Wednesday 21 October 2015

యేమిరా!ఈ బడుధ్ధాయలు భారతీయవిజ్ఞానశాస్త్రము నపహాస్యము చేయుచుండిరి?

     నేను మన దేశంలో పుట్టి  తమ ఎజెండాకి విరుధ్ధంగా ఉన్నదన్న ఒకే ఒక్క కారణంతో తాము పుట్టి పెరిగిన దేశపు చరిత్రనే మాయం చేసిన దౌర్భాగ్యుల్ని విమర్శిస్తే సూటిగా జవాబు చెప్పలెక ఆ ప్రసంగంలో ప్రస్తావించిన ఒక అప్రస్తుత విషయాన్ని పట్టుకుని భారత్యీవిఘ్ణాణ శాస్త్రాం -- అహ్హహ్హహ్హ అని నవ్విన మేధావుల కోసమే ప్రత్యేకంగా ఈ ప్రసంగం చేస్తున్నాను.వీటిల్లో యే ఒక్కటి కూడా నా స్వకపోలకల్పితం కాదు.ఇక్కడ నేను ప్రస్తావించిన ఆవిష్కరణల ప్రాచీనత కూడా యదార్ధమే!ఇక్కడ ఉన్నట్టే పాకిస్తాను లోనూ కమ్యునిష్టులు/మంచివాళ్ళు ఉన్నారు గాబట్టి పాకిస్తాను వాడు ఇక్కడ గుడ్విల్ కొట్టెయడానికి ప్రయత్నించినా వాడిపట్ల గట్టిగా నిరసన వ్యక్తం చేయ్యకూడదట!నిజమే,వర్గచైతన్యం యెక్కువగా ఉన్న కొద్దిమంది, మెజార్టీ ప్రజల కోరికల్ని పెట్టుబడిదారీ ఆర్ధిక విధానంలోని విషఫలాలుగా లెక్కగట్టి, పెట్టుబడిదారీ ఆర్ధికం తనలోని వైరుధ్యాలకి తనంతట తనే కూలిపోతుందని భయపెట్టి, అలా భయపడిన వారికి తరుణోపాయంగా వర్గరహితసమాజమనే మోక్షమార్గాన్ని చూపించి, దాన్ని వ్యతిరేకించిన వాళ్లకి వర్గశత్రువులని పేరు పెట్టి సాయుధపోరాటం పేరుతో పెద్దమొత్తంలో లేపెయ్యటం నచ్చిన వాళ్ళకి ఈ చిన్నా చితకా రంగులు పులమటం లాంటి బూర్జువా నిరసనలు సిల్లీగా అనిపిస్తాయి కాబోలు?!విదేశీయులు మన చరిత్రని భ్రష్టు పట్టించారంటే అర్ధం చేసుకోవచ్చు - ఈ దేశంలో పుట్టినవాళ్లే అంత ఘాతుకం తెలిసే చేశారు,అయినా పశ్చాత్తాపం లేకుండా చరిత్రని యేకపక్షంగా మార్చేస్తున్నారని వదరుతున్నారు - చీ!ఆ ప్రసంగంలోనూ ఈ ప్రసంగంలోనూ నేను ప్రస్తావించిన ప్రతి విషయానికీ ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి.ఇక్కడే కాదు,నేను యెప్పుడు యెక్కడ యే విషయం గురించి ఇచ్చిన సాక్ష్యాలు అయినా సరే నాకు మాత్రం తెలిసేవి ఇవ్వను - వెతికితే యెవరికయినా దొరికే సాక్ష్యాలనే నేను ఇస్తాను.హిందూ ధర్మం గురించి అయినా సరే అబధ్ధాలు చెప్పి మోసం చెయ్యను - సత్యమే నా విశ్వాసం!


నాదబిందుకళాధరి అంటున్న పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం!

     ఆదిశంకరులు రచించిన గురుపాదుకా స్తోత్రంలో "నాద బిందు కళా ధరి!" అనే విశేషణం ఉంటుంది.అది కేవలం చందస్సులో ఇమిడ్చిన పదపూరణ కాదు.ఆధునిక విజ్ఞాన శాస్త్రం మూలకాలను వేరు చెయ్యటానికి ఉపయోగించే వాటిల్లో మూడు రకాల పరీక్షలు ముఖ్యమైనవి ఉన్నాయి.చలనం ఉన్నచోట ధ్వని తప్పనిసరిగా ఉంటుంది.ఆ ధ్వనికీ చలనానికి కారణమైన శక్తికీ సంబంధం ఉంటుంది.కాబట్టి ధనాత్మకమై కేంద్రకం చుటూ గుణాత్మకమైన అంశాలు తిరుగుతున్నప్పుడు పుట్టే ధ్వనిని అయస్కానత ప్రతిధ్వని రూపంలో గుర్తిస్తారు.దీనిని Nuclear magnetic resonance అంటారు.ఇది నాద స్థితి!మొదట్లో పరమాణు సంఖ్యని మూలకాల వర్గీకరణకి ప్రమాణం చేసుకున్నారు.కానీ ఒకే పరమాణు సంఖ్య ఉన్నప్పటికీ కొన్ని మూలకాల(Isotopes) ధర్మాలు వేరుగా ఉండటం వల్ల ఇప్పటి శాస్త్రజ్ఞులు పరమాణువుల భారాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నారు.ఇది బిందు స్థితి!ఇక ఆయా మూలకాల వాయుస్థితిలో కాంతిని ప్రసరింపజేసి తీసిన పరమాణు వర్ణపటాలు యెంతో ప్రధానమైనవిగా ప్రతి ఒకరికీ తెలిసినదే,ఇది కళా స్థితి!

గుడులన్ని తిరగగలవా నరహరి?స్థలమందు మర్మము తెలియగలవా ఓ నరహరి!

     అమెరికాకు చెందిన McKim Malville అనే ఒక astrophysicist భారతదేశంలోని కొన్ని పుణ్యక్షేత్రాల్ని పండితుల సహాయంతో తిరిగి చూసి వాటి క్షితిజాంశపు విశేషాల్ని గమనించి ఆశ్చర్యపోయాడు.అవన్నీ ఆయా ప్రదేశాల్లో, రెండు విధాలైన భూభ్రమణాల వల్ల సూర్యకాంతి ప్రసరించే భ్రమణాభ్రమణాత్మకమైన ఆవర్తనాయుత కోణాలలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన క్షితిజరేఖాంశాల దగ్గిర నిలబడి భౌమ అయస్కాంత ప్రవాహాల పరంగా కొన్ని ప్రత్యేకమైన లక్షణాల్ని ప్రదర్సిస్తున్నాయి!చిత్రకూటం,రాముడితో అనుసంధానించబడిన ప్రదేశం కదా!రాముడికి శరం చిహ్నం.ఆశ్రమాన్ని GPS తో మ్యాప్ చేస్తే summer solstice నాడు ఉదయాస్తమయాల్ని సూచించే అమ్ము మాదిరిగా ఉంది.వారణాశి లోని 14 ఆదిత్య మందిరాలూ నెలల వారీగా సూర్యగమనపు దశల్నీ అంతర్దశల్నీ సూచిస్తున్నాయి!మొదట అతను ఆయా దేవుళ్ళకి భక్తుడై తీర్ధయాత్రలకి రాలేదు,అతని రోజువారీ జ్ఞానసమీకరణలో యేదో క్లూ దొరికి ఉంటుంది,అనుమానం తీర్చుకోవడానికి వచ్చాడు!మనవాళ్ళు మాత్రం అసలు అనుమానమే లేకుండా "INDIAN SCIENCE IS A JOKE" అనేస్తున్నారు,యెక్కడుంది లోపం?


యెన్ని ఫస్టులో ఈ మొద్దబ్బాయిలకి?!

10,000 సంవత్సరాల క్రితమే గంగా మైదానంలో మొదట వ్యవసాయం చేసింది ఇక్కడి వాళ్ళే!

10,000 సంవత్సరాల క్రితమే కుండల్ని తయారు చేసింది ఇక్కడి వాళ్ళే!

9,000 సంవత్సరాల క్రితమే రాగి వాదకం మొదలుపెట్టింది ఇక్కడి వాళ్ళే!

9,000 సంవత్సరాల క్రితమే పత్తిని నేసింది ఇక్కడి వాళ్ళే!


శ్రీదేవి ముక్కందం పెంచిందెవడ్రా?శుశ్ర్రుతుల వారండీ!రైఠో - గుడ్ బాయ్?! 

     చరక సంహిత,అష్టాంగ హృదయ,శుశ్రుత సంహిత ఈనాటికీ భారతీయ సంప్రదాయిక వైద్యులకి అందుబాటులో ఉన్నాయి.సుశ్రుతుడు చేసిన శస్త్రచికిత్సల కోసం అతను వాడిన పరికరాలను గురించిన వర్ణనల వల్ల అతి సూక్ష్మమైన స్థాయిలో కూడా అతను శస్త్రచికిత్సల్ని చేశాడని తెలుస్తున్నది.క్రీ.పూ 6వ శతాబ్దం నాటికే శుశ్రుతుడు చేసిన ప్లాస్టిక్ సర్జరీ గురించిన ఉదాహరణ కూడా నేటికీ లభ్యమే!

     The portion of the nose to be covered should be first measured with a leaf. Then a piece of skin of the required size should be dissected from the living skin of the cheek, and turned back to cover the nose, keeping a small pedicle attached to the cheek. The part of the nose to which the skin is to be attached should be made raw by cutting the nasal stump with a knife. The physician then should place the skin on the nose and stitch the two parts swiftly, keeping the skin properly elevated by inserting two tubes of eranda (the castor-oil plant) in the position of the nostrils, so that the new nose gets proper shape. The skin thus properly adjusted, it should then be sprinkled with a powder of licorice, red sandal-wood and barberry plant. Finally, it should be covered with cotton, and clean sesame oil should be constantly applied. When the skin has united and granulated, if the nose is too short or too long, the middle of the flap should be divided and an endeavor made to enlarge or shorten it.


ఎంతెంత దూరం?లెక్కెంత ఖచ్చితం!

     ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించే మార్గం వలయంలా కాకుండా దీర్ఘవృత్తంలో ఉంటుంది.ఈ దీర్ఘవృత్తంలో సూర్యుడికి సమీపంగా వచ్చేటప్పటి దూరం 91,445,000 మైళ్ళు అంటే 147,166,462 కిలోమీటర్లు.సూర్యుడికి సుదూరంగా ఉండేటప్పటి దూరం 94,555,000 మైళ్ళు అంటే 152,171,522 కిలోమీటర్లు.ఈ రెంటికీ సరాసరి కడితే 92,955,807 మైళ్ళు అంటే 149,597,870 కిలోమీటర్లు.రికార్డుల కెక్కిన దాని ప్రకారం తొలిసారి 1672లో Jean Richer మరియు Giovanni Domenico Cassini భూమి వ్యాసార్ధానికి 22,000 రెట్లు అంటే 22000 * 6371 kms = 140,162,000 అని కొలిచి చూపించారు.

     అయితే ఇక్కడ 15వ శతాబ్దానికి చెందిన గోస్వామి తూలసీదాసు తన హనుమాన్ చాలీసాలోని "యుగసహస్ర యోజన పర భానూ,లీల్యో తాహి మధుర ఫల జానూ" అనే దోహాలో ప్రస్తావించాడు.దీనిని వైదిక సాహిత్యం లోని విషయాల ప్రకారం మార్చి చూస్తే:
1 యుగం = 12000

1 సహస్రం= 1000

1 యోజనం = 8 మైళ్ళు

వీటిని బట్టి

12000 X 1000 X 8 =  96,000,000  మైళ్ళు

1 మైలు = 1.6 కి.మీ.లు

మైళ్ళని కిలోమీటర్లుగా మారిస్తే  96,000,000 * 1.6 = 153,600,000 కి.మీ.లు అవుతుంది!

     According to modern scientific measurements we orbit the Sun at a distance of about 150 million kilometers. This number is actually an average, since we follow an elliptical path. At its closest point, the Earth gets to 147 million km, and at its most distant point, it’s 152 million km.You might be surprised to know that the distance from the Sun to the Earth was only determined within the last few hundred years. There were just too many variables. If astronomers knew how big it was, they could figure out how far away it was, or vice versa, but both of these numbers were mysteries.

ఆపవయ్యా నీ వేగం!చూడవయ్యా ఈ వేదం?

तरणिर्विश्वदर्शतो जयोतिष्क्र्दसि सूर्य | विश्वमा भासिरोचनम |
తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్క్రదసి సూర్య!విశ్వమా భాసిరోచనం! - ఋ.1:50
     క్రీ.శ 14వ శతాబ్దంలోని విజయగరాన్ని పరిపాలించే బుక్కరాయల ఆస్థానంలోని సాయణాచార్యులు దానికి భాష్యం రాస్తూ "తత చ స్మర్యతే యోజనం సహస్రే ద్వే ద్వే శతే ద్వే చ యోజన యేకేన నిమిషార్ధేన క్రమణం" అని విపులీకరించారు.దీని అర్ధం సూర్యకాంతి అరనిమేషంలో 2202 యోజనాలు ప్రయాణిస్తుందని!మహాభారతం లోని శాంతిపర్వంలో ఉదహరించబడిన ప్రకారం:

15 నిమేషలు = 1 కాష్ఠ.

30 కాష్ఠలు = 1 కళ,

30.3 కళలు = 1 ముహూర్త,

30 ముహూర్తలు = 1 అహోరాత్రం

మనకి తెలుసు ఒక అహోరాత్రం అంటే 24 గంటలని,కాబట్టి 24 గంటలు = 30 x 30.3 x 30 x 15 నిమేషలు, మరోలా చెప్పాలంటే 409050 నిమేషలు.

కొత్త లెక్క ప్రకారం చూద్దాం,

మనకి తెలుసు 1 గంట = 60 x 60 = 3600 సెకండ్లు.

కాబట్టి 24 గంటలు = 24 x 3600 సెకండ్లు. = 409050 నిమేషలు.

ఈ మామూలు లెక్కలన్నీ సరిపోయాయి గదా?అనుమానం ఉంటే కాలిక్యులేటర్లు వాడి సరిచూసుకోవచ్చు!



409050 నిమేషలు = 86,400 సెకండ్లు,

నిమేష = 0.2112 సెకండ్లు (This is a recursive decimal! Wink of an eye=.2112 seconds!).

½ నిమేష = 0.1056 సెకండ్లు



ఇక దూరమానాలు చూద్దాం:

10 యవలు = 1 అంగుళ (1.89 cm or approx ¾ inch),
6 అంగుళాలు = 1 పాదం
2 పాదలు = 1 వితస్తి
2 వితస్తులు = 1 హస్త
4 హస్తలు = a ధనువు
2000 ధనువులు = 1 గవ్యూతిi(12000 అడుగులు)
4 గవ్యూతులు = 1 యోజనం = 9.09 మైళ్ళు
     Calculation: So now we can calculate what is the value of the speed of light in modern units based on the value given as 2202 Yojanas in ½ Nimesa = 2202 x 9.09 miles per 0.1056 seconds = 20016.18 miles per 0.1056 seconds = 189547 miles per second !!As per the modern science speed of light is 186000 miles per second ! And so I without the slightest doubt attribute the slight difference between the two values to our error in accurately translating from Vedic units to SI/CGS units. Note that we have approximated 1 Angula as exactly ¾ inch. While the approximation is true, the Angula is not exactly ¾ inch


యెవరక్కడ?బౌధాయనుడా!పైధాగరస్సా!

     క్రీ,పూ 400 కాలం నాటి పైధాగరస్ తన రేఖాగణిత నియమాల్లో ఒక లంబత్రికోణానికున్న మూడు భుజాలకీ మధ్యన ఉన్న నిష్పత్తిని గురించి "In any right-angled triangle,the area aof the square where side is hypotenuse(the side opposite the right angle) is equal to the sum of  the areas of the squares whose sides are the two lehs(the two sides meet at  right angle)" అని చెప్పాడు.

