Monday 6 April 2015

హిందూ పురాణాల అశాస్త్రీయత సంగతి సరే గానీ మీరు పాటిస్తున్న మార్క్సిజం శాస్త్రీయమైనదేనా?ఎర్ర మేధావు లందరికీ ఇదే నా సవాల్!

చాలాకాలం క్రితం నేను ఒక ప్రాజెక్టుకు అవసరం కావడంతో లైబ్రరీలలో పుస్తకాల వర్గీకరణ గురించి వివరంగా చదివాను.సామాన్య విషయం:1 నుంచి 100 వరకూ,తత్వశాస్త్రం:101 నుంచి 200 వరకూ,చరిత్ర:201 నుంచి 300 వరకూ - ఇట్లా విభాగాలుగా విడగొట్టి ప్రతి పుస్తకానికి ఒక్కో విభాగంలో నంబరు వుండేటట్టు చూస్తారు.ఆ తర్వాత రచయిత పేరును చూస్తారు.పుస్తకం టైటిలు కూడా పరిగణిస్తారు. వీటినన్నిట్నీ కలుపుతూ ఉండేలాగ ప్రతి పుస్తకానికీ ఇండెక్స్ కార్డ్ ఒకటి తయారు చేస్తారు. టైటిలు కార్డు,ఆథరు కార్డు,సబ్జెక్టు కార్డు - ఇట్లా యెన్ని ఉన్నా లైబ్రేరియనుకి మట్టుకు అవన్నీ ఒక పుస్తకం గురించేనని తేలిగ్గా అర్ధమవుతుంది!

కానీ "మార్కిజం" అనేదాన్ని నిక్కచ్చిగా యేదోఒక క్యాటగిరీకి సర్దాలంటే మాత్రం యెంతటి మేధావికయినా ఒక పట్టాన సాధ్యపడి ఛావదు?యెందుకంటే తత్వశాస్త్రం,చరిత్ర,ఆర్ధిక శాస్త్రం,జంతుశాస్త్రం,వృక్షశాస్త్రం ఒకటేమిటి తనకి దొరికిన పుస్తకమల్లా చదివేసి అర్ధమయినంత మటుకూ ఒక్కచోటే పూరీల పిండిలా కుదించి జీడిపాకంలా సాగదీసి గుడ్డుసొనలా గిలకొట్టి తేనీటి కషాయంలా వడకట్టి వండిన బ్రహ్మ పదార్ధమది!మామూలుగా ప్రతి శాస్త్రానికీ కొన్ని నియమాలు ఉంటాయి,ఫలానా విషయం యే శాస్త్రం సహాయంతో అర్ధం చేసుకోవచ్చుననేది తేలికగానే తెలుస్తుంది.కానీ మార్క్సు గారు చెప్పిన యే ఒక్క మాటా యే ఒక్క శాస్త్రానికీ కట్టుబడదు,రెండు నుంచీ అసంఖ్యాకంగా వున్న శాస్త్రాల్ని ఒకే గుక్కన ఆపోసన పట్టగలిగిన బహుముఖప్రజ్ఞాశాలురికి మాత్రమే అందులోని బేసిక్సు అర్ధమౌతాయి.మిగతా అన్ని శాస్త్రీయ విభాగాలలోనూ యేదయినా ఒక విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే దాన్ని సులభతరం చేసి చెప్తారు,కానీ మార్క్సు గారి పధ్ధతే వేరు!నీ ముక్కేదిరా అంటే పుర్రచేతిని తల చుట్టువార తిప్పి ముచ్చినగుంట మీదుగా కుడీవైపుకి చాపి అందీ అందకుండా అటుపక్క నున్న ముక్కు దూలాన్ని పట్టుకు చూపించడం మార్క్సుగారి అనుయాయులకి మహా ఇష్టం!

ఉదాహరణకి చరిత్ర గురించి ఈయన గారి సూత్రీకరణ చూడండి,ఉత్పత్తి శక్తులు చరిత్ర గమనాన్ని శాసిస్తాయని రూఢిగా చెప్పేసి గత చరిత్రలో విషయాలన్నిట్నీ ఆ సూత్రీకరణ ప్రకారమే వ్యాఖ్యానించి అద్భుతమైన వాదనా పటిమతో వాదించి ఒప్పించేశాడు,కానీ తను యెక్కడయితే తన సూత్రీకరణలకి ఉదాహరణగా పారిశ్రామికంగా బలమైన అమెరికా లాంటి దేశాల్లో ముందుగా కమ్యునిష్టు తరహా విప్లవం వస్తుందని చెప్పాడో అక్కడ రాలేదు సరిగదా అవి ఇంకా గట్టిగా పెట్టుబడిదారీ విధానానికే కట్టుబడి వున్నాయి?మార్క్సీయ తరహా విప్లవం వచ్చిన సమాజాలని పరిశీలించి చూస్తే తను బల్లగుద్ది చెప్పిన పారిశ్రామిక విధానం రీత్యా వేనకబడినవీ వ్యవసాయ ప్రధానమైన ఆర్ధిక పునాది వున్నవీ!ఇంతకీ చరిత్రకి ఒక దిశ ఉన్నదా?లేదు,యెందుకంటే కొన్నివేల అసంవత్సరాల వెనకటి నుంచి ఇప్పటి వరకూ చరిత్ర గమనం హఠాత్తుగా జరిగే నాటకీయ పరిణామాల వల్ల గానీ ఒక ప్రభావశీలమైన వ్యక్తి యొక్క చొరవ వల్ల గానీ అంతకు ముందు తరం వాళ్ళు వూహించను కూడా వూహించలేని మలుపును తీసుకోవడం ప్రతి చరిత్ర విద్యార్ధికి ప్రతిరోజూ తెలుస్తూనే ఉంటున్నది గదా!ఒక ప్రాంతం యొక్క చరిత్రని మార్క్సు చెప్పిన పధ్ధతిలో అయినా సరే యెంత సూక్ష్మంగా అధ్యయనం చేసి అయినా గానీ ఆ ప్రాంతంలో ఒక అయిదేళ్ళ తర్వాత చరిత్ర యే మలుపు తీసుకుంటుందో యేవరూ చెప్పలేక పోతున్నారు,అవునా కాదా?

మన దేశపు వేదాంతంలో ముఖ్యంగా భారతాంతర్గతమైన భగవద్గీతలో ఉన్న "సత్తు","అసత్తు","చిత్తు" అనే మూడు ముక్కల మాదిరి వినపడే "థీసిస్","యాంటీ థీసిస్" మరియూ "సింథీసిస్" అనే వాటి చుట్టూ తిరిగే హెగెలియన్ భావవాదాన్ని తీసుకుని దాన్ని తిరగేసి రూపం మార్చేశానని గొప్పలు చెప్పుకుని మన వాళ్ళు నిరీశ్వర సాంఖ్యంలోని పురుషుణ్ణి కాస్తా "పరమ పురుషు" డనేసి ఈశ్వర సాంఖ్యంగా మార్చినట్టు ఆ హెగెలు గారు చెప్పిన భావవాదంలోని అతీత శక్తి స్థానంలో హేతువాదపు ఉత్పాదక శక్తిని ఇరికించి "గతితార్కిక చారిత్రక భౌతికవాదం" అనే ధియరీని ప్రచారంలోకి తెచ్చాడు.ఇంతా చేసి సిధ్ధాంతపు అంతిమ లక్ష్యమైన "వర్గరహిత సమాజం" దగ్గిర కొచ్చేసరికి హేతువుకి యేమాత్రం అందని విషయాలతో పూర్తిగా కల్పనామయ వర్ణనలతో నింపేసి మరోసారి సిధ్ధాంతాన్ని భౌతికవాదం నుంచి భావవాదం వైపుకి తిప్పేశాడు,యెడంచెయ్యి తీసి పుర్రచెయ్యి పెట్టినట్టు యెందుకొచ్చిన తిప్పలు చెప్పండి?

