Monday 6 October 2014

నిన్నటి తరం గొప్పవాళ్ళ విగ్రహాల పైన నీకు ఆగ్రహ మేలరా? వాళ్ళ వుసురు తగిలి - కుర్చీ పోయిన మరుక్షణం నువ్వు పనికిమాలిన వాడివి కాకురా!

సీ||          కాకిరి బీకిరి కూతల్తొ కాకిలా
                 కావు కావు మని తిక్కోని మల్లె

                  నోటికేదొస్తె అదే సుభాషిత మల్లె
                  కూసినా - పెయ్యనాకుడుల మంద

                  నీకన్న గొప్పోడు లేనట్టు మోస్తేను
                  ఇంతోడి వైనావు! యెందు కట్ల

                  వెన్కటి తరాల వేగుచుక్కలను ప
                  నికిమాలినోళ్లని నోటి నిండ

తే||            పేడ నింపుక వాగేవు?పాప కర్మ
                   లింక ఆపరా, ఈ సుద్దులన్ని వోట్లు
                   రాల్చకుండ యెదురుతంతె -  రాజ్యమంత
                   పోయి నెన్క నీ బతుకెంత పోటుగాడ?!
(05/10/2014)
______________________________________________________
             టాంక్ బండ్ మీద ఇప్ప్పుడు విగ్రహాలుగా వున్నవాళ్లలో యెవరయినా తెలంగాణా ప్రజలకు అపకారం చెయ్యటం గానీ తెలంగాణా సంస్కృతిని అవమానించటం గానీ చేశారా?తమ పరిధిలో తాము - కవులయితే కవిత్వం చెప్పదం ద్వారా, దాత లయితే దానాలు చెయ్యదం ద్వారా, సంస్కర్త లయితే దురాచారాల్ని పరదోలి ప్రజల్ని సంస్కార వంతుల్ని చెయ్యడం ద్వారా - ప్రజలకు సంతోషాన్ని కలిగించిన వారే తప్ప అన్యు లెవరయినా వున్నారా?అయినా సరే వాళ్లని వారి గొప్పదనంతో యేమాత్రమూ సరితూగలేని ఇవ్వళ్టి ఒక రాజకీఎయ నాయకుడు పనికిమాలిన వాళ్ళు అంటుంటే అది గొప్పమాటలా చెల్లిపోతున్నదేంటి! ఒకనాడు సాండర్స్ అనే ఒక పోలీసు తమకు అత్యంత గౌరవనీయుదయిన నిన్నటి తరం నేతను అవమానిస్తే సింహకిశోరాలై లేచిన భగత్ సింగుని గౌరవిస్తున్నాం, మరి ఇప్పుడిక్కడ నిన్నటి తరంలో నిస్వార్ధంగా ప్రాంతాల కతీతంగా యేవో కొన్ని మంచి పనులు చేసిన వారిని కూడా మా ప్రాంతం వాళ్ళు కాకపోతే వాళ్లు పనికిమాలిన వాళ్ళే, వాళ్ళ పీఠాల్నించి వాళ్ళని తొలగించి తీరుతాం అంటూ వుంటే యెవరికీ చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదేమిటి? యెవరు యే స్థానంలో వుండి యెలాంటి మాటలతో ఆ ప్రల్లదనాన్ని సమర్ధించుకుంటున్నారో చూస్తే తన పర భెదం తెలియకుండా పరోపకారం తో బతికిన వారి ఔన్నత్యం కూడా యెన్నికల్ల్లో వోట్లను విదిల్చే 200/- లేక 300/- రూపాయల కట్టల స్థితికి దిగజారి పోయింది కదా అని బెంగగా అనిపిస్తున్నది!

        "ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతందాకా తరిమి కొడతాం, ప్రాంతం వాదేవాడే చేస్తే ప్రాంతంలోనే పాతిపెడతాం' అన్నాట్ట వాళ్ళ ప్రజాకవి యెప్పుడో, ఇప్పటికీ అది పట్టుకు వూరేగేవాళ్ళు ప్రాంతం దాటి పోతే తమకీ అదే గతి పడుతుందనా ఇన్నాళ్ళూ ప్రాంతం పొలిమేరలు దాటనిది? నేను క్రిష్ణా జిల్లా నుంచి కొందరు వచ్చి బాగుపగలిగీతే పక్కనే వుండి కూడా హైదరాబాదుకు వచ్చి బాగుపడటానికి యెందుకు వెనకాడారు అని అడిగితే ఇప్పటి వరకూ జవాబు లేదు, యెందుకనో?! వొకప్పుడు అప్పటి ప్రభుత్వం ఇళ్ళ క్రమబద్దీకరణ చేస్తుంటే ఆగమాగం చేసి ఆపేయించి ఇప్పటి ప్రభుత్వం చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చున్న వూసరవెల్లిని తరిమికొట్టలేకపోయారేం? అక్కున జేర్చుకుని మంత్రిగా కూడా ఆదరిస్తున్నారుగా?

