Thursday 20 November 2014

శ్రీమతే కచరా రమణ గోవిందో హరీశ్ కవితారకం మహత్!!!

          విడిపోక ముందు దక్షిణ భారతంలో నాలుగు బలమయిన భాషా సాంస్కృతిక మూలస్తంభాల్లో ఒకటిగా వున్న ఆంధ్ర ప్రదేశ్ యెంత భయానకంగా విడిపోయిందంటే అది జరిగిన తీరు చూసి అప్పటి దాకా ఈ రాష్ట్రం విడిపోగానే తామూ విడిపోదాం అని గోతికాడినక్కల్లా యెదురు చూసిన ఇతర రాష్ట్రాల్లోని వాళ్ళంతా మూతి కాలిన తెనాలిరాముడి పిల్లుల్లా యెక్కడి వాళ్ళక్కడ గప్ చుప్ అయిపోయారు!ఒకప్ప్పుడు చెన్నపట్నాన్ని వొదులుకోలేక అటువాళ్ళూ ఇటువాళ్ళూ కొంచెం గింజుకున్నా యెంత హుందాగా ఇరుపక్షాల వారూ వ్యవహరించారు!బిల్లుకి కోరం చాలకపోతే కొందరు తమిళులు కూడా ఆంధ్రావాళ్ళ పక్షాన వోటు వేసి గెలిపించడం కూడా జరిగిందని చదివాను.మొదటి దశలో రాజకీయంగా వూగిసలాడుతూ తలా ఒక మాటా మాట్లాడుతుంటే,"మీ ఆంధ్రావాళ్ళకి సిగ్గు లెదు" అని ఒక రైల్లో జరిగిన సంభాషణలో మిత్రుడైన ఒక తమిళ రాకజీయ వేత్త గద్దించి మరీ గట్టిగా పోరాడమని వుత్సాహ పరచిన సన్నివేశం గురించీ చదివాను.అందుకనే విడిపోయిన మరుసటి రోజు నుంచీ చెన్నై లోనూ ఇతర ప్రాంతాలలో వున్న తెలుగువారు అసలేమీ జరగనట్టుగానే యెక్కడి వాళ్ళు అక్కడ సాటి తమిళులతో నిన్నటి రోజున వున్నంత సాదరంగానూ వుండగలిగారు!

          మరి ఇప్పుడెందుకిలా జరిగింది? ఒక బుడ్డిమంతుదు తను గొప్ప నీతిమంతుడిలాగా పోజులు కొడుతూ మీరంతా దొంగలు, ద్రోహులు,తెలంగాణాకి అన్యాయం చేశారు  అని రెచ్చిపోతుంటే కాదు, మేము తెలంగాణా ప్రజలకి అన్యాయం చెయ్యలేదు అని చెప్పుకోవడానికి కూడా ముఖం చెల్లనంతగా రాజకీయాల్ని భ్రష్టు పట్టించిన అన్ని పార్టీల రాజకీయ నాయకులూ దీనికి కారణం!మరీ ముఖ్యంగా విభజన ఆఖరి దశలో అక్కడా ఇక్కడా అధికారంలో వుండి రెండు రాష్త్రాలకీ న్యాయం జరిగే హుందా అయిన పధ్ధతిని పాటించగలిగి వుండి కూడా ఒక పిట్టలదొర చూపించిన ముఫ్ఫయ్ సీట్ల అద్భుతాన్ని చూసి అతని ముందు సాష్టాంగపడి పోయి యూపీయే-3 అనే ఒక చెత్త ప్లానుని భుజానేసుకుని  ప్రజలతో సంబంధం లేని రాజ్యాధికారాన్ని ఆశించే అలవాటున్న నూట ముఫ్ఫయ్యేళ్ళ జంబుకం అధికారంలో వుండటం ఈ రెండు రాష్ట్రాల లోని సౌభ్రాతృత్వాన్ని కోరుకునే వివేకవంతులయిన తెలుగు వాళ్ళ దురదృష్టం!

      "అట్లెట్ల వొస్తది తెలంగాణా?" అని విన్నవాళ్ళు అంటే "ఇట్లనే వొస్తది తెలంగాణా" అన్నా, అట్లనే తెచ్చి చూపించినా అని మురుసుకునే ఇవ్వాల్టి వాహనాల పునః పునః రిజిస్ట్రేషన్ పండితుడు తెలంగాణా వుద్యమాన్ని యెక్కడ మొదలు పెట్టి యే దారుల్లో తిప్పి యెక్కడ నిలబెట్టాడో నిజంగా తెలంగాణా గడ్దని ప్రాణాధికంగా ప్రేమించే తెలంగాణా వాసులు అర్ధం చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇంతకు ముందు మాతృ రాష్ట్రం నుంచి విడిపోయిన రాష్ట్రాలు మొదట విడిపోవటానికి సభలో మెజారిటీ మైనారిటీ లెక్కలతో కొలిస్తే అంకెకి తక్కువే అయినా తమ శాసన సభలోనే విభజన ప్రతిపాదన చేసి ప్రతికక్షుల్ని కూడా వొప్పించి సోదర రాష్ట్రాలు రెండూ సాదరంగా విడిపోయాయని తెలిసి కూడా ఇక్కడ మేము అంకెకి తక్కువున్నాం మాకు న్యాయం జరగదు అని ఆర్టికిల్ మూడుని భుజానేసుకుని యెందుకు తిరిగాడు!ఆంధ్రోళ్ళని తిడుతూ విడిపోయే అమర్యాద కరమయిన పధ్ధతిలోనే తెలంగాణా తీసుకురావాలనే దరిద్రమయిన వూహ యెలా వచ్చిందో ఇతనికి నాకిప్పటికీ అర్ధం కావడం లేదు? దానికి తోడు అప్పుడు అధికారంలో వున్న ఇతర పార్టీల రాజకీయ నాయకులంతా తెలంగాణాకి సంబంధించి గందరగోళంలో వుండటమూ దీన్నించి తమకీ మైలేజీ నొల్లుకుందామనే కక్కుర్తిలో వుండటమూ ఈ పిట్టలదొరకి రెక్కలు మొలిచినట్లయింది! యెప్పుడు యెవడికి అధికారం దూరమయినా భుజానేసుకుని తిరగొచ్చుననే దుర్మార్గమయిన తెలివితో తెలంగాణా రాజకీయ నాయకులే తెలంగాణా వెనుకబాటు తనాన్ని అలాగే వుంచెయ్యటం కూడా కలిసొచ్చింది!వీళ్ళు చెప్పే అబధ్ధాల్ని అబధ్ధాలుగా నిరూపించలేని వాళ్ళు, కనీసం ఇతని ఈ అమర్యాదకరమయిన భాషకి కూడా గట్టిగా ప్రతిస్పందించలేని అసమర్ధులు రాజకీయ ప్రతికక్షులు కావటం మరింత హుషారు నిచ్చింది! దానితో ప్రపంచంలో మరే న్యాయపోరాటమూ జరగనంత దిక్కుమాలిన దారికి వుద్యమం సగర్వంగా కదిలి తెలంగాణా లోని సభ్యతాసంస్కారం గలవారు వ్యతిరేకించినా వుద్యమద్రోహులనే పేరుతో దహశుధ్ధికి గూడా తెగబడి ఆరోగ్యకరమయిన చర్చలకి వుద్దేశపూర్వకంగానే దూరంగా వుంటూ ఆఖరికి లోక్ సభ సభ్యులు మార్షల్స్ పని కూడా చెయ్యాల్సినంత దరిద్రమయిన పతాక సన్నివేశం వరకూ నడిచిన కధలో యే మలుపులో తెలంగాణా ప్రజల స్వాభిమానం ప్రతిబింబించిందో యెప్పుడో ఒకప్పుడు యెవరో ఒకరు చరిత్రకారులకీ పరమపురుషుడికీ జవాబు చెప్పి తీరాలి! తమ పార్టీకి సంబంధించిన రాష్ట్రస్థాయి నాయకుల కన్నా ఈ కోతల్రాయుడికి యెక్కువ ప్రాధాన్యత నిచ్చి ఈ మనిషి వొక్కడే మళ్ళీ కాంగ్రెసుని దేశమంతటా అధికారంలోకి తీసుకురాగలడని నమ్మిన డిల్లీ గాంక్రెసు దేశమంతటా పూర్తిగా హతమారి పోతే తప్ప ఆంధ్రావాళ్ళకి జరిగిన పన్నెండేళ్ళ సుదీర్ఘమయిన అవమాన కాండకి పూర్తి  పరిహారం లభించదు!

          నేనిక్కడ బ్లాగుల్లో "తెలంగాణా మేధావుల్లోని మేధావిత్వపు శాతం యెంత?" అని అడిగితే ఒక్కరూ ఇంత అని ధీమాగా చెప్పలేక పోయారు!"అబ్బో మేధావి గారు బాగనే కనిపెట్టిండు?" అని వ్యంగ్యాలు వాడేసి ఆకుకీ పోకకీ అందని జవాబు లేవో చెప్పేసి తప్పుకున్నారు."కబ్జా లు చెయ్యడం వ్యాపారం అనుకుంటున్నారా ఎంధి ? రామోజీ ఫిల్మ్ సిటీ లు , రాంకి లు , లాంకో ఎస్టేట్ లు , నార్నె ఎస్టేట్ లు ప్రపంచంలో యే విషయం కొథ గా కనుక్కొని వీళ్ళు అవ్వి సంపాదించారు" అని బాగానే గర్జించారు అప్పుడు!మరి రాష్ట్రం యేర్పడినాక ఆ వీరాధివీరులు మాట్లాడరేం?వారి హేట్ లిష్టులోని వ్యక్తుల్ని కబ్జాకోరులుగా నిరూపించి వెళ్ళగొట్టలేకపోయారేం?అవి కబ్జాలు అని వాళ్ళు ఖచ్చితంగా అంటే నీరజా మిశ్రా అనే ఒక స్త్రీ మాత్రం చెయ్యలేని అసమర్ధులుగా వాళ్ళూ వాళ్ళ ముఖ్యమంత్రే లెక్క కొస్తారు, అవునా కాదా?అప్పుడెప్పుడో కాళోజీ రెండున్నర జిల్లాల రెండున్నర కులాల పెత్తనం గురించి తూర్పార బట్టటం గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఇవ్వాళ మంత్రివర్గ సభ్యుల  కులాల దామాషా లెక్కల్తో చూస్తే తామివ్వాళ ఒకటిన్నర కులాల పెత్తనం కింద వున్నారని తెలియడం లేదా?తెలిసీ తెలియనట్టు అమాయకత్వం నటిస్తున్నారా?మరి నిన్నటి రోజున యే కుల వర్గ సమీకరణలతో ప్రభుత్వాలు యేర్పాటు చేసి తమని దోచేసారని విమర్సించారో ఈ రోజు ప్రభుత్వంలో అవే కుల వర్గాల పెద్దమనుషులు కొలువుదీరిన మంత్రివర్గం వారు కోరుకున్న కొత్తరకం తెలంగాణాను ఎట్లా తీసుకొస్తుంది? అట్టడుగున వున్న ప్రజల రాజకీయ పరిజ్ఞానంలో తేడా లేదు, అధికార యంత్రాంగంలో తేడా లేదు, ప్రభుత్వాధినేతల సంస్కారంలో తేడా లేదు, పరిపాలనకు పాటిస్తున్న చట్రంలో తేడా లేదు - కానీ భవిష్యత్తు మాత్రం ఇదివరకటి కన్నా విభిన్నంగా వుంటుందంటే నమ్మాలా!

             యాభయ్యేళ్ళ వేరుకుంపటి పైత్యం తర్వాత పన్నెండేళ్ళ మంకుపట్టు తర్వాత ఇప్పుడు తెలంగాణా యెలా వుంది? ప్రాధమ్యాలు తెలియని మయోఅయం,తను యెంత అమర్యాదగా వాగినా యెదటివాళ్ళు మాత్రం మర్యాద కొద్దీ వూరుకుంటుంటే అది అలుసుగా తీసుకుని మరింత రెచ్చిపోయే నోటి దురుసు ముఖ్యమంత్రి, యెటు చూస్తే అటు అంధకారం!అక్కడున్న మేధావుల్ని కదిలిస్తే -తెలంగాణాకు లేకుండా చేసిన విద్యుత్ ప్లాంట్లకు నాలుగింతలు భవిష్యత్తులో రాబోతున్నాయి. అప్పుడు తెలంగాణా అడిగే స్థితినుండి ఇచ్చే స్థితికి రావచ్చు కూడా.- అనే నవ్వాలో యేదవాలో తెలియని విచిత్రమయిన ఆలోచనలతో వున్నారు.ఇప్పటికే ముందు కాలానికి కూడా కొనేసుకుని అక్టోబరు 2 నుంచే నిరంతరాయంగా వాడుకుంటున్న రాష్ట్రానికి రేపెప్పుడో వీళ్ళిచ్చేదేంది? మిగులుతో విడిపోయి కూడా కరెంటు అడిగిన రైతుల మీదకి పోలీసుల్ని పంపించి తలలు పగలగొట్టిన రాష్ట్రం భవిష్యత్తులో మేడలు కడుతుందట!యెదటి వాళ్ళకి విందులు చేస్తుందట!

    మర్యాద నిచ్చిన మర్యాద వచ్చును!ద్వేష పూరిత ప్రసంగాల్తో తక్కువరకం మనుషుల్ని రంజింపజేస్తూ, ముందు చూపు - దొంగ చూపు అనే ప్రాసయతుల తిట్లు తిడుతూ తన వాచాలత్వానికి తనే మురుసుకుని నవ్వుకునే స్థాయి వ్యక్తిని సమర్ధించటానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పుడు తను మాట్లాడుతున్నది యెన్నికల ప్రసంగం కాదని తెలుసు.అవతలి మనిషి నుంచి తనకు హక్కుగా రావలసినదే అడుగుతున్నా అది మర్యాదకరమయిన పధ్ధతి కాదని తెలియకే అలా మాట్లాడవలసి వచ్చిందా?పదేళ్ళ క్రితం జరిగినాయని చెబుతున్న ద్రోహాల కధలన్నీ ఇదివరకే విప్పారు గదా, మళ్ళీ మళ్ళీ అవే తవ్వడం అంటే మీవైపు నుంచి అమర్యాదనే చూపిస్తారు, అయినా మేము మాత్రం మర్యాదనే చూపించాలనేది అతనీ మరియూ అతని పంఖాల భావమా?!అయినా ఒక సారి రిజిస్టర్ అయిన వాహనాన్ని రెండోసారి రిజిస్టర్ చెయ్యడం కుదరదనే మామూలు విషయం కూడా తెలియని ఈ చవట దద్దమ్మకి మరొకర్ని సన్నాసి అనే అర్హత వుందా?!

     యాబై అరవై యేళ్ళుగా తెలంగాణాకి ద్రోహం జరగడంలో తెలంగాణా రాజకీయవేత్తల ప్రమెయమే యెక్కువని అంత కాలం రాజకీయ జీవితం గడిపాక కూడా ఇతనికి నిజంగానే తెలియదా? ఈ బుడ్డిమంతుడు పెద్ద నీతిమంతుడిలా పోజులు కొడుతూ ఆంధ్రా రాజకీయ వేత్తల్ని మాత్రమే అంటున్నాను ప్రజల్ని కాదు అని యెంత సమర్ధించుకున్నా కొన్ని లక్షల కోట్ల మంది ముందు సభావేదికల మీద పచ్చి బూతుల్ని కూడా అవి బూతులు కాదని తెగబడి యెలా మాట్లాడ గలిగాడు?రాజకీయ వేత్తలు ఆకాశంలోంచి వూడిపడతారా?ఒక శాసనసభ నియోజకవర్గంలో లక్ష వోట్లు వుంటే లక్ష వోట్లూ ఒకరికే పడతాయా?పది మంది నిలబడితే పదకొండువేల వోట్లు యెవరికి వచ్చినా అతనే గెలుస్తాడు గదా!గెలిచిన వాడు తనకు వోటు వేసిన ఆ పదకొండు వేల మందికి మాత్రమే ప్రతినిధి అవుతాడా?అతనికి వోటు వెయ్యనివాళ్ళు నేను ఇతనికి వోటు వెయ్యలేదు గాబట్టి నాకితను ప్రతినిధి కాదు అంటారా?యెన్నికలు తెలంగాణాలో కూడా ఆంధ్రాలో జరిగినట్టే జరుగుతున్నాయా లేక మరోరకంగా జరుగుతున్నాయా! తెలంగాణా ప్రజలు  యెన్నుకున్న రాజకీయ నాయకులే తెలంగాణా బాగుని పట్టించుకోకపోతే ఆంధ్రా ప్రాంతపు రాజకీయ నాయకుల్ని తిట్టడ మేమిటి?

     ఇప్పుడు బాబు మీద నన్నూ తెలంగాణానీ బద్నాం చెయ్యాలని చూస్తున్నావు అని రెచ్చిపోతున్నాడు గానీ ఇలాగే విడిపోవాలని తను వేసిన యెదవ ప్లాను వల్ల తనూ తెలంగాణా ఇప్పటికే బద్నాం అయిపోయారని తెలుసుకోలేకపోతున్నాడు?! ఆంధ్రాని కేంద్రం 24X7 విద్యుత్తు ప్లానుకి పైలెట్ రాష్ట్రంగా యెన్నుకోవడాన్ని కూడా స్నేహితుడు ఇచ్చిన గిఫ్టు లెండి అని వంకర కూత కూస్తున్నారు గానీ మిగతా రాష్ట్రాల వాళ్ళు అలా అనుకోవడం లేదు.ఒక బెంగుళూరు నివాసి - When compared with loss due to bifurcation. It is big zero....A P people has got better aluminum plate there as Telangana was gifted by Golden plate with platinum studded spoon that was congress decision..where as the power giving is just like giving an water for thirsty.person - అంటున్నాడు!అతనొక్కడే కాదు అక్కడే కామెంటిన ఇతర్లు, అక్కడా ఇక్కడా అనేముంది ఈ విభజన గురించి మాట్లాడుకునే అందరూ అదే అభిప్రాయంలో వున్నారు. ఇప్పుడు అందరూ ఆంధ్రావాళ్ళ పట్ల జాలితోనూ సదభిప్రాయం తోనూ వుంటే తెలంగాణ వాళ్ళ పట్ల యే అభిప్రాయం వున్నట్టు?హైదరాబాదు నుంచి వాళ్లకి రావలసిన ఆదాయంలో చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఆంధ్రా వాళ్ళని కట్ట్టుబట్టల్తో తరిమేసిన దుర్మార్గులుగా ప్రపంచం ముందు నిలబడ్డారు పన్నెండేళ్ళ పాటు మాకన్యాయం జరిగిందని మహోద్యమం చేసిన తెలంగాణా వాళ్ళు!

       ఒకప్పుడు రాష్ట్రం మొత్తాన్ని చీకటి గుయ్యారంగా చేసి కేవలం హైదరాబాదు లోనే అభివృధ్ధి నంతా పోగేసిన చంద్రబాబు ఇవ్వాళ్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదమూడు జిల్లాలకీ అభివృధ్ధిలో భాగం కల్పించే దిశగా అడుగులు వేస్తూ పాత తప్పుల్ని పునరావృతం చెయ్యకుండా జాగ్రత్త పడుతున్నాడు!అసలే జీమూతం లాంటి రుణమాఫీ రిజర్వ్ బ్యాంకు ప్రతిపక్షం లాగ తయారయి మోకాలడ్డం పెట్టేసరికి భల్లూకంలా తయారయినా తన చాణక్య ప్రజ్ఞతో బ్యాంకర్లని బుజ్జగించి అంచెలంచెల మోక్షం లాంటి కష్టమయిన దారిని యెన్నుకుని ప్రస్తుతానికి బరువు తగ్గించుకుని వూపిరి పీల్చుకున్నాడు!రిజర్వ్ బ్యాంకు వాదన కూడా కరెక్టే మరి, ప్రభుత్వాలు తమ బడ్జెట్లలో యెక్కువ శాతం ఇలాంటి అనుత్పాదక వ్యయాలకి కేటాయిస్తే సంస్థాగతమయిన పెట్టుబడుల్లో కోత పెట్టాల్సి వస్తుంది గదా!అంత కాలం శ్రమించి పెంచిన రాజధానిని వదిలి వచ్చిన కొత్త రాష్ట్రం మళ్ళీ రాజధాని కట్టుకోవడానికి కూడా నోటి మాటల నీటి మూటల్ని అద్దంలో చూపించడమే తప్ప నికరమయిన వాగ్దానం చెయ్యలేదు నికృష్టపు కాంగ్రెసు! పాత ప్రభుత్వం చేసిన గ్యారెంటీ ఇవ్వని వాగ్దానాల్ని ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తుందో లేదో తెలియని అయోమయం కొంతకాలం గడిచి,ఇచ్చినా డబ్బు రూపంగా బ్యాంకులో వెయ్యం రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి సంబంధించి వేసే ప్రణాళికల్లో సాంకేతికంగా సాయం చెయ్యడమే తప్ప అని తేల్చి చెప్పడంతో పరిస్థితు లన్నీ మొదట కంగారు పెట్టినా రాజధానికి పెట్టే ఖర్చు నుంచే రాజధాని అవసరాలకీ ప్రభుత్వ నిర్వహణకీ అవసరమయిన రెవెన్యూ రాబట్టుకునే విధంగా చంద్ర బాబు వేసిన మాస్టర్ ప్లాన్ నిజంగా అధ్బుతమే!దుర్మార్గమయిన విభజనతో సమస్యల్ని మూటగట్టుకుని లోటుతో వచ్చిన రాష్ట్రాన్ని కూడా గతాన్ని తిట్టుకోకుండా భవిష్యత్తులోకి పరుగులు పెట్టిస్తున్నాడు ఆంధ్రా ముఖ్యమంత్రి.

      కల్లు కాంపౌండ్లు తెరిపించటానికీ బతుకమ్మను స్టేట్ ఫెస్టివల్ గా చెయ్యటానికేనా తెలంగాణాను తెచ్చింది అని చిన్న కుర్రాడు కూడా జోకులేస్తున్నాడు,ఇప్పటి వరకూ తెలంగాణా ప్రభుత్వం నిక్కచ్చిగా అంటే యే కోర్టుతోనూ చివాట్లు తిని వెనక్కి తగ్గేలా కాకుండానూ సహం లోనే గెజెట్టుల ద్వారా కేంద్రానికి దఖలు పర్చెయ్యకుండానూ చేసినవి ఆ రెండే మరి?!1956 స్థానికత అనంగానే కోర్టు, "నువ్వు ఈ దేశంలోనే వున్నావా,అర్జెంటుగా ఈ వాదన ఆపు,లేదంటే చీరి చింతకి కడతాన్రరేయ్!" అనేసింది - నాలిక్కర్చుకుని వెనక్కి తగ్గాడు!నిజంగా అన్నిటికీ అది గానీ అమలు చేస్తే తనే ఇప్పుడు ఆంధ్రాలో వున్న విౙనగ్రానికి పోయి కాందిశీకుడిలా బతకాలి మరి?లార్సన్ అండ్ టబ్రో అనే ఒక కంపెనీ పరమ ఘోరమయిన కామెంట్లతో నేను వీళ్ళతో పనిచెయ్యలేను ఈ బోడి కాంట్రాక్టు నుంచి తప్పుకుంటున్నానహో అని టముకేసినా యేమి పీకాడు? అత్త తిట్టినందుక్కాదు గానీ తోడికోడలు నవ్వినందుకు కోపగించుకుని ఆ తోడికోడలు నోటికి ప్లాస్టరేసి సరిపెట్టుకున్నాది తెలంగాణా పెబుత్వం! మరీ పరువు పోకుండా సమయానికి కేంద్రం గెజెటు ద్వారా ఆ కార్యక్రమాన్ని తను దఖలు పర్చేసుకుంది గానీ లేకపోతేనా? ఒకసారి వాహనాల చట్టంప్రకారం రిజిస్టరు చేయబడిన వాహనానికి రెండవ రిజిస్ట్రేషన్ అనే చెత్త వూహ యెలా వచ్చింది?వాహనాల చట్టంలో యేమయినా అస్పష్టత వున్నదా? లేదే, కోర్టు ముక్క చివాట్లు పెట్టింది గదా? అప్పటికీ వెనక్కి తగ్గకుండా వాహనం మీద వుండే నంబరు ప్లేటు మీద మాత్రం మారిస్తే చాలుననే మొదటిదాని కన్నా చెత్త వూహ యెలా వచ్చింది?హత్యలూ దోపిడీలూ చేసి పారిపోయే వాళ్ళు చేసినట్టు యే వాహన యజమాని అయినా తప్పు నంబరు వాహనం మీద వేస్తే ట్రాఫిక్ పోలీసులు చూస్తూ వూరుకుంటారా? అలా వూరుకోమని ప్రభుత్వాధినేతగా లిఖిత పూర్వకంగా పోలీసులకి ఆదేశాలు జారీ చెయ్యగలడా?తోటకూర నాడే చెప్పకపోతివేమే అని తల్లిని చెంప పగలగొట్టిన వాడిలాగా వాహనాల రీ రిజిస్ట్రేషన్ అన్నప్పుడే ఈ తెలివితక్కువ దద్దమ్మను వొదిలించుకోకపోతిమే అని తెలంగాణా ప్రజలు తమ చెంపలు తామే వాయించుకోవాల్సి వస్తుందేమో రేపటి రోజున!