ఇంతకీ చరిత్ర తొలిదశలొని ఆటవిక వేటకారి జీవనవిధానాన్ని అసలు లోపాలు లేని అత్యుత్తమ జీవిత లక్ష్యమైన వర్గరహిత సమాజపు వాస్తవిక వుదాహరణగా కీర్తించిన వాడు తన గతితార్కిక భౌతికవాదం ప్రకారమే దానిలోని యాంటీథీసిస్ వల్లనే మాయమైపోయిందనే విషయం మాత్రం యెందుకు పట్టించుకోలేదు?వోల్గా నుంచి గంగకు జరిగిన మజిలీల మలుపుల్లో పసిపిల్లల్ని బండల కేసి బాది చంపిన "నిశ","దివ" అనే స్రీమూర్తుల్ని గురించి చెప్పకుండా దాచెయ్యటం అబధ్ధాలు చెప్పటం కాదా!అది తెలిశాక గూడా రాహుల్ సాంకృత్స్యాయన్ లాంటి వాళ్లకి గూడా మార్క్స్ చెప్పిన ఆదిమ సమాజపు ఔన్నత్యం అబధ్ధమనే లైటు వెలగలేదంటే అర్ధమేమిటి?నిజంగానే అప్పటి ఆదిమ సమాజం యే వర్గాలూ లేని అంతటి ఆదర్శప్రాయమైనదా,లేక తను దోషిగా నిలబెడదామనుకున్న పెట్టుబడ్డిదారీ విధానానికి భిన్నంగా ఉండటం వల్ల పులుముడు పాండిత్యంతో మనముందు గొప్పగా నిలబెడుతున్నాడా అనే అనుమానం కూడా రాకుండా నమ్మిన మీరు మంత్రాల్నీ దేవతల్నీ నమ్ముతున్నారని అవహేళన చెస్తున్న మాకంటే యేవిధంగా తెలివనవాళ్ళు?!

హేతువు నుంచి నమ్మకానికి 360 డిగ్రీలు తిరిగేశాక గూడా మాది గొప్ప శాస్త్రీయమైన సిధ్ధాంతమ అని డప్పు కొట్టుకుంటున్నారు ఈ పుచ్చొంకాయలకి మన సిధ్ధాంతం గురించి యేమి తెలుస్తుందిలే అనే మొండిధైర్యంతో!ఇక్కడ మన దేశంలో యెడ్వినా ప్రియుడు ఆర్టికిల్ 370 గురించి వొ గిస్తే గిస్తే గిస్ జాయెగా అని చెప్పినట్టుగానే "State withers away once a society enters into class less society" అని అన్నాట్ట!మరి చైనాలో కమ్యునిజం యేర్పడిన ఇంతకాలం తర్వాత కూడా రాజ్యం దూదిపింజలా యెగిరిపోలేదేమి?అది నిజమైన కమ్యునిజం కాకనా?కమ్యునిజం మార్క్సుగారు చెప్పినట్టు వినకనా?ఒక సమాజం వర్గరహితసమాజం లోకి అడుగు పెట్టిందని యెట్లా గుర్తు పట్టాలో దాని లక్షణాలు వివరించలేదు,ఆ సమాజం వర్గరహితసమాజం లోకి ఇంకా వెళ్ళని మిగిలిన సమాజాలతో యెట్లాంటి సంబంధాల్ని కలిగివుండాలో సలహాలు ఇవ్వలేదు,ఆ అసమాజం వర్గరహితసమాజంలో ప్రవేశించాక మనుషుల ప్రవర్తన యెట్లా మారుతుందనే విషయాల గురించి కనీసం వూహలయినా చెయ్యలేదు - అయినా అది శాస్త్రీయమైనదే అంటున్నారు,అది తప్ప మిగిలినవన్నీ అశాస్త్రీయ మనేస్తున్నారు!మానవుడు వస్తుగతవాది అని క్యాపీటలిష్టు ఎకానమీకి మూలస్తంభమైన ఆడం స్మిత్ గారు చెప్పిన ముక్కని తుచ తపకుండా వొప్పుకుని తన సిధ్ధాంతాన్ని మొదలు పెట్టాడు గదా వర్గరహితసమాజం లోకి వెళ్ళగానే ఈ వస్తుగతవాది అయిన మానవుడు హఠాత్తుగా ఆదర్శవాది అయితే గదా రాజ్యం అంతమై పోయేది?యే రకమైన శాస్త్రీయమైన విశ్లేషణతో అప్పటిదాకా వస్తుగతవాదిగా ఉన్న మానవుడు వర్గరహితసమాజంలోకి అడుగుపెట్టగానే ఆదర్శవాదిగా మారిపోతాడని అంచనా వేశాడు కార్ల్ మార్క్స్?అతను చూపించిన యే సాక్ష్యాలతో మీరు దాన్ని ఇంతవరకూ నమ్మారు,ఇప్పటికీ నమ్ముతున్నారు,నమ్మి అందరికీ చెప్తున్నారు!

వర్గరహితసమాజంలోకి వెళ్ళే ఒక సమాజం గురించి మళ్ళీ యక్షప్రశ్నలు బోలెడు వున్నాయి!రష్యన్ సమాజం కొంతకాలం కమ్యునిష్టు పార్టీ ఆధిపత్యాన్ని చూసింది,వర్గరహితసమాజంలోకి వెళ్లలేదు,చైనా సమాజం ఇంకా కమ్యునిష్టు పార్టీ ఆధిపత్యంలోనే వుంది,ఇంకా వర్గరహితసమాజంలోకి వెళ్ళలేదు,భారత సమాజం కొంచెం రుచి చూట్టమే తప్ప పూర్తిగా మింగలేదు,అమెరికన్ సమాజం అసలు యేనాటికీ కనీసం ముట్టుకోను గూడా ముట్టుకోదని "కామ్రేడ్స్" అనే ఒక్క మాట వాడినందుకు చార్లీ చాప్లినుకి వాళ్ళు తినిపించిన టెంకిజెల్ల తోనే అర్ధం చేసుకోవచ్చు,అమెరికా ఖండంలో ఉండి దాని ఆధిపత్యానికి భిన్నంగా ఉండాలనే లక్ష్యంతో కావచ్చు చెదురు మదురుగా కొన్ని ముక్కలు కొంతకాలం కమ్యునిజాన్ని కావిలించుకోవటం కాలం మరికొంత గడిచాక చీ కొట్టి వొదిలెయ్యటం లాంటి దాగుడుమూతలు ఆడుతున్నాయే తప్ప శాశ్వతంగా కమ్యునిజానికి అంకితమైన భూభాగం ప్రపంచంలో అంగుళం మేర కూడా లేదు - మరి భూమి మీద ఉన్న ప్రతి మనిషీ మార్క్సిష్టు తరహా కమ్యునిజాన్ని ఒప్పుకుంటే గానీ వర్గరహితసమాజం అనేది ఉనికిలోకి రాదా?అదే నిజమయితే మాత్రం ఇవ్వాళ కమ్యునిష్టు పార్టీల వల్ల వర్గరహితసమాజం యేర్పడుతుందని నమ్మేవాళ్ళు పిచ్చిపుల్లయ్యల కింద లెఖ్ఖ,అవునా కాదా!

