కాదు యెక్కడ యెదిగినా అది చారిత్రకంగా రికార్డ్ అయి వుంది.డాన్ బ్రవున్ పుస్తకాలు చర్చి కూడా అబధ్ధం అనలేక నొర్రుమూస్కుని అతన్ని వాటికన్ నగరాన్నంత అతిప్పి చూపించి పరువు దక్కించుకున్నంత నిర్దుష్తంగా విప్పిచెప్పాయి.అవే మాటలు క్రైస్తవేతరుడు చెప్తే యెట్లా ఉండేదో మరి?

      ఇక్కడ చెప్పని విషయమొకటి ఈ మధ్యనే ఆరుల ఉత్తర ధృవ నివాసం గురించి చదువుతుంటే తెలిసింది.మొదట ఇక్క డ ఇంత గొప్ప నాగరికత పుట్టింది అని ఒప్పుకోలేక కావాలనే చేశారో యేమో గానీ ఆర్యులు అనే వాళ్ళు ఉత్తర ఢృవం నుచి వచ్చి యుధ్ధాల ద్వారా అప్పుడు ఇక్కడ ఉన్న అనాగరీక్ జాతిని గెల్చి కొత్తరకం నాగరికతని సృష్టించారనే వాదన తొలినాళ్ళలే చాలా కాలం పాటు నడిచింది.తర్వాత తర్వాత నిజాలు తెల్సి ఆ వాదన వీగిపోయింది.ప్రపంచం నలుమూలలా జరుగుతున్న పరిశోధనల వల్ల ఇప్పుడు తెలుస్తున్న కొత్త విషయాలు పూర్తి విరుధ్ధమైఅన సత్యాన్ని బయటికి తీసుకొస్తున్నాయి.ప్రాచీన కాలపు మానవ సమూఒహాలు కదలటం అనేది ఇక్కడి నుంచే మిగతా ప్రాంతాల వైపుకి జరిగిందేమో అనే అనుమానం అందరిలోనూ కలుగుతున్నది, గట్టి ఆధారాలు లేకపోయినా కేవలం భారతీయులే కాదు సత్యం మీద ఆధారపడి చరిత్ర పరిశోధనలు చేస్తున్న విదేశీయులు కూడా ఆ అవకాశాన్ని కొట్టెయ్యలేకపోతున్నారు.

      ఇట్లాంటి పరిస్థితుల్లో మనల్ని మనమే చిన్నబుచ్చుకోవటం అంటే.....?

      Delete
    2. @Hari baabu,

      ప్రాచీన కాలపు మానవ సమూఒహాలు కదలటం అనేది ఇక్కడి నుంచే మిగతా ప్రాంతాల వైపుకి జరిగిందేమో అనే అనుమానం అందరిలోనూ కలుగుతున్నది..సత్యం మీద ఆధారపడి చరిత్ర పరిశోధనలు చేస్తున్న విదేశీయులు కూడా ఆ అవకాశాన్ని కొట్టెయ్యలేకపోతున్నారు.

      Experiences with Maha Periyava: The Oldest Language in the World

      Read Vamsi Emani

      http://www.quora.com/Is-Sanskrit-the-mother-of-all-European-languages-Why

      Thomas McEvilley on Ancient Greek and Indian philosophy
      https://www.youtube.com/watch?v=OXBygl-ox5Q

      Thomas McEvilley on 'The Shape of Ancient Thought'
      He researched 37 years.

      https://www.youtube.com/watch?v=8HAiTfOSP_w
      Vishnu idol found during excavation in Russian town

      http://timesofindia.indiatimes.com/world/rest-of-world/Ancient-Vishnu-idol-found-in-Russian-town/articleshow/1046928.cms
      ____________________

      God's Bankers: A History of Money and Power at the Vatican
      http://www.amazon.in/Gods-Bankers-History-Money-Vatican/dp/1416576576

      Conversations w/Great Minds P1- Gerald Posner, God's Bankers - Blood Money?

      https://www.youtube.com/watch?v=qbQWJNqrrE0

      Delete
  8. ఆమధ్యన ఎక్కడో మీరు ఆర్యుల ఉత్తరధ్రువ నివాసం గురించి అడిగినట్టున్నారు... ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చూస్తున్నాను... మీకు దొరికి ఉంటే సరే... లేకపోతే... కోట వెంకటాచలం గారు తిలక్ ప్రతిపాదించిన ఆ సిద్ధాంతాన్ని ఖండిస్తూ 'ఆర్యుల ఉత్తర ధ్రువ నివాస ఖండనము' (పేరు కొద్దిగా తప్పయి ఉండవచ్చు) అంటూ 1950ల్లోనే రాసి ఇంగ్లీషు, తెలుగు ఉభయ భాషల్లో ప్రచురించారు. అదే కాదు... భారత చరిత్ర వక్రీకరణ గురించి పెద్ద సీరీసే రాసారు. వీలయితే అవి సంపాదించి చూడండి.. తెలుగువాడు కదా... రావలసినంత పేరు ప్రఖ్యాతుల్లో వెయ్యోవంతయినా రాని మహానుభావుడాయన.

    ReplyDelete
    Replies
    1. పురాణపండవారూ,

      'ఆర్యుల ఉత్తర ధ్రువ నివాస ఖండనము' సరైన పేరే అనుకుంటాను. నేనూ ఇప్పటిదాకా ఇదే పేరుతో విన్నాను. కాని చదవటాని ఆ పుస్తకం నాకు లభ్యం కాలేదు.

      తెలుగువాడు కదా... రావలసినంత పేరు ప్రఖ్యాతుల్లో వెయ్యోవంతయినా రాని మహానుభావుడాయన అన్న మాట అక్షరసత్యం

      Delete
    2. మాస్టారూ...
      ఆ పుస్తకం ఒకట్రెండేళ్ళు నా దగ్గర ఉండేది... తర్వాత ఎన్నో పుస్తకాల్లాగే దానికీ కాళ్ళొచ్చేసాయి. అప్పుడు దాచుకోలేకపోయాను. అప్పటికి ఇంటర్నెట్టులూ, యూనికోడులూ పుస్తకాల అప్‌లోడుల గురించి నాకు కనీస అవగాహన కూడా లేదు. ఉండుంటే అప్పుడే అంతర్జాలంలోకి ఎక్కించి ఉండేవాణ్ణి. ఇప్పుడు ఎంత వగచి ఏం లాభం... హ్మ్‌.

      Delete
  9. ఒక విన్నపము :సూటిగా సమాధానములు చెప్పగలరు..ఈ ప్రశ్న లు కేవలము నేను సత్యం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగ పడాలి అనుకుంటున్నాను
    బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రులనే విధంగా విభజన --- హేతువు, ధీరత్వము, ఇఛ్ఛ తో ఎలా పోల్చవచ్చో తెలుపగలరు...?ప్రశ్న ను సూటిగా అర్ధం చేసుకోండి
    మీ నమ్మకం పై వర్గ విభజన రాజ్య సుపరిపాలనుకు....అయితే నిజం మాత్రం కొన్ని వర్గాలు ఆధిపత్యం కోసం చేసిన కుట్ర ...
    రాజ్య సుపరిపాలనకు వర్గ విభజన తప్పనిసరి అని మీరెలా చెప్పగలుగుతున్నారు?నమ్మకం తో కాక మరేమిటి?
    ఆర్యుల ప్రస్తావన గురించి
    కొందరు ఆర్యులు వచ్చారని
    కొందరు రాలేదని బోలెడన్ని పుస్తకాలు ఆర్టికల్స్ ఎవరి వాదన వారిదే
    కాని నా చిన్న అనుమానం
    లంకేయులు ..తమిళులు ఇంకా రావణాసురుని తమ రాజు గా అనుకుంటున్న సజీవ సాక్ష్యాలు ...
    అంటే ఆర్యుడైన రాముడు ఉత్తర భారత దేశం నుండి వచ్చినట్టేగా
    ఇది కేవలం అనుమానం మాత్రమే
    మరొక ప్రశ్న :దాదాపు 700 సంవత్సరాలు పాలించిన ముస్లిం ల పైన మనం ఎందుకు స్వాతంత్ర్యo కోసం పోరాటం చేయ సంకల్పించక కేవలం బ్రిటిష్ వారి పైన మాత్రమే ప్రకటించాముఅందులో ఈస్ట్ ఇండియా 1857 వరకు పాలన తీసివేస్తే కేవలం 50yrs కే

    ReplyDelete
    Replies
    1. @srinu the boss
      హేతువు ,ధీరత్వము,ఇచ్చ గురించి నేను చదివిన మొత్తం విషయం నుంచి ఒక చిన్న కొటేషను మాత్రమే ఇచ్చాను."హేతువు" అనే అంశాన్ని వ్యక్తీకరిస్తూ కొందరు,"ధీరత్వము" అనే దాన్ని వ్యక్తీకరిస్తూ కొందరు,"ఇచ్చ" అనే అంశాన్ని వ్యక్తీకరిస్తూ కొందరూ సమాజంలో ఉండాలని చెప్పిన పండితుడి వ్యాఖ్యాన సహిత వివరణ చాలా యెక్కువగానే ఉంటుంది.అదంతా యెక్కించాలంటే కష్టం.మీరు నా పోష్టులో ఉన్నదే సమస్తం అనుకోకుండా ఆ ప్లేటో,అరిస్టాటిల్,మాకియవిల్లీ యేమి చెప్పారో సొంతంగా కూడా చదివి తెలుసుకోవచ్చు.

