Thursday 11 September 2014

ప్రపంచంలోని రామభక్త హనుమాన్లందరికీ ఇదే నా ఆహ్వానం!

              ఒక సిధ్ధాంతం సారంలో యెంత గొప్పదయినా కావచ్చు,ఆచరించే వాళ్ళు తెడ్డుశ్రీ లయితే యెలా అఘోరిస్తుందో తెలుసుకోవాలంటే ముతప్పాళ కురంగీన్యాకమ్మ నీ ఆవిడ భక్తుల్నీ చూఒసి తెలుసుకోవచ్చు!నువ్వు కమ్యునిష్టువా కమ్యునిష్టేతరుడివా అనే ప్రశ్నతో సంబంధం లెకుండా ప్రతివాడూ పాటించాల్సిన మానవ సహజమైన మర్యాదలు కొన్ని వుంటాయనేది కూడా లేకుండా నిన్న గాక మొన్న చనిపోయిన బాపు అనే చిత్రకారుణ్ణి వీళ్ళు బజారు కీడుస్తున్న పధ్ధతి చూస్తూ వుంటే వీళ్ళు కమ్యునిజాన్ని తీసుకు రావాలనుకుంటున్నది మనుషుల్లోనా పశువుల్లోనా అనే అనుమానం వస్తున్నది?

              ఇంతకీ వీళ్ళ ఆరోపణ యేమిటంటే ఆ మహా రచయిత్రి ఒక గొప్ప కావ్యం రాస్తే దానికి బొమ్మలు వెయ్యనని తిరస్కరించటం? వెయ్యనంటే వెయ్యనని చెప్పొచ్చుగా అది చెక్కో/డీడీయో గానీ దాని వెనకాల రామ రామ అని రాసి తిప్పి పంపటం దేనికీ అని వీళ్ళ గోల, విన్నవాళ్ళు నవ్వుతారని కూడా లేదు వీళ్ళకి. చెక్కు గానీ డీడీ గానీ ఒకసారి ఒక వ్యక్తికి పంపించాక అది యేమయినా పంపించిన వాడికి అనవసరం. తీసుకున్న వాడు దాన్ని క్యాష్ చేసుకుంటే నీ యెక్క్కవుంటు లోంచి దబ్బు పోతుంది. న్లేదంటే చించేసినా దాచుకున్నా అది చెల్లని ట్రాన్సాక్షన్ గా కొంత కాలమయ్యాక మురిగి పోయి నీ డబ్బు నీ దగ్గీరే వుంటుంది. దాని కంత యేడుపెందుకు?

            వెనక్కాల రాసిన రెండు + రెండు నాలుగక్షరాలకే ఇన్నేళ్ళ తర్వాత గూడా యేడిచేటంతగా మనోభావాలు గాయపడితే మరి ఆ పుస్తకంలో వున్న విషయానికి మా మనోభావాలు యెంత గాయపడాలి? మనుషు లందరికీ యేది చెయ్యాలి యేది చెయ్యగూడదు అనే లెక్కకి, "యెదటి వాడు యేమి చేస్తే నీకు  కష్తం కలుగుతుందో అది నువ్వు యెదటి వాడికి చెయ్యక పోవటం" అనే మర్యాదని వాళ్ళు పాటించరా? సరే, ఒప్పుకుందాం! కేవలం ఆవిడ శైలిలోనే జవాబు చెప్పటం తప్ప అభ్యంతరకరమయిన పదాలేమీ నేను వాడలేదని తెలుస్తుంది.అందులో కొన్ని టైపోస్ ని సవరించి ఇక్కడా ఇస్తున్నాను, చూడండి.

===============
రంగనాయకమ్మ రామాయణాన్ని విమర్సించిన తీరు యెంత అసహ్యంగా వుందో ఒక వుదాహరణ చెప్తాను;
రాముదు శూర్పణఖని చూడగానే లొట్టలేసుకుంటూ చూశాడట!ఆహా!! సీతకన్నా ముందు ఈవిడ(?) కనబడితే ఈమెనే పెళ్ళాడి వుండేవాణ్ణి, ఇప్పుడు చేసుకుంటే జనం నా యేకపత్నీవ్రతాన్ని అనుమానిస్తారేమో అని కంగారు పడ్డాడట!