        అసలు ఆనాడు ఆ విగ్రహాల లిష్టు తయారు చేసిన పెద్దమనిషి సినారె నోరువిప్పి మాట్లాడడేమిటి?ఇదివరకు మానవవాదం ఇన్నయ్య ఒక పాతసంగతిని గుర్తు చేశాడీ పెద్దమనిషి గురించి - కులపతి పదవి కోసం నెల తప్పిన విషయం! ఈయన కూడా వాహినీ వారి పెద్దమనుషుల్లో ఒకడే?! అందుకే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కూడా యేదో ఆశించి తను ప్రతిపాదించిన లిష్టు చుట్టూ అంత గొడవ జరుగుతున్నా -అవి పనికిమాలినవి కావు అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మవునంగా వున్నాడా? ఇప్పుడు పనికిమాలినోళ్ళు అని వదరుతున్న కేసీఆర్ కూడా ఆ విగ్రహాల యెంపిక కమిటీలో సభ్యుడే నట! కొంత మంది సభ్యులు దాన్ని యెత్తి చూపితే వొక మేధావి యెప్పుడో NTR మీద జరిగిన తిరుగుబాటు గురించి యెత్తి NTR మీదనే చెప్పులు విసరడం గురించి మాట్లాడి విషయాన్ని పక్కదారి పట్టించేశాడు! కేసీఆర్ కూడా ఆ కమిటీలో సభ్యుదే అనేదాన్ని జీర్ణించుకోలేకనే దాన్ని వ్యతిరేకించలేకనే NTRనీ, వెన్నుపోటునీ NTR మీద చెప్పులు విసరడాన్నీ ప్రస్తావించి పక్కదారి పట్టాడు అనే విషయం తెలుస్తూనే వుందిగా!


         ఇంత రాజకీయం నేర్చిన ఈ పెద్దమనిషి రేపు ఖర్మ కాలి కేసీఆర్ కుర్చీ ఖాళీ అయితే వెంటనే తన రాజకీయ మనుగడ కోసం అవసరమయితే కేసీఆర్ ని కూడా పనికిమాలినోడు అని అనకుండా వుంటాడని గ్యారెంటీ ఇవ్వగలరా తెవాదులు! యెప్పటిదాకానో యెందుకు, ఇప్పుడేం వూడబొడుస్తున్నాడు తెలంగాణా ముఖ్యమంత్రిగా? ఇంతవరకూ వొక్క పని కూడా మొదలు పెట్టలేదని తనే వొప్పుకున్నాడుగా! కుర్రాళ్లకి ఇంబర్స్ చెయ్యాల్సిన ఖాతా మొత్తం రుణమాఫీకి ఫిరాయించేసాడో యేమో, దాన్ని కవరప్ చేసుకోవడానికి 1956 స్థానికత అని ఫాస్టు గా వెళ్ళబోతే కోర్టు ఈ దేశంలోనే వున్నావా అని చివాట్లు పెట్తి మరీ స్లో చేసింది? బోడి లార్సన్ అండ్ టర్బో మీ హయాంలో పని చెయ్యటం మావల్ల కాదు,ప్రాజెక్టు నుంచి తప్పుకోడాని కయినా సిధ్ధమే అంటే లోపల్లోపల బతిమిలాడుకుంటున్నారో యేమో గానీ బయటికి మాత్రం వులుకూ పలుకూ లేకుండా వారం రోజులు గడిపి పత్రికల్లో ఆ వుత్తరం సంగతి లీకయ్యాక మొగుదు కొట్టినందుకు కాదు గానీ తోడికోడలు నవ్వినందుకు యేడుస్తున్నానన్నట్టు లీకు గురించి గోల చేసారే తప్ప అసలు వుత్తరంలోని సారాంశం అబధ్ధ మని అనలేక పోయారు! అతనెంతటి సమర్ధుడో తెలుసుకోవడానికి మూడు నాలుగేళ్ళు ఆగి అన్నమంతా పిసికి చూడాలా, ఈ వొక్క వుదాహరణా చాలదా? ఇంతకీ కధ యేమయింది అంటే ప్రాజెక్టును కాకెత్తు కెళ్ళింది, కంచికి చేరకుండానే ముగింపు వాయిదా పడింది! విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుని గెజెట్ వేసేసి తను లాగేసుకుంది!తెలంగాణా ప్రభుత్వం కూడా కేంద్రం అడిగిందే తదవు గెజెట్ కోసం తను కూడా సహకరించేసి చేతులు దులిపేసుకుంది? పంచకూళ్ళ కషాయాన్ని పంచవేణీసంగమం అని మురుసుకునే తొట్టిగాంగు సభ్యులు మరి ధర్మ ప్రభువు నిజాము గారి దివ్యభవనాల గురించి ఆశ లొదిలేసుకోవాల్సిందేనా?! పోనీ ఇప్పటి వరకూ యేమి చేశాడో గుర్తు చేసుకుందామా అంటే- పోలవరం గురించి కొంతకాలం యేడ్వటం,  కరెంటు కష్టాల గురించి కొంతకాలం యేడ్వటం, కుర్రాళ్ళ ఫీజుల విషయంలో కోర్టుతో చివాట్లు తినడం, యేమి చేద్దామన్నా అధికార్ల విభజన పూర్తయి చావలేదని విసుక్కోవటం ఇవే గుర్తు కొస్తున్నయి మరి!


         మధ్యే మధ్యే అక్షతాన్ సమర్పయామి అన్నట్టు ఈ విగ్రహాల మీద పడి యేడ్వటం దేనికయ్యా అంటే తన అసమర్ధత బయట పడకుండానూ, పడినది పో ట్యూబులైట్ల వంటి అనుచరగణం దాన్ని గుర్తుపట్టి తిరుగుబాటు చెయ్యకుండా కొంతకాలం అన్న చించేస్తున్నాడురోయ్! అన్న నవ్వితే మాసు, అన్న యేడిస్తే మాసు, అన్న కోర్టులతో మొట్టికాయ లేయించుకున్నా మాసే అని పొంగిపోయే వీరభక్తులకి పూనకాలు రప్పించే వినోద కార్యక్రమం! నిజంగా పూనుకుని విగ్రహాల మీదకి పలుగులూ పారల్తో వెళ్ళారే అనుకుందాం, యేమవుతుంది, అహ యేమవుతుందీ అంట! ప్రాంతీయతని చూసుకుని మురిసిపోవదం తెలంగాణ్యులకి మాత్రమే సొంతమా? మనమేం తక్కువ తిన్నామా? వెంఠనే స్వాభిమానం గల ఆంధ్రా పారిశ్రామిక వేత్తలూ వ్యాపార ప్రముఖులూ విగ్రహాలతో పాటే స్వర్ణాంధ్రకు తరలి వస్తారు! మన ప్రాంతానికి చెందిన గొప్పవాళ్లని పారల్తో పలుగుల్తో పెళ్లగించి పొలిమేరలు దాటిస్తుంటే వాళ్లకి సంపదలు కూర్చబెడుతూ అక్కడే వుండటం అంటే యేమిటో విదమరిచి చెప్పాలా? తన ప్రాంతం పట్లా తన సంస్కృతి పట్లా గర్వం వున్నవాడెవడయినా ఆ పని చేస్తాడా? కొంచెం బిస్కట్టు విదిల్చేసరికి నేనూ హైదరాబాదీనే అన్న శ్రీమాన్ బెండప్పడు గారి లాంటివాళ్ళు వుంటారేమో, వుండనివ్వండి! అందాకా వొస్తే ఆయన్నీ నువ్వూ పలుగూ పారా పట్టుకుని వెళ్తావా అని అడిగి తేల్చుకుందాం! చిల్లర మల్లర పనులతో అల్లరి చెయ్యటం వాళ్లకి మాత్రమే తెలిసిన బ్రహ్మవిద్యా? ప్రపంచం పొలిమేరల దాకా వినబడేటట్టు మనం అరిచి గోల చెయ్యలేమా?


      అయినా గానీ ఇదివరకటి వాళ్ళు నిర్లక్ష్యం చేశారు,వోకే! తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు కావాలనే పెట్టలేదు, రైటే!! నీ మంచితనం నువ్వు చూపించుకుంటూ వాళ్ళు మర్చిపోయిన విగ్రహాల్ని కొత్తగా పెట్టుకుంటే సరిపోతుంది గదా, వున్నవి కూల్చాల్సిన పనేంటి అనే డవుటొచ్చిందా మీకు? ఆయనే వుంటే మంగలెందుకని అక్కడ అంత తిన్నగా ఆలోచించేవాళ్ళు లేకనే గదా సామీ ఈ కుక్కజట్టీల తంతులన్నీ పెనుయుధ్ధాల్లాగ జరుగుతున్నాయి! వొక పెద్దమనిషి యెంతో ఆశగా "2012 సంవత్సరం లో రాజమండ్రి గొదావరి గట్టుపై శ్రీ.పీ.వీ.నరశిం హా రావు గారి విగ్రహాన్ని పెట్టారు ఆయన పేరు మీద పార్క్ కూడా వుంది." అని నచ్చజెప్పబోతే ఒక వదరుబోతు "పి.వి. ముల్కీ నిబంధనలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి అనే కారణంతో జై ఆంధ్ర ఉద్యమం నడిపి ఆయన్ని పదవి నుంచి దించేసారు. ఇప్పుడు ఆయనకి విగ్రహం పెడితే ఆయన మీద గౌరవం ఉన్నట్టా?" అని వంకలు పెదతాడు! లేకపోతే పెట్టలేదంతారు?పెట్టాం అని సాక్ష్యం చూపిస్తే యెప్పటిదో యెత్తి అప్పుడు అవమానించారుగా ఇప్పుదు విగ్రహం పెడితే గౌరవించినట్టా అని మెలిక వేస్తారు, ఇవేమి తంటాలు వొచ్చి పడ్డాయండి? యెందు కొచ్చిన తిప్పలు, అవును ఆంధ్రోళ్లకి తెలంగాణోళ్ళ గొప్పదనం అర్ధం కాలే! గొప్పదనాన్ని నిర్ణయించే స్కేలుబద్దలు తెలంగాణోళ్ల కాణ్ణె వుండె!!సరి పాయే,యెందుకీ తొండి మెలికలు పెట్టే గయ్యాళి మందతో వాదన?! ఆ తర్వాత యెంతోకాలానికి NTR మన తెలుగువాడు ప్రధాన మంత్రి అవుతున్నాడు, మనం పోటీ పెట్టగూడదు అని దానికి కట్టుబడి వున్నది వాడికి యెక్కలేదు గానీ వుద్యమం చెయ్యడమే గుర్తుండి పోయింది వాడి మట్టిబుర్రకి! ముందుకు పదవయ్యా ముకుందయ్యా అని మొత్తుకుంటున్నా యాభయ్యేళ్ల నాటి సంగతుల్నే కెలుక్కుంటూ యెనకటయ్యగా వుంటానంటే వుండండి - మాకే మంచిది!


p.S:మమ్మల్నీ మా ప్రాంతాన్నీ అవమానించే కొందరు ధూర్తుల్ని విమర్సించగానే నాకు తెలంగాణా ద్వేషాన్ని అంతగట్టే ప్రబుధ్ధులకి కొన్ని సాక్ష్యాలు:మొదటి నుంచీ విడిపోవడం న్యాయమే అని తప్ప బలవంతంగా కలిపి వుంచాలని నేను కామెంట్లు వేసే దశ నుంచీ పోష్టులు వేసే ఈనాటివరకూ వొక్క అక్షరం కూడా రాయలేదు.యెన్నికల సమయంలో కూడా ఆంధ్రాలో తెదెపా తెలంగాణాలో తెరాసా అధికారంలోకి వస్తే రెండు ప్రాంతాలకీ మంచిది అన్నాను.సరే వుద్యమ కాలంలో ఆ వేడిలో మీరు అన్నారు, మేము పడ్డాం, ఇప్పుదిక అన్నీ మర్చిపోయి 105 గురిలా వుందాం అని కూడా చెప్పాను.తెలంగాణా ముఖ్యమంత్రి నిర్ణయం అప్పుడు కూడా యెవరో అనామకుడు రావటం కన్నా మొదటి నుంచీ నాయకత్వం నడుపుతున్న కేసీఆర్ ముఖ్యమంత్రి కావదమే మంచిదని అన్నాను. సకలజనుల సర్వేని మనస్పూర్తిగా మెచ్చుకుని సరదా సరదాగా వొక పోష్టు గూడా వేసాను.తను వివేకంతో మసులుకుంటూ తెలంగాణా ప్రజలకి మంచి చేసే విధంగా తన శక్తియుక్తుల్ని వుపయోగిస్తే మీతోపాటూ నేనూ సంతోషిస్తాను.మీ ప్రాంతంలో మీరుండి స్థానబలం చూసుకుని విర్రవీగి మీ ప్రాంతంలోని ప్రాంతేతరుల మనోభావాల్ని గాయపరిస్తే మీరు ప్రాంతం దాటి వెళ్ళినప్పుడు మీకూ అదే శాస్తి జరుగుతుంది అని చెప్పడమే నా వుద్దేశం.అర్ధమయితే సంతోషం, కాకపోతే నమస్కారం!ముందు కురికి భవిష్యత్తుతో పోటీ పడాల్సిన కాలంలో మాటిమాటికీ వెనక్కి చూసి వులిక్కిపడుతూ వుంటే ప్రయోజనం యేమిటి?


5 comments:

  1. నన్నయ్యను, తిక్కన్నను. రుద్రమదేవి, బ్రహ్మనాయుడు, ఎఱ్ఱాప్రగడ, వేమన లాంటి వారి కాలాలు ఏమిటి? అప్పటికి ఇప్పటి ఈ ప్రాంతాలు ఈ ప్రాంతాలు గా ఉన్నాయా? తురక రాజులు వచ్చి ఒ ప్రాంతాన్ని ఆక్రమించి పరిపాలించారా?

    వాళ్లకు కూడా ప్రాంతాలు అంట కడుతున్న తెలబాన్ దొర, ఆ దొర కు కాల్మొక్కే చదువుకొన్న బ్యాచ్ కావాలంటే తెలుగు బ్లాగులలోనే కనిపిస్తారేమో, సిగ్గు ఎగ్గు లేకుండా :)

    దొర ఆయనకు కాల్మొక్కే బ్లాగుల గుంపు ఇంతకీ ఆ విగ్రహాలలో ఏవి పనికి వచ్చేవి, పనికిరానివి, ఆంధ్రా వాళ్లవి ఏవి, తెలంగాణా వాళ్లవి ఏవో చెబితే బాగుంటుందేమో ముందు.

    ఇంతకీ అవి పనికి మాలినవో, అంతకంటే పనికి వచ్చేవి పెట్టక పోవటానికి కారణ మయిన సి.నా.రే., దొరే అన్న మాట బాగా గుర్తు చేసారు చెంచాలకు.

    ReplyDelete
  2. ముఖ్యనేతగారు కూడ కలకాలం అధికారంలో ఉండరు కదా!
    మరో పదేళ్ళకో, ఇరవయ్యేళ్ళకో ఆయన కూడ విగ్రహంగా మారతాడు కదా!
    అప్పుడు వేరే పార్టీవాళ్ళు అధికారంలోకి వచ్చి, ఈయన విగ్రహాన్ని పనికిమాలినది అని అంటే అప్పుడు ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఒకసారి ఊహించుకుంటే బాగుంటుంది.

    ReplyDelete
  3. స్పందించినందుకు కృతజ్ఞతలు! అక్కడ ప్రజలో జరిగే చర్చలో 3:4 అనీ జిల్లా స్థాయిలో ప్రాంతీయ నాయకుల విగ్రహాలు ఇన్నీ జాతీయ స్థాయి నాయకుల విగ్రహాలు ఇన్నీ 12-16 లో ణ్ట్ర్ వస్తాడా రాడా అనే కాకిలెక్కలు ప్రింటులో చదవడానికే అసహ్యంగా వుంది నాకు!దయచేసి ఈ దరిద్రాన్ని ఇంతటితో ఆపుతారా?శ్యామలీయం మాష్తారు చెప్పినట్టు గౌరవం అనేది హృదయమూలాల నుంచి పొంగుకు రావాల్సిన భావోద్ర్రేకపు గంగధార! ఆ సంస్కారం వాళ్ళకి లేకపోవటం వల్ల ఈ గొదవలు!ఈ ఆంధ్రా- తెలంగాణా గురించి పోష్తులు వెయ్యకుండా ప్రశాంతంగా వుందాం, ట్రాక్ మారుద్దామని అనుకుంటున్నా ఈ మనిషి ఇత్లాంటి తంపులు పెడుతూనే వున్నాడు, యేం చేస్తాం?మరీ చెత్తగా వ్సిగించతంతో రియాక్త్ అవకుండానూ వుండలెక పోతున్నా!

    ReplyDelete
  4. "ఆంధ్రోళ్లకి తెలంగాణోళ్ళ గొప్పదనం అర్ధం కాలే"

    మీరు ముద్దుగా వదరుబోతు అని పిలిచిన మిత్రుడు తెలంగాణోడు కాదు. నాకు తెలిసి ఆయన ఆంధ్రోడో లేదా ఒరియోడో.

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రోడు అయినా వొరియోడు అయినా వదరుబోతు తనంలో తేడా లేదుగా!?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...