Monday 29 February 2016

రిజర్వేషన్లు ఎవడు గట్టిగా అడిగితే వాడికల్లా ఇచ్చెయ్యటమేనా?కులాన్ని వెనకబడ్డదిగా గుర్తించండని పోట్లాడే బదులు ముందుకెళ్ళటానికి పోట్లాడొచ్చుగా!

          ఒకప్పుడు వీరశైవం ఉదృతంగా ఉన్నకాలంలో గ్రామాలలో ఒక తంతు నడిచేది.వీరశైవంలో అతి ముఖ్యమైనది లింగధారణ చేసిన ప్రతివాడూ శివరూపమే అన్న సూత్రీకరణ,ఇది మొదట్లో ఆ శైవమతం వరకు అందరూ సమానం అనుకోవడానికి పెట్టిన నియమం, మంచిదే పాపం!ఇక జంగమదేవరల్ని అపర మాహేశ్వరులు అని పిలిచేవాళ్ళు. వీళ్ళు భిక్షాటన కోసం గుంపులు గుంపులుగా వూళ్ళమీద పడేవాళ్ళు.మళ్ళీ వూళ్ళలోకి వెళ్ళాక వీధుల్ని కూడా వాళ్ళలో వాళ్ళు తీరుగా పంచుకునేవాళ్ళు.ఖర్మకాలి ఎవరైనా గృహస్థు వీళ్ళకి భిక్ష వెయ్యకపోయినా, లేక ఆలశ్యం చేసినా విపరీతంగా రెచ్చిపోయేవాళ్ళు.ఇంట్లో చొరబడి నానా భీబత్సం చేసేవాళ్ళు, అది చాలదనుకుంటే శంఖధ్వానం - వూళ్ళో ఉన్న అందరు జంగమదేవరలకీ ఆహ్వానం అన్నమాట!ఇంక చూసుకోండి,ఇవ్వాళ్టి మాఫియాలూ ఆకు రౌడీలూ కూడా చెయ్యనంత అల్లరి చేసేవాళ్ళు.వీరముష్టి అనే మాట కూడా వీళ్ళని చూసే పుట్టించారు."సాగినంత కాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే చతికిలబడుదురు" అన్న సుకవివాక్యం ప్రకారం మొదట్లో హవాహవాయి అన్నట్టు నడిచిన యవ్వారమే తర్వాత మొత్తం శైవమే వెనక్కి జరిగి వైష్ణవం ముందుకు రావడానికి కారణమైంది.

          ఇవ్వాళ రిజర్వేషన్ల కోటాలో వాటా కోసం జరుగుతున్న రగడలు చూస్తుంటే నాకు మళ్ళీ అదే వాతావరణం కనిపించి మళ్ళీ అదే పద్ధతిలో మొత్తం రిజర్వేషన్ల తంతు కూడా వీరశైవం మాదిరే అదృశ్యమైపోతుంది కాబోలు ననిపిస్తున్నది!నిన్నటి రోజున ఆంధ్రాలో కాపుల్ని బీసీల లిస్టులోకి ఎక్కించాలని రైలుబోగీలు తగలబెట్టి హింసాకాండ సృష్టించారు.అయిదు రోజులకి ముఖ్యమంత్రి హడావిడి ప్రకటన చెయ్యగానే ఆగిపోయింది.ఆపకపోతే వీళ్ళకిస్తే తమ వాటా తగ్గుతుందని బీసీల సంఘంవాళ్ళు ఆందోళన చెయ్యటానికి రెడీగా ఉన్నారు.ఇప్పుడు జాట్ కులస్థులు మొదలుపెట్టారు.ఎందుకొచ్చిన గోల అనుకుంటున్నారో ఏమో వీళ్ళకీ వాగుదానమో చెరువుదానమో చేసి చల్లబరుస్తారు లెండి!వీళ్ళు చల్లబడ్డాక ఇంకో కులంవాళ్ళు మొదలుపెడతారు - హనుమంతుడి తోకలాగ!రామాయణంలో కధాగమనానికి ఏ ప్రాధాన్యతా లేని ఒక విచిత్రమైన సన్నివేశం ఉంటుంది.ఒక వ్యక్తి స్వర్గారోహణ చేశాక కూడా అప్పుడప్పుడూ భూమి మీదకి వచ్చి తన శరీరాన్ని తనే తినివెళుతూ ఉండే  దివ్యపురుషుడి కధ ఒకటి ఉంది.అప్పుడది నాకు ఎందుకు రాశాడో,దాని ప్రయోజనమేమిటో అర్ధం కాని మిస్టరీ అనిపించింది గానీ ఇప్పుడు కొందరు రాజకీయనాయకులు అడుగంటిపోయిన పాప్యులారిటీని పెంచుకోవటానికి పరిష్కారం లేని/కుదరని సమస్యల్ని జనం మీదకి వదులుతూ కీర్తిభోజనుల మాదిరి బతకడం చూస్తుంటే వాల్మీకి అతని కాలంలోనూ ఇలాంటివాళ్లని చూసి మార్మిక రూపంలో అలా చెప్పిఉంటాడు అనిపిస్తున్నది!

అసలు రిజర్వేషన్లు ఎందుకు ప్రతిపాదించారు?


          అంబేద్కర్ గారు 1956 నాటికే తన సాటి దళిత మేధావుల గురించి పూర్తి నిరాశా నిస్పృహలకి లోనయ్యాడని మీకు తెలుసా?"on 18 March 1956 at Ramlila Ground, Agra he said with a heavy heart that, “The educated people have betrayed me. I was thinking that after education they will serve their society. But I find that a crowd of clerks had gathered around me, who are engaged in filling their belly”. This heart burning is a proof that educated and intellectual class is alienated from the society and is going away from its brotherhood."స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళ లోపే,అంటే తను ఈ దేశపు విద్యావంతుల విచక్షణా జ్ఞానం మీదా సామాజిక బాధ్యత మీదా ఎన్నో ఆశలు పెట్టుకుని సంతో తెలివిగా పెట్టిన రిజర్వేషన్ల వ్యవస్థ గురించి అంత తొందరగా అంత నిస్పృహకి ఎందుకు గురయ్యాడు?ఎందుకంటే,గాంధీ యొక్క అహింసాయుత పోరాటం అనే వింత సిద్ధాంతం అతడికి తప్ప ఇంకెవరికీ అర్ధం కానట్టు అంబేద్కర్ రిజర్వేషన్ల విధానం ఎందుకు ప్రతిపాదించాడో అటు ప్రభుత్వంలో ఉండి అమలు చెయ్యాల్సిన పెద్దమనుషులకీ ఇటు దాని ఫలితాన్ని అందుకోవలసిన దళిత విద్యావంతులకీ అసలేమాత్రం అర్ధం కాలేదు!

          నిజానికి ఈ ప్రత్యేక రక్షణ(reservation) అనేది ఎవరికీ కవచాలు తొడిగి రక్షించటానికి ఉద్దేశించినది కాదు.అసలు దీని యొక్క ప్రాధమిక లక్ష్యానికి తగిన పదం ప్రత్యేక ప్రాతినిధ్యం!ఇప్పుడు ఎవరైతే ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని కోరుకుంటున్నారో వారు దాని అర్ధాన్నీ పరమార్ధాన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాలి.దానికి పరిమితులు కూడా ఉన్నాయనేది గ్రహించాలి.అది ప్లాసిబో లాంటి సర్వరోగనివారిణి ఎన్నటికీ కాదు.అది ఒక వ్యక్తికి కొంత సౌకర్యం ఇస్తున్నా ఆ ఇవ్వడం అతనికి వ్యక్తిగతంగా ఇవ్వడం లేదు,కులపరంగా ఒక వ్యక్తికి మనం ఉద్యోగంలో గానీ శాసనసభ్యత్వంలో గానీ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామంటే ఆ వ్యక్తి తను నిలబడిన సమూహంలో తన కులానికి ఒక గొంతునీ,గుర్తింపునీ సాధించి ఆ కులానికి ప్రతినిధిగా నిలబడే అవకాశం కల్పిస్తున్నాము అని అర్ధం!కానీ ఈ దేశపు దళిత విద్యావంతులు ఆ గురుతరమైన బాధ్యతని నిర్వర్తించటంలో దారుణంగా విఫలమయ్యారు - అదే అంబేద్కర్ బాధకి కారణం!

          మొదటిసారి రిజర్వేషన్ వల్ల లాభం పొందినవాళ్ళు ఆ ప్రాతినిధ్యాన్ని ఇంకా పెంచటానికి,అంటే ఏ వెనుకబాటుతనాన్ని గుర్తించి తనకి అవకాశం కల్పించబడిందో అలాంటి మరిన్ని అవకాశాలను తన కులంలోని మిగిలిన వారికి కూడా దక్కే విధంగా కృషి చెయ్యాలి.కానీ వాస్తవంలో ఏమి చేశారు.తమకి ఉద్యోగం రాగానే తను ఎంత తొందరగా ప్రమోషన్ ఎట్లా కొట్టెయ్యాలి, ఎంత తొందరగా బంగ్లా,కారు,హోదా తెచ్చుకోవాలి అనే రంధిలో పడిపోయారు.అంబేద్కర్ వీళ్ళని చూసి బాధపడిన అప్పటికీ రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తూ డెబ్భయ్యేళ్ళు గదిచిన ఇప్పటికీ అదే పరిస్థితి.ఇవ్వాళ ఏ కులపరమయిన వెనుకబాటుతనం వల్ల తాము కొత్తగా సౌకర్యం పొందారో ఆ బుద్ధిమంతులకి తమ కులంలోని మిగిలిన వ్యక్తుల పట్ల సానుభూతి లేదు గానీ నిన్నెప్పుడో అగరకులాల వాళ్ళు మమ్మల్ని అణగదొక్కేశారు మొన్నెప్పుడో బ్రాహ్మణులు మమ్మల్ని చదువుకోనివ్వలేదు అని సొల్లుకబుర్లు చెప్పే డొల్లతనం పెరిగింది!కార్య కారణ సంబంధాన్ని బట్టి రాగద్వేషాల కతీతంగా చెప్పవలసి వస్తే రిజర్వేషన్ వ్యవస్థ అంబేద్కర్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడే విఫలమైపోయింది.

కమ్యూనల్ అవార్డు నుంచి రిజర్వేషన్ల వరకు!