      అక్కడి హేతువును వ్యక్తీకరించే వ్యక్తుల స్థానంలో ఇక్కడ బ్రాహ్మణులు,అక్కడి ధీరత్వమును వ్యక్తీకరించే వ్యక్తుల స్థానంలో ఇక్కడ క్షత్రియులు,అక్కడి ఇచ్చను వ్యక్తీకరించే వారి స్థానంలో ఇక్కడ వైశ్య శూద్రులు వస్తారని తెలుస్తుంది.నేను కొత్త పోష్టు కోసం పరిశోధిస్తుంటే శాతవాహనుల కాలం లోనూ సమాజం నాలుగు అంతరువులుగా విభజించబడి ఉందని తెలుస్తున్నది.పరిపాలనలో సులువు కోసం ఇవ్వాళా ఐ.యే.యస్ లాంటి యేర్పాట్లు ఉన్నాయిగా?

      ఆ 700 యేళ్ళూ ప్రశాంతంగా చేతులు ముడుచుకుని కూర్చున్నారని మీకు రూఢిగా తెలుసా?
      ముస్లిము పరిపాలకులు దాడులు చేసినా ఆలయాలు కూలగొట్టినా కింది స్థాయిలోని స్వయంపూర్ణ గ్రామ వ్యవస్త్ఝని బద్దలు కొట్తలేకపోయారనీ ఇంగ్లీషు వాళ్ళు దాన్ని బద్దలు కొట్టడం వల్లనే మొట్టమొదటి సారి సాఅన్యులకి కూడా సెగ బాగా తగిలిందనీ నా గత పోష్టుల్లో చెప్పే ఉన్నాను గదా!

      ఈస్ట్ ఇండియా పాలన తీసెయ్యాలా?యేం,యేందుకు!మీకు నచ్చినట్టు తీసెవేతలూ కూడికలు చెయ్యటానికా చరిత్ర ఉన్నదీ తెలుసుకోవాల్సిందీ?!

      Delete
    2. హేతువు ,ధీరత్వము,ఇచ్చ...పరిపాలన సౌలభ్యం కోసం చెప్పినా అవి ఇక్కడి వర్ణ వ్యవస్థను ప్రతిబింబించవు...
      ఇక్కడి వర్ణ వ్యవస్థ ఒక భయంకర ఛట్రం...annihilitation of castes
      చదవదానికి ప్రయత్నించండి
      700 yrs ప్రశాంతంగా ఉన్నారా? అంటే మనకు "బాబర్ నామా" లో
      జవాబు దొరుకుతుంది
      అది1)"ఇక్కడి సంప్రదాయ వ్యవహారాల్లో(ex:వర్ణ వ్యవస్థ ,సతి)వేలు పెట్టనంత కాలం మనం పాలిన్చుకోవచ్చు "
      ...
      2)1857 లో సిపాయిల తిరుగుబాటు నాయకుడిని డిల్లి సుల్తాను గా పెట్టుకోవడం
      అంటే మనం డిల్లి సుల్తాను ను ఒప్పుకున్నట్టే కదా?
      3)అప్పుడు మన చరిత్రలో దేశ స్వాతంత్ర్య పోరాటాలు చరిత్రలో మనకు కనపడక పోవడం
      ...
      ఈస్ట్ ఇండియా పాలన కూడా మన సంప్రదాయాల జోలికి పోలేదు
      అది డైరెక్ట్ బ్రిటిష్ పాలన కాదు ఒక కంపనీ పాలన అందుకే అప్పుడు కూడా స్వాతంత్ర్య పోరాటం చేయలేదు
      కాని మనకు మన సంప్రదాయ మూడ నమ్మకాల మీద దెబ్బతీసే చట్టాలు బ్రిటిష్ పాలన లో నే after 1857 వచ్చాయి..
      అప్పుడు బ్రాహ్మణ అస్తిత్వానికి ప్రమాదం మొదలయ్యింది...
      అందుకే after ఈస్ట్ ఇండియా తర్వాతే మనకు స్వాతంత్ర్య కాంక్ష మొదలయ్యింది

      Delete
    3. @srinu the boss
      హిందువుల్ని దుర్మార్గులుగా చిత్రించాలనుకుని హిందూ మతంలోని చెడుకి బలయినట్టుగా తనకి తనే ముద్ర కొట్టుకుని అదే నోటితో బనియాలనీ ముస్లిముల్నీ చిన్నచూపు చూస్తున్నా ఇతని పట్ల యేమాత్రమూ వ్యతిరేకత రాకపోవడం ఇతడి అదృష్టమూ ఇలాంటి పనులేవీ చెయ్యక పోయినా హిందువులు మతోన్మాదులుగా కనబడటం హిందువుల దురదృష్టమూ కావచ్చునా?

      హిందూమతంలో ఉన్న క్రూరత్వానికి గాయపడ్డామని చెప్తూ దానిమీద పోరాటానికే తమ జీవితాన్ని అంకితం చేశామని చెప్పుకునేవాళ్ళు తామే ఇతర్ల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నప్పుడు కనీసం ఆత్మ పరిశీలన కూడా చేసుకోకపోవడం యెంత విచిత్రం?


      ఐలయ్య గారు బ్రాహ్మణులకీ బ్రాహ్మణత్వానికీ యే దుర్మార్గాన్ని అంటగట్టి విమర్శిస్తున్నారో ఆ మనస్తత్వమే వారిలోనూ ఉందటానికి కారణ మేమిటి?

      యెదటివారిని విమర్శించటం చాలా తేలిక!తమను తాము సంస్కరించుకోవడమే కష్టం?అమాయకంగా చేసినా తప్పునిప్పు కాల్చకుండా ఉండదు.ఆ కఠినత్వం సమాజంలో యెప్పుడూ ఉంది.కురుమగొల్ల కులం విశ్వవ్యాప్తం కావాలని మనసారా కోరుకుంటున్నారు ఐలయ్య గారు,బాగానే ఉంది - కానీ అది యెలా జరుగుతుంది?వ్యాపారం అంటేనే అదనపు విలువ,అదనపు విలువ అంటేనే దోపిడీ,దోపిడీ దారు తనంతట తను అదనపు విలువని ఇవ్వడు గాబట్టి సాయుధ పోరాటం పేరుతో వాళ్ళని లేపేసి దాన్ని అనుభవించాలి,మరి అట్లా ఒకసారి సాయుధపోరాటం ద్వారా అదనపు విలువని చహెజిక్కించుకున్నాక ఆ వ్యాపారాన్ని తాము అందిపుచ్చుకుని కంటిన్యూ చేస్తారా లేక మూసేస్తారా,చేస్తే అప్పుడు ఆ అదనపు విలువని వాళ్ళు హ్యాపీగా అందరిక్కీ పంపిణీ చేస్తారా చెయ్యరా అనేవి యేవీ స్పష్టంగా చెప్పని కమ్యునిష్టు సిధ్ధాంతం నుంచి కాపీ/పేష్తు చేసిన శ్రామికుల స్థానంలో మిమ్మ్మల్నీ దోపిడీ స్థానంలో బ్రాహ్మణాధిక్యతనీ పెట్టుబడిదారుల స్థానంలో బ్రాహ్మణుల్నీ ఇరికించి కేసీఆర్ తెలంగాణా తీసుకొచ్చినట్టు యెన్నికల్లో ఆయా కులాల వాళ్ళంతా తనకిష్తం లేని బనియాలకీ ముస్లిములకీ కాకుండా తనకి నచ్చిన వాళ్ళకి వోట్లు వేస్తూ వాళ్లని అధికారంలోకి తీసుకురావడం ద్వారా బాగుపడాలనుకునే పైత్యం ఉన్నంత వరకూ వ్యాపార పారిశ్రామిక రంగాలకు వెళ్ళరు.వెళితే మాత్రం ఈ కవచ కుందల సిధ్ధాంతాల్ని వొదిలేసి తన కులం వాడితోనే అయినా సరే తన మనుగడ ప్రమాదంలో పడీతె యెంత క్రూరమైన పని చేసయినా పైకి ర్రావలసిందే.బస్తీ మే సవాల్ అని జబ్బ చరిచి రంగంలోకి దిగాక అక్కద మీరు మమ్మల్ని ముంచేసారని అంతున్న వాళ్ళ బ్రాహ్మణాధిక్యతా పని చెయ్యదు,నేను దళితుణ్ణ్ణి ఇన్నాళ్ళూ అణచబడ్డాను అని చెప్పే మీ జాలికబుర్లూ పని చెయ్యవు!

      "annihilitation of castes" పుస్తకం యెపుడు రాసింది?ఇవ్వాళ పరిస్థితి యేమిటి?పెట్టుబడిదారీ ఆర్ధిక విధానంలో ఉన్నాం.ఇక్కడ "annihilitation of castes" లూ "Das Kapital" లూ పని చెయ్యవు!కాదూ కూడదనుకుంతే సగం అదీ సగం ఇదీ అని వూగిసలాడకుండా కమ్యుఇన్ష్టులు చెప్పే వర్గరహిత సమాజ స్థాపన కోసం చెయ్యాల్సిన సాయుధ పోరా టం ఉండనే ఉంది.అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే మాత్రం ఇట్లాంటి వైరుధ్యాలూ కంఫ్యూజన్లూ తప్ప ఒరిగేది యేమీ ఉందదు.

      You: ఈస్ట్ ఇండియా పాలన కూడా మన సంప్రదాయాల జోలికి పోలేదు
      అది డైరెక్ట్ బ్రిటిష్ పాలన కాదు ఒక కంపనీ పాలన అందుకే అప్పుడు కూడా స్వాతంత్ర్య పోరాటం చేయలేదు

      Me: దత్తత స్వీకార నిషేధ చట్టాల వంటివాటి కన్నిటికీ మానవాళ్ళు అసలేమీ పోట్లాడనే లేదన్న మాట?చరిత్ర గురించి నాకు చెవిలో పువ్వులు పెట్టొద్దు!