కానీ భారతదేశంలోని క్రీ,పూ 800 నాటి బోధాయనుడు ఇంకా సరళంగా "दीर्घचतुरश्रस्याक्ष्णया रज्जु: पार्श्र्वमानी तिर्यग् मानी च यत् पृथग् भूते कुरूतस्तदुभयं करोति ॥" అని తేల్చి చెప్పాడు."దీర్ఘచతురస్రస్యా క్షణయా రజ్జు పార్శ్వమానీ తిర్యగ్మానీ చ యత్ పృధగ్ భూతే కురుతస్తదుభయం కరోతిఅంటూ ఒక తాడుని ఉదాహరణగా చేసుకుని అంతకన్నా సూటిగా చేప్పేశాడు!


ఆట గద శివా,నీ పాట గద కేశవా!

     ఈ శతాబ్దపు తొలి మూడు దశాబ్దాలలో భౌతిక శాస్త్రం తన రూపురేఖల్ని విశేషంగా మార్చుకుంది.1905లో ఐన్స్టీన్ ఆవిష్కరించిన సాపేక్ష సిధ్ధాంతం భౌతిక శాస్త్ర పరిధిని దాటి అన్ని రంగాల ఆలోచనల్నీ ప్రభావితం చసింది.సాపేక్ష సిధ్ధాంతం ప్రకారం కాలానికి ప్రత్యేకమైన అస్తిత్వం(Entity) అంటూ లేదు.ఇంకా విశ్వం త్రిమితి(three dimensional) కాదు,స్థల-కాల ద్వయాల పరస్పర సంయోజనం వల్ల చాతుర్మితిక గతిశీలత(four dimensional continuam) సంభవించింది.ఒక కమ్యునిష్టు రచయిత "బుధ్ధికొలత" సిధ్ధాంతం గురించి రాస్తే మురంనా అతను మార్క్సిస్టు అయి వుండీ మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నాడని వెక్కిరించింది - అదండీ ఆవిడ విజ్ఞానం!నూతన ఆవిష్కరణల ప్రకారం ఈ ప్రపంచాన్ని వర్ణించటానికి యేడు రకాల కొలతలు ప్రతిపాదించబడినాయి.సాపేక్ష సిధ్ధాంతం క్వాంటం సిద్ధాంతంతో కలిసి అంతకు ముందు భౌతిక శాస్త్రం యేర్పరచుకున్న "I,The Observer","World,The Object" అనే విభజనని చెరిపేసింది!ఈ సమస్త ప్రపంచమూ కొన్ని ఖచ్చితమైన నియమాలకి లోబడి నడుస్తున్నదనే పాత నిబంధన స్థానంలో చిన్న చిన్న అంశాల కలయికతో యేర్పడిన ఒక పెద్ద అంశంలో మన జ్ఞాన పరిధికి రాని యే ఒక్క చిన్న అంశంలో మార్పు జరిగినా మనం చూస్తున్న పెద్ద అంశంలో విపరీతమైన మార్పులు కనబడతాయి,కాబట్టి ప్రపంచమూ అది పాటిస్తున్నదని అనుకుంటున్న నియమాలూ మారకుండా స్థిరంగా ఉండటం అసంభవమనే కొత్త నిబంధన వచ్చింది!

     ఒక్క కాంతివేగం తప్ప మిగిలినవన్నీ సాపేక్షం అన్నాడు ఐన్స్టీన్.ఇలా వేగాన్ని స్థిరంగా ఉంచుకోవడం కోసం కాంతి విశ్వంలో ప్రయాణించేటప్పుడు గురుత్వాకర్షణ కలిగిన అస్తిత్వాల యొక్క ఆకర్షణకి లోనై వంగుతుందని చెప్పాడు.దీనివల్ల కాలం సాపేక్షం అయింది.దాంతో మానవుల అనుభవంలోకి వచ్చే నిన్న,నేడు,రేపు అనేవి ఇదివరకటి లెక్క ప్రకారం ఖచ్చితమైన విభజనతో ఉన్నట్టు కాకుండా ఇవన్నీ కలిసి ఉండే అవకాశం కూడా కనబడుతూ "కాలంలో ప్రయాణం" లాంటి తమాషా కధలు నిజమేనేమో అని భ్రమించేటట్టు చేసింది!తను ప్రతిపాదించిన గణితసూత్రాన్ని మినహాయిస్తే ఇతని సిధ్ధాంతం చదువుతుంటే భారతీయుల ప్రాచీన వేదాంత బోధనలు చదువుతున్నట్టు ఉంటుంది."Time Warp" అనే దృగిషయానికి చెప్తున్న ఉదాహారణ ఇట్లా ఉంటుంది:ఒకే వయస్సు గల ఇద్దరు సోదరుల్లో ఒకరు 20 యేళ్ళ వయసులో కాంతివేగం వల్ల జరిగే కాలం యొక్క స్థానభ్రంశానికి గురై 20 యేళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి వస్తే తన సోదరుడు 40లో ఉంటాడు,తను మాత్రం 20లోనే ఉంటాడు!ప్రస్తుతానికి మనిషి కాంతి వేగానికి దగ్గిరగా ప్రయాణించటాన్ని కూడా సాధించలేకపోయాడు గాబట్టి దీన్ని నిరూపించలేము గానీ సాపేక్షవాదం యొక్క ప్రభావం అలా ఉంటుందని చెప్పటానికి మాత్రం ఈ ఉదాహరణ పనికొస్తుంది.అయితే మహాభారతంలోని ఒక కధ ప్రకారం "కకుద్మి అను పేరు గల ఒకానొక రాజు,తన కుమార్తె అయిన రేవతికి తగిన వరుణ్ణి వెదికి వెదికి విసుగెత్తి అసలు తన కూతురికి యెవర్ని భర్తగా లిఖించాడో అడిగి తెలుసుకుందామని సరాసరి బ్రహ్మలోకమే వెళ్ళాడు.అప్పుడు బ్రహ్మదేవుడు గంధర్వుల గానకచ్చేరి(Divine Rock Music) వింటూ ఉండటం వల్ల అది ముగిసేవరకూ అట్లాగే వేచి ఉన్నాడు:-)తీరా సంగీత సభ పూర్తయ్యాక రాజు విషయం విన్నవిస్తే ఆయన నవ్వేసి నువ్విక్కడ నాకోసం యెదురు చూస్తున్న సమయంలో భూమి మీద 27 మహాయుగాలు గడిచిపోయినాయి.నీ రాజ్యమూ గతించిపోయింది,నీ కాలంలో వివాహార్హత గలిగిన రాజయువకులూ నశించిపోయారు - ప్రస్తుతం ద్వారకలో బలరాముడు నీ కుమార్తెకు తగిన వరుడు" అని చెప్పే కధలో ఉన్నది యేమిటి?


     1900 సంవత్సరంలో మాక్స్ ప్లాంక్ ద్వారా ప్రవచించబడి ఐన్స్టీన్ ప్రోత్సాహంతో విపరీతంగా కొనియాదబడుతున్న క్వాంటం సిధ్ధాంతం అయితే సాపేక్షతా సిధ్ధాంతం కన్నా ఒకడుగు ముందుకేసి పూర్తిగా శివతాండవానికి వ్యాఖ్యానమా అన్నట్టు ఉంటుంది!దీనిని విషయాన్ని బట్టి తరంగ సిధ్ధాంతం అని పిలవాలి.ఈ విశ్వం లోని యే ఒక్క అస్తిత్వం గల పదార్ధాన్నీ మిగిలిన అస్తిత్వాల నుంచి విడదీయలేము.పైగా చెట్టు నుంచి పుట్టిన విత్తనం తిరిగి చెట్టుగా పెరగడానికి అవసరమైన జ్ఞానాన్ని దాచుకున్నట్టు ప్రతి వస్తువూ ఈ విశ్వం యొక్క మొత్తం సమాచారాన్ని ఇముడ్చుకుని ఉంటుంది.యే రెండు అస్తిత్వాల మధ్యన ఉన్న సంబంధమూ శాశ్వతం కాదు.రెండు అస్తిత్వాలు కలవడం,విడిపోవడం అనే ప్రక్రియలో సంభావ్యతలు మాత్రమే ఉంటాయి తప్ప శాశ్వతమైన అస్తిత్వం దేనికీ లేదు.మన చుట్టూ కనబడే వస్తుగతమైన ప్రపంచం కూడా సంభావ్యతల లోని ఒక ఉద్భవం(one probability among multiple possibilities) మాత్రమే!దీని నంతట్నీ చూస్తున్న,గ్రహిస్తున్న,అనుభూతిస్తున్న కర్త గూడా ఈ సంభావ్యతల లోని ఒక శకలమే అవుతాడు,మరి నియమాలు మారకుండా యెలా స్థిరంగా ఉంటాయి?


     The relativistic field theory asserts that:“the ultimate material reality that physics can apprehend is the ‘field’ and in the aspect of the quantum field, it is both a continuum and a discontinuum, the discontinuities being temporary condensations of space-time where the field is unusually intense giving rise to matter (Pantda: 1991, 154).According to the field theory, reality is nothing but the transformation and organization of the field quanta.  Particles are interactions between fields, and are ephemeral manifestations.  They only appear to be substantial as a result of the dynamic, energetic interplay of the quantum fields (155).All types of particle-pairs are constantly generated and absorbed by the field.  The “dance” of all possible particles, may be regarded as the fundamental activity of Nature."My dear Lord,this visible cosmic manifestation is a demonstration of Your own creative energy.Since the countless varieties of forms within this cosmic manifestation are simply a display of your external energy.this virat-roopa is not your real form". - Srimad bhaagavatam 5:18:31,


     చూశారుగా,చలనం,జ్వలనం,ప్రణవం,నర్తనం గురించి భారతీయులు చెప్పిన వాటికి ఆధునికులు యెంత దగ్గిరగా వచ్చారో - ఇప్పుడు కూడా భారతీయులు విజ్ఞానం అంటే యేమిటో తెలియని వాళ్ళే అంటారా?శివుని చేతిలోని ఢమరుకం మ్రోగుతున్నంత కాలం నాదమయమైన సమస్త ప్రపంచమూ ఆ తరంగఘోష లోని లయకు అనుకూలంగా నర్తిస్తూనే ఉంటుంది.ఢమరువు ఆగితే జ్వాల రేగుతుంది,సమస్తాన్నీ భస్మీభూతం చేస్తుంది.మళ్ళీ ఢమరుకం మోగే వరకూ అంతటా నిశ్శబ్దం 
తాండవిస్తుంది!మరోవైపు నారాయణుడు క్షీరసాగర తరంగాల పైన అనంతశయనుడై లీలామానుషంగా తన నుండే పుడుతున్న అనాహత మోహన వంశీ గానం వింటూ మందహాసవదనారవిందుదై ఉంటే అక్కడ సంభ్రమిస్తున్న క్షీరసాగర తరంగాల నుంచి బుద్బుదాల వలె అనంతకోటి విశ్వాలు(Multiverses) పుట్టి గిట్టుతూ ఉంటాయి!

     ముందు ముందు సైన్సుకీ మతానికీ మధ్య ఉండే తేడా అదృశ్యమై పోతుంది.ఒకదాన్నే పట్టుకు వేలాడతానంటే కుదరదు.Science also has religious spirit, when you go on searching for a reason,some where you may find your reason fails and settles into  belief!Religion also has scientific spirit, When you go on trying to believe,some where you may find your belief ask question and seeks for reason?అసలు అపహాస్యం కాబోయేది నాస్తికత్వమే!

నెత్తి మీద పడిన యాపిలు కధేంటి?ఆ మాత్రం దంపుడుపని మేము చెయ్యలేమా!

     ఈ సృష్టిలో మారకుండా ఉండేది యేదీ లేదు.ఒక పదార్ధం మరొక పదార్ధంగా మారుతుంది,అప్పుదు మొదటి పదార్ధం ధర్మాలు కూడా రెండవ పదార్ధం యొక్క ధర్మాలుగా మారుతాయి - వైశేషిక సూత్ర 1.1.10!ఇది ఇప్పుడు ఉష్ణగతిజశాస్త్రపు ప్రధమనియమం అని మనం చిన్నప్పుడు చదువుకున్న నియమమే.కార్య విరోధి కర్మ(వైశేషిక సూత్ర 1.1.14) సూత్రం యేమి చెప్తుందంటే ఒక వస్తువు మీద యేదైనా కర్మ చెయ్యాలంటే వస్తువులోని స్థితిశక్తి దాన్ని నిరోధిస్తూ వ్యతిరేక దిశలో పనిచేస్తుంది అని!ఇక్కడ చప్పట్లు కొట్టాల్సిందే ఈ దేశాన్ని ప్రేమించేవాడు యెవడయినా సరే - యెందుకంటే Work done = Energy Required; And the direction is opposite సూత్రం స్పష్టంగా కనబడుతున్నది గనక?!
     అందమైన ఆడపిల్ల వడ్లు దంచుతుంటే చూట్టానికి రెండు కళ్ళూ చాలవు గదూ!సీను తల్చుకుంటేనే బాలయ్య ఫ్యాన్లు "దంచవే మేనత్త కూతురా" పాట లంకించుకుంటారని నాకు తెలుసు:-)కాస్త అందులోని సైన్సు యేమిటో కణాదుల వారు సవివరంగా చెప్పారు,చూడండి!
వైశేషిక సూత్ర 5.1.1 - ముసలాన్ని చేతబట్టి నిలువుగా పైకెత్తుతాం(ఇది మొట్టమొదటి దశ,కదూ!)
వైశేషిక సూత్ర 5.1.2 - హస్తం ముసలంలో కర్మని పుట్టిస్తుంది.
వైశేషిక సూత్ర 5.1.3 - హస్తం ముసలాన్ని వొదిలెయ్యడం వల్ల ముసలం ఉఖల మీద పడటంలో హస్తం ప్రమేయం లేదు,అయినా పడుతున్నది అంటే ఆ కర్మకి భూమి యొక్క ఆకర్షణ కారణం.
వైశేషిక సూత్ర 5.1.4 - ఉఖల మీద పడిన ముసలం పైకి యెగదన్నడంలో హస్తం ప్రమేయం లేదు,అది ఉఖల నుండి పుట్టే  కార్య-విరోధి-కర్మ యొక్క ప్రతిచర్య.
వైశేషిక సూత్ర 5.1.5 - పైకి వెళ్ళే ముసలాన్ని పట్టి ఉన్న హస్తంలో ముసలంతో ఉన్న సంబంధం వల్ల కర్మ పుడుతున్నది.
వైశేషిక సూత్ర 5.1.6 - ఈ విధంగా ముసలం అనే యంత్రాన్ని ఊపయోగిస్తున్న హస్తం మీద కర్త్రాధీన కర్మ మరియు వస్త్వాధీన కర్మ అను రెండు కర్మలు పుడుతున్నాయి.
వైశేషిక సూత్ర 5.1.7 - ముసలం మీద వ్యక్తి యొక్క పట్టు లేకపోతే ముసలం గురుత్వాకర్షణ వల్ల కింద పడిపోతుంది - గురుత్వాత్ పతనం!
వైశేషిక సూత్ర 5.2.3 - అపం సమ్యొగభవె గురుత్వత్ పతనం - అర్ధం అయిందా?మేఘాలు వర్షించడానికి కారణం కూడా గురుత్వమే అంటున్నాడు!
-----------------------------------------------------------------------------------------------------------------
సంఖ్య   సూత్రం                                               వ్యాఖ్యానం
-----------------------------------------------------------------------------------------------------------------
1)        వేగః నిమిత్తవిశేషాత్ కర్మణో జాయతే     Change of motion is due to impressed force.
2)        వేగః నిమిత్తాపేక్షాత్ కర్మణో జాయతే      Change of the motion is proportional to the 
           నియతదిక్ క్రియా ప్రబంధ హేతుః           impressed force and is in the direction of the force. 
3)        వేగః సంయోగవిశేషవిరోధీ                     Acyion and Reaction are equal and opposite
-----------------------------------------------------------------------------------------------------------------
     ఈ కణాదుడు యెప్పటీవాడో తెలుసా?క్రీ.పూ 6వ శతాబ్దికి చెందిన వాడు!ఇప్పటికీ గురుత్వాకర్షణ నియమాన్ని తొలిసారిగా కనుక్కున్నది న్యూటనే అని వాదిస్తారా మీరు?మొత్తం ఈ భూమి నంతా తమ కిష్టమైన ఒక ఎజెండాతో నిరంకుశంగా ఏకం చేసి నియంతృత్వంతో పట్టి ఉంచగలమనుకోవటం దురాశ!భూమి మీద సముద్రాలూ నదులూ వాగులూ వంకలూ గుట్టలూ మిట్టలూ అడవులూ అగాధాలూ తీసేసి సౌకర్యం కోసం వెదికి చూస్తే మానవనివాసయోగ్యమైన స్థలమే చాలా చాలా చాలా తక్కువగా ఉంది!ఆ ఉన్న కొంచెం కూడా ఖండాలుగా విడిపోయి ఉంది.రవాణా,సమాచారం లాంటివి యెన్నయినా కొంతవరకే మనుషుల్ని దగ్గిర చేస్తాయి.యెంత తిరిగినా యేమి చేసినా చీకటి పడే సమయానికి ఒక గూడు కిందకి చేరటం తప్పనిసరి.ఒకచోట గుమిగూడీన వారు భద్రత కోసం ఏదో ఒక స్థాయిలో రాజ్యం అనే గొడుగు కిందకి రాక తప్పదు.రాజ్యం సజావుగా నదవాలంటే విధేయత తప్పనిసరి.ఈ చట్రంలో ఇమడలేని వారికి రెండే దారులు - సొంత ప్రయోజనాల కోసం ముఠా కట్టి అందినంత దోచుకోవడం,తనకు కోరుకున్న అధిక ప్రయోజనాన్ని అందరికీ సాధించగలగటం,ఎవరు యెన్ని రకాల సిధ్ధాంతాలతో ఊదరగొట్టినా అన్నింటిలోనూ ఉండే రాజనీతి ఇదే కదా!మనిషికి తీరవలసిన పాంచభౌతికమైన అవసరాలలో అధికభాగం భూమి నుండే వస్తున్నాయి.మనిషి తన అలవాట్ల కోసం ప్రకృతిని మార్చటం,మారిన ప్రకృతి వల్ల పుట్టిన సమస్యలు మనిషికి మళ్ళీ అలవాట్లని మార్చుకోవాల్సిన అవసరాన్ని పుట్టించటం మానవావిర్భావం నుంచీ జరుగుతున్నదే,కొందరు భయపెడుతున్నట్టు అది వింతైనదీ కాదు!అయితే,భారతీయులు ఈ దేశానికి నైసర్గికంగా అమరి ఉన్న అనేకానేకమైన అనుకూలతల్ని ఉపయోగించుకుని ప్రకృతి - పురుష సంయోజనం(Interactivity) యొక్క క్రియ - ప్రతిక్రియ అనే ద్వంద్వాల్ని అర్ధం చేసుకున్నారు గనక వీరి జ్ఞానధార అవిచ్చిన్నంగా సాగింది,సాగుతున్నది,సాగుతుంది!దేశభక్తినే "high end limit","low end limit" అంటూ వెక్కిరించేవారికి సంప్రదాయం విలువ యేమి తెలుస్తుంది?