          1933 ఆగస్టులో బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డోనాల్డ్ భారతదేశపు పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన కమ్యూనల్ అవార్డ్ చట్టానికి రూపకల్పన చేశాడు.ఇందులోని అతి ముఖ్యమైన అంశం ముస్లిములు,శిఖ్ఖులు,భారతీయ క్రైస్తవులు,ఆంగ్లో ఇండియన్లు,యూరోపియన్లు దళితులు - భిన్నవర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా ఎన్నికలు జరిపించటం.అంటే ఒక ప్రాంతంలో ఆయా వర్గాల జనసాంద్రతని బట్టి ఆయా ప్రాంతాలను ఆయా వర్గాలకు కేటాయిస్తారు.అన్ని పార్టీల వారూ ఆయా వర్గాలకి చెందిన వారినే అబ్యర్ధులుగా నిలబెడితే ఆయా వర్ణాల వారు మాత్రమే వోటు చేయాలి.ఈ అవార్డు భారతదేశపు నాయకుల మధ్యన వివాదాస్పదమైంది.అంబేద్కర్ ఎంతో ఉత్సాహంగా సమర్ధించినా మోహనదాసు ముస్లిముల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చెయ్యలేదు గానీ దళితుల్ని మాత్రం హిందువుల నుంచి వేరు చెయ్యటానికి వీల్లేదని పట్టుబట్టి నిరశన దీక్షకి తెగబడ్డాడు.ఎన్నో వాదోపవాదాల తర్వాత అంబేద్కర్ తనకి లోలోపల ఇష్టం లేకపోయినా గాంధీ వైపునుంచి వచ్చిన దళితుల్ని హిందువులలోనే ఉంచి వారికి కొన్ని సీట్లు దఖలు పరచటం అనే ప్లానుకి ఒప్పుకోవలసి వచ్చింది.దీనినే పూనా ఒప్పందం అంటారు.ఇదే స్వాతంత్ర్యాననతరం మరికొన్ని మార్పులు చేర్పులతో మరింత విస్తృతమై ఇప్పటి మోడల్ అయిన రిజర్వేషన్ వ్యవస్థ రూపు దిద్దుకున్నది.

          కులప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు ప్రతిపాదించారో తెలియాలంటే ముందు కులం అంటే ఏమిటో తెలియాలి.మిగతా దేశాల్లో ఎక్కడా ఇంత స్పష్టమైన కులవిభజన లేదు - కొంతమేర పోలికలు కనబడటమే తప్ప.అందువల్లనే ఈ కులవ్యవస్థ ఇక్కడ వివాదం కూడా అయ్యింది.కొందరు దీనిని హిందూధర్మంలో చెప్పబడిన చాతుర్వర్ణం లాంటివాటితో కలిపి బ్రాహ్మణులు చేసిన కుట్ర అంటున్నారు.ఈ హిందూమతంలో బ్రాహ్మణుల కున్న గౌరవాన్ని బట్టి మతానికి సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో వారికున్న ప్రాధాన్యతని బట్టి దీనికి "బ్రాహ్మణ మతం" అని పేరు కూడా పెట్టేశారు.కానీ చారిత్రక పరిశోధకులు ఎవరూ వీరు చెప్తున్న బ్రాహ్మణాధిక్యతకి సంబంధించిన పూర్తి ఆధారాల్ని చూపించలేకపోయారు.ప్రపంచంలో ఎక్కడ సంపద పుట్టినా అది భూమినుంచే వస్తుంది.అన్ని కాలాలలోనూ అన్ని అదెశాలలోనూ సంపద భూమినుంచి పుట్టిన వస్తువులను విపణి(మార్కెట్) దగ్గిర అమ్మడం వల్ల పుడుతుంది.

          ప్రపంచంలోని అతి ప్రాచీనమైన మానవ సమూహం అయి ఉండటం వల్ల ఈ సంపదని సృష్టించడం కూడా చాలా ముందుగానే మొదలుపెట్టారు.మొహెంజెదారో కాలం నాటికే ఇక్కడ గొప్ప ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం జరిగింది.అప్పటికే దూరప్రాంతాలతో వాణిజ్యం ద్వారా విదెశీ మారక ద్రవ్యపు నిల్వల్ని సాధించారు.దానికి సాక్ష్యం ఆ కాలంలోని ఇతర ప్రాంతాల ప్రజలు వాడే నాణెములు,వస్తువులు అక్కడ దొరకటం.వ్యవసాయం కన్నా వీరు వ్యాపారం మీదనే ఎక్కువ ఆధారపడినారని తెలుస్తుంది.అయితే, వీరు చేసిన వ్యాపారానికి మూలమైనవి ఏమిటో తెలుసా - బొమ్మలు!అప్పటి కాలానికి అద్భుతం అనిపించేటంతటి నాణ్యమైన పనితనంతో హస్తకళాకృతులు తయారుచేసి అమ్మేవారు.ఇప్పుడు త్రవ్వకాలలో బయటపడిన వాటి నునుపుదనం చూసి వాటిని పరిశోధిస్తున్న నవీన కాలపు శాస్త్రవేత్తకి కళ్ళు తిరిగినంత పనయ్యింది, నిజంగానే!"కార్బన్ డేటింగ్ మెధడ్ ద్వారా టి కాలం తెలిసింది గాబట్టి నమ్ముతున్నాను గానీ లేకుంటే నమ్మలేను,ఎందుకంటే మా దేశంలో 18వ శతాబ్దిలో తయారయిన వాటిలో కూడా ఇంత నునుపుదనం చూడలేదు" అన్నాడు.ఇప్పుడు మనం ఆధునిక కాలంలో తెలుగునేలపై కనబడుతున్న హస్తకళానిపుణులకు వీరు ఆద్యులు.ఒక కళలో అంతగా ఆరితేరడానికి ఒక వ్యక్తి జీవితకాలం సరిపోదు.కొత్తది కనిపెట్టడం,శిష్యులకి నేర్పడం,గురువు నుంచి నేర్చుకోవడం,కొత్తది చేర్చడం అనే నిరంతర ప్రక్రియ ద్వారానే అది సాధ్యమవుతుంది.అందుకోసం దానిపట్ల ఆసక్తి ఉన్నవారందరూ వీలయినంత ఎక్కువకాలం ఒకచోట గడపాలి.కొన్ని తరాల పాటు జరిగిన అలాంటి సహజీవన పరంపర నుండి కులాలు స్థిరపడినాయి.ఇవ్వాళ తెలుగునాట మనం చూస్తున్న ప్రతి కులమూ ఒక వృత్తికి అనుసంధానించబడి ఉండటం ఆ వృత్తికి కావలసిన నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవటానికీ,ఆ వృత్తి మీద వచ్చే ఆదాయం మీద పట్టు సాధించడం కోసమే ఏర్పడింది.వ్యవసాయం కూడా లాభసాటి అయ్యాక వ్యవసాయానికి అనుబంధంగ ఉండే వృత్తులకి సంబంధించిన కులాలు వ్యవసాయదారులకి తమ నైపుణ్యాన్ని వస్తుసేఅవల రూపంలో ఇస్తూ పరస్పరాశ్రితులుగా ఉందే స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థ ఒకటి ఉద్భవించింది.ఈ అన్ని సామాజిక దశలలోనూ ఇక్కడ పెరిగిన సంపద విదేశీయులకి ఈర్ష్య కలిగించిందంటేనే ఆ వ్యవస్థ ఎంత విజయవంతంగా నడిచిందో అర్ధమవుతుంది. ఎన్నిసార్లు ఎంతమంది దోచుకుపోయినా మళ్ళీ పుడుతూ ఉందేది అక్షయపాత్ర లాగ!

          ఆ అక్షయపాత్ర భిక్షాపాత్ర అయింది ఇంగ్లీషువాళ్ళ క్రూరమైన పరిపాలన వల్లనే!బాబరు నుంచి ఔరంగజేబు వరకు ఉన్న మొఘల్ ప్రభువులూ,నాదిర్ షా వంటి ఇతరులూ కూడా సంపదని తమ మూలస్థానాలకి తరలించుకుపోకుండా ఇక్కడే రాజ్యం చెయ్యాలనుకున్నారు గాబట్టి మౌలికమైన ఆర్ధిక చట్రాన్ని వారెన్నడూ ధ్వంసం చెయ్యటానికి ప్రయత్నించ లేదు.ఇవ్వాళ గోమాంసం తినటం హిందూమతోన్మాదులను వ్యతిరేకించటం కాబట్టి చేసి తీరతాం అంటున్నవాళ్ళకి ఔరంగజేబు కూడా గోవధ నిషేధ చట్టాలు చేశాడనేది తెలుసా!తన రాజ్యంలో పక్క రాజ్యం కన్నా ఎక్కువ సంపద పోగవ్వాలని కోరుకుంటాడే తప్ప ఏ ప్రభువూ సంపద పెంచే అవకాశాల్ని ధ్వంసం చెయ్యడు.ఇంగ్లీషు వాళ్ళకి ఈ దేశప్రజల పట్ల బాధ్యతా లేదు, ఈ దేశం నష్టపోతే ఏమి చెయ్యాలన్న బాధ కూడా లేదు - జండా ఎత్తేసి మరో చోట పాతుతాడు!

        స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఇంగ్లీషువాళ్ళ అడ్డగోలు పరిపాలన వల్ల మొత్తం భారదదేశమంతా వట్టిపోయిన గొడ్డులా తయారయింది.అలాంటి స్థితిలో హఠాత్తుగా స్వేచ్చావాయువులు పీల్చుకున్నప్పుడు ప్రతివాడూ తను బాగుపడటం గురించే ఆలోచిస్తే అప్పటికే ముందున్నవాళ్ళు ఇంకా ముందుకెళ్ళి అప్పటికి వెనకబడి ఉన్నవాళ్ళు ఇంకా వెనక్కి వెళతారు.ఆ సమయంలో రిజర్వేషన్లు పెట్టకుండా సర్వసమాంత్వం ఆశిస్తే సాయుధ పోరాటం ద్వారా వచ్చే విప్లవమే శరణ్యం!ఆ భీబత్సాన్ని నివారించడం కోసమే ఆనాడు అంబేద్కర్ లాంటి దేశభక్తులు రిజర్వేషన్ల వ్యవస్థని ప్రతిపాదించారు. అప్పటికే రిజర్వేషన్లని బలంగా వ్యతిరేకిస్తున్న ప్రతివాదుల నుంచి వస్తున్న ఎన్నో అభ్యంతరాల్ని పూర్వపక్షం చేసి మొండిగా నిలబడటం వల్లనే ఆనాడు రిజర్వేషన్ల వ్యవస్థ అమలులోకి వచ్చింది.అంబేద్కర్ దార్శనికతలో దోషం లేదు,కాకపోతే ఆయన సాటి దళిత మేధావుల యొక్క సమర్ధత గురించి ఎక్కువగా వూహించుకున్నాడు - అమాయకుడు!

అసలు ఎవరు ఎప్పుడు ఖచ్చితంగా రిజర్వేషన్లని ప్రారంబించారు?


         క్రీ.శ 1882లో హంటర్ కమిషన్ మొదటిసారి ఈ కోణంలో తన పనిని మొదలుపెట్టింది.అప్పట్లోనే జ్యోతిబా పూలే ఉచిత విద్య కోసం,ప్రభుత్వ ఉద్యోగాలలో కనీస ప్రాతినిధ్యం కోసం కృషి చేస్తున్నాడు.క్రీ.శ 1901లో కొల్హాపురి సంస్థాన ప్రభువైన చత్రపతి షాహుజీ మహరాజ్ తన రాజ్యంలో బ్రాహ్మణేతరులకి,వెనుకబడిన తరగతులకి రిజర్వేషన్లని ప్రారంభించాడు.ఈ మంచి మహారాజు ఉచితవిద్యని కులమతాల కతీతంగా అందరికీ అందించే ఉద్దేశంతో విద్యార్ధుల సౌకర్యం కోసమని వసతిగృహాలు కూడా తనే నిర్మించి అన్ని విధాల లోపరహితమైన విద్యావ్యవస్థని తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది.విద్య ముగిసిన తర్వాత ఉద్యోగలభ్యత విషయంలో కూడా శ్రద్ధ చూపించినట్టు తెలుస్తున్నది.ఇతను 1902లో అంటరానితనం లేని,కులభేదాలు లేని భారతదేశం గురించి ప్రతిపాదిస్తూ ఒక ప్రసంగం చేశాడు.అధికారికంగా ప్రభుత్వాల తరపు నుంచి రిజర్వేషన్లని ప్రతిపాదిస్తూ వచ్చిన మొదటి ప్రకటన ఇదే.

          భారతదేశంలొని అత్యంత దారుణమైన దురాచారం అంటరాని తనం.దీని ప్రారంభం ఎప్పుడో తెలియదు గానీ ఆనాటి నుంచీ ఈనాటి వరకూ ఎందరో మహానుభావులు ఎంత పోరాడినా ఇంకా వదలకుండా ఒక సమూహం మొత్తాన్ని కేవలం ఆ కులంలో పుట్టినందుకు ఇతర్లు ముట్టుకోవడానికే కూడా ఇబ్బంది పడే భయానకమైన పరిస్థితి కొనసాగుతున్నది.అలాంటి మానసికపరమయిన చొరవలేమిని తొలగించటానికి ప్రతిపాదించిన రిజర్వేషన్ల కోటాలో వాటా కోసం ఆ పరిస్థితి లేని కులాలు కూడా పోటీ పడటం దేనికి?ఇవ్వాళ రిజర్వేషన్ల కోటాలో వాటా పొందటం అనేది బలప్రదర్శన తంతు కింద తయారయిందే తప్ప నిజంగా రిజర్వేషన్ల కోటాలో వాటా వచ్చెయ్యగానే తమకి గట్ట్ మేలు జరుగుతుందనే గ్యారెంటీ ఉండి కాదు!

రిజర్వేషన్లలో ఆర్ధిక ప్రాతిపదిక ఎంతవరకు సబబు?


          పొరపాట్న కూడా రిజర్వేషన్లలో ఆర్ధికపరమైన వెసులుబాటును కల్పించడం గురించి గానీ  ఆర్ధిక స్థితిగతుల్ని బట్టి రిజర్వేషన్లని వర్తింపజెయ్యటం గురించి గానీ ఆలోచించకూడదు.ఎందుకంటే, మొదటి నంచి చెప్తున్నట్టు ఇది ఆర్ధిక స్వావలంబన కోసం ఉద్దేశించిన పధకం కాదు.ఈ మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థని అంత గొప్ప దార్సనికత కలిగి ఉండి రూపుదిద్దిన అంబేద్కర్ దీనిని ఎందుకు వదిలేస్తాడు?

          ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తి బీదవాడైనా అతనిలో పుట్టుకకి సంబంధించిన ఆత్మన్యూనత ఉండదు.అట్లాగే మాదిగ కులానికి చెందిన వ్యక్తి అయితే ధనవంతుడైనా పుట్టుకకి సంబంధించిన నిరాదరణని ఎదుర్కొనే పరిస్థితి ఉంది గాబట్టి దానిని గుర్తించి ఆ కులానికి రిజర్వేషన్లు అనే వ్యవస్థని ప్రతిపాదించారు.ఒక వ్యజ్తిని గానీ సమూహాన్ని గానీ ఆర్ధిక స్వావలంబన వైపుకి నడిపించటానికి ఇతర మార్గాలు చాలా ఉన్నాయి - ఒక రకంగా ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి పౌరుడికీ చెయ్యాల్సిన సేవ అది!దానికోసం రిజర్వేషన్లని ఊపయోగించడం కంటే రిజర్వేషన్లని ఎత్తెయ్యడమే మంచిది.

రిజర్వేషన్లు కులాల కుమ్ములాటలను పెంచుతున్నాయనేది నిజమేనా?


          రిజర్వేషన్లని ప్రవేశపెట్టింది కులాల మధ్యన అంతరాల్ని తగ్గించడానికే!రిజర్వేషన్ల గురించి ఈ పాయింటు లాగి రిజర్వేషన్లని డుల్ల్లించటానికి చూసేది ఇప్పటికే ముందుకు పడిపోయిన వారు.ఆ కోటా లేకపోతే తమ కులం వాళ్ళతో సమస్తాన్ని నింపేసి మందబలాన్ని పెంచుకోవాలనుకునేవాళ్ళు.రిజర్వేషన్ల వల్ల ప్రతిభకి అన్యాయం జరుగుతుందనేది మరొక ఆరోపణ.ఇది కూడా దుర్మార్గమైన మాటే.ఎక్కడ రిజర్వేషన్లను ప్రతిపాదించినా మొదట ఆ వ్యక్తి ఆ ఉద్యోగానికి అర్హుడా కాదా అనేది చూస్తారు.బాగా డబ్బులున్న పైకులంవాడు 90% సాధించితే అదంతా అతని స్వయంప్రతిభయేననీ చూచిరాతలు రాసి ప్యాసవలేదనీ గ్యారెంటీ ఉందా?కాపీలు కొట్టటమే కాదు, ట్యూషన్లు పెట్టించుకునే వెసులుబాటును ఉపయోగించుకోవటం ద్వారా కూడా ఎక్కువ మార్కులు సాధించవచ్చును.కానీ సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిన వ్యక్తి 80% సాధించినా దానికి విలువ ఇవ్వకపోవడం అన్యాయమే కదా!

          అయితే పైన చెప్పుకున్నట్టు రిజర్వేషన్లు పొందినవారు వెనక్కి తిరిగి తన కులం గురించి ఆలోచించకుండా అప్పటికే ముందుకు పడ్డవారితో సమస్థాయిని ఆస్వాదిస్తూ కుక్షింభరులుగా మాత్రమే మిగిలిపోతున్నందువల్ల ఈ వాదనకి బలం వచ్చింది.ఇవ్వాళ మాలమహానాడు,మాదిగ దండోరా చేస్తున్నదేమిటి?రిజర్వేఅషన్ల కోటాలో వాటా తగ్గకుండా చూడ్డమో ఇంకా పెంచడమో తప్ప వారి వర్గానికి నిర్మాణాత్మకంగా చేస్తున్నది ఏమీ లేదు!ఆ సంస్థ లోని పైస్థాయిలోని వారు మాత్రం రాజకీయ ప్రాభవాన్నీ ఆర్ధిక స్వావలంబననీ పొందుతున్నారు.

         ఈ రిజర్వేషన్లు అనేవి వ్యక్తులు కేవలం ఆర్ధికంగా పైమెట్టుకు చేరటానికి ఉపయోగపడే నిచ్చెనమెట్లు కావని అర్ధమయితేనే అంబేద్కర్ ఎందుకంత బాధపడ్డాడో తెలుస్తుంది. అంబేద్కర్ బాధపడిన విధంగా కాకుండా దళిత విద్యాధికులు మరికొంత బాధ్యతా యుతంగా ప్రవర్తించి ఉంటే ఈపాటికే అంతరాల నిర్మూలన పూర్తయి అందరి అంగీకారంతో రిజర్వేషన్ల వ్యవస్థని రద్దు చెయ్యటం కూడా జరిగిపోయి ఉండేది.

ఈ రిజర్వేషన్లని ఎంతకాలం వరకు కొనసాగించాలి?


          తొలినాళ్ళలో చట్టసభల్లో ప్రవేశానికి సంబంధించిన రిజర్వేషన్లని 10 సంవత్సరాలు మటుకు ఉంచి తర్వాత మదింపు ద్వారా ఇక అనవసరం అనుకుంటే రద్దు చేసే ప్రతిపాదన ఉంది.అయితే ఎలాగూ వెసులుబాటు ఉంది కదాని మదింపుతో సంబంధం లేకుండానో తూతూ మంత్రపు మదింపుతోనో పొడిగించుకుంటూ వస్తున్నారు.విద్యా ఉద్యోగ విషయాలకి సంబంధించి ఆ సూచన కూడా లేదు.

          మొదట ఒక కులాన్ని కోటాలో చేర్చినపప్పటికి 20 సంవత్సరాల తర్వాత మదింపు చేసి ఆ కులం యొక్క ప్రాతినిధ్యం తగినంతగా ఉన్నదని నిర్ధారించి కోటా నుంచి తొలగించడం న్యాయమే.ఆ స్థానంలో ఆ వెసులుబాటుని కొత్త వర్గాలని ప్రోత్సహించడానికి ఉపయోగించవచ్చును.

          కానీ తమ కులాన్ని లిస్టులో ఉంచుకోవటం,వాటాని పెంచుకోవడం రాజకీయ బలప్రదర్శన స్థాయికి దిగజారిన ఇప్పుడు న్యాయాన్యాయాల గురించి ఆలోచించేదెవరు!


రిజర్వేషన్ల వల్ల ఆయా వర్గాలకి సిద్ధించిన నిజమైన ప్రయోజనం ఎంత?


          రిజర్వేషన్లు అనేవి పూర్తిగా ప్రభుత్వోద్యోగాలలో ప్రవేశించడానికి మాత్రమే ఉద్దేశించినవి.2014లో వేసిన ఒక అంచనా ప్రకారం 14 లక్షలమంది రిజర్వేషన్ల విధానం ద్వారా ఉద్యోగాలు దక్కించుకోగలిగారు.మూదవ,నాల్గవ తరగతి ఉద్యోగులలో కోటాను మించి 16% ఉంది.మొదటి,ఎండవ తరగతి ఉద్యోగులలో వెనుకబడిన తరగతుల వారు 8% నుంచి 12% వరకు ఉన్నారు.రిజర్వేషన్లు అనే మార్గం లేకుంటే వీరెవరూ అక్కడికి చేరుకోవటం దాదాపు అసాధ్యం.ఇంత సుదీర్ఘమైన కాలాన్ని బట్టి చూస్తే మరీ ఇంత తక్కువా అని దీని గురించి నిరాశ పడనక్కర లేదు.

          అసలు సమస్య,స్వాతంత్ర్యం వచ్చి డెబ్భయ్యేళ్ళు గడిచాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన స్థానాల్ని రిజర్వేషన్ల ద్వారా పొందినవారిలో ఎంతమంది తమ బుద్ధినీ కాలాన్నీ తమ కులానికి గౌరవమైన స్థానాన్ని కల్పించేటందుకు ఉపయోగించారు అని గనక ప్రశ్నించుకుంటే చాలా దయనీయమైన జవాబు వస్తుంది!దేశంలో ఉన్న సంపదనంతా దోచిపెట్టనక్కర లేదు, ఇప్పటివరకు పై స్థాయిలో తమ సుదీర్ఘమైన ఉద్యోగజీవితకాలంలో తమ కులానికి చెయ్యాల్సిన న్యాయమైన సహాయం చెయ్యడానికి అవసరమైనవన్నీ వారిచెంత ఉన్నాయి,కానీ వారినుండి వారి కులానికి అందినది శూన్యం.అసలైన విషాదం వీరు మెల్లమెల్లగా తమ కులానికి దూరంగా జరుగుతూ "ఉన్నత తరగతి దళితులు" అని పిలవాల్సిన పరిస్థితికి దిగజారిపోయారు.

          వీరి పతనానికి పరాకాష్ఠ ఖెయిర్లంజి కేసులో స్పష్టంగా తెలుస్తుంది.ఒక్కర్ని విడిచి మొత్తం దళిత కుటుంబాన్ని చంపేసిన  కేసులో దళిత ప్రజాసేవకులు,దళిత అధికారులు తమ స్వకులపు సోదర సోదరీల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించారు,అధికారంలోకి రాగానే పరిపాలక మనస్తత్వంలోకి వెళ్ళిపోయారు!నిన్నటి రోజున ఏ రకమైన రాజ్యం తమ కులాన్ని వెనకబడేలా చేసిందో ఆ రాజ్యపు ఆదర్శాలని వీరు ఏమాత్రం సంకోచం లేకుండా ఆమోదించేశారు - మరి,గంభీరమైన దళిత భావజాలపుస్పూర్తి ఏమైనట్టు?

దళితులు బ్రాహ్మణుల వల్ల అణచబడి ఇంగ్లీషువాళ్ళ వల్ల పైకొచ్చారనేది నిజమేనా!


          నేను మీ జేబులో చెయ్యి పట్టి మీ పర్సు లాగితే నన్ను దొంగంటారు,నన్ను నడిబజార్లో పెట్టి పరువు తీస్తారు.అదే నేను తెలివిగా మాయకబుర్లు చెప్పి మీ అంతట మీరే మీ పర్సు తీసి నాకిచ్చేటట్టు చేస్తే మీరు నన్ను తిట్టలేరు,పైగా చూసేవాడు ఎవడయినా నేను చేస్తున్న మోసం గ్రహించి నన్ను తిడుతుంటే మీ వెర్రితనం ఎక్కడ బయటపడుతుందో అని నష్టం ఎటూ జరిగిపోయింది గాబట్టి పరువు నిలబెట్టుకోవాలని అనిపిస్తే మీరు నన్ను తిట్టడానికి బదులు నన్ను తిడుతున్న పెద్దమనిషినే "నా అంతట నేనిస్తే ఆయన్నెందుకు తిడతావు,నా నష్టం సంగతి నీకెందుకు?నీ సంగతి నువ్వు చూసుకో!" అని ఝాడించనూ గలరు:-)

          ఎంతమంది ఎన్నిసార్లు ఎంతమొత్తం దోచుకుపోయినా మళ్ళీ కూడదీసుకుని లేచి నిలబడగలిగిన కామధేనువు తొలిసారి ఈచుకుపోయిన గొడ్డులా అయింది ఇంగ్లీషువాళ్ళ వల్ల - గట్టి సాక్ష్యం బెంగాల్ కరువు!ఆ దెబ్బకి అప్పటి వరకు అప్రతిహతంగా సంప్రదాయిక వ్యవసాయం మీద ఆధారపడ్డ స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది.ఏ ఉత్పాతం జరిగినా నిలవలో ఉన్నవాడు తొందరగా సర్దుకుంటాడు గదా. అలాంటి భూస్వాములు తట్టుకోగలిగారు గానీ ఏడాది మొత్తం రైతులకి పనిచేసి సంవత్సరానికి సరిపడే మొత్తాన్ని ఒకేసారి తీసుకుని అది వాడుకుంటూ నిక్షేపరాయుళ్ళ మాదిరి బతకటమే తప్ప నిలవ సొమ్ము లేని కులవృత్తుల వాళ్ళు పూర్తిగా అణగారిపోయారు.

          అలా అణగ్గొట్టిన వాడే ఇవ్వాళ వీళ్ళకి దేవుడయ్యాడు.ఈ పని చేసిన మాయామశ్చీంద్రుడు లార్డు మెకాలే.జనవరి 1835లో ఇతను భారతీయులకి సరికొత్త విద్యని అందించటానికి ఒక ప్రణాళికని సభ ముందుంచాడు.సభ చేత ఒప్పించాడు.అప్పటి వరకు ఇంగ్లీషువాళ్ళు ఇక్కడి రాజుల,జమిందార్ల ద్వారానే పనులు జరిపించుకునేవాళ్ళు సామాన్య ప్రజలతో సంబంధాలు లేకుండా.దీనివల్ల భూఖండం పరతంత్రంలో మగ్గుతున్నా మానవాత్మలు మాత్రం స్వతంత్రంగానే ఉన్నాయి."మొత్తం ఇండియన్,అరబిక్ సాహిత్యాన్నంతా కలిపినా ఒక యూరోపియన్ లైబ్రరీలోని ఒక అరకి తూగదు గదా" అనగలిగిన అజ్ఞానంతో బలిసిన అహంకారి ఈ ఉన్నత తరగతి దళితులకి కారణజన్ముడిలా కనపడుతున్నాడు.

          మరీ అట్లా తీసిపారేస్తే బాగుండదని కాబోలు రూటు మార్చి "ఈ నగరంలోనే స్థానికులలో కందరు ఇంగ్లీషు భాషలో రాజకీయ,ఆర్ధిక,సామాజిక అంశాలను గురించి ధారాళంగా చర్చిస్తూ ప్రసంగించగలిగిన వారు ఉన్నారు. " అని గిల్లి జోల పాడినట్టు  ఓ పొగడ్తను విసిరేశాడు.దానికి సాక్ష్యాలు కూడా ఉండటంతో "నిజానికి కొందరు హిందూ పండితుల ఇంగ్లీషు భాషా ప్రావీణ్యానికి సరితూగగలిగినవాళ్ళు యూరోపియన్ విద్యావంతులలో కూడా లేరు" అని ఒప్పుకున్నాడు.మరి,ఇతను ఈ కొత్త విద్యని ఇంగ్లీషుతో కలిపి అమలుపర్చకముందే కొందరు భారతీయులు అంత పాండిత్యాన్ని ఎట్లా సంపాదించారు?

          ఇంతకీ, ఇతనికి ఇంగ్లీషు భాష మొత్తాన్నీ,అంటే మిల్టను కవిత్వం దగ్గిర్నుంచీ వాళ్ళ జ్ఞానం మొత్తాన్నీ మనకి పరిచయం చేసి మనల్ని తమతో సమస్థాయికి తీసుకెళ్ళీ పక్కన కూర్చోబెట్టుకుని గౌరవించాలనే సదుద్దేశం ఎంతమాత్రం లేదు. చాలా సూటిగా అతని ఉద్దేశం "మనకీ మనం పాలిస్తున్న ప్రజలకీ మధ్యన ఒక దుబాసీ తరగతి:రక్తంలో రంగులో మాత్రమే భారతీయులుగా ఉంటూ అభిప్రాయాలలో,నీతులలో,బుద్ధులలో మనవలెనే ప్రవర్తించగలిగిన ఒక ప్రత్యేక తరగతి"ని సృష్టించటం.ఈ ప్రత్యేకమైన వారధుల ద్వారా స్థానిక భాషలలోనికి ఇంగ్లీషు భాషని ప్రవహింప జేయాలి."Macaulay’s Minute" అనబడే ఈ ప్రణాళికని పరిశీలించిన ప్రపంచ స్థాయిలో నిష్పక్షపాత బుద్ధి గల మేధావులందరూ నిర్ఘాంతపోయారు!పూలచెండులో కత్తిని దాచి చిరునవ్వులతో కానుకగా ఇచ్చినట్టు పరమ దుర్మార్గమైన సామ్రాజ్యవాదాన్ని ఒక జాతిని ఉద్ధరించేందుకు ఉద్దేశించిన సంస్కరణ వలె రూపం మార్చి చూపిస్తున్న ఈ నివేదికని అత్యంత ప్రమాదకరమైన రాజకీయ పత్రాలలో ఒకటిగా వారు గుర్తుపట్టారు - అందుకే ఆ దిగ్ర్భాంతి?!

          అక్కడ మెకాలే మహనీయుడు తన మేధోశక్తి నుపయోగించి ఒక ప్లాను వెయ్యగానే అప్పటి వరకు అజ్ఞానాంధకారంలో ఉన్న భారతీయులు ఈ కొత్తచదువును అమాంతం తలకెత్తుకోలేదు.ఆయన చేసిన ప్రసంగంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాడు - "అప్పటికే ఇంగ్లీషును ఇంగ్లీషువాళ్ళ కన్నా గొప్పగా మాట్లాదగలిగిన వాళ్ళు ఉన్నారు" అన్నాడు.వాళ్లు గాలిలోనుంచి పుట్టుకు రాలేదు కదా!

         అప్పటికి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న గంజాం కలెక్టరేట్ పరిధిలో 255 స్కూళ్ళు ఉన్నాయి.వాటిలో బ్రాహ్మణులు 808 మంది,వైశ్యులు 243 మంది,శూద్రులు 1003 మంది,ఇతర కులాల వారు 896 మంది,ముస్లిములు 27 మంది చదువుకుంటున్నారు.నెల్లూరు కలెక్టరేట్ పరిధిలో 804 స్కూళ్ళు ఉన్నాయి.వాటిలో బ్రాహ్మణులు 2466 మంది,వైశ్యులు 1641 మంది,శూద్రులు 2462 మంది,ఇతర కులాల వారు 432 మంది,ముస్లిములు 620 మంది చదువుకుంటున్నారు.సేలం కలెక్టరేట్ పరిధిలో 388 స్కూళ్ళు ఉన్నాయి.వాటిలో బ్రాహ్మణులు 783 మంది,వైశ్యులు 324 మంది,శూద్రులు 1674 మంది,ఇతర కులాల వారు 1410 మంది,ముస్లిములు 459 మంది చదువుకుంటున్నారు.మద్రాసు కలెక్టరేట్ పరిధిలో 844 స్కూళ్ళు ఉన్నాయి.వాటిలో బ్రాహ్మణులు 1186 మంది,వైశ్యులు 1119 మంది,శూద్రులు 7312 మంది,ఇతర కులాల వారు 3017 మంది,ముస్లిములు 1147 మంది చదువుకుంటున్నారు. సరాసరి చూస్తే శూద్రులు 45%,బ్రాహ్మణులు 23% చదువుకుంటున్నారు.

          క్రీ.శ 1800కు ముందు బెంగాలులో పరిస్థితిని గురించి ఆడం రిపోర్టు ప్రకారం దాదాపు ప్రతి పల్లెలో ఒక స్కూలు ఉంది.దాదాపు ప్రతి జిల్లాలోనూ 100 వరకు ఉన్నత విద్యని అందించే కళాశాలలు ఉన్నాయి.వీటినుంచి 10,8800 మంది ఉత్తీర్ణులై వస్తున్నారని చెప్పాడు.బెంగాలులో చెప్పుకోదగిన సంఖ్యలో మంచి కౌశలం గలిగిన వైద్యప్రవీణులు కూడా ఉన్నారు. క్రీ.శ 1811లో  మొత్తం ఇంగ్లాండు జనాభా 95,43,610 మందిలో సుమారు 75,000 స్కూళ్ళకి వెళ్తున్నారు. క్రీ.శ 1823లో మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం జనాభా 1,28,50,941లో 1,57,195 మంది స్కూళ్ళకి వెళ్తున్నారు.

          ఇంగ్లాడులో క్రీ.17వ శతాబ్దం వరకు చదువు అంటే బైబిల్ చదవటం తప్ప మరొకటి లేదు.క్రీ.శ 1802 ప్రాంతంలో Joseph Lancaster,Andrew Bellలు కొత్తరకం విద్యావిధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. Alexander Walker తన గ్రంధం Note on Indian Educationలో అప్పటికి భారతదేశంలో Bramans చెప్తున్న చదువు గురించి "The children were instructed without violence and by a process peculiarly simple" అని అంటున్నాడు.

          అంతకు ముందు ఉన్న భారతీయుల స్కూళ్ళని నయాన,భయాన బలవంతంగా మూయించివేసిన తర్వాత ఇక మిగిలింది ఏమిటి?ఇవ్వాళ పరోపకారి పాపన్న కంటె ఎక్కువగా వీళ్ళు కీర్తిస్తున్న మెకాలె స్కూళ్ళు!ప్రపంచ స్థాయిలో అనేక విషయాలను గురించి నిష్పాక్షికమైన అభిప్రాయాల్ని చెప్పి సకలజనవంద్యుడైన Mark Twain చదువు - విద్య గురించి "I do not allow my schooling to interfere with my education" అన్నాడు.భారతీయ విద్యావ్యవ్స్థలో ఇంగ్లీషువాళ్ల మూలంగా జరిగిన మార్పు Indian Education System పోయి Macaulay Schooling System రావటం.

       భారతీయ దేహంలో ఆంగ్లేయాత్మని ప్రవేశపెట్టాలనుకున్న దార్శనికుడు మెకాలే కల ఎంతవరకు నెరవెరిందో తెలుసుకోవడానికి 2006,అక్టోబర్ 25వ తేదీన ఈ దేశపు రాజధానిలో జరిగిన ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు పండుగ చాలు.

       అది కొత్తగా పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్న డిల్లీ నగరపు సబర్బన్(శివారు) టవున్సులో ఒక టవునులో చిన్న అపార్టుమెంటు.ఇంటి యజమాని పేరు చందర్ భాను ప్రసాద్,పొట్టిగా,నవ్వుతూ నవ్విస్తూ ఉండే దళితకులానికి చెందిన సామాజిక కార్యకర్త, అతిధులు కూడా ఇతని లాంటి ప్రతిభాశాలురే - దళిత మేధావులు,విద్యావేత్తలు,విదేశీ పాత్రికేయులు.వారిప్పుడు ఒక అపూర్వ వ్యక్త్తి, ధామస్ బాబింగ్టన్,లార్డ్ మెకాలే, గొప్పదైన ఆంగ్లభాషను మొదట భారతదేశానికీ,తదుపరి ప్రపంచానికీ పరిచయం చేసి ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపిన కారణజన్ముని పుట్టినరోజును జరుపుకుంటున్నారు.అయితే జరుగుతున్న పద్ధతి మాత్రం ఆ మహనీయుడు పరిచయం చేసిన పశ్చిమదేసపు ఆదర్శాల ప్రకారం కాకుండా భారతీయుల మూర్ఖపు సంప్రదాయాలనే అనుసరించింది.కలిపి కొట్టరా కావేటి రంగ అన్నట్టు విదేశీ స్కాచ్ విస్కీతో నంజుకోవటానికి స్వదేశీ పకోడీ ఉంది.ఈ పండుగలోని పతాక సన్నివేశం నూతనంగా చిత్రీకరించబడిన "ఆంగ్ల భాషా దేవత" యొక్క ఆవిష్కరణ మహెత్సవం!


          ఒక దళిత కవి బ్రహ్మణాధిక్యత వల్ల తమకు సంక్రమించబోయే అజ్ఞానాంధకారమును దరిచేరనివ్వక గొప్ప తెలివితేటలను,మంచి ఉద్యోగమును,తీరైన నడవడికను,సకల సంపదలను దయతో ప్రసాదించి జన్మాంతరమున English mokshaను కూడ ప్రసాదించగలుగు అత్యంత శక్తివంతమైన ఈ కొత్త దేవత మీద తను రచించిన కృతిని చదివి/పాడి వినిపించాడు.

 Oh Devi Ma, please let us learn English!
Even the dogs understand English.

         అప్పుడు చందర్ భాను ప్రసాద్ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు "ఆంగ్లదేవత చేత ఆశీర్వదించబడిన వారై, దళితులిక ఈ సరికొత్త గ్లోబలైజేషన్ యుగంలో తమ న్యాయమైన స్థానాన్ని పొందెదరు గాక!మనం భారతీయ విద్యని చదివి ఉంటే ఎక్కడ ఉండేవాళ్ళమో ఒక్కసారి ఆలోచించండి.ఆఫ్ఘనిస్థాన్ లాగో ఇవ్వాల్టి నేపాల్ లాగో ఉండేవాళ్ళం." కనుకొసల నుంచి కొంటెతనం మెరిపిస్తూ "ఇకనుంచి,పుట్టబోయే దళిత శిశువు లందరు తమ తల్లిదండ్రుల నుంచి మొదట వినాల్సిన మాటలు - ఏబీసీడీ. కాబట్టి,బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డ చెవిలో ఏబీసీడీ లని వినిపించాలి" అని చక్కిలిగింతలు పెట్టినట్టు నవ్వించాడు.

          మనల్ని కట్టుబానిసల్ని చేసుకోవటానికి తను చేసిన దుర్మార్గమైన పనికి -  మీ వెర్రితనం బయటపడుతుందని నన్ను తిట్టకుండా పొగుడుతున్న ఇందాకటి కధలోని మీలాగ - వీళ్ళు తనకి చేస్తున్న వీరపూజకి సమాధిలో ఉన్న మెకాలే ఆత్మ సంతృప్తిగా తలాడిస్తూ హాయిగా నవ్వుకుంటూ ఉండవచ్చు గానీ భారతమాత స్థానంలో ఈ విదేశీవనితని చూసి దేశభక్తి కొంచెం ఎక్కువగా ఉన్న మనలాంటి పిచ్చివాళ్ళకి మాత్రం మనస్సు చివుక్కు మంటుంది!వాళ్ళిప్పుడు మెకాలే తయారు చేసిన భారతీయ దేహంలో ఉన్న ఆంగ్లేయాత్మలు గనక మన బాధ వాళ్లకి హాయి, ఎక్కువగా ఏడ్చినా వాళ్లకి లోకువ కావడం తప్ప వాళ్ళలో మార్పు మాత్రం రాదు.అంబేద్కర్ ఏడ్చినా పట్టించుకోనివాళ్ళు ముందుగానే హిందూ మతతత్వ వాదులు అని ముద్ర కొట్టేసుకున్న మన మాట అస్సలు వినరు,  ఎందుకొచ్చిన గోల!

