Tuesday 25 November 2014

కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (జవహర్ లాల్ నెహ్రూ)

ఈ దేశంలోని ప్రతి రేణువు లోనూ రామపాద స్పర్శ వుండాలని కోరుకుని ఇక్కడ సీత కూర్చుంది,ఇక్కడ రాముడు మారీచుణ్ణ్ణి చంపిన బాణాన్ని కడుక్కున్నాడు అని తమ తమ ప్రాంతాల్ని రాముడితో అనుసంధానించుకునే ప్రజలకి ఒక స్రీలోలుడు యెలా ప్రతినిధి అయ్యాడు?ఇక్కడి ప్రజల సంస్కృతీ సాంప్రదాయాల్ని గౌరవించని వాడు ఇక్కడి ప్రజలకు తిరుగులేని నాయకుదు యెట్లా అయ్యాడు!తన మంత్రివర్గ సభ్యుడూ యుధ్ధాన్ని పర్యవేక్షిస్తున్న రక్షణ మంత్రీ అయిన సాటి దేశభక్తుడు నేనిక్కడ శత్రువుని తరిమి కొడుతున్నాను సమస్య పరిష్కారమైపోతుంది ఒక్కరోజు ఆగమన్నా ఆగకుండా పనిగట్టుకుని కాశ్మీరును వివాదంగా మార్చి అంతర్జాతీయ ప్రమేయానికి దఖలు పర్చేసి అనంత కాలం వరకూ పరిష్కరించలేని పీటముడిగా తయారు చెయ్యటం వెనుక తన ప్రియురాలైన - ఆ శీలవతి కూతురు కూడా అంగీకరించిన - ఒక విదేశీ వనిత ప్రమేయం వున్నదని తెలిశాక కూడా అతన్ని దేశభక్తుడని కీర్తించడం ఈ దేశాన్ని ప్రేమించే వాడెవడయినా చెయ్యదగ్గ పనేనా?




స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధానికి మొదటి గవర్నరు జనరల్ గా నిన్నటిదాకా తామంతా ఈ దేశం నుంచి యెవర్ని తరిమి కొట్టాలని అంత పోరాటం చేశారో ఆ ఇంగ్లీషువాడు తప్ప భారతీయుడెవడూ పనికి రాలేదా? తన ప్రియురాలితో మరికొన్ని రోజులు కులకాలన్న ఆరాటం తప్ప మిగిలిన ఇంగ్లీషు వాళ్ళంతా యెప్పుడో తట్టాబుట్టా సర్దుకుపోయినా ఆ ఒక్క ఇంగ్లీషువాణ్ణి ఇంకా ఇక్కడే వుంచడానికి కారణ మేమిటి? కొత్తగా స్వతంత్రం తెచ్చుకుని దేశం సక్షోభంలో కూరుకుపోయిన సమయంలో ఈ దేశభక్తుడు తీరిగ్గా ఇంగ్లీషు రాజుకు "Your Highness" అని సంబోధిస్తూ తను వుంచుకున్నదాని మొగుడు అయిన మౌంటు బాటము గారికి సర్ బిరుదు తక్కువయిందనీ అది ఇవ్వవలసిందనీ వుత్తరాలు రాస్తూ గడిపాడని యెవరికయినా తెలుసా? ఇంగ్లీషు రాజే అసలు వూడగొట్టిన నాగటి దుంప!పైన ఒక సామంతుడు చక్రవర్తిని సంబోధించినట్టుఈ విదేశీ భావజాలపు బానిస చేసిన సంబోధన? ఆ వుత్తర మేదో ఆ దేశ ప్రధాని చేతిలో పడివుంటే అప్పుడే భారత ప్రధాని పిచ్చిపుల్లయ్యతనాన్ని ప్రపంచానికి పెద్ద జోకులాగా చెప్పి పరువు తీసి వుండేవాడు!!




ఈ దేశపు స్వాభిమానానికి ప్రతీక అయిన వందే మాతర గీతం జాతీయ గీతం కాకుండా చెయ్యాలని సభలోనే వున్న ఆదర్శవంతులయిన ముస్లిము సభ్యులు కూడా ఆమోదిస్తున్నా బజారు వెధవల్ని సంతోష పెట్టాలని - ప్రధానిగా వున్నందుకు కనీసం తటస్థంగా నన్నా వుండకుండా - తనే మిగిలిన వాళ్ళకి రాని వంకల్ని కూడా పెట్టి వ్యతిరేకించిన వాణ్ణి కూడా దేశభక్తుడు అని అంటున్నారే, ఇక దేశద్రోహులు యెవరండీ?! మహోన్నతమయిన బావ పరంపరతో సమున్నతంగా నిలబడి యెక్కడయినా ప్రధమ స్థానంలో నిలబడాల్సిన మంత్రగీతాన్ని దాని కాలిగోటికి కూడా సరిపోలని ఒక మామూలు రణగొణ పాట కిందకి దించి రెండో స్థానానికి దిగజార్చుతుంటే చేష్టలుడిగి నిల్చున్నారు అప్పటి దేశభక్తులంతా ఈ గాడిదని ప్రధానిని చేసి! ఇవ్వాళ రహమాన్ అనే సచ్చా ముసల్మాన్ "మా తుజే సలాం" అని గొంతు నిండుగా గానం చేస్తే యే గాడిద అడ్డం పడ్డాడు? బిస్మిల్లా ఖాన్ నాదస్వరంలో పలికించిన "వాతాపి గణపతిం భజేహం" లోని సంస్కృత పదాల కన్నా ఘోరమైనవా వందే మాతరం లోని సంస్కృత పదాలు!వందే మాతరం పాడొద్దని చెప్పిన ప్రవక్త "వాతాపి గణపతిం భజేహం" గురించి చెప్పడం మర్చిపోయాడా? "మూర్ద్నివా సర్వలోకస్య శీర్యతే వనయేవవా" అనేది నమ్మే నాలాంటి క్షాత్రం గలవాడు యెవడయినా ఆనాడు వుండి వుంటే, "చీ! ఆ రెండో స్థానం మాత్రం దేనికి?యెవడికి గౌరవం వుంటే వాడే పాడుకుంటాడు!" అని ఆ రెండో స్థానానికి కూడా యెట్టి పరిస్థితి లోనూ ఒప్పుకుని వుండేవాడు కాదు?!




1889 నవంబర్ 14న కాశ్మీరు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మోతీలాల్ నెహ్రూ అనే ఒక సంపన్న బారిస్టరుకు ప్రధమ కుమారుడుగా జవహర్ లాల్ నెహ్రూ జన్మించాడు. తల్లి స్వరూపరాణి కూదా లాహోరు లో స్థిరపడిన  సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందినదే. బాల్యంలో చెప్పుకోదగిన సంఘటన లేమీ జరగక పోయినా పంతుళ్ళే ఇంటికొచ్చి చదువు చెప్పే వైభవోపేతమయిన జీవితంతో పెరిగి పెద్దవాడయ్యాడు! తండ్రి మోతీలాల్ రాజకీయ వ్యాసంగంలో చురుగ్గా వుంటూ భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి రెండుసార్లు అధ్యక్షుడిగా పని చేశాడు! ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన 1912లో లండన్ నుంచి బారిస్టరు గిరీ పూర్తి చేసుకుని రాగానే పేరుకి అలహాబాదు హైకోర్టులో బారిస్టరుగా నమోదు చేసుకున్నాడు గానీ దానికన్నా రాజకీయాలే సుఖంగా అనిపించడంతో పాట్నా కాంగ్రెసు మహాసభకు హాజరై అక్కడి నుంచీ తొలి తరం వారసత్వ రాజకీయపు వైభవం యొక్క ప్రదర్శన మొదలు పెట్టాడు!




ఇతనికి అప్పటి కాంగ్రెసు "కొద్దిగా ఇంగ్లీషులో ప్రవేశమున్న వున్నత కులీనుల సమూహం యొక్క హడావిడి వ్యవహారాలు"గా కనబడినప్పటికీ, కాంగ్రెసు యొక్క ప్రభావశీలత్వం పైన సందేహాలు వున్నప్పటికీ పార్టీ కార్యకలాపాల్లో - అంటే, మోహన దాసు గాంధీ నడుపుతున్న పౌరహక్కుల ప్రచార కార్యక్రమాలకి చందాలు పోగెయ్యటం లాంటివాటిల్లో మనస్పూర్తిగానే పాల్గొన్నాడు? తను కూడా ప్రచార సభల్లో పాల్గొన్నాడు.1914లో ప్రధమ ప్రపంచ యుధ్ధ ఫలితం భారత దేశంలోని మేధావుల్లో మిశ్రమ స్పందన కలిగించింది. కొందరు ఇంగ్లీషు వాళ్ళకి నడ్డివిరిగి కూలబడటాన్ని చూడటం ఆనందాన్ని కలిగిస్తే మరి కొందరు ఇంగ్లీషువాళ్ళతో తమకున్న అనుబంధం వల్ల విచారించారు! నెహ్రూ మాత్రం ఫ్రాన్సు పైన సానుభూతి చూపించాడు ఆ దేశపు సంస్కృతిని ఆరాధించే వాడు గనక!పుట్టిన దేశపు సంస్కృతిని తప్ప అన్ని దేశాల సంస్కృతుల్నీ ఆరాధించిన ప్రమాదవశాత్తూ హిందువైన ఇతడికి హిందూ ధర్మం మాత్రం దేశంలో వుండదగనిదిగా కనిపించింది? ఆఖరికి మూకుమ్మడి దొమ్మీలని పశుబలంతో గెలవడం తప్ప ఇంకేమీ లేని చెంగిజ్ ఖాన్ తైమూరు లంగ్ లాంటివాళ్ళలో కూడా ఇతనికి అధ్బుతమయిన నాయకత్వ లక్షణాలు కనిపించాయి? ఇంకా పార్టీ స్థాయిలో మాత్రం "స్వాతంత్ర్యాన్ని గూర్చి వూహించటమే పిచ్చితనం" అని భావించే గోపాల కృష్ణ గోఖలే లాంటి మితవాదుల ప్రభావం బలంగానే వున్నప్పటికీ ఈ యుధ్ధానంతర రాజకీయాల్లో రాడికిల్స్ అనే గ్రూపులో చేరిపోయి విజృంభించటం మొదలు పెట్టాడు .




తను కూడా మితవాదే అవటం వల్ల తండ్రి బాబూ వేరే "ప్రాక్తికల్ ఆల్టర్నేటివ్" లేదురా అని ప్రైవేటు చెప్పినా వుద్యమం మరీ అంత నెమ్మదిగా కదలడాన్న్ని భరించలేక "హోం రూల్" కోరుకునే అతివాదుల్లో కలిసిపోయాడు ఖాజీ సాయిబు గారు తురకల్లో కలిసిపోయినట్టు:-) 1915లో గోఖలే గారు కీర్తిశేషుడవటంతో తిలక్, అనీబిసెంటు లాంటి వాళ్ళంతా యెంత గట్టిగా హోం రూలు కోసం ప్రతిపాదించినా అంతటి భయంకరమయిన ప్రతిపాదనని తక్కిన మితవాదులు నిర్ద్వందంగా తిరస్కరించెయ్యటంతో అది వీగిపోయింది. అతివాదులు కూడా మొండికెత్తి అనీబిసెంటు ఒకటీ తిలక్ గారు ఒకటీ హోం రూల్ లీగుల్ని పెట్టి సమాంతరంగా పోరాడటం మొదలు పెట్టారు.నెహ్రూ రెంటిలోనూ సభ్యుడయినా అనీబిసెంటు తోనే యెక్కువగా తిరిగాడు. ఇదే సమయంలో జరిగిన మరొక ముఖ్యమయిన విశేషం నెహ్రూకి బాగా లాభించింది!అదే 1916   దెసెంబరులో లక్నో ఒప్పందం పేరుతో భారత జాతీయ కాంగ్రెసుకూ ముస్లిం లీగుకూ మధ్యన జరిగిన "హిందూ ముస్లిం ఐక్యతా ఒప్పందం". దీని సూత్రధారి రెంటిలోనూ సభ్యుడై హోం రూల్ వుద్యమంలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్న మహమ్మదాలీ జిన్నా! ఈ లక్నో ఒప్పందానికి కర్తా కర్మా క్రియా అన్నీ జిన్నానే, అందుకే సరోజినీ నాయుడు "the Ambassador of Hindu-Muslim Unity" అని ఇతన్ని ప్రశంసించింది.




ఇందులో బెంగాలు విభజన అనంతరం పలుకుబడి తగ్గిన ముస్లిము లీగుకి మళ్ళీ గౌరవనీయత పెంచడం అనే వ్యూహం దాగి వుంది! అసలు ముస్లిము లీగు మొదట కాంగ్రెసు పేరుతో హడావిడి చేసే హిందూ గుంపు నుంచి రక్షణ కోసం రాణికి విధేయంగా వుండే వుద్దేశంతో పుట్టిందని మొదటి భాగంలో తెలుసుకున్నాం కదా! కానీ ఇంగ్లీషు వాళ్ళు ఖలీఫా పట్ల వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది ఇంగ్లీషువాళ్ళకి దూరంగా జరగాలనుకోవడం కూడా కలిసొచ్చింది? ఈ మొత్తం ప్రక్రియకీ నెహ్రూకీ వున్న సంబంధం యేమిటంటే ఈ ప్రతిపాదన ఆనంద భవన్ లో "All-India Congress Committee" నుంచి ఒక సూచనగా మొదలవటం!




ఈ మలుపు తర్వాత నెహ్రూ మాట్లాడిన ప్రతి పలుకూ వేసిన ప్రతి అడుగూ హిందూ ముస్లిం సమైక్యతా పరిరక్షకుడిగా జిన్నా స్థానాన్ని ఆక్రమించడానికే!అందుకోసం ఇతడు హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడేటంతగా దిగజారి పోయాడు. ఈ దేశం నుంచి విడిపోయి తన కొక దేశాన్ని సాధించుకున్న జిన్నా యేనాడయినా ఈ దేశపు సంస్కృతినీ హిందూత్వాన్నీ అవమానించాడా? నాకు తెలిసినంత వరకూ మీ హిందువుల వల్ల మా ముస్లిములకి ప్రమాదం అని సైధ్ధాంతికంగా వాదించటం తప్ప పరుషమయిన భాష వాడలేదు. ఒకవేళ వాడినా అతడు హిందువు కాదు గాబట్ట్టి తెలియక అన్నాడని క్షమించ వచ్చు!. ఒక హిందువు "భారత దేశంలో మతం పేరుతో ప్రచలితమవుతున్న దంతా, సంస్థాగతమయిన నిర్మాణం కలిగినవన్నీ నన్ను ఆగ్రహావేశాలకు గురి చేస్తున్నాయి, చాలాసార్లు నేను దీన్ని వ్యతిరేకించాను, నేను దీన్ని పూర్తిగా వూడ్చి పారెయ్యాలనుకుంటున్నాను. ఈ మతాన్నీ సంస్కృతినీ పూర్తిగా నాశనం చెయ్యాలనుకుంటున్నాను. ఇది గుడ్డి నమ్మకాలకీ, పరపీడన పరాయణత్వానికీ చిహ్నంగా నిలబడి వుంది" అని ప్రకటించగలిగాడంటే - ఆలోచించండి?! తేనెటీగ పువ్వుల మీద వాలి మకరందాన్ని తయారు చేసి ఆనందాన్ని కలిగిస్తుంది. పోతుటీగ శ్లేష్మం చేత  ఆకర్షించబడి దానిలో ముంచిన పాదాలతో మన మీద వాలుతూ అసహ్యాన్ని కలిగిస్తుంది. మాక్స్ ముల్లర్ లాంటి విదేశీయులకి గొప్పగా కనిపించిన హిందూ ధర్మంలో ఇతనికి ఇవే కనబడినాయన్న మాట? ఈ దేశాన్ని గురించి తెల్సుకోవడానికి విదేశీయులు  "ఇండాలజీ" అనే ఒక శాస్త్రాన్ని యేర్పాటు చేసుకుంటే ఈ దేశంలో పుట్టిన ఈ మనిషికీ ఇతని మార్గంలో నడిచే ఇతరులకీ ఈ సనాతన ధర్మం సిగ్గుపడదగినదిగా కనిపించిందన్న మాట! విజ్ఞత గలవాడు తను పాటించే ధర్మంలో తప్పు లుంటే అందరితోనూ చర్చించి సంస్కరించి మరింత గౌరవప్రదంగా నిలబెట్టాలని చూస్తాడే తప్ప ఇతనిలా ద్వేషిస్తాడా?ఈ మొత్తం నాటక మంతా జిన్నా కన్నా తనే ముస్లిం పరిరక్షకుడిగా యెదగటానికి చేసిన దిగజారుదు రాజకీయమే తప్ప అతని మాటల్లో గంభీరమయిన తాత్విక చింతనతో కూడిన విమర్శనాత్మక దృక్పధం నాకయితే యెక్కడా కనబడ లేదు?




చౌరీ చౌరా సంఘటన తో మోహన దాసు హఠాత్తుగా అన్ని కార్యక్రమాల్నీ ఆపెయ్యడాన్ని మిగతా వాళ్ళందరికన్నా యెక్కువగా వ్యతిరేకించినప్పటికీ తండ్రి మోతీలాలుతో సహా అందరూ బయటి కెళ్ళి స్వరాజ్ పార్టీని స్థాపించినా వాళ్ళతో వెళ్ళకుండా గాంధీని వదలకుండా అంటిపెట్టుకుని కూర్చున్నాడు? వ్యక్తిత్వంలో గానీ నాయకత్వ పటిమలో గానీ పార్తీకి మేలు చేసే యెత్తుగడలు వెయ్యటంలో గానీ ఇతని కన్నా అఖండులయిన వాళ్ళంతా అనేకానేక కారణాల వల్ల కాంగ్రెసుకి దూరమవడం వల్ల కలిగిన శూన్యం కారణంగా మోహన దాసు ఆశీస్సులతో యే చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షమన్నట్టు ఇతడు మర్రి చెట్టులా యెదిగిపోవటానికి తోడ్పడింది.




ఈ దేశ విచ్చిత్తికి కారకుడయిన వాడిగా జిన్నాను అపార్ధం చేసుకుంటారు గానీ ముస్లిములకు రక్షకుడిగా యెదగటం కోసం నెహ్రూ చేసిన ద్విముఖవిషప్రచారం - "హిందూ నాయకు లందర్నీ వీలయినంత మతమౌఢ్యం గలవాళ్ళుగా చిత్రించటం, హైందవేతరులు దుర్మార్గు లయినా సరే అపార్ధాలకి గురయిన వాళ్ళుగా చిత్రించటం"  వల్లనే ముస్లిములలో అంతగా భయాందోళనలు రగిలాయనేది యెంతో నిశితంగా పరిశీలించి చూస్తే తప్ప అర్ధం కాని విషయం! అప్పటికే ద్విజాతి సిధ్ధాంతం ప్రచారంలో వున్నా జిన్నా మొదట్లో దేశ విభజన వైపుకి అంత తొందరగా అడుగులు వెయ్యకుండా నిగ్రహంగానే వున్నాడనేదీ, దేశాన్ని విడిపోకుండానే వుంచి హిందూ ముస్లిం ఐక్యత కోసమే కృషి చేశాడనేదీ తెలిస్తే గానీ యెవరు నిజమైన ద్రోహులో తెలియదు!


1928 నాటికి గాంధీని ఒప్పించి "dominion status" ప్రకటన చేయించగలిగాడు నెహ్రూ. రెండు సంవత్సరాల లోగా భారత్ కు "dominion status" ఇవ్వకపోతే ఇక కాంగ్రెసు "complete independence" పిలుపు నిస్తుందనేది నెహ్రూ ప్రమేయంతో మోహన దాసు చేసిన ఆ బెదిరింపు సారాంశం! రెండు సంవత్సరాలు కూడా యెక్కువే ననిపించి మళ్ళీ తనే పూనుకుని గాంధీని ఒప్పించటంతో ఆ పరిమితి సంవత్సరానికి కుదించబడింది? ఇదివరకటి అన్ని దిమాండ్ల లాగే దీన్ని కూడా పట్టించుకోలేదు బ్రిటిషు వాళ్ళు. దానితో తానే అధ్యక్షత వహించి 29 డిసెంబర్ 1929లో "పూర్ణ స్వరాజ్" పిలుపు నిచ్చాడు. ఈ లాహోరు కాంగ్రెసు మహా సభ తర్వాత గురువు క్రమంగా వెనక్కి తగ్గి శిష్యుడికి దారి ఇవ్వడంతో 1935లో యేర్పడిన అర్ధంతర ప్రభుత్వాల నాటికి నెహ్రూ దుర్నిరీక్షమయిన మహానేతగా యెదిగాడు.


1930ల్లోనే రెండుసార్లు కలాత్తా మేయరుగా యెన్నికై పాలనా సంబంధమయిన విషయాల్లో అధ్బుతంగా రాణించిన సుభాష్ చంద్ర బోసు ఇతనికన్నా యెన్నో విధాల సమర్ధుడు. అయినా సరే అంతర్గత ప్రజాస్వామ్య సాంప్రదాయం ప్రకారం అఖండమయిన మెజార్టీతో పార్టీ అధ్యక్షుడిగా బోసు యెన్నికవడాన్ని జీర్ణించుకోలేక గురు శిష్యులిద్దరూ ఆ ఓటమిని అక్రమ పధ్ధతుల్లో గెలుపుగా మార్చుకున్న సన్నివేశం లోనే కాంగ్రెసు అప్పటికీ ఇప్పటికీ నైతికతకి యెంత గొప్పగా కట్టుబడుతుందో తెలిసిపోతుంది. ఆ ఇద్దరూ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అత్యున్నత ఆదర్శాలకి కట్టుబడిన వాళ్ళయితే బోసు రాజీనామా చేసి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి వుండేది కాదు. వాళ్ళే పార్టీ పదవులకి రాజీనామా చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళే వాళ్ళు!




1937లో "provincial states" నాటికే నెహ్రూ కాంగ్రెసు పార్టీలోనూ దేశపు సామాజిక రంగస్థలం మీదా ఒక ప్రజాసామ్య ప్రభువుగా అవతరించేశాడు?! అప్పటికే ప్రజలకి "కాంగ్రెసు అంటే ప్రభుత్వం" అని అర్ధమై పోయింది. పరిస్థితి యెలా వుందంటే, "కాంగ్రెసు యేం చెప్తే అదే శాసనం. నెహ్రూ యేం చెప్తే అదే కాంగ్రెసు చెప్తుంది.". అప్పటి నెహ్రూ వైభవాన్ని చూసి రష్యా వాడు కృశ్చేవ్ "Democratic Dictator" అనే బిరుదు కూడా ఇచ్చేశాడు!ఈ "provincial states"లో మత ప్రాతిపదికన హిందువులకీ ముస్లిములకీ ప్రత్యేక నియోజక వర్గాలు యేర్పాటు చెయ్యడానికి ఒప్పుకున్న మోహన దాసు దళితుల దగ్గిర కొచ్చేసరికి మాత్రం అరిభీకరంగా వ్యతిరేకించేశాడు! అప్పటి నుంచీ ఇప్పటి వరకూ గొప్పగా అనిపిస్తున్న ఈ కుహనా సెక్యులరిజంలో వున్న అసలైన మడత పేచీ ముస్లిములని ప్రధాన జీవన స్రవంతిలో కలవనివ్వకుండా చెయ్యటమే! హిందూ ముస్లిములని విడి విడిగానే వుంచి అవసరమయినప్పుడు కలుపుతూ మిగతా అప్పుడు విడిగా వుంచుతూ ఆడిన దొమ్మరాటలు వాస్తవంలో వ్యతిరేక ఫలితాన్నే ఇచ్చింది? నిజానికి ముస్లిముల్ని ప్రొత్సహించటానికి రాజమార్గం కాంగ్రెసులోనే చేర్చుకుని వారి వారి వుద్యమ స్పూర్తిని బట్టి పార్టీలో వున్నత స్థానానికి యెదిగేలాగా సహకరించటం చెయ్యాలి, కానీ ఆ తెలివయిన అభిప్రాయంతో ముస్లిము లీగుకి పోటీ పెడదాం, యెన్నికల్లో వోడిద్దాం అని చెప్పిన వాళ్ళు హిందూ మతతత్వ వాదులుగా ముద్ర వేయించుకున్నారు, అటు వేపు వున్న గాలి వెధవల్ని సంతృప్తి పరిచే వాళ్ళు ఆదర్శ నేత లయ్యారు. ఆ ప్రతిపాదనలు చేసిన వారికే వీళ్ళ కున్నవాళ్ళ కన్నా యెక్కువ మంది ముస్లిము స్నేహితులు వున్నారు! ఈ రకంగా హిందువులు ముస్లిములు విడివిడిగా వుండటం బాగా లాబించింది ఇంగ్ల్లీషు వాళ్లకే - "విభజించు - జయించు" అనే చాణక్యనీతిని మన మీదకే వొదలటానికి తోడ్పడింది!




1929-31 మధ్యలో ఇవ్వాళ మనం ఆదేశిక సూత్రాలుగా రాజ్యాంగంలో చదువుతున్న వున్నతాదర్శాల్ని - మత స్వేచ్చ,వాక్ స్వాతంత్ర్యం,భావ స్వాతంత్ర్యం,కుల మత వర్ణ ప్రాంతాల కతీతంగా చట్ట పరమయిన సర్వ సమానత్వం, మద్యపాన నిషేధం, అస్పృశ్యతా నిరోధం, భారత్ ను సోషలిష్టు మరియు సెక్యులరు దేశంగా నిలబెట్టటం వంటి కలగాపులగం కబుర్లన్నమాట - వండి వార్చేశాడు. తీరా తినడానికి కూర్చునేసరికి కొందరికి మింగుడు పడలేదు పాపం! అటు ముగ్గురూ ఇటు ముగ్గురూ చేరి ఆరుగురు ప్రముఖ నాయకులూ దాంతో కాలిబంతాట ఆడేసుకున్నారు! కుడి-రెక్క వాటంతో సర్దార్ వల్లభాయ్ పటేల్, డా.రాజేంద్ర ప్రసాద్, చక్రవర్తుల రాజగోపాలాచారి ఆడితే యెదమ-రెక్క వాటం గాళ్ళు సుభాష్ చంద్ర బోసు, మౌలానా ఆజాద్ సాయంతో నెహ్రూ ఆడాడు. సర్వశక్తులూ ఒడ్డి 1936లో డా.రాజేంద్ర ప్రసాద్ ని దించేసి తను అధ్యక్షుడై సామ్యవాద భావజాలానికి  మరింత వూపును తీసుకొచ్చాడు. ఇతని కన్నా అన్ని విధాలా సమర్ధుడయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో బోసు బయటికి వెళ్ళిపోవటం అప్పటి పరిస్థితుల్లో అడ్డు లేకుండా నడిచింది. స్వాతంత్ర్యానంతరం గాంధీ దుర్మరణాన్ని తన చేతగానితనంగా భావించుకుని కుంగి పటేల్ దూరమవడంతో తర్వాతి రాజకీయాల్లో అడ్డు లేకుండా జరిగిపోయింది. అదృష్టం తన్నాల్సిన చోట తంతే ప్రజాస్వామికంగా కూడా నియంతృత్వం వెలగబెట్టవచ్చుననే దానికి ఇతడే ఒక గొప్ప వుదాహరణ!




అప్పటిదాకా పైకి చెప్పకపోయినా గాంధీ వారసుడుగా అందరూ వూహిస్తున్న నెహ్రూని 1941 జనవరి 15న రాజాజీ కాదు, నెహ్రూయే నా వారసుడు అని గాంధీ ప్రకటించటంతో అధికారికంగా యువరాజ పట్టాభిషేకం జరిగిపోయింది!1942 ఆగస్టు 8న గాంధీ మొదటి సారి తీవ్రమయిన భాషతో క్విట్ ఇందియా తీర్మానాన్ని ప్రవేశ పెట్టాడు. భాష యెప్పుడయితే అంత తీవ్రంగా వుందో వెంఠనే ఇంగ్లీషువాళ్ళు మొత్తం నాయకు లందర్నీ ఖైదు చేసేశారు.ఇలా కాంగ్రెసు నాయకులంతా జైళ్ళలో వుండటం జిన్నా నాయకత్వం లోని ముస్లిం లీగుకి విపరీతమయిన ప్రోత్సాహాన్ని ఇచ్చింది! 1943 ఏప్రిలు కల్లా అప్పటిదాకా వాస్తవదూరంగా వున్న ప్రత్యేక దేశం చాలా దగ్గిర కొచ్చేసిందన్నంత బలాన్ని పెంచుకోవడం కేవలం కాంగ్రెసు నాయకుల అరెస్టు వల్లనే సాధ్యపడింది? కానీ కాలం గడిచే కొద్దీ సామాన్యులైన ముస్లిములకి గూడా జైళ్లలో వున్న కాంగ్రెసు నాయకుల పైన సానుభూతి పెరగడం, 1943-1944ల మధ్యన విరుచుకు పడ్ద బెంగాలు కరువు ముస్లిము లీగు ప్రభుత్వం ఖాతాలో పడటంతో ముస్లిము లీగు యెంత వేగంగా ప్రాభవం పెంచుకుందో అంత వేగంగానూ అపఖ్యాతికి గురయింది. జిన్నా అయితే పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకుని కాశ్మీరులో సెటిలయిపోయాడు! మరింత నాటకీయంగా 1944 మే లో అనారోగ్య కారణాలతో జైలు నుంచి విడుదలయి వచ్చిన మోహన దాసు ఈ శవానికి మళ్ళీ ప్రాణం పోశాడు?




ఈ మేధావి పనిగట్టుకుని అక్కడ కూసిందేమిటంటే యుధ్ధానంతరం ముస్లిములు అధికంగా వున్న ప్రాంతాల్లో ప్లెబిసైటు పెడదాం వాళ్ళు దేశం నుంచి విడిపోదామని అనుకుంటున్నారా లేదా అని తేలుచుకోవడానికి అని - మాటల్లో చెప్పకపోయినా అది పాకిస్తానుకు ఒప్పుకోవటమే, అదీ జిన్నా పరువు పోగొట్టుకుని దాని గురించి ఆశలుడిగి కూర్చున్న సమయంలో! జిన్నా వెంటనే చురుగ్గా కదిలి నాకలా కుదరదు పాకిస్తాను యేర్పాటుకు నికరమయిన హామీ కావాలనటంతో కధ అడ్డం తిరిగింది. బూదిని వూది నిప్పు రగిలించటం కోసమే జరిగినట్టు గాంధీ జిన్నాను కలిసిన ఈ సంఘటన దారా షికో పతనం తర్వాత ఈ దేశ చరిత్ర తిరగకూడని మలుపు తిరిగిన మరో దుర్ఘటన!? దాంతో జిన్నా రెట్టించిన బలంతో కదిలి అతి వేగంగా తన పూర్వపు ప్రాభవాన్ని సమకూర్చుకుని అసాధ్యమనుకున్న తన పాకిస్తాను కలని సుసాధ్యం చేసుకున్నాడు!


ఆ విధంగా ఈ దేశపు రాజకీయ రంగస్థలం మీద విధి ప్రదర్సించిన మహా నాటకం లోని పాత్రధారు లంతా యెవరి పాత్రల్లో వాళ్ళు స్థిరంగా కుదురుకోగా  1947 జూన్ 3న బ్రిటిష్ ప్రభుత్వం తొలిసారి విదుదల చేసిన ప్రణాళిక తో మొదలై 1947 ఆగష్టు 15తో శత్రు దేశపు  ప్రభుత్వం మధ్యవర్తిత్వం లోనే రెండుగా చీలుతూ స్వతంత్ర దేశంగా అవతరించింది మన భారత దేశం!మనకు చేసిన ద్రోహాలకి కత్తికో కండగా నరకాల్సిన శత్రువుని ఆత్మబంధువును సాగనంపినట్టు క్షేమంగా రేవులు దాటించి ఆత్మబంధువులుగా కలిసి మెలిసి బతకాల్సిన వాళ్ళు కుత్తుక లుత్తరించుకునే విధంగా ఆవిర్భవించినది శుభవేళ యెలా అవుతుందో నాకిప్పటికీ అర్ధం కాదు? పాలు పొంగించి గృహప్రవెశాలు చేసే సాంప్రదాయం గల భారత జాతి నవశకానికి వేసిన తొలి అడుగులో తగలబడుతున్న గృహాలని చూసింది, శవాల గుట్టల మధ్య నుంచి నడిచింది! మాతృభారతిని పంచామృతాలతో అభిషకించాల్సిన శుభవేళ జ్ఞాతి కలహాల నుంచి యెగసిపడిన రక్తనదీప్రవాహాలతో అభిషేకించాము - అది యేమి స్వాతంత్ర్యం?! శాంతికాముకుల మంటూ డప్పాలు కొట్టుకోవటమే తప్ప ఆ కలహాల్ని తగ్గించటానికి కళ్లముందు కొచ్చిన బంగారం లాంటి అవకాశాల్ని కాలదన్ని అప్పటి నాయకులు మూర్ఖంగా ప్రవర్తించడం  వల్లనే అలా జరిగిందని యెంతమందికి తెలుసు?




మొన్నటి రోజున ఆ మనిషి వేరే దారి లేకనే అలా చెయ్యలేదనీ వాస్తవికంగా ఆలోచించే వాళ్ళు ఇది తప్పు భవిష్యత్తులో ప్రమాదాన్ని తీసుకొస్తుందని హెచ్చరించినా వినకుండా మొండిగా దూసుకెళ్ళడం వల్లనే నిన్నటి రోజున ఆనాడు వాస్తవికంగా ఆలోచించిన వాళ్ళు చెప్పిన భీబత్సాలు జరిగినాయనీ తెలిసిన తర్వాత కూడా ఇప్పటి రోజున కొందరు ఇతన్ని గొప్ప దార్శనికుడని పొగుడుతున్నారంటే వీళ్ళని యెలా అర్ధం చేసుకోవాలి? ప్రపంచంలోని యే దేశచరిత్రలోనూ తన దేశానికి ఇన్ని సమస్యల్ని సృష్టించిన దేశాధినేత మరొకడు లేడు? జనంతో చీత్కరించుకుని గెంటించుకున్నవాళ్ళకి గూడా మహా వుంటే ఒకటో రెండో, మన వాడా - యెక్కడ వేలు పెడితే అక్కడల్లా ఒక కుంపటి రగిలించాడు! అదీ యెప్పటికి ఆరతాయో తెలియని రావణ కాష్టాలు!? అన్ని తప్పులు చేసినా ఇతడికి ఇంకా చప్పట్లు పడుతున్నాయంటే అది అతని అదృష్టం! అన్ని తప్పులు చేసినా ఇతడికి ఇంకా చప్పట్లు కొడుతున్నారంటే అది ఈ దేశపు మేధావుల దేబెతనం!