     న్యూటను మహాశయుడు తను యేమి సాధించినా అది తనకన్నా ముందున్న పెద్దల భుజాల మీద నుంచి చూడటం వల్ల్లనే అని అన్నది వినయంతో కాదు,తన ప్రతిస్పర్ధి అయిన రాబర్ట్ హూక్ యొక్క గూనితనం మీద వేసిన వ్యంగ్యం అని యెంతమందికి తెలుసు?"నా నెత్తి మీదొక యాపిల్ పడింది,అందులోంచే ఐడియా పుట్టింది" అనటం కూడా కేవలం అతని కున్న హాస్యప్రీతి నుంచి ఊడిపడిన చతురు మాత్రమే.యెన్నో సంవత్సరాల పాటు పరిశోధించి యెన్నో గ్రంధాలు చదివి ఇతర్లతో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంభాషించి తయారుచేసిన మొత్తం విషయాన్ని ఆ విషయాలతో అసలు పరిచయమే లేనివాళ్ళకి యెట్లా చెప్పగలడు?అందుకే యాపిల్ నా నెత్తిమీద పడిందనే జోకుతో సరిపెట్టేస్తే ఆ యాపిలే ఇప్ప్పుడు బుర్రలో జ్ఞానం వెలగటానికి పెద్ద సింబలై కూర్చుంది - ఒక్కొక్కప్పుడు బోడిగుండుకీ మోకాలికీ కూడా సంబంధం కుదురుతుందండోయ్!

గతమెంతొ ఘనకీర్తి గలవోడ భారతీయుడ!ఇప్పటి సంగతి చెప్పవేందిర చాదస్తుడ?
     కొందరిప్పటికీ "మరి అన్ని ఘనకార్యాలు సాధిస్తే ఇప్పటికీ మిగిలి ఉండాలి కదా,అంతటి జ్ఞానమూ తర్వాత కాలంలో యేమైపోయింది?మూఢనమ్మకాలకి గురై వెనకబడి పోయి ఇప్పుడు పాతగొప్పల్ని చెబితే యేమి ఉపయోగం?ఇప్పుడు మనకన్నా ముందున్నవాళ్ళ గొప్పదనాన్ని గుర్తించలేని యేడుపు కాదా ఇది!" అని వెక్కిరిస్తారని నాకు తెలుసు.వారికి నేనొకం సంగతి గుర్తు చేస్తున్నాను.12వ శతాబ్ద వరకూ భారతదేశమే ప్రపంచానికి జ్ఞాంభిక్ష పెట్టిందనేది అందరూ ఒప్పుకుంటున్న సత్యం!కానీ నలందా,విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాల్ని కాల్చి బూడిద చెయ్యడం వల్ల జరిగిన నష్టమే మనల్ని ఇన్ని శతాబ్దాల పాటు అంధకారంలో ఉంచిందని చాలామందికి తెలియదు.అక్కడ ఉన్న తాళపత్ర గ్రంధాలు తగలబడటానికి ఆరునెలలు పట్టిందని చెప్తున్నారు, యెంత స్థాయిలో జ్ఞానం ధ్వంసమైపోయింది?ప్రమాదం కనిపెట్టి కొందరు వీలున్నంత మేరకు దక్షిణాదికి తరలించారు.వాటిలో కేరళ లోని నీలకంఠ,మహదేవ శాఖల నుండి పుట్టిన జాతిరత్నమే సూర్యసిధ్ధాంతిక రచయిత భాస్కరాచార్యుడు!George Ghevergese Joseph తన "The Crest of the Peacock: Non-European roots of mathematics" అన్న గ్రంధంలో న్యూటనుకీ,అనేక యూరోపియన్ గణిత శాస్త్రజ్ఞులకీ కీర్తి కారణమైనవి కేరళ శాఖల నుండి జరిగిన అనువాదాలని సోదాహరణంగా నిరూపించాడు.ఈ పుస్తకం టైటిలులో ఉన్న "Crest of the Peacock" ఆర్యభటీయం లోనిదైన చక్కని పోలిక - నెమలికి పించం ఎంతటి శోభాయమానమో తక్కిన శాస్త్రాలన్నింటికీ గణితం అంతటి శోభాయమానమైనది అన్న గణితప్రశస్తి నుంచి తీసుకున్నదే.

      గ్రంధాలయాలు భస్మరాశులుగా మిగిలిపోవటం,జ్ఞానులు క్రూరంగా వధించబడటం,నగరాలకి నగరాలు నేలమట్టం కావటం లాంటివి భారతీయ జ్ఞానసింధువుని ఊషర క్షేత్రాల వైపుకి పరుగులెత్తించినాయి.ఆంగ్లేయులు ఈ దేశంలో ప్రాబల్యం వహించేనాటికి ఒకనాటి ఉద్యానవనం నేడు కనలేని మరుభూమిగా మారిపోయింది!ఆంగ్లేయుల లోని కొందరు జ్ఞానతృష్ణ గలవారు మళ్ళీ ఆ గతాన్ని తవ్వితీస్తున్నప్పుడే పాతకధలు వివరంగా తెలిశాయి - ఇతరులు తవ్వి తీసి ఆశ్చర్యానికి గురవుతుంటే గర్వించటానికి మనం యెందుకు వెనుకాడుతున్నాం?మనవాళ్లలోనే మన దేశం పట్ల ఉన్న చిన్న చూపు వల్ల మనకి రావలసిన గౌరవాల్ని మనకి దక్కించుకోవడం కోసం ప్రతి చిన్నదానికీ యెదురీత ఈదాల్సి వస్తున్నది,యెందుకీ ఆత్మహనపు పైశాచిక ధోరణి?అందరూ జీరో భారతదేశపు ఆవిష్కారం అని ఒప్పుకున్నాక ఇరవయ్యో శతాబ్దంలో కూడా అది గ్రీకుల "ఒమిక్రం" అనే అక్షరం నుంచి వచ్చిందని కొత్త వాదం లేవనెత్తారు యూరపియన్ మేధావులు.చివరాఖరికి గుజరాతులో లభించిన ఒక ఐదవ శతాబ్దానికి సంబంధించిన శిలాశాసనంలో జీరో ఉండటంతో ఒప్పుకోక తప్పలేదు.రామసేతువుని గుర్తించింది అమెరికా వాళ్ళు,కానీ దానికి తప్పుడు వ్యాఖ్యానాలు చెయ్యబోతే ఖండించింది జర్మనీ వాళ్ళు!మరి మనవాళ్ళు యేమి చేస్తున్నారు?ఇతరులు గుర్తించి ప్రశంసించే అంశాల విషయం వీళ్ళకి నచ్చకపోగా అవన్నీ అబధ్ధాలు అని వీళ్ళే పనిగట్టుకుని తప్పులు వెతికి మాదేశం ఒక చెత్త అని అందరికీ వినబడేటట్టు అరవడమే గొప్ప అనుకోవటం బహుశా ప్రపంచంలో ఇంకే దేశంలోనూ జరగదేమో!

     గతంలోని గొప్పదనాన్ని గురించి చెప్పేటప్పుదు వాస్తవాల్ని మాత్రమే చెప్పాలి.మనవాళ్ళు ఒకప్పుడు విమానాలు తయారు చేశారు అని చెప్పే నిరాధారమైన కబుర్ల వల్ల ప్రయోజనం యేముంది?వ్యతిరేకులు మరింత వేళాకోళం చెయ్యటం తప్ప వాటి వల్ల యే ఉపయోగమూ లేదు,నిజమే!విమానాల్ని కనిపెట్టిన వాళ్ళు కార్ల నెందుకు వదిలేశారు అనే ప్రశ్న నాకే వచ్చింది:-)కానీ ఒక విదేశీ మేధావి చెప్పినట్టు మనవాళ్ళకి తెలిసిన ప్రతి విషయాన్నీ  ప్రయోగం ద్వారా రుజువు చేసుకోవాలనే దురదా కనిపించిన ప్రతిదాన్నీ అనుభవించి తీరాలనే దురాశా లేదు!అలాంటి లక్షణం ఉండటం వల్లనే పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం మారణాయుధాల్ని కనిపెట్టడం మీద,కాలుష్యాలను పెంచే వ్యర్ధ వ్యాపారాల మీద శ్రధ్ధ చూపిస్తే మన వాళ్ళు మనిషి చిరకాలం ప్రశాంతంగా జీవించడానికి పనికివచ్చే ఆయుర్వేదం,యోగశాస్త్రం,ఆధ్యాత్మికత వంటి వాటి మీద దృష్టి పెట్టారు.ఇప్పటికీ ధ్వంసం కాకుండా మిగిలిన ఆవిష్కరణలలో సౌభాగ్య చింతనే కనిపిస్తుంది తప్ప భీబత్స సూచనలు లేవు!వాళ్ళేమో తమ దేశపు ప్రాభవం పెరగటానికి యే చిన్న అవకాశాన్నీ వొదులుకోవటం లేదు!మనమేమో మనల్ని మనం కించపరుచుకోవటానికి యే చిన్న అవకాశాన్నీ వొదులుకోవటం లేదు?బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టినట్టు బ్రాహ్మణులు మమ్మల్ని అణిచేశారు,కాబట్టి బ్రాహ్మణులు సాధించిన ఘనకార్యాల్ని మేమెందుకు పొగడాలి అంటే యేమి చెప్పగలం?అమెరికా దేశానికి సంబంధించిన నాసా ఉద్యోగుల్ని అక్కడి నల్లవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలకి బాధ్యుల్ని చెయ్యగలమా?యే సమాజమూ యెప్పుడూ ఒకే రకంగా ఉండదు - గతం నుంచి చెడుని పరిహరించి మంచిని స్వీకరించి ఆగతానికి కదిలితే ప్రయోజనం ఉంటుంది గానీ గతాన్ని తిట్టుకుంటూ యెన్ని శతాబ్దాలు గడిపినా ఒక్క అడుగు కూడా భవిష్యత్తు లోకి పడదు గదా!రెండు మహానగరాలు నవల "అదొక వైభవోజ్వల శకం.అదొక వల్లకాటి అధ్వాన్న శకం..." లాంటి మహాగంభీరమైన వాక్యాలతో మొదలవుతంది!జిజ్ఞాసతో జీవితాలని చరితార్ధం చేసుకున్న గతకాలపు మహనీయుల వల్లనే వర్తమానం ఇలా ఉంది,ఆ జిజ్ఞాసువుల పట్ల గౌరవం లేకుండా భవిష్యత్తు మహోజ్వలం కాబోదు.

అధాతో విశ్వ జిజ్ఞాసా,అధాతో బ్రహ్మ జిజ్ఞాసా!
-----------------------------------------------------------------------------------------------------------------
ఈ ప్రసంగం శాలివాహన శకం 1937 ఆశ్వీజ మాసము 30వ తేదీ గురువారము నాడు ప్రచురించబడినది.

84 comments:

  1. Another excellent post Haribabu garu, thanks for the same.

    ReplyDelete
  2. ఈ వీరి ఒక్క వాక్యానికే వీరికి వెయ్యి వీర త్రాళ్ళు వెయ్య వచ్చు :౦

    నిజమే,వర్గచైతన్యం యెక్కువగా ఉన్న కొద్దిమంది, మెజార్టీ ప్రజల కోరికల్ని పెట్టుబడిదారీ ఆర్ధిక విధానంలోని విషఫలాలుగా లెక్కగట్టి, పెట్టుబడిదారీ ఆర్ధికం తనలోని వైరుధ్యాలకి తనంతట తనే కూలిపోతుందని భయపెట్టి, అలా భయపడిన వారికి తరుణోపాయంగా వర్గరహితసమాజమనే మోక్షమార్గాన్ని చూపించి, దాన్ని వ్యతిరేకించిన వాళ్లకి వర్గశత్రువులని పేరు పెట్టి సాయుధపోరాటం పేరుతో పెద్దమొత్తంలో లేపెయ్యటం నచ్చిన వాళ్ళకి ఈ చిన్నా చితకా రంగులు పులమటం లాంటి బూర్జువా నిరసనలు సిల్లీగా అనిపిస్తాయి కాబోలు?!

    ReplyDelete
  3. హరిబాబు గారు,

    ఎక్సలెంట్ పోస్ట్. కానీ పోస్ట్ మొత్తం మీద ఒక చిన్న డౌట్. కకుద్మి బ్రహ్మ లోకం తనొక్కడే వెళ్లాడా లేక కూతురుతో సహా వెళ్లడా? తనొక్కడే వెళితే క్రింద భూమి మీద 25 యుగాలు అంతరించి పోయినా అతని కూతురు మాత్రం ఎలా జీవించి వుంది. పోస్ట్ లో ఇదొక్కటే క్లియర్ గా లేదు. మిగతా పోస్ట్ అంతా చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. with daughter and wife,
      thanks for the response!

      Delete
  4. < "బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టినట్టు బ్రాహ్మణులు మమ్మల్ని అణిచేశారు,కాబట్టి బ్రాహ్మణులు సాధించిన ఘనకార్యాల్ని మేమెందుకు పొగడాలి అంటే యేమి చెప్పగలం?"

    బాగా చెప్పారు.
    కూలంకషంగా వ్రాసిన హరిబాబు-మార్క్ excellent post.
    విజయదశమి శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. కొబ్బరి చెక్కలుకూడా తమ ఆరగింపుకే చాలటం లేదు, బ్రాహ్మలకెక్కడ. కొబ్బరి చెక్కలు తినేవాళ్ళు కూడా బేమ్మల గురించి మాటాడేవాళ్ళే :(

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. గుడి శుబ్రం చేసే కాంట్రాకట్రెవరు? నువ్వు,నువ్వు. కొబ్బరి చెక్కల కాంట్రాక్టరెవరు నువ్వు నువ్వు. బేమ్మల గురించెందుకు మాటాడ్తావోయ్. గుళ్ళో చెత్తేసేదెవరు నువ్వు, నువ్వే

      Delete
    5. నీహారికా
      నీకసలు దేశభక్తి లేదు,హన్నా!
      అదే నన్ను చూడు,కాంగ్రెసూ మరియూ దానితో డైరెక్టు లింకూ ఉన్నది తప్ప ఈ దేశంలోని ప్రతి అంగుళాన్నీ ప్రేమిస్తాను - మురికి కుప్పల్తో సహా?!
      సంస్కర్తల్లో కల్లా యెన్నదగిన గిరీశంగారు యేమన్నారు?విడో మ్యారేజీ చెయ్యాలంటే బాల్య వివాహాలు ఉండాలన్నాడు!యాంటీ నాచ్చి అనే బృహత్కార్యం చేసి పేరు తెచ్చుకోవాలంటే డ్యాన్సిగర్ల్సు ఉండి తీరాల్సిందేనని ఉద్ఘాటించారా లేదా?

      రావణాసురుదనే ఒక పరదారాసక్తుడు పక్కన ఉంటేనే శ్రీరాముడికి హీరో వర్షిప్,లేకపోతే అన్ని గొట్టాల్లో ఒక గొట్టం గోవింద రాజులు,కాదా?అట్లాగె స్వచ్చ భారత్ జయప్రదం కవాలంటే మురికి కుప్పలు ఉండాలి గదా,యేమంటావ్?
      అన్నట్టు మరక మంచిదే అయినప్పుడు మురికి యెందుకు కాదు చెప్మా?

      దేసమును ప్రేమించుమన్నా,మురికి యన్నది పెంచుమన్నా.
      జై మురికి కుప్పలు!జై రావణబ్రహ్మ!!జై దేశభక్తి!!!
      ఇట్లు
      చిచ్చరపిడుగు

      Delete
    6. ఈ రోజు ఉదయమే అయోధ్యలో నరేంద్ర మోదీ భక్తి పాట loud speakerలో వినిపించింది. వీళ్ళకి దేశభక్తి పోయి వ్యక్తిభక్తి వచ్చింది. అబ్ మే బనారస్ మే హూఁ. అయోధ్యా మే ముఝే ఠహర్నే కేలియే అచ్చా ప్రబంధ్ నహీఁ మిలా, ఇస్ లియే మే బనారస్ మే కమరా లియా!

      Delete
    7. ప్రవీణ్
      నా బ్లాగులో నువ్వు కామెంటు వెయ్యకు!చెప్పకుండా దెలిట్ చేస్తే యెందుకు డెలిట్ చేశానో తెలియదు గాబట్టి చెప్తున్నా.

      నేను దెలిట్ చేసిన నీ ఆఖరి కామెంటు గుర్తుందా?అందులో నన్ను పట్టుకుని "నీ పక్కింట్వాడు రంకు చేస్తే సహిస్తావు,నెహ్రూ రంకుని యెందుకు వొప్పుకోవు" అని అడిగావు,యెంత పైత్యం?నేను నా పక్కింటివాణ్ణి సహిస్తానని నీకెలా తెలుసు?యెవరు చెప్పారు నా గురించి?నువ్వు స్వయంగా చూశావా?నీ దగ్గిర సాక్ష్యముందా?యేం మాట్లాడుతున్నావో తెలియకుండా నను బ్లేం చెయ్యడం కాదా!యెదటివాళ్లని లేని లోపాన్ని అంటగట్టి విమర్శించను.న అగురించి స్థాయి తక్కువ మాటలు అంటే సహించను.

      ఇంకా నువ్వు నెహ్రూ నాస్తికుడు గాబట్టీ నూఒ హైందూత్వాని నమండు గాబట్టీనూ మరేదో లాజిక్కుతో నెహ్రూ రంకు చేసినా ఫర్వాలేదని అన్న నీ తలతిక్క అభిప్రాయాలతో నాకు పని లేదు గానీ సూటిగా నన్నే అవమానించావు,గాబట్టి మళ్ళీ యెప్పుడూ ఇక్కడ కామెంటు చెయ్యకు.దమ్ముంటే కమ్యునిజం గురించి నా ప్రశ్నలకి జవాబు చెప్పు,ఇప్పటికీ ఆ చాలెంజి అలాగే ఉంది - బస్తీ మే సవాల్?!

      నేనట పక్కింటివాడు రంకు చేస్తే సహిస్తానట,నెహ్రూని మాత్రమే విమర్శిస్తానట - SHIT!

      Delete
    8. This comment has been removed by the author.

      Delete
    9. This comment has been removed by the author.

      Delete
    10. నీహారికా,
      నిజంగానే మాంచి లాభసాటి యాపారం మీదనే నీ కన్ను పడింది,గుడి గోపురాల చుట్ట్టూ జరిగే బిజినెస్సు,అబ్బో!బాబు గారు హిందూ దేవాలయాల్ని మళ్ళీ ఇదివరకట్లా ప్రభుత్వం పట్టు నుంచి విడిపించి ధర్మకర్తలకి అప్పజెప్తానంటున్నాడు,నా స్సామిరంగా!ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టు ఆ ఒక్కటీ జరిగితే చూస్కో.

      Delete
    11. గుళ్ళలో బ్రాహ్మణులు ఆధ్యాత్మిక కూలీలు. ఆశీర్వదించడానికి తప్ప ఏ హక్కులూ లేని కూలీలు. వాళ్ళ నెత్తిమీద దాతలూ, ధర్మకర్తలూ, ఎండోమెంట్స్ డిపార్ట్ మెంటూ ఇత్యాది దొంగమొగుళ్ళు అనేకమంది ఉన్నారు. ఆ మొగుళ్ళు గుళ్ళలో టెంకాయల్ని పీచుతో సహా హోటళ్ళకి అమ్ముకుంటారు. బాధలు పడుతున్నవాళ్ళనే ఇంకా నిందించడం సరికాదు.

      Delete
    12. This comment has been removed by the author.

      Delete
    13. పున్నమి ఎఫెక్ట్ బానే ఉన్నట్లుంది, ఆయన ఇచ్చిన వివరణ ఏమిటి? దానికి నీ రెప్లై ఏమిటి మెంటల్ ?

      Delete
    14. This comment has been removed by the author.

      Delete
  5. Excellent post Haribabu garu. విజయ దశమి శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. వ్యాఖాతలూ మరియూ బ్లాగ్మిత్రు లందరికీ విజయదశమి శుభాకాంక్షలు!

    ReplyDelete
  7. One of the finest articles seen on the subject. Worth saving this one. Thanks Hari garu.

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారు, సాయి కిరణ్ గారు చెప్పినట్టు పదిలంగా దాచుకొనే విలువైన వ్యాసం. మీరు ఈ వ్యాసాలను ప్రముఖ పత్రికలలొ కాని, లేదా పొపులర్ తెలుగు వెబ్ సైట్స్ లో కాని ప్రచురిస్తే ఇంకా ఎక్కువ పాఠకులకు చేరతాయి. ఊదాహరణకు ఏంబీఎస్ ప్రసాద్ గారిని తీసుకొండి. ఆయన ఎంతో మంచి అర్టికల్స్ ను గ్రేటంధ్రా డాట్ కాం లొ పబ్లిష్ చేస్థున్నారు. మీరు కూదా అలా చెయ్యొచ్చు కదా? ఆలొచించగలరు.

      Delete
    2. హరిబాబు గారు, సాయి కిరణ్ గారు చెప్పినట్టు పదిలంగా దాచుకొనే విలువైన వ్యాసం. మీరు ఈ వ్యాసాలను ప్రముఖ పత్రికలలొ కాని, లేదా పొపులర్ తెలుగు వెబ్ సైట్స్ లో కాని ప్రచురిస్తే ఇంకా ఎక్కువ పాఠకులకు చేరతాయి. ఊదాహరణకు ఏంబీఎస్ ప్రసాద్ గారిని తీసుకొండి. ఆయన ఎంతో మంచి అర్టికల్స్ ను గ్రేటంధ్రా డాట్ కాం లొ పబ్లిష్ చేస్థున్నారు. మీరు కూదా అలా చెయ్యొచ్చు కదా? ఆలొచించగలరు.

      Delete
    3. మీ సూచన నాకూ నచ్చింది.ఇదివరలో ఒక్క పోష్టు అక్కడ వేసినట్టు గుర్తు!వారే అడిగినట్టున్నారు.ఇప్పుడు నేనూ ఈ భావాలు యెక్కువ మందికి తెలియలనుకుంటున్నాను.మన దేసపు మేధావుల్ని పొగిడితే విదేశీయుల్ని తిట్టినాట్టూ,ఒంకా వీళ్ళ్ళ ఆత్మబంధువుల్ని అవమానించినంత కోపమూ దు~హ్ఖమూ చూస్తుంటే ఇవన్నీ యెక్కువమందికి తెలియకపోవడం వల్లనే కదా ఇలా జరుగుతునదనిపిస్తున్నది.మరి ఇప్పుడు నేనెలా కాంటాక్ట్ చెయ్యాలి?

      Delete
  8. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  10. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. @nagarjunareddy akkineni:
      I am seeing that you are deleting, hahahahahaaahahahahhahaahah, Idiot!! I have my own ways to prove that you are nothing but an utter idiot! I will use them!!! wait for me!

      haribabu:
      చెత్త కామెంట్లు వేస్తే డెలిట్ చెయ్యరా?ఏదో వాళ్ళు ఫ్రిజ్జులూ అవీ కనిపెట్టారు,బట్టలు కూడా వాళ్ళవే తొడొగుతున్నావ్ అని నన్ను ఇడియట్ అన్నావు.అసలు ఇడియట్ నువ్వురా బడుధ్ధాయ!అవి వాడుతున్న నీ దేహం ఇక్కడ ఈ భూమి మీదే పుట్టిందా!

      రాం దేవ్ బాబా ఆయుర్వేదం మందులు తయారు చేసి అమ్ముతున్నట్టే వాళ్ళు కొన్ని వస్తువుల్ని తయారు చేసి మార్కెటులో అమ్మితే కొంటున్నాం.నీ లెక్క్కన కాల్గేట్ టూత్ పేస్టు నుంచీ బాటా షూ కంపెనీ వరకూ ఇంకా హార్లే డేవిడ్సన్ కంపెనీకీ రోజూ దణ్ణాలు పెట్టాలి,పెడుతున్నావా?పందగలప్పుడు వాళ్ళందరి ఆయురారోగ్యాఇశ్వర్యాల కోసం పూజలు చేయించాలి,చేస్తావా?

      నేను న్యూటన్ దగ్గిర్నుంచి ఇక్కడ ప్రస్తావించిన విదేశీయుల్లో యే ఒక్కరి నయినా అవమానించానా?వాళ్ళ ప్రజ్ఞ గొప్పదే.కానీ వాళ్ళ కన్నా ముందే మనవాళ్ళు కనుక్క్కున్నారు,అయినా మనవాళ్ళకి గుర్తింపు రాలేదు అని నేనంటుంటే నీ రక్తసంబంధీకుల్ని తిట్టేసినంతగా కోపమూ దుఃఖమూ యెందుకు వస్తున్నాయి నీకు?

      నీకు బుర్రలో గుజ్జుంటే పైన చెప్పినవన్నీ అబ్ధ్ధాలు అని రుజువు చెయ్యడానికి ప్రయత్నిస్తావుర్రా అసలైన బడుధ్ధాయా!నీ లాంటి వాళ్ళనే నేను చాలంజి చేసింది,దమ్ముంటే టేకప్ చేసి ఇవ్వన్నీ అవికనుక్కున్నాక రాసి ఇరికించినవని రుజువు చెయ్యి అప్పుడు ఒప్పుకుంటా నువ్వు ఇడియట్ కాదని - బస్తీ మే సవాల్?!

      P.S:మళ్ళీ వస్తావేం?వచ్చి యేం పీకుతావు,నీ స్వదేశీయుల్ని పొగిడినందుకు నీ స్వదెశీయుణ్ణీ ఇడియట్ అటావు,అంతకన్నా పీకగలిగేది యేమయినా ఉంటే చాలెంజి టేకప్ చేసి ఆ పని చూడు - యెన్ని అడ్డదారుల్లోనయినా!

      Delete
  13. @nagarjunareddy akkineni
    this man doesn't even know the manners of writing!

    haribabu:you didn't even know the manners of commenting!
    ఇదివరకటి ఆర్టికిల్ కొంచెం గ్రాంధికం కాబట్టి జనం కంఫ్యూస్ అయ్యారనుకోవచ్చు,ఇంత మామూలు తెలుగులో రాసినా నీకు ఇందులోని విషయం సరిగ్గా అర్ధం కాలేదంటే నిన్ను చూసి నవ్వాలా యాడవాలా?!

    ReplyDelete
  14. To Moron who say Westrens invented great things......
    All of Western inventions Destroys Environment .... Proud to be Indians .... Long back Indians Invented few .... They never ...(noway ) harms Nature ...
    Westerns invented Fridge, AC ....all these harms Nature.


    Regarding Post ..... Good work sir ......

    Waiting for "tingari anonymous ...... Who just argue illogically" ;)

    ReplyDelete
    Replies
    1. Thanks
      I am not a coward to be frightened by these fellows.
      moreover I had proof for each and evry word and I never criticized any of the scients,why should I fear?
      me too waiting:for them-)

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
    3. This comment has been removed by a blog administrator.

      Delete
    4. nagarjunareddy akkineni
      మళ్ళీ వచ్చి నువ్వు పీకుతానన్నది ఇదా?అసలు పైవాటిని అబధ్ధం,అవి నిజంగా పాతవి కావు అని ప్రూవ్ చేసే దమ్ము ఉందా లేదా?రేప్ అనేది పర్సెంటేజి ప్రకార్మ్ చూస్తే ఇక్కడ కన్నా నువ్వు గొప్పవనుకున్న దేశాల్లోనే యెక్కువ,నువ్వు లెక్కలు తీసినా కనపడుతుంది.

      పోటుగాడి మల్లే వచ్చి చెత్త కామెంట్లు వెయ్యడం కాదు,ఓపెన్ చాలేంజి చేశాను.కళ్ళు దొబ్బాయా?మైండు సరిగ్గా లేదా?

      Delete
  15. సర్, వ్యాఖ్యాతలు తిక్కరాతలు రాస్తే వాటిల్లో ప్రతి ఒక్కదానికీ సమాధానం చెప్పే పని పెట్టుకోకండి. దాని వల్ల మీ హుందాతనమూ, ఇంటలెక్చువలిజమూ దెబ్బదింటాయి. కొందర్ని మీరు ఏం చేసీ మార్చలేరు. బ్లాగర్ ని రెచ్చగొట్టడం కొంతమందికి సరదా. అలాంటి పనిలేని మంగలాళ్ళ కత్తెరలకి మీరు బలైపోకండి. ఇహపోతే మగవాళ్ళ వ్యాఖ్యలకి మాత్రమే సమాధానం ఇవ్వడం ఉత్తమం. ఎందుకంటే వాటిల్లో కాస్త కాకపోతే కాస్తయినా intellectual content ఉంటుంది.