          ఇవ్వాళ చాలామంది గొప్పగొప్పవాళ్ళకి కూడా దేశభక్తి అంటే ఏమిటో,జాతీయత ఎలా ఉంటుందో తెలియడం లేదు పాపం!అంబేద్కర్ విద్యార్ధి సంఘంలో సభ్యులై ఉండి ఆయన ప్రవచించిన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ప్రభుత్వం కొలువుదీరుతున్న భవనాన్ని నేలమట్టం చెయ్యాలని సంకల్పించి విఫలమైనవాణ్ణి మహావీరుడి కింద పరిగణించేవాళ్ళకి ఆ సందేహం రావడంలో ఆశ్చర్యం లేదు.ఈ దేశపు ప్రజల్ని 300 మందిని చంపిన యాకూబ్ మెమన్ లాంటి వాళ్లని ఇంటికొకణ్ణి పుట్టించి వాళ్ళ చేతుల్లో మళ్ళీ మళ్ళీ చస్తూ తరించమని ఈ దేశపు ప్రజలకే విజ్ఞప్తులు చెయ్యగలిగిన గాడిదకీ. ఆ గాడిదని సింహమని పొగుడుతున్నవాళ్ళకీ ఎంత విడమరిచి చెప్పినా అర్ధం కాకపోవడం విచిత్రం కాదు.

          అయినా మానవ ప్రయత్నంగా ఒక కధ చెబుతాను.అనగనగా ఒక మీర్ జాఫర్.ఇతని తాత అప్పటి వరకు అందరి మద్దత్తు ఉన్న తనని కాదని సిరాజ్ ఉద్దౌలాని బెంగాలుకి నవాబుని చేశాడు.అతని ఏడుపులోనూ కొంత న్యాయముంది లెండి!ఈ సిరాజ్ ఉద్దౌలా అప్పటి వరకు స్త్రీలోలుడని ముద్ర వేసుకుని స్వేచ్చావిహారిగా ఉండేవాడు.దానితో అందరూ తాత మీర్ ఖాశిం వైపుకే మొగు చూపుతాడని అనుకున్నారు.కానీ సిరాజ్ ఉద్దౌలా మనస్తత్వంలో ఒక రహస్యం ఉంది - రాజ్యం మీద ఆసక్తి లేక యవ్వనపు సరదా వల్ల అలా తిరిగినా ఒక బాధ్యతని తీసుకుంటే క్షణమాత్రపు సంకల్పంతో అన్ని రకాల ప్రలోభాల్నీ అణుచుకోగలిగిన నిగ్రహమూ ఉంది,అప్పగించిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడం కోసం ఎంతటి త్యాగానికనా సిద్ధపడే మహత్వమూ ఉంది!ఇతరులు గుర్తించకపోయినా తాత అది గుర్తించాడు.అందుకే అందరూ వ్యతిరేకిస్తున్నా సిరాజునే సార్వభౌముణ్ణీ చేశాడు. అధికారాన్ని ఆశించిన మీర్ జాఫర్ తనకి అన్యాయం జరిగిందనుకున్నాడు.సరిగ్గా ఇటువంటి సన్నివేశంలోనే దుర్యోధనుడికి శకుని కూటనీతిని బోధించి మయాద్యూతాన్ని ప్రయోగించి దుర్యోధనుణ్ణి సంతోష పెట్టాడు. మీర్ జాఫర్ ఆ కూటనీతినే పాటించి ఆంగ్లేయులతో చేతులు కలిపాడు.సోదరుడి తల తెగి కోట గుమ్మానికి వేళ్ళాడుతుండగానే తన తన మీదకి కిరీటం వచ్చింది. అధికారంలోని కొత్తదనం పోయాక మెల్లమెల్లగా పరిస్థితి బోధపడింది - తన రాజ్యాన్ని తను పరిపాలించుకునే స్వేచ్చ తనకి లేదనీ, తను ఇంగ్లీషువాళ్ళకి అలుసైపోయాననీ తెలిశాక మొదట్లో విసుక్కున్నాడు,తర్వాత గునిశాడు,తర్వాత పోట్లాడాడు - ఆఖరికి మరీ సిగ్గులేని బతుకు కష్టమనిపించి తిరగబడ్డాడు.దొరలకి చిరాకు పుట్టి అతన్ని వూడబెరికి అతని మేనల్లుడు మీర్ ఖాసిం అనేవాణ్ణి కుర్చీ మీద కూర్చోబెట్టారు.

          అక్కడ ఉన్న సిరాజ్ ఉద్దౌలా,మీర్ జాఫర్ అనే ఇద్దరిలో మొదటివాడిని కుల మత ప్రాంతాల కతీతంగా భారతీయుడన్న ప్రతివాడూ పొగుడుతున్నాడు.రెండవ వాడిని  కుల మత ప్రాంతాల కతీతంగా భారతీయుడన్న ప్రతివాడూ తెగుడుతున్నాడు.మొదటివాణ్ణి ఎందుకు పొగుడుతున్నారో తెలిస్తే అది దేశభక్తి.రెండవవాణ్ణి ఎందుకు తెగుడుతున్నారో తెలిస్తే అది దేశద్రోహం.ఇద్దరిదీ ఒకటే మతం,ఇద్దరూ ఒకే కుటుంబం లోనివాళ్ళు - అయినా వాళ్ళని సమర్ధించేవాళ్ళూ విమర్శించేవాళ్ళూ ఈ పోలికల్ని పట్టించుకోవడం లేదు,అవునా!మీర్ జాఫర్ కూడా వ్యక్తిగతంగా మంచివాడే అయ్యుందవచ్చు,తిన్నగా రాజ్యం చెయ్యనిస్తే ధర్మప్రభువే అయి ఉండేవాడేమో - కానీ ఒక చారిత్రక సంధ్యలో వీరెక్కడ నిలబడ్డారో దాన్ని బట్టి ప్రజలు నిండుమనస్సుతో ఇచ్చిన తీర్పు కదా అది! ఇప్పుడు నేను ఈ పెద్దమనుషులకి ఈ దేశప్రజల తరపున ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను - మా దేశపు సరిహద్దుల్ని దొంగచాటుగా దాతి వచ్చి మమ్మల్ని చంపుతున్నవాళ్లని పొగుడుతున్న మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? మావి 300 ప్రాణాలు పోయినందుకు ఏడవకుండా మమ్మల్ని చంపిన ఒక పొరుగుదేశపు ఉగ్రవాది కోసం మీరు ఏడుస్తున్నప్పుడు మిమ్మల్నెవడో తంతున్నాడని మేమెందుకు మీకోసం ఏడవాలి?

అంబేద్కర్ సాటి దళిత మేధావుల్ని ఎందుకంత క్రూరంగా విమర్శించాడు?


          ఈనాడు మేము అణిచివేతకి గురయ్యామని వీరు పదేపదే నొక్కి వక్కాణించ నవసరం లేదు,అంబేద్కర్ కూడా అణిచివేతకి గురయిన వాడే!

Dr.AMBEDKAR (1891-1956)
B.A., M.A., M.Sc., D.Sc., Ph.D., L.L.D., D.Litt., Barrister-at-Law. 

Above single line and his lifetime struggle,reveals THE GREATNESS... .. . 

B.A.(Bombay University) Bachelor of Arts,
MA.(Columbia university) Master Of Arts,
M.Sc.( London School of Economics) Master Of Science, 
Ph.D. (Columbia University) Doctor of philosophy ,
D.Sc.( London School of Economics) Doctor of Science ,
L.L.D.(Columbia University) Doctor of Laws ,
D.Litt.( Osmania University) Doctor of Literature,
Barrister-at-Law (Gray's Inn, London) law qualification for a lawyer in royal court of England.

ALL THIS EDUCATION ACHIEVED BEFORE 1954 !!! HOW REMARKABLE!!! !! !

HE WON THE AWARD OF GREATEST INDIA !!! !! !
THE PERSON WHO SAT OUTSIDE THE CLASS,TO WHOM DRINKING WATER WAS DENIED ... .. . THE SAME PERSON HAS BECOME ... .. .
""" $$$ THE GREATEST INDIAN $$$ """

MOST EDUCATED INDIAN SCHOLAR !!! !! !

       అయినా ఆయన ఏనాడూ వీళ్ళ మాదిరి ఇంత అసహనం వెళ్ళగక్క లేదు. దేశాన్ని ద్వేషించ లేదు, బ్రాహ్మణాధిపత్యం గురించి సొల్లుకబుర్లు చెప్పలేదు.హిందూమతం తనకి అన్యాయం చేసిందనుకున్నప్పుడు హుందాగా బౌద్ధాన్ని స్వీకరించాడు.నిన్నటి రోజున నా తాతల్ని వీళ్ళ తాతలు అణిచివేశారు గాబట్టి ఈరోజు నేను వీళ్ళని ఓ పట్టు పడతాను అనుకోలేదు.తన వరకు తను ఉదారంగా ఆలోచించి నవభారత నిర్మాణంలో అన్ని వర్గాలూ తమ న్యాయమైన ప్రాతినిధ్యాన్ని అందుకోగలిగిన ఒక సామాజిక చట్రాన్ని నిర్మించి ఇచ్చాడు.ప్రతిరోజూ అంబేద్కర్ బోధనల్ని అధ్యయనం చేసే అంబేద్కర్ విద్యార్ధి సంఘం సభ్యులకి అంబేద్కర్ ప్రవచించిన రాజ్యాంగ వ్యవస్థని అవమానించే విధంగా పొరుగుదేశం నుంచి దొంగచాటుగా సరిహద్దుల్ని దాటివచ్చి ఇక్కడి అమాయకుల్ని చంపుతున్నవాళ్లని కీర్తించడం తప్పని తెలియదా?

          అంబేద్కర్ దళిత విద్యావంతుల నుంచి ఆశించింది చాలా తక్కువ. అప్పటికే జనాభా గణాంకాలు అన్నీ వివరంగా దొరికాయి గాబట్టి ఎంత విమర్శనాత్మకంగా చూసినా ఏ ఒక్క వర్గానికీ ఇబ్బంది లేనంత ప్రణాళికాబద్ధంగా చేసిన దాని ముఖ్య ఉద్దేశం - "నూటికి 10 మంది డాక్టర్లు,20 మంది ఇంజనీర్లు.30 మంది లాయర్లు ఉన్న కులం మీద దాడి చెయ్యటానికి గానీ ఆ కులం మీద పెత్తనం చెయ్యటానికి గానీ ఎవడూ ధైర్యం చెయడు"  అని!ఎంత రిజర్వేషన్లు అనే సపోర్టు ఉన్నా తాము ఇక్కడి వరకూ వచ్చింది తమ సొంత కష్టంతోనే, అయినా తమ సాటి కులస్తులకి తమ అధికార పదవుల నుపయోగించి చెయ్యదగిన న్యాయమైన సహాయం చెయ్యమని.

          అది 1956 జులై 31,మంగళవారం.సమయం సాయంకాలం 05 గంతల 50 నిముషాలు. డాక్టర్ అంబేద్కర్ న్యూఢిల్లీ అలిపుర్ 26,తన స్వగృహంలో ఉన్నాడు.తన పర్సనల్ సెక్రటరీ నానక్ చంద్ కట్టూ గారితో ఇలా అంటున్నాడు:"నానక్ చంద్,నా ప్రజలకి చెప్పు.ఏది నన్ను కష్తపెడుతున్నదో దేనివల్ల నేను విచారంగా ఉన్నానో మీకు తెలియదు.మొట్టమొదట నా మనస్సులో తోస్తున్న విషాదం నా లక్ష్యాన్ని చహెరుకోవదంలో నేను విఫల మయ్యాననై.నేను నా జీవితకాలంలో నావాళ్ళు అధికారం చెలాయించే వర్గంగా చూడాలనుకున్నాను,ఇతర కులాలతో రాజకీయాధికారాన్ని పంచుకుంటూ ఉంటారని బలంగా ఆశించాను.నేనిప్పుడు వృద్ధాప్యంతోనూ అనారోగ్యంతోనూ శిధిలమై ఉన్నాను. నేనేమి చేయగలిగానో దాని ఫలితాన్ని కొద్దిమంది విద్యావంతులు, తమలోని మోసపూరితమైన ప్రవర్తన ద్వారా పనికిమాలినవాళ్ళుగా నిరూపించుకున్న వాళ్ళు, తమ సాటివారు పడుతున్న బాధల పట్ల సహానుభూతి లేనివారు అనుభవిస్తున్నారు.వారు నా వూహాదృశ్యాన్ని చూసి కూడా తల తిప్పేసుకుని ముందుకెళ్ళి పోయారు;వారు కేవలం తమకోసం మాత్రమే జీవిస్తున్నారు.వారిలో ఒక్కరు కూడా సామాజిక సేవ చెయ్యటం లేదు.వారొక భ్రష్తమార్గంలో నడుస్తున్నారు.నేనిక వీళ్ళని మర్చిపోయి నా ధ్యాసని పల్లెల్లో ఉండి అవిద్యతో మగ్గిపోతూ ఆర్ధికస్తితిలో ఏ మార్పూ రాకుండా బతుకీడుస్తున్న నిర్భాగ్యుల మీదకి మళ్ళిస్తాను.కానీ ఆయుష్షు తక్కువ....నా సైన్యాధిపతులు,ఎవరినైతే ఉద్యమాన్ని పరుగులు పెట్టిస్తారని నమ్మానో వారంతా వాళ్ళలో వాళ్ళు నాయకత్వం కోసం,అధికారం కోసం కుమ్ములాడుకుంటున్నారు,తమ మీద ఎంత బరువైన బాధ్యత ఉందో తెలుసుకోకుండా...ఏమైతేనేం,అన్ని వైపుల నుంచి వచ్చిపడిన ఎన్నో తిట్లని భరించి నేను చేసింది ఎక్కువే, చచ్చేవరకు చేస్తూనే ఉంటాను. "

          ఇప్పుడు నానక్ చంద్ అంటున్నాడు "ఇలా మాట్లాడి,కన్నీరు చెమపల మీదకి కారుతుండగా,ఆయన నావైపు చూశారు,నేను కూడా ఏం చెయ్యాలో తెలియక కళ్ళనీళ్ళ పర్యంతమై ఆయన వైపు చూశాను."కొంచెం సంబాళించుకుని ముఖం మీద ఇంకా బాధ కదలాడుతూనే ఉన్నా తనకి తను చెప్పుకుంటున్నట్టు "హైర్యం తెచ్చుకో,నిరాశ పడకు,జీవితం ఒకరిఎజు కాకపోతే మరొకరోజు అంతం కావల్సిందే" అని గొణిగారు.కొంచెం సేపాగి,కన్నీళ్ళు తుడుచుకుని,చేతిని వెలుగు నింపుకున్న తన కల్లకు పైకెత్తి ఇలా న్నారు:"నా ప్రజలకి చెప్పు నానక్ చంద్!నేనేమి చేసినా,భయంకరమైన కష్టాల మధ్యన జీవితమంతా ప్రతికక్షులతో పోట్లాడుతూనే చెయ్యగలిగాను.అతి కష్టం మీద,ఈ భోగయాత్రని ఇప్పుడున్నచోటకి తీసుకు రాగలిగాను.ఈ భోగయాత్రని దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపకుండా ముందుకు పోనివ్వండి.ఒకవేళ నా ప్రజలు,నా దళపతులు,ఈ భోగయాత్రని ముందుకు తీసుకు వెళ్లలేకపోతే దాని నక్కడే వదిలేయండి.కానీ ఎట్టి పరిస్థ్తిలోనూ ఈ భోగయాత్రని వెనక్కి తిప్పకండి"

          సందేహం లేదు, అంతపనీ చేసేశారు - బండి ఎప్పుడో వెనక్కి తిరిగింది!ప్రతి కులానికీ మన కులం మీద వెనకబడ్డ కులం అనే ముద్ర పడితే గానీ ముందుకెళ్ళం అని రూఢిగా తెలిసిపోయినంత ముందుకెళ్ళింది ఈ దేశం.మొన్న కాపు సోదరుల ఉద్యమంలో జరిగిన విధ్వంసం ఖరీదు నాలుగు రత్నాచల్ బోగీలు,రెండు పోలీస్ స్టేషన్లు.నిన్న జాట్ సోదరులు తమని తాము వెనుకబడ్డ కులంగా దేశంలో అందరికీ తెలిసేలా చెయ్యటానికి జరిపిన విధ్వంసం ఖరీదు అక్షరాల 34 వేల కోట్లు!రేపు అడిగేవాడు రేంజి పెంచాలనుకుంటే 50 వేల కోట్ల వరకు పెంచినా పెంచొచ్చు.అమంగళం ప్రతిహత మగుగాక, అలాంటి సన్నివేశం జరగకూడదనే కోరుకుంటున్నాను, కానీ ఇవ్వాళ్టి రాజకీయ వాతావరణం చూస్తుంటే అలాంటివి జరగటానికే ఎక్కువ ఆస్కార ముంది.

          ఒకవేళ అలాంటిది గానీ జరిగితే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారికి ఈ దేశప్రజలందరి తరపున నేనొక విజ్ఞప్తి చేస్తున్నాను:"అయ్యా, ఇక మీరు మమ్మల్ని పరిపాలించవలసిన కష్టాతికష్టం మీకిక ఎంతమాత్రం లేదు.మామీద దయదల్చి మీరు గనక తప్పుకుంటే శ్రీమాన్ అఫ్జల్ గురు లాంటి సమర్ధులని ప్రభువులుగా చేసుకుని క్షేమంగా బతకదల్చుకుంటున్నాం.వారు మీకన్నా ఎంతో సమర్ధులు.సరిహద్దు భద్రతా విభాగం కళ్ళుగప్పి టెర్రరిస్టులని దేశం నడిమధ్యకి రప్పించగలిగారు.వెంట్రుకవాసిలో ప్లాను ఫెయిలైంది గానీ, లేకుంటేనా - ప్రపంచం కళ్ళింతలు జేసుకుని ఆయన్ని కీర్తించేది!సాక్షాత్తూ పార్లమెంటు భవనాన్ని పేల్చటం అనే ఘనకార్యం చేసి ప్రపంచంలోని వీరాధివీరుల్లో ఒకడిగా ప్రఖ్యాతిని పొందేవాడు?!చూడండి, ఏ మాత్రమూ పశ్చాత్తాపపడకుండా తన సహాయం కోరివచ్చిన ఎవరికయినా విధ్వంసం సృష్టించడంలో ఇప్పుడు చేసిన సహాయం అప్పుడూ చేస్తూనే ఉంటానని నిర్భయంగా చెప్తున్నాడు.అసమర్ధుడికి బార్యగా ఉండే కన్నా సమర్ధుడికి ఉంపుడుగెత్తెగా ఉంటే నన్నా ఎక్కువ సుఖపడ వచ్చనే కామన్ సెన్స్ ప్రకారం మీలాంటి వాళ్ళ పరిపాలనలో కన్నా అలాంటివాళ్ళ పరిపాలనలోనే మరింత క్షేమంగా ఉంటామని నేను బలంగా నమ్ముతున్నాను, కాబట్టి మీరు దిగిపోయి వారికి దారివ్వండి." - ఒక్క అక్షరంలో కూడా నేను వ్యంగ్యాన్ని జోడించ లేదు.

          చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ముందు జాగ్రత్త పడదల్చుకుంటే తక్షణం రిజర్వేషన్ల వ్యవస్థని రద్దు చెయ్యండి!ఉండి ఉద్ధరించింది ఏమీ లేదని అంబేద్కర్ మాటల సాక్షిగా డెబ్భయ్యేళ్ళ పాటు ఆ సౌకర్యం అనుభవించిన వారు నిర్ద్వంద్వంగా నిరూపించాక కూడా ఇంకా మొహమాటం దేనికి?దానికి బదులు మీరు చెయ్యాల్సినది చాలా చాలా చిన్న పని. కుల,మత,ప్రాంత,వర్గ భేదాలు లేకుండా ప్రతి పౌరుడీకీ న్యాయం చెయ్యగలిగిన సమర్ధవంతమైన పరిపాలన అందిస్తే చాలు - ఒక రకంగా ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి పౌరుడికీ చెయ్యాల్సిన సేవ నిక్కచ్చిగా చెయ్యండి చాలు

          ఒక్క రిజర్వేషన్లే కాదు, మొత్తం వ్యవస్థలన్నింటితో సహా అసలు స్వాతంత్ర్యమే విఫలమైనట్టు నాకు అనుమానంగా ఉంది.డెబ్బయ్యేళ్ళ తర్వాత ఇవ్వాళ మనం సాధించిన ఘనకార్యం మెకాలే కలలుగన్న భారతాన్ని ఆవిష్కరించటం.భూఖండానికి మాత్రమే స్వతంత్రం వచ్చింది, కానీ మానవాత్మలు మాత్రం పరతంత్రంలోకి వెళ్ళిపోయాయి..రాజమార్గంలో ఈ దేశం మీద శౌర్యం చూపించి యుద్ధం చేసి గెలిచిన న్యాయవిజేతని పొగిడినా కొంత నయం.అమాయకంగా ఈ దేశంలో పొట్టపోసుకుని బతకడానికి వచ్చిన వాణ్ణి చంపితే అన్యాయం అని ఆక్రోశించినా నయమే - కానీ ఇదేమిటి?ఈ దేశప్రధాని నామీద కుట్ర జరుగుతున్నదంటే ఒక్కడూ జాలిపడ లేదు,ఒక ఉగ్రవాది మీద ఎంతమంది అభిమానం చూపిస్తున్నారు!ఒక ఉగ్రవాదికి ఉన్న ఫాలోయింగులో సగం కూడా లేనివాడు ఈ దేశ ప్రధాని పదవికి అనర్హుడు!కాబట్టి, నేనిందాక పెట్టిన కండిషన్, మళ్ళీ రిజర్వేషన్ల అగ్గి ఏదీ రగలకపోయినా ఇప్పటికిప్పుడే ప్రధానమంత్రి తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని శ్రీమాన్ అఫ్జల్ గురు గారి అభిమానులకి అధికారం అప్పగించి వారు విశ్రాంతి తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను - ఇక్కడ సైతం ఒక్క అక్షరంలో కూడా నేను వ్యంగ్యాన్ని జోడించ లేదు.

          ఎందుకు పనిచెయ్యాలో అర్ధం కాకపోవడం వల్ల పనిచెయ్యనివాళ్ళు బద్ధకస్తులు,ఎందుకు పనిచెయ్యాలో తెలియకపోయినా పక్కవాడు చెప్పాడని పనిచేసేవాళ్ళు పిచ్చిపుల్లయ్యలు - అనగా పీడితులు,ఒకపని ఎట్లా చేస్తే అందరికీ మేలు జరుగుతుందో తెలిసి కూడా అట్లా చెయ్యకుండా తమ లాభంకోసమే పనిచేసేవాళ్ళు ఖచ్చితంగా దుర్మార్గులే!ఈ రిజర్వేషన్ల వల్ల పైకొచ్చినవాళ్ళంతా అట్లాంటివాళ్ళే నన్నది జగమెరిగిన సత్యం.యేది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమో అదే సుందరమూ అవుతుంది!!

సత్యం శివం సుందరం!!!

11 comments:

  1. Good research backed post, congrats!

    ReplyDelete
  2. మీరు చాలా విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యాఖ్య చాంతాడు కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వీటిలో రెంటి మీద మాత్రమె స్పందిస్తాను.

    1. ఈ రిజర్వేషన్లని ఎంతకాలం వరకు కొనసాగించాలి?

    మండల్ కమిషన్ మొత్తం 11 అంశాలను గుర్తించి వాటిని మూడు రకాలుగా విడదీసింది. వీటికి స్వభావాన్ని బట్టి వైటేజీ ఇచ్చాక 22 పాయింట్లు. 11 కంటే ఎక్కువ పాయింట్లు వచ్చిన వర్గాలను వెనుకబడిన తరగతులుగా కమిషన్ పరిగణించింది. ఒకవేళ ఈ ఫార్ములాలో ఏమయినా చిన్నా చితకా లోపాలున్నా అప్రోచ్ మాత్రం బాగుంది.

    అయిదేళ్లకు లేదా పదేళ్లకు ఒకసారి తిరిగి సమీక్షిస్తూ ఉంటూ ఏయే వర్గాల హోదా మారిందో తెలిసిపోతుంది. 11 కంటే తగ్గిన వారిని బీసీ లిస్టు నుండి తీసెయవచ్చు. పొరబాటున కిందటిసారి అగ్రవర్ణాలు ఇప్పుడు బీసీలయితే వారికి అవకాశం ఇవ్వొచ్చు. This review mechanism is better than fixing an arbitrary time period.

    2. కొత్తగా బీసీ "హోదా" అడుగుతున్న వారిని ఏమి చేయాలి?

    వారికి ఇదే పరీక్ష సరిపోతుంది. ఒకప్పుడు శూద్ర కులాలుగా పరిగణించబడిన జాట్ మరాఠా కుర్మి పటేల్ కాపు వన్నియార్ ఎళావా తదితరులు కేవలం తాము ద్విజవర్గాలకు చెందము కనుక బీసీ "హోదా" కావాలనడం సబబు కాదు. నా అనుమానం ప్రకారం అంకెల గారడీతో కొన్ని వర్గాలు "హోదా" సాదించారు కానీ వీరిలో ఎవరూ మండల్ ఫార్ములా ప్రకారం బీసీలు కాలేరు.

    ReplyDelete
    Replies
    1. @jai
      This review mechanism is better than fixing an arbitrary time period.

      haribabu
      yes,I Do agree.

      Delete
  3. Well written, persuasive argument. The irony is our politiicians neither have yr vision nor the will to listen to yr sound advice!

    ReplyDelete
  4. హరిబాబు గారు , మీరు గత రెండురోజులు గా సారంగలో వ్యాఖ్యలు రాసినట్లు ఉన్నారు. చదువుదామని చూస్తే ఒక్కటి కనపడటం లేదు. కారణమేమిటి?

    ReplyDelete
    Replies
    1. "సారంగ వారు మళ్ళీ నా కామెంట్ల మీద శీతకన్నేస్తున్నారు." అని హరిబాబు గారే చెప్పుకున్నారు పాపం (Feb 24)).
      అన్నట్లు హరిబాబు గారికి నాలుగు హితవచనాలు చెబుతూ చంద్రిక గారు వ్రాసిన ఈ క్రింది వ్యాఖ్య కూడా కనబడటంలేదు ("బ్లాగిల్లు" సంకలిని వారి వ్యాఖ్యల విభాగంలో మాత్రమే కనిపించింది. అలా తెలిసింది ఇటువంటి వ్యాఖ్యొకటి వచ్చిందని.)
      =============================

      "బ్లాగు : Comments for సారంగ
      chandrika

      హరి బాబు గారు వీళ్ళకి జ్ఞానోదయం చేద్దామని అనుకుంటున్నారా ఏంటి ? ఇదంతా ఒక ఫేస్బుక్ గ్రూప్. ఒకరి కి ఒకరు ఆహ్వానాలు పంపుకుని మరీ వచ్చి దూషణ మొదలు పెడతారు. రాహుల్ గాంధీ కంటే ఘోరం అయిన రాజకీయాలు చేస్తారు వీళ్ళు. వీళ్ళని చూసి చూడనట్లు ఎంత ఊరుకుంటే అంత మంచిది. బురద లో కాలు పెట్టకండి. పొద్దున్న మీ వ్యాఖ్యలు చదివాను. మోడరేటర్ గారు తీసివేశారని కూడా అర్ధం అయింది. మా లాంటి తెలీని వాళ్ళు వచ్చి కామెంటారంటే అర్ధం ఉంది. అంత చక్కగా ప్రతి విషయాన్ని విశ్లేషిస్తూ బ్లాగు వ్రాస్తూ వీళ్ళతో మీకెందుకు? ఏదో ఒక రోజు భస్మాసుర హస్తం వీళ్ళ నెత్తిన పెట్టుకుంటారు. అది మనం చెప్పనక్కరలేదు కదా!! "
      ==============================

      ఏమయినా హరిబాబు గారు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు :) :)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. నరసింహా రావు గారు,

      నేను చాలా సమయం వెచ్చించి, వ్యాఖ్యలను ఆధారాలతో సహ రాశాను. కొన్నిసార్లు కనిపిస్తాయి, ఆ తరువాత మాయమౌతాయి. కొన్ని వ్యాఖ్యలు వెంటనే పబ్లిష్ అవుతాయి, కొన్ని వైటింగ్ ఫర్ మోడరేషన్ అనే మెసెజ్ కనిపిస్తుంది. ఆ తరువాత ఆ వ్యాఖ్య మయమౌతుంది. మొదట్లో టేక్నికల్ ప్రాబ్లెం అనుకొన్నాను. రోహిత్ పై రాణి శివశంకర శర్మ రాసిన టపాకు ఓ పదిసార్లకు పైగా జరిగింది. (అది శివశంకర శర్మ రాసిన దానినిసమర్ధిస్తూ,ఆయన విమర్శకులను తిప్పికొడుతూ రాసిన వ్యాఖే). కాని హరిబాబు కూడా అదే సమస్య ఉందని గ్రహించిన తరువాత ఇక్కడ అడగటం జరిగింది. వ్యాఖ్యలను ప్రచూరించ లేక ఒకసారి విసుగొచ్చి రాణి శివశంకర శర్మ ను బ్లాగు పెట్టి రాయమని అడిగాను. ఆ వ్యాఖ్య మొదట్లో కనిపించినా ఆ తరువాత కనపడలేదు. అక్కడ కోరటానికి కారణం ఆయన మైల్ ఐ.డి., పోన్ నంబర్ ఇవేమి లేవు. మెసేజ్ చేరే మార్గం సారంగ ద్వారా మాత్రమే కనుక. అందులో ఉన్న అభ్యంతరకరమైన అంశం ఎమిటి? అలా కోరటంలో తప్పేమి లేదు కదా! అది మాయమవ్వటంతో చికాకు వేసింది

      Delete
    4. Yes, I am the most stubburn crusader:-)
      But all my comments are saved before posting there.I will use it in my net post

      Delete
  5. >>>హరిబాబు గారు , మీరు గత రెండురోజులు గా సారంగలో వ్యాఖ్యలు రాసినట్లు ఉన్నారు. చదువుదామని చూస్తే ఒక్కటి కనపడటం లేదు. కారణమేమిటి?>>>
    "తెలిసీ తెలియని నరు దెల్ప బ్రహ్మ దేవుని వశమే" అన్న సంగతి తెలిసి కూడా హరిబాబు గారిది దింపుడు కళ్ళం ఆశ

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...