తనలాంటి మరో రచయిత రాసిన పుస్తకాన్ని విమర్శించేది ఇలాగేనా? ఆ రచయిత ఒక పాత్రని ఒక పధ్ధతిలో సృష్టిస్తే ఆ పాత్రని అవహేళన చేస్తూ కాదు కాదు, ఆ కధ అలా జరగలేదు, ఇలా జరిగింది అని పులుముడు తెలివి చూపిస్తే యెలా వుంటుందో తెలుసా?

నేను జానకి విముక్తి నవల్లొని పాత్రల గురించి, "ఆ జానకి నాకు తెలుసండీ!వాళ్ళు మా ఇంటికి మూడిళ్ళ పక్కనే వుండే వాళ్ళు!! తనకి కనిపించిన మగాడి కల్లా కన్ను కొట్టే అలవాటుండేది, అందుకే వాళ్లత్తా మొగుడూ అలా తిట్టినా కొట్టినా పడి వుంటుంది!" అని అంటే యెలా వుంటుందో అలా వుంటుంది.

కొన్ని లక్షల మంది ఆ కావ్యాన్ని గౌరవిస్తున్నారు అనేది కూడా గట్టి పాయింటు కాదు, విమర్శించిన పధ్ధతి చెత్తగా వుందనేది మాత్రం తిరుగు లేని సత్యం!

ఇక పోతే బాపు గానీ రమణ గానీ వాళ్ళ ప్రవృత్తి లోనే హాస్యం వుంది, వాళ్ళ సహజ ప్రవృత్తి తో ఒక కొంటె పని చేసారు. ఒక సీరియస్ పుస్తకాన్ని చెత్తగా విమర్శించడంతో పోలిస్తే ఆ కొంటెతనం అభ్యంతరకరమైనది కానే కాదు.
===============

             ఈవిడ విషవృక్షం రాయక ముందు స్వీట్ హోం, బలి పీఠం, ఇంకా ఇలాంటి యద్దనపూడి టైపు ఫామిలీ నవల్లు రాసుకుంటూ వుండేది కాస్తా మేధావుల్లోకి యెక్కేసింది - రాముణ్ని తిట్టి గొప్పదయింది?! సాహితీ విమర్శలు ఆర్.యస్.సుదర్సనం గారూ చేసారు, ఈవిడా చేసింది - రెంటికీ హస్తి మశకాంతరం, కాదా!! రామాయణం నిజంగా జరిగిన కధ అయితే అప్పటి కాలంలో వున్న వాస్తవమయిన విషయాల్ని చూపించి వాల్మీకి చెప్పిన అబధ్ధాల్ని నిరూపించాలి.కానీ ఒక కవి రాసిన పాత్రల్ని మరో రకంగా చిత్రీకరించటం యెంత తప్పో తెలియజెప్పాలనే ఒక స్త్రీ పాత్రకి కన్ను కొట్టటం ఆపాదించటం జరిగింది. ఒకవేళ నేను చేసిందానికి చివుక్కు మనే సుకుమారులు ఆవిడ చేసిన దుర్మార్గానికి ఇంకా బాధ పడాలి మరి?!

            నిన్నటి రోజున ఈవిడ రాసిన పుస్తకాలు ఇవ్వాళ యెంతమంది చదువుతున్నారో తెలియదు, కానీ యావత్ స్వాస్థ్యంతి గిరయః అని చెప్పుకున్న వాల్మీకి కన్నా తను గొప్పదని ఆవిడా ఆవిడ అభిమానులూ యెలా అనుకుంటున్నారు!నక్కెక్కడ నాక మెక్కడ? 

        కాబట్టి ఇప్పుటి కయినా శివద్వేషులే నా ఆహారం అనే వీరభద్ర పెరుమాళ్ లాగా రామ భక్తు లంతా వీర హనుమాన్ల మాదిరి ఈ తింగరి మాటలు మళ్ళీ మళ్ళీ  రాకుండా ఒకేసారి గట్టి ప్రతీకారం చెయ్యాలి! ఆవిడింకా బతికి వుండగానే తేల్చుకుంటే ఓ పనై పోతుంది! బెజవాడ లోనో హైదరాబాదు లోనో యెక్కడ వుంటే అక్కడి కెళ్ళి ఇదే ప్రశ్నని తన ముఖం మీదనే అడగాలి, యేమి చెబుతుందో చూద్దాం?

