Saturday 28 March 2015

మొదట అట్టను అంత భయంకరముగ చిత్రించ నేల?పిదప అట్టను చూసి భయపడకండని కన్నుగీటులేల!

       స్వైరిణి మళ్ళీ కన్ను గీటి కాలెత్తింది!ఈసారి మహాభారతం మీద పడింది?రంకు నేర్చిన ఆడది బొంకు నేర్వదా అని - అబధ్ధాలు చెప్పడంలో మాంఛి శ్రేష్టమైన మార్గాన్నే యెంచుకునింది?!మొదటిసారి వాల్మీకి చెప్పనివి - రాముడు శూర్పణఖని చొల్లు కార్చుకుంటూ చూశాడనీ,సీత రావణుణ్ణి చూసి గొప్పగా మురిసిపోయిందనీ - తను కల్పించి చెప్తే రామకధ యెక్కువ మందికి తెలిసి వుండటంతో అట్లాంటి వాటితో తిరగేసి తన గూబనే గుయ్యి మనిపించడం తప్ప రామాయణాని కేమీ హాని జరగలేదు!కానీ తిరిగే కాలూ తిట్టే నోరూ వూరుకోవుగా యెందుకో ఈసారి మహా భారతం చదివింది.అప్పట్లాగే తనకి అర్ధం కానివి కొన్ని తప్పులుగా కనపడినాయి.అర్జెంటుగా ఆమాంబాపతు గాళ్ళకి ఓ పదిమందికి ఫోను చేసిందిట!వాళ్ళు మహాభారతంలో అవి వున్నాయా, మాకేం తెలీదన్నారంట!వెంఠనే బుర్రకి పదును పెట్టేసింది - సంస్కృతం రాకపోతే యేం అనువాదాలు వున్నాయిగా రామాయణ విషవృక్షం కూడా అట్లాగే లాగించిందిగా "ఇదండీ మహా భారతం"అనే పుస్తకాన్ని వొదిలింది - దేశంలో వున్న స్వైరిణి పాదరేణువులంతా హర్ష పులకాంకితగాత్రులై పోయేటట్లుగా!

     యేదైనా ఒక వస్తువుని పదిమందికీ అమ్మాలంటే చూడగానే ముచ్చట గొలిపే ప్యాకింగు అవసరమని చిన్నపిల్లాడికి కూడా తెలుసు!తన జేబులో వున్న శెనిక్కాయని పక్క పిల్లోడికి అమ్మాలన్నా కూడా మట్టి తుడిచి సాపుచేసి అమ్మాలని చూస్తాడు,మరి ఈ తెలివి యేమిటో తన పైత్యకారి తనమంతా అట్ట చూడగానే తెలిసి పోవాలన్నట్టు వికారమైన బొమ్మతో వొదిలింది?తనే తెలిసీ అట్టని చూడగానే కోపమొచ్చేలా చేసి మళ్ళీ "అట్టను చూస్తే  కోపమొస్తుందేమో.  లోపలికి వెళ్ళండి. న్యాయం లేకుండా, చర్చ లేకుండా,  పరిశీలించకుండా కోప్పడితే  అది తప్పవుతుంది కదా?" అని దీర్ఘాలు తీస్తుంటే ఆ తెలివిని తెలివనే అనాలా?

        అబధ్ధాలు రెండు రకాలుగా చెప్పొచ్చు!రామాయణం విషయంలో అక్కడ లేని దాన్ని వున్నట్టు చెప్తే ఇక్కడ మహాభారతం విషయంలో తను వెక్కిరించటానికి పనికొచ్చేదాన్ని మాత్రమే వుటంకిస్తూ అక్కడే తన వాదనని వెక్కిరించే సత్యం వున్నా దాన్ని మాత్రం చెప్పకుండా వొదిలేసి చెలరేగిపోవటం చాలా గొప్ప తెలివి! గట్టిగా యెవరయినా నిగ్గదీస్తే నేను చెప్పిన పార్టు మట్టుకు అక్కడ వుందా లేదా అని యెదురుదాడి కూడా చెయ్యొచ్చు, అమ్మ స్వైరిణీ బల్లే లాజిక్కు లాగావుగా!

        అప్పుడెప్పుడో బాపుగారు అప్పుడే పోయారనే ఇది కూడా లేకుండా పాత విషయాన్నొకదాన్ని కెలికి అల్లరి చెసిన ఒక బ్లాగరు ఇప్పుడు ఆవిడకి పరమ భక్త శిఖామణి అయిపోయి అందులోని విశేష భాగాలు అంటూ తనకి తిరుగులేని వనిపించే కొన్ని చెత్త వాదనల్ని ఒక పోష్టుగా వేశాడు.ఆవిడ లాగే రండి,వాదించండి,గెలవండి అని పిలిచి తీరా వాదన గట్టిగా వుంటే ఆ కామెంట్లని ప్రచురించకుండా వొదిలేసి,కొన్నిటికి తాంబూలా లిచ్చెశాను తన్నుకు చావండన్నట్టుగా నేను చెప్పిందే ఫైనల్,ఇంక దీని గురించి వాదన అనవసరం అనీ అంటున్నాడు!మరి అంతోటి దానికి రండి,చూడండి,వాదించండి, గెలవండి అని పిలుపు లెందుకు?ఆ "స్వైరిణి పాద రేణువు" పోష్టులో ప్రచురించిన విషయాన్ని మార్చి 24 నాటి 7:28 గంటల తన కామెంటు వరకూ ఇక్కడ ప్రస్తావించదల్చుకున్నాను.అక్కడి లాగా ఇక్కడ నేను కామెంట్లని మోడరేట్ చెయ్యను.మిత్రులకి, మహాభారతాన్ని సమర్ధించదల్చుకున్న వారికి మాత్రం భాష విషయంలో హెచ్చరిక చేస్తున్నాను - మన భాష అసభ్యంగా వంటే సరుకు లేక ఇట్లా మాట్లాడుతున్నారని నింద రావచ్చు కాబట్టి జాగ్రత్తగా వుండండి!ఉషశ్రీ తెలుగు అనువాదం కొన్ని భాగాలు నా దగ్గిర వున్నాయి కాబట్టి విషయం వరకూ కంగారు పడాల్సిన పని లేదు! కాబట్టి స్వైరిణి పాద రేణువులు మాత్రం తమ బుధ్ధినీ సంస్కారాన్నీ మిళితం చేసిన వాదనల్ని నిరభ్యంతరంగా చెయ్యవచ్చు!

       మొదట స్వర్గారోహణ పర్వాన్ని గురించిన వాదనల్నే తీసుకుందాం.ఉషశ్రీ చెప్పిన దాని ప్రకారం వ్యాస భారతంలో శతాధిక పర్వాలు వున్నాయి. ప్రతి పర్వానికి పెట్టిన పేరు ఆ పర్వంలో చెప్పే కధని సూచించే విధంగా వుంటుంది.కాండలుగా,పర్వాలుగా,సర్గలుగా ప్రతి భాగానికీ పెట్టినట్టుగానే "మహా ప్రస్థానం","స్వర్గారోహణం" అని పెట్టి కధ చెప్పినా కూడా స్వైరిణికీ స్వైరిణిపాదరేణువుకీ వాళ్ళు యెక్కడి కెళ్తున్నారో అర్ధం కాలేదట!ఇంద్రుడు కనపడగానే ఆగిపోయాడేమిటీ అని అమాయకంగా ఆవిడ దీర్ఘాలు తీస్తూ అడుగుతే ఈ స్వైరిణిపాదరేణువు నేను విడమరిచి చెప్పాక కూడా కధలో స్వర్గాని కెళ్తున్నట్టు లేదుగా అని అడ్డం తిరిగి వాదిస్తున్నాడు,ఈపాటి తెలివికి అసలు వాదనకి తెగబడటం దేనికి?ఇట్లా వ్యాసభారతంలో వాళ్ళు బయలుదేరింది స్వర్గానికి చేరడానికే అని కాకుండా అస్పష్టంగా వుండేటట్టు యే అనువాదంలో వుందో చెప్తే మేమూ చదివి తరిస్తాం!తమ తమ పుణ్యవిశేషంతో యోగనిష్ఠకి సంబంధించిన ప్రయాణమైన మహాప్రస్థానంలో కూడా దేహబంధాలకి చోటిచ్చి వెనక్కి చూసుకుంటూ పడిపోయిన వాళ్లందర్నీ మోసుకుంటూ వెళ్ళాలని పిచ్చ్గివాళ్ళు మాత్రమే అనగలరు!మిగతావాళ్ళు పడిపోయినప్పుడు కూడా యెందుకు పడిపోతున్నారో చెప్పి ఆగకుండానే వెళ్ళాడనేది తెలిసి కూడా ద్రౌపది పడిపోవటాన్నే ప్రముఖంగా చెప్పడం ఆడవాళ్ళని రెచ్చగొట్టాలని కాదా?ఈ దేశపు ఆడవాళ్ళు మరీ అంత చెవుల్లో పువ్వులు పెట్టుకున్నారని అనుకుందా!రామాయణం,మహాభారతం కధల్లో యేముందో తెలియకపోయినా ఆడవాళ్ళు తమ తల్లుల ద్వారా తమ ప్రవర్తనని నిర్దేశించుకుంటున్నారు,అదొక పరస్పరాశ్రిత సంబంధానికి తమ క్షేమం కోసం కట్టుబడటం - అందులో సందేహాలు వచ్చినప్పుడు మాత్రమే సమాధానాల కోసం ఆ గ్రంధాల సారం పనికొస్తుంది!ఖచ్చితంగా పాటించి తీరాలని ఒత్తిడి కూడా చెయ్యటం లేదు,అట్లా సాగదని తెలిపేటందుకు బృహత్కధ లోని శృంగారం నిండిన చాటువులూ భారతంలోనే అక్కడక్కడా వున్నఉపకధలూ వుదాహరణలుగా నిలుస్తాయి!

        జూదం చాలా ధర్మబధ్ధంగా జరిగినట్టూ అందులో అక్రమం యేమీ లేనట్టూ కౌరవులు ఓడిపోయుంటే భానుమతినీ అట్లాగే ఈడ్చుకొచ్చేవాళ్ళు కదా అనీ,వాళ్ళూ అడవులకి వెళ్ళాల్సిందే కదా అని ఆవిడ లాజిక్కు లాగితే పిన్నిని పెళ్ళి చేసుకుని పక్కలోకి లాగాలని చూసే పైత్యకారి ఒకడు దుశ్శాసనుడికి రేప్ చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చిన ధర్మరాజుకి ద్రౌపది విడాకులు యెందుకివ్వలేదు అని అడుగుతున్నాడు?అంత నీచమయిన కామెంటుని కూడా తన సైడు వాడు వేశాడు గాబట్టి పబ్లిష్ చేసిన ఈ స్వైరిణిపాదరేణువుకి తనకి బెండు తీసే కామెంట్లలో మాత్రం అసభ్యత కనిపిస్తుంది కాబోలు?విరాట పర్వంలో ద్రౌపది భీముడితో అంటుంది "యెంతకాలం జూదమాడినా తరగని సంపద మనది,కొద్ది క్షణాల్లో మాయచేసి ఓడించారు.ఈ విరాట రాజు ఒకప్పుడు మనకి సామంతుడు. ఇప్పుడు మీ ఆన్నగారు దాసుడిగా తిరగటం, వీళ్లని సంతోష పెట్టటం కోసం నువ్వు యేనుగులతో సింహాలతో పోట్లాడటం, గాండీవి నారీజనం మధ్యన గంతులు వెయ్యడం చూస్తుంటే నాకు దుఃఖంగా వుంది" అని!తన భర్తల పట్ల అంత గౌరవం వుండి మాయోపాయంతో దుర్యోధనుడు తన భర్తల్ని ఓడించటం వల్లనే తనకి పరాభవం జరిగిందని తెలిసిన ద్రౌపది ఈ ఆడదానితో పెళ్లికి పనికిరాని గాడిదకి నచ్చేటట్టు విడాకుల ఆలోచన చేస్తుందా?ఇంత కాలం ఈ కామాంధుడి వదరుబోతు తనాన్ని చూశాక గూడా యెవడికీ వీణ్ణి నాలుగు తందామనే ఆలోచనే రావటం లేదా?ఇంకా హిందువులలో ధార్మికక్షాత్రం రగుల్కొనుట లేదా?ఒక్కసారి కూడా గెలవకుండా అన్నిసార్లూ ఓడిపోవటం చూశాకనైనా ధర్మరాజు కేవలం ఆసక్తి కొద్దీ నేర్చుకోవటమే తప్ప ప్రావీణ్యం కోసం యేనాడూ పాకులాడ లేదనీ దానికి భిన్నంగా శకుని అందులో ఆరితేరిన వానీ తెలియడం లేదా?అదే విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణంలో అశ్వధ్ధామ "యుధ్ధంలో గెలవలేమని తెలిసే మీరు ద్యూతానికి దిగి పాండవశ్రీని హరించారు.అప్పుడు మా అవసరం మీకు లేకపోయింది,ఇప్పుడు కూడా శకునినే పిలవండి" అని అంటాడే - ఆ ముక్క యేమి చెప్తుంది?భీష్ముడు కూడా ద్యూతార్జితం రాజపురుషులకి గౌరవప్రదమయిన సంపాదన కాదు,న్యాయంగా వాళ్ళ భాగం వాళ్ళకిస్తే నువ్వు క్షేమంగా వుంటావు నీ మేలు కోరి చెప్తున్నా నంటాడు.ఇంత ప్రముఖమైన సన్నివేశం కూడా స్వైరిణి చదివిన అనువాదాల్లో లేదా?

       హస్తినాపురం,కౌరవులు,దృతరాష్ట్రుడు,దుర్యోధనుడు,భీష్మద్రోణాదులు - ఇవన్నీ ఒకదాని కొకటి సంబంధం లేకుండా గాల్లో తేల్తున్న విడివిడిభాగాలు గాబోలు స్వైరిణిపాదరేణువుకి హస్తినాపురం ఓడిపోతే దృతరాష్టుడు ఓడిపోవటమేమిటో అంతుబట్టటం లేదట!ఇండియాకీ పాకిస్తానుకీ జరిగిన యుధ్ధంలో భుట్టో తుపాకీ పట్టుకుని యుధ్ధం చేశాడా?వెయ్యేళ్లు యుధ్ధం చేస్తానన్న భుట్టో చేత నిర్యుధ్ధ సంధి సంతకం యెందుకు చేయించుకుంది ఇండియా?ఈ స్వైరిణిపాదరేణువు లాజిక్కు ప్రకారం భుట్టో ఇండియా మీద పెత్తనం చెయ్యాలి గాబోలు - యేమి పిచ్చి లాజిక్కు ఇది? అసలు దృతరాష్ట్రుడికి రాజ్యార్హత లేదు - అది ఖచ్చితం!యేదో పెద్దవాడు కుళ్ళి చస్తాడని ఇప్పటి రాష్త్రపతికి మల్లే వుత్సవ విగ్రహం లాగా కూర్చోబెట్టాడు పాండురాజు, రాజ్యార్హతకీ పిత్రార్జితానికీ తేడా తెలీదా ఈ దద్దమ్మలకి ప్రజాస్వామ్యంలో కూడా తాగుబోతుకీ తండ్రి ఆస్తిలో వాటా వస్తుందిగా అని పేలుతాడు?నిజమైన రాజ్యార్హత వుండి ఆ అర్హతని నిలబెట్టుకున్న పాండురాజు పెద్ద కొడుకుగా ధర్మరాజుని యువరాజుగా అందరూ అంగీకరించినట్టు అంత స్పష్టంగా చెప్పాక గూడా వెర్రిమొర్రి మాటలు మాట్లాడితే యెవడు యెవడి గూబ గుయ్యి మనిపించాలి?!యుధ్ధాలు చెయ్యటం,రాజ్యాన్ని విస్తరించటం,అధికారిక నిర్ణయాలు చెయ్యటం అన్నీ పాండురాజు పరంగానే జరిగేవి!పాండురాజు చనిపోయాక కుంతి పిల్లలతో వస్తున్నప్పుడు యువరాజ మర్యాదలతో గౌరవంగా చూస్తారు ధర్మరాజుని, స్వైరిణి చూసినవైనా అనువాదాలలో ఆ భాగం చూస్తే తెలుస్తుంది గదా!అయినా రాజ్యం దుర్యోధనుడిదే అయినట్టూ ధర్మరాజే తనది కాని దాన్ని ఆశించే దుర్మార్గుడనే వాదన వ్యాసుడికన్నా కవిత్రయంకన్నా స్వైరిణికే యెక్కువ తెలుసునని డప్పు కొట్టుకోవడానికి తప్ప యెందుకైనా పనికొస్తుందా?

       ఉత్తర గోగ్రహణం తర్వాత యెకాయెకి కృష్ణ రాయబారం జరగలేదు!మొదట ధర్మరాజు ధౌమ్యులవార్ని పంపిస్తాడు మర్యాదగా తమ భాగం తమకి ఇచ్చి తమ్ముడి కొడుకుల పట్ల తనకున్న ప్రేమని చూపించమని,దానికి ప్రతిగా దృతరాష్ట్రుడు సంజయుణ్ణి పంపించి యెట్లాగూ వనవాసం అలవాటయిందిగా అక్కడే వుండిపోరాదా అనే బూతుసందేశం పంపిస్తాడు,అయినా తమాయించుకుని ఆఖరుసారిగా కృష్ణుణ్ణి పంపిస్తాడు ధర్మరాజు!ఈ స్వైరిణికీ స్వైరిణిపాదరేణువుకీ ధర్మరాజు తన అర్ధరాజ్యం కోసమే యుధ్ధం చేశాడని యెట్లా అర్ధమయిందో తెలియదు గానీ పేర్లు చెప్పి మరీ తలా ఒక గ్రామం ఇచ్చినా చాలు నంటే సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను పొమ్మన్నాకే గదా యుధ్ధం జరిగింది?అంత ధీమాగా హస్తినాపురాన్నే కొట్టాక కూడా అది వొదులుకుని పోవటం పిచ్చివాడు తప్ప యెవ్వడూ చెయ్యడు గదా!గెల్చిన వాడికి అది ధర్మవిజితమే కదా, ఇంకా దాన్ని తనని అడుక్కుతినమని అన్న ధృతరాష్ట్రుడి కిచ్చి తను యెక్కడికో పోవటమేమిటి అర్ధం లేకుండా?!యుధ్ధం పూర్తయ్యాక ధర్మరాజు  అసలు దృతరాష్ట్రుడి రాజ్యార్హతతో యేమాత్రం సంబంధం లేకుండానే హస్తినాపురానికి పూర్తి హక్కుదారుడు అని తెలిసి కూడా తను అర్ధరాజ్యం కోసమే యుధ్ధం చేశాడు గాబట్టి హస్తినాపురాన్ని దృతరాష్ట్రుడికి ఇస్తేనే ధర్మం అంటే ఇండియాకీ పాకిస్తానుకీ జరిగిన యుధ్ధంలో పాకిస్తాను సైన్యం మాత్రమే ఓడిపోయింది గానీ భుట్టో ఓడిపోలేదనీ ఆ నిర్యుధ్ధ సంధి పత్రం మీద బలవంతంగా సంతకం పెట్టించుకోవటం అన్యాయమనీ అన్నట్టే గదా?

          గీతలోని కర్మయోగానికీ భారతం చివరి ఫలశ్రుతికీ ముడిపెట్టి వెక్కిరించటం స్వైరిణికే చెల్లింది - బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టటం లాంటిది!ఫలితం మీద ఆశ లేకుండా యే గాడిదా పని మొదలు పెట్టడు,భగవద్గీతలో చెప్పింది అంతా ఫలితం గురించిన యావతో కక్కుర్తితో వుండకు,ఫలితం నీ ఆశలకి విరుధ్ధంగా వచ్చినా కుంగిపోకు,ఒక పని నువ్వు తప్పనిసరిగా చెయ్యాల్సినదయితే ఆ పని నీకు లాభమైనా నష్టమైనా ఒక్కలాగే చెయ్యమని చెప్తుందే తప్ప ఫలితం లేని కర్మ గురించి చెప్పదు!అసలు ఫలితం లేని కర్మా వుండదు,ఫలితాన్ని ఆశించని మనిషీ వుండడు - అది వ్యాసుడికి స్వైరిణి కన్నా బాగా తెలుసు!అర్ధం కాకపోతే మూసుకుని కూర్చోవాలి గానీ సంబంధం లేనివాట్ని కలపకూడదు,వున్నవాట్ని వున్నట్టుగానే అర్ధం చేసుకోవాలి!మహా భారతం అనే గ్రంధాన్ని చదవాలని అనుకున్న వాడెవడయినా దాన్నుంచి యెంతో కొంత నేర్చుకుందామనే తెరుస్తాడు - అది కూడా తెలియదా ఈ స్వైరిణికి?మిల్స్ అండ్ బూన్ పుస్తకం తెరిచేవాడు కాలక్షేపాన్ని ఆశిస్తాడు,భారతాన్ని తెరిచేవాడు జ్ఞానాన్ని ఆశిస్తాడు - చెంబు కొద్దీ గంగ!

         అసలు ఇలాంటి సాహిత్యం అన్ని మతాల్లోనూ వున్నా ఈ కుహనా మేధావులు హిందూ మతం మీదనే పడి యేడుస్తా రెందుకో?అంబేద్కర్ గారు రాముడి పుట్టుక గురించి అక్రమ సంబంధం వల్ల పుట్టాడు అనే విధంగా వ్యాఖ్యానించినప్పుడు మరి యేనుగు కలలోకి వస్తే పుట్టిన పిల్లాడు అక్రమ సంతానం కాబోలు అని మనం అంటే యెట్లా ప్రతిస్పందిస్తారు?క్రైస్తవ మతంలో ఉండి హిందూ పురాణాల్ని అపహాస్యం చేసే ఐలయ్య గారూ ఆయన అభిమానులూ అబ్రహాము ద్వారా కాకుండా దేవదూత వల్ల పుట్టిన యేసు అక్రమ సంతానం అని ఒప్పుకోగలరా?వారి వారి మతాల్లో వున్న హేతువిరుధ్ధమైన విషయాలు వారికెంత ప్రీతిపాత్రమో హిందువులకీ అంతే కదా అని యెందుకు అనుకోరు,హిందువులు వాజెమ్మల వలె ఇట్లాంటివి నిగ్గదియ్యటం లేదు గనకనా!ఈ స్వైరిణీ స్వైరిణి అభిమానులూ తాము హేతువాదులమనీ ఈ కధలన్నీ హేతువిరుధ్ధంగా అన్యాయంగా వుండటం వల్లనే విమర్శిస్తున్నామని చెప్పుకుంటున్నారు గాబట్టి ఇంత అరిభీకరంగా అన్ని మతాల్నీ వెక్కిరించగలరా!

       తనకి అర్ధం కానివన్నీ తప్పులని విర్రవీగితే మరోసారి చావుతిట్లు తినాల్సి వస్తుంది స్వైరిణి,అయినా పాప్యులారిటీ కోసం యెంత చవకబారు పన్లు చెయ్యటానికైనా దిగజారేవాళ్లని యెన్ని తిట్టినా యేముంటుంది - వొదిలెయ్యటమే కాకికేమి తెలుసు సైకోఅనాలిసిస్ అని!ఈ స్వైరిణిపాదరేణువు మహాభక్తిగా విశేషభాగాలు అంటూ ప్రచురించిన వాటిని బట్టే నాకు ఈ తుక్కుపుస్తకం వల్ల మహాభారతానికి యెలాంటి ప్రమాదమూ రాదని అర్ధమై పోయింది,ఇంకెందుకు ఆందోళనతో కూడిన హైరానా?!


దీంతో ఆగకుండా మొత్తం పుస్తకాన్నే ప్రచ్రురిస్తే కానీ ఖర్చు లేకుండా చదివి నవ్వుకుంటా!

7 comments:

  1. ఎలోక్వెంట్ ! బావుందండీ.
    అం'తరంగం'

    ReplyDelete
  2. Will Durant’s indictment of Raj atrocities is republished . The book was first published in 1930. It was banned in the United Kingdom

    Bangalore: “I have seen a great people starving to death before my eyes, and I am convinced that this exhaustion and starvation are due not, as their beneficiaries claim, to over-population and superstition, but to the most sordid and criminal exploitation of one nation by another in all recorded history.”

    “The book talks about the brutality and criminality of the British Raj. I had tears in my eyes when I read it. I took photocopies of the book and distributed them to my friends. I wanted more people to read it,” T.V. Mohandas Pai said.

    http://www.thehindu.com/todays-paper/tp-national/tp-karnataka/i-want-more-people-to-read-it/article1969467.ece

    ReplyDelete
    Replies
    1. నిజమే శ్రీరాం గారూ,ఇదంతా ఇంగ్లీషు వాళ్ళు చేసిన ప్రాపగాండా!అంతకన్నా దారుణం స్వతంత భారత ప్రప్రధమ ప్రధాని హోదాలో ఒక భారతీయుడు చేసిన ద్రోహమే యెక్కువ,పధ్ధెనిమిదేళ్ళు డైరెక్తుగా మోసం చేశాడు, ఆ తర్వాత ఇన్నేళ్ళూ ఇండైరెక్తుగానూ ఈ జాతిని మోసం చెయ్యగలుగుతున్నాడు,జనం యెప్పటికి తెలుసుకుంటారో?

      Delete
  3. Hari baabu,

    You can down load this book from below website

    http://www.vifindia.org/ebook/1930/the-case-for-india

    ReplyDelete
  4. Pls watch these videos. You will get clear picture about language,music and sound. Do not miss it.
    Vedic Perspective on Acoustics by Dr.Prasad M G

    https://vimeo.com/32063009

    https://www.youtube.com/watch?v=H40vzfq7GuY

    http://www.durvasula.com/Taranga/vedic_acoustics.pdf

    http://www.taranga.us/

    ReplyDelete
  5. Shiva Ayyadurai inventor of email, MIT
    http://vashiva.com/

    Va Shiva Ayyadurai- Sages and Scientists 2013
    https://www.youtube.com/watch?v=48cOqDRz_tg

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...