Thursday, 11 September 2014

ప్రపంచంలోని రామభక్త హనుమాన్లందరికీ ఇదే నా ఆహ్వానం!

              ఒక సిధ్ధాంతం సారంలో యెంత గొప్పదయినా కావచ్చు,ఆచరించే వాళ్ళు తెడ్డుశ్రీ లయితే యెలా అఘోరిస్తుందో తెలుసుకోవాలంటే ముతప్పాళ కురంగీన్యాకమ్మ నీ ఆవిడ భక్తుల్నీ చూఒసి తెలుసుకోవచ్చు!నువ్వు కమ్యునిష్టువా కమ్యునిష్టేతరుడివా అనే ప్రశ్నతో సంబంధం లెకుండా ప్రతివాడూ పాటించాల్సిన మానవ సహజమైన మర్యాదలు కొన్ని వుంటాయనేది కూడా లేకుండా నిన్న గాక మొన్న చనిపోయిన బాపు అనే చిత్రకారుణ్ణి వీళ్ళు బజారు కీడుస్తున్న పధ్ధతి చూస్తూ వుంటే వీళ్ళు కమ్యునిజాన్ని తీసుకు రావాలనుకుంటున్నది మనుషుల్లోనా పశువుల్లోనా అనే అనుమానం వస్తున్నది?

              ఇంతకీ వీళ్ళ ఆరోపణ యేమిటంటే ఆ మహా రచయిత్రి ఒక గొప్ప కావ్యం రాస్తే దానికి బొమ్మలు వెయ్యనని తిరస్కరించటం? వెయ్యనంటే వెయ్యనని చెప్పొచ్చుగా అది చెక్కో/డీడీయో గానీ దాని వెనకాల రామ రామ అని రాసి తిప్పి పంపటం దేనికీ అని వీళ్ళ గోల, విన్నవాళ్ళు నవ్వుతారని కూడా లేదు వీళ్ళకి. చెక్కు గానీ డీడీ గానీ ఒకసారి ఒక వ్యక్తికి పంపించాక అది యేమయినా పంపించిన వాడికి అనవసరం. తీసుకున్న వాడు దాన్ని క్యాష్ చేసుకుంటే నీ యెక్క్కవుంటు లోంచి దబ్బు పోతుంది. న్లేదంటే చించేసినా దాచుకున్నా అది చెల్లని ట్రాన్సాక్షన్ గా కొంత కాలమయ్యాక మురిగి పోయి నీ డబ్బు నీ దగ్గీరే వుంటుంది. దాని కంత యేడుపెందుకు?

            వెనక్కాల రాసిన రెండు + రెండు నాలుగక్షరాలకే ఇన్నేళ్ళ తర్వాత గూడా యేడిచేటంతగా మనోభావాలు గాయపడితే మరి ఆ పుస్తకంలో వున్న విషయానికి మా మనోభావాలు యెంత గాయపడాలి? మనుషు లందరికీ యేది చెయ్యాలి యేది చెయ్యగూడదు అనే లెక్కకి, "యెదటి వాడు యేమి చేస్తే నీకు  కష్తం కలుగుతుందో అది నువ్వు యెదటి వాడికి చెయ్యక పోవటం" అనే మర్యాదని వాళ్ళు పాటించరా? సరే, ఒప్పుకుందాం! కేవలం ఆవిడ శైలిలోనే జవాబు చెప్పటం తప్ప అభ్యంతరకరమయిన పదాలేమీ నేను వాడలేదని తెలుస్తుంది.అందులో కొన్ని టైపోస్ ని సవరించి ఇక్కడా ఇస్తున్నాను, చూడండి.

===============
రంగనాయకమ్మ రామాయణాన్ని విమర్సించిన తీరు యెంత అసహ్యంగా వుందో ఒక వుదాహరణ చెప్తాను;
రాముదు శూర్పణఖని చూడగానే లొట్టలేసుకుంటూ చూశాడట!ఆహా!! సీతకన్నా ముందు ఈవిడ(?) కనబడితే ఈమెనే పెళ్ళాడి వుండేవాణ్ణి, ఇప్పుడు చేసుకుంటే జనం నా యేకపత్నీవ్రతాన్ని అనుమానిస్తారేమో అని కంగారు పడ్డాడట!

తనలాంటి మరో రచయిత రాసిన పుస్తకాన్ని విమర్శించేది ఇలాగేనా? ఆ రచయిత ఒక పాత్రని ఒక పధ్ధతిలో సృష్టిస్తే ఆ పాత్రని అవహేళన చేస్తూ కాదు కాదు, ఆ కధ అలా జరగలేదు, ఇలా జరిగింది అని పులుముడు తెలివి చూపిస్తే యెలా వుంటుందో తెలుసా?

నేను జానకి విముక్తి నవల్లొని పాత్రల గురించి, "ఆ జానకి నాకు తెలుసండీ!వాళ్ళు మా ఇంటికి మూడిళ్ళ పక్కనే వుండే వాళ్ళు!! తనకి కనిపించిన మగాడి కల్లా కన్ను కొట్టే అలవాటుండేది, అందుకే వాళ్లత్తా మొగుడూ అలా తిట్టినా కొట్టినా పడి వుంటుంది!" అని అంటే యెలా వుంటుందో అలా వుంటుంది.

కొన్ని లక్షల మంది ఆ కావ్యాన్ని గౌరవిస్తున్నారు అనేది కూడా గట్టి పాయింటు కాదు, విమర్శించిన పధ్ధతి చెత్తగా వుందనేది మాత్రం తిరుగు లేని సత్యం!

ఇక పోతే బాపు గానీ రమణ గానీ వాళ్ళ ప్రవృత్తి లోనే హాస్యం వుంది, వాళ్ళ సహజ ప్రవృత్తి తో ఒక కొంటె పని చేసారు. ఒక సీరియస్ పుస్తకాన్ని చెత్తగా విమర్శించడంతో పోలిస్తే ఆ కొంటెతనం అభ్యంతరకరమైనది కానే కాదు.
===============

             ఈవిడ విషవృక్షం రాయక ముందు స్వీట్ హోం, బలి పీఠం, ఇంకా ఇలాంటి యద్దనపూడి టైపు ఫామిలీ నవల్లు రాసుకుంటూ వుండేది కాస్తా మేధావుల్లోకి యెక్కేసింది - రాముణ్ని తిట్టి గొప్పదయింది?! సాహితీ విమర్శలు ఆర్.యస్.సుదర్సనం గారూ చేసారు, ఈవిడా చేసింది - రెంటికీ హస్తి మశకాంతరం, కాదా!! రామాయణం నిజంగా జరిగిన కధ అయితే అప్పటి కాలంలో వున్న వాస్తవమయిన విషయాల్ని చూపించి వాల్మీకి చెప్పిన అబధ్ధాల్ని నిరూపించాలి.కానీ ఒక కవి రాసిన పాత్రల్ని మరో రకంగా చిత్రీకరించటం యెంత తప్పో తెలియజెప్పాలనే ఒక స్త్రీ పాత్రకి కన్ను కొట్టటం ఆపాదించటం జరిగింది. ఒకవేళ నేను చేసిందానికి చివుక్కు మనే సుకుమారులు ఆవిడ చేసిన దుర్మార్గానికి ఇంకా బాధ పడాలి మరి?!

            నిన్నటి రోజున ఈవిడ రాసిన పుస్తకాలు ఇవ్వాళ యెంతమంది చదువుతున్నారో తెలియదు, కానీ యావత్ స్వాస్థ్యంతి గిరయః అని చెప్పుకున్న వాల్మీకి కన్నా తను గొప్పదని ఆవిడా ఆవిడ అభిమానులూ యెలా అనుకుంటున్నారు!నక్కెక్కడ నాక మెక్కడ? 

        కాబట్టి ఇప్పుటి కయినా శివద్వేషులే నా ఆహారం అనే వీరభద్ర పెరుమాళ్ లాగా రామ భక్తు లంతా వీర హనుమాన్ల మాదిరి ఈ తింగరి మాటలు మళ్ళీ మళ్ళీ  రాకుండా ఒకేసారి గట్టి ప్రతీకారం చెయ్యాలి! ఆవిడింకా బతికి వుండగానే తేల్చుకుంటే ఓ పనై పోతుంది! బెజవాడ లోనో హైదరాబాదు లోనో యెక్కడ వుంటే అక్కడి కెళ్ళి ఇదే ప్రశ్నని తన ముఖం మీదనే అడగాలి, యేమి చెబుతుందో చూద్దాం?

జై శ్రీ రాం!     జై శ్రీ రాం!!     జై శ్రీ రాం!!!


Saturday, 6 September 2014

కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ)

                  సోనియా గాంధీ అనే పేరుతో వ్యవహరించబడుతున్న ఆంటోనియో మైనో అనే రాజమాతని కానీ, కాలం కలిసొచ్చి యూపీయే-3 కల నిజమయితే ప్రధాన మంత్రి అయ్యే రాహుల్ గాంధీ గా పిలవబడుతూన్న యువరాజు రావుల్ విన్సీ ని కానీ, మరే కాంగ్రెసు వాది నయినా సరే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ అనే వ్యక్తి గురించి ఒక ఐదు నిముషాల పాటు వినేవాళ్లకి బోరు కొట్టకుండా ప్రసంగించమని చాలెంజి విసిరితే ఫలితం యెలా ఉంటుంది? "మోహన్ దాసా, ఆడెవడు?" అని గద్దించి అడిగినా ఆశ్చర్య పోనక్కర్లేదు!

                100+ వయసు గల కాంగ్రెసు పార్టీ లోపలి పరిస్థితి అలా ఉంటే ఈ దేశ ప్రజల మనస్థత్వం యెలా ఉందో తెలుసా? కాంగ్రెసు యెన్ని కుంభకోణాలలో కూరుకుపోయినా, యెంత దరిద్రంగా పరిపాలించినా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనని యెంత చెయ్యగూడని విధంగా చేసినా యెన్నికల్లో కాంగ్రెసుకి ఆంధ్రా లోనే కాకుండా మొత్తం దేశమంతటా అన్ని వోట్లు యెలా పడినయ్యో, ఇకముందు కూడా యెందుకు పడుతూనే ఉంటాయో తెలుసా? ఈ దేశ ప్రజలు కాంగ్రెసుని మహాత్ముడు అని భావిస్తూ ఉన్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీతో అనుసంధానించుకుని అతని మీద ఉన్న అభిమానాన్నే ఆ పార్టీ మీదకి ప్రసరింపజేస్తున్నారు! ఒక సారి కాంగ్రెసుకు వోటు వెయ్యడానికి నిశ్చయించుకుంటే ఆ వ్యక్తి యెదటివాళ్ళు ఆ పార్టీ మీద యెన్ని ఆరోపణలు చేసినా అవి నిజమే అని తేలినా కాంగ్రెసుకే వోటు వేస్తాడు. అతనికి తన కళ్ల ముందున్న అవినీతి పరులూ, అసమర్ధులూ కనపడరు, కేవలం మహాత్మా గాంధీకి సంబంధించిన పార్టీకి మాత్రమే తను వోటు వేస్తున్నా ననుకుంటాడు. అలాంటి సాంప్రదాయికమయిన వోటర్లు ఉన్నంత కాలం కాంగ్రెసు ఈ దేశపు రాజకీయ చిత్రపటం మీద తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది.

             1885లో స్థాపించబడినప్పటికీ కాంగ్రెసు అనే ఒక సంస్థ ఉన్నదనీ అది అప్పుడున్న ఆంగ్లేయుల పరిపాలనని అంతమొందించి దేశ స్వాతంత్ర్య సముపార్జన కోసం ప్రయత్నిస్తున్నదనీ సామాన్యులతో సహా అందరికీ కాంగ్రెసులోకి ఇతని ప్రవేశం జరిగిన 1920 నించే తెలిసింది. సరిగ్గా ఇతని రంగ ప్రవేశం జరిగే నాటికి నేను మొదటి భాగంలో చెప్పినట్టు ఒక రాజకీయ ప్రళయ త్రికోణం యేర్పడి ఉంది కదా!ఇతనికి ఆనాటి కాలమూ చరిత్రా నిర్దేశించిన కర్తవ్యం ఆ త్రికోణానికి మధ్యన ఉండి యే మూలనీ అతిగా సాగనీయకుండా కలిపి ఉంచటం.

             కొల్లాయి గట్టటం లాంటివాటితో ఈరోజు నిరాదంబరంగా వుండటానికి గుర్తుగా వున్నాడు గానీ భారత రాజకీయ రంగంలోకి ఇతని ప్రవేశం మాత్రం ఒక యుధ్ధాన్ని గెలిచి రాజధానికి చేరుకునే రాజాధిరాజుకు తన రాజ్యంలోని ప్రజలు ఇచ్చే ఆహ్వానం తో పోల్చదగినంత వైభవోపేతంగా జరిగింది. దానికి కారణం ఇక్కడ మనల్ని ఆక్రమించుకున్న ఇంగ్లీషు వాళ్ళే యేలుతున్న దక్షిణాఫ్రికాలో ఒక సరికొత్త రకపు తిరుగుబాటుకు తెరతీసి సంచలనాన్ని రేకెత్తించటం.

                ఇతను 1869లో అక్టోబర్ 2న పోర్బందర్ జిల్లా లోని సుదామపురి అనే నగరంలో పొర్బందర్ సంస్థానంలో దివానుగా పనిచేస్తున్న కరం చంద్ గాంధి కి నాలుగో భార్య అయిన పుత్లీబాయ్ ద్వారా పుట్టాడు. మోహన్ దాస్ తన తండ్రి యొక్క సంతాన మందర్లోనూ చిన్నవాడు. ఇద్దరు అన్నలూ ఒక అక్క. ఇతనికి 13 యేళ్ళ వయసులో 14 యేళ్ళ కస్తుర్బాయ్ మఖంజి తో అప్పటి సాంప్రదాయాల కనుగుణంగా వివాహం జరిగింది.
       మాధ్యమిక విద్యాబ్యాసం పోర్బందర్ లోనూ ఉన్నత విద్య(హై స్కూలు చదువు) రాజ్కోట్ లోనూ జరిగింది.చదువులో చాలా చాలా చాలా మామూలు స్థాయి విద్యార్ధి. క్లాస్రూం లోనూ ప్లేగ్రవుండు లోనూ మనోడు నస్మరంతి గాడే! సంవత్సరాంతపు రిపోర్టు ఇలా వుండేది, "ఇంగ్లీషులో గుడ్డు, లెక్కల్లో ఫెయిరు, జాగర్ఫీలో వీకు, కాండక్టు అదుర్సు మరియూ చేతి రాత దరిద్రం" - అయ్యా అదీ సంగతి. పాపం ఇవే లోపాలు మన పిల్లల్లో వుంటే యెంత యాగీ చేస్తున్నాం - పనికి రాకుండా పోతావురా బడుధ్ధాయా అని?!

       బావనగర్  లోని సమల్దాస్ కాలెజి నుంచి మెట్రిక్యులేషన్ యెలాగోలా గట్టెక్కించాడు! బారిస్టర్ గిరీ వెలగబెడితే తండ్రి పోష్టయినా దక్కుతుందేమో నని 1888లో లండన్ కి ప్రయాణం కట్టాడు.1891లో అది పూర్తి చేసి ఇండియాకి వొచ్చి పడ్డాడు. బొంబాయిలో లా ప్రాక్టీసు మొదలెట్టి సాక్షుల్ని క్రాసెక్జామిన్ చెయ్యడంలో మానసికంగా సమర్ధుడు కాకపోవటం చేత ఆ వృత్తికి పనికి రాక రాజ్కోట్ కి తిరిగొచ్చి లిటిగెంటులకి పిటిషన్లు రాసి పెట్టటానికి మాత్రం పరిమితమై పోయాడు. ఒక బ్రిటిష్ ఆఫీసర్ తో యేదో సంథింగ్ సంథింగ్ ఇనక్కు ఉనక్కు అయ్యేసరికి అదీ బలవంతంగా ఆపెయ్యాల్సి వచ్చింది. ఏ మలుపూ లేకుండా అతని జీవితం ఇలాగే గడిచి పోతే ప్రపంచంలోని అసంఖ్యాక మయిన చెట్టు కింద ప్లీదర్లలో ఒకడిగా అనామకంగా మిగిలి పోయే వాడు?

           1893లో దక్షిణాఫ్రికా నటాల్ ప్రాంతంలోని అబ్దుల్లా & కో నుంచి ఒక సంవత్సరానికి ఆకర్షణీయమయిన £105.00 నెల జీతపు కాంట్రాక్టును ఒప్పుకుని తన 24వ యేట దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టాడు. ఇక్కద గడిపిన 21 యేళ్ళూ ఇతని రాజకీయ పరమయిన భావజాలానికీ, నాయకత్వ లక్షణాలకీ పునాదిని యేర్పరచాయి. స్వదేశంలో దారుణంగా ఫెయిలయిన వాడు ఇక్కడ అద్బుతంగా చెలరేగి పోయాడు. దానికి కారణం క్రాసెగ్జామినేషన్లో తన వీక్నేసు తనకి తెలుసు గనక కోర్టులో అడుగు పెట్టే పని లేని ఒక ట్రిక్కు ప్లే చేశాడు, తన అదృష్టం బాగుండి అది గారెల బుట్టలో పడేసింది - సొమ్ముల పంట పండించింది! అదేమిటంటే కోర్టు బయట రాజీలు చెయ్యటం! ప్రపంచంలో ఇతనికి తప్ప మరెవరికీ లాభసాటిగా వుండనంత వింతయినదీ ట్రిక్కు? డబ్బులు చేతి నిండా వుండటం వల్ల రైళ్ళలో యెప్పుడూ మొదటి తరగతి టికెట్టునే తీసుకోవటం, తెల్లవాళ్ళు మాత్రమే విడిది చెయ్యగలిగిన ఖరీదయిన హోటళ్లలో మకాం చెయ్యటమూ, మొండితనం వుండటం వల్ల ఆ ప్రయాణాల్లో యెంతగా అవమానాలకి గురయినా వాటిని కొనసాగించటం మిగతా భారతీయుల్లో ఇతని పట్ల ఒక రకమయిన హీరో ఇమేజిని తెచ్చి పెట్టాయేమో? రైల్లోంచి తోసేస్తే దులుపుకుని పోవటం, ఒక హోటల్ నుంచి గెంటేస్తే మరో హోటల్ కి వెళ్ళడం తప్ప ప్రతిఘటించి పోరాటా లేమీ చెయ్యలేదు, యెందుకనో?

