Friday 19 February 2016

ఇలాంటి బుద్ధిమట్టం వాగుడుకే గదా తెలంగాణలో తెదెపా ఖాళీ ఐపోయింది!ఇంకా పునర్వైభవానికి కార్యకర్తల్ని పిలుస్తాడేంటి?

          చంద్రబాబుకి మీడియా కనిపిస్తే చాలు పిచ్చిదో ఎచ్చిదో ఏదో ఒక మాట అనకుండా ఉండలేని నరాల బలీనత ఉంది.దాని మూలంగా ఇదివరకు లేనిపోని తద్దినాలు కొన్నింటిని నెత్తిమీదకి కూడా తెచ్చుకున్నాడు,అయినా బుద్ధి తెచ్చుకోవటం లేదు!అమరావతి శంకుస్థాపన జరుగుతుంది."ఆహా అమరావతి ఓహో అమరావతి" అని ఎన్నైనా పొగుడుకోవచ్చు కదా,మధ్యలో పుసుక్కున "హైదరాబాదును తీసేస్తే తెలంగాణలో ఏముంది? అనేశాడు!వినగానే నాకు తెగ నవ్వొచ్చింది,తెలంగాణలో తెదెపా భూస్థాపితం అవడం మంచిదే అనిపించింది.లేకపోతే ఏంటి, రాష్త్రం విడిపోవటానికి తెలంగాణ వాళ్ళు చెప్తున్నదీ ఆంధ్ర ప్రాంతపు నాయకులు హైదరాబాదును తప్ప తెలంగాణలో దేన్నీ డెవలప్ చెయ్యలేదనే గదా!తెలంగాణలో హైదరాబాదు తప్ప ఏదీ కనబడకపోవటానికి తన బాధ్యత ఏమీ లేదా?

          కేసీఆర్ వాహనాల రీరిజిస్ట్రేషన్,గుడుంబాను తగ్గించటానికి కల్తీకల్లు పరిష్కారం లాంటి ఎన్ని పిచ్చిపనులు చేసినా మాట్లాడే మాటల్లో మాత్రం ఎక్కడా తప్పు పట్టటానికి వీల్లేకుండా మాట్లాడతాడు.హుస్సేన్ సాగర్ చుట్టూ 69 అంతస్థుల భవనాలు అన్నా, ఫలానా భవనం వాస్తు బాలేదు కూల్చి కొత్తది కడదాం అన్నా అవన్నీ కనీసం అతను ఇప్పుడున్న దాన్ని బాగు చేద్దామ నై కలగంటున్నాడు అన్నట్టు ఎలుస్తుంది - అవి నిజం చెయ్యగలడా,డాబుసరి కబుర్లా అనేది రేపటిరోజున గానీ తెలియదు.కానీ ఇవ్వాళ వింటున్నవాళ్ళకి వాటిలో తప్పు కనబదదు,క్రూరమైన కేసీఆర్ ద్వేషులకి తప్ప.ఎక్కదయిన అదొరుకుతాడు గానీ కరణం రాతలో ఒరకడన్ననత నిక్కచ్చిగా మాట్లాదతాడు కేసీఆర్!

          నేను విభజన తర్వాతి ఎన్నికల విశ్లేషనలోనే చెప్పాను తెలంగాణని కేసీఆర్ కొదిలేసి బాబు ఆంధ్రాకి పరిమితమవటం ఈ రెందు రాష్ట్రాలకీ మంచింది అని.కేసీఆర్ వోటుకు నోటు లాంటి వ్యూహం వేస్తాదని నేను అప్పడే వూహించాను.ఆగండాగండి,భవైష్యత్ దర్శనం లాంటి సక్తుల్ని గురించి సొంత దబ్బా కొట్టుకుంటునానై అనుకోకండి.బాబు కేసీఆర్ ప్రజ్ఞని తక్కువ అంచనా వేశాడు గానీ నాకు మాత్రం కేసీయార్ గురించి ఎలాంటి తక్కువ స్థాయి అభిప్రాయమూ లేదు.తెదెపాని ఖాళీ చేయించకపోతే కేసీయార్ ఖాళీ అయిపోతాడు!

          తెదెపాని ఖాళీ చేయించటం కేసీయార్ యొక్క ప్రధమావసరం గనక ఖచ్చితంగా ఇప్పుడు  కనబడుతున్న వోటుకు నోటు కేసు లాంటిదాన్ని సినిమా కధలాగా నేను వూహించ లేదు గానీ అలాంటి వ్యూహం ఒకటి తప్పకుండా వేస్తాడు అని అనుకుంటూనే ఉన్నాను, వేశాడు!ఆంధ్రావాడిగా కేసీయార్ దాడిని వ్యతిరేకించినా అది బాబు స్వయంకృతం అని మీకూ నాకే కాదు బాబుకి కూడా తెలుసు.కేవలం తెలంగాణని విడగొట్టి వదిలెయ్యకుండా అభివృద్ధి లోకి తీసుకు రావడం కోసం ఇప్పుడు మొత్తం తెలంగాణలో కేసీయార్ కన్న సమర్ధుడు మరొకడు లేడు.కాబట్టి అతనికి ఇబ్బందులు కలిగించకుండా ఉంటమే ఉత్తమం.అందుకోసం అన్ని పార్టీల లోని పనికొచ్చే వాళ్ళని ఆకర్షించినా తప్పు లేదు.మరి ఇంతకాలం హెందుకయ్యా హరిబాబూ నిప్పులు చెరిగావు కేసీయార్ మీద అంటారా - విషయాని బట్టి తప్ప ఏ మనిషినీ నేను దుర్మార్గుడు,సన్మార్గుడు అని గీత గియ్యను!నేను నిలబడిన ఒక సన్నివేశంలో నా ఎదుట నిలబడిన మనిషి తప్పు చేస్తే వ్యతిరేకిస్తాను,అదే మనిషి మరో సన్నివేశంలో ఒప్పు చేస్తే మెచ్చుకుంటాను - అదీ నా పద్ధతి.

          ఇకనుంచయినా బాబు "రెండు కళ్ళు","తెలుగువాళ్ళని కలపటం" మర్చిపోతే బాగుంటుందని నా కోరిక.ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు చీమలూ జెర్రులూ పకౌతున్నట్టు ఉండేవి.విడిపోయిన మూడేళ్ళ తర్వాత కూడా ఎప్పుడో మమ్మల్ని వెక్కిరించారనీ "చెప్పాలె" అనుకోనివ్వలేదనీ ఏడ్చేవాళ్ళతో ఎవడు కలవగలడు?పాపం ఇప్పుడు బాబుకీ అనిపిస్తుంటుందేమో లెండి రెండు కళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా గుడ్డికన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంత అని:-(

పెరుగు పెరుగే,మజ్జిగ మజ్జిగే!ఆంధ్రా ఆంధ్రాయే,తెలంగాణ తెలంగాణయే

2 comments:

  1. రెండు కళ్ళ సిద్ధాంతం ఇంకా వదలకపోతే, ఉన్న ఒక్క కన్ను కూడా పోవడం పక్కా. హైదరాబాద్ తో అనుబంధం ఆంధ్ర ప్రజలకి గత చరిత్ర మాత్రమే. ఇప్పటికైనా బాబు గారు డబ్బా వాగుడు మాని, పనిలో ప్రతాపం చూపించాలి

    ReplyDelete
  2. Yes sir you are right. Babu should concentrate on Andhra. KCR and KTR are capable of developing Telangana. I was against division of AP. Still, I feel that KCR and KTR are doing good job. They are sincere and have a vision for Telangana. Babu want to travel in two boats. He should keep off Talangana. At the same time Babu is playing cheap caste based politics in Andhra. Casteism is the bane of Andhra people.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...