    ReplyDelete
  16. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  17. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. అవి అబధ్ధాలు,చరిత్రని వక్రీకరించలేదు అని సాక్ష్యాలు చెప్పకుండా సుభాషితాలు చెప్తూ సొల్లు కబుర్లు చెపకు.నిర్ధారనలు చెప్పు.నేను నిన్ను అడిగింది గట్టి సాక్ష్యాలతో వాదించమని.ఇట్లా నువ్వు సొల్లు చెప్తూ నన్ను వెక్క్రిస్తే కుదరదు.తర్వాతి కామెంటుని ఉంచానౌ కదా,దానికి జవాబు చెప్తాను.

      చెత్త కామెంట్లు వేస్తే మాత్రం యెవరి దయినా ఉంచను.భాసహ హుందాగా వుంచుకో.

      Delete
  18. ఇంకోవిషయం. వేదాలను అపౌరుషేయాలు అంటారు. అంటే ఏంటో తెలుసుకో. వాటిని గ్రంధస్థం చేసిన వ్యక్తి వేద వ్యాస్డు. ఆయన బ్రాహ్మణుడు కాదు. ఇవే కాదు ఇంకా చాలా శ్లోకాలున్నాయి. అవేవీ బ్రహ్మనులు రాసినవి కావు. అయినా అందులో ఉండే చెడును మేము వ్యతిరేకిస్తాం. బ్రాహ్మణులు రాస్తే బాలేదండం, బ్రాహ్మనేతరులు రాస్తే నెత్తికెత్తుకోవడం రెండూ మా పనులు కావు. మాకు కంటెంట్ ముఖ్యం, రాసినోడు కాడు. అయినా నీకు ఇలా నోరేసుకుని పడిపోవడం తప్ప నిజానిజాలు ఎప్పుడు కావాల్సి వచ్చాయని !

    1.The Brahmins wrote the Vedas.

    The Vedas are called Sruthi , heard and transmitted and there is no authorship.

    There is no author or authors for the Vedas.

    The Vedas were compiled by Ved Vyasa and not authored by him.

    And Veda Vyasa was the son of a fisher woman and Parasara(Brahmin -marriage with Sathyavati was performed by Yagnyavalkya), not a Brahmin.

    There is no connection between the Brahmins and the authorship of the Vedas.

    There is also a view that the Puanas were written by the Vedas and propagated by them.

    They were not written by them and were by Vyasa.

    As a matter of fact most of the Gods worshiped by the Hindus are not Brahmins,

    Rama ,a Kshatriya,Krishna a Cowherd.

    Even the great mantras of the Vedas were compiled, not by Brahmins.

    The greatest mantra of Hinduism was by Viswamitra. a Kshtriya, who was called a Brahmin after he gave the world the Gayatri Mantra.


    https://ramanan50.wordpress.com/2014/02/07/brahmins-caste-hinduism-vedas/

    ReplyDelete
    Replies
    1. usaravelli:The Vedas were compiled by Ved Vyasa and not authored by him.
      haribabu:who will disagree with this fact?మేము కూడా వేదాల్ని విభజించినవాడు అనే అంటున్నాం గానీ ఆయనే వేదాలన్నీ రాశాడు అనట్లేదుగా!





      usaravelli:And Veda Vyasa was the son of a fisher woman and Parasara(Brahmin -marriage with Sathyavati was performed by Yagnyavalkya), not a Brahmin.
      haribabu:who will disagree with this fact?జ్ఞానం ప్రవృధ్ధమైనప్పుడు కులంతో సంబంధం లేకుండా వాళ్ళు ఆస్థానానికి యెదగడానికి సాక్ష్యం అది!కుంభసంభవుడు అనే పదానికి కూడా కుంభకారుల కులంలో పుట్ట్టినవాడు అనే అర్ధం వస్తుంది,నిజమే కదా!




      usaravelli:As a matter of fact most of the Gods worshiped by the Hindus are not Brahmins,

      Rama ,a Kshatriya,Krishna a Cowherd.
      haribabu:who will disagree with this fact?ఆ కధల్లోనే అందుకు సాక్ష్యం ఉంది.యెవ్వరూ యే అభ్యంతరమూ చెప్పలేదు.

      LINK:So using canards to persecute Brahmins is nothing short of a distortion of Facts and mischievous.CORRECT?!

      Delete
    2. persecute:to treat (someone) cruelly or unfairly especially because of race or religious or political beliefs

      : to constantly annoy or bother (someone)

      so,tell me according to your supported arguments here,is it justifiable to hate/blame/mockeary that was throwing on brahmins?

      Delete
    3. >వేదాలను ...... గ్రంధస్థం చేసిన వ్యక్తి వేద వ్యాసుడు. ఆయన బ్రాహ్మణుడు కాదు.
      > Veda Vyasa was the son of a fisher woman and Parasara (Brahmin..

      వేదవ్యాసుడు బ్రాహ్మణుడేనండీ.

      ( సత్యవతి ఉపరిచరుడనే రాజర్షికుమార్తె. అమె బెస్తయువతి కాదు. పరాశరుడు భ్రాహ్మణుడనటం సరైనదే. )

      ఈ విషయంలో శ్రీవనం జ్వాలానరసింహారావుగారి బ్లాగులో కొద్దిరోజుల క్రిందటే సవివరంగా వ్రాసాను. అక్కడి వ్యాఖ్యను పరిశీలించగలరు.

      Delete
    4. @శ్యామలీయం
      Please give me the link, it's almost impossible to search !

      Delete
  19. @usaravelli
    ఇట్లా పరిశుభ్రమైన భాషతో పాయింట్ల వారీగా వాదిస్తే యెవరు వ్యతిరేకిస్తారు.నేను తీసేసిన రెండో కామెంటులో మీరేదో ఆధారాలు దొరక్క అలా చేసారూ అంటున్నారు.ఒక తప్పు పట్టగానే అంబేద్కరును విమర్శించే స్థాయి ఉందా అని అడిగేశారు.కానీ నాకు అంబేద్కర అంటే ద్వేషం గానీ చిన్న చూపు గానీ యేదీ లేదు.గత పోష్టుల్లో కులాల గురించి వచ్చినప్పుడు ఆయన దామాషా పధ్ధతిలో యేర్పరచిన రిజర్వేషన్ల ఈక్వేషన్ నాకు నచ్చిందనే చెప్పాను.

    అదే మబేద్కర్ "ఆర్యన్ ఇన్వేజన్" గురించి అప్పుడే ఇది వాళ్ళ రాగద్వేషాలతో వండి వారుస్తున్నదే తప్ప నిజం అనేతందుకు ఆధారాలు లేవు అని అన్నాడు.
    writings of ambedkar clearly reveal that he totally debunked the Aryan theory of race. Excerpts:


    That the theory of the Aryan race set up by Western writers falls to the ground at every point goes without saying. This is somewhat surprising since Western scholarship is usually associated with thorough research and careful analysis. Why has the theory failed? … Anyone who cares to scrutinise the theory will find that it suffers from a double infection. In the first place, the theory is based on nothing but pleasing assumptions and inferences based on such assumptions. In the second place, the theory is a perversion of scientific investigation. It is not allowed to evolve out of facts. On the contrary the theory is preconceived and facts are selected to prove it.
    అది కూడా ఆధారాలు దొరక్క చేసిందేనా?రొమిల్లా ధాపర్ ఈ అదెశచరిత్రకై సంబంధించి దేశం లోపల ఒక వెర్షన్ దేసం బయట ఒక వెర్షన్ చెప్పడం కూడా అనుకోకుండ అజరిగిన పొరపాటు అంటారా?

    P.S:ముందే చెప్పాను,నేను యేదీ యేకపక్షంగా నిర్ధారించుకోను - అన్ని వైపుల నుంచీ కరెక్టా కాదా అన్నది తేల్చుకున్నాకే మాట్లాదతాను.మీరు సాక్ష్యాలు చూపించి రుజువూలతో వ్యతిరేకిస్తే అప్ప్పుడు నాతో సహా మేమందరం వెధవల మవుతాం,ఈసారి అలా రండి!

    ReplyDelete
  20. Excellent post.. thanks for sharing with us..

    ReplyDelete
  21. usaravelli27 October 2015 at 22:56
    బ్రాహ్మణులు రాస్తే బాలేదండం, బ్రాహ్మనేతరులు రాస్తే నెత్తికెత్తుకోవడం రెండూ మా పనులు కావు. మాకు కంటెంట్ ముఖ్యం, రాసినోడు కాడు

    haribabu:చాలా చక్కని అభిప్రాయం,ఇట్లా నిష్పక్షపాతంగా మాట్లాడితే యెందుకు వ్యతిరేకిస్తాం?మీరు మంచిమాట చెప్పినా విమర్సిస్తే మా దుష్టబుధ్ధి బయటపడిపోదూ!

    కానీ చూశారూ,అనుకోకుండానే వ్యాసుడు అబ్రాహ్మణుడని పొరబడినట్టున్నారు,కొంచెం సరి చేసుకుంటారా?

    మీకు నిజంగా వేదాల్లో ఉన్న చేడుని అధికారికంగా యెత్తిచూపి మానోళ్ళు మూయించాలని ఉంటే జర్మనీ వెళ్ళండి!అక్కడ వీటన్నింటికీ ప్రామాణికమైన అనువాదాలు దొరుకుతాయి!వాళ్ళేమీ దొరికందే చాలని ప్రతిదాన్నీ అనువదించెయ్యలేదు,తమకి దొరికింది నమ్మదగినదా కాదా అని పరిశోధించి తెలుసుకున్నాకే అనువదించారు.వాటి కాలనిర్ణయాలు కూడా చేశారు.

    ప్రయత్నించి చూదండి!

    ReplyDelete
    Replies
    1. నాది పొరపాటు కాదు. నేను నిరూపించ గలను. కాకపోతే ముందుగా శ్యామళీయం గారు చెప్పిన సదరు చర్చ ఏమిటో చూడాలని ఉనిద్. దానికోసమే ఆయన్ను లింకు అడిగాను. మీరేమో నా కామెంట్లు ప్రచురించడం ఇష్టం లేదన్నట్లు దాన్ని ప్రచురించలేదు. నన్ను ప్రశ్నించి నాకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వక పోవడం అనేదాన్ని మీ విఙ్ఞటకే వదిలేస్తున్నాను !

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. usaravelli
      సందర్భం పాడూ లేకుండా లింకు అడిగి వొదిలేస్తే యెలా?శ్యామలీయం బ్లాగులో ఒక పోష్టు దగ్గిర ఇదివరకు భాగవతం లింకు ఇచ్చాను.మీరు అడిగిన మెసేజి నాకు మెయిల్లో శ్యామలీయం ఐడితో కనపడింది.మళ్ళీ దీన్ని పబ్;లిష్ చెయ్యదం దేనికని పాత భాగవతం లింకునే రెదైరెక్ట్ చేశాను.ఆ ప్రశ్న వేసింది మీరనీ శ్యామలీయం చర్చించిన పోష్టు.యొక్క లింకు అడిగుతున్నారని నాకెలా తెలుస్తుంది?

      అయినా మీరు నిరూపించదలచింది ఆ లింకుతో సంబంధం లేకుండానే నిరూపించవచ్చు,భాగవతం అధికారిక పాఠంలో స్పష్టంగా "దృతీయంబైన ద్వాపరయుగంబు దీఱు సమయంబున నుపరిచర వసువు వీర్యంబున జన్మించి వాసవి నాదగు సత్యవతి యందు పరాసరునికి హరికళం జేసి విజ్ఞాని యైన వేదవ్యాసుండు జన్మించి" అని స్పష్టంగా ఉంది నేనూ చదివాను.నిరూపించుకోగలనై మీరంత గట్టిగా చెప్తున్నారు గాబట్టి ప్రయత్నించండి.

      Delete
  22. Bramhan .... Non Bramhan ...
    Khatriya ....shudra ... vaishya ...
    These are Not decided by Birth ....
    Caste decided by "Qualities of a Person" then Vyasa maharshi has Excellent Gnyaana ... So he is Bramhan.

    Birth based Casteism applied by Invaders and Continued by Khangress .....with label of RESRVATIONS ....

    (small logic how people missing and confirming Vyasa not a bramhan !! )
    Even I was mi guided with arguments of Commie story tellers!!


    One more point Krishna ....not a Cowherd ... He is Kshatriya ... Coz of his Khaatra skills ...and Kshatriya responsibility is to Protect How matha ...

    Jai Gow Matha :)

    ReplyDelete
  23. http://jwalasmusings.blogspot.com/2015/10/blog-post.html


    “....వర్ణనిర్ణయం క్షేత్రాధిపత్యప్రధానంగా జరుగుతుంది. రావణుడి తండ్రిబ్రాహ్మణుడు కావటంతో, కైకసి బ్రహ్మక్షేత్రం అయ్యింది కాబట్టి రావణుడు బ్రాహ్మణుడే అవుతున్నాడు. ….మత్సగ్రంధి ఉపరిచరుడనే రాజర్షికూతురు కాబట్టి క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబటి క్షేత్రాధికారిగా మరొకక్షత్రియుడు లేడక్కడ.”


    వందల, బహుశా వేల సంవత్సరాల క్రితం అప్పటి కవులు ఆయా పాత్రల సంబంధబాంధవ్యాలను, సమాజంలో స్థితిగతులను ఎంత నిర్దిష్టంగా వర్ణించారో తెలియదు గాని… ఉత్కృష్టమైన గ్రాంధిక భాషలో 21వ శతాబ్దపు పురాతనవాది శ్రీ శ్యామలీయం గారు మాత్రం తమదైన రీతిలో అద్భుతంగా సూత్రీకరించారు.


    సామాన్యుల భాషలో దీన్ని విశ్లేషిస్తే…


    కైకసి, బ్రాహ్మణుడిచే చేపట్టబడినది కాబట్టి బ్రహ్మక్షేత్ర మయ్యింది. క్షేత్రమంటే దున్నుకొని, విత్తులు నాటుకొని, పంట పండించుకొనే పొలం. దున్నుకోకలిగిన పొలం మాదిరిగా ఆమె ఎవరి అధికారంలో వుందో ఆతడి వర్ణమే, ఆమెకి కలిగిన కుమారుడికి వర్తిస్తుంది. కాబట్టి రావణుడు బ్రాహ్మణుడే. అంటే, స్త్రీకి తాను పుట్టిన జాతినుంచి కాని, వర్ణము నుంచికాని ఏమాత్రము విలువ వారసత్వం పొందగల అర్హతలేదు, మనిషిగా స్వంత వ్యక్తిత్వానికి నోచుకోలేదు. పెళ్లి కాకముందు తండ్రి సొత్తు, తర్వాత భర్త ఆస్తి. అదీ, మన ఆధునిక బ్రాహ్మణుడి సూత్రీకరణ.


    ఇవీ మన ధర్మగ్రంధాల మేధోమధనం ద్వారా శ్యామలీయం గారు, వనం వారు వంటి పండితోత్తములు ఈ 21వ శతాబ్దంలో మన తెలుగు బ్లాగ్లోకానికి అందిస్తున్న విజ్ఞానగుళికలు.


    మర్చిపోయానండోయ్… ఇంత అద్భుత జ్ఞానసంపద కేవలం మన హిందూ భారత జాతి సొత్తని మరీ ఎక్కువగా స్వకుచమర్ధనం చేసుకోనవసరంలేదు. మన సోదరులు కూడా ఏమీ తక్కువ తినలేదు…


    Sura 2:223, Quran: Your women are your fields, so go into your fields whichever way you like . . . .