          ఈ వెర్రిమొర్రి ఆలోచన లన్నిటి వెనకాలా తనలోనూ తన పంఖాల్లోనూ వున్న ఆంధ్రావాళ్ళ మీదున్న ద్వెషమే కారణం!పింగళి సూరన కళాపూర్ణోదయం అవతారికలో వాళ్ళ కుటుంబాల్లో విన్న ఒక తమాషా కధ చెప్తాడు. ఆ కధకో పేరు కూడా వుందేదట, "పింగళి వారి పేకి" అని.వీళ్ళ తాత గారి కాలంలో ఒకాయన పని చేసుకుంటుంటే హఠాత్తుగా ఒక ఆడమనిషి వచ్చి నాకూ పని చెప్పు చేస్తానని తగులుకుందట. తీరా పని చెప్పబోయే ముందు ఒక కండిషన్ పెట్టింది, "నేను ఆపకుండా పని చెయ్యగలిగేలా చెప్పాలి,నాకు చెయ్యడానికి పనిలేని మరుక్షణం నిన్ను మింగేస్తాను" అని!ఆ మహానుభావుడు తెలివయిన వాడు అవటంతో వ్యవసాయప్పన్లన్నీ తనతోనే లాగించాడు!కానీ ఆరాత్రి మాత్రం అనుకున్నట్టు జరగలేదు? మనిషి రూపంలో వుండటం వల్లనో మరెందుచేతనో గానీ దానికీ నిదరొచ్చిందో యేమో, రాత్రి మంచి నిద్రలో దీపం కళ్ళల్లో పడుతుంటే ఆ నిద్రపోతున్న దానికి కొంచెం పక్కకి జరమన్నాడు. పని చెప్పాక అది యెలా చేస్తుందో చూసి గుండె గుభేలు మన్నంత పనయ్యింది?! యెక్కడ పడుకున్నది అక్కణ్ణించే నాలిక పొడుగ్గా సాగించి నాలికతో పక్కకి తోస్తున్నది. అప్పటిదాకా ధైర్యంగా వుండి యేదో అనుకున్న పెద్దమనిషి ఇదేదో మరీ ప్రాణాంతకమయిన పిశాచమని తెలిసి వొదిలించుకుందామని చూస్తే "నా పూస నాకిస్తే వెళ్తా" నందట!ఆ పూస కధేమిటని చూస్తే పని మధ్యలో యేదో పూస కనబడితే బావుందని జేబులో వేసుకున్నాడు, అది ఇచ్చాడు - ఆ పిశాచం వొదిలింది!ఈ ఆంధ్రా ద్వేషం అనే కల్వకుర్తి వారి పేకి గూడా అంతే- దీన్ని వొదిల్తే రాజకీయంగా తను చస్తానని భయపడుతున్నాడు, వొదలనంతకాలం మైండు సరిగ్గా పని చెయ్యక ఇలాంటి తిక్కపనులే మళ్ళీ మళ్ళీ చేస్తూనే వుంటాడు!

    నిన్నటి నుంచి ఈరోజుకి ద్వేషమనే విత్తనం నాటి అబధ్ధాలు,అమర్యాద,అనుమానాలు అనే దినుసుల్ని యెరువుగా వేసి ఒక విషవృక్షాన్ని పెంచుతూ ఇవ్వాళ్తి మలుపులో నిలబడ్డారు.మేము అబధ్ధాలు ఆడామా అని అదిరిపోతారేమో,సాక్ష్యం చూపిస్తాను.ఆంధ్రాలో రుణమాఫీ గురించి పెద్ద తెలిసినట్టు యేం వాగాడు?ఇంతవరకూ రైతులకి ఒక్క రూపాయి ఇవ్వలేదు అని ఆంధ్రా ముఖ్యమంత్రి మీద చెలరేగిపోయాడు.ఈ మనిషి ఇలా వాగిన తెల్లవారే సరికి అప్పటికే సిధ్ధంగా వున్న రుణమాఫీ వివరాల్ని ఆన్ లైన్లో పెడుతున్నాం చూసుకోండి అన్నాడు ఆంధ్రా ముఖ్యమంత్రి! చూసి తేల్చుకుంటాడా తేలు కుట్టిన దొంగలా వూరుకుంటాడా? ఒక అబధ్ధాలకోరుని అబధ్ధాల కోర్లు మాత్రమే సమర్ధించుకుని మెచ్చుకోగల్గుతారు! ఈ అబధ్ధాల కోరు -  ప్రైవేటు కర్మాగారమైన హిందుజాలను బెదిరించి తెలంగాణాకు అందించ వలసిన కరెంటు ఆపాడు - అని చంద్రబాబు మీద అభాండాలు వేస్తున్నాడు! దేశమంతటా విస్తరించాలనుకునే ఒక వ్యాపారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడని తన వ్యాపారాన్ని కొత్త శాఖలు తెరిచి విస్తరించుకోకుండా ఆగిపోతాడని ఒకడంటే నమ్మేవాళ్ళు చెవిలో పువ్వు పెట్టుకున్నపిచ్చివాళ్ళయినా అయివుండాలి అన్నవాడికి పంఖా లయినా అయి వుండాలి?

          ఒకే నగరంలో ఒకే భవనంలో పక్క బ్లాకులోకే వెళ్ళి పత్రికా సమావేశంలో కక్కిన ముందుచూపు-దొంగచూపు అనే ప్రాసయతుల తిట్లు ముఖాముఖిగానే కక్కే వీలు వుంది కదా?ఆంధ్రా ముఖ్యమంత్రి కూడా యెప్పటించో పిలుస్తూనే వున్నాడు గదా ఇలాంటివన్నీ తేల్చుకుందామని. తన రాష్త్రానికి న్యాయం జరిపించుకోవడానికి పోట్లాడి అయినా సాధించుకు రమ్మనే గదా అందరూ అనేది,కానీ అమలాపురంలో చెయ్యాల్సిన పని ఆముదాలవలసలో చేస్తున్నాడు తెలంగాణా ముఖ్యమంత్రి?!అధికారంలోకి వొచ్చినప్పటి నుంచీ చర్చలకి రమ్మని పిలుస్తున్నా ముఖం చెల్లక తప్పించుకుని తిరుగుతూ అమలాపురంలో చెయ్యాల్సిన పనిని ఆముదాల వలసలో చేస్తే యేమి ప్రయోజనం?

       నిన్నటి నుంచి ఈ రోజుకి ఒక చైన్ రియాక్షన్లో భాగంగా నడిచి ఇక్కడికి వచ్చారు.ఈ చైన్ రియాక్షన్ ఇలాగే కొనసాగితే రేపు యెలా వుంటుందో వూహించలేమా?ఈ దారిలో వెళ్తే ఆ మూడు పార్టీలూ మిమ్మల్ని కార్నర్ చేసి తెలంగాణా వొస్తే చాలుననే విధంగా మిమ్మల్ని మెంటల్ గా ప్రిపేర్ చేసే అవకాశం వుందనీ, అలా తెలంగాణాకి అన్యాయం జరిగే ప్రమాదం వుందని యెప్పుడో "ధర్మమేవ జయతే" బ్లాగులో కామెంటు వేసాను! కానీ అది పబ్లిష్ కాలేదు.ఒక వ్యక్తి విననప్పుడు మిగతా వాళ్ళు మాత్రం యేమి వింటారులే అని నేనూ ఇంకెక్కడా వెయ్యలెదుకానీ  ఇప్పుడు చూశారుగా నా అంచనా యెలా నిజమయిందో! ఒక చైన్ రియాక్షన్ మొదలయితే దాని నడక ఆ రకంగానే వుంటుంది.వేరే ఫలితం రావాలంటే ఆ చైన్ రియాక్షన్ దిశని మార్చాలి.అప్పుడు నేను వూహించిన నాలుగు దశల్లో రెండు పూర్తయి మూడో దశలో వుంది ఇప్పటి తెలంగాణా! ఇప్పటి తెలంగాణాలో పందితరాయలు వెక్కిరించిన తరహాలో నడుస్తాంది రాజ్యం!ఒకప్పుడు ఇందిరయే ఇండియా, ఇండియాయే ఇందిర అనేరకం కాంగ్రెసోళ్ళ మాదిరి కేసీఆరే తెలంగాణా, తెలంగాణానే కేసీఆరు అనే మూర్ఖులు పెరిగారు!రెచ్చిపోయి దుర్మార్గాలు చెయ్యడం ఒక రకం, కానీ పిచ్చిపుల్లయ్య లాగా ప్రవర్తించినా సమర్ధించుకొస్తున్నారే?!తెలంగాణా ప్రజలకి విసుగుపుట్టి ఆపమనాల్సిందే తప్ప ఆటగాడు మాత్రం అనంతకాలం వరకూ ఇదే రకంగా ఆడినా విసుగు దరిచేరనివ్వని విక్రమార్కుడే - మరి తెలంగాణా ప్రజల భవిష్యత్తు యేంటి?!


శ్రీమతే కచరా రమణ గోవిందో హరీశ్ కవితారకం మహత్!!! 

2 comments:

  1. హరి గారు,
    చిన్న అనుమానం, కాస్త బుఱ్ఱ పెట్టి ఓ చిన్న టపా వెయ్యాలంటేనే బోలెడు టైం పడుతుంది, అలాంటిది ఇంత మ్యాటర్ ను, అందులో తీసివేయబయేడిది కూడా ఎమీ లేదు, ఎలా రాయగలుగుతున్నారు?
    మీకు మాకు 1990 లలో ఉన్నటువంటి software ఉద్యోగాలయినా ఉండాలి (అప్పటిలో గట్టిగా ఓ గంట పనిచేసి, ఆఫీసులో మిగతా టైము అంతా కబుర్లాడుకొనేవాళ్ళము, DoTCoM రోజులు, అలాంటి ఉద్యోయగమయినా ఉండి ఉండాలి, లేక మీ కుటుంబం అయినా పిల్ల లలతో పుట్టుంటికి టూర్ కి వెళ్ళి ఉండాలి, ఈ రెండు combo అయినా అయి ఉండాలి, :))

    ReplyDelete
    Replies
    1. నాకు వోపికెక్కువ:-<)పని తక్కువ:->)

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...