దోషారోపణకి కాకుండా అసలు మార్క్సు యేమి చెప్పాడో నాకు అర్ధమైనంతగా చెబుతాను ముందు.మానవ చరిత్రని కొన్ని దశలుగా విడగొట్టాడు:ఆదిమ సమాజం,బానిస సమాజం,ఫ్యూడల్ సమాజం,పెట్టుబడిదారీ సమాజం అనేవి చారిత్రకంగా ప్రతి ప్రాంతంలోనూ కొన్ని తేడాలతో కనిపించడం వాస్తవమే! పెట్టుబడి దారీ సమాజంలో అసంఖ్యాకంగా ఉన్న శ్రామికులు కేవలం తమ శ్రమకి మాత్రమే హక్కుదార్లు కాగా సంఖ్యలో తక్కువగా ఉన్న పెట్టుబడిదార్లు ఉత్పత్తివనరుల్ని గుప్పిట్లో పెట్తుకుని శ్రామికుల మొత్తం శ్రమ వల్ల తయారయిన  వస్తుసేవలకి హక్కుదార్లై  వాట్ని అమ్మగా వచ్చే లాభాన్ని తాము మాత్రమే అనుభవిస్తున్నారనీ అది శ్రామికుల శ్రమని దోచుకోవటమేననీ విశ్లేషించాడు!ఒక సమాజాన్ని అర్ధం చేసుకోవాలంటే ఆ సమాజపు ఉత్పత్తి సాధనం యేమిటి అనేది అర్ధం చేసుకోవాలని చెప్పి పైన ఉటంకించిన ఉటంకించిన చరిత్రలోని దశల్ని కూడా దాని ప్రకారమే వ్యాఖ్యానించాడు:ఆదిమ సమాజంలో ఆహారం కోసం వేట,బానిస సమాజంలో తక్కువ ఖర్చుతో అత్యద్భుత నిర్మాణాల కోసం బానిసలు,ఫ్యూడల్ సమాజంలో రాజ్యానికి అవసరమైన వ్యవసాయం - వ్యాపారం సజావుగా సాగడాని కవసరమైన భూమి,పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడి - సాంకేతికత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయని వివరించాడు!

ఇతని సిధ్ధాంతాన్ని క్రమానుగతంగా పరిశీలిస్తే పెట్టుబడిదారీ విధానం తొలిదశలో మానవాభ్యుదయానికీ బానిసత్వపు శృంఖలాల్ని పగలగొట్టే స్వేచ్చా సౌభ్రాతృత్వపు సాంస్కృతిక భావాల వ్యాప్తికి దోహద పడిన పురోగామి లక్షణాన్ని గట్టి సాక్ష్యాలు ఉండటం వల్ల గుర్తించడమూ, అప్పుడు తను చూస్తున్న భీభత్సాల్ని భూతద్దంలోంచి చూసి వాట్ని పెట్టుబడిదారీ సమాజపు వైరుధ్యాలుగా తీర్మానించటమూ,తను కనుక్కున్న కన్నంలో దొంగలాంటి అదనపు విలువ అనేదాన్ని గురించి ప్రపంచ ఆర్ధిక రంగాన్ని విపరీతంగా ప్రభావిత చెయ్యగల అత్యద్భుతమైన ఆవిష్కరణగా అతిగా వూహించుకోవడమూ, ఆ వైరుధ్యాలు మరింత పెరిగిపోయి ఈ పెట్టుబడిదారీ సమాజం తన వైరుధ్యాలని పరిష్కరించుకోలేని మొండితనంతో అంతమైపోయి తర్వాతదీ మానవాళి చరిత్రకి ఆఖరుదీ అయిన వర్గరహిత సమాజంలోకి ప్రవేశిస్తుంది అనే భవిష్యపురాణం చెప్పడమూ అని అర్ధమౌతుంది?!అప్పుడు నెలకొని ఉన్న అన్ని లోపాలకీ పెట్టుబడిదారీ విధానాన్ని పూర్తిగా దోషిగా నిలబెట్టేసి తాను దీనికి భిన్నంగా వుండే ఒక వర్గరహితసమాజం అనే స్వర్గతుల్యమైన ప్రపంచంలోకి మానవాళిని నడిపించబోయే కొత్త దేవుడిగా ఆవిర్భవించాలనే కీర్తికాంక్షతో ఉన్నాడనేటందుకు అతను చేసిన సూత్రీకరణల లోనే చాలా సాక్ష్యాలు ఉన్నాయి!తను మోడల్ థెయరీగా స్వీకరించిన హెగెలియన్ పధ్ధతిలో ఆలోచనలు చరిత్ర ముందుకు కదలడానికి ప్రచోదక శక్తి అని ఉంటే దాన్ని పూర్తిగా తిరస్కరించేసి మనుషుల ఆలోచనల్ని కూడా భౌతిక శక్తులే ప్రభావితం చేస్తాయి అనడం ఖచ్చితంగా భావాలకూ సంస్కృతికీ మనిషి మనస్సు మీద వున్న ప్రభావాన్ని గుర్తించని మొండితనమే అసలు కారణ మనేది నిస్సందేహంగా తెలుస్తూనే ఉన్నది గదా!యెందుకంటే ఒకే విధమయిన నైతికపరమైన పరీక్షా సన్నివేశంలో విరుధ్ధ సంస్కారాలు గలవాళ్ళు వేర్వేరుగా ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాం,అయినా భౌతిక ప్రపంచంలో తన కార్యాచరణ వల్ల వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకోవటానికి మెదడు అనే అవయవం ఉపయోగపడినా అందులోకి వెళ్ళే సారం అక్కడ నిర్ణయాలు జరగడంలో అతని సాంస్కృతిక అవగాహనయే కదా అతన్ని సమస్యల్ని పరిష్కరించుకునే తదుపరి కార్యాచరణ వైపుకి నడిపించేది?

నిజంగా ఆదిమకాలపు జీవన విధానం మార్క్సు మానవాళి అంతిమలక్ష్యంగా కొనియాడిన వర్గరహితసమాజం అంత అత్యున్నత ఆదర్శాలతో కూడి ఉన్నదేనా?అదనపు విలువని సంగ్రహించినందుకే పెట్టుబడిదారీ విధానాన్ని దుర్మార్గం అని చెలరేగిపోయిన హేతుబధ్ధమైన  కారుణ్యవాది తన తిండి తను తిని బతికే ఒక జంతువుని కత్తులతో బల్లాలతో గుంపుగా వెంటాడి వేధించి చంపి తినడాన్ని దుర్మార్గంగా యెందుకు గ్రహించలేక పోయాడు?ఇవ్వాళ తమ పార్టీ చిహ్నంగా ఉన్న కొడవలిని ఉత్పత్తి సాధనంగా మాత్రమే చూస్తూ పిడికిళ్ళలో బిగించి ఆకాశానికి చూపిస్తూ యెత్తిన కొడవళ్లతో చిందులు వేస్తూ మురుసుకుంటున్నారే గానీ అది మొక్కల్ని పరపరా కోస్తూ చంపుతున్న దుర్మార్గమైన హత్యాసాధనం అని యెందుకు గుర్తించలేక పోతున్నారు!

ఒక వ్యాపారం/పరిశ్రమ లో పెట్టుబడి పెట్టి మిల్లుల్ని కట్టి కొన్ని వందల మందికి జీతభత్యాలు ఇస్తూ లాభాలు ఆర్జించడానికి అవసరమైనంత డబ్బు ఒకే ఒక్క  వక్తి దగ్గిర చేరడానికి ఖచ్చితంగా దోపిడీయే కారణమని తీర్మానించేసి "నరజాతి చరిత్ర అసమస్తం పరపీడన పరాయణత్వం" అనే వాదన యెంత అసబబో తెలియాలంటే ఆదిమ సమాజం నుంచి ఇప్పటి వరకూ ఉన్న ఆధునిక సమాజంలో డబ్బు కున్న ప్రాముఖ్యత యేమిటో అది యెప్పుడు పుట్టి యెన్ని రూపాలు మార్చుకుందో తెలియాలి!ఇవ్వాళ దేశాల మధ్యన సరిహద్దు రేఖలు ఉన్నాయి,ఆ రేఖల్ని వాటి సార్వభౌమాధికారం చెల్లుబడి అయ్యే పరిధులుగా గుర్తించారు,అవునా!ఆయా దేశాల సరిహద్దుల లోపల పూర్తి భిన్నమయిన సంస్కృతులతో అలరారే జాతులు ప్రాంతాల వారీగా విడివిడిగా ఉన్నా వారిని కలిపి ఉంచే అంశం యేమిటనుకుంటున్నారు?తొక్కలో జాతీయతలూ కాదు, వుత్తుత్తి వారసత్వాలూ కాదు - రూప్యము అనబడే సాంకేతిక పదంతో ఉన్న కరెన్సీ ఆ దేశంలో యెక్కడికెళ్ళినా చెల్లడమే ఒక ప్రాంతం ఆ దేశానికి చెందినదా కాదా అనేది చెప్తుంది!ఒక దేశపౌరుడు మరొక దేశానికి వెళ్ళి స్వేచ్చగా తిరగాలంటే తన దగ్గిరున్న తమ దేశపు కరెన్సీని ఆ దేశపు కరెన్సీ లోకి మార్చుకోవాలి,కదా!

మార్క్సుగారు అమాయకమైనదీ ప్రపంచ మానవాళి భవిష్యత్తుకు దారి చూపేదీ అంటున్న ఆదిమ సమాజం కూడా డబ్బు లేకుండా బతకలేదు.అందరూ కలిసి సామూహికంగా వేటాడినా యెవడో ఒకడు ప్లానింగు దగ్గిర్నుంచీ ఇంప్లిమెంటేషను వరకూ నాయకుడిగా వుండి మిగతా వాళ్ళని తన ప్లాను కనుకూలంగా నడిపించకుండా అది నిక్కచ్చిగా ఫలితమివ్వదు.అట్లా ప్రత్యేక పాత్ర నిర్వర్తించినందుకు చంపిన జంతువుకి సంబంధించిన గుర్తుల్ని వీరతాళ్ళుగా తీసుకోవడం జరుగుతుంది.ఇటీవలి కాలంలోని షికారీలు తాము చంపిన పులుల గోళ్ళని మెడలో వేసుకునే గొలుసుల్లో అలంకరించుకునే వాళ్ళనేది పాతకాలం జమిందార్ల ఫోటోల్ని చూసిన వాళ్ళకి తెలుస్తుంది.మామూలు సందర్భాల్లో అది వీరతాడు మాత్రమే అయినా దాన్ని తను అపురూపంగా చూసుకుంటాడు గనక కొన్ని సందర్భాల్లో దాన్ని పణంగా పెట్టి మరొక దాన్ని సాధించితే అది హఠాత్తుగా అతని సంపద అయిపోవడం లేదా?మరో ఉదాహరణని తీసుకుంటే డబ్బు యొక్క అసలు స్వరూపమేమిటో తెలుస్తుంది!సుబ్బారావు దగ్గిర ఆవు వుంది,రంగారావు దగ్గిర మేక ఉంది,సుబ్బారావుకి మేకా రంగారావుకి ఆవూ అవసరమనుకోండి వాళ్ళిద్దరూ యేమి చేస్తారు?మామూలుగా ఆ రెంటినీ మార్చుకుంటే సరిపోతుంది,అది న్యాయమే నని కూడా మనకి తోస్తుంది!కానీ ఆవుపాలు మేకపాల కన్నా రుచిగా ఉంటాయి,గోమయం క్రిమిసంహారిణిగా పని చేస్తుంది,వ్యవసాయం లాంటి ఇతర పన్లలో కూడా మేకపెంటికల కన్నా యెక్కువ పనికొస్తుంది - సుబ్బారావు ఇవన్నీ లెక్క వెయ్యక పోతేనే ఒక ఆవుతో ఒక మేకని మార్చడం న్యాయం అని అతను అనుకోగలడు.అతను గనక రంగారావుకి తను ఇచ్చిన ఒక ఆవుకి బదులుగా రంగారావు తనకి నాలుగు మేకల్ని ఇవ్వాలని అడిగితే?మారకంలో 1:1 కాకుండా మరో రకం నిష్పత్తి రంగప్రవేశం చేస్తుంది!మరో ఇద్దరి దగ్గిర మేక - గొర్రె అనే జంటని మారకం చెయ్యడానికి మరో నిష్పత్తి అవసరమౌతుంది.ఒక ప్రాంతంలో చెలామణిలో ఉన్న అన్నిరకాల మారకపు నిష్పత్తుల యొక్క సాధారణీకరించబడిన రూపమే ఆ ప్రాంతంలో రూప్యముగా చెలామణీ అవుతుంది,అవునా కాదా!అలాంటి నిష్పత్తిని అందరి మధ్యనా శాసించడానికే రాజ్యం అవసరమవుతున్నది,రిజర్వుబ్యాంకు లాంటి సంస్థ యొక్క ఉనికి రాజ్యానికి మూలస్తంభంగా నిలబడుతున్నది!వేటలో తన చొరవకి గుర్తుగా యెక్కువ వీరతాళ్ళు పొందటం తప్పు కానప్పుడు, తను యెక్కువ పశువుల్ని మచ్చిక చేసుకుని పోషించి యెక్కువ ద్రవ్యాన్ని పోగు చేసుకోవటం తప్పు కానప్పుడు పెట్టుబడిదారు ఒక్కడే నేరస్తుడు యెట్లా అవుతాడని మార్క్సు అంత గట్టిగా నొక్కి వక్కాణించాడు?

పెట్టుబడికీ శ్రమకీ కనీసం 50:50 భాగస్వామ్యం కూడా ఇవ్వకుండా పెట్టుబడి అనేది ఇదివరకటి దోపిడీ నుంచి వచ్చిన కాలకూట విషంగా తీర్మానించేశాక దాని కొనసాగింపు అయిన |అదనపు విలువ->సాయుధపోరాటం->శ్రామిక వర్గ నియంతృత్వం->వర్గరహిత సమాజం| అనే వంకర టింకర గొలుసుకట్టులో తను అత్యద్భుతంగా పేల్తుందనుకున్న అదనపు విలువ అనే ఆటంబాంబు అనుకున్నంతగా పెట్టుబడిదారుల్ని భయపెట్టకుండా తుస్సుఢాంతుస్సు అయిపోయింది పాపం?కొద్దికాలంలోనే పెట్టుబడిదార్లు అదనపు విలువ అనేది పులి కాదనీ కనీసం పిల్లి కూడా కాదనీ కేవలం చిట్టెలుక మాత్రమేనని గుర్తించేశారు!ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగానే ఉంచాలనుకున్న స్మిత్తుగారి మోడల్ ఎకానమీ యొక్క పునాదుల్ని కదిలించకుండా ప్రపంచాన్ని మార్చగలనని మార్క్సుగారు యెట్లా కలగన్నాడో అని నాకు ఒక రకమైన నవ్వులాంటిజాలి తెగ ఉబికి వస్తున్నది,యెందుకంటే ప్రతి లక్ష్యానికీ అనుబంధంగా బలమైన ఎకనమిక్ ఫ్రేంవర్క్ చాలా అవసరం అని అంత గట్టిగా బల్లగుద్ది వాదించిన పెద్దమనిషి అందరికీ శకునాలు చెప్పే బల్లి తను కుడితిలో పడటాన్ని కనుక్కోలేనట్టు వర్గరహితసమాజాన్ని సాధించటానికి అవసరమైన ఎకనమిక్ ఫ్రేంవర్క్ యెందుకు ప్రతిపాదించలేదు?

అసలు చాణక్యుడి నుంచి ఆడం స్మిత్ వరకూ ఆర్ధిక నిపుణులు తమ గ్రంధాల్లో చేసిందేమిటి?రాజుకీ ప్రభుత్వానికీ యే రకమైన వస్తువుల మీద యెలాంటి పన్నులు వెయ్యాలి,యే విధమైన ఆర్ధిక కార్యకలాపాల్ని ప్రోత్సహంచాలి,యే విధమైన ఉత్పత్తి కార్యక్రమాల్ని అసలు కొనసాగనివ్వకుండా చూడాలి అని సలహాలు ఇవ్వడానికే వాళ్ళు ఆ పుస్తకాలు రాశారు,అవునా కాదా?మరి దానికి భిన్నంగా ఈ ప్రపంచాన్ని మార్చాలనే తాత్విక భూమికతో కదలాలని అనుకున్నప్పుడు అంతకన్నా విస్తృత ప్రాతిపదికతో ఆలోచించి వాళ్ళు వొదిలేసిన వాట్ని కూడా పట్టించుకోవాలి గదా!కార్ల్ మార్క్సు అనే ఈ అఖండప్రజ్ఞాధురీణుడు పెట్టుబడి నుంచి లాభం వరకూ ఉన్న కార్యకలాపాలకి అటూ ఇటూ ఉన్న ముఖ్యమైన రెండు విషయాల్ని తెలియక పట్టించుకోలేదా కావాలని వొదిలేశాడా?

ఆ రెండూ యేమిటో తెలియాలంటే ఒక హరికధ చెప్తాను శ్రమ తెలియకుండా వినండి!ఒకానొక రోజు పొద్దున మీకు యేమయీఅ సరే ఈరోజు ద్రాక్సహపళ్ళు తినాలనై అనిపించిందనుకోండి,యేమి చేస్తారు?మీ తోటలొనే పండీతే గొడవే లేదు,లాగించేస్తారు!ఆ తోట పొరుగూరిలో ఉంటే?ఆ తోట మీది కాకపోతే?అంత దూరం వెళ్ళడానికి బధ్ధకం అనిపిస్తే?అయినా సరే తినాలనిపిస్తే?మీకు బదులుగా యెవరయినా వెళ్ళి తీసుకు రావడానికి యెవరయినా సిధ్ధపడితే ఆనందంగా అతనికి పళ్ళ ఖరీదు ఇచ్చి పంపిస్తారు,అవునా?అతను మీకు ఉచితంగా ఈ పని చెయ్యడానికి ఒప్పుకోకపోతే దారి ఖర్చులూ తిండి ఖర్చులూ ఇస్తారు,కదా!తోట నుంచి పళ్ళు కొనడానికి 100రు.లు మాత్రమే ఖర్చయితే దారి ఖర్చులూ తిండ్ ఖర్చులూ 20రు.ల తోనే సరిపోతే మొత్తం 150రు.లు ఇచ్చారనుకోండి,అతనికి 30రు.లు లాభం,అతను కాస్త తెలివైన వాడు అయి వుండి మీకోసం వెళ్తున్నట్టు చెప్పకుండా మీ పక్కింటతనికి ద్రాక్షపళ్ళ గురించి తనే ఆశపెట్టి మరో 150రు.లు తీసుకుంటే అప్పుడేమి జరుగుతుంది?అతనికి 80రు.లు అదనంగా వస్తుంది!ఒకరికి చెప్పకుండా మరొకరి దగ్గిర తీసుకోవడం అనేది సరదాగా చెప్పాను గానీ అట్లా కాకుండా అతను ఒక బండిని కొని దానితో మీలాంటి వాళ్ళకి ద్రాక్షపళ్ళు అందిస్తుంటే ప్రతిసారీ బండి కొనక్కర్లేదు గాబట్టి లాభంతో పాటు అనుకోకుండానే మార్క్సుగారు కన్నంలో దొంగ అని భయానకంగా వర్ణించి చెప్పిన అదనపు విలువ అతనికి సహజంగానే దక్కుతుంది,అవునా కాదా?పెట్టుబడిదారు యెక్కడ యెపుడు పెట్టుబడి పెడుతున్నాడు?ఇక్కడ ఒక సౌకర్యాన్ని నేను నా కస్టమర్లకి అందివ్వడం ద్వారా నాకు లాభం వస్తుంది అనే నమ్మకం లేకుండా యే పెట్టుబడిదారుతో అయినా కార్ల్ మార్క్సు గారు పెట్టుబడి పెట్టించగలడా?ఆ నమ్మకం యేర్పడిన తర్వాతనే గదా పెట్టుబడి పెట్టటం అనే దశ మొదలయ్యేది,అతనికి ఆ పని చెయ్యగలననే నమ్మకం ఉంటే కొంతమంది మనుషులు అవసరమై అతను పిలిస్తేనే గదా ఆ మనుషులు శ్రామికుల రూపంలో రంగప్రవేశం చేస్తున్నది,వాళ్ళంతట వాళ్ళే అతనితో నువ్వు నాకు ఇంత ఇవ్వు నేను నీకు ఇంత పని చేస్తాను అని ఒప్పందం చేసుకునే వొస్తున్నారు గదా!ఆ శ్రామికులు అనబడే స్థానంలో ఉన్న వ్యక్తులు తాము సొంతంగా యెదగదల్చుకున్నా ఇదివరకు తమకి యజమానిగా ఉన్న వ్యక్తి యే విధంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాడో ఆదారిలోనే వెళ్తున్నారు గదా - ఇందులో మార్క్సు గారికి అన్యాయం యెట్లా కనిపించింది?అది నిజంగా అన్యాయమైతే దానికి బిన్నంగా వుండే మరో రకమైన వ్యాపార పధ్ధతిని దేన్నైనా అతను ప్రతిపాదించాడా?పెట్టుబడిదారు వైపుకి వెళ్ళే లాభం ఒక్కదాన్నే ప్రముఖంగా యెత్తి చూపించి ఇంత భీబత్సం చేస్తున్న మేధావులు పెట్టుబడిదారు నంచి కస్టమరు వైపుకి సౌకర్యం అనేది ఒకటి వెళ్తుందని యెందుకు గుర్తించటంలేదు?అవచి తిప్పయ్య శెట్టి చేసినా అంబానీ చేసినా కస్టమరుకి ఒక సౌకర్యాన్ని కలిగించి తను కొంత లాభం తీసుకోవడమే గదా, కస్టమరుని మోసం చెయ్యనంత వరకూ దాన్ని దోపిడీ అని యెట్లా అనగలరు మీరు?