      You: కాని మనకు మన సంప్రదాయ మూడ నమ్మకాల మీద దెబ్బతీసే చట్టాలు బ్రిటిష్ పాలన లో నే after 1857 వచ్చాయి..
      Me: పైన పోష్టులో మొదట మూఢనమ్మకాల పేరున మీ కులాల మీదనే దాడికి దిగటం,తొలిదశలోని పోరాటాలు కింది కులాల నుంచే జరగటం లాంటి వన్నీ పైన పోష్టులో చెప్పాను,చరిత్రని సరిగ్గా చదివితే సాక్ష్యాలు కూడా దొరుకుతాయి గానీ మీకు మాత్రం అవి కనబడటం లేదు,యెందుకనో!

      Delete
    4. బాబు హరిబాబు!
      మనకు 1773 నుండే చట్టాలు ఉన్నాయి ....
      కాని నేను చెప్పిన ఉద్దేశ్యం మీరు అర్ధం చేసుకోవాలని చెప్పాను
      కాని నేను ఒక మెట్టు మీదనే ఉన్నాను అని తెనాలి సినిమా ల చెప్తారని అనుకోలేదు
      ఈ బ్లాగ్ లోకం లో కొంచెం అర్ధంచేసుకొని రెస్పొంద్ అయ్యేవారు మీరు మాత్రమే అని మీకు మాత్రమే కామెంట్ చేసాను
      మీరు కూడా సగం సగం అర్ధం చేసుకొని రిప్లై ఇవ్వడంసరికాదు
      1857 నుండి జరిగిన వాస్తవిక కోణం చూడమని చెప్పను నేను
      సిపాయిల తిరుగుబాటు ఎనుకు జరిగిందో తెలియక మీ చెవులో పువ్వులు పెడతానని మీరు ఎలా అనుకున్నారో నాకు అర్ధం కాలేదు
      annihilitation of castes కాలం అన్నారు
      నేను ఆ వ్యవస్థను నా కింది కులాల పై చూపాను
      ఎప్పుడైతే నేను ఎదుర్కొన్ననో అప్పుడు తెలిసింది ఆ విష చట్రం గురించి
      అది ఇంకా ఉంది అనేది సత్యం
      అది కేవలం రాజ్యాధికారం నాట్ పారిశ్రామికదికారం
      ఎందుకంటే శూద్రులకు అంత సీన్ లేదు
      డబ్బు లేదు విజ్ఞానం లేదు
      పల్లెతూర్లోకి రండి చూడండి
      పోగా మీరు పాండవులను శూద్రులుగా ఊహించగలరా?
      వేణువు తో మీ ఆర్గుమెంట్ చూడగలరు
      ఇక్కడ మీ ద్వి సిద్ధాంతం అవలోకించగలరు

      Delete
    5. @srinu the boss
      మీరిక్కడ యే వేణువు దగ్గిర వాదనను యెత్తారో ఆ వేణువునే ఇక్కడ నా పోస్టు కి చాలంజికి పిలుస్తూ కామెంటు కూడా వేశాను.కామెంటు మోడరేషన్ ఉంది గాబట్టి కనబడకపోవచ్చు గానీ అడ్మిన్ హోదాలో ఆ కామెంటు చూసే ఉంటాడు గదా,చూసి కూడా రాలేదేమిటో?


      నేను వాదించిన ద్వి సిధ్ధాంతం యేమిటో కొంచెం వివరించగలరా?నేను రాసిన పోష్టుని గానీ కామెంటుని గానీ రాండం మూడ్ ఉండి కక్కెయ్యను గాబట్టి నాకు గుర్తుంటాయి.లేదంటే రిఫరెన్సు ఇవ్వండి!

      నేను వెలమ వాణ్ణి,వెలమలు కూడా శూద్రులే కదా?కాదా!నేను పుట్టిందీ పెరిగిందె పల్లెటూరులోనే కమ్మవారమ్మాయికి లవ్ లెటర్ రాసినందుకే ఒక మాల కుర్రాణ్ణి వాళ్ళ ఇంటి కెదురుగా పెదరెక్కలు విరిచి కట్టటాన్ని నేనూ చూశాను.

      పాందవులు శూద్రులు కాలేరు నిజమే,కానీ ఐలయ్య గారు గాంధీనీ లోహియానీ బనియాలు అని యెతకారాలు ఆడకుండా ఉండగలడా?ఇది మాత్రం ద్వి సిధ్ధాంతం కాదు గానీ వేణువు బ్లాగులె నా వాదనాతో సహా నా బ్లాగు పోష్టు లన్నింటిలోనూ ఒకే రకంగా మాట్లాడుతున్నా గానీ నా మాటలు మాత్రం ద్వి సిధ్ధాంతం లాగా కనిపిస్తున్నాయా?

      మరయితే యేది యేకరూపతగా అనుకోవాలో సెలవిస్తారా!

      Delete
    6. @srinu the boss
      అది కేవలం రాజ్యాధికారం నాట్ పారిశ్రామికదికారం
      :-)
      మీరు 1857 గురించీ మరియూ ఈ దేశచరిత్ర గురించీఎ యెన్ని గ్రంధాలు చదివి యెంత రీసెర్చి చేశారో తెలియదు గానీ ఈ ఒక్క మాట చాలు - అటు శుధ్ధ కమ్యునిజం ప్రకారం చూఒసినా ఇటు శుధ్ధ దళితవాదం ప్రకారం చూసినా మీ అవగాహన యెంత పూర్ లెవెల్లో ఉందో చెప్పటానికి!

