Friday 21 November 2014

జీవం లేని భవనాలూ రోడ్లూ అధ్బుత సౌందర్య ప్రతీకలా? వాటికోసం జీవం తొణికిసలాడే పంటపొలాల్ని పాడుబెట్టాలా!

          ప్రతివాళ్ళూ నల్లని జీమూతాల్లాగా ఆకాశంలోకి సూదుల్లా దూసుకుపోయే భవంతులూ, హేమమాలిని బుగ్గల్లా నున్నగా వుండే తారు రోద్లూ అందంగా కనిపించి సింగపూరును అభివృధ్ధికి కొలమానంగా చూపిస్తారేమిటి?ఒక భవంతి మరొక భవంతికి సూర్యరశ్మిని మూసేస్తే పట్తపగలు దీపాలు వెలిగించుకోవాల్సి రావటం వైభవమా?ఇప్పుదు చంద్రబాబుకి సింగపూరు అనే పిచ్చి పట్టింది! ఆంధ్ర ప్రదేశ్ మొత్తాన్ని తర్వాత చేస్తాడేమో గానీ ప్రస్తుతానికి మాత్రం రాజధానిని సింగపూరును తలపించేలా తీర్చిదిద్ది తనేంటో చూపిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు!

     పిడుగులు యెత్తుగా వున్న భవంతుల్నే యెందుకు తాకుతాయో తెలుసా? విద్యుచ్చక్తి రెండు రూపాల్లో వుంటుంది - ఒకటి తీగల్లో ప్రవహించేది, రెండవది ప్రవహించకుండా ప్రతీ వస్తువుని ఆవరించుకుని వుండే స్థిర విద్యుత్తు.భవనాల్లో వాడే టన్నుల కొద్దీ లోహాలు ఆ భవంతుల చుట్టూ ఈ స్థిర విద్యుత్తుని తయారు చేస్తాయి.అదీగాక వాతావరణంలో పై పొరలకు వెళ్ళే కొద్దీ గాలి కూడా అయాన్లుగా విద్యుదీకరింపబడుతుంది, ఆక్సిజను శాతం తగ్గిపోతూ వుంటుంది! మామూలుగా స్థిరవిద్యుత్తు వల్ల ఎలెక్త్రొక్యూషన్ జరగదు, కానీ ఆకాశంలో వురుములు-మెరుపుల వర్షం పడేటప్పుడు మాత్రం తప్పకుండా ఈ స్థిర విద్యుత్తు క్షేత్రాలు పిడుగుల్ని ఆకర్షిస్తాయి! అలాంటి ప్రమాదాల గురించి సామాన్యులకి తెలియకపోవచ్చు,కానీ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ ప్రజలకి ఇలాంటి ప్రమాదాల గురించి చెపాల్సిన ప్రభుత్వాధికారులకి తెలియకనా - తెలిసీ రెయల్ ఎస్టేట్ వారికి లాభాలు చేకూర్చి తమ వాటా తాము తీసుకుంటూ సరిపెట్టెయ్యడానికా ఈ బహుళ అంతస్తుల భవనాల్ని ప్రోత్సహిస్తున్నారు?

         సింగపూరు అనేది అంతా కలిపితే మన మహానగరాలకు దాదాపుగా వున్నా ప్రత్యెకంగా ఒక ద్వీపంలా వుండటంతో అదే దేశం కూడా అయ్యింది.చేసేది దళారీ వ్యాపారం - ముడి చమురుని దిగుమతి చేసుకుని, శుద్ధి చేసి, దాన్ని తిరిగి విదేశాలకి అమ్మే దేశం. టూరిజం కూడా ఒక వనరుగా మారిన యెకానమీ. దాన్ని తీసుకొచ్చి వ్యవసాయం బలంగా వుండి జీవం తొణికిస లాడే ప్రకృతి సంపదతో కళ్లపండువుగా వుండే మన దేశంతో పోల్చి చూసే పిచ్చిపని ఈ దేశపు గొప్పతనం తెలియని మూర్ఖుడే చేస్తాడు! యెప్పుడూ వ్యవసాయమే చేస్తారా? అని అడగ్గానే యెప్పటికీ ముఖ్యమంత్రిగానే వుంటారా? అని అడగని ప్రజలు దొరికారు చంద్రబాబుకి?! పచ్చని ప్రకృతి దృశ్యాలతో కళకళ లాడే భూమిని ఆ పచ్చదనం నుంచి దూరం చేసి,దాని వల్ల పుట్టే ఆక్సిజన్ స్పర్శకి దూరమయి సిమెంటు కట్టడాలని పెంచుతూ కార్బన్ డయాక్సైడుని పుట్టించుకునే రాజధాని మనకి మేలు చేస్తుందా?