బాత్ సోషలిష్టు పార్టీలో చేరి సమసమానత్వాన్ని గురించిన గొప్ప ఆదర్శవంతమైన కలలతో రాజకీయ ప్రయాణం మొదలు పెట్టి కల్లుపాకల దగ్గిర నుంచుని తాగివూగే తాగుబోతులకి తన జాత్యహంకారపు సిధ్ధాంతాన్ని అప్రతిహతమైన వాగ్వైభవంతో నూరిపోసి ఆఖరికి కాన్సెంట్రేషను క్యాంపులతో క్రూరత్వానికి గుర్తుగా మిగిలిపోయిన హిట్లరు మాదిరిగానే అమాయకమైన శ్రామికుల ముందు వర్గరహితసమాజం అనే సువర్లోకం గురించి వర్ణించి చెప్పి ఇంకా నీచంగా పెట్టుబడిదార్ల దగ్గిర చేరిన అదనపువిలువను కొల్లగొట్టగా సమకూడే అపరిమితమైన సంపదని ఆశ చూపించి రెచ్చగొట్టి ఇప్పటికి సాకారమై కనుపట్టిన రెండు చోట్లా రక్తపాతానికీ నియంతృత్వానికీ తెరతీయడం తప్ప విశ్వ మానవాళి సౌభాగ్యానికి యేమాత్రమూ ఒక నికరమైన వాగ్దానాన్ని ఇవ్వలేని విధంగా అభాసుపాలయినాక గూడా మేమెందుకు మిమ్మల్ని నమ్మాలి?

తను వర్ణించిన అన్ని చారిత్రక దశల లోనూ వ్యాపారం అనేది ఒకే రకమైన అమ్మకం - కొనుగోలు నియమాలతో నడుస్తుండటం అనేది తను యెందుకు గమనించలేదు?ఆదిమ సమాజంలో యెముకలూ ఈకలూ కూడా వ్యాపారపరంగా విలువైనవే గదా!మార్క్సు చూసిన ఆదిమ సమాజాలలో లేకపోవచ్చు గానీ సింధులోయ నాగరికత నాటి హస్తకళా వైభవాన్ని చూపించే ఆటబొమ్మల్నిసుదూర ప్రాంతాలలో కూడా అమ్మి వ్యాపారపరంగా సఫలురు కావడమే వారి ప్రత్యేకత కాదా?యే ఒక్క అమ్మకం - కొనుగోలు వ్యవహారంలోనూ ఇద్దరూ 50:50 శాతంగా సమాన లాభం పొందటం యెట్టి పరిస్థితుల్లోనూ జరగదు గాక అజరగదు?! ఒకచోట అమ్మకందారు 51 శాతం కొడితే మరొకచోట కొనుగోలుదారు 65 శాతం కొట్టవచ్చు, అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఈ వ్యాపార సంబంధాలు మార్పు లేకుండా కొనసాగడాన్ని యేవిధంగా అర్ధం చేసుకున్నాడు కార్ల్ మార్క్స్?డబ్బు అనేది మనుషుల మధ్య నుంచి అదృశ్యం కానంత వరకూ అమ్మకం - కొనుగోలు ద్వందాలు మనుషుల మధ్యన ఉన్నంతవరకూ మార్క్సు చెప్పగా మీరు నమ్ముతున్న వర్గరహితసమాజం యేర్పడదు గాక యేర్పడదు అని నేను నినద భీషణ శంకము దేవదత్తమే అన్నంత ఖండితంగా చెప్తున్నాను,కాదనగలరా?

ప్రపంచ కమ్యునిష్టులారా సావధానులై వినండి - నేను మిమ్మల్ని మీకు సరిగ్గా తెలియని హిందూ పురాణాల గురించి అడగట్లేదు మీరు ప్రతిరోజూ అధ్యయనం చేస్తున్న మీ సిధ్ధాంతం గురించి అడుగుతున్నాను!మీరు పాటిస్తున్న సిధ్ధాంతం శాస్త్రీయమైనదేనా?అందులో మూఢ నమ్మకాలు యేమీ లేవా?అది తప్పు అయ్యేందుకు ఆస్కారమే లేదా?ఇక్కడ బ్లాగుల్లో పిన్నికీ అత్తకీ తేడా తెలియని పైత్యకారి ప్రవీణ్ మాత్రమే కాదు రాముడు శూర్పణఖని చూసి చొల్లు కార్చుకున్నాడని వాగిన స్వైరిణి ముప్పాళ రంగనాయకమ్మ వరకూ మీలో యెవరు చెప్పగలిగినా సరే - బస్తీ మే సవాల్?!జవాబు చెప్పడానికి సిధ్ధపడితే పోయేదేం లేదు మీ(మా) అజ్ఞానం తప్ప!

మీ(మా)కోసం ఒక మంచి కొటేషను:
"కమ్యునిష్టులు,భాషా దురహంకారులు,మతోన్మాదులు - అలాంటి వారిని విచారణ లేకుండా జైళ్ళలో వేయాల్సిందే,లేదంటే దేశం సర్వనాశనం అవుతుంది."
-లీ క్వాన్ యూ

12 comments:

  1. "కమ్యునిష్టులు,భాషా దురహంకారులు,మతోన్మాదులు - అలాంటి వారిని విచారణ లేకుండా జైళ్ళలో వేయాల్సిందే,లేదంటే దేశం సర్వనాశనం అవుతుంది." -లీ క్వాన్ యూ

    హ హ, ఐతె ఇంకేం మతం పేరెత్తగానె శివాలెత్తిపోయి దాడులు చేసే బ్లాగు మతపరిరక్షకులందరినీ లోపల తోయాలన్న మాట. ఇంకేముంది కామ్రేడ్,

    పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం జైల్లోకి, విచారణన్నది లేని నరకకూపానికి, మానవహక్కుల హననానికై తెరిచిన ద్వారానికి, వికృత నిరంకుశత్వ దాశ్య శృంకలాలచే స్వేచ్ఛను సమాధిచేసిన నియంత చరణాల సన్నిధికి !

    కమ్యూష్టులు, మతోన్మాధుల ఐక్యత వర్దిల్లాలి (జైల్లో) :P

    లీక్వాన్ యూ అనే క్యాపిటలిస్టు నియంతగారి సిద్దాంతాల ప్రకారం ఆవు మాంసం తినడం నిషిద్దం అని చెప్పడం (ఫుడ్ ఫ్యాసిజం) కూడా తప్పే కదా కామ్రేడ్? అంతేనా ఏదో ఓ పుస్తకం మీకు వ్యతిరేకంగా రాయగానే నోటికొచ్చినట్లు ఒక స్త్రీ గురించి చెత్తా చెదారమంతా రాశారు. ఇలా రాస్తే సింగపూరులో ఏమి చేస్తారో తెలుసా కామ్రేడ్? గూగులించి చూడండి, మీకు ఆయన మీదున్న ప్రేమ ఆవిరైపోవచ్చు.

    అయినా, మతాన్ని కొద్దిగా విమర్శించగానే దాడులు చేసి, తెలుగు భాష చచ్చిపోయిందని శోఖాలు పెట్టి, తెలగానా - ఆంధ్రా వంటి ప్రాంతీయ విభేదాల్లో విపరీతంగా కొట్టుకుని మీరు లీక్వాన్ యూను సమర్ధించడం చూస్తుంటే గొర్రె కసాయి వాన్ని నమ్మినట్టు లేదూ? ఆయన పాలనలో ఇలాంటివి చేసినట్టు ఆయనకు తెలిస్తే మీ "హరికాలం" బ్లాగు కాస్తా మీకు "పోయేకాలం (జైల్లోకి)" గా మారుతుందేమో ఆలోచించారా?

    ఇక శాస్త్రీయత అందురా ఎంత మాటా, ఎంత మాట..

    చిన్న కర్ర, పెద్ద కర్ర సిద్దాంతం ప్రకారం, పురాణాలతో పోలిస్తే మార్క్సిజం శాస్త్రీయతలో పెద్ద కర్ర వంటిదే కదా?

    నాతో చెప్పింతురేమయ్యా .. పుష్పకవిమానాలూ, కామధేనువులూ, మృత సంజీవనులనూ నమ్ముతూ ఏనాడో అశాస్త్రీయమైన మీరు, శాస్త్రీయత శాస్త్రీయతా అంటూ మాట్లాడుట ఎందులకు??


    మార్క్సు చెప్పిన క్లాస్ థియరీ శాస్త్రీయం కాదా? సమాజములో ఉన్న వర్గాలు నిజాలు కాదా? పాశ్చాథ్య దేశాలలో ఉన్న లిబరల్స్ మార్క్సిస్టులకి సోదరులు కారా? అమెరికా, యూరోపులోని చాలా దేశాలు ఉన్నది వామపక్ష భావజాల పార్టీల చేతుల్లో కాదా? మార్క్సిజం ఎక్కడా లేదని చెప్పే వారు కాస్త లోకాన్ని చూడడం నేర్చుకుంటే మంచిదేమో!!

    ప్రపంచ దేశాలలో అత్యధిక శాతం ఆచరణలో ఉన్న సిద్దాంతం మార్క్సిజమే. చిక్కని పాలు తాగితే విరోచణాలవుతాయని, కాసిన్ని నీళ్ళు కలుపుకుని తాగడం లేదూ? ఇది కూడా అలానే. ప్రస్తుతం ఉన్న ప్రజల మైండ్ సెట్ కి మార్క్సిజం చిక్కగా అందిస్తే ఝడుసుకుంటారని, కాస్తంత క్యాపిటలిజాన్నీ కూడా కలిపి లిబరలిజాన్ని (Liberalism) అందిస్తున్నారు అంతే. ఏదో ఒక రోజు మార్క్సిజం పూర్తి స్థాయిలో రాక మానదు.

    ReplyDelete
    Replies
    1. అంతేనా ఏదో ఓ పుస్తకం మీకు వ్యతిరేకంగా రాయగానే నోటికొచ్చినట్లు ఒక స్త్రీ గురించి చెత్తా చెదారమంతా రాశారు. ఇలా రాస్తే సింగపూరులో ఏమి చేస్తారో తెలుసా కామ్రేడ్? గూగులించి చూడండి, మీకు ఆయన మీదున్న ప్రేమ ఆవిరైపోవచ్చు.
      ?
      అది యేదో ఒక పుస్తకం కాదన్ని మీకూ తెలుసు!
      తను మేము గౌరవించే పుస్తకాన్ని రాసిన వెక్కిరింత పధ్ధతిలోనే రాస్తే మీకు నేను రాసింది చెత్తా చెదారం అయీతే అసలు సరుకూ అనతే కావాలిగా?
      మీఉ సింగపూరులో నాకు జరుగుతుందని ఆనందపడిపోతున్నది ముందు తనకే జరిగి ఉండేది నేను అట్లా స్పందించాల్సిన అవసరమే ఉండేది కాదు గాబట్టి ఆ ఖర్మ నాదాకా రాదు!

      Delete
    2. అయినా, మతాన్ని కొద్దిగా విమర్శించగానే
      ?
      దొంగలు పడ్డ ఆర్నెల్లకి మొరిగినట్టు ఆ పోష్టులో నేను ముఖ్యమైన వాటికి అసలు భారతంలో యేముందో చెప్పి వాదనకి అన్ని అహ్వానాలు పలికినా చదివి కూడా అక్కద స్పందించకండా ఇక్కడ కూడా ఆకుకి పోకకై అందని ఆందోళన వెళ్ళబఓసుకుంటున్నారు,యెందుకనో?!ముఖం చెల్లకనా?బతుకు రేవున పడుతుందనా?

      Delete
  2. రంగనాయకమ్మ రాసింది "ఏదో పుస్తకమే". దాన్ని ఆమె మీరు గౌరవించే పుస్తకం మీద రాసుండొచ్చు. మీరు వెక్కిరింత పద్దతిలో రంగనాయకమ్మను వ్యక్తిగతంగా దూషించకుండా ఏ మార్క్సు సాహిత్యము మీదనో రాసుంటే సరిపోయేది. ఒక రచయిత మీరు గొప్పదని భావించే గ్రంధాన్ని తూలనాడింది.. దానికి ఆమెను వ్యక్తిగతంగా విమర్శించడం ఏపాటి సంస్కారం? ఆమె రాసింది సరికాదనుకుంటే ఎందుకో చెప్పాలి, లేదా ఆమె గౌరవించే మరో గ్రంధాన్ని మీరూ విమర్శించుకోంది. మేము ఎప్పుడైనా కాదన్నామా? మత పిచ్చితో ముందూ వెనుకా చూడకుండ దూషించింది మీరు.

    సింగపూరులో మత స్వేచ్ఛ బాగా పూర్! కాబట్టి అది ప్రజలను అఫెక్ట్ చేయడం కష్టం, అలాంటప్పుడు రంగనాయకమ్మ ఈ తరహా పుస్తకాలను రాయాల్సిన అవసరమే ఉండేది కాదు. ఎటొచ్చీ, మతమూ మతమూ అని అరిచేసుకునే మీకే చిక్కులు!

    భారతం గురించి మీరు రాసిన పోస్టుతో నాకేం పని? భారతం గురించి చర్చినడానికి నేనేం వృద్దాశ్రమములో పురాణ కాలక్షేపం చేయడం లేదు. మీరు ఇక్కడ మార్క్సిజం గురించి సవాలు విసిరారు కాబట్టి వచ్చాను. అయినా మీకు సినిమా భారతం భాషలోనే చెబుతాను వినండి, ఘటొత్కచుడు తన సేనలకు కౌరవులను తిట్టమని చెబితే, ఒకడు దుసటచతుసటటయం అని ఒకసారి, దుసటటటయం అని ఇంకో సారి అంటాడే గానీ సరిగ్గా ఒక్కసారి కూడ పలకడు. మాయా బజార్ సినిమా చూడంది. అయినా సరే వెయ్యండి వీరతాడు అని వీరతాళ్ళు వేసేస్తారు. మీరు భారతం గురించి ఏమి రాసుకున్నా మాకనవసరం. మీరేమి రాసినా మాకు అది చర్చించదగ్గ విషయం కాదు. అలానే రంగనాయకమ్మ ఏమి రాసినా మేము వీరతాళ్ళు వేసితీరతాం.
    ?
    ఇక్కడ కూడా ఆకుకి పోకకై అందని ఆందోళన వెళ్ళబఓసుకుంటున్నారు,యెందుకనో?!ముఖం చెల్లకనా?బతుకు రేవున పడుతుందనా?
    ?
    భలే, నేను ఆకుకీ పోకకందని రాతలు రాశానా? నేను మీకు "కందే"లా రాసాను. కందిన తరువాత వచ్చే ఎరుపు మాకు కనపడుతోంది. నా బతుకుని మీరు రేవున పెట్టడమా ..? ఈ ఉత్తర కుమార ప్రగల్బాలపి ముందు మార్క్సిజం మీద చర్చ ఏదన్నా ఉంటే చూడండి. లేదు అంటే, సెలవ్.