    Deuteronomy 22:28, Bible:
    "If a man finds a girl who is a virgin, who is not engaged, and seizes her and lies with her and they are discovered, then the man who lay with her shall give to the girl's father fifty shekels of silver, and she shall become his wife because he has violated her


    Exodus 20:17, Bible (Tenth Commandment): "Thou shalt not covet thy neighbour's house, thou shalt not covet thy neighbour's wife, nor his ox, nor his ass, nor anything that is thy neighbour's." The tenth commandment forbids coveting your neighbor's house, wife, animals or anything else that the neighbor owns, any piece of property.

    ReplyDelete
    Replies
    1. @Edge:వందల, బహుశా వేల సంవత్సరాల క్రితం అప్పటి కవులు ఆయా పాత్రల సంబంధబాంధవ్యాలను, సమాజంలో స్థితిగతులను ఎంత నిర్దిష్టంగా వర్ణించారో తెలియదు గాని… ఉత్కృష్టమైన గ్రాంధిక భాషలో 21వ శతాబ్దపు పురాతనవాది శ్రీ శ్యామలీయం గారు మాత్రం తమదైన రీతిలో అద్భుతంగా సూత్రీకరించారు.

      haribabu:ఇప్పటికీ ఇంటిపేరు తండ్రి నుంచి సంక్రమిస్తూ పెళ్ళీ కాగానే భర్త ఇంటిపేరుకి మారుతున్నప్పుడు శ్యామలీయం కొత్తగా చూపించిన పాండిత్యం,రుబాబు,కుట్ర యేమి ఉంది?తమరు కూడా యేదో ఒక కులం వారు అయిన్ ఉందాలి,మీ కులంలోనూ ఇదే జరుగుతుంది గదా!ప్రత్యేఅకించి శ్యామలీయం మీదనే అక్కసు వెళ్ళగక్కదం దేనికి?

      మళ్ళీ మీరే హిందూ మతంలోనే కాదండోయ్,అన్ని మతాల్లోనూ ఇంతే అంటున్నారు,దాన్ని బట్టి మీఎకేఅమి అర్ధమయింది?ఆయా మతాల్లో ఉన్న సాంపర్దాయాలకి కూడా శ్యామలీయమే భాష్యం చ్ప్పినట్టా!

      Delete
    2. @ హరిబాబు

      శ్యామలీయం గారేమో ఎవరు దున్నితే వారి కులం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయని ఢంకా బజాయించి చెపుతున్నారు. తమరేమో అది కాదు, కేవలం స్వాభావ రీత్యా కులాల విభజన ఉండాలని అవే శాస్త్రాలు చెప్పాయని గతంలో అరివీర భయంకరంగా వాదించినట్టు గుర్తు. ఈ రెండిటిలో ఏది వాస్తవమో శెలవిస్తారా?

      Delete
    3. శ్రీకాంత్ చారి,

      సైంటిఫిక్ మైందుతో చూసినా మనిషి కూడా ఒక జంతువే.మనిషికన్న ముందు పుట్టిన జంతువుల్లో కూడా సంతానం ద్వారా తమ జాతిని వ్యాప్తి చేసుకునే విషయంలో చొరవ చూపించటం మగవాటికే ఇచ్చింది ప్రకృతి!ఉదాహరనలు కావాలంటే జంతు సమూహం మొత్తంలో ఏ జాతి యొక్క ప్రత్యుత్పత్తి విధానం చూసినా తెలుస్తుంది.పక్షుల్లో మగపక్షూలకే యెకువ సింగారం,పెద్ద గొంతు,గూడు కట్టటంలో నేర్పరితనం మగపక్షుల్లోనే ఉన్నాయి.ఒక రకం పక్షి జాతిలో మగ పక్షులు గూడు కట్టి యెదురు చూస్తే ఆడపక్షి వచ్చి గుద్లు పెట్టి తనదారిన తను పోతుంది.ఆ గుడ్లని కాపాడి,పెంచి పోషించే పని అంతా ఆ గూడు కట్టిన మగపక్షిదే.మొత్తం జంతుజాతిలో అంతా జరుగుతున్నదే మనిషీ పాటిస్తుంటే శ్యామలీయం క్షేత్రం అన్నాడని అతని మీద పడి యేదవటం తప్ప వాస్తవం చూస్తున్నారా మీరు?దున్నడం అనే మాటని పదే పదే వాడి వెకిలిగా ప్రవర్తిస్తున్నది మీరు!దావీశూకర్నలో కొందవీటి వెంకత కవి యంటీవోడికి రాసిన డయలాగుల్లో లేదా క్సహేత్రబీజప్రాధాన్యత!సామాన్యంగా అందరూ వాడుతున్నమాటని ప్రత్యేకంగా యెత్తి చూపించి మీరు వూడబొడిచేది యేముంటుంది?

      మనుషుల్లో పెళ్ళి యెందుకు యేర్పడింది?నువు బ్యాంకులో అకవుంటు ఓపెన్ చెయ్యాలంటే నామినీ గురించి అడ్గుతున్నారా లేదా?యే ఆస్తినైనా రిజిస్తర్ చేసుకోవాలన్న్నా హఠాత్తుగా పోతే ఆస్తి ఎవరికి చెందాలో స్పెసిఫై చెయ్యాలా అఖ్ఖ్కర్లేదా?ఇప్పటికీ మనం పురుషాధిపత్య సమాజంలోనే ఉన్నాం.ఆడవాళ్ళు కూడా ఒకప్పుడు మాతృస్వామ్యలో పెత్తనాన్ని కొంతకాలం అనుభవించి అది వొదిలేసి ఇందులో సర్దుకుపోయారు.ఫలానా స్త్రీ ద్వారా నాకు పుట్టిన సంతానం నా ఆస్తికి వారసులు అని సమాజం ముందు ప్రకటించటమే పెళ్ళి అనే తంతుకి అర్ధం!ఇందులో శ్యామలీయం సొంతంగా లాగి పీకింది యేమయినా ఉందా?

      ఒక్క హిందూ మతం,భారతదేశం అనే గాకుండా మొత్తం ప్రపంచంలోని అన్ని మానవ సమూహాల్ల్లోనూ కొన్ని వేల యేళ్ళుగా జరుగుతున్న దానికి శ్యామలీయమూ హరిబాబూ కర్తలా?మీ తొక్కలో వెక్కిరింత మీకే తగుల్తుందని కూడా తెలియట్లేదు మీకు,పేద్ద పోటుగాళ్ళలా వాదనకి తయారయ్యారు?

      స్వభావాలని బట్టి విదగొట్టాను అని వ్యాసుడు స్పష్టంగా అంటే స్వభావాలు పుట్టుకతో వస్తాయని అర్హం నువ్వు పీకి దానికి ఒక జాత్యహంకార సిధ్ధాంతాన్ని తోడుగా తెచ్చుకుంటే అందులో తెలివీ తేటా ఉన్నట్టా?తెల్లవాళ్ళు నల్లవాళ్ళ కన్నా పుట్టుకతోనే గొప్పవాళ్ళు అని దప్పు కొట్టుకోవటం కోసం నాజీఎ హిట్లర్ అభిమానులు వండివార్చిన ధియరీని మీరు సాక్ష్యానికి తీసుకొచ్చారు.మీరు ఆ సిధ్ధాంతాన్ని మీ వాదనకి సపోర్టుగా తెచ్చుకుంటే వ్యాసుడి కన్నా గట్టిగా కులభెదాలూ వర్ణభెదాలూ ఇకముందు కూడా ఇట్లాగే ఉండాలని మీరు కూడా ఒప్పుకున్నట్టు అవుతుంది కదా!మరి మీరు సపోర్టు తెచ్చుకున్న ధియరీ చెప్పినదాన్నే వ్యాసుడూ చెప్తుంటే వ్యాసుడు చెప్పింది అన్సైంటిఫిక్ యెలా అవుతుంది?మీరు సాక్ష్యానికి తెచ్చుకున్న పుచ్చొంకాయ్ ధియరీ మీకే మొట్టికాయలు వేస్తుందని కూడా తెలియదు:-)

      మొదటి నుంచీ నా వాదన ఒక్కలాగే ఉంది!యే మాత్రం తేడా లేకుండా వర్నవ్యవస్థ అనేది పొలిటికల్ హైరార్క్య్ గురించి చెప్తుంది,ప్లాటో రీజన్,స్పిరిట్,అప్పెటైట్ అన్నట్టే అది కూడా క్లాసిఫికేషన్ అంటున్నాను.కులం మాత్రంవృత్తిని బట్టి ఉంటంది - ఆ మాటలో కూడా యే మార్పూ లేదు.గందరగోళం మీలో ఉంది.

      స్వభావాలు పుట్టుకతో వస్తాయని వ్యాసుడెక్కడా చెప్పలేదు.పతంజలి యోగసూత్రాలు మనస్సుని ఒక విషయం మీద కేంద్రీకరించి అవలక్షణాల్ని సరిచేసుకోవటానికి ఉద్దేశించినదే!అంటే స్వభావాల్ని క్రమశిక్షణతో మార్చుకోవచ్చునని వాళ్ళకి తెలుసు అనే కదా అర్ధం!

      ఇక్కడ ఉసరవెల్లి గారు మాకు కంటెంటు ముఖ్యమ న్నారు,ఇప్పుడు వ్యాసుడు బ్రాహ్మణుడు కాడు అంటున్నారు,మళ్ళీ అదే కంటెంటుని సాక్ష్యాలుగా చూపిస్తున్నారు.యెందుకీ గందరగోళం?వ్యాసుడు బ్రాహ్మణేతరుడైతే అతనికి వేదం మీద అధికారం యేలా వచ్చిందో మీరే చెప్పాలి!మీరు జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి,ముందు వాటి సంగతి చూడండి!

      మీరు కంఫ్యూజ్ అవుతూఒ నేను కంఫూజ్ అయ్యానంటావు,సరిగ్గా గుర్తు తెచ్చుకో!

      Delete
    4. మీరు వ్రాసిన యాభై పైగా లైన్లలో అనవసరమైన చెత్తనంతా తీసేస్తే నాకు అర్థమైంది...

      "స్వభావాలు పుట్టుకతో వస్తాయని వ్యాసుడెక్కడా చెప్పలేదు."

      అంటే స్వభావాలు పుట్టూకతో రావన్న మాట! మీరు కులం స్వభావజం అంటారు కాబట్టి మీ థియరీ ప్రకారం కులాలు కూడా పుట్టుకతో రావన్న మాట. మరి శ్యామలీయంగారు బీజ ప్రధానంగా కులాలు పుట్టుకతోనే వస్తాయంటున్నారే? ఏది కరెక్టు? ఇప్పుడయినా అనవసరపు సోది ఆపి విషయానికి సూటిగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి.

      Delete
    5. Sreekaant chaari
      మీరు కులం స్వభావజం అంటారు కాబట్టి మీ థియరీ ప్రకారం కులాలు కూడా పుట్టుకతో రావన్న మాట. మరి శ్యామలీయంగారు బీజ ప్రధానంగా కులాలు పుట్టుకతోనే వస్తాయంటున్నారే? ఏది కరెక్టు?

      haribabu:అర్ధం చేసుకోవలసినదంతా చెత్త కింద తీసేసి నువ్వే ఒక గుర్తింపు లేని తప్పుడు సైంటిఫిక్ ధియరీని సపోర్టుగా తెచ్చుకునే మనస్తత్వంలో ఉంటే యెట్లా అర్ధమవుతుంది నీకు?

      వృత్తులకీ కులాలకీ ఉన్న సంబంధం గురించి అంత స్పష్టంగా చెప్పాను.ఇక్కడ పూర్తిగా చెప్పకపోయినా ప్రజ దగ్గిర వివరంగా చెప్పాను.కులానికీ వృత్తికీ యెందుకు సంబంధం కలిగిందో తెలిస్తే కులం,వర్ణం ఒకటి కావు అని నీకు అర్ధం అవుత్తుంది,ఆ పాయింటే నీకు యెక్కటం లేదు.దున్నడానికి సంబంధించిన బూతుజోకుల మీద ఉన్న శ్రధ్ధ సీరియస్ విషయాల్ని అర్ధం చేసుకునే చోట ఉంటే బాగుంటుంది:-)

      ఇక్కడ నాలుగు వర్ణాలు అంటే అక్కద రీజన్,స్పిరిట్,అపెతటైట్ అన్నారు అని చెప్పినా అర్ధం కాకపోతే ఇంకెట్లా అర్ధమవుతుంది?ఇవ్వాళ ప్రెస్స్/మీదీయాని వాళ్ళు ఫోర్త్ ఎస్టేట్ అన్నారు.మనం అప్పటికే జుడిషియరీ,పొలిటీ లాంటి నాలుగు ఉన్నాయి కాబట్టి అయిదో వ్యవస్థగా వర్ణిస్తున్నాం.ఇదంతా ఒక్క రోజులో స్థిరపడిందా?యెవరయినా హఠాత్తుగా మీడియా అనేదాన్ని సృష్టించి తెల్లారేసరీకల్లా పరిపుస్టం చేశారా?మొదటి దశలో న్యూస్ పేపర్లు ఒకే ఒక పేజి ఉండేవి.చిన్న చిన్న సంగతులు,కొన్నిటి మీద ఆ పత్రిక ప్రచురించే మనిషికి ఉన్న సొంత అభిప్రాయాలు, అంతే!ఇవ్వాళ్టి పరిస్థితిని బట్టి ఇందులో నెగటివ్ ధోరణులు పెరిగాయి కాబట్టి మొత్తంగా దీన్ని దుర్మార్గం అని తీసిపారెయ్యగలవా?అలాగని అంతా బాగుందని నెత్తిన పెట్టుకోగలవా?

      మీడియా అనేది యెలా పెరిగిందో తెలియాలంటే దాని చరిత్ర తెలియాలి.వర్ణం,కులం అర్ధం కావాలంటే తులనాత్మకంగా చదవాలి.యేయే దశల్లో యేమి జరిగిందో తెలియాలి.ఆ చరిత్ర అంతా చెత్త అనేసిన మట్టిబుర్రకి వాదనలు దేనికి?ఇవ్వాల 2015లో నా కులం వెనుకబాటు తనానికి వ్యాసుడే కారణం అని భజన చేసుకో,నువ్వు వ్యాసుడి దఫ్గ్గిరకి వెళ్ళో వ్యాసుణ్ణే ఇక్కడికి తీసుకొచ్చే నీ ప్రతీకారం తీర్చుకో,వ్యాసుణ్ణి విలన్ పాత్రగా పెట్టి నిన్ను హీరోగా పెట్టి అద్రికని వ్యాంపుగా పెట్టి ఫార్ములా సినేమా తియ్యి,నీలాంటి కేతిగాళ్ళకి చూపించు,కలెక్షన్లు నిల్లు,చప్పట్లు ఫుల్లు:-)

      P.S:కొంచెం బుర్రపెట్టి ఆలోచించి కామెంటు,మోదరేషన్ ఉంది - చెత్త కామెంటు వేస్తే కుదరదు!

      Delete
    6. శ్రీకాంత్ చారి గారు, ఈ ప్రశ్న మీరు వేస్తేనే బాగుంటుందని ఎదురుచూస్తున్నాను. హరిబాబుగారి నుంచి యధావిధిగా logic కి అందని consistency కి చిక్కని style ఎక్కువ substance తక్కువ సమాధానం ఊహించాననుకోండి.

      వెతగ్గా వెతగ్గా మీలాగే నాక్కూడా ఒక మట్టిలో మాణిక్యం దొరికింది:

      “వ్యాసుడు బ్రాహ్మణేతరుడైతే అతనికి వేదం మీద అధికారం యేలా వచ్చిందో మీరే చెప్పాలి!”

      ఇదీ, సాక్ష్యాలు లేకుండా ఏదీ అంగీకరించని హరిబాబుగారు వ్యాసుడు బ్రాహ్మణుడే అనడానికి ఋజువుగా ప్రవేశపెట్టిన సాక్ష్యం. మానవాళికి అద్భుత జ్ఞానసంపదనందించిన వేదం మీద బ్రాహ్మణుడేతరుడెవ్వరికి అధికారం ఉండే అవకాశంలేదు కాబట్టి, వ్యాసుడు బ్రాహ్మణుడే.