      కార్ల్ మార్క్సు రాజ్యాధికారం కావాలంటే పారిశ్రామికాధికారం కావాలని తెగేసి చెప్పాడు.సాయుధ పోరాటం అనేదాని కీలకం అదే!ఇతు దళితవాదంలో కమ్యునిష్టు సిధాంతం లోంచి కాపీ/పేస్టు చేసి "శ్రామికుడు-దళితులు","పెట్టూబ్డిదారు-బ్రాహ్మణుడు" లాంటి పదాల్ని రీప్లేస్ చెయ్యగా వొదిలేసిన ముక్కే అది.అదే దళితవాదంలోని వైరుధ్యాలకీ గందరగోళానికీ మూలం.

      రాజ్యాధికారం రావాలంటే ఆ కులంలో గానీ వర్గంలో గానీ కొందరయినా పారిశ్రామికంగా బలపడాల్సిందే - ఐలయ్య గారి ప్లాను ప్రకారం మన కులం వాణ్నే యెంకరేజి చేద్దాం అంటూ కులాభిమానాన్ని అధికారం సాధించటానికి వాడుకోవాలనడంలోని కిటుకు అదే కదా,కాదా!

      Delete
    7. ప్రస్తుతం పారిశ్రామికదికారమే రాజ్యదికారాన్ని శాసిస్తుంది..
      కాని కింది స్థాయి సుధ్రులు సాధించగలిగేది ప్రస్తుతానికి రాజ్యదికారమేఅనేది స్పష్తం
      మీరు మార్క్సిజాన్ని ఇక్కడి వర్ణ వ్యవస్థ తో కాపీ పేస్టు చేసుకున్నారని అర్ధమైంది
      కాని పెట్టుబడి దారుడు శ్రమికునికి ఉన్నంత సరళ సంబంధం ఇక్కడ లేదు
      ఇక్కడ క్లిష్టత ఉంది దీనిని మీరు అర్ధం చేసుకోగలరు
      అందుకే మీరు వర్ణ వ్యవస్థ ను అర్ధం చేసుకోలేరు అని అర్ధమౌతున్నది
      ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మనాదిపత్యాన్ని ఎదిరించిన రెడ్లు ఇతరులు రాజ్యాధికారాన్ని సాధించారు కాని వారు బ్రహ్మనిజాన్నిఫాలో అయినట్టే ఎందుకంటే బ్ర్హమనుల స్థానాన్ని వీరు స్థానబ్రంశం చేసారు
      ఇక్కడ కింది వారు పైకి వెళ్లి మల్లి అంతకు ముందు తన పైన వారు చేసే బ్రహ్మనిజాన్నే ఫాలో అవుతున్నారు
      ఇక్కడ బ్రహ్మనిజం అంటే బ్రాహ్మణులు మాత్రమే చేసేది కాదు పైన వాడు/పైన కి వెళ్ళిన వాడు కింద వాణ్ణి అణగ ద్రొక్కే ప్రయత్నం గా మీరు అర్ధం చేసుకోండి
      మీరు కచితంగా annihilitation of caste మీరు చదవడం మూలాన ఎంతో కొంత మా లాంటి వారికి మీ మేధా శక్తి లాభం జరుగుతుంది

      Delete
    8. హరిబాబు:మీరు మన మీద పెత్తనం చేసేవాడి మీద ఖచ్చితంగా పెత్త్తనం చెయ్యాల్సిందే అంటున్నారు.అంటే రక్తానికి రక్తం అనే సినేమా డయలాగు లాగా దోపిడీకి దోపిడీయే సమాధానం అవుతుందంటారా మీరు?ఇవ్వాళా వాళ్ళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని దోచుకున్నాట్టు రేపు మేము మా కు అధికారం వస్తే ఇతర కులాల్ని అణిచి వేసాతము,ఇతరుల్ని దోచుకుంటాము అని అంటున్నట్టా!దానికి ఐలయ్య గారు గయ్యాళిగా వాదిస్తే మీరు అమాయకంగా ఆత్మాభిమానం అనే పేరు పెడుతున్నార్రు,అవునా కాదా?

      -
      ఇక్కడ హరిబాబు గారు వాదిన్చేదానితో ద్విసిద్ధాంతం కనపడుతుంది -
      పైన కులం (కౌరవులు) కింది కులం పాండవులు అనుకుంటే
      పాండవులు రాజ్యాధికారం సాధించి కౌరవులపై అధికారం చెలాయించడం అనేది మీరు వేణువుతో జరిపిన వాదన
      అయన చెప్పింది వారి భాగం వారికిచ్చెయ్యాలి ,మీరు అలాగా ఎలా ఇస్తారు అంటారు ఇక్కడ పాండవులు రాజ్యాధికారం పూర్తిగా చేలాయిన్చాల్సిందే అంటున్నారు
      మరి అయిలయ్య గారు దళితులు చెయ్యాల్సిందే అంటే మాత్రం వేరే విదంగా స్పందిస్తున్నారు

      వేణువు గారు స్పందించక పోవడం వెనక చాలా కారణాలు ఉండొచ్చు
      సమయం లేకపోవచ్చు
      అయన వెర్షన్ మీరు అర్ధం చేసుకోలేదని అనుకోవచ్చు
      వాదన -చర్చ
      అయన చర్చ చేయడానికే ఇస్తాపడోచ్చు
      ఏదేమైనా అది అయన వ్యక్తిగతం

      ----
      నేను మీతో చర్చిస్తుంది కేవలం మీరు నేర్చుకోవదానికే నా పోస్టులు అన్నారు కాబట్టే
      మీ పోస్ట్ మీ ఇష్టం మీరు నిజం రాయొచ్చు రాయక పోవచ్చు
      ----
      ఇక నా కామెంట్స్ నేను విషయాన్ని తెలుస్కోవడానికి ...
      నాకు తెలిసిన అంశాల్లో సత్యాన్ని నిజాయితి గా ప్రాక్టికల్ గా కనుక్కొనే ప్రయత్నం ....సమస్య పరిష్కార దిశగా మాత్రమే చర్చిస్తాను అంతే కాని ఇబ్బంది పెట్టడానికి కాదు
      ----
      కావున నా ఉద్దేశ్యం అర్ధం చేసుకొని రెస్పొంద్ కాగలరు

      Delete
    9. @srinu the boss
      మీరు కచితంగా annihilitation of caste మీరు చదవడం మూలాన ఎంతో కొంత మా లాంటి వారికి మీ మేధా శక్తి లాభం జరుగుతుంది
      ans:చదువుతాను గానీ పుస్తకాలు కొని చదివే వెసులుబాటు లేదు,కాబట్టి వెబ్ పజి యేదయినా ఉంటే యేదయినా ప్రామాణికమైన లింకు ఇవ్వండి!

      Delete
    10. @SRINU THE BOSS
      ??????????
      హరిబాబు:మీరు మన మీద పెత్తనం చేసేవాడి మీద ఖచ్చితంగా పెత్త్తనం చెయ్యాల్సిందే అంటున్నారు.అంటే రక్తానికి రక్తం అనే సినేమా డయలాగు లాగా దోపిడీకి దోపిడీయే సమాధానం అవుతుందంటారా మీరు?ఇవ్వాళా వాళ్ళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని దోచుకున్నాట్టు రేపు మేము మా కు అధికారం వస్తే ఇతర కులాల్ని అణిచి వేసాతము,ఇతరుల్ని దోచుకుంటాము అని అంటున్నట్టా!దానికి ఐలయ్య గారు గయ్యాళిగా వాదిస్తే మీరు అమాయకంగా ఆత్మాభిమానం అనే పేరు పెడుతున్నార్రు,అవునా కాదా?
      ????????
      ans:మీరు మన మీద పెత్తనం చేసేవాడి మీద ఖచ్చితంగా పెత్త్తనం చెయ్యాల్సిందే అంటున్నారు.అంటే రక్తానికి రక్తం అనే సినేమా డయలాగు లాగా దోపిడీకి దోపిడీయే సమాధానం అవుతుందంటారా మీరు?
      --- I think this is the actual opinion of jyotibaa pulae and Ii never committed for such meaning in any of my posts or comments.

      on some nearly annotation I have understood this is the implied meaning of kanche ayilayya gaaru and conceptually i had opposing opinion about such concept!

      I am unable to digest that I myself expressed such opinion
      can you show me the reference url?.

      Delete
  10. ఎందుకంటే శూద్రులకు అంత సీన్ లేదు డబ్బు లేదు విజ్ఞానం లేదు.
    కమ్మ,కాపు,వెలమ, రెడ్లు శూద్రులు కారా? వారికి విజ్ణానం లేదా? ఈ రోజులో కార్పోరేట్ ఆసుపత్రులు,కంపెనీలు దాదాపు అన్ని వారి దగ్గరే ఉన్నాయి కదా! వీళ్ళంతా పల్లేటూరి నుంచి వచ్చిన వాళ్ళే కదా!

    ReplyDelete
    Replies
    1. మీరు ఒక మురికినీటి కుండ లో ఒక చుక్క పాలను పోసి ...ఆ కుండ మొత్తం పాలే ఉన్నాయి అని అనుకుంటారేమో?అని పిస్తోంది
      పైన చెప్పిన నాలుగు కులాల వారి శాతం మొత్తం సుద్రుల్లో ఎంత?
      కేవలం కొంత మందిని చూపి అంతా బాగుంది అని చెప్పడం కర్రెక్టేనా

      Delete
    2. నువ్వు రాసిన ఉపమానం సరైనది కాదు. భారత దేశ చరిత్ర చదివితే శూద్రులకు విజ్ణానం బాగా ఉంది. డబ్బులు కూడా ఉండేవి అని తెలుస్తుంది. బ్రిటీషోడి పాలన చివరికాలంలో వాడు పనిగట్టుకొని కులవృత్తులను దివాల తీయించాడు.

      Delete
    3. The extent of British Plunder makes the Kohinoor appear a small loss. So let the British keep the stone.

      The British caused irreparable losses to India in a number of sectors.

      Like a huge sponge Britain soaked up the country’s wealth and simultaneously ruined its industry, agriculture and education.

      http://swarajyamag.com/world/forget-kohinoor-the-british-looted-greater-treasures-from-india

      All our greatest possessions are stolen...The entire British Museum is an active crime scene. If we start giving back everything we took from the empire, that building would be completely empty.
      John Oliver, TV Show Host.

      Delete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. ఈరోజు ఒక కొత్త విషయం తెలిసింది. రెండేళ్ల క్రితం లెఫ్ట్ లిబెరల్ ఆరుంధతి రాయ్ రాసిన పుస్తకాన్ని విమర్సిస్తూ ఐలయ్య గారు ఆయన మిత్రులు వ్యతిరేకించారు.

    An Open Letter to Ms. Arundhati Roy

    http://tinyurl.com/obj4z5b

    https://www.youtube.com/watch?v=T4QONGlF1OU

    https://www.youtube.com/watch?v=w5RtF5SRj_s

    https://www.youtube.com/watch?v=IjD6u3qQswo

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete

  14. ఐలయ్య మీడియాలో హిందువులు, హిందూ మత సంస్థలు దానం చేయరని ,క్రైస్తవుల,క్రైస్తవ సంస్థలు చాలా దానాలు చేస్తాయని (విద్య,వైద్యం) రాస్తూంటాడు. ఇటువంటి అభిప్రాయం చాలా మంది నిజమే అని అనుకొంటారు, నమ్మేస్తూంటారు. కారణం దేశంలో ప్రముఖ ఇంగ్లిష్ విద్యాలయాలు,కాలేజీలు మిషనరిల ఆధీనంలో ఉన్నాయి. చదువుకొన్న వారు వాటిని నిజమే అని నమ్మేస్తూంటారు. కాని వాస్తవం వేరు. హిందువులు,హిందూమత సంస్థలు (టిటీడి),రామకృష్ణ మిషనరి మొదలైనవి విద్య వైద్యం పై ఎంతో ఖర్చు చేస్తాయి.తిరుపతి లో ఉన్న విద్యాలయాలు గోవింద్ రాజ్ ఆర్ట్స్ కాలేజ్, పద్మావతి మహిళ విద్యాలయం, వెంకటేశ్వరా యునివర్సిటి,డిల్లి లోని వెంకటేశ్వరా కాలేజి, స్వింస్, చెవిటి వారికి ఆసుపత్రి, మ్యుజిక్ కాలేజిలన్నిటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ధిక సహాయం అందజేస్తూంది. రామకృష్ణ మిషనరి సంస్థల ద్వారా లబ్ది పొందినవారు కోట్లలో ఉంటారు.

    హిందూ దేవాలయాల సంపద అంతా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండటమే కాక వాటి ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని మతాల ప్రజలకొరకు ఖర్చు చేస్తున్నాయి. ఏ మాత్రం పరిశీలన లేకుండా ఐలయ్య ఆరోపణలు చేస్తాడు. ఈయన రాసే దానిని కనీసం పరిశీలన చేయకుండా ఆంధ్రజ్యోతి పేపర్ ప్రచూఉరిస్తారు. టీవి చానల్ వాళ్ళు ఆయన చెప్పేదానిని నిజమే అన్నట్లు గొర్రేల్లా తలవూపుతారు. ఒక్కరు ఖండించరు.

    భారతీయులు చేసే దానాలు ఏ ఇతర దేశలా కు తీసిపోవని ఈ క్రింది వీడియోలో గురుమూర్తి చెప్పాడు.

    Shri. Gurumurthy Speech at 19th Mahaveer Awards

    https://www.youtube.com/watch?v=3x2BpPdGuvM

    రాష్ట్ర ప్రభుత్వాల్య్ హిందూమతసంస్థల ఆదాయలను స్వాధీనం చేసుకొని ఎలా స్వాహా చేస్తున్నాయో తెలుసుకోవాలంటే pls go through my comments

    Tamilnadu Hindu Temple loot

    http://ssmanavu.blogspot.in/2015/08/blog-post_26.html

    ReplyDelete
    Replies
    1. Truth is, Hindus are explicitly prevented from establishing educational institutions, apart from being denied institutional control over their temples. Please read amendment 93 of Indian constitution. Infact, there is a 2.5 page section in the RTE act of New Delhi that has several clauses in which a government can take over a school, followed by a single line exemption that that act does not apply to minority schools.
      http://www.edudel.nic.in/act_and_rules/chapter7.pdf

      Delete
    2. http://indiacode.nic.in/coiweb/amend/amend93.htm

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...