    ReplyDelete
    Replies
    1. 1).ముందు మార్క్సిజం మీద చర్చ ఏదన్నా ఉంటే చూడండి. లేదు అంటే, సెలవ్
      ?
      నేను పిల్చిందే అందుకోసం!వచ్చి యేదేదో వాగి సెలవ్ అంటే ఇంక చెప్పేదేమిటి?
      పైన వేసిన ప్రశ్నలు మీకోసమే గదా?వాటిమీద చర్చకే గదా పిల్చింది?

      2)
      ఒక స్త్రీ గురించి చెత్తా చెదారమంతా రాశారు
      =>
      ఒక పేళ్లైన వాణ్ణి ఎమంజాయ్ చేస్కుందాం అనిఅడిగి అతను నాకు పెళ్లయింది కుదరదంటే అతని పెళ్లాన్ని చూసీ చూడగానే చంపాలనై చూసి ముక్కూ చెవులూ కోయించుకుని అన్న దగ్గ్గిరకి పోయి వాడి పెళ్ళాన్ని నువ్వు యెత్తుకొచ్చి పండగ చేస్కోమని సలహా ఇచ్చిన ఆడదాన్ని గౌరవనీయమైన దానిగా నిలబెట్టాలని చూసినప్పుడు నీకు స్త్రీత్వం గుర్తుకు రాలేదా?

      ఇప్పుడు స్త్రీ అనికూడా చూడకుండా అగౌరవంగా మాట్లాడిన దుర్మార్గాన్ని నాకు అంటగట్టటానికే నీకు స్త్రీత్వం గుర్తుకొచ్చిందా?

      3.మీరు వెక్కిరింత పద్దతిలో రంగనాయకమ్మను వ్యక్తిగతంగా దూషించకుండా ఏ మార్క్సు సాహిత్యము మీదనో రాసుంటే సరిపోయేది.
      =>
      ఇప్ప్పుడు చేసింది మిమ్మల్ని చాలెంజి చెయ్యటమే గదా!నేను వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పరాదు?

      Delete
    2. "ఒక రచయిత మీరు గొప్పదని భావించే గ్రంధాన్ని తూలనాడింది" అంటూనే ఆ తూలనాడిన కుసంస్కారం గురించి యేమాత్రం చెప్పకుండానే "ఆమెను వ్యక్తిగతంగా విమర్శించడం ఏపాటి సంస్కారం?" అని మీరు మాత్రమే ప్రశ్నించగలరేమో కదా!దీనికి నేను యెన్ని ఆహాహాలూ ఇహ్హీహ్హీలూ వేస్తే బాగుంటుందో మరి?!

      Delete
    3. @Shanthi Kiran
      భారతం గురించి మీరు రాసిన పోస్టుతో నాకేం పని? భారతం గురించి చర్చినడానికి నేనేం వృద్దాశ్రమములో పురాణ కాలక్షేపం చేయడం లేదు. మీరు ఇక్కడ మార్క్సిజం గురించి సవాలు విసిరారు కాబట్టి వచ్చాను. అయినా మీకు సినిమా భారతం భాషలోనే చెబుతాను వినండి, ఘటొత్కచుడు తన సేనలకు కౌరవులను తిట్టమని చెబితే, ఒకడు దుసటచతుసటటయం అని ఒకసారి, దుసటటటయం అని ఇంకో సారి అంటాడే గానీ సరిగ్గా ఒక్కసారి కూడ పలకడు. మాయా బజార్ సినిమా చూడంది. అయినా సరే వెయ్యండి వీరతాడు అని వీరతాళ్ళు వేసేస్తారు. మీరు భారతం గురించి ఏమి రాసుకున్నా మాకనవసరం. మీరేమి రాసినా మాకు అది చర్చించదగ్గ విషయం కాదు. అలానే రంగనాయకమ్మ ఏమి రాసినా మేము వీరతాళ్ళు వేసితీరతాం.
      ans:ఆమె యెంత చెత్తగా రసినా వీరతాళ్ళు వేసి తీరతాము అన్నారు మధ్య నాదేం పోయింద్1,సరే!
      ఇక్కడ టాపిక్కు అర్ధం కాలేదా?మార్క్సిజం గురించి అదగంది అంటూనే నా ప్రశ్నలకి జవాబు చెప్పకుండా సెలవ్ అనేశారు?

      Delete
  3. ఇంతకి మార్క్స్ తెలిసిన సైన్స్ ఎంత? ఆయన ఎమైనా సైన్స్ విభాగాలైన ఫిజిక్స్,కెమిస్ట్రి,మాత్స్,జువాలజి,బాటని లలో ప్రవేశం ఉందా? పి.చ్.డి. ఎమైనా చేశాడా? మార్క్స్ సమకాలీనూడు చార్లెస్ డార్విన్ లండన్ లో ఉంటే ఎప్పు, మార్క్స్ గారు ఎప్పుడైనా వెళ్లి అతనితొ సైన్స్ విష యాలు చర్చించాడా? మార్క్సిజం శాస్రీయమైతే జ్యోతిష్యం శాస్రీయమే. జ్యోతిష్కుల ప్రకారం భవిషత్ లో మన కలలు,కోరీకలన్ని తీరిపోతాయి.

    ReplyDelete
  4. ఈ శాంతికిరణ్ లాంటి బాపతులవల్లే అసలు కమ్యూనిజమ్ అంటే జడుసుకు చస్తున్నారు జనాలు. ఇంత వివరంగా ప్రశ్నించాక కూడా అసలు విషయం వదిలేసి, రంగనాయకమ్మ స్త్రీత్వాన్ని అడ్డం పెట్టుకుని గబగబా తిట్టేసి పారిపోయాడు.

    ReplyDelete
  5. సాంతి కిరన్ రంగి భక్తుడు ... కమ్యునిస్ట్ కాదు ... కమ్యునిసం గురించి ఆవ గింజంత కూడా తెలియదు ... ఇట్టాంటి ఖాలీ డబ్బాలు చూసినప్పుడు communism ఈ దేశాన్ని ఏమి చేయలేదని నమ్మకం రెట్టింపు అవుతుంది.
    ప్రస్తుత కమ్యునిజం వ్యక్తిత్వ హీనులను తయారు చేయగలదు కానీ "విషయ ఙనాం ఇవ్వలేదు" అని నా లిబరల్ అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. అవును కరెక్టుగా చెప్పారు.
      "మొదట అట్టను అంత భయంకరముగ చిత్రించ నేల?పిదప అట్టను చూసి భయపడకండని కన్నుగీటులేల!" పోస్టులో నా ఆఖరి పేరా అదే అభిప్రాయంతో ఆగుతుంది.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...