      Delete
    7. మరింత సరళంగా అడగడానికి ప్రయత్నిస్తాను, సరేనా?

      శాస్త్రం ప్రకారం కులాలు శ్యామలీయంగారు చెప్పినట్టు కులాలు పురుష బీజ ప్రభావం వల్ల పుట్టుక వస్తాయి.

      జవాబు: అవును/కాదు

      శాస్త్రం ప్రకారం మీరు చెప్తున్నట్టు కులాలు పెరుగుదలతో ఏర్పడే స్వభావం వల్లనే సంప్రాప్తిస్తాయి.

      జవాబి: అవును/కాదు

      ఇప్పుడు ప్రయత్నించండి.

      Delete
    8. This comment has been removed by the author.

      Delete
    9. అందుకే బుర్రపెట్టి ఆలోచించి కామెంటు వెయ్యమన్నది.పెళ్ళి అనేది వారసత్వం కోసం,వారసత్వం,ఇంటిపేరు లాంటివన్నీ పురుషుడి నించే వస్తున్నాయి.శ్యామలీయం చెప్పినా హరిబాబు చెప్పినా ముస్లిం మత పెద్దలు చెప్ప్పినా అక్రైస్తవ మత పెద్దలు చెప్పినా అందరూ ఒప్పుకుని పాటిస్తున్నదే.ఇదివరకే చెప్పినదాన్ని మళ్ళీ అవును/కాదు అని రెట్టిస్తే యేమిటి అర్ధం?చెప్పింది బుర్రకేక్కనప్పుడు యెన్నిసార్లు చెప్పినా ఒక్కటే!

      నువ్విక్కడ ఇదివరలో అరిభీకరంగా చర్చినట్టు గుర్తు అని అన్నది దేని గురించి?గుర్తు చేసుకున్నావా?అక్కద నేను చేసిందల్లా "మీరు సపోర్టుగా తెచ్చుకున్న ధియరీ మీకే మొట్టికాయలెస్తుంది" అని చెప్పి వొదిలెయ్యటం.అది అర్ధం కాకనో యేమో హరిబాబు మధ్యలో పారిపోయాడు అని ఆత్మతృప్తి కామెంట్లు వేసుకున్నారు.ఇక్కద మరోసారి చెప్తే లైన్ల లెక్క చెప్పి "ఆ చెత్తన్ని వొదిలేస్తే.." అంటున్నావు.

      ఒక పాయింటు చెప్తే దానికి సమర్ధనా ఉదాహరణా చెప్పటం వాదనలో ముఖ్యంగా చెయ్యాల్సిన పని.పాయింటు మాత్రమే నేను చెప్తాను.సాక్ష్యాలు నువ్వు వెతుక్కోమనటమే చెత్తపని..

      శ్యామలీయం క్షెత్రం,బీజం,క్షేత్రాధికారి,బీజప్రదాత అనేవి అతను వాడిన మాటలు.వాటితో నాకేమిటి సంబంధం?అందరూ చెప్తున్నది ఇది అని చెప్తున్నాడు.వాస్తవం కూడా అలాగే ఉంది,ఇంకేంటి దాని గురించి నన్ను నిలదీస్తూ అనవస్రమైఅన పీకులాట?నేను చెప్తున్నదల్లా వర్ణం,కులం,జాతి,వంశం ఇవన్నీ ఒక సమూహానికి పెట్టిన పేర్లు.వీటి గురించి తెలియాలంటే వాటి చరిత్ర తెలియాలి,తెలుసుకోవాలి.వీటి గురించి మొదట పరిశోధన చేసి నీకు ఆ పేర్లని పరిచయం చేస్న వాళ్ళే తొలిదశలో వర్ణాలు అనేవి కేవలం హోదాని గురించి చెప్పటానికి వాడారు అంటున్నారు.అవేఅవీ చదవకుండా ఆ రెండు ముక్కల్నీ పట్టుకుని మూడుముక్కల్లో జవాబు కావలి నాకు అంటే కుదరదు.

      నేను చెప్తున్నది ఇది,తొలి మలి వైదిక కాలం నాడు వర్ణం అనేది సామాజిక హోదా మాత్రమే.అప్పటికి మహాజనపదాలూ నే ప్రిమిటివ్ స్టేట్ కూడా యేర్పదలేదు.వర్ణాలూ,కులాలూ పుట్టుకని బట్టి కొనసాగడం నేది రాజ్యం పూర్తి రూపంతో యేర్పడ్డాక జరిగింది.

      హరప్పా మొహంజదారో కాలంలో ప్రముఖమైన ఆదాయమార్గం తర్వాత కాలంలో కులవృత్త్తులుగా స్థిరపడటానికి ఆధారమైన చేతివృత్తుల కళాకారుల పనితనమే!అప్పుడు తయారయిన కొన్ని బొమ్మల నునుపుదనం చూసి వాటిని బైటికి తీసిన శాస్త్రజ్ఞుడే ఆశ్చర్యపోయాడు.కార్బన్ డేటింగ్ ద్వారా ఇవి ఆ కాలం నాటివని తెలిసింది గాబట్టి నమ్మాను,లేకపోతే అస్సలు నమ్మేవాణ్ణి కాదు అని.రాజ్యం స్థిరపడినాకా అ ఆచేతివ్ర్త్తుల వాళ్ళు మోనాపలీ కోసం తమలో తామే పెళ్ళిళ్ళు చహెసుకుంటూ తమ అసంతానానికే వాటిల్లో ట్రైనింగు ఇచ్చుకుంటూ వాళ్ళ అసమూహాన్ని ఒక కులంగా యేర్పాటు చేసుకున్నారు.

      యెన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ మొదటికే వస్తే విసిగు పుట్టదా?ఇక చాలు ఆపండి.విషయం కాంప్లికేటెడ్ అని తెలిసీ రెండు ముక్కల్లో తేల్చమటం చెత్త.చెత్త్త్పనుల్లో ఇరుక్కోవాలని ఇక్కద్ బోర్డు పెట్టుకుని కూర్చోలేదు నేను.

      P.S:పాడిందే పాడరా పాచిపళ్ళ్ అదసడా అని చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు చిరాకు.ఒకసారి వివరంగా చెబుదామని కొంచెం ఉదాహరణ చెప్తే లన్లు లెక్కపెట్టి ఆ చెత్తని తీసేస్తే అనే మనస్తత్వంలో ఉన్న్వాడికి యేదీ యెక్కదు.

      Delete
    10. Edge
      వెతగ్గా వెతగ్గా మీలాగే నాక్కూడా ఒక మట్టిలో మాణిక్యం దొరికింది:

      “వ్యాసుడు బ్రాహ్మణేతరుడైతే అతనికి వేదం మీద అధికారం యేలా వచ్చిందో మీరే చెప్పాలి!”

      ఇదీ, సాక్ష్యాలు లేకుండా ఏదీ అంగీకరించని హరిబాబుగారు వ్యాసుడు బ్రాహ్మణుడే అనడానికి ఋజువుగా ప్రవేశపెట్టిన సాక్ష్యం. మానవాళికి అద్భుత జ్ఞానసంపదనందించిన వేదం మీద బ్రాహ్మణుడేతరుడెవ్వరికి అధికారం ఉండే అవకాశంలేదు కాబట్టి, వ్యాసుడు బ్రాహ్మణుడే.

      haribabu:తింగరి మెలికలు పెట్టి టాపిక్ డైవర్ట్ చెయ్యడంలో చూపించే తెలివి అన్ని ఆధారాలూ సరి చూసుకుని గట్టి సాక్ష్యాలతో వాదించహ్టం మీద చూపిస్తే బాగుండ్డేది!


      ఇన్నేళ్ల నించీ వేదాలమీద పెత్తనం తీసుకుని బ్రాహ్మణాధిపత్యంతో హిందూమాన్ని కుళ్ళబెట్టారు అని వాగుతున్నది యెవరు?నేనా మీ వైపు వాళ్ళా?ఇన్నేళ్ళుగా కింది కులాలని బ్రాహమణులు తొక్కెయ్యడానికి వేదాలని మరొకరు చదవకుండా చేశారు అని ఆరోపించిందీ తమ వైపు వారే!మళ్ళీ నాలాంటివాడు మీరు కొత్తగా వ్యాసుడు బ్రాహ్మణేతరుడు అని అంటుంతే మరి బ్రాహమణేతరుడికి వేదం యెలా అందుబాటులోకి వచ్చింది మీరు చెప్తున్న బ్రాహమ్ణాధిపత్యం అబధ్ధమైతేఅనే గ్దా అది జరిగేది అని అడిగితే అందులోనుంచి ఒక ముక్కని ఆణిముత్యగా వెతికి పట్టుకోవడానికి యెంత శ్రమ పడ్డారో పాపం!

      Delete
  24. వ్యాసుడు బ్రాహ్మనుడు కాదు అన్న దానికి నా వివరణ ఇక్కడ ఇచ్చాను చూడండి. వ్యాసుడు వర్ణవ్యవస్థ ప్రకారం బ్రాహ్మనేతరుడే. వర్ణం పుట్టుకని బట్టి కాదు అని కొంత మంది చెబుతున్నారు. అది తప్పు. వర్ణం పుట్టుకను భట్టే వస్తుంది. అలానే శ్యామళీయం గారు స్త్రీ క్షేత్రమని, విత్తును నాటే వాడిని బట్టి వర్ణ నిర్ణయం జరుగుతుంది అని అన్నారు. అది పూర్తిగా నిజం కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా తప్పే ! దానికి వివరణ ఈ పోస్టులో ఇచ్చాను చూడండి.

    వ్యాసుడు బ్రాహ్మణుడా? బ్రాహ్మణేతరుడా??
    https://usaravelli.wordpress.com/2015/11/07/%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3%E0%B1%81%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%AC%E0%B1%8D/

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. Dear usaravelli,
      వ్యాసుడు బ్రాహ్మణుడు కాదని ఒప్పుకుంటే మీరు ఇప్పటివరకూ వాదిస్తున్న బ్రాహ్మణాధిక్యత అంతా అబధ్ధం అని ఒప్పుకోవాలి!ఎందుకంటే మీరు చెప్తున్న నియమాన్ని బట్టే ఒక అబ్రాహ్మణుడిని వేదం చదవనివ్వరు కదా!మరి,చదవటమే కాదు కలగూరగంపలా ఉన్నవాటిని విభజించి వేదవ్యాసుడు అని పేరు తెచ్చుకోవటానికి బ్రాహ్మణులు యెలా ఒపుకున్నారు?అలా వొప్పుకుని ఉంటే కులవ్యవస్థ యేకాందశిలలా ఉందని మీరంటున్నది అబధ్ధం కాదా?

      పోలికలు లేకుండా యెలా ఉంటాయి.ఇంటిపేరు,వారసత్వమ అన్నిట్లోనూ మగవాడే కదా కంద్రబిందువు ఇప్పటికీ అన్ని మతాల్లోనూ!సామాన్యంగా జరిగేదాన్ని బాట్టి కాకుండా మీ వాదం గెలవటం కోసం వ్యాసుడు బాహ్మణుడు కాడు,సత్యవతి ఉపరిచహ్రవసువు కూతురైనా సరే ఆమె రాజకన్య కాదు అని మీరు తీర్మానించటానికి పనికొచ్చే వాదనల్నే అందరూ ఒప్పుకోవాలి,అంతేనా?


      మీతు ఇదివరకు రమణీస్ బ్లాగ్ అని లంకు ఇచ్చారు.అది మీరు సమర్ధనగా తెచ్చుకున్నారా?అందులోని విషయం యేమిటి?కేవలం బ్రాహమ్ణులే కాదు,ఈ వ్యవస్థ్ ఇలా రూపు దిద్దుకోవట్టానికి బ్రాహమ్ణేతరులు కూడా కారణం అని ఆయన అంటున్నారు.అది మీరు కూడా ఒప్పుకుంటే ఇంక ఈ వ్యాసుడు బ్రాహ్మణుడు కాడని నిరూపించే ప్రయత్నం అంతా నిరుపయోగం!ఈ సంస్కృతిని నిర్మించటంలో అన్ని కులాల వారి ప్రమేయమూ ఉందంటే కులవ్యవస్థకి కూడా అందరూ బాధ్యులు కావలసిందే కదా?కాదు,మిగిలినవాటిని తక్కిన కులాల వాళ్ళు సృష్టించారు,కులవ్యవస్థకి మాత్రం బ్రాహ్మణులే కారణం అంటే దానివల్ల మీ మూర్ఖత్వమే బయటపడుతుంది తప్ప మరేమీఎ కాదు!మీరు వ్యాసుడు బ్రాహ్మణుడు కాడు అని నిరూపించటానికి ఇప్ప్పుడు కష్తపడుతున్నారు.బాగానే ఉంది.

      మరి రమణి బ్లాగు వాదన ప్రకారం,ఇప్పటి మీ వాద్న ప్రకారం చూసినా అబ్రాహమ్ణుడైన వ్యాసుడు "వ్యాసో నారాయణో హరి" అని సాక్షాత్తూ దేవుడిలా గౌరవించబడ్డాడు కదా!మరి,అదే వ్యాసుడు రాసిన మహాభారతంలో భీష్ముడి నోట చెప్పించినవాటినే ఇక్కడ సాక్ష్యానికి పెడుతున్నారు!దీన్ని బట్టి వ్యాసుడు అగ్రవర్ణాల నుంచి గౌరవం కోసం తన కులానికీ సాటి నిమనకులాలకీ ద్రోహం చేశాడని మీ భావమా?


      మీ వాదన పొడిగిస్తే వచ్చే ఈ గందరగొఏలం గురించి యేమయినా వూహించారా?నేను వెలమ వాణ్ణి,బ్రాహ్మణుణ్ణి కాదు,వ్యాసుడు మా కులం వాడు అని తేలనంత వరకూ బ్రాహ్మణుడైనా అబ్రాహ్మణుడైనా నాకు ఒరిగేదీ ఉండదు,తరిగేదీఎ ఉండదు.ఏ విసహయంలో నైనా నిజమే ముఖ్యం నాకు.సైంటిఫిక్ స్పిరిట్ ఉండి వాదించదల్చుకుంటే ఫైనల్ స్టేజి వరకూ వెళ్లాలంటే మొదటి దశ వాదనలో గందరగోళం ఉండకూడదు.

      వ్యాసుడు బ్రాహమణుడు కాడు అని మీరు నిరూపించదల్చుకుంటే అతనికి వేదాలు యెట్లా అందుబాటులోకి వచ్చాయి అనేది చాలా కీలకమైఅన్ ప్రశ్న.ఇంతకాలం ఆంగ్ల మానస పుత్రులూ,కమ్యునిష్టు సిధ్ధాంతులూ,దళిత మేధావులూ చెప్తున్న బ్రాహ్మణాధిక్యత అనేది అబధ్ధం అయితేనే అది సాధ్యపడుతుంది,అవునా కాదా?

      Delete
    3. usaravelli
      కంపారిజన్లు వద్దు. నేను చెప్పింది వర్ణ వ్యవస్థ గురించి. ఆ వర్ణ వ్యవస్తే ఇప్పుడు ఫాలో అవుతున్నామని ఎక్కడన్నా చెప్పానా?
      haribabu:మరి రమణి లాగరు సమర్ధనని ఒకసారి తెచ్చుకుని,ఓకసారి ఈ కులవ్యవస్థ అంతా బ్రాహ్మణులు పెట్టిందే అని చెప్పి.భెష్ముడు పుట్టుకతో వర్ణాలు సంక్రమిస్తాయన్నాడని సాక్షం చూపిస్తూ,మీరు సాక్ష్యంగా తీసుకున్న పుస్తకాన్ని రాసిన వ్యాసూదు బ్రాహ్మణుడు కాడని నిరూపిస్తూ మీరు చెప్పదల్చుకున్నదేమిటి?వూసరవెల్లి రంగులు మారిస్తేఅ దై తన ఆత్మర్క్షణ్ అకోసం,దాన్ని తప్పు పట్టటం పాపం!కానీ ఇన్ని రంగూల కోణాల్ స్థానాలలఓ మీరు యే స్థానంలో నిలబడాలో ముందు కుదురుగా తేల్చుకోండి!యేదటివాళ్లని "DUDE" అనీ "STUPID" అనీ అనబోయేముందు ఆ మాలు మీకు తగలకుండా చూసుకుంటే మంచిది!

      Delete
  25. “నువ్వే ఒక గుర్తింపు లేని తప్పుడు సైంటిఫిక్ ధియరీని సపోర్టుగా తెచ్చుకునే మనస్తత్వంలో ఉంటే యెట్లా అర్ధమవుతుంది నీకు?”

    ఆ గుర్తింపు లేని తప్పుడు సైంటిఫిక్ ధియరీ ఏంటో కూడా వివరంగా చెప్తే మాబోటి వాళ్ళకి అర్ధం అవుతుంది కదా, హరిబాబుగారు.

    “దున్నడానికి సంబంధించిన బూతుజోకుల మీద ఉన్న శ్రధ్ధ సీరియస్ విషయాల్ని అర్ధం చేసుకునే చోట ఉంటే బాగుంటుంది:-)”

    బ్రాహ్మణత్వానికి క్షేత్ర బీజ ప్రాధాన్యతలే ప్రాతిపదికలని ధర్మశాస్త్రబద్ధంగా శ్యామలీయంగారు చేసిన తీర్మానాల్ని బూతు జోకులుగా తీసిపారేస్తారా? ఇలా మాట్లాడడానికి మీకసలు మనసెలా ఒప్పింది హరిబాబుగారు?

    “ఇక్కడ నాలుగు వర్ణాలు అంటే అక్కద రీజన్,స్పిరిట్,అపెతటైట్ అన్నారు అని చెప్పినా అర్ధం కాకపోతే ఇంకెట్లా అర్ధమవుతుంది?”

    అక్కడ అంటే ఎక్కడ, అలా అన్నదెవరు, ఇక్కడకి అక్కడకి ఉన్న సంబంధం ఏమిటో కూడా వివరిస్తే బాగుంటుంది హరిబాబుగారు.

    ఏదేమైనా, వేదవ్యాసుడి నుంచి మొదలుపెట్టి మీడియాతో మెలికపెట్టి జ్యుడీషియరీతో ట్విస్ట్ ఇచ్చి అద్రికని వ్యాంపుగా పెట్టి ఫార్ములా సినిమా తీసేదాకా అనితరసాధ్యమైన రీతిలో అభిమానులని అలరించే మీ అద్భుత రచనా పటిమని అభినందించ కుండా ఉండలేక పోతున్నాను హరిబాబు గారు. మీకు మీరే సాటి సార్.

    ReplyDelete
  26. హరి బాబు, మీరు ప్రజలో, ఇక్కడ రాసే వ్యాఖ్యలను పోస్ట్ లు గా ప్రచూరించండి. చదవటానికి అనుకూలం గా ఉంట్టుంది.

    ReplyDelete
  27. Edge
    ఆ గుర్తింపు లేని తప్పుడు సైంటిఫిక్ ధియరీ ఏంటో కూడా వివరంగా చెప్తే మాబోటి వాళ్ళకి అర్ధం అవుతుంది కదా, హరిబాబుగారు.

    haribabu:మీరు పాల్గొనని చర్చకి సంబంధించి యెంత పురాణం విప్పితే మీకు అర్ధమవుతుంది?శ్రీకాంత్ చారికి తెలుసు!

    పుట్టుకతో స్వభావాలు వస్తాయి నేది వ్యాసుడికి అంటగట్టటానికి తెల్లరంగువాళ్ళు నల్లరంగువాళ్ళ కన్న్నా పుట్టుకతోనే గొప్పవాళ్ళు అని చెప్పే ధియరీని సపోర్టుగా తెచ్చుకున్నారు!వారి వాదన ఇది:ఆ ధియరీ గుణాలు పుటుకతో వస్తాయంటున్నది గాబ్ట్టి వ్యాసుడు స్వభావరీత్యా విదగొట్టాను అన్నప్పటిక్కీ అది వ్యాసుడు కూడా పుట్టుకని బట్టి విదదీసినట్టే అని అర్ధం పీకారు.దాని చరిత్ర ఇప్పుడు చెప్తే లైన్లు లెక్కపెట్టి ఈ చెత్తనతా తీసేస్తే అంటున్నాడు,ఇవీ మీ తెలీవిన వాదనలు.ఇక మూసుకుపొండి.కొత్త కామెంట్లు పబ్లిష్ చెయ్యదల్చుకోలేదు.

    ఎదగ్వగోల!ఒక్క అభొప్రాయాన్ని తిన్నగా గందరగోళం లేకుండా చెప్పలేరు,దేనికీ సాక్ష్యాలూ నిరూపనలూ చూపించరు.యేద్టివాడు చూపించినవి పట్టించుకోరు.అసలు మీకు ఆ బ్రాహ్మణాధిపత్యం,వర్ణం,కులం,జాతి అనే మాటల్ని పరిచయం చేసిన వాళ్ళు చెప్పినదీ పూర్తిగ అతెలియదు.చారిత్రకంగా కూలం అనేది యెలా పరిణామ్మ్ చెందిది నే ముఖ్యమైన అంసం గురించి ఓ అంటే ఢం తెలియదు.చెబితే చెత్త అనతం మాత్రం తెలుసు.మూసుకుపొండి!

    ReplyDelete
  28. http://www.andhrajyothy.com/Artical?SID=219703


    పందొమ్మిదో శతాబ్ది ముగింపు కాలం వరకు భారతదేశంలో చేతివృత్తులు కలకలలాడాయి. ఏడెనిమిది వందల సంవత్సరాల పూర్వం నుంచీ అవి నిరాఘాటంగా దేశాన్ని సుసంపన్నం చేశాయి. ‘కాకతీయుల రాజ్యంలో శ్రేష్ఠమైన, సన్నని వస్త్రాలు నేస్తారు. అవి చాలా ప్రియం. సాలెపురుగు దారాలతో నేసిన వల బట్టలలాగా ఉంటాయి ఆ వస్త్రాలు. ప్రపంచంలో ఏ రాజు కానీ, ఏ రాణి కానీ వీటిని చూస్తే వదిలిపెట్టరు’ అని జెనీవా నుంచి వచ్చిన మార్కోపోలో అనే యాత్రికుడు రాశాడు. ఇతడు కాకతి రుద్రమ్మ కాలంలో మన దేశానికి వచ్చాడు.




    తెలంగాణంలోని నిర్మల్‌ కత్తులు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. నిర్మల్‌కు సమీపంలోనే ఉన్న కూనసముద్రంలో వాటిని సిద్ధం చేసేవారు. డెమాస్క్‌సలో ఈ కత్తులకు చాలా గిరాకీ ఉండేది. కాకతీయుల కాలంలో వెండి బంగారు నాణేలు చెలామణీలో ఉండేవి. కూనసముద్రంలో ప్రపంచంలో కెల్లా శ్రేష్ఠమైన ఉక్కు తయారుచేసేవారు. ఈ ఉక్కు పరిశ్రమ పందొమ్మిదో శతాబ్ది చివరివరకూ కొనసాగింది.





    కూనసముద్రంలో తయారయ్యే ఉక్కు వంటి ఉక్కు తయారుచేయాలని పర్షియాలో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలురయ్యారని ప్రతాపరెడ్డి గారు ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో రాశారు. కాకతీయుల కాలంలో ఉన్న 35 రకాల పట్టు వస్త్రాలను పాల్కుర్కి సోమనాథుడు వర్ణించాడు. వాటి పేర్లన్నీ ఇచ్చాడు. ఇవన్నీ చేనేత పనివారు తయారుచేసేవారు. ఇటీవలి కాలంలో కూడా చేనేత బట్టలకు బందరు పాశ్చాత్య దేశాలలో కూడా చాలా ప్రసిద్ధి పొందింది. ఇంగ్లీషు వారు మచిలీపట్నాన్ని ‘మసూలా’ అనేవారు. అక్కడ లభించే అతి శ్రేష్ఠమైన సన్నని నూలు బట్టలనే అర్థం నుంచే ‘మస్లిన్‌’ అనే ఇంగ్లీషు పదం ఏర్పడింది.

    1813లో ఇండియా చట్టం రూపొందించే సందర్భంగా సర్‌ థామస్‌ మన్రోను భారతదేశ పరిశ్రమల గురించి నివేదిక కోరగా ఆయనిట్లా అభిప్రాయం రాసి పంపించారట. ‘సైన్సులో, రాజ్యతంత్రంలో, విద్యలో హిందువుల స్థాయి మనవారి స్థాయితో సమానమైనది కాదు. అయినా ఉత్తమ వ్యవసాయ పద్ధతి, సాటిలేని వస్తు నిర్మాణ నిపుణత, జీవిత సౌఖ్యానికి కావలసిన వాటినన్నిటిని సమకూర్చుకోవడం, దానం, ఆతిథ్యం, విద్య మొదలగునవి నాగరక జాతుల లక్షణాలైతే హిందువులు యూరోప్‌ జాతులవారికెవ్వరికీ తీసిపోరు.



    నాగరికతే వ్యాపార వస్తువైతే మన దేశమే ఇండియా నుంచి దానిని దిగుమతి చేసుకోవడం మంచిది’ అని మన్రో చెప్పారట. తాను ఒక శాలువాను ఇండియాలో కొని ఏడు సంవత్సరాల నుంచి వాడుకొంటున్నా అది కొత్తదిగా ఉన్నదనీ, ఇంగ్లండ్‌ శాలువా ఎవరైనా తనకు బహుమానంగా ఇచ్చినా తాను తీసుకోననీ మన్రో దొర చెప్పినట్లు ప్రతాపరెడ్డి గారు రాసారు. పందొమ్మిదో శతాబ్ది ప్రారంభకాలం వరకు భారతీయులు తమ సరుకులను అమ్మటానికి తమ ఓడలలో తీసుకొని పోయేవారు. మన బానిసలు మనకు పోటీ రావడమా అని వాపోయారట, ఆగ్రహించారట.


    సర్‌ థామస్‌ మన్రో మద్రాసు రాష్ట్రంలో 24 సంవత్సరాలు పనిచేశారు. ఆయన మద్రాసు రాష్ట్రానికి గవర్నరు కూడా అయినాడు. రాయలసీమ జిల్లాలో ప్రజలు ఈయనను ఎంతగానో అభిమానించారు. తమ బిడ్డలకు ఈయన పేరు పెట్టుకున్నారు. 1827వ సంవత్సరంలో గుత్తి దగ్గర పత్తికొండలో కలరా సోకి మన్రో మరణించారు. ఈయన దగ్గర రాయసం కోటీశ్వరం అనే యువకుడు ఆంతరంగికోద్యోగిగా పనిచేశాడు. అతడు లేత వయసులోనే మరణించటం మన్రోగారిని చాలా కలతపాలు చేసింది. కోటీశ్వరం ఒంగోలు వాడు. ఇరవై సంవత్సరాల వయసుకే గొప్ప ప్రతిభ కనబరచాడు. ఈయన వెన్నెలకంటి సుబ్బారావుకి బావమరిది అవుతాడు.
    అక్కిరాజు రమాపతిరావు
    - 040- 27423352

    ReplyDelete
    Replies
    1. ఈ వ్యాసం నేను చదివాను.ఇదే కాదు,భారత దేసపు చరిత్రని వాస్తవదృష్టితో చూసి చేసిన పరిశోధనలన్నీ ఇదే చెప్తున్నాయి.మొదత ఇంగ్లీషువాళూ,తర్వాత కమ్యునిష్టులూ చెప్పింది చెప్పినట్టు నమేసే మనస్తత్వంలో ఉన్న "అంచు"లకీ "కంచె"లకీ వాస్త్వాలౌ అక్కర్లేదు.

      Delete
  29. మీ బ్లాగులో ఈ టపా ఎలా miss అయ్యానో అర్ధం కాలేదు. చాలా బావుంది. భారత దేశం గురించి ఇలా ఒక్క టపా సరిపోదేమో. చిన్న ఉదాహరణ. మనం ఇది వరకు మరచెంబుతో నీళ్లు పట్టుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వాటి స్థానం లో ‘BPA free’ అంటూ స్టీలు నీళ్ల సీసాలు అమ్ముతున్నారు అమెరికా కొట్లల్లో. భారత దేశం లో ప్లాస్టిక్ పొట్లాల్లో మంచినీరు తాగుతున్నాము. ధౌర్భాగ్యం అంటే ఇదే !! “ఆచేతివ్ర్త్తుల వాళ్ళు మోనాపలీ కోసం తమలో తామే పెళ్ళిళ్ళు చహెసుకుంటూ తమ అసంతానానికే వాటిల్లో ట్రైనింగు ఇచ్చుకుంటూ వాళ్ళ అసమూహాన్ని ఒక కులంగా యేర్పాటు చేసుకున్నారు” - బాగా చెప్పారు. ఇంట్లో ఏ శుభకార్యమైనా ఇంటి బ్రాహ్మడు ఎంత ముఖ్యమో ఇంటి రజకుడు అంతే ముఖ్యం. ప్రతి వృత్తి ముఖ్యమే అని చెప్తుంది మన సంస్కృతి. దేశంలో సుభిక్షత అంతా ఇటువంటి ఐకమత్యం లో ఉంది అని అర్ధం అయింది బ్రిటిష్ వారికే. ముస్లిం రాజుల కంటే మహా ప్రమాదకరమైన వారు బ్రిటిష్ వారు. భారత దేశ సంపదంతా కేవలం ఒక రెండు వందల ఏళ్లలో కొల్లగొట్టిన మహాపురుషులు. ఇది తెలుసుకోవడానికి గ్రంధాలూ చదవక్కరలేదు. సాక్ష్యాలు, ఋజువులూ అక్కరలేదు. కొంచం ఇంగిత జ్ఞానం ఉంటే చాలు.వారి ‘Divide and Rule’ పాలసీ విషబీజం ఎలా నాటారో భారత దేశం లో ఈ రోజున ప్రతి చోటా చూస్తున్నాము. Hinduism అంటే casteism అని మన తర తరాల కే కాదు, యావత్ప్రపంచానికి చాటి చెప్పేసారు. ఈ విష బీజం వృక్షాలనే నాటేసింది.

    ReplyDelete
    Replies
    1. చాలా కాలమైంది రాసి!నాలుగు రోజుల క్రితం నాకు పట్టిన వైరాగ్యం పోయింది లెండి.మీరూ ఈత్ర పెద్దలు,ముఖ్యంగా వయస్సులో పెద్దవారైన శర్మ గారి కామెంట్లు చదివాక కొంచెం విరక్తి తగింది.దానికి తోడు భాగ్వతంలోని ఒక విసషం కూడా నా విరక్తిని పోగొట్టింది.

      ఈసారి ఒకే టైటిల్ పెట్టి భాగాలుగా సనాతన ధర్మం గురించీన్ విశేషాలు చెప్పాలని అనుకుంటున్నాను.

      Delete
    2. అదీ మాటంటే! మగాడితనమంటే!! శుభం భూయాత్!!! ఎందుకాలస్యం!!!!టపాకోసం ఎదురు చూస్తానూ!!!!!

      Delete


  30. నాలుగు రోజుల వైరా
    గ్యాలను వదిలి హరిబాబు ఘంటా రవమై
    బోలెడు సనాతనపు ధ
    ర్మాల టపాల మొహరించి రావడి జేయున్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నాకు జోజో పాడి వెటకారం చేశావు గదూ!నీ పని పదతాన్లే!!

      Delete


  31. హరితో జగడంబేలా
    హరియించు నిను హరిబాబు హరి సరి యనవే
    హరినామామృతము విడువ
    గిరగిర తప్పదు జిలేబి కాదన మాకే :)

    జిలేబి

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...