         అప్పుడు అక్కడి శ్వేత జాతి దుర్మార్గపు విధానాల్ని అర్ధం చేసుకునేందుకు వీలుగా కొంచెం అప్పటి దక్షిణాఫ్రికా పౌర సమాజ వాతావరణాన్ని తెలుసుకోవాలి. అసలు దక్షిణాఫ్రికా ప్రజలు పల్లెల్లో వుండేవాళ్ళు, రైతులుగా, బైతులుగా, వేటగాళ్ళుగా - అదీ దేశ మంతటా చెల్లా చెదురుగా వుండే వాళ్ళు. తెల్లవాళ్ళకి వాళ్ళతో సమస్యలు లేవు. కానీ భారతీయులు అలా కాదు, వ్యాపారాల్లో ఆరి తేరి పోయి వుండటం, లేదంటే బాగా చదువుకుని గాంధీ లాగా మంచి ఆదాయాల కోసం రావడం వల్ల తెల్ల వాళ్లకి వీళ్ళు గట్టి పోటీగా తయారయ్యారు. వీళ్లని నిరోధించటం కోసమే సరిగ్గా 1890ల నాటికే నల్ల చట్టాలు చెయ్యటం మొదలు పెట్టారు.

        1893 నుంచి 1914 వరకూ పిటిషన్లు రాయడంలో తన ప్రావీణ్యతని వుపయోగించుకుని కోర్టులకీ గవర్నమెంటు లోని వాళ్ళకీ పిటిషన్లు తగిలిస్తూ మధ్య మధ్యలో ఇండియాకీ ఇంగ్లాండుకీ తిరిగి మద్దతు కూడగట్టుకుంటూ ఆ ఇరవయ్యేళ్లలో విపరీతమయిన ప్రచారాన్ని తెచ్చుకున్నాడు. ఇతని యెదుగుదలకి దక్షిణాఫ్రికా మీడియా కొన్నిసార్లు మెచ్చుకుంటూ, కొన్నిసార్లు వెక్కిరిస్తూ తన వంతు పాత్ర తను పోషించింది. ఒక రకంగా మొత్తం సమాజాన్ని దీర్ఘకాలికమయిన శాంతియుతమయిన సర్వతోముఖమయిన అభివృధ్ధి పధంలోకి నడిపించగలిగిన జ్ఞాన సంపదా, దూరదృష్టీ యేమీ లేకుండా - ఒక గందరగోళపు భావజాలంతో తాత్కాలికమయిన వుద్రేకాల్ని సృష్టించి MRTP రేటింగుల మీద యావే తప్ప ప్రజల పట్ల నిబధ్ధత లేని మీడియా తన వంతు పాత్ర తనూ పోషించగా మహామహులుగా కీర్తించబడుతున్న ఇవ్వాళ్టి విభజన వాద వుద్యమ నేతల లాంటి వాడే అయినా, సహజంగా మనుషుల్లో వుండే(మేధావుల్లో కూడా) - నిశితంగా పరిశోధించడానికి వీలు పడనివ్వని - బౌధ్ధిక అలసత్వం వల్ల మరో విధంగా రూపం మార్చుకుని ప్రపంచ రాజకీయ చిత్రపటం మీద మహాత్ముడిగా మనగలుగుతున్నాడు.

        1899లో బోయరు యుధ్ధంలో 1100 మంది భరతీయుల్ని తెల్లవాళ్ళ తరపున యుధ్ధంలో సాయం చెయ్యతానికి వొప్పించి తను నాయకత్వం వహించి  Indian Ambulance Corps పేరుతో తెల్లవాళ్ళ ప్రభుత్వానికి సహాయ పడ్డాడు - వీళ్ళపట్ల దుర్మార్గంగా వున్నాప్పటికీ? "పాలకులు అన్నిసార్లూ న్యాయముగా ప్రవర్తించ లేకపోయిననూ పాలితులు రాజ్యానికి అనుసంధానించబడి వున్నంత కాలమూ పాలకులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించరాదు" ట! మొదటిసారి నేను ఈ అభిప్రాయం చదవగానే "ఆండాళ్ళూ నీకేమయినా అర్ధ మయిందా" గుర్తొచ్చి చక్కిలిగింతలు పెట్టినంత నవ్వొచ్చింది! కానీ "ఏ రాజ్యమైనా తిరుగు బాటు చేసిన ప్రజలను తీవ్రంగా అణచి వేస్తుంది. అందులో మారణకాండ, మాన ప్రాణ హాని సర్వ సాధారణం. మేం వాటిని డాక్యుమేంట్ చేసుకున్నాం. మీరు గుర్తించడానికే నిరాకరిస్తున్నారు... అంతే తేడా" అని అంటున్న ఈ కాలపు మేధావి అభిప్రాయాన్ని చూసినప్పుదు మాత్రం భయంగా అనిపించింది?! మోహన్ దాస్ కరం చంద్ గాంధీ అనే ఈ వ్యక్తిని అర్జెంటుగా  భారత రాజకీయ రంగం నుంచి అడృశ్యం చెయ్యక పోతే చాలా ప్రమాద మనిపించింది!

            అందరూ శాంతియుత ప్రతిఘటన, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే ఇతని సిధ్ధాంతాలకి భగవద్గీత నుంచి స్పూర్తి తీసుకున్నాడని పదే పదే చెప్పగా విని మొత్తం 700 పై చిలుకు వున్న శ్లోకాల్ని ఇటు నుంచి అటూ అటు నుంచి ఇటూ గిలకొట్టి చదివినా ఒక చెంప మీద కొడితే మరో చెంపని చూపించటం, కూడూ నీళ్ళూ మానుకుని కూర్చోవటం లాంటి తింగరి చేష్టలకి వుత్సాహ పరిచే సాక్ష్యాలు నా కెక్కడా కనబడ లేదు. అసలు భగవద్గీత సూటిగా "అర్జునా! ఈ దుర్యోధనాధములు యెప్పుడయితే కనీసపు పశ్చాత్తాపం కూడా లేకుండా పాపాలు చేశారో అప్పుడే చచ్చి పోయినట్టు లెక్క! పాప పుణ్యాలు విచారించకుండా చంపి పారెయ్యి. యేదొచ్చినా నేను చూసుకుంటాను గదా,  నాకు వొదిలెయ్యి" అని చెప్పేటట్లుగా వుంటే అందులో ఈ సుత్తి యెలా కనబడింతో అతనికి?

          అసలు తనకా ఆలోచన యెట్టా వొచ్చిందో తన ఆత్మఖద My experiments with truth లో తనే వివరంగా చెప్పాడు. ఈ పుస్తకం పేరే నాకు పెద్ద బోకులా వినిపిస్తుంది! సత్యం అంటే అన్ని ప్రయోగాలూ చేసాక ఆ ప్రయోగ ఫలితాల్ని విశ్లేషించగా తెలిసి చచ్చే విషయం కదా! ఒక విషయం రూఢిగా తెలిసాక గూడా దాని మీద మళ్ళీ ప్రయోగాలు చెయ్యట మేమిటి నా బొంద? తిక్కశ్రీ తిక్క రత్న లాంటి బిరుదుల్ని ఆశించే తిక్క వెధవ తప్ప మామూలు వాడెవడయినా చేస్తాడా?

          భార్యని కక్కూసు గది కడగ మన్నాడట! దానికి ఆ అగ్ర కులానికి చందిన ఆడమనిషి ఈ పాకీ పని నేను చేస్తానా అని కించ పడి, అయినా చెప్పింది సాంప్రదాయం ప్రకారం తనకన్నా అధికుడయిన పతి దేవుడు కాబట్టి లాగి తన్నకుండా మౌనంగా వుండి పోయిందట! ఆ తిరస్కారం తనలో మార్పుని తీసుకు రాగా దానినే తన సత్యాగ్రాహ మనే బ్రహ్మాస్త్రానికి మూల మంత్రంగా చేసుకున్నాడట! ప్రపంచ మంతటా అన్ని కుటుంబాల్లోనూ అతి మామూలుగా జరిగే మొగుడూ పెళ్ళాలకి సంబంధించిన రంకు బాగోతాన్ని ఒక జాతినీ వర్గాన్నీ ప్రజల్నీ అతి క్రూరంగా అణిచేసే వాళ్ల మీద పోరాడటానికి ఆయుధంలా మలుచుకున్నాని చెప్తుంటే ఇన్నేళ్ళుగా వింటున్న వాళ్లలో యెవరికీ అసహ్యం కాదు గదా కనీసం చిరాకు గూడా వెయ్యలేదేమిటా అని చాలా ఆశ్చర్యంగా వుంటుంది నాకు! 

     అన్ని సంవత్సరాలు అంత హడావిడి చేసినా ఒక్క నల్ల చట్టమూ రద్దు కాలేదు? యేదో ఒక సంచలనాత్మకమయిన పని చెయ్యటం, అరెస్టవటం, తెల్లవాళ్లతో రాజీ ప్రతిపాదనతో బయటికి రావటం, రాజీ పడినందుకు సాటివాళ్లతో తిట్టించుకోవటం, ఆ తెల్లవాళ్ళు రాజీ ప్రతిపాదనల్ని రద్దు చెయ్యగానే మళ్ళీ హడావిడి మొదలు పెట్టటం తప్ప నికరమయిన విజయాన్ని దేన్నీ నమోదు చేసుకోలేక పోయాడు. అయినా సరే, "భారత దేశం పిలుస్తోంది, రా! కదలి రా!" అని భారతదేశం లోని అభిమానులు పదే పదే పిలవడం తోనూ, తనకి కూడా, "ఇక్కడయితే నేను కేవలం 150,000 మందికి మాత్రమే నాయకత్వం వహించ గలను, అక్కడ మరింత విశాల మయిన రంగస్థలమే నాకోసం యెదురు చూస్తున్నది" అని అనిపించటంతో -  మొదలు పెట్టిన పనిని సగంలోనే వొదిలేసి వెళ్తున్నాడని సాటివాళ్ళు విసుక్కునే విధంగా హఠాత్తుగా 1914లో భారత దేశానికి వొచ్చి పడ్డాడు. బోయరు యుధ్ధంలో తమతో అంత బాగా అంట కాగిన సమయంలో మెడళ్ళు ఇచ్చి సత్కరించిన తెల్లవాళ్లే పురెక్కించి ఇక్కడ ఇంప్లాంట్ చేసి వుండవచ్చు నని కొందరు అనుమానిస్తున్నారు గానీ నేను ఆ కోణం మీద అతిగా పోదల్చుకోలేదు.

            1915 జనవరి 9న శాశ్వతంగా దక్షిణాఫ్రికా జీవితంతో తెగదెంపులు చేసుకుని భారత భూభాగం మీద కాలు పెట్టాడు. 1915 నుంచీ 1920 వరకూ పని మొదలు పెట్తకుండా యేమి చేశాడో తెలుసా? నేను ఈ దేశాన్ని గురించి తెలుసుకోవాలని దేశ మంతటా తిరిగాడు. దేశ మంతటా గోచి పాత రాయుళ్ళే కనబడ్డంతో వాళ్లలో ఒకడిగా కలిసి పోవాలంటే తనూ వాళ్ల లాగా వుండాలని తను కూడా పైన చూస్తున్న తన  ట్రేడ్ మార్క్ అయిన గోచిపాత లోకి మారాడు! ఇంకా నయం, రైళ్ల లోనూ బస్సుల్లోనూ మాత్రమే తిరిగి దాంతో సరి పెట్టేశాడు గానీ అడవుల్లో కూడా వుంది నా దేశం అని నగ్నంగా తిరిగే ఆదిమ జాతు లున్న అరణ్యాలను కూడా శోధించితే యెట్లా తయారయి వుండే వాడో!

           ఆ కాలం గురించి మనకి రెండు భ్రమ లున్నాయి, దేశ మంతా బ్రిటిషు వాళ్ళ పూర్తి అధికారం లోకి వెళ్లిందనీ, వాళ్ళు మన నెత్తి మీద తుపాకీ పెట్టి పరిపాలించారని! రెండూ అబధ్ధాలే! సామాన్య ప్రజలకి అసలు ఇంగ్లీషు వాళ్ళు కనబడిందే చాలా తక్కువ. అందరికీ చిన్నప్పటి హిస్టరీ పాఠాల్లో పరిచయమయిన సైన్య సహకార మైత్రి లాంటి వొప్పందాలతో పై స్థాయిలో వుండే అప్పటి రాజుల్నీ జమీందార్లనీ బానిసల్ని చేసుకుని వాళ్ళ ద్వారా తమకు కావల్సిన వాట్ని సాధించుకున్నారు! అప్పుడప్పుడూ తెల్లని రంగుతో కనిపించే కుంఫినీ దొరల్ని కళ్ళింతలు జేసుకుని చూడ్డం, కారు లాంటి వాట్ని చూసి ఇది ఆ తెల్ల వాళ్ళు తెచ్చిందని తెలిసినప్పుడు "ఔరా తెల్లోడి బిస" అని అనుకోవటం తప్ప సామాన్య జనానికి తమ కష్టాలకి కారణం ఇంగ్లీషు వాళ్లని అస్సలు తెలియదు.

         ఈ పై స్థాయిలో వుండి ఇంగ్లీషు వాళ్ళకి స్నేహ పాత్రులుగా వుంటూ యెవరయితే ఇంగ్లీషు వాళ్ళు రాక ముందు నుంచీ సామాన్యుల్ని పీల్చి పిప్పి చేస్తూ వున్నారో వాళ్ళు కాంగ్రెసునీ స్వాతంత్రోద్యమాన్నీ 1945 వరకూ వ్యతిరేకిస్తూనే గడిపి చివరి దశలో జస్టిస్ పార్టీ లాంటి హడావిడిని కూడా చేసి ఆఖరి రోజుల్లో ఇంక స్వాతంత్ర్యం రావడం ఖాయమని తెలియగానే కాంగ్రెసు లోకి దూకేసి అప్పటి దాకా లెక్క లేనన్ని త్యాగాలు చేసిన పింగళి వెంకయ్య, గరిమెళ్ళ సత్యనారాయణ లాంటి వాళ్లని వెనక్కి నెట్టేసి ప్రజల ఆమోదంతో ప్రభుత్వాధినేతలుగా అవతరించారు! గాంధీ ఈ జగన్నాటక మంతా ఇలాగే జరిగేందుకు సూత్రధారిగా నిలబడి యెక్కడా ప్రాచీన భారత దేశపు సామాజిక చిహ్నాలయిన  కులాలూ మతాలూ వాటికున్న రాజకీయ ప్రాధాన్యతలూ యే మాత్రమూ కదల బారకుండా అన్యాయా లన్నింటినీ తెల్లోడి ఖాతాలో వేసేసి అప్పటి దాకా ఇంగ్లీషు వాళ్లతో కలిసి జనాన్ని చెండుకు తిన్న పాత కాలం రాజుల్నీ జమీందార్లనీ ఆదర్శవంతులయిన కొత్త రకం ప్రభువులుగా అవతరింప జేశాడు!

       ఇతనికి ఆపాదించిన "ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందించకుండా సాధించిన ఘనకార్యం" చాటున ఇతను సాధించిన నిజమయిన ఘనకార్యం యేమిటో అర్ధం చేసుకుంటే ఇతను మాట్లాడిన శాంతి, సత్యము, అహింస, ధర్మకర్తృత్వం అనేవి పరమ జుగుప్సాకరమయిన బూతుమాటల కన్నా వెగటు పుట్టిస్తాయి.

        నేను మొదటిసారి ఈ ఒక్క నెత్తురు బొట్టుకూడా చిందించకుండా అనే మాటను వినేటప్పటికే లాఠీ దెబ్బలకి లాలా సాబ్ అమరుడు కాగా దానికి ప్రతీకారంగా భగత్ సింగ్ బృందం సాందర్స్ ని చంపాలని అనుకోవడం, అందులో ఫెయిల్ అయినా అదే స్పూర్తితో హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ ని స్థాపించి వాళ్ళు చేసిన అజరామరమైన పోరాట గాధ నంతా చదివి వుండటంతో ఆశ్చర్య మనిపించింది? అదేంటి? యెంతో మంది త్యాగధనుల రక్తం యేరులై ప్రవహించినా ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందించకుండా సాధించాడు అంటారేమిటి - అని! గాంధీని అలా పొగిడేవాళ్ల లోనూ అసలు గాంధీ మనస్సులోనూ వున్న నిజమైన లక్ష్యం ఇంగ్లీషు వాళ్ల శరీరం నుంచి గానీ వాళ్లతో నాలుగింట మూడు వంతులుగా కలిసి అధికారంలో వున్న రాజవంశీయుల శరీరం నుంచి గానీ  ఒక్క నెత్తురు బొట్టును కూదా చిందనివ్వకుండా -  అనేది అర్ధమవటానికి నాకు చాలా కాలం పట్టింది!