జై శ్రీ రాం!     జై శ్రీ రాం!!     జై శ్రీ రాం!!!


11 comments:

  1. రాముడిని వీళ్ళు ఎన్ని తిట్లు తిట్టినా సైద్దాంతిక విమర్శ అదే విధంగా వీళ్ళ రచనలలోని పాత్రలను తిడితే అది మాత్రం వ్యక్తిగత విమర్శ.. shameful bigotry

    ReplyDelete
  2. రంకుముండ రంగనాయకమ్మ ...టైటిల్ ....ఒక వేశ్య ఆత్మకథ అని క్యాప్షన్ తో ఒక పుస్తకం రాస్తే ఆ రచయితని తెల్లారే సరికి చంపి మానవహక్కుల పరి రక్షణ అనేయగలరు ఎర్ర జనం!!
    ....రామాయణం నౌన్ ఇలా పేరుని అవమాణించడం తనకి ఎంతవరకు సబబు ....

    అందుకే తన పేరు దుర్వినియోగం జరిగితే ఎర్రల దిమ్మతిరగాలి!


    ఆ మధ్య ద్రౌపది అని మరో తింగరి రచన వచ్చింది అస్ గతిమాలిన వాడికి అవార్డు కూడా ఇచ్చారు ..... అందులోని పాత్రలకి సోనియా .... రాహుల్ ...ప్రియాంక ..Rajiv అని పేర్లు మార్చి మళ్ళీ రిలీస్ చేస్తే ......vaaDiki secular ibbandulostaayi!!!

    మనం మూసుక్కూచుంటాం అని రెచ్చిపోతున్న పిక్ష్చి మొక్కలకి సంàధానం చెప్పాలి.

    ReplyDelete
  3. ఆమె పేరు టైటిల్ గా ఒక బూతు కథ రాస్తే...
    ఆ రచయితని తెల్లారే సరికి చంపి మానవహక్కుల పరి రక్షణ అనేయగలరు ఎర్ర జనం!!
    ....రామాయణం నౌన్ ఇలా పేరుని అవమాణించడం తనకి ఎంతవరకు సబబు ....

    అందుకే తన పేరు దుర్వినియోగం జరిగితే ఎర్రల దిమ్మతిరగాలి!


    ఆ మధ్య ద్రౌపది అని మరో తింగరి రచన వచ్చింది అస్ గతిమాలిన వాడికి అవార్డు కూడా ఇచ్చారు ..... అందులోని పాత్రలకి సోనియా .... రాహుల్ ...ప్రియాంక ..Rajiv అని పేర్లు మార్చి మళ్ళీ రిలీస్ చేస్తే ......

    మనం మూసుక్కూచుంటాం అని రెచ్చిపోతున్న పిక్ష్చి మొక్కలకి సంàధానం చెప్పాలి.
    first comment may be offensive so small modification to make it polished!!!!

    ReplyDelete
  4. ఇక్కడ రామాయణాలను భారతాలను విమర్శించే మేతావులు ఇతర మతగ్రంథాలపట్ల బహు గౌరవంగా ఉంటారెందుకని ? ఎవరికోసం ఈ రచయితలు ,ఎవరి తరపున ఏలక్ష్యం కోసం ఇలాంటి చెత్త రచనలనుసాగించారో సమాజానికి అర్ధమైంది. ఐనా ఆకాశంపై ఉమ్మేయాలనుకునే మూర్ఖమేతావులపై ఇంత సున్నితమైన విమర్శలు దున్నపోతుమీదవానచినుకులే

    ReplyDelete
    Replies
    1. ఇతర మతాల వారికి హందువుల కున్న సహాన్మ్ వుందదు,దేహానికే ప్రమాదం!చాలా కాలం క్రితమే ఒక ఇంగ్లీషు సినిమా పత్రికలోనే చదివాను.ఒక హిందీ సినిమా పాటల రచయిత కృష్ణుడికీ రాధకీ వున్న సంబంధం గురించి ఒక పాటలో యెగతాళిగా రాస్తే దానికి రావలసిన వ్యతిరేకత రాకపోవడం చూసి - సాటి రచయిత(ముస్లిం) ఆశ్చర్య పోయాదంట, ఇదే ఒక ముస్లిము ప్రవక్త గురించో అతని కుటుంబ సభ్యుల గురించో ఇట్లా రాసి వుంటే భీబత్సాలు జరిగేవి మీవాళ్ళు చాలా మంచివాళ్ళు సుమా అని!ఇప్పటికీ అదే సహనం యెంతవరకు భావ్యం?

      Delete
  5. విషవృక్షంలో రంగనాయకమ్మగారి స్వకపోల కల్పన కొంతవరకూ ఉన్నదని నేనూ ఒప్పుకుంటాను.

    కానీ ఆవిడ రచన చదివాక నాకు రామాయణంలోని చాలా విషయాలు అర్ధమయ్యాయి (ఆతరువాత అవన్నీ రామాయణంలో ఉన్నా, మర్యాదకోసం వాటిని మరుగుపరుస్తున్నారని రామాయణంపై రాయబడిన ప్రామాణిక గ్రంధాలు చదివి రూఢి చేసుకున్నాను). ఉదాహరణకి చందమామలో రామాయణాన్ని సీరియల్గా చిన్నప్పుడు చదివిన నాకు దశరధుడికి ఎందరు భార్యలు, సీతని ఎవరు ఏ విశేషణాలతో సంబోధించారు, రాముడికి దశరధుని వరాల విషయం తెలుసాలేదా లాంటి విషయాలు ఒకలా అనిపిస్తే, ప్రస్తుతం నేను చదువుతున్న పుస్తకాలు, వింటున్న చాగంటిగారి ప్రవచనాలు నాకు క్రొత్త విషయాలను తెల్పుతున్నాయి. కొన్నాళ్ళ క్రితం బ్లాగుల్లో అశ్వమేధ యాగం గురించి ఒక heated discussion జరిగినట్లు గుర్తు. ఐతే ఆ యాగంలో గుర్రాల ప్రస్తావన, గుర్రంతో పట్ట మహిషిగారు రాత్రిని గడిపే ప్రస్తావన చాగంటిగారు confirm చేశారు. కుశనాభుడి కూతుళ్ళు అగ్నిదేవుడి marriage proposalని తిరస్కరించే ఘట్టంలో చాగంటిగారు చేసిన విమర్శ సూటిగా రుక్మిణిని అవమానించేదిగా ఉంటుంది. ఆయననోతినుండి కార్తికేయుడి జననంవిన్ననాకు ఆఘట్తంలోని అశ్లీలత హాలీవుడ్ సినిమాలోని అస్లీలతలాగానే నచ్చలేదు. గంగావతరణంలో భగీరధునికి భూమిని మోస్తున్న ఏనుగులు కనిపించాయని చెప్పినప్పుడు, సుగ్రీవుడు వానరసేనను లలుదిక్కులకూ పంపిస్తూ దేశదేశాల వర్ణనలు చేస్తూ ఆయన 'భౌగోళిక జ్ఞానం' (ఈమాట చాగంటిగాఎరే అన్నరు) బయటపెట్టుకున్నప్పుడూ నేను నవాపుకోలేకపోయాను. అంతెందుకు రాముడు కైకేయి గురించి అయోధ్యలో ఒకలాగాను (దీన్ని రాముదిలోని సంస్కారంగా చాగంటిగారు వివరించారు), అడవిలో ఇంకోలాగానూ (దీన్నిమాత్రం human flawగా విస్మరించాలని అదే చాగంటివారు మాటమార్చేశారు) మాట్లాడుతాడు. భరతుణ్ణీ, సీతనీ రాముడు అనుమానించడాన్ని నేను రాముడిలోని సుగుణంగానో లేక వారి సుగుణాలని ప్రపంచానికి వెల్లదిచేసే strategyలో భాగంగానో చూదలేకపోయాను.

    ReplyDelete
    Replies
    1. ఇవ్వాళ ప్రభుత్వాలు క్లవుడ్ సీడింగుకి మొదటిసారిగా ప్రయత్నించినప్పుడు కూడా విమర్సలు వచ్చాయి - మూడనమ్మకం అన్నంతగా.

      తోకలున్న కోతులు మానవభాషలో మాట్లాడటం అసహజమని ఆధునికుదే అయిన శుంగవంశపు రాజయిన పుష్యమిత్రుడి కాలంలోని వాల్మీకికి తెలియదా?

      ఒకటి గమనించండి -స్త్రీ ఇచ్చాపూర్తిగా చేసిన దాన్ని ఇటు ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చిన వేదవ్యాసుడు కానీ కామానికి ప్రాధాన్యత ఇచ్చిన వాత్స్యాయనుడు కానీ అశ్లీలంగా చూడలేదు.వాత్స్యాయనుడైతే పారదారికం(పక్కోడి పెళ్ళానికి లైనెయ్యటం యెందుకు!యెలా?),వేశ్యాధికరణం(వ్యభిచారాన్ని వ్యవస్తీకరించతం యెలా?) అనేవాట్ని యెంతో విస్తారంగా చర్చించాడు.కాబట్టి ఇవ్వాళ మనకి అశ్లీలంగా అనిపించినవి అప్పుడు కాదు కాబట్టి వాటి ప్రస్తావనకి వాళ్ళు కించపడ లేదు.

      ప్రతి కావ్యంలోనూ అలంకాం అనేది సింపులు గానే వుండాలని లేదు.వుత్ప్ప్రేక్ష అనే అలంకారానికి సహజ ధర్మమే వున్నదాన్ని పదినలు యెక్కువ చేసి చెప్పటం!రామాయణంలో వున్న భౌగోళిక వర్ణనల్ని అంతకన్నా యెక్కువగా తీసుకుంటే నవ్వే వొస్తుంది, నాకయినా సరే!.

      Delete
  6. "తోకలున్న కోతులు మానవభాషలో మాట్లాడటం అసహజమని ఆధునికుదే అయిన శుంగవంశపు రాజయిన పుష్యమిత్రుడి కాలంలోని వాల్మీకికి తెలియదా?"

    ఈ పుష్యమిత్రుడి కాలమూ, కధా కమానిషూ తెలియజేయగలరా దయచేసి. మీరన్న విషయం కొంచెం కొత్తగా ఉంది.

    "ఒకటి గమనించండి -స్త్రీ ఇచ్చాపూర్తిగా చేసిన దాన్ని ఇటు ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చిన వేదవ్యాసుడు కానీ కామానికి ప్రాధాన్యత ఇచ్చిన వాత్స్యాయనుడు కానీ అశ్లీలంగా చూడలేదు.వాత్స్యాయనుడైతే పారదారికం(పక్కోడి పెళ్ళానికి లైనెయ్యటం యెందుకు!యెలా?),వేశ్యాధికరణం(వ్యభిచారాన్ని వ్యవస్తీకరించతం యెలా?) అనేవాట్ని యెంతో విస్తారంగా చర్చించాడు.కాబట్టి ఇవ్వాళ మనకి అశ్లీలంగా అనిపించినవి అప్పుడు కాదు కాబట్టి వాటి ప్రస్తావనకి వాళ్ళు కించపడ లేదు."

    మీరన్నది ఒప్పుకుంటాను. అసలు సెక్సు విషయంలో హిందువుల నైతికత is an outright imitation of the Christian morality. ఒక్కసారి బైబిల్ గుర్తుతెచ్చుకోండి, Adam పతనానికి eve కారణం (how about Lucifer?). How about witch-hunts? After the advent of Christianity, Hinduism faced a challenge in presenting their religion as a chastier faith, hence the importance to chastity of woman and new found respect for the celibacy of men. బ్రహ్మచర్యం అన్నమాటకూడా ఈ నేపధ్యంలో refraining from sex అన్న కొతా అర్ధం సంతరించుకుంది. రామాయణ భక్తుల మీద నా అభియోగమల్లా ఒక్కటే : ఇప్పతివారు అప్పటివారికనా ఎక్కువ "నైతిక" బతుకులు బతుకుతున్నప్పుడు, అప్పటి "నైతికత" ను వాడి, ఇప్పటివారిని ఎలా విమర్శించగం అన్నదే. రామాయణం ప్రస్తుత కాలనికి ఆదర్శమని బోధించేవారుకొందరు నేను లేవనెత్తిన ప్రశ్నల్ని విస్మరించడమో, దాటవేయడమో చేస్తుంటారు.


    "ప్రతి కావ్యంలోనూ అలంకాం అనేది సింపులు గానే వుండాలని లేదు.వుత్ప్ప్రేక్ష అనే అలంకారానికి సహజ ధర్మమే వున్నదాన్ని పదినలు యెక్కువ చేసి చెప్పటం!రామాయణంలో వున్న భౌగోళిక వర్ణనల్ని అంతకన్నా యెక్కువగా తీసుకుంటే నవ్వే వొస్తుంది, నాకయినా సరే!."

    scoutsలో ఒక కష్టమైన knot వెయ్యడనికి అనుసరించవలసిన stepsని పాముని తరమడం అనే కధగా చెబుతారు. రామాయణ భాగవాతాలూ అంతే. They were meant to convey something else. And we were stuck up with something else. చెప్పదలుచున్న విషయాలని కధల్లో దాచి చెప్పడమనేది ప్రపంచంలో ప్రతి ఒక్క సాంప్రదాయంలోనూ చూడవచ్చు. కానీ ప్రతిసాంప్రదాయంలోనూ knot(అసలు విషయం)ని వదిలిపెట్టి, పాము కధ నిజమని భావించేవాళ్లనీ, పాముకధకు historical significance అంటగట్టేవాళ్లని నేను భక్తులంటాను. నావరకు నాకు Sherlock Holmes యొక్క ఉనికి ఎంత నిజమో రాముడి ఉనికి అంతే నిజం.

    ReplyDelete
    Replies
    1. రాహుల్ సాంకృత్యాయన్ గురించి వినే వుంటారు.కమ్యునిష్టు అయినా సంస్క్ర్తంలో మహా పండితుడు.అప్పట్లో ఆయన చేసిన వాదాల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా మన ప్రాచీన సాహిత్యంలో ఆయన కున్న పట్టుని మెచ్చుకున్నారు.ఆయన వాల్మీకి గురించి చేసిన కాల నిర్ణయం అది.మామూలుగా అవతారికలో వొచ్చే ఆ పిట్టకధలూ లోపల వున్న కావ్యరమ్యత కోసం చేసిన కల్పనలూ నిజం అనుకుంటే మనం వాల్మీకి అనే వ్యక్తి బోయవాడు కానీ గజదొంగ అయి వుండి మంత్రోపదేశంతో కవిగా మారాడనే అంకుంటాం.కానీ Etimology అనే ఒక టెక్నిక్ ఫాలో అయ్యి ఆయన వాల్మీకి శుంగ వంశపు రాజు పుష్యమిత్రుడి కాలం వాడని తేల్చాడు.

      ఆ Etimology ప్రకారం భాషలోని ప్రతి మాటకీ కాలాన్ని బట్టి మార్పు వుంటుంది.ఒకే మాట కాలం గడిచే కొద్దీ మారే మార్పుల్ని స్టడీ చెయ్యటం ఒక అంశం అయితే ఒకే కాలం లోని గ్రంధాలన్నింటిలో - అవి వేరు వేరు రచయితలు రాసినా సరే - ఒకే రకమయిన పదాలు రిపీట్ అయితే ఆ గ్రంధాలన్నింటినీ ఒకే కాలానికి సంబంధించినవిగా భావించవచ్చు ననేది మరొక సూత్రం.దీని ప్రకారం క్రీస్తు పూర్వం 185-149 మధ్య కాలానికి చెందిన శుంగ వంసపు రాజు పుష్యమిత్రుడి కాలానికి చెందిన కవిగా నిర్ధారించాదు.

      చందస్సులో ఓ అంటే ఢం తెలియకుండా యెవ్వడూ ఆ స్థాయిలో కవిత్వం చెప్పలేడు!మిగతా కవు లందరి లాగే మామూలుగానే చదువుకుని కవిత్వం నేర్చుకుని కవిత్వం చెప్పిన వాడే.కాకపోతే అతను అవతారికలో చెప్పుకున్నంత ధీమాగా తన గురించి ప్రపంచంలో మరే కవీ చెప్పుకోలేదు!"ఈ ప్రపంచంలో నదులు పారుతున్నంత వరకూ పర్వతాలు స్థిరంగా వున్నంత వరకూ నా కధ నిలబడుతుంది" - యెంత ధీమానో చూశారా?

      Delete
    2. హరిబాబు గారు,

      పుష్యమిత్రుని ప్రసక్తి బాగానే తీసుకు వచ్చారు. అసలు ఈ పుష్యమిత్రుడు ఎవరు? బౌద్ధ మతాన్ని స్వీకరించిన మౌర్య వంశపు చివరి రాజును వధించి రాజ్యాన్ని చేజిక్కించుకున్న వాడు. తర్వాత ఇతడు అప్పటికి చాలాకాలం కిందే మూలన బడ్డ సనాతన ధర్మానికి తిరిగి ప్రాణం పోశాడు.

      మరి చిరిగి మూలన పడ్డ పాత కోటును తిరిగి వాడాలంటే అతుకులు వేయాలి గదా! అలాంటి అతుకులే రామాయణ మహాభారతాలు. కాబట్టి ఆ అతుకులకు కావలసిన ముళ్ళను కవులచేత వేయించాడన్న మాట!

      ఇక మీరు చెప్పిందీ, Iconoclast గారు చెప్పిందీ సరిపోయింది కదా!

      Delete
    3. అవును,నేను అవన్నీ చదివాను.వాల్మీకి బోయవాడు.రామ మంత్రొపోపాసనతో రామాయణం రాయగలిగాడని నేను అనుకోవడం లేదు. నేను హిందువునే కానీ హిదూత్వంలో వున్న ప్రతి చెత్తనీ సమర్ధించను.నాకు మొత్తం హిదూత్వంలో వున్న అన్ని విషయాల గురించీ తెలియదు కూడాను.కాకపోతే నాకు తెలిసిన ప్రతి విషయాన్నీ యదార్ధమా కాదా, అది నా జీవితంలో నేను వుపయోగించుకోగలనా లేదా అనే వుపయోగిత దృష్తితో చూసి నాకు హేతుబధ్ధంగా అనిపిస్తేనే నమ్ముతాను.

      రామాయణం లో పిడకల వేట అనే మాట విన్నారు కదా!అవి మామూలు పిడకలు కాదు,బౌధ్ధ మత ప్రవచనాల్లో వుండే పిటకాలు.వాటిని రామాయణంలో యెందుకు వెతికారు?రామ కధ లో కూడా బుధ్ధుడు నగరాన్ని వదిలి సన్యసించడాన్ని వనవాసంగా రూపించాడు వాల్మీకి.శంకరాచార్యుల వారి సిధ్ధాంతాన్ని కూడా ప్రచ్చన్న బౌధ్ధం అంటారని మీకూ తెలిసే వుండొచ్చు.అలా బౌధ్ధమతం యొక్క విజృంభనకి ప్రాభవం తగ్గిన హిందూ మతాన్ని తిరిగి ప్రాభవంలోకి తీసుకు రావడానికి తన ప్రయత్నం తను చేశాడు, అది తప్పు కాదని నేననుకుంటున్నాను. యే కాస్త తెలివి వున్నా తను అభిమానించే విషయాన్ని అదే గొప్ప్దనఓ, కుద్రక పోతే అది కూడా గొప్పదే అనో హైలైట్ చేసి దానికి పేరు తెస్తూ పనిలో పనిగా తనూ పేరు తెచ్చుకోవడం యెక్కడ జరగడం లేదు?అదే తప్పయితే అమ్మ నవల ద్వారా మాక్సిం గోర్కీ చేసింది కూడా తప్పవ్వాలి.బౌధ్ధులు కూడా రాజుల్ని ఆశ్రయించుకుని రాజుల ద్వారా విహారాలు కట్టించుకుని యెదిగిన వాళ్ళే.వాళ్ళు కూడా వాళ్ళ పులుముళ్ళు వాళ్ళూ పులిమిన వాళ్ళే!

      రామాయణం వాల్మీకి అవతారికలో చెప్పుకున్నట్టు కాలాలకీ ప్రాంతాలకీ అతీతంగా నిలబడ్దానికి కారణం హిందూమతానికి అతుకులు వెయ్యడం కారణం కాదని నేను అనుకుంటున్నాను.ఈ ప్రపంచంలో నైతిక సూత్రాలు దాదాపుగా యేదో ఒక మతానికి అనుబంధమైనవే అయి వున్నాయని నా పరిశీలన.అన్ని రకాల సామాజిక ప్రమయిన నీతులూ వివాహ విషయాల్లో వుండాల్సిన ప్రవర్తన గురించే మొదలు పెడతాయి.దానికి కారణం చాణక్యుడి అర్ధశాస్త్రం చదివితే తెలుస్తుంది.

      ఆడ కానీ మగ కానీ పెళ్ళి అయేవరకూ వాళ్ళని ఫలానా వాళ్ళ కొడుకు/ఫలాన వాళ్ళ కూతురు అనే వ్యహరిస్తