Wednesday 22 October 2014

ఉత్తరాంధ్ర కోలుకోలేని దెబ్బతో మూల్గుతున్నది!దీపాలు వెలిగించి సరిపెడదామా?

              మొన్నటి హుద్ హుద్ యెంతటి భీబత్సం చేసింది?ఇదివరకు ఈ తుఫానులకి ఆడవాళ్ళ పేర్లు పెట్టేవాళ్ళు!అప్పటి తుఫాన్లు కూడా అలా అమాయకంగా కొంచెం భయపెట్టి సరిపెట్టేసేవి!పేరు లాగే దీని తీరు కూడా చాలా భీబత్సంగా వుంది.మేము కొన్నేళ్ళ పాటు విసాఖలో గడిపాం!యెంత అందమయిన నగరం?మిగతా అన్ని నగరాల్లోనూ జనానికి వినోదం అంటే సినిమాయే.కానీ విశాఖలో సరదాగా గడపాలంటే యెన్ని చోట్లు?అప్పుడు మేము తిరిగి అంత హ్యాపీగా గడిపిన చోట్లన్నీ ఇప్పుడు ఇట్లా కనబడుతుంటే మనం చూస్తున్నది నిజమేనా?మీడియా యేదయినా ప్రాక్టికల్ జోకు వేస్తున్నదా అనిపిస్తున్నది నాకు!


         కోలుకోవడానికీ మళ్ళీ మామూలు రూపం సంతరించుకోవడానికీ సమయం తీసుకున్నా మనుషుల్లో తిరిగి పుంజుకోగలమనె ధైర్యం కనబడుతున్నది,అది చాలా గొప్ప విషయం!నాయకత్వం యెంత చురుగ్గా కదిలినా ప్రాణనష్టాన్ని బాగా తగ్గించటం పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యపడింది!కానీ ప్రకృతిని శాసించాలనో మరి సొంత భొగాల కోసమో ప్రకృతిని నాశనం చేస్తూ మనిషి చేస్తున్న దుడుకు పనులకు ప్రకృతి చేసే హెచ్చరికగా కూడా ఇట్లా మళ్ళీ మళ్ళీ విరుచుకు పడుతున్న ప్రకృతి భీబత్సాలని చూసి అర్ధం చేసుకోవాలి,కానీ యెందరికి అర్ధమవుతున్నది!ప్రభుత్వాధికారుల మీద యెదురు దాడులు కూడా చేస్తూ వందల వేల యెకరాల అడవుల్ని కలప దుంగలుగా మార్చేవాళ్ళు - ఒక్కసారి ఇవ్వాళ యే డబ్బు కోసం వాళ్ళీ పని చేస్తున్నారో ఆ డబ్బు ఒక పాతికేళ్ళ తర్వాత జరగబోయే భీబత్సంలో వాళ్ళకి వుపయోగపడదని తెలిస్తే ఆ పని అంత మూర్ఖంగా చెయ్యగలరా? ఇవ్వాళ వీళ్ళు చేస్తున్న దుర్మార్గమే రేపు వాళ్ళనీ వాళ్ళ పిల్లల్నీ ఈ భూమి మీద ప్రశాంతంగా బతకనివ్వదని వాళ్ళ కర్ధమయ్యేలా యెవరు చెప్తారు?


     ప్రకృతిని తెలుసుకోవడానికి పనికొచ్చే జ్ఞానం ప్రకృతిని యెలా శాసించ గలదు?ఇప్పటి వరకూ మనిషి తెలుసుకున్న భూమి పుట్టుక మొదలు అనే పాయింటు నుంచి పోలిక కోసం ఆ కాలమంతా ఒక రోజుతో పోలిస్తే మనిషి ఆఖరి గంటలోనే వచ్చాడు!ఈ కొంచెం సమయంలో మనకు తెలిసింది చాలా తక్కువ.ఈ మిడిమిడి జ్ఞానంతో మనం ప్రకృతిని శాసించడం అసాధ్యం!కాబట్టి బుధ్ధిగా మనం అర్ధం చేసుకున్నంత వరకూ యెలా బ్రతికితే ఈ ప్రకృతిలో క్షేమకరంగా వొదిగిపోగలం అనేది మాత్రం తెలుసుకుని అలా - అంటే ప్రకృతిసిధ్ధంగా బ్రతకటం వొక్కటే మనకు శ్రీరామరక్ష?!


          విభజన కష్టాలు మొదట భయపెట్టినా ఇప్పటి ముఖ్యమంత్రి పాతముఖమే గాబట్టి ఇప్పుడు అతని పనితీరునీ చూశాక ఇప్పుడిప్పుడే కొంచెం నమ్మకంగా వున్నంతలోనే ఈ హుద్ హుద్ విరుచుకు పడింది, యేం చేస్తాం? కాలాధీనం జగత్సర్వం!దీపం జ్యొతి పరబ్రహ్మ!!దీపం వెలించడం అనేది మన చుట్టూ పరుచుకుని వున్న చీకట్లని తొలగించుకోవటానికి మనం వేసే మొదటి అడుగు!అధికారం తనదేనని తెలిసిన మరుక్షణం నుంచీ మొదట రాష్ట్రానికి కావలసింది నిరంతరాయమైన విద్యుత్తు అనే ప్రాధమ్యాన్ని గుర్తించి వర్షాలకి ఆగిపోయే పవర్ ప్లాంట్ల మీద ఆధారపడకుండా దొరికిన ప్రతి చోటు నుంచీ కొని జాగ్రత్త పడటం వల్ల తుఫానుకి బెదరకుండా విద్యుత్తుని అతివేగంగా పునరుధ్ధరించ గలిగేలా చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక కృతజ్ఞతా దీపాన్ని వెలిగిద్దాం!


          తెలంగాణాలో త్వరలోనే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయట!సభలో టపాసులు బాగానే పేలేటట్టు వున్నాయి!మామూలు టపాసుల్తో సరిపెడుతారో,కచరా బ్రాండు బాంబులు కూడా వేస్తారో? యేమయినా శ్రీవారు అఘటనాఘటన సమర్ధులు!గట్టిగా మాట్లాడితే అన్ని పాపాల్నీ ఆంధ్రోళ్ళ మీదకి తోసెయ్యొచ్చుననే ధీమాలో వున్నారు!యాభయ్యేళ్ళుగా ఒక పార్టీలో ముఠాలు కట్టి గూడుపుఠాణీలు చేస్తూ ముఖాలు మారినా విధాలు ఒకటే అన్నట్టుగా తెలంగాణా ఒక్కదాన్నే కాకుండా ఒకప్పటి పెద్ద రాష్ట్రాన్నే పీల్చి పిప్పి చేసి ఆ పార్టీని కాకులు కూడా ముట్టని అనాధపిండాన్ని చేసిన గొప్ప కులమూ, ఇప్పటిదాకా సముద్రంలో కాకిరెట్టలాగా అక్కడొకడూ ఇక్కడొకడుగా కనిపిస్తూ ఆ కులంతోనూ ఈ కులంతోనూ జోడు కట్టలేక పోవటం వల్ల కొంచెం అమాయకంగా కనబడే మరో పెద్ద కులమూ జోడు కూడి తమ బతుకుల్తో తోడి రాగం ఆడుకోవటానికి వాళ్ళకి నచ్చని మరో కులాన్ని ప్రాంతానికి బూచిగా చూపించే ఇవ్వాళ్టి రాజకీయ నాటకం యొక్క అసలు రూపం తెలుసుకోలేని అమాయక తెలంగాణా ప్రజలకి అసలు రహస్యం వీలయినంత త్వరగా తెలియాలని ఒక ఆశాదీపాన్ని వెలిగిద్దాం!


         దీపం వెలిగించటం అంటే ఆలోచన పుట్టించటంతో సమానం అయితే నా పోష్టులతో నేను నిత్యమూ ఆ పని చేస్తున్నట్టే గదా?సహ బ్లాగర్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క స్టయిలుతో అతిధుల్ని అలరిస్తున్నారు, వరూధిని-అయ్యరు గారు తమ చిన్న చిన్న పోష్తుల్తో అల్పాక్షరముల అనల్పార్ధములు స్పురింప జేస్తూ వున్నారు!నవ్వీతే నవ్వండి మాస్టారు నవ్వుల్ని చక్కగా పండిస్తారు, ఈ మధ్యనే లక్ష వత్తుల నోము మొదలు పెట్టారు! కష్టేఫలి మాస్టారు మధ్య తరగతి జీవితానుభవాల్ని మందహాసాలతో చదివేలా రాస్తారు!శ్యామలీయం మాస్టారు చందస్సు తెలిసి పాండిత్యం కూడా తోడవటంతో అన్ని రకాల విషయాలతో కలిపి వడ్డిస్తారు!వీరందరి మధ్యనా వీరందరి కన్నా భిన్నంగా వుండాలంటే మాటలా?!నావైపు నుంచి చూస్తే అందరూ ఆల్రెడీ చెప్పేసినదాన్నే మళ్ళీ చెప్పడం కాకుండా మిగతా వారికి తోచని కొత్త పాయింటు యేదయినా వుంటే అది ఇక్కడ విప్పి చెప్తున్నా! అందుకు నాకు నేనో శభాషు దీపం వేసుకుంటూ చదివి మంచి కామెంట్లతో ఆదరిస్తున్న మీకూ ఒక ఖుర్నీసు దీపం వెలిగిస్తున్నా?!


        నిన్న మన తండ్రులు యేమి చేశారో దాని ఫలితం ఇవ్వాళ అనుభవిస్తున్నాం!ఇవ్వాళ యేమి చేస్తున్నామో దాని ఫలితం రేపు మన పిల్లలు అనుభవిస్తారు!కుటుంబాల నుంచీ దేశాల వరకూ ఇదే చరిత్ర మనకి నేర్పే పాఠం?! మొత్తం సంవత్సరానికి వున్న 365 వ్రోజుల్లో మనకి వున్న పెద్ద పండగలు 10 మాత్రమే.ఆ పది రోజుల్ని కూడా మనదయిన పధ్దతిలో తీరిగ్గా గడపలేని కాలంలో వున్నాం మనం!యెప్పటి కయినా మన భవిషత్తు తరాల కయినా జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించగలిగే సులువు తెలియాలని కోరుకుంటూ ఒక జ్ఞానదీపాన్ని వెలిగిద్దాం!



        దీపావళి మనకున్న పండగలన్నింట్లోనూ చాలా సరదా అయిన పండగ! టపాసుల మోతలు యెలాగూ వుంటాయి గానీ, ఆ తర్వాత పల్లెటూళ్ళలో ఈ పందగ రోజున ఆఖరు ఘట్టం దివిటీలు తిప్పటం అని యెవరికయినా తెలుసా?ఈ దివిటీలు తిప్పే సమయంలో తమకి నచ్చని వాళ్ళనీ, తమని బాగా యేడిపించిన వాళ్ళనీ బూతులతో సహా నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టుకోవచ్చు!బహుశా బలం లేక పెద్దవాళ్ళ దుర్మార్గానికి గురై తమలో వున్న అక్కసుని బయటికి కక్కేసేటందుకు మనవాళ్ళు యేర్పాటు చేసిన ఛానలైజేషన్ టెక్నిక్ అనుకుంటా!వీధుల్లో పరుగులెత్తే అంతమందిలో యెవడు తిట్టాడో తెలియకపోయినా ఆ తిట్లు విన్నవాడు కొంచెమయినా సిగ్గు పడకపోతాడా?ఒకవేళ అది రహస్యంగా జరిగిందయితే పదిమందికీ తెలెసి మిగతా జనం కూడా నిలదీసే వీలుంటుంది గదా!వుపయెగించుకుంటే కక్షల్నీ కార్పణ్యాల్నీ వొత్తిడుల్నీ తగ్గించుకోవడానికి సైకో అనలిష్టులకి కూఒడా తట్టని సొల్యూషన్,కదా?!


      నిన్నటి తరం కవి కుమారు లిద్దరు జంటకవులుగా వెలుగుదా మనుకున్నారు!ఒక కుర్రాడి పేరు దీపాల పిచ్చయ్య శాస్త్రి!మరొక కుర్రాడి పేరు గుర్రం జాషువా!ఒకరు బ్రాహ్మణుడు,మరొకరు దళితుడు - అయినా వారి స్నేహదీపం మాత్రం అద్భుతంగా వెలిగింది!కవితా రంగంలో కూడా జోడుదీపాలుగా వెలగాలనుకున్నారు,కానీ పేర్లు కుదరనివ్వ లేదు?ఇంటి పేర్లతో కలుద్దామా అంటే గుర్రం దీపాల, దీపాల గుర్రం - యెటు చూసినా పిచ్చయ్యకి దెబ్బై పోతున్నది?పోనీ అసలు పేర్లతో కలుద్దామా అంటే పిచ్చయ్య జాషువా, జాషువా పిచ్చయ్య - జాషువాకి దెబ్బై పోతున్నది?దాంతో విసుగెత్తి పోయి జంటకవులుగా కాకుండా విడివిడిగానే తమ కావ్యదీపాల్ని వెలిగించారు!!

పిరికితనం నుంచి శాడిజం వరకూ అన్ని మానసిక జాడ్యాలకూ హాస్యమే పరమౌషధం!

1 comment:

  1. ఇంకా పూర్తిగా కరెంటు మొదలు కాలేదని ఇప్పుడే విన్నాను, చాలా బాధగా ఉంది. రేపు బయలుదేరి విశాఖ వెళ్తున్నాను: ఎలా కనిపిస్తుందో అని మనసులో ఒకటే భయం. చూసొచ్చాక అప్డేట్ చేస్తాను.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...