రాజ్యాంగ రచన 1935లో మొదటిసారి మంత్రివర్గాల్ని యేర్పరచినప్పటి నుంచీ జరుగుతూనే వుంది. మొదట్లో బ్రిటిష్ ఇండియాకు బయట వున్న రాజ్యాలకి రాష్ట్రాల హోదా ఇచ్చేసే ఫెదరల్ రాజ్యాంగానికి అనుకూలంగా వుందేవాళ్ళు నెహ్రూ తప్ప మిగిలిన నాయకులందరూ. కానీ 1946కి వచ్చేసరికి అది కాస్తా నెహ్రూ మాట వేదవాక్కుగా చెల్లుబడి అయ్యే కాలం గనక  ఆ రాజ్యాల నన్నిట్నీ విలీనం చేసి రిపబ్లికన్ తరహాకు రాజ్యాంగం 180 దిగ్రీలు తిరిగి నిజాముని బలవంతంగా లొంగదీసుకోవడంతో సగం పూర్తయ్యింది. కానీ బలవంతంగా లొంగదీసుకోవటం వల్ల వాళ్ళని పూర్తిగా శాంతపర్చటానికి కొన్ని హక్కులూ భరణాలూ పేరుతో ఖజానా మీద అదనపు ఖర్చు కూడా వచ్చి పడటంతో 1971లో ఇతని కూతురు ప్రధానిగా 26వ సవరణతో ఆ రాజభరణాలను రద్దు చేశాకనే ఆ పని పూర్తయింది. అంటే తెలంగాణా ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన సైనిక చర్యకి ప్రధాన కారకుడు నెహ్రూయే అన్నమాట! అప్పుడు యెదురు తిరిగిన మిగతా వాళ్ళు కూడా 1935లో తమకి రాజ్యాంగం వాగ్దానం చేసిన న్యాయబధ్ధమయిన హక్కు కోసమే పోరాడారన్న మాట!


1935లో యేర్పడిన "provincial autonomy"తో యెర్పడిన ప్రభుత్వాల్లో నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెసు అత్యధిక స్థానాల్ని గెలుచుకుని ప్రజల ఆమోదంతో తిరుగులేని అధిపత్యాన్ని చూపించగా జిన్నా అధ్యక్షతన ముస్లిం లీగు చాలా దారుణంగా దెబ్బ తినేసింది.ఈ దశలో నెహ్రూ మౌలానా అజాద్ లాంటి వుదార వాదిని భారత ముస్లిములకి ప్రతినిధిగా ముందుకు తీసుకొద్దామని చూసినా మోహన దాసు ఇంకా జిన్నాయే భారత ముస్లిములకి ప్రతినిధి అనే భ్రమ నుంచి బయటికి రాకుండా జిన్నాకే ప్రాధాన్యత ఇస్తూ వుండటంతో అదీ కుదర లేదు?!


జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఈ దేశపు భవితవ్యాన్ని శాసించటం మొదలు పెట్టిన 1947 ఆగష్టు 15 తదాది మోహన దాసు హత్యకి గురయిన 1948 జనవరి 30 వరకు ఈ దేశంలో యేదో ఒక మూల విధ్వంస కాండ జరగని రోజంటూ లేదు. యాస్మిన్ ఖాన్ అభిప్రాయం ప్రకారం  మహా మేధావి అయిన పటేల్ చాతుర్యం కన్నా దార్సనికుడుగా పేరు గాంచిన నెహ్రూ సమర్ధత కన్నా గాంధీ చావు - రెండు వారాల పాటు నాటకీయంగా ప్రదర్శించిన విషాద భరితమయిన వాతావరణమే - ఆ భీబత్సాన్ని ఆపగలిగింది? బతికుంటే అప్పటికే మాట చెల్లుబడి తగ్గిపోవడంతో కొంతకాలం తర్వాత అనామకంగా హతమారి పోయేవాడు కాస్తా చచ్చి గోడమీదబొమ్మై ఇంతకాలం గుర్తున్నాడు?!




ఇతని పేరుమీద చెలామణిలో కొచ్చిన మిశ్రమ ఆర్ధిక విధానం కొన్ని శతాబ్దాలకు ముందే చాణక్యుదు చెప్పాడు - గనులు, నదులు,లాభసాటిగా వుండకపోయినా ప్రజలకి వుపయోగపడేవి అన్నీ ప్రభువే సొంతంగా పర్యవేక్షించాలి అని!ఇతను ఆర్ధిక సలహాదారుగా యెంచుకున్న మహలనోబిస్ బొమ్మా బొరుసా లెక్కలు తేల్చే ప్రాబబిలిటీ మేథమేటిక్సు పండితుడే తప్ప ఆర్ధిక శాస్త్రంలో యేమాత్రమూ పరిజ్ఞానం లేనివాడు!ఫెల్డ్మాన్ మరియూ మహలనోబిస్ అనే ఇద్దరిలో ఫెల్డ్మాన్ ఏలెక్ట్రికల్ ఇంజనీరు, మహలనోబిస్ గాలివాటం లెక్కల పంతులు!అంటే లెక్క ప్రకారం నడవాల్సిన ఆర్ధిక వ్యవహారాలతో పాచికలు విసిరే తరహాలో జూద మాడాడు!జూదంలో యేం జరుగుతుంది?పాచికలు అనుకూలంగా పడినంత కాలం అధ్బుతంగా గడుస్తుంది,అవి కాస్తా మొరాయించటం మొదలయినాక ఆటగాడు ఒక్కొక్క మెట్టుగా దిగుతూ సర్వ నాశన మయ్యే వరకూ వొచ్చే ఆటలో నైనా గెలుస్తానేమో ననే ఆశతో ఆడుతూనే వుంటాడు. అట్లాగే మన దేశపు విదేశీ మారక ద్రవ్యం తాకట్టు పెట్టాల్సి వచ్చే వరకూ మనకి ఈ మనిషి మనమీద రుద్దిన దరిద్రగొట్టు ఆర్ధికం మీద వ్యామోహం వదల్లేదు!




విదేశాంగ విధానాన్ని చాణక్యుడి షాడ్గుణ్యాన్నించి తీసుకుంటున్నానని చెప్పి మళ్ళీ అందులో తన పైత్యం కొంత కలిపి పంచశీల అని పేరు పెట్టి ప్రపంచం మీద వొదిల్తే భాయి భాయి అన్న చైనా మొదటి శీల వూడగొట్టేసింది 1962లో!మిత్రుడికి శత్రువు మనకూ శత్రువు అనే చాణక్యుడి సూత్రాన్న్ని పట్టించుకోకుండా చైనాకు నచ్చని దలైలామాకి ఆశ్రయ మిచ్చాడు! అప్పటి దాకా నిమ్మళంగా వున్నవాడు హడావిడిగా చైనా సరిహద్దుల్లో పటాలాల్ని దించడం మొదలెట్టాడు. దాంతో మండి వాళ్ళు కాల్పులు జరపటంతో మొదలయిన ఇండో - చైనా యుధ్ధం భారత సైన్యాన్ని శత్రువు కూడా జాలిపడేటంత పరమ దయనీయమయిన స్థితిలోకి నెట్టేసింది?! ఈ విధంగా అన్నివైపుల నుంచీ సమస్యలూ విమర్శలూ పెరిగిపోవటంతో రాజీనామాకి కూడా సిధ్ధపడి మళ్ళీ తమాయించుకుని, కనీసం సమర్ధించుకోవడానికి కూడా వీలివ్వనంత స్పష్టంగా కంటికి కనబడుతున్న తాను చేసిన తప్పులకు తానే వగచి వగచి కృశించి కృశించి నశించాడు 1964 మే 27న!




అంతటితో యెక్కడ అందమయిన ఆడది కనబడినా అమాంతం అక్కడ వాలిపోయి కావిలించుకుని పులకించిన పరమ పాషండాల ప్రదర్శన సమాప్తమై పోయింది!కానీ అంగారం లోనూ శృంగారం లోనూ ఇతని కన్నా రెండాకులు యెక్కువే చదివిన ఇతని కూతురు భారత దేశపు రాజకీయ రంగస్థలం మీద మహమ్మారిలా విరుచుకుపడి ఒక చీకటి కాలాన్ని సృష్టించింది?
________________________________________________________
1    2    3    4    5    6                                     (తేదీల వివరాలు:వికీ పీడియా,చిత్రాలపీటిక:గూగుల్)

17 comments:

  1. బాగుంది. ఈ టపా చదివాక, నేను నెహ్రూని కావలిసినంత భ్రష్టు పట్టించలేదేమో అని బెంగగా ఉంది. :)

    ReplyDelete
  2. Still u r incorrect in so many factors. Either u v omitted them or failed to recognize.

    ReplyDelete
    Replies
    1. Sorry?can you mention about incorrect factors!In fact I have omitted some of the things like Edwina affair,china war and others because, my main goal in all these sequels how the nation as whole effected by those individuals with their deliberate mistakes.

      I WAIT FOR YOUR CLARIFICATION ABOUT THE INCORRECT FACTORS SIR!

      Delete
    2. u v mistaken. there r so many other things also to be added to what u v told

      Delete
    3. So,there are no errors in current content - thanks!And would you mention the required things,i will try to update.

      Delete
    4. I was having document proof also till recently. Unfortunately lost in a system crash. Jinnaha is a Hindu convert to Islam. There is no sir name by Nehru in Kashmiri brahmins.

      Delete
    5. @sarma
      Jinnaha is a Hindu convert to Islam
      ?
      This is new to me!But I knew about his wife ratti, a hindu(may be that's the reason to have a hindu wife) ?
      ok,But I didn't go deeply into family Tree and Personal Details.

      Delete
    6. Dig the history to find so many skeletons. Nehru's great grand father is general of Mughal empire.

      Delete
    7. This comment has been removed by the author.

      Delete
    8. It is a very old story.

      Muslim law doesn’t apply to Jinnah, says daughter

      Jinnah, as a Khoja-Shia, was not governed by Muslim succession law, but by Hindu customary law — in which intestate succession is to the daughter alone.

      http://archive.indianexpress.com/news/muslim-law-doesn-t-apply-to-jinnah-says-daughter/372877/

      Delete
  3. కాష్మీర్ ప్రజలు వేరే జాతికి చెందినవారని, వారిది మనసంస్కృతి కాదని,భారత దేశంతో సంబంధం లేదని కొందరు రాస్తూంటారు. కాని ఫరూక్ అబ్దులా మా పూర్వీకులు సరస్వత్ బ్రాహ్మణులు అని అతనే చెప్పాడు. ఇక పాకిస్థాన్ అభిమాన కవి మహమద్ ఇక్బాల్ . ఇతనిని అలామా ఇక్బాల్ అని కూడా అంటారు" సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమార హమార" పాటను రాశారు. రవీంద్రనాథ్ ఠాగుర్ అంతటి వాడని పేరు. ఇతను రాముడు మీద, గాయత్రి మత్రం మీద కూడ రచనలు చేశాడు. అతని పూర్వీకులు కూడా కాష్మీరి బ్రాహ్మణులు.

    IQBAL’S HINDU RELATIONS by Khushwant Singh
    http://www.telegraphindia.com/1070630/asp/opinion/story_7992715.asp

    ReplyDelete
  4. http://www.amazon.in/Indias-biggest-cover-up-Anuj-Dhar-ebook/dp/B008CDVRWW
    https://www.facebook.com/anujdhar/posts/10151325775311557
    www.youtube.com/watch?v=vSagi9jVFss

    http://www.sunday-guardian.com/analysis/could-gandhiji-have-been-saved-from-godse

    ReplyDelete

  5. Sir,Nehru's great grand father is general of Mughal empire.
    >>
    I know this part.i will touch in the next part about IG!there is an interesting reference also in her life - visiting babar birth placae and becoming sentimental.

    ReplyDelete
  6. Dear friends
    all these sequels I had a plan!Some of the above mentioned points will be relevant in next part about IG.

    But I am not willing to go deep into personal things.my importance is how Indian history was influenced by their misdeeds.

    ReplyDelete
  7. హరిబాబు గారు,
    ఈ ధారావాహికంలో మీ తదుపరి వ్యాసాలు ఎప్పుడు పెడతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానండీ!!

    ReplyDelete
    Replies
    1. as early as possible,collecting relevant and authentic material.
      thanks for the curiosity expressed!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...