     కేవలం నోటిమాటలతో తప్ప నికరమయిన పత్రాలు ఇవ్వకుండా భూములు తీసుకోవటం రైతుల్ని మోసం చెయ్యటమె!ఇప్పుడు సంతోషంగా భూముల్ని ఇస్తున్న వాళ్లంతా ఇంతకుముందు అస్సలు రేటు పలకని భూములకి ఇది మంచి రేటు కాబట్టి ఇస్తున్నారు!కానీ ఇదీవరకే మంచి రేటుతో వుండి చక్కని పంటలు పండే పొలాలు వున్న రైతులకి మాత్రం నష్టమే. మొదట్లో ఇచ్చిన రైతులకి లాభం వుంటుందని సమర్ధించాను గానీ నికరంగా యే పత్రాలూ దఖలు పర్చే దాఖలాలు లేవని తెలిశాక మాత్రం నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. దీనికన్నా భూసేకరణ చట్టాన్ని ఫాలో అయ్యి ఆ దారిలో కేంద్రసహాయంతో రాజధాని కట్టడమే మంచిది. ఒకసారి ఇలాంటి పిచ్చి వేషాల తోనే అధికారం కోల్పోయిన వాడు మళ్ళీ అవే పిచ్చ వేషాలు వేస్తున్నాడు! విభజన జరిగాక కూడా అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రిగా వుండటం మెరుగు అనే భావనతోనే సందేహిస్తూనే బొటాబొటీ మెజార్టీ ఇచ్చారని తెలుస్కుంటే కళ్ళు కొంచెం వాస్తవాన్ని చూస్తాయి. రాజధాని విషయంలో కిరికిరి జరిగి పరువు పోగొట్టుకుంటే కాంగ్రెసుకి పట్టించిన గతినే ఇతనికీ పట్టించక తప్పదు!

      అసలు రాజధాని విషయంలో అస్మదీయులయిన పాత్రికేయుల ద్వారా లీకు లిచ్చి భూముల ధరల్ని పెంచకుండా తను గోప్యతని పాతించి వుంటే బాగుండేది! ఒక ప్రాంతాన్ని నిర్ణయించుకుని అతి తక్కువ కాలంలో చట్టబధ్ధమయిన పధ్ధతి లోనే భూ సమీకరణ చేసి వుండాల్సింది.ఇప్ప్పుడు కొత్తగా బయట పడుతున్న విషయాలన్నిటినీ చూస్తే ఇది రైతులకి అన్యాయం చేసి రియల్టర్లకి మేలు చెయ్యడానికే ఈ తరహా భూసేకరణ అనేది తెలుస్తుంది! తన గార్గేయ సిధ్ధాంతి వాస్తు సలహాలతో కాకుండా రాజధానిని అందరి ఆమోదంతో ముఖ్యంగా రైతులకి నికరలాభం చేకూర్చే విధంగా వుండాలి.

        ఒక వేళ సాంప్రదాయ బధ్ధంగా వెళ్లాలని అనుకున్నా ఇప్పుడు చెప్తున్న ప్రాంతం విషయంలోనూ కొందరు వాస్తు విరుధ్ధం అంటున్నారు.అసలు రాజధాని అనేది అందరికీ సంబంధించినది అయినప్పుడు అధికార పక్షం తన సొంత ప్రయోజకత్వానికి సంబంధించిన విషయంగా తీసుకోకుండా అఖిలపక్ష సమావేశం యేర్పరచి అందరి అభిప్రాయాలతో ముందుకెళ్ళటం అన్ని విధాలా శ్రేయస్కరం?!

1 comment:

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...