         గాంధీ ఈ దేశంలో అడుగు పెట్టే నాటికి భారత దేశపు  రాజకీయ సామాజిక ఆర్ధిక చిత్రపట మంతా పరమ భీభత్సమయిన గందరగోళంలో వుంది. సామాజికంగా చదువుకున్న వాళ్ళంతా లండన్ వెళ్ళి లాయర్లుగా తిరిగొచ్చి ఇక్కడీ జమిందార్లకీ ఇంగ్లీషు వాళ్ళకీ సాయపడుతూ ప్రాక్టీసు పెంచుకుంటూ గడుపుతున్నారు. ఆ ఇంగ్లీషు వాళ్ళ ఆదర్శాలతోనే ప్రభావితమయి వారి ఆధిక్యత పట్ల తీవ్రమయిన వ్యతిరేకత లేని ఇప్పటి మాదిరి మామూలు కెరీరిష్టు జర్నలిష్టులే పత్రికా రంగంలో మేధావులుగా చలామణీ అవుతూ హల్చల్ చేస్తున్నారు. రాజకీయంగా నేను మొదటి భాగంలో చెప్పిన ప్రళయ త్రికోణం మరింత స్పష్టమైన రూపం ధరించింది. ఆర్ధికంగా మధ్య యుగాల నాటి నిలవనీరు లాంటి వ్యవసాయాధారితమయిన పాత అమరిక మీద ఇంగ్లీషు వాళ్ల పారిశ్రామిక విప్లవపు కొత్త అమరిక కూడా కలిసి ప్రజల్ని మరింత భయానక స్థితి లోకి నెట్టేసింది.ఈ కొత్త రకం ఆర్ధిక చట్రం యొక్క ఫలితమే ప్రపంచంలోనే అత్యంత దయనీయమయిన కరువుల్లో వొకటయిన బెంగాల్ కరువు.

      దేశ మంతటా తిరిగి ఈ వాతావరణాన్నంతా చూసిన గాంధీ దక్షిణాఫ్రికా మోడల్ ఇక్కడ పని చెయ్యదని తెలుసుకున్నాడు! జ్ఞానవృధ్ధుడయిన యువకిశోరం భగత్ సింగ్ లాగా అట్టడుగున వున్న సామాన్య ప్రజలకు మేలు కలిగించే సామ్యవాద స్పూర్తితో ప్రజల్ని చైతన్య వంతుల్ని చేసి తమ భావిని తామే తీర్చిదిద్దుకునే లాగా ప్రజల్ని నడిపించటం ఈ జ్ఞానఢింభకు డైన చీకుగద్ద లక్ష్యం కానే కాదు! అలాంటి లక్ష్యం పట్ల ఇతనికి ద్వేషం కూడా వుంది. అప్పటికే ప్రపంచం లోని అనేక దేశాల్లో పెల్లుబుకుతున్న ప్రజాస్వామిక సంస్కృతిని యెప్పటికయినా ఇక్కడా రాక తప్పదు గాబట్టి ఇక్కడికీ తీసుకురావదం, ఆ చట్రంలో అప్పుడున్న రాజవంశీయుల్ని వాళ్ళ ప్రాభవాలు యేమాత్రమూ తగ్గనివ్వని పధ్ధతిలో అమర్చటం అనేది ఇతను సాధించిన ఘనకార్యం. కుంజరయూధాన్ని దోమ కుత్తుకలో దూర్చటం అనే అనితర సాధ్యమయిన పనిని అంత ప్రతిభావంతంగా చెయ్యడం నిజంగా అద్భుతమే!

       దక్షిణాఫ్రికాలో యేనాడూ సామాన్య ప్రజల్ని భాగస్వాములుగా చేసే కార్యక్రమాల్ని రూపొందించని వాడు ఇక్కడ పూర్తిగా సామాన్య ప్రజల్ని ఆకర్షించటం మీదనే దృష్టి పెట్టాడు. అప్పటి దాకా రాజు మంచివాడయితే సంతోషంగా వుంటూ రాజు దుర్మార్గుడయితే తిరుగుబాటు చేసి మరొక రాజును తెచ్చుకుంటూ తమ కష్టాలకు కారణం దేముడి  దయ లేకపోవటమే నని సరిపెట్టుకోవటమే తప్ప - ఇప్పటికీ చాలామంది విద్యాధికులకి కూడా అర్ధం కానంత జటిలమయిన విషయాలు అవడం చేత - కరువులు ప్రభువుల దుర్మార్గమయిన ఆర్ధిక విన్యాసాల వల్లనే వస్తాయనీ వాటిని మార్చుకోకుండా ప్రభువుల్ని మారిస్తే ప్రయోజనం వుండదని తెలుసుకోలేని అమాయకుల ముందు మొదటిసారిగా ప్రజలకి మీ కష్టాలకి దేవుడు కారణం కాదు ఇక్కడివాళ్ళే అని చెప్పాలి, అలాగని ప్రజలు వాళ్లకి అలవాటయిన పధ్ధతిలో తిరుగుబాటు చెయ్యకుండా నిగ్రహించాలి. ప్రజలు హింసకి దిగితే తను ప్రభుత్వంలో అమర్చుదామనుకున్న వాళ్లకే ప్రమాదం మరి! అందుకనే చాలా మామూలు సంఘటన అయిన చౌరీ చౌరా ఘటనకి అంత అతిగా రియాక్ట్ అయి పక్కనున్న శుంఠలకి అది అర్ధం కాక వొద్దని మొత్తుకుంటున్నా వుద్యమం ఇంకొద్ది రోజులు గట్టిగా చేస్తే అప్పుడే స్వతంత్రం వొచ్చి వుండేదనిపించేటంత వూపులో వున్నప్పటికీ మొత్తం కార్యక్రమాన్నే ఆపేశాడు!

        1920లో కాంగ్రెసు పార్టీ పగ్గాలు చేపట్టినా అతి సుదీర్ఘ కాలాన్ని కింది స్థాయిలో ప్రజలకి అస్పృశ్యత గురించీ మద్యపాన నిషెధం గురించి చెప్పటానికీ పై స్థాయిలో సంధాన కర్త లాగా స్వరాజ్ పార్టీకీ కాంగ్రెసు పార్టీకీ రాజీ చెయ్యటం అనే గర్భాదాన ప్పంతులు పనికీ ఉపయోగించుకున్నాడు. 1930లో వుప్పు సత్యాగ్రహం మొదలు పెట్తేవరకూ అతడు చేసిందంతా ప్రజల్ని తను యేం చెప్తే అది నమ్మే విధంగా ప్రజల్ని సిధ్ధం చెయ్యటమే.

         వెనకటి కాలం లోని పిట్ట కధలో కొండని మోస్తానన్న వీరుడి లాగా మీరంతా నేను చెప్పినట్టు వింటే ఒక్క సంవత్సరంలో స్వతంత్రాన్ని తీసుకొస్తా నన్నాడు! మరి చూస్తావేం మొయ్యి అంటే యెవరయినా యెత్తి నా భుజాల మీద పెడితే మోస్తా నన్నాను గానీ నేనే యెత్తుతా ననలేదుగా మీరు యెత్తి నా భుజాల మీద పెడితే మొయ్యదానికి నేను యెప్పుడూ సిధ్ధమే నన్న ఆ పిట్టకధలోని హీరో లాగే మీరు నేను చెప్పినట్టు వినలేదుగా అని తేల్చి పారేశాడు?ఆ పిట్టకధ యెప్పట్నుంచో అందరికీ తెలిసిందే అయినా ఇంతమంది మేధావులూ పోలిక పట్టలేక ఈ కమెడియన్ ని అంత సీరియస్ గా నమ్మేశారంటే తెలివి తక్కువ మాటల్ని కూడా గంభీరంగా మోత మోగించడంలో ఇతని ప్రజ్ఞ నిరుపమానం!

             1918లో ఇంగ్లండు మొదటి ప్రపంచ యుధ్ధంలోకి దిగింది. బోయరు యుధ్ధంలో Indian Ambulance Corps తో సరిపెట్టిన ఇతడు ఈసారి బ్రిటిషు వాళ్ల తరపున భారతీయుల్ని యుధ్ధం చేయించడానికి సమరోత్సాహంతో కదిలాడు. "In a June 1918 leaflet entitled "Appeal for Enlistment", Gandhi wrote "To bring about such a state of things we should have the ability to defend ourselves, that is, the ability to bear arms and to use them...If we want to learn the use of arms with the greatest possible despatch, it is our duty to enlist ourselves in the army." He did, however, stipulate in a letter to the Viceroy's private secretary that he "personally will not kill or injure anybody, friend or foe." ఇప్పటిదాకా అంతా అచ్చ తెలుగులో రాసి ఇది మాత్రమే పక్కా ఇంగ్ల్లీషులో యెలా వున్నది అలాగే యెందుకు దించేశానో తెలుసా? యెలా అనువదించాలో అర్ధం కాలేదు, యెన్నో సంక్లిష్టమయిన విషయాల్ని అర్ధం చేసుకోగలిగిన నా మేధస్సు కూడా ఈ గందరగోళపు భావజాలం లోని అస్పష్టత ముందు దారుణంగా ఓడిపోయింది!

      ఇతని కిదేం పిచ్చ! తన కన్యాయం చేసారని వాళ్ళ మీద భీభత్సంగా పోరాడుతుంటాడు, అయినా వాళ్ల సొంత కారణాల తో వాళ్ళు వేరే వాళ్లతో యుధ్ధానికి వెళ్తే నేను కూడా సాయం చేస్తానని వురక లెత్తుతాడు? వ్యక్ర్తిగతంగా స్నేహితుణ్ణి గానీ శత్రువును గానీ చంపడటం ఇష్టం లేదట! యుధ్ధాల్లో యెంతమందిని చంపినా అభ్యంతరం లేదట! ఇంగ్లీషు వాళ్ళ శత్రువుల్ని చంపటానికి భారతీయులు సైనికులుగా వెళ్ళాలట! భారతీయులు ఇంగ్లీషు వాళ్లని మాత్రం చంపగూడదట! ఇదేమి అహింసా వాదం?

         బోయరు యుధ్ధంలో అపారమయిన ఇంగ్లీషు వాళ్ళ సైన్యాన్న్ని చూసి వీళ్ళ మీదకి ఆయుధాల్తో వెళ్తే మనల్ని చంపేస్తారు అనే చావుభయాన్నీ శత్రువుకి మనల్ని చంపెయ్యాలనేటంత కోపం రాకుండా చూసుకుంటే బతికుండి బలుసాకయినా తిని బతకొచ్చనే బతక నేర్చిన తెలివినీ కలిపేసి తయారు చేసిన తిక్క ఐడియాని కేవలం నైతికంగా వున్నతులు మాత్రమే పాటించగలిగిన బలమయిన ఆయుధం అని కోతలు కొయ్యటం Neighbors Envy Owners Prideని మించిన గొప్ప అడ్వర్టైజింగ్ టెక్నిక్!

       గాంధీలో కొన్ని లోపాలు వున్నప్పటికీ మొఠ్ఠ మొదటి సారిగా సామాన్య ప్రజలను రాజకీయంగా చైతన్యవంతులను చేసిఒక్క తాటి మీద నడిపించాడనిన్నీ, భిన్న సంసృతులతో కలగాపులగంగా వున్న ప్రజల్నందర్నీ బిన్నత్వంలో యేకత్వం పరిఢవిల్లే లాగ తీర్చి దిద్దాడనిన్నీ, అందువల్లనే స్వతంత్రం రాగానే మళ్ళీ ముక్కలు ముక్క లయ్యే ప్రమాదం తప్పిపోయి ఒక్కటిగా నిలబడిందనిన్నీ సుభాషితాలు చెప్తారు - మరీ తాము సమర్ధించలేని తప్పుల్ని యెదటి వాళ్ళు యెత్తి చూపిస్తూ ఇరుకున పెడుతున్నప్పుదు మధ్యేమార్గంగా రాజీ కొస్తూ! ఆ మహానుభావుడే లేకుంటే  దేశం అల్లకల్లోలమైపోయేదని భయపెట్టేస్తారు. కాని శ్రీవారు కొత్తగా జాతీయ సమగ్రతను సాధించినది తొలుత అనేక సంస్థానములుగా వుండి స్వాతంత్ర్యము తర్వాత తమ ప్రాభవము లేవియునూ చెదరని రీతిన ఒకే లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వము రూపములో నూత్న వేషములు ధరించి అవతరించిన సాంప్రదాయిక భారత మనుజేశ్వరాధములకు మాత్రమే! శ్రీవారి దృష్టిలో సామాన్య ప్రజలు తను చెప్పిన కార్యక్రమములు తు.చ తప్పక పాటించుటకు - చరఖా వడకుటకు, విదేశీవస్త్రాలను తగలబెట్టుటకు,ఇంగ్లీషు వారి తరపున యుధ్ధములలో పాల్గొని చచ్చుటకు మాత్రమే వుండిరి!

         మనది వ్యవసాయ ప్రధానమయిన దేశం. ప్రతి వ్యక్తికీ భూమితో అనుబంధం యెక్కువ. భూమితో అనుబంధం వున్న మనిషి యెక్కడున్నా ఒక్కలాగే వుంటాడు. అందరి కష్టాలూ కన్నీళ్ళూ ఒక్కలాగే వుంటాయి. మన ధార్మిక జీవనంలో వున్న తీర్ధయాత్రలూ, పుష్కరాలూ మనుషులు కలుస్తూ వుండేలా చేస్తూనే వున్నాయి. కొన్ని శతాబ్దాలకు ముందు నుంచే ఈ దేశ ప్రజలు వేషభాషలూ ఆచార వ్యవహారాలూ వేరయినా ఆసేతు శీతనగం ఒకే రకమయిన సంస్కారంలోనే వుండి ఐకమత్యంగానే వున్నారు. ఇంతకు ముందే వున్నదాన్ని ఇతను కొత్తగా పరిచయం చేశాడని అనటం గురువుకి శిష్యుడు పాఠాలు నేర్పినట్టు వుంటుంది!

        అసలు గాంధీ చెప్పింది సామాన్య ప్రజలకు అర్ధమే కాలేదు! ఈయన గారి పొంతన లేని అసమన్వయ సుత్తిని జనాలకి అర్ధ మయ్యెటట్టు చెప్పలేక పల్లెటూళ్ళలో తిరిగే కాంగ్రెసు కార్యకర్తలు "భారతీయులంతా కలిసి ఒక్కసారిగా వుమ్మేస్తే ఆ ప్రవాహంలో ఇంగ్లీషు వాళ్ళంతా లండన్ దాకా కొట్టుకు పోతారు" అనే జోకుల్తో అలరిస్తూ వుండేవాళ్ళు! అహింసాయుత పోరాతం లాంటి గంభీరమయిన విషయా లన్నీ చదువుకున్న వాళ్లే పత్రికల్లో చూసి తెలుసుకునే వాళ్ళు. ఇతను చెప్పిన గంభీరమయిన విషయాలు సైతం కాంగ్రెసు కార్యకర్తలకే యెక్కలేదు,  ఇంక సామాన్య ప్రజలకి అర్ధమయి యెలా అనుసరిస్తారు? అతను చెప్పిందంతా బుర్రలోకి యెక్కి అతని మీద నమ్మకమే వుంటే సుభాష్ చంద్ర బోసు పట్టాభి మీద అంత మెజార్టీతో యెలా గెలుస్తాడు? పైగా అక్కడ గాంధీ మొహం మీద పేలింది కింది నుంచి పైదాకా అంతరువులు అంతరువులుగా ప్రతినిధుల్ని యెన్నుకుంటూ వొచ్చిన అంతర్గత ప్రజాస్వామ్యమనే ఢాంబు! ఆ దెబ్బకి "నా బఠానీ వోడింది, నేనూ వోడినట్టే" అని చెప్పి కూడు మానేసి ముసుగు దన్ని పడుకున్నాడు. ముసలాడు చస్తాడని జాలిపడి కొందరూ, నిజంగానే బోసు గెలుపు నచ్చక కొందరూ మొత్తానికి బోసు గారిని గాంధీ గారి సహాయ నిరాకరణ మనే ఆయుధంతోనే బలవంతంగా రిజైను చేసి వెళ్ళిపోయేలా చేశారు. సాటి దేశభక్తుడి మీద ప్రయోగించినంత తీవ్రంగా ఇంగ్లీషు వాళ్ల మీద ప్రయోగించి వుంటే మనకి స్వతంత్రం ఇంకా చాలా ముందే వొచ్చి వుండేది! సరే, బోసుగారు రిజైన్ చెయ్యగానే తన బఠానీ గెలిచేసినట్టు మమ చెప్పేసుకుని తను కూడా ముసుగు తీసేసి మళ్ళీ రంగం లోకి దిగాడు.

          ఈ నిరాహార దీక్ష అనేది ఇవ్వాళ ప్రతివాడూ తనకి జరిగిన అన్యయానికి నిరసన తెల్పడానికి వాడుకుంటూ అది గాంధీ ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రమని అనుకుంటున్నాడు గానీ అతను మాత్రం చరఖా వడక మనటం, విదేశీ  వస్త్రాలని తగల బెట్ట మనటం, వుప్పు తయారు చెయ్య మనటం తప్ప ప్రజలకి నిరాహార దీక్ష గురించి పొరపాటున కూడా వుప్పుదేశించ లేదు!? దాన్ని ఇట్లా పార్టీలో తన మాట చెల్లుబడి కానప్పుడు బ్లాక్ మెయిలింగుకి మాత్రమే వాడుకునే వాడు!! సమిష్టి కార్యాచరణ జరుగుతున్న చోట యెదటి వాళ్లని బలమయిన వాదనతో గెలిచి వొప్పించి తన మాటకి కట్టుబడి నడుచుకునే లాగ చెయ్యటం, యెవరయినా తనకన్నా బలమయిన వాదన చేసి మెప్పిస్తే తను కూడా అతన్నే అనుసరించటం ప్రజాస్వామ్య స్పూర్తి గల నాయకుడి లక్షణం. దానికి విరుధ్ధంగా తన పాయింటు బలమయినది కాకపోయినా ఇతర కారణాలతో వొత్తిడి పెట్టి అందరూ తననే అనుసరించేలా చెయ్యటం అనేది నియంతృత్వం అయితే అది హిట్లర్ ఆక్టివ్ గా చేశాడు, గాంధీ పాసివ్ గా చేశాడు, అయినా మనం హిట్లర్నే నియంత అంటున్నాం గానీ గాంధీని అనలేక పోతున్నాం, యెందుకని?

         గాంధీ దక్షిణాఫ్రికాలో వుండగా బోయెరు యుధ్ధంలో పాల్గొన్నప్పుడూ ఇండియాలో మొదటి ప్రపంచ యుధ్ధంలో పాల్గొన్నప్పుదూ వాళ్లని యుధ్ధానంతరం కొన్ని సౌకర్యాలు అడిగాడు.యుధ్ధం ముగిశాక వాళ్ళు మాట తప్పేసి వాటికి తూచ్చి చెప్పినప్పుదు కనీసపు ప్రతిఘటన కూడా చెయ్యలేదు, యెందుకు? అసలు అడిగినవి కాదనడం కాదు - ఇచ్చిన మాట తప్పినందు కయినా నిలదీయాలి గదా! మనిషి శారీరకారోగ్యానికి సంబంధించిన రక్తలేమి వ్యాధి లాగా మానసికారోగ్యానికి సంబంధించిన క్షాత్రలేమి వ్యాధి పీడితు డితను! దానికి అంటువ్యాధి లక్షణాలు కూడా వున్నాయేమో ఇతరుల్లో మానసికంగా రోగ నిరోధక శక్తి తక్కువగా వుండి బౌధ్ధిక అలసత్వం యెక్కువగా వున్న వాళ్లందరికీ అంటించి పారేశాడు! ముఖ్యంగా ప్రజల్లో అంతకు ముందు వున్న క్షాత్రాన్ని చంపేసి దేబె మొహాల్లాగా తయారు చేశాడు. ఒకప్పుడు తమకు కష్టాలు కలిగించినందుకు నిరంకుశంగా వున్న రాజుల పైనే తిరుగుబాటు చేసి రాజ్యాల్నే తల్లకిందులు చేసిన వాళ్ళు ఇవ్వాళ తమ చుట్టూ ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా స్తబ్దుగా వుండటం, లేదంటే గుడారాలు పాతుకుని దండలు మెడలో వేసుకుని యేడుపు మొహాలతో మూలుగుతూ కాలం గడపటం చేస్తున్నారు కానీ,  వీటివల్ల వీళ్ళంతా సాధిస్తున్న దేమిటి?

       రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఇతనెప్పుడూ గడగడ లాడించనే లేదు! వీళ్ళు గొడవలు చెయ్యటం,  వాళ్ళు అణిచి వెయ్యటం, మరీ గొడవ యెక్కువయితే గుండ్రబల్ల ముచ్చట్లకి లండన్ పిలవటం, వీళ్ళేం మాత్లాడే వాళ్ళో వాళ్లేం మాట్లాడే వాళ్ళో గానీ ఆఖరికి వీళ్ళ డిమాండ్లని వొప్పుకోకుండానే వెనక్కి పంపించెయ్యటం లాంటి హడావిడే జరిగింది తప్ప ఇక్కణ్నించి వెళ్ళిపోవాలనే వూపు మాత్రం వాళ్లలో కలిగించలేకపోయారు. ఇంకా నేను  చదివిన విషయం ప్రకారం, "గాంధీ మాట రాజకీయ రంగంలో చెల్లుబడి అవుతున్నంత కాలం మనం భారత్ నుంచి వైదొలగడానికి తొందర పడటం అనవసరం" అనే అభిప్రాయంలో వుండే వాళ్ళు?ఇంగ్లీషు వాళ్లని నిజంగా భయపెట్టి తరిమేసిన ఒక నాటకీయమయిన అద్భుతం 1946లో జరిగింది.అది జరిగిన సంవత్సరం లోగా మనకి స్వతంత్రం ఇచ్చేసి ఆ గడువు దాటాక ఒక్క రోజు కూడా ఇక్కద వుండకూడదని ఆ రోజుకన్నా ముందే పిట్ట పురుగు కూడా లేకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే దాని పవరేమిటో అర్ధం చేసుకోవచ్చు!

         అదే నావికుల తిరుగుబాటు! ఫిబ్రవరి 18న నిప్పురవ్వ ఆహారం, మరియు సాధారణ మయిన అసౌకర్యాలకు సంబంధించిన సమ్మెగా రాజుకున్నా ప్రచండ వేగంతో విరుచుకు పడి అరణ్యాన్నంతా చుట్టెయ్యగలిగిన దావానలం లాగా మొత్తం దేశాన్నంతటినీ కదిలించింది!  ప్రారబ్దం యేమిటంటే మన వాళ్ళకి దీని ప్రాముఖ్యత తెలియక పటేల్ లాంటి వాళ్ళు యెప్పుడో విప్పేసిన నల్లకోట్లు మళ్ళీ తొడిగి వాళ్ళ కేసుని వాదించారు అనే చిన్న వివరం తప్ప యెక్కువగా చెప్పలేదు. కానీ ఇంగ్లీషు వాళ్ల వైపు నుంచి చూస్తే గానీ దాని ప్రాధాన్యత తెలియదు. వలస రాజ్యాల్ని తమ పట్తులో వుంచుకోవటానికీ, తిరుగుబాట్లనై అణిచివెయ్యటానికి సైన్యాన్ని కదిలించటానికీ అతి ముఖ్యమైనది నౌకా దళం! అక్కడ తిరుగుబాటు జరగట మంటే ఆయువుపట్టు మీద దెబ్బ తగలటమే!

          కమ్యునిష్టులు అతిగా వుత్సాహ పరచటం వల్ల దీనికి ప్రాధాన్యత ఇస్తే వాళ్లని పెంచినట్టు అవుతుందనే కారణం కావచ్చు గానీ కాంగ్రెసు మొదట చూపించినంత వుత్సాహం చూపించ లేదు. మార్చ్ 3 స్టేట్మెంట్ ప్రకార మయితే  గాంధీ దాన్ని తీవ్రంగా విమర్శించేశాడు కూడాను!? వాళ్ళకి గనక సరయిన నాయకత్వం దొరికి వుంటే ఈ దేశం అఖండం గానే స్వాతంత్ర్యాన్ని సిధ్ధింప జేసుకుని వుండేదేమో ననిపిస్తుంది, యెందుకంటే ఆశ్చర్యకరంగా ముస్లిములు కూడా నావికా పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని వ్యక్తం చేసారు!

          నాదో చిన్న అనుమానం! అంత పిరికిగా  వ్యతిరేకత వచ్చిన రెండేళ్లలోనే అదిరి పడి పారిపోయిన వాళ్ళు, అదీ ఈ దేశజనభాలో 5% మించని వాళ్ళూ అన్నేళ్ళ పాటు అంత మొండిగా అన్ని దుర్మార్గాలు యెట్లా చెయ్యగలిగారు?పైస్థాయిలో వున్న మనుజేశ్వరాధములు అరాచకం పేరుతో హడావుడి చేసి పోలీసుల్నీ సైన్యాన్నీ ఇంగ్లీషువాళ్ళ పేరు మీద పంపిస్తే ఈ బానిసాధముడి నట్టువాంగం మేజువాణీ గాళ్ళు ఆ పోలీసుల్ని ఇంగ్లీషు వాళ్ళ దౌష్ట్యానికి చిహ్నంగా చూపించి డబుల్ గేము యేదయినా అడారా?వాళ్ళూ వీళ్ళూ యేం చేసినా మరో నరమానవుడికి తెలియకుండా చేశా మనుకున్నారు గానీ పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడు యెవరి కేది వెయ్యాలో అది వేసేశాడు! ఒకనాడు తమది రవి అస్తమించని సామ్రాజ్యం అని మిడిసి పడిన వాళ్ళు ఇవ్వాళ యెక్కడ వుదయిస్తున్నాడో తెలియని అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు! ఒకనాడు ఈ దేశాన్ని పరిపాలించే అర్హత తమకే వుందని విర్రవీగిన వాళ్ళు ఇవ్వాళ  ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక పోయి - కన్నీరు మున్నెరుగా విలపిస్తూ యెక్కే గడపా దిగే గడపా అన్నట్టు అందరినీ దేబిరిస్తూ - నాలాంటి వాళ్లకు మహదానందాన్ని కలిగిస్తున్నారు! పాపపుణ్యాలు తమ ఫలితాల్ని తప్పక చూపిస్తాయి -  అది యెరిగిన వాళ్ళు వినయంగా వుండి ప్రజామోదాన్ని పొందుతారు,యెరగని వాళ్ళు ఇవ్వాళ కాంగ్రెసుకు పట్టిన అధికారాంత మందు జూడవలె గదా అయ్యల సౌభాగ్యము లనే దుస్థితిని అనుభవిస్తారు!

        ఇతరేతర కారణాలతో సిద్ధించినా ఫలితాన్ని మాత్రం గాంధీ నేతృత్వం లోని కాంగ్రెసు పార్టీకి దఖలు పరుస్తూ 1947 ఆగస్ట్ 15న భారత్ దేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించదంతో భారత రాజకీయ చరిత్రలో మోహన్ దాస్ కరం చంద్ గాంధీ యొక్క చారిత్రక ప్రాధాన్యత ముగిసి పోయింది. మరో నాటకీయమయిన సన్నివేశంలో గాడ్సే అనే పుణ్యాత్ముడు గాంధీని భౌతికంగా గూడా ఈ ప్రపంచం నుంచి పంపించి వేశాడు! ఒక పాత్ర ముగియగానే మరొక పాత్ర రావాల్సిన నాటక రంగ సాంప్రదాయం ప్రకారం భారత రాజకీయ రంగాన్ని శాసించేందుకు మరొక సామ్రాట్టు ఆవిర్భవించాడు! అతని కంటె ఘనుడు అతని శిష్యుడు అన్నట్టు గురువు గారి కిష్టమయిన పన్లేవీ చేయక పోయినా గురువుగారు చెప్పని వాట్ని కూడా గురువు పేరుతోనే ఝణాయించుకోగలిగిన ఆషాఢభూతి వంటి జవర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధానిగా రంగ ప్రవేశం చేశాడు!

          గాంధీ చేసిన అసలు మాజిక్ ప్రజలకి తాము సరికొత్త ప్రజాస్వామ్యబధ్ధమయిన రాజకీయ వ్యవస్థలో వున్నట్టు భ్రమింప జేస్తూనే పాతకాలపు రాజస్వామ్యాన్నే పార్టీ అద్యక్షుల కుటుంబస్వామ్యం రూపంలో కనిపిస్తూనే వున్నా  అది సహజమే నన్నట్టుగా ఆలోచించేలాగా ప్రజల మైండ్సెట్ ని మార్చటం! చరిత్ర కందని కాలం నుంచీ ఈ దేశంలోని మనుజేస్వరాధములు యెన్ని శతాబ్దాల పాటు ప్రయత్నించినా చెయ్యలేని దానిని కేవలం పాతికేళ్ళలో చేసి చూపించాడు! అందుకేనేమో ఇతన్ని దైవాంశ సభూతుడి గానూ అవతార పురుషుడి గానూ వాళ్ళు కీర్తిస్తున్నది!

      మోహన్ దాస్ కరం చంద్ గాంధీ అనబడే ఈ వ్యక్తి యొక్క గందరగోళపు భావజాలం నుంచి పూర్తిగా బయట పడిన క్షణం ఉంచే సత్యధర్మన్యాయ ప్రతిష్ఠితమైన వ్యాస పరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం వున్న మన గురు పరంపర నిండు మనస్సుతో హర్షించే నిజమయిన ప్రస్ఠాన యాత్రలో  భారత దేశం తొలి అడుగు వేస్తుంది!


ఒకడేమిటో వాడి చావు చెబుతుందంటారు, ఈ అహింసావాది బుల్లెట్ తో చచ్చాడు!?
______________________________________________________
1    2    3    4    5    6

Tuesday, 2 September 2014

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని చీలికలు పేలికలు చేసి చిందర వందర చెయ్యాల్సిన దౌర్భాగ్యం దేనికి?

        ఒక రాష్ట్ర్రానికి గానీ దేశానికి గానీ రాజధాని ఒక ఇంటికి తల వాకిలి లాంటిది. అలాంటి దాని విషయంలో యెందుకింత బీద అరుపులు అరుస్తున్నారు? రాజధానిని వికేంద్రీకరించట మేమిటి నా బొంద? రాజధాని అంటే ఏమిటి? సెక్రటేరియట్, అసెంబ్లీ,హై కోర్టు ఇంకా రాష్ట్ర పరిధిలో వుందాల్సిన శాఖల ముఖ్య కార్యాలయాలు. వీట్ని తలో చోటా తగలేస్తే పరిపాలన యెలా వుంటుందో తెలుసా? ఇప్పటికీ డాక్యుమెంటేషన్ అంతా పేపర్ వర్క్ తోనే జరుగుతుంది కదా! ఒక ఫైలు ఒక శాఖ నుంచి మరో శాఖకి వెళ్ళాలంటే పొరుగూరు వెళ్ళాలా?

     ఇదివరలో జరిగింది ఒక వైపు నుంచే చూస్తే తప్పు జరిగినట్టుగానే అనిపిస్తుంది.ఇవ్వాళ గయ్యాళిగా మాట్లాడుతున్న తెలంగాణా కుమేధావుల మాటలు నమ్మితే నిజంగానే మనం సిగ్గుతో తల దించుకోవాలనే అనిపిస్తుంది!కానీ యేమంటున్నారు వాళ్ళు, మా వుద్యోగాల్ని దోచుకున్నారు - కావాలంటే గిర్గ్లానీ రిపోర్టు చూడ మన్నారు.చూశాను, ఒక పోష్టు గూడా వేశాను, యేముంది అందులో? అన్యాయం జరగడం అంటూ వుంటే అన్ని ప్రాంతాల వారికీ జరిగిందని ఖచ్చితంగా చెప్పాడు.మిగతా యే ప్రాంతాల వారికీ అన్యాయం జరక్కుండానో, లేదా మిగతా అన్ని ప్రాంతాల వారికీ విపరీతంగా లాభం చెకూరి వీళ్ళు ఒక్కరికే అన్యాయం జరిగితే కదా ఆ మాట అనాల్సింది?ఒక పత్రికా విలేఖరి మరీ సూటిగా యెవరు నష్ట పోయారు?యెవరు లాభ పడ్డారు అని అడిగితే "అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి వెళ్ళగలిగిన వాళ్ళు బాగు పడ్డారు, వెళ్ళ లేని వాళ్ళు నష్ట పోయారు" - అని అంతకన్నా సూటిగా జవాబు చెప్పాడు. దాని భావ మేమిటో యే తిరుమలేశుణ్ణీ అడగనక్కర్లేదు కదా?చిన్న పిల్లవాడి నడిగినా చెప్తాడు, ఇంకా "అదేంటి?అయితే యెక్కడో వున్న కృష్ణా జిల్లాల వాళ్ళు అంత దూరంలో వున్న హైదరాబాదుకి వెళ్ళి బాగు పడగలిగినప్పుడు, పక్కనే వున్న వాళ్ళు కూడా వెళ్ళి బాగుపడితే బాగుండేది కదా? వెళ్ళగలిగితే బాగు పడతామని తెలిసినప్పుడు వెళ్ళి బాగు పడకుండా యాభయ్యేళ్ళు యేమి చెస్తున్నట్టు?" అని కూడా అడుగుతాడు!నా లాంటి తింగరోడు పక్కనే వుంటే , "బహుశా యాభయ్యేళ్ళయినా వందేళ్ళయినా ఆ ఆంధ్రోళ్ళని అక్కణ్ణించి తరిమి కొట్టాకే వెళ్ళి బాగు పడదాంలే అనుకుంటూ, యే మహానుభావుడు వచ్చి ఆ ఆంధ్రోళ్లని తరిమికొడతాడా అని జపతపాలు చేస్తూ కూర్చున్నారేమోలే" అని ఓ వంకర కూత కూస్తాడు!!

     విడిపోయిన ఇంత కాలం తర్వాత కూడా యెప్పుడో యేభయ్యేళ్ళ క్రితం నాటి కర్నూలు గుడారాల్ని యెత్తి చూపించి వెక్కిరించే వాళ్ళని అమాయకులని నమ్మడం వల్లా, వాళ్ళ తింగరి వాదనల్ని మొగ్గలోనే తుంచెయ్యని మన వెనకటి తరం నాయకుల అలసత్వం వల్లా ఇదంతా జరిగింది! అంతకు మించి అక్కడ అందరూ అనుకున్న భీభత్సాలు యేమీ జరగలేదు. పోనీ జరిగాయనే అనుకుందాం, ఇప్పటి పరిస్థితి యేమిటి? కలిసుండటం వల్లనే  మా కన్యాయం జరిగిందని విడిపోతే యే న్యాయం వెయ్యి కాంతులతో వికసిస్తుందని వాళ్ళు అంటున్నారో ఇవ్వాళ్టి తెలంగాణా ఆ నమ్మకాన్ని కలిగించే విధంగా వుందా?యెన్నికల్లో గెలిచి మంత్రివర్గంలో వున్నవాళ్ళలో గానీ అక్కడ పై స్థాయిలో చక్రం తిప్పుతున్న వాళ్ళలో గానీ ఆ నమ్మకాన్ని కలిగించే కొత్త ముఖాలు మీ కెక్కడయినా కనబడినాయా?కేసీఆర్ కుటుంబమూ, రెడ్లూ మరియూ వెలమలూ హవా హవాయీ అన్నట్టుగా వున్నారు! కోడి పోయి కత్తి వచ్చె డం డం డం అన్నట్టు ఆంధ్రా రెడ్లు పోయి తెలంగాణా రెడ్లు వచ్చె డం డం డం అనేట్టుగా వున్న ఈ కొత్త సీసాలో పాత సారా తంతు కోసమేనా అంతగా అంగ లార్చింది?

      సరే జరిగిందేదో జరిగింది, పరిదికి మించి గతాన్ని తవ్వుకోవడం వల్ల ప్రయోజన మేముంది?కానీ కొన్ని దారుణ మయిన మాటలు ఇప్పటికీ బాధ పెడుతున్నాయి!మనం తమిళుల నుంచి విడి పోతా మన్నప్పుడు మొదట్లో వ్యతిరేకించినా తర్వాత వాళ్ళు కూడా వొప్పుకుని కోరం సరిపోక పోతే వాళ్ళు కూడా మన వైపు వోటు వేసి సాయం చేస్తే తమిళులతో తన్నించుకుని వచ్చారు అని కూశారు!మద్రాసు నుంచి వెళ్ళ మనటం కూడా మంచిగానే అడిగారు, యెప్పటి కయినా వెళ్ళాల్సిందే గదా, వుంటే ఇంకా అనుబంధం పెంచుకున్నట్టు వుంటుందని, వుండటం వల్ల మొహమాటాలు పెరుగుతాయి, లేని పోని సమస్యలు వస్తాయి అని ప్రస్తావిస్తే మనం కూడా నిజమే లెమ్మని వచ్చెశాం. అయినా ఇప్పుడు ఈనాటి రోజున నీ ముందు లగడపాటీ మరొకడూ వుండి వుండవచ్చు - కానీ ఆనాటి సన్నివేశాన్ని తన్నించుకుని రావడం అంటే అప్పుడు అక్కడ వున్న ప్రకాశం పంతులూ పొట్టి శ్రీరాములూ వున్నారు కదా ఆ మాట వాళ్ళకేగా తగిలేది?!

         మనం తప్పు చెయ్యలేదు, సగర్వంగా తల యెత్తుకునే తిరుగుదాం. ఆంధ్రావాళ్ళు యెక్కడున్నా ముందు వరస లోనే వుంటారు. యెక్కడయినా సరే గొప్పగా వుండాలని అనుకుంటాం. వుంటాం. తెలంగాణా వాళ్ళు మాటిమాటికీ గుజరాతీల్ని కడుపులో బెట్టుకున్నాం, మార్వాడీల్ని కడుపులో బెట్టుకున్నాం, వాళ్లని కడుపులో బెట్తుకున్నాం వీళ్లని కడుపులో బెట్టుకున్నాం మీతోనే తంటా అని అంటున్నారే, ఆ మతలబు యేంటో తెలుసా? ఆ గుజరాతీలకి తెలంగాణా సొంత ఇల్లు కాదు, వాళ్ళ మూలాలు గుజరాత్ లో వున్నాయనేది వాళ్ళకీ వీళ్ళకీ గూడా తెలుసు, పుట్టుక నుంచీ పెళ్ళిళ్ళూ అన్నీ వాళ్ళళ్ళో వాళ్ళే చేసుకుంటారు, పండగ లొస్తే గుజరాతు లో వున్న చుట్టాల ఇంటికే వెళ్తారు, మన ప్రాంతంలో వున్న గుజరాతీల్లాగే - మనకి తెలియదా? మనం కూడా అలాగే తెలంగాణాలో పరాయి వాళ్ళుగా వుంటూ వాళ్ళకి వొదిగి వుంటే మనం మంచివాళ్ళం అయి వుండే వాళ్లమేమో? అది మనకి సరిపడనిది కదా! యెక్కడున్నా షరతులూ వొత్తిళ్ళూ మనకి గిట్టవు, స్వేచ్చగా ఒక యెకరం భూమిని కూడా కొనుక్కోకుండా స్వంతం అనే భావన లేని చోట బతకడాన్నే బానిస బతుకంటారు, వాళ్ళు పెద్ద మనుషుల వొప్పందం పేరుతో మనల్ని కూడా అలాగే వుంచాలనుకున్నారు! నేను చెప్తున్నానుగా, మనకి ఇక్కడ రాజధాని యేర్పడిన మరుక్షణం నుంచీ మెడ మీద తలకాయ వున్న ఆంధ్రా వాడెవ్వడూ తెలంగాణాలో వుండడు - వీళ్ళింకా కర్నూలు గుడారాల గురించి వంకర కూతలు కూస్తూ వుంటే, అది ఖాయం! వుండాలనుకున్నా మనం వుండనివ్వకూడదు, యెందుకంటే మన వాళ్ళు వాళ్ల ప్రభుత్వానికి పన్నులు కట్టటం ద్వారా మన ఆదాయాన్ని వాళ్లకి సమర్పిస్తున్నట్టు లెఖ్ఖ! మన వాళ్ళ విగ్రహాలనే టాంక్ బండ్ మీద భరించ లేని చోట మన మెందుకు వుండాలి? వున్నందు వల్ల వాళ్ళు మనకి మెచ్చి మేకతోలు కప్పబోతారా?

         కాబట్టి ఇప్పుదు మనం యెవరి సొల్లు కబుర్లకీ విలువ ఇవ్వనక్కర్లేదు, హైదరాబాదును తలదన్నే బలమయిన రాజధానిని కట్టుకోవాలి! రాజధాని మొత్తం తిరిగి చూస్తే చాలు రాష్ట్రమంతా తిరిగి చూసిన అనుభూతి కలగాలి!! సారవంతమయిన వ్యవసాయ భూములు వున్నాయి.పొడుగాటి సముద్ర తీరం వుంది, యెన్నో రేవు పట్నాలు వున్నాయి - మనం నంగిరి పింగిరిగా బతకాల్సిన పని లేదు!!

      మొత్తం 13 జిల్లాల లోని ప్రజ లందరికీ అభివృధ్ధి లో తప్పకుండా వాటా వుంటుంది.వుండక పోతే పోట్లాడి అయినా సాధించుకోవాలి. కానీ రాజధాని విషయంలో మాత్రం మా ప్రాంతంలో వుండాలంటే మా ప్రాంతంలో వుండాలనె మూర్ఖత్వాలకి పోకండి. అది చాలా తప్పు, రాజధాని అనేది యే వొక్క ప్రాంతం వారికో స్టాటస్ సింబల్ కాదు. మొత్తం రాష్ట్ర ప్రజ లందరికీ హక్కు వుంటుంది, వుండి తీరాలి - అలోచించండి! చెన్నయ్ నుంచి తన్నించుకుని వచ్చారు, మా హైదరాబాదుని లాక్కున్నారు అనే మాటలు పడ్డాం, దానికి జవాబు చెప్పాల్సిన సమయంలో మనం గందరగోళానికి గురి కావటం వల్ల నవ్వుల పాలవుతాం.

        దేని గురించి సందేహ పడాలి మనం?ఈ సుదీర్ఘమయిన విభజన అనే రాజ్యాంగ పరమయిన ప్రక్రియని మొదలు పెట్టిన  గత కేంద్ర ప్రభుత్వం మనకి వాగ్దానం చేసింది రాజధాని నిర్మాణం కోసం సహాయం చేస్తామని. ప్రభుత్వ మర్యాద ప్రకారం గత ప్రభుత్వం చేసిన వాగ్దనాన్ని ఇప్పటి ప్రభుత్వం కూడా పాటించి తీరాలి. ఒక వేళ యే తొండి రాజకీయాల వల్ల నయినా కేంద్ర సాయం అందకపోయినా మన సొంత బాధ్యతగా మనం రాజధానిని కూడా కట్టుకోలేని దుస్థితిలో వున్నామా?ఒకటి గుర్తుంచుకోండి ఇప్పటికీ దేశాల మధ్యన ఖండాల మధ్యన సరుకు రావాణా సముద్రం ద్వారానే జరుగుతున్నది. ఇన్నాళ్ళుగా మనం పాడుబడేసిన సముద్ర తీరాన్ని వుపయోగించుకుందాం. వాళ్ళు సింగపూరు వెళ్ళి పాఠాలు నేర్చుకునే టైములో మనం ఆ సింగపూరునే ఇక్కడ చూపిద్దాం. అది అసంభవ మేమీ కాదు, వీళ్ళంతా చూసి మురిసి ముక్క లవుతున్న అక్కడి లాండ్ స్కేప్ గొప్ప యేమిటి?ఆ సిమెంటు కట్టడాలూ, తారు రోడ్లూ ఇక్కడా కట్టగలం, అయినా వుభయ గోదావరి జిల్లాలలో కనిపించే సహజమయిన ప్రకృతి సౌందర్యంతో తొణికిస లాడే లాండ్ స్కేప్ తో పోల్చి చూడండి, అంతకన్నా గొప్ప దృశ్యాలనే చూపించగలం మనం!

       నాకు వ్యక్తిగతంగా చంద్రబాబు మీద యే విధమయిన అభిమానమూ లేదు.రామారావును పడగొట్టటం అనేది కిరాతకమయిన పనే, దానికి సంబంధించిన కోపం కూడా వుంది.అప్పట్లో నేను రామారావు హాజరయిన ఒక అవధాన కార్యక్రమాన్ని చూశాను.అందరూ అతన్ని గుర్తు పట్టే డ్రామా డయలాగులూ ఆంగికాభినయమూ యేదీ లేకుండా, "యేమో, యేమవుతామో,భవిష్యత్తు యెట్లా వుందబోతుందో, మన తర్వాత తరం వాళ్ళు ఈ సంస్కృతిని యెట్లా కాపాడుకుంటారో అని ఆందోళనగా వుంది" అని చాలా ఫీలవుతూ మాట్లాడాడు. ఆ మాట తీరు చూస్తేనే అంతకు ముందున్న డ్రమెటిజం పోయి ప్రాక్టికల్గా మారాడని అనిపించింది. అలాంటి టైములో పడగొట్టటం దారుణ మనిపించింది. తరవాత్తరవాత కాలం గడిచే కొద్దీ  సర్దుకున్నాను, కాంగ్రెసోళ్ళ పదేళ్ల నిర్వాకం చూశాక వీళ్ళ కన్నా చాలా మెరుగు కదా అనిపించి ఇంకొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు ఈ యుగసంధిలో అతని నాయకత్వం మనకి తప్పని సరి.చంద్రబాబుకి ఈ రాష్ట్రానికి తను యేది చేసి చూపించాలన్నా ఇదే ఆఖరి అవకాశం. తనకీ తెలుసు ననుకుంటాను.విజన్7 ఇంకా సూపర్ సెవెన్ అనీ తను చెప్తున్న వాటిల్ల్లో మంచి ప్రాక్టికాలిటీ వుంది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అనేది కూడా మంచి ఆలొచనే. ఇవన్నీ మంచి ఫలితాల నిస్తే రేపటి రోజున యెలా బతకాలి అనేదానికి దేశానికే కాదు ప్రపంచానికే కొత్తదారులు చూపించగలం - తెలంగాణా వాళ్ళతో సహా! ఇలాంటి సమయంలో మనలో మనం చిన్న చిన్న విషయాలకి గొదవలు పడకుండా కలిసికట్టుగా కదలాలి.

      సచివాలయం, శాసన  సభ అనేవి కేవలం సిమెంటూ ఇటుకలూ కలిపి కట్టిన కట్టడాల లాగా వుండకుండా మన చరిత్రనీ సంస్కృతినీ ప్రతిబింబించే అంశాల్ని నిర్మాణంలో వుపయోగించుకోవాలి. వాస్తులో ఈశాన్యం నుయ్యి ఆగ్నేయం పొయ్యి అని మూఢనమ్మకాల్లా అనిపించేవి కాకుండా కొన్ని మంచి విషయాలు వున్నాయి. వుదాహరణకి కిటికీలూ తలుపులూ సరిసంఖ్యలో యెదురెదురుగా వుండాలనేది. అది గాలి ధారాళంగా ఇటు వైపు నుంచి అటు వైపుకి  ప్రవహించదానికి వుపయోగ పడుతుంది.యెంత వేసవి లో నైనా గాలి కదులుతూ వుంటే హాయిగానే వుంటుంది, గమనించారా? తుఫాన్లు వచ్చినప్పుడు కూడా తలుపు లన్నిట్నీ తెరిచి వుంచితే నీటి వేగం మొత్తం ఇంటిని కూల్చెయ్యకుండా ఇటు వైపు నుంచీ అటు వైపుకి సాఫీగా వెళ్ళిపోతుంది. ఇలాంటి వాట్ని ఇప్పుడు కూడా వుపయోగించుకోవచ్చు. గోల్కొండ కోటలో ఇట్లాగే గాలిని వొంపులు తిప్పి సహజమయిన యేసీ గదిని ఒకదాన్ని యేర్పాటు చేసారని చదివాను. ఇళ్ళలో కూడా ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే కరెంటుని అతిగా వాడటం తగ్గుతుంది.

      ఇక్కడ చెన్నయ్ లో వళ్ళువార్ కొట్టంలో నేను ఒక మంచి విషయాన్ని చూశాను.వీళ్ళ చరిత్ర లోనూ సాహిత్యం లోనూ వున్న మంచి మంచి దృశ్యాల్ని గోడల మీద బొమ్మలుగా నిలబెట్టారు.సచివాలయ శాసన సభా భవనాల్లో కూడా కారిడార్లలో ఇలాంటివి వుంచాలి. బయట రోడ్దు మీద వెధవ పన్లు చేసే వాడయినా యేదయినా గుడిలో అడుగు పెట్టగానే యెంత బుధ్ధిమంతుడయి పోతాడో చూడండి! ఇక్కడ కూడా చుట్టూ వుండే వాతావరణం పవిత్రంగా వున్నప్పుడు దాని ఫలితం తప్పకుండా కనబడుతుంది!!
                                               సీ|| మేలు జరుగుగాక మేదినిపై గల
                                                       సకల జనులకు - స్వస్తి భవతు!

                                                       రక్షించబడు గాక రమణులు,వృధ్ధులున్,
                                                       శిశువు లనాధలున్ - స్వస్తి భవతు!

                                                       కలియుగాక సఫలకర్ములై దేశదే
                                                       శాల పౌరజనులు - స్వస్తి భవతు!

                                                        నశియించి పోవలె నీచులున్, దుర్మతుల్
                                                        శాంతమార్గముననె - స్వస్తి భవతు!

                                               తే|| చెలుల కిష్టులౌ మగలార స్వస్తి భవతు!
                                                       చదువు చెప్పు గురువులార స్వస్తి భవతు!
                                                       సమత పెంచు నాయకులార స్వస్తి భవతు!
                                                       సేద్య మొనరించు సైరికా స్వస్తి భవతు!!

(04/06/1996)



కంగారు పడకండి, అనుమాన మక్కర్లేదు - మనకి అంతా మంచే జరుగుతుంది!
--------------------------------------------------------------------------------------------------------

Friday, 29 August 2014

రాజు లంతా ఒక రకంగానే వుంటారా?నిజామునీ కృష్ణదేవరాయల్నీ ఒకే గాటన కట్టెయ్యొచ్చా?

సీ||          వెలిసిన గోడపై వేసిన మసకలు
                 గమ్మిన బొమ్మలు కదిలి నట్లు

                  తోచు మార్మిక చిత్రతోరణాలు! తెగ వే
                  ధించెడి మనను బాధించెడి గత

                  కాలపు గాయాల్ని కళ్ళకు మరల మ
                  రల చూపించెడి హర్రరులు! హుషారు

                  లను పెంచు ఫాంటసీలు!చదివి చూడవోయ్
                  మమ్మల్ని తెలుసుకో మనసు మర్మ

తే||            మంటు చాలెంజి విసిరేటి పజిలు గళ్ళు!
                   మనసు భాషను తెలిపేటి మార్మికాల
                   లెక్క తేల్చేటి పదనిధులు! గహనాలు!
                   నిదర చెట్టుకు పూసేటి విరులు- కలలు!!
(23/07/2014)
______________________________________________________
పదనిధులు=vocabulary(list of key words)
______________________________________________________


         విజయవాడ లయోలా కాలేజిలో చదివుకునేటప్పుడు నేనూ మా ఫ్రెండూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాం.మా కాలపు కుర్రాళ్లకి ఘంటసాల ఇంకా టచ్ లోనే వున్నాడుగా, వాడు హఠాత్తుగా ఒక ఘంటసాల పాట యెత్తుకున్నాడు, "బ్రతుకంత బాధగా కన్నీటి ధారగా" అని.వెంటనే దానికి జవాబుగా  నేను, "బ్రతుకూ కన్నీటి ధారల లోనే బలి చేయకూ" అని యెత్తుకున్నా8=P)

           తెగ నవ్వుకున్నాం, ఈ సినిమా పాటలు రాసేవాళ్ళు యే మూడ్లో వుంటే ఆ మూడ్ కి పనికొచ్చే పాట రెడీగా వుంచారు, బహుశా ఆ రెండు పాటలూ ఒకడే రాసినా ఆశ్చర్యపోనక్కర లేదు గదా!కొన్ని పాటలయితే బహురూపుల మాదిరి ఒకే పాట యే మూడ్ లో వుంటే ఆ అర్ధానికి పనికొస్తాయి. అలాంటివాటిలో ఒకటి, "ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం" - అదే యేడుపు పాటా, అదే వోదార్పు పాటా అవుతుంది మరి!

           కవిత్వంతో పని లేని వాళ్ళు బండిచక్రంతో పోలుస్తారు కాలాన్ని, తిరుగుతూ వుంటే పై ఆకు కిందకీ కిద ఆకు పైకీ వస్తాయని.కానీ నాకు ఈ పోలిక తప్పనిపిస్తుంది, యెందుకంటే రిపీట్ అవుతున్నవి సన్నివేశాలు కాదు, మన భావాలు మాత్రమే!ఒకసారి తప్పు చేసేశాక దిద్దుకోవటం అసంభవం, ఫలితాన్ని అనుభవించటమే శరణ్యం. స్ప్రింగు పై నుంచి చూస్తే సర్కిల్ లాగ కనపడినా పక్క నుంచి చూస్తే యే రెండు పాయింట్లూ కలవవని.

        మనిషి బతుకూ అంతే, ఒకసారి చేసిన తప్పుని దిద్దుకోవటం కుదరదు - పరిహారం చెల్లించుకోవటమూ తప్పదు!గతంలో చేసిన తప్పులకు యేడుస్తూ కూచున్నా ముందు కెళ్ళలేం! ఇతర్లు చేసిన తప్పుల నుంచీ వాళ్లకి తగిలిన దెబ్బల నుంచీ నేర్చుకోవటం ద్వారానే మనం తప్పులు చెయ్యకుండా వుందగలుగుతాం. అన్నీ మన స్వానుభవం మీదనే నేర్చుకోవద మంటే నిప్పు కాలుతుందిరా అంటే చెయ్యి పెట్టి చూసి తెలుసుకుంటా ననడం లా వుంటుంది!

          గడపలకి పసుపు రాయడం నుంచి బొడ్డుతాడు దాచటం వరకూ మన పెద్దవాళ్ళు యెంతో అనుభవసారాన్ని మన కందించారు, యేమి లాభం?నపుంసకుడికి లావణ్యవతిని కట్టబెట్టినట్టుంది ఇవ్వాళ్టి పరిస్థితి! యెప్పటి కప్పుడే యెప్పటి దప్పుడే అనే ధోరణి పెరిగి ఒకప్పుడు యేం జరిగింది, దానివల్ల ఇవ్వాళ్టి మనం యెలా ప్రభావితుల మవుతున్నామో తెలిస్తే గదా ఇవ్వాళ మనం చేస్తున్న పనుల వల్ల మన తర్వాత తరం వాళ్ళ బతుకులు యెలా ప్రభావిత మవుతాయో తెలిసేది?అందుకే మనవాళ్ళు మానవజాతి మనుగడని ప్రవాహం తో పోల్చారు. నిన్నా నేడూ రేపూ ల మధ్యన చక్కని సమన్వయంతో సాగే ఆ ప్రవాహం దారిలో వూషర క్షేత్రాలు పెరగదంతో కొంచెం బలహీన పడింది!

       ఈ దేశ చరిత్రలోని కొన్ని అనివార్యతలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి.అనివార్యత అంటే ఒకటి - ముఖ్యంగా హాని చేసే దుస్సంఘటన - జరగబోతుందని తెలిసినా ఆపలేని నిస్సహాయత! యెందుకొస్తుంది?ఒకటి మనకి హాని కలిగిస్తుందనీ దాన్న్ని వొదిలేస్తే మంచి జరుగుతుందనీ తెలిసినా సరే వొదలకుండా గట్టిగా పట్టుకుని ఒక  విధ్వంసం యెదురయ్యే వరకూ అకర్మణ్యంగా వుండిపోతున్నాం.మొదటిసారి జరిగినప్పుడు దాని నుంచి నేర్చుకుంటే రెండవసారి జరగ్కుండా ఆపవచ్చు, కానీ నేర్చుకునే చురుకుదనం మనలో లేనట్లుంది?!

       దారా షికో - గొప్ప పండితుడు, సజ్జనుడయిన ప్రభువు.మన భారతీయ సాంప్రదాయం పట్ల గౌరవాదరాలు వుండి మన సాహిత్యాన్ని పారసీ భాషలోకి తర్జుమా చేసి ప్రపంచాని కందించాలని కలలు గన్న దార్శనికుడు.ఔరంగజేబు - ఈ దేశాన్ని యెంత దుర్మార్గమయిన పధ్ధతిలో నైనా సరే తనకు నచ్చిన మతానికి అంటుగట్టాలని చూసిన సంకుచిత మనస్తత్వం గలవాడు.వీరిద్దరి మధ్యనా అధికార మార్పిడికి పట్టిన ఆ అయిదు నిముషాల కాలం హిందువులూ ముస్లిములూ అన్యోన్యంగా కలిసి వుండి వుండేవాళ్లేమో అని అనుకోవాల్సిన జరగని భవిష్యత్తు నుంచి ఇవ్వాళ మనం చూస్తున్న ఈర్ష్యా ద్వేషాలతో రక్తపుటేరులు పారించుకుంటున్న పరిస్థితి దాపరించింది!?

      మొగలాయీ వంశంలో తండ్రి నుంచి కొడుక్కి అధికారం రావటం కూడా కుట్రల తోనూ కుహకాల తోనూ రక్త సంబంధీకుల్ని కూడా కత్తికి బలిచ్చి కూడా యేమాత్రమూ పశ్చాత్తప పడని విధంగా జరిగింది!యెంత పరమ శాంతంగా అధికారం లోకి వచ్చినా దారా  ఔరంగజేబు చేసిన మోసపు యుధ్ధంతో చరిత్ర చెత్తబుట్టలోకి క్రూరంగా విసిరివెయ్యబడ్డాడు!దారా సైన్యంలోని ఒక వ్యక్తిని కొనేశాడు, తక్కువ సైన్యంతో యుధ్ధానికి వచ్చి వెనక్కి తిరిగి పారిపోతున్నాట్తు నటిస్తున్నాడు. ఈలోపు పాదుషా సైన్యంలోని అతని పావు, "ప్రభూ, తమరు గజం మీద నుంచి కన్నా అశ్వం మీద నుంచి అయితే మరింత చురుగ్గా కదలగలరు" అనడంతో అమాయకంగా హౌదా మీద నుంచి దిగాడు.సమయం కోసం చూస్తున్న ఔరంగజేబు పాదుషా వోడిపోయి వెనక్కి తిరుగుతున్నాదని హడావుడి చేశాడు, అంతే - వోడిపోతున్నామనుకున్న సైన్యం హుషారుగా రెచ్చిపోయింది, గెలుస్తున్నామనుకున్న సైన్యం దిగ్భ్రాంతితో చతికిల బడింది - ఫలితం తారుమారయింది!

          కేవలం కొన్ని మొహిరీల అదనపు సంపాదన కోసం అనామకుడైన ఆ లంచగొండి సైనికుడు  చేసిన పని భారతదేశ చరిత్రని యెంత వూహించని మలుపు తిప్పిందో చూశారుగా!ఇవ్వాళ రక్షణ శాఖ లోని వున్నతాధికారులే అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తుంటే దేశ భవితవ్యం గురించి నిర్భయంగా వుండగలమా?దారా షికో ఆస్థానంలో కవిగా తెలుగువాదైన పండిత జగన్నాధ రాయలు వుండేవాడు.దారా షికో పతనం తర్వాత ఢిల్లీ వొదిలి దేశాతనలో కాలం గడిపాడు.కధాకావ్యాలు రాయలేదు గానీ ఇతని వ్యంగ్యవైభవం అసామాన్యం! అతనిలా అంటాడు, "ఓ గాడిదా! రోజంతా బట్టల మూటలుమోసి వీపు విరగ్గొట్టుకుని ఈ గుగ్గిళ్ళు తినదం దేనికి?రాజుగారి అశ్వశాలలో హాయిగా విందు భోజనమే చెయ్యవచ్చు గదా! కాపలా వాళ్ళు గుర్తు పట్టి తంతారు గదా అంటావా, అక్కడ నూటికి తొంభయ్ శాతం మంది గుర్రానికీ గాడిదకీ తేడా తెలియని వాళ్ళే వుంటారు, మిగిలిన ఆ పదిమంది మాటా రాజుగారి దగ్గిర చెల్లదు." అని.అప్పటి రాజస్వామ్యంలోనూ ఇప్పటి ప్రజాస్వామ్యంలోనూ పరిస్థితి ఒక్క లాగానె వుంది కదా, యెంత మందకొడి తనం? అనివార్యత లన్నీ విషాదాన్నే మోసుకొస్తున్నాయని తెలిసినా ఇప్పటికీ చిన్న చిన్న వాట్ని కూడా ఆపలేకపోవడానికి మందకొడి తనమే కారణం కదా!

             అయితే ఇంత మందకొడిగా బతికే అసంఖ్యాక ప్రజల మధ్య నుంచి అప్పుడప్పుడూ తమ జీవిత కాలం లోనే కాలాన్ని పట్టి బంధించి గుప్పిట పట్టి చరిత్రని తమ సంకల్పాని కనువుగా మలుపు తిప్పి చూపించి అనంతకాలం వరకూ నడక ఆపని వాళ్ళూ వున్నారు!వాళ్ళింకా నడుస్తూనే వున్నారు,చూస్తున్నారా!వారి చిరంజీవిత్వం వెనక వున్న రహస్య మేమిటి?యేమీ లేదు, వాళ్ళొక కల గన్నారు దాన్ని కష్టపడి నిజం చేసుకున్నారు!కాలం తెలియని ఒక స్థలంలో పరమ పురుషుదు పుట్టీ పుట్టగానే తన చుట్టూ వ్యాపించి వున్న యేమీలేనితనం చూసి బోరు కొట్టి ఒక 3డి బ్రష్ ని కదిలించి ఈ అనంతకోటి విశ్వాల్నీ సహస్రాధిక భాను మండలాల్నీ యేది కిందో యేది మీదో తెలియని విశ్వ ఘనంలో మునగానాం తేలానాం అంటూ వేలాడుతూ కదులుతున్న పాలపుంతల్నీ బృహత్తారల్నీ సృష్టించుకున్నాడు - తన ఆనందం కోసం!అనేకానేక జీవరాశుల్నీ సృష్టించాడు - చంపుతూ,పుట్టిస్తూ, యేడిపిస్తూ, నవ్విస్తూ - కాలక్షేపం చెయ్యడానికి! అంతా అయిపోయాక బ్రష్ పక్కన పడేసి తీరిగ్గా చూస్తే యెక్కడో యేదో కనబడీ కంబడకుండా దాక్కున్నట్టు అనిపించింది!? తనే సృష్టించుకున్న బ్రహ్మాండమంతా కలయదిరిగినా ఫలితం లేకపోయింది, విసుగెత్తి తన బదులుగా వెతకడం కోసం మనిషిని సృష్టించాడు!

            తనకు మాత్రమే ప్రత్యేకమయిన సృజించే శక్తినీ అమరత్వాన్నీ తప్ప తనకున్న అన్ని శక్తుల్నీ - ముఖ్యంగా కనిపించిన దాన్ని బట్టి కనిపించని దాన్ని చూడగల బుధ్ధి చాతుర్యాన్నీ యేది చేయందగు నేది చేయందగదనే విచక్షణనీ -  ఇచ్చాడు. ఇచ్చి వెదకమన్నాడు గానీ అతను ఒక జీవితకాలం సరిపోదనేశాడు. సరే, ఆ మనిషినే రెండుగా చేసి ఒక సగం నుంచి  ఆడ మనిషిని కూడా సృష్టించి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసి ఈ భూమి మీదకి దించాడు. ఆ లోపాన్ని సరి చెయ్యగలిగిన వాడికి తన సృజించే శక్తితో సహా అన్నీ ఇచ్చి తనంతవాణ్ణి చేస్తానని హామీ ఇచ్చాడు! సంతానం అయితే తామరతంపరగా పెరిగింది గానీ నూటికి తొంభయ్ శాతం మందకొడిగా తిరిగే బేవార్సు గాళ్ళే. కేవలం పదిశాతం మందే భగవంతుడు విసిరిన ఛాలెంజిని టేకప్ చేశారు. "యేమీలెనితనం నుంచి వచ్చిన ఈ కనిపించే దాంట్లో యేది కలిస్తే పరిపూర్ణత్వం సిధ్ధిస్తుందో అది యేది?" అనే వెతుకులాటలో జీవితాల్ని అన్వేషణకి అంకితం చేశారు.అసలుదైన దైవత్వం సిధ్ధించలేదు గానీ కొసరుదైన అమరత్వం సిధ్ధించింది!

          మీరూ ప్రయత్నించండి.నేనూ ఖాళీగా వుండన్లెండి.దేవుడితో సమానం అయ్యే ఛాన్స్ వొదులుకుంటామా, చెప్పండి! వెతుకుదాం,వెతుకుదాం,వెతుకుదాం - అలిసిపోతే నిదర పోదాం. ఆ నిదరలో ఒక కలొస్తుంది!ఆ కల, పైన చెప్పినట్టు - హర్రర్, ఫాంటసీ, పజిల్, క్లూ వర్డ్ - యెలా అయినా వుండొచ్చు! పీడకల వచ్చి వులిక్కిపడి లేచినా యెంత సేపు మేలుకుని వుండగలం? అదృష్టం ఈడ్చి తన్నే ఒక క్షణంలో వచ్చే కల మన లక్ష్యాన్ని కళ్ల ముందు బొమ్మ కట్టిస్తుంది.ఆ కల వెంట పయనమయితే మనమూ చరితార్ధుల మవుతాం?!
గొప్పోణ్ణవటానికి దగ్గిర దారేది గురూ? అర్జెంటుగా ఒక మంచి కల గనెయ్యటమే శిష్యా!

Monday, 25 August 2014

యేందీ తెలంగాణా కాంగ్రెసోళ్ళ చిలుకుడు పండగ?నాకేందో కెలకనీకి హుషారు గున్నది!

(హలొ.. హలొ ..మైక్ టెస్టింగ్,మైక్ టెస్టింగ్.వ్యాఖాతలకు ఒక మనవి, ఈ వొక్క పోష్టును మాత్రం నేను ఆంధ్రోణ్ణి గాకుండ ఒక తెలంగాణోడిగా వేస్తున్నా!కొసాకి ౘదివితే బుర్రలో దీపం వెలుగుతుంది యెందుకట్లా చేసానో?)       
              తెలుగుని తెలుగులాగ వుంచకుండ సంస్కృతంతోనో ఇంగ్లీషుతోనో సంకరం జేసెటొళ్ళంటె నాకు మా సెడ్డ సిరాకు!రెండుగ చీలింది భూమే గద, భాష గాదు గద.మొత్తం 23 జిల్లాలల్ల బహు చక్కని తెలుగుండె, ముచ్చట పడి కాలికి బలపం గట్టుకుని తిరిగి అన్నీ నేరుస్తనంటె వొద్దని యెవడయిన అంటడా?అది గాకుంటె వున్న వూర్ల నేర్చుకున్న  సొంత బాస వుండె గద!

         గదేందో కాంగ్రెసోళ్ళు దొంగలు బడ్డ ఆర్నెల్లకు మొరిగే కుక్కల మాదిరి "తెలంగాణా ఇచ్చినా మనం తెలంగాణలో యెందుకు గెల్వలేదు" అని తేల్చుకొనుడు గిప్పుడు షురూ జేసిన్రు. దానికి "మేధో మధనం" అని సంస్కృతంల పేరు బెట్తిన్రు.గింత చిన్న దానిగ్గూడ సంస్కృతం గలిస్తె గాని యవ్వారం తిన్నగ నడ్వదా ఈళ్ళకి?అచ్చ తెలుగుల "తలల చిలుకుడు" అంటే అందరికీ అర్ధమయితలేదా,  జర చెప్పున్రి?

           అయిపోయిన పెళ్లికి బాజాలు యెందు కన్న సంగతి గూడ యెర్క లేనోళ్ళు దేనికి పనికొస్తరు బై?వూరందరికి దెల్సి పాయె, నవ్వనోడు వుంటె పాపమన్నట్టు దేన్ని బడితె దాన్ని తిట్టుడే దప్ప జోకులెయ్యని కంచె అయిలయ్య మేష్టారు గూడ జోకులేసిండె - ఈళ్లకి మాత్రం దెలియక పాయె!?

         యెన్నికల సందట్లోనే మన దొర దేశానికి సొతంత్రం దెచ్చుకొనుడులో తెచ్చిన గాంధీ గొప్పోడా?ఇచ్చిన ఇంగ్లీషోడు గొప్పోడా అని ఇరగనూకిండు గద, అది గూడ యెక్కలేదా ఈ కోడి మెదడు సన్నాసులకి?!సోనియ గాంధి యెన్నో కష్టనష్టాల కోర్చి ఇచ్చిందంట, వార్ని మనకి దెల్వనట్టు?అయిదేండ్ల క్రితం యెన్నికల్ల తెలంగాణా ఇస్తనని చెప్పి పవర్ దక్కించుకుని నాలుగేండ్ల పదకొండు నెల్లు యేడిపించి ఇచ్చుడు మనమీద గారాబం కొద్దీ ఇచ్చినట్టా?ఒకేపున సెంటరోళ్ళు ఇస్తమని హడావుడీ జేస్తంటె వాళ్ళే కిరికిరిగాణ్ణొకణ్ణి ఈడ కుర్సీల బెట్టి యెంత లొల్లి జేయించిన్రు వాని తోని?యెన్నిసార్లు యేందివయా ఇది, మీ వోడే నఖరాలు జేస్తండని అడిగినా మావోడు మంచోడు మామిడి కాయంత దొడ్డోడు అని అనిందెవరు, ఈళ్ళు గాదట్నా? ఈ ఇచ్చుడు గూడ ఆంధ్రోళ్లతో గూడి నాటకమాడి మనకి ద్రోహమే జేసింది గద!

          అన్నా ఒకటి జెప్త ఇనుకో, కాంగ్రెసు అంత మాదచ్చేదు పార్టీ ఇంగొకటి లేదీ బూమ్మీద,యెవళ్ల సంగతో మనకేల?గారోజున తెలంగాణను బలవంతంగా ఆంధ్రోళ్ళతో గలిపిన పాపమూ దానిదే,అందుకోసరమని పెద్దమనుషుల ఒప్పందం అనే కంటితుడుపు మేళం ఒకటి యేర్పాటు జేసిందీ ఆ పార్టీయే, ఆ బల్లకి అటూ ఇటూ గూడ కాంగ్రెసోళ్ళే గూసోని దస్తర్ల మీద ముద్దర్లు గుద్దిందీ ఆళ్ళే, ఆ ఒప్పందాన్ని తుంగలో దొక్కి మన మీదెక్కి తొక్కిందీ  ఆ పార్టీయే గద?యెంటీ ఆర్ వొచ్చెదనుక ఆంధ్రాలో హవా అంతా ఆ పార్టీదే గద, యేం పీకింది బై?ఆంధ్రా రెడ్లూ ఆంధ్రా కమ్మోళ్ళూ ముఠాలు గట్టి రాష్ట్రం మొత్తాన్ని ఆళ్ళ సంక కింద నుంచి బయటికి రానీకపాయె?!ఒకడేమో వాని పెండ్లాం పక్కోనితో లేచిపోయినా దుఃఖ పడడు గానీ పదవి లోంచి పీకేస్తే చాలు చెవిగోసిన మేకలాగ అరెచెటోడు!మిగతోళ్ళు రాష్ట్రాన్ని  పంచుకొనుడు దంచుకొనుడు అంతా సొంత యవ్వారమల్లె ఆళ్ళలో ఆళ్ళు జేస్కుంట మనకి సందే ఇవ్వకపోతె మనకు మండదా?

           మండి యేమడిగినం? మీతోనీ మీ కరప్షన్ తోనీ మాకు విసుగెత్తి పోయింది, మాది మాకు పారెయ్యమంటిమి?అంతా శ్రీ వైష్ణవులే మరి బుట్టెడు చేపలూ యేమాయె నన్నట్టు అందరూ లేఖలిచ్చిన్రు - తెలంగాణా ఇస్తె మాకు ఫికర్ లేదని.అయినా నాలుగేండ్ల పదకొండు నెల్లు దేనికి సాగలాగినట్టు?సెంటర్లోనూ స్టేట్లోనూ వాళ్ళే వుండి ఇంత దరిద్రంగా విభజన జేసి మనకి చెడ్డపేరు దెచ్చిన పరమ నికృష్టమయిన పార్టీకి అసల్కి మొన్న యిన్ని వోట్లు యెలాగ పడినై బై?మన రాష్ట్రం మనకి ఇమ్మని అడిగినమే గాని ఇంత దరిద్రంగ ఇమ్మన్నమా?నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించినట్టు ఇచ్చిందన్నా కాంగ్రెసు తెలంగాణా  మనకి!ఆంధ్రోళ్ళ సమైక్యం హడావుడి చూసీ విడిపోతే చస్తామన్న శోకాలకి మతి పోయీ మన బోలాశంకరుడు గూడ మాకు తెలంగాణా ఇస్తె చాలు ఆంధ్రోళ్లకి యేమిస్తరో మీ ఇష్టం అనేసిండు!?అటు ఆంధ్రోళ్లని సమైక్యమని రెచ్చగొట్టి ఆఖరి మినిట్ వరకూ వస్తదా రాదా అని కంగారు పెట్టి తరుగు రెవెన్యూ పేర్న, రాజధాని పేర్న పాకేజీలు ఆళ్లకీ ఖాళీ పళ్ళెం  లాంటి వుత్త తెలంగాణా మనకీ  ఇచ్చిన్రు, సమజైందా?!ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళే, హమ్మో?!

         మాటిమాటికీ కేసీఆర్ విలీనం ప్రపోజల్ బెట్టిండు అంటరు, తప్పేందీ అంట!అవస్ర పడి వసుదేవు డంతటోడు గాడిద కాళ్ళు బట్టిండు,యేమాయె?కేసీఆర్ పట్టింది ఈ గాడిదలనె గద,యెట్లుండె రిటార్టు?వీండ్లు కష్టనష్టాల కోర్చిందీ అనే సొనియకు మొదట్నె తెలంగాణా అంటె సానుభూతి వుంటె విలీనం అనక ముందే ఇచ్చి వుండును గద! అది పచ్చ మీడియాయే గావొచ్చు, కెలకడానికే గావొచ్చు - యెన్ని సార్లు యెందు కిస్తున్నరు తెలంగాణా అంటె ఒక్క సారయినా తెలంగాణా ప్రజల కోరిక మేరకు అనకపోయె, అన్ని సార్లూ విలీనం జేస్తనన్నడు, మాకు ముఫయ్ సీట్లు రప్పిస్తనన్నడు - ఇదే గోల జేసి మాకు మేము ఆ ముఫయ్ సీట్లు గూడ దెచ్చుకోలేని యెదవలం అని వొప్పుకున్నరు గద! ఇంగిప్పుడు ఈ చిలుకుడులో కొత్తగ దేల్చే పరమ సత్య మేముంటది - బూదిలో కెలుకుడు ఇంత కన్న నయం గాద!

     అయినా ఒక కుటుంబానికి కట్టుబానిసలల్లె బతికెటోళ్ళు వీళ్లకి రాజ్యమూ అధికారమూ యేలన్నా?సొంత రాష్ట్రాల్లో దిక్కూ దివాణం లేని చిదంబరం, షిండే లాంటి కూర్పాసం గాళ్ళు కోటరీలో జేరి యెంత హవా వెలగబెట్టిన్రు, మరి నలబై రెండుకి నలభై ఒకటి వొచ్చిన్నాడు కేంద్రంలో యేమాత్రం చక్రం దిప్పిన్రు ఈ పోటుగాళ్ళు?పోరాడి గెలుస్తరంట, గెలిచి మళ్ళ పవర్లో కొస్తరంట, దేనికో?మొదటి మూల స్తంభం దగ్గిర్నుంచి ఆఖరి మూలస్తంభం వరకూ బెట్టిన కుంపట్లు జాలవనా?కొత్త కుంపట్లు రగిలించాలనా?మొదటి మూలస్తంభం నెహ్రూ ఒక్కడు యెన్ని కుంపట్లు బెట్టిండు?మొదటి కుంపటి కష్మీరే ఇంకా ఆరకుండె!హైదరాబాదు యెన్నికల్లోనూ మెదక్కులోనూ పోటీ జేస్తరు గాబోలు, ఒకే ఒక్కటి అదగాలె - లోక్ సభ యెన్నికల కయితే పవరిస్తం గానీ కష్మీరు కుంపటి ఒక్కటి ఆర్పి చూపించమని అడగాలె,అసెంబ్లీ యెన్నికల కయితే తెలంగాణాకు పాకేజీ లెందుకు ఇవ్వలేదని అడగాలె..

నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించిన మీకు తెలంగానోళ్ళ వోట్లు గావాల్నా?
మీరే బానిసలు!బానిసలకు అధికార మేలరా మాదచ్చోదు ల్లారా?

Monday, 11 August 2014

యేక్ దిన్ కా సర్వే?బహుత్ అచ్చా!! పారా హుషార్!!!

       ఆ వొక్క రోజే? ఆ వొక్క రోజే! ఆ వొక్క రెజే?! త్వరన్ కదులుడు త్వరన్ కదలుడు ఇంటి కడనే నిలువుడు.బలే మంచి చౌక బేరము?!తెలంగాణా వాసులారా, ఆ వొక్కరోజూ శుభకార్యాలూ అశుభాలూ అన్నింటినీ వాయిదా వేసుకోండి!గుడి గోపురాలకూ దేమునికీ యముని మహిషానికీ కూడా ఆ రోజు శలవు రోజు!.తెలంగాణా సామ్రాట్టు ఆరోజు ప్రపంచ చరిత్రలోనే యెవ్వరూ చెయ్యని ఒక అధ్బుతాన్ని చెయ్యబోతున్నారు, సహకరించండి!!బలే మంచి చౌక బేరము!! ఆలసించిన ఆశాభంగము,ఆ పైని యెంత విలపించినా లేదు లాభము!

       ఆ వొక్కరోజూ తెలంగాణా సమాజం మొత్తం స్తంభించి పోవాల్సిందే,శ్రీమాన్ చంద్రశేఖర వర్మ మహారాజులుంగారు ఆదేశించారు,యేమని?ఆ వొక్క రోజు యెవరు ఇంటి దగ్గిర వుండి తమ ఇళ్ళ కడకు గంటకు వంద కుటుంబాల లెక్కన వాయువేగంతో పరిగెత్తుకు వచ్చే సర్వే అధికార్లకు తమ వివరాలు ఇస్తే చాలు,మరుసటి రోజు నుంచీ ప్రభువుల వారు కురిపించే వరాలన్నీ మీవే?! ఇవ్వక పోతిరా పంచ మహా పాతకాలూ చుట్టుకుంటాయి, అసలు మీరు తెలంగాణా వాసులే కానట్టు లెఖ్ఖ?!బంగారు తెలంగాణా కోసం ఆ మాత్రం కంగారు పడలేరా?!

    పూర్వం యెప్పుడో రాజుల కాలంలో జరిగేవి ఇట్టాంటి హదావిళ్ళు,రాజుగారు ఒక్క రాజ ముద్ర నొక్కేసి హుకుం జారీ చెయ్యగానె యేమిటిది?యెందుకు? - అనే ప్రశ్నలు లేవనెత్తకుండా జనం కకావికలై పరుగులు పెట్టటం నిజంగా చూడ చక్కని దృశ్యం!!!చరిత్ర మలుపు తిప్పే మహనీయుల్ని చూశాం గానీ చరిత్రని యేకంగా కొన్ని శతాబ్దాలు వెనక్కి నడిపించగలిగిన మహనీయుడు ఇన్నాళ్లకి మళ్ళీ పుట్టాడు?!పరిజనులారా పుణ్య భాగీరధీ తోయముల నందుకొనుడు!వందిమాగధు లారా కచరా మాహారాజును కర్ణపేయముగా కీర్తించుడు!!యేరీ తెలంగాణా కవిద్వయం, నిద్రపోవుచున్నారా?సహస్ర ఫణముల సహస్ర ఫూత్కారములతో విజృంభంచవయ్యా ఆచార్య కవీంద్రా!చందస్సుల్తో మందుగుండు దట్టించి విషజ్వాలలతో ఆంధ్ర మశకములను తరిమి కొట్టవయ్య మొద్దుసూదనా!! మీ మీ కవితా విష గంధపు ధాటికి ఆంధ్రోళ్ళు, ముఖ్యముగా చంద్రనాధుడు ముక్కులు మూసుకొని పుంజాలు తెంపుకొని పది నిముషాల్లో భాగ్యనగరిని, కాదు కాదు -  మన కంగారు తెలంగాణాను - అర్రర్రె నేనే కంగారు పడినాను, మన బంగారు తెలంగాణాను వదలి పరుగులు పెట్టునట్ట్లు చేయుడయ్య!!ప్రజాస్వామ్యంలో రాజస్వామ్యాన్ని చూపిస్తున్న చంద్రశేఖర వర్మ గారి వైభవాన్ని చూస్తా వుంటే కళ్ల నిండికీ ఆనంద భాష్పాలు వొద్దన్నా తన్నుకొచ్చేత్తన్నాయి, కర్చీఫులు చాలవేమో తుడుచుకోవటానికి?

    నా బెంగంతా ఇంట్లో ఆడోళ్ళ తిట్లు పడలేక అఫీసుల్లో యేదో పొడిచేస్తున్నట్తు హడావుడి పెట్టి పగలంతా తిట్లు తప్పించుకుని హాయిగా కులుకుతున్న మగాళ్ళు ఆ రోజంతా యెంత నరకం అనుభవిస్తారో గందా అనే!యేం గాచ్చారం వొచ్చి పడిందిరా నాయనా!!పైగా మొగాళ్ళు ఆఫీసులకి చెక్కెయ్యంగానే మారిణింగు షోలో మహేష్ బాబునీ మాట్నీ షోలో బాలయ్యనీ కళ్ల నిండికీ చూసుకునేవోళ్ళు రోజంతా ఈ పొట్టి బుడంకాయల్నీ బట్టతలోళ్లనీ చూడాల్సిన దరిద్రానికి యెంత కాక మీదుంటారో ఆడోళ్ళు?!ఇరగ దీసెయ్యరూ?సాయంకాలానికల్లా ఆ అర్భనాకారి మొగుళ్లలో యెంత మంది బతికి బట్ట గడతారో?ఆయన కేం, చూట్టానికి బక్కగా వున్నా ఆయువులో గట్టోడు - ముక్కు బలంతో బతీకేస్తన్నడు,లక్ష తిట్లు దిని కూడా తట్టుకు నిలబడ్డాడు, ఈ బక్క ప్రాణుల కంత సీను లేదే?!పోన్లెండి, పోయినోళ్ళు నిక్కచ్చిగా ఒక శాతానికి తేలినా ఆ మొత్తం ఖజానా మీద బరువు తగ్గుద్ది- కరువులో అదిగ మాసం అన్నట్టు పెరిగారీ మందంతా!! 

      తెలంగాణా వాసులారా మీరెంత అదృష్టవంతులు? యెప్పుడూ ఏసీలో హాయిగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని మిమ్మల్ని చిన్న చూపు చూసిన అధికార్లు కాగితాల కట్టలు తీసుకుని మీ దగ్గిరకి పరుగులు పెట్టుకుంటూ వచ్చే సుందర దృశ్యాన్ని తనివితీరా చూసి పులకించిపొండి!!ప్రజల వద్దకే ప్రభుత్వం అనే ఆదర్శాన్ని కనుల విందుగా వీక్షించడానికి రెండు కళ్ళూ చాలవు గదా?!అధికార్ల్లూ పరిగెత్తండి, ఆ ఒక్క రోజే మీది?!మీరు యేది రాస్తే అదే ఫైనల్! మీకు నచ్చిన వాళ్ళు లేకపోయినా వున్నట్టే రాసుకోండి, సంతకాలు ఫోర్జరీ అయినా ఫర్లేదు, యేం కాదు!అంత గాకపోతే ప్రభువుల వారు అంతా సరిగ్గా జరిగిందా లేదా అనేది తేల్చుకోవడానికి మరొక రోజు కేటాయిస్తారు. ఆ రోజు మళ్ళీ పరుగులు పెట్టొచ్చు.మాంచి యెక్సరసైజు వొంటికి మంచిది! ముఖ్యంగా ప్రభువుల వారు పైకి చెప్పక పోయినా మీరు అర్ధం చేసుకుని చెయ్యాల్సింది యేంటంటే - ఆ ఆంధ్రోళ్ళని మాత్రం లిష్టులోకి రానివ్వ మాకండి!ఆ కొంపల వేపుకు అసలు వెళ్ళకుంటే పాయే?! లేని వివరాలకి రుజువు లెవడు అడుగుతాడు? మీ సత్తా అంతా చూపించండి?!యాభయ్యేళ్ళ నుంచీ ఆంధ్రోళ్ళ అధికారంలో మొద్దు నిద్ర పోయారు,  ఇప్పుడే నిద్ర లేచి పరుగులు పెట్టే అవకాశం వచ్చింది, లేవండి పరిగెత్తండి!! యేవరు పరిగెత్తుతున్నారో యెందుకు పరిగెత్తాలో తెలియక పోయినా సరే పరుగు ఆపకండి?!నించుని నీళ్ళు తాగదం కన్నా పరిగెత్తి పాలు తాగడం మంచి దన్నారు, పాలు తాగడానిక్కూడా ఆగకుండా పరిగెత్తాల్సిందే, ఇది రాజాజ్ఞ!

      అసలు పనంతా అధికార్లదే గదా, వాళ్ళొచ్చి రాసుకునే అయిదు నిముషాలు మినహా ఇంట్లో బోరుకొట్టదా అని అనుకోమాకండి?అయాచితంగా వచ్చిన ఈ సెలవును యెలా వుపయోగించుకోవాలో ఆలోచించుకోండి, ప్రబువుల వారి దొడ్డ మనసు తెలుస్తుంది. ఆడవాళ్ళు వరలక్ష్మీ వ్రతాలూ అవీ చేసుకోవచ్చు.మగవాళ్ళు చతుర్ముఖ పారాయణాలూ ద్రవయజ్ఞాలూ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు!!అయ్య బాబోయ్, అసలు విషయం మర్చే పోయా?! అన్ని ఆఫీసులూ మూసేస్తా మన్నారు, క్లబ్బులూ బారులూ కూడా మూసేస్తారా యేంటి, కనుక్కొవాలి - వస్తా!!

Thursday, 7 August 2014

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా! ఆ అన్నాన్ని తిట్టిన వాడు ముఖ్యమంత్రి యెట్లా అయ్యాడు?

                                      సీ||          ఆంధ్ర బిర్యానీని పేడ యనిం డొక
                                                       బాడుఖావు! పరుల భోజనాన్ని

                                                       కావరమున వెటకారించె టోడు మ
                                                       నిషె కాడుగా, పవరిచ్చి రెట్ల

                                                       ఘనమైన గా తెలంగాణోళ్ళు? మొదలెమొ
                                                       మా తిండిపై వూస్తడా, అటెన్క

                                                      మమ్ముల్ని కడుపుల బెట్కొని సూస్తడా!
                                                      గిట్ల జూస్తె పురుషుడూ గట్ల జూస్తె

                                    తే||            ఆడదీ ఐన బహురూపి లాగ వుంది
                                                      గా దిమాగు యెక్వోని నయా జమాన!!
                                                      వూరు పేరు లేనోళ్ళు గొప్పోళ్ళ నేందొ
                                                      పనికిమాలినో ళ్ళంటున్రు పొగరు బట్టి!!!
(28/07/2014)
______________________________________________________
     నాకు మొదటి నుంచీ తెలంగాణా వుద్యమాన్ని గురించి ఒక సందేహం పట్టి పీడిస్తూ ఇప్పటికీ జవాబు దొరక్కుండా యేడిపిస్తుంది - అంత చదువుకుని ఇంత చెత్తగా మాట్లాడుతున్నారు, యేమిటి వీళ్ళ సంస్కారం? పోనీ తెలంగాణా సంస్కృతే అంత అనుకుందామా అంటే - నాకు వస్తుతః తెలియదు గనక వారూ వీరూ చెప్పిందే ఆధారం, మరి గొల్లపూడి మారుతీ రావు గారి దగ్గిర్నుంచీ అందరూ చాలా గొప్పగా పొగుడుతున్నారు!యెంత వైరుధ్యం?యే ప్రజల కోసం పోరాడుతున్నాం అంటున్నారో ఆ ప్రజల సంస్కారానికి యే మాత్రం సంబంధం లేకుండా ప్రవర్తించే వాళ్ళు తామే తెలంగాణా ప్రజలకు నిజమయిన ప్రతినిధులుగా డప్పు కొట్టుకుంటున్నారు!

      న్యాయ పోరాటం పేరుతో వీళ్ళు చేసిన వుద్యమ విధానాన్ని చూస్తే ప్రపంచంలో న్యాయం కోసం పోరాడిన వాళ్లంతా సిగ్గుతో తల దించుకోవాలి!మా వుద్యోగాలు లక్షల్లో లాకున్నారు, మమ్మల్ని మా హైదరాబాదు నుంచే మెడబట్టి గెంటేసి కులుకుతున్నారు - కావాలంటే గిర్గ్లానీ రిపోర్టు చూడండని యెక్కడ బడీతే అక్కద రెచ్చి పోయారు, చదువుకున్న వాళ్ళు మరీ ఇంతగా అబధ్ధాలు చెప్పగలరని అనుకోలేదుగా - ఈ మధ్య వరకూ నేనూ నిజమే నని నమ్మేశా!తీరా చూస్తే ఆయన వీళ్ళ వాదనకి పూర్తి విరుధ్ధంగా వుల్లంఘనలు అన్ని జోన్ల లోనూ జరిగాయి, అందరూ నష్టపోయారు అని నిక్కచ్చిగా  చెప్పాడు.ఈ ప్రస్తావన మూడుసార్లు గ్రీన్ స్టార్ అనే తెలంగాణా మేధావి నుంచి వచ్చింది.మొదట మాలతీ మాధవం బ్లాగులో ఈ విభజన గురించి ఆమె నాకు ఈ లెక్కలూ డొక్కలూ యేమీ తెలియవు కానీ విడిపోవటం బాధగా వుంది అనే ధోరణిలో వుంటే అరిభీకరంగా చెల రేగిపోయాడు - గిర్గ్లానీ రిపోర్టు గురించి. ఒక లింకు గూడా ఇచ్చేశాడు - అది గిర్గ్లానీ గారు ఈనాడు కి ఇచ్చిన ఇంటర్వ్యూ.అక్కడా విలేఖరి యెవరు నష్ట పోయారు, యెవరు లాభ పడ్డారు? అని అడిగితే అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి వెళ్ళగలిగిన వాళ్ళు లాభ పడ్డారు, వెళ్ల లేని వాళ్ళు నష్ట పోయారు అని చెప్పాడు.ఆమె ఈ పాయింటు యెత్తి జవాబు చెప్పాక మళ్ళీ అటు నుంచి జవాబు లేదు?

          ఈ క్లూ పట్టుకుని అసలీ గిర్గ్లానీ గారు యేం చెప్పాడు అనే అనుమానం వొచ్చి వెతికితే ఈ లింకు దొరికింది.తీరిగ్గా అదంతా చదివి ఈ వడ్లగింజలో బియ్యపు గింజ కింత రాధ్ధాంతమా? అనే పోస్టు వేశాను.ఆయన ఈ జోనల్ సిస్టం గురించి చాలా చెప్పాడు.మొత్తం మీద దాని సారాంశం యేమిటంటే - అది కానీ అంతకు ముందు ఈ వుద్యోగాల విషయాలకి స్మబంధించిన రిపోర్టుల స్వభావ మంతా ఒకటే!మామూలుగా యే శాఖలో నయినా శాఖాదిపతులుగా గెజిటెడ్ స్థాయి గలిగిన అధికార్లు వుంటారు.వీళ్లు కింది స్థాయిలో నాన్-గెజిటెడ్ వాళ్లని తీసుకోవటానికి సంబంధించిన తకరారు లో వీటి ప్రమేయం వస్తుంది.పాత రిపోర్టులతో సహా తన రిపోర్టు కూడా యెందుకని నిరుపయోగం అవుతుందో కూడా చెప్పాడు.ఈ రిపోర్టు లన్నీ సలహాల కోసమే తప్ప అధికారికం గా పాటించి తీరాలన్న నిబంధన యే రిపోర్టు విషయంలోనూ లేదు.అన్ని రకాల నిబంధనల కన్నా పైన ఆ అధికారి విచక్షణ మాత్రమే నిర్ణయానికి కీలకం అని ఆయనే చెప్పాడు.ఈ రిపోర్టు ల్లోని అంశాల్ని ప్రభుత్వ పరమయిన విధి విధానాల్లోకి అంటే రూల్ బుక్ లోకి యెక్కించనంత వరకూ యేమీ ఫలితం వుండదన్నాడు. యెందుకంటే,  శాఖాపరంగా ఒక వుద్యోగి మీద దర్యాప్తు జరపాలంటే తను తన రూల్ బుక్ ని ఫాలో అయ్యాడా లేదా అనే చూస్తారు తప్ప గిర్గ్లానీ రిపోర్టును ఫాలో అయాడా లేడా అని చూడరు.ఇంకా ఇంట్రో లోనే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి మామూలు వాళ్ళకి కాదు - వీటి గురించి ప్రభుత్వాన్ని యెలర్ట్ చెయ్యాల్సిన ప్రభుత్వ సలహాదార్లకే గందరగోళం వుందన్నాడు. అంత గందరగోళం వున్నప్పుడు జరిగిన వాట్ని కూడా కావాలని తమకు అన్యాయం చేసినట్టుగా గయ్యాళి తనంతో రెచ్చి పోయారు!మరి అన్ని ప్రాంతాల్లోనూ వుల్లంఘనలు జరిగాయి, అన్ని ప్రాంతాల వాళ్ళూ నష్ట పోయారు అని ఆయన తెగేసి చెప్పినప్పుడు ఆంధ్రా రాయలసీమ వాళ్ళకీ అన్యాయం జరిగినట్టే కదా?ఆ అన్యాయానికి తెలంగాణా వాళ్ళు కారణ మయినట్టే కదా?

        మరో చోట ఇదే పెద్దమనిషి గిర్గ్లానీ గారి ఈనాడు వ్యాఖ్యని కొంచెం మెలితిప్పి వాదిస్తూ కనబడ్దాడు.చర్చలో వారే ఈ రిపోర్టు గురించి యెత్తేసరికి అన్ని జోన్లలోనూ జరిగాయని అంటున్నారు కదా అనే జవాబు వేశాను.దానికి వారు "అన్ని జోన్లలో జరిగాయి, నిజమే. కాని వారు ఇంకో విషయం కూడా చెప్పారు, అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు అని. అంటే హైదరాబాదు అని నేను అనుకుంటున్నాను. అసలు ఏ ఏ జోన్ లలో ఎంతెంత అక్రమాలు జరిగాయో ప్రభుత్వమే ఒక శ్వేత పత్రం ఎందుకు విడుదల చెయ్యదు?" - అని మరో ప్రశ్న వేసారు. వారు అంటున్నది "అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు" - అని. కానీ ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిర్గ్లానీ గారు చెప్పింది ఇది,"ఒక్క తెలంగాణా వారే నష్టపోలేదు.అన్ని ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది.మేలు జరిగిందెవరి కంటే అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి తరలి వెళ్లగలిగిన వారు లబ్ధి పొందారు." ఆయన చెప్పింది వెళ్ళగలిగిన వాళ్ళు లాభ పడ్దారు అని.ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కృష్ణా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?స్పష్టంగా చెప్పిన దాన్నే ఒప్పుకోనప్పుడు శ్వేతపత్రాలు సాక్ష్యానికి పనికొస్తాయా?వారు యే గిర్గ్లానీ కమిటీ రిపోర్టును గురించి మాకు అన్యాయం జరిగిందని చెప్తుందని వూదరగొట్టారో ఆ రిపోర్టు తయారు చేసిన పెద్ద మనిషే అంత స్పష్టంగా మీ మాట తప్పు అంటుంటే ఇంకా శ్వేతపత్రం అంటారేమిటి? - అని నిగ్గదీశాను.మళ్ళీ జవాబు చెప్పలేదు,మౌనమే సమాధానం.మళ్ళీ అక్కదే మరొక పాయింటు మీద నాకౌ ప్రశ్న వేస్తే - మీ ప్రశ్నకి నేను జవాబు చెప్పేముందు మీరు నాకో ప్రశ్నకి జవాబు బాకీ వున్నారు ముందు అది తీర్చండన్నాను.అదీ భేతాళుడి ఆఖరి ప్రశ్నే అయింది - అంతతో నాకు మల్ళీ ఆ ప్రశ్న యెవ్వర్నీ వెయ్యకూడదన్నంత విరక్తి పుట్టింది!



        అసలు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం యేమిటంటే |violations| అంటున్న |deviations| అన్ని జోన్ల లోనూ సమానంగానే జరిగాయి, ప్రత్యేకంగా ఒక జోను నష్టపోయింది అని చెప్పలేం అని అంత ఖచ్చితంగా చెప్తే మాకు అన్యాయం జరిగిందని గిర్గ్లానీ కమిషన్ రిపోర్తులో ఉంది, వెళ్ళి చూసుకోండని వీరంగాలు వేశారు. మిగతా అన్ని జోన్లలోనూ అంతా బాగనే ఉండి ఒక్క తెలంగాణాలోనే జరిగితే కదా వారికి ప్రత్యేకంగా అన్యాయం జరిగినట్టు?ఇంత కాలం నేను అసలు గిర్గ్లానీ కమిటీలో యేం ఉందో చూడాలని అనుకోకపోవటానికి కారణం మేధావులూ విద్యావంతులూ సంస్కారం గలిగిన వాళ్ళు మరీ దుర్మార్గంగా అబధ్ధాలు చెప్తారా అనే భరోసా తోనే!తీరా చూస్తే పరిస్థితి ఇది.

        అసలు ఒక విషయం నిజమా అబధ్ధమా అని యెలా కనిపెట్టాలి?ఒక విషయం గురించి యెదటి వ్యక్తి వెయ్యి వాక్యాలు చెప్తే మొదటి వాక్యానికీ వెయ్యవ వాక్యానికి అర్ధంలో తేడా వొస్తే అబధ్ధం అని తేలుసుకుంటాం, కదా? ఒక వేళ ఈ వెయ్యి వాక్యాల్లో యే విరుధ్ధతలూ లేకపోయినా వెయ్యిన్నొకటో వాక్యం కొత్తగా తెలిసి దానికి గట్టి సాక్షాలు ఉంటే ఈ వెయ్యి వాక్యాలూ నిజమనిపించేటట్టు అంతా యేకసూత్రంగా ఉన్నా అవన్నీ అబధ్ధాలు అయి పోతాయి,అవునా? ఇప్పుడు అసలు విషయంలో వైరుధ్యాలు ఉన్నా యెదటి వాళ్ళకి తెలిసే వీలు లేదనుకుని వాటిల్లో కొన్నిట్ని దాచేసి అంతా తమ వాదానికి అనుకూలంగా ఉన్నవాట్ని మాత్రమే చెప్తే అబధ్ధం కూడా నిజమయి పోతుంది గదా!తెలంగాణా వాదులు వాదనల్లో ఇదే పద్ధతిని అనుసరించారు.వారంతట వారు చెప్తే తమకు అనుకూలంగా లేని సగాన్ని దాచేసి  అనుకూలంగా వున్న సగాన్ని మాత్రమే చెప్పటం,ఇతర్లకి ఆ మిగతా సగం కూడా తెలిసి నిలదీస్తే చల్లగా జారుకోవటం!!


      కలిసుండడం వల్ల తెలంగాణా భాషకి అన్యాయం జరిగిందనీ కృష్ణా జిల్లా మాండలికాన్ని అధికార భాషగా చేస్తే భరించాల్సి వొచ్చిందనీ చెబుతున్నారు. అది నిజమేనా? నిజంగా కృష్ణా జిల్లా మాండలికం ఇలాగే ఉంటుందా? కృష్ణా జిల్లా మాండలికాన్నే గనక కుట్ర పూరితంగా పైకి తీసుకొస్తే ఒక్క తెలంగాణా వాదులేనా రాయల సీమ వాళ్ళూ గొడవ చెయ్యరా? యే ఇద్దరు రెండు వేర్వేరు జిల్లాల నుంచి వొచ్చ్చిన వాళ్ళు యెవడి భాషలో వాడు మాట్టాడుకుంటూ పోతే వ్యవహారం నడుస్తుందా? అందువల్ల అప్పటి వాళ్ళు మాండలిక వ్యవహారిక తెలుగు ని కాకుండా అందరూ అర్ధం చేసుకొగలిగే విధంగా భాషని సామాన్యీకరించారు? ఇప్పుడు బ్లాగుల్లో మనందరం వాడుతున్నదీ అదే, యే ప్రాంతీయ పదాలూ లేని అందరికీ అర్ధమయ్యే సామాన్య తెలుగు. ఇది కూడా తప్పేనా?ఆయా మాండలికాలకి ఆదరణని కల్పించడం అనేది ఆ భాషలో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు తమ రచనల్లో ఉపయోగించి మిగిలిన వారికీ పరిచయం చేస్తే మిగిలిన వారు అందులోని స్వారస్యాన్ని గ్రహించి మెచ్చుకుంటారు. తిక్కన గారు తన పదిహేను పర్వాల తెలుగు భారతంలో నెల్లూరు జిల్లా మాండలికపు సొంపుని వాడినట్టుగా శ్రీ శ్రీ గారు చెప్పగా విన్నాను. ఆ రకంగా నెల్లూరు జిల్లా మాండలికం తన పలుకుబడులతో సహా భారతేతిహాసంలో ఒక భాగం కాగలిగింది. దీన్ని యెవరయినా వ్యతిరేకించగలరా? మరో విధంగా యే ఒక్క భాష నయినా అధికారికంగా ప్రోత్సహిస్తే మిగిలిన వారు ఊరుకుంటారా?


      మరి ఇంతటి భాషాభిమానమూ అందెశ్రీ గారు నూతన తెలంగాణా రాష్ట్ర గీతం ఆ పాత తెలుగు లోనే రాసినప్పుడు యేమయ్యిందో?యేది చేసినా వాళ్లంతట వాళ్ళకి తోచి  చెయ్యాలే తప్ప మనం చెప్పితే తప్పన్నమాట!నేను ఒక తెలంగాణా వారి బ్లాగు పోష్టులో ఒక టపాను చూశాను. అక్కడ నేను ఒక ప్రశ్న అడిగాను. "ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు" - అనే ప్రస్తావన చూసి అయ్యా, ఈ అర జిల్లాకు అర్ధ మేమిటో సెలవిస్తారా?భౌగోళికంగా కానీ, సామాజికంగా కానీ,సాంస్కృతికంగా కానీ, వ్యావకారికంగా కానీ అయితే మూడు జిల్లాలు లేకపోతే రెండు జిల్లాలు ఉంటాయి.కానీ మీరు రెండున్నర జిల్లాలు అంటున్నారు.దాని అర్ధం కొంచెం విపులంగా వివరిస్తే బాగుంటుంది. మొదలు పెట్టటమే రెండున్నర జిల్లాలు అని మీరు యెంత వెటకారంగా మాట్లాడినా మేము ఆ వ్యంగాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తే మిమ్మల్ని మీ భాషని ఆదరంగా చూసుకున్నట్టు అవుతుందా?ఇంతకీ ఆ “రెండున్నర జిల్లాల” పేర్లు చెప్తారా మీ నోటితో? అని అడిగాను


     దానికి అక్కడ వారిలో ఒకరు ఇచ్చిన జవాబులోని మొదటి భాగం ఇది: (ఇది 1969ల కాలోజి రాసిన పెద్ద కవితలో చిన్న భాగము) ఇగ రెండున్నర జిల్లాలు అంటే క్లియర్ గానే చెప్పిన. 1. కృష్ణా, 2. గుంటూరు 3. ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము.మళ్ళీ అడిగాను,యేమని? ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము – అనేది యేంటి? ప్రత్యేకంగా ఆ జిల్లాలు రెండూ విడివిడిగానే ఉన్నాయి.అందుకనే అడుగుతున్నా, అయితే మూడు జిల్ల్లాలు లేదా రెండు జిల్లాలు అని మామూలు వాళ్ళు అంటారు.కానీ పైత్యకారి తనం ఉన్న వాళ్ళు మాత్రమే రెండున్నర జిల్లాలు అనే వెటకారం ఆడుతారు, అవునా కాదా?నేను దాని గురించి బాబూ అడుగుతున్నది!ఆ పైత్యకారి వెటకారాన్ని కూడా మీరు మమ్మల్ని పొగిడినట్టుగా భావించి మిమ్మల్ని నెత్తినపెట్టుకోవాలన్న మాట. దీనికి వారింకా జవాబు చెప్పలేదు,యేమి చెప్తారో మన కనవసరం.ఒకటి మాత్రం నిజం,అలా మనల్ని వెక్కిరించిన కాళోజీకి మనం కూడా నీరాజనాలు పట్టాం ప్రజాకవి బిరుదు నిచ్చి పొగిడాం, యెందుకు?ఫలితం యేమిటి?


      ఇంతకీ అన్నాన్ని తిట్టిన వాడికి పరిహారం మన పెద్దవాళ్ళు అనుభవంతో తరచి చూసి యేం చెప్పారో తెలుసా?అన్నాన్ని తిట్టిన వాడికి అన్నం దొరక్కుండా పోతుంది, వున్నా తీనలేని దౌర్భాగ్యం దాపరిస్తుంది!మనిషిని తిట్టినా తప్పు లేదు, మనిషిలో తప్పూ వొప్పూ వుండొచ్చు.డబ్బుని తిట్టినా తప్పు లేదు అది పాపపు సొమ్మూ కావచ్చు, కానీ పాపపు తిండి వుంటుందా?!సత్యధర్మన్యాయ ప్రతిష్ఠిత మయిన నా గురు పరంపర - వ్యాస పరాశరాది శిర్డి సాయినాధ పర్యంతం వున్న నా గురు పరంపర -  పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా,ఆ తిట్టిన వాడికీ, పక్కనే వుండి కూడా అది తప్పని అతనికి బుధ్ధి చెప్పని వాళ్లకీ, అతనికి అప్రతిహతమయిన అధికారమిచ్చి అచ్చోసిన ఆంబోతులా వొదిలిన వాళ్లందరికీ ఆ పాపంలో భాగం వుంటుంది.ఆ పాపం తన ఫలితాన్ని తప్పకుండా చూపిస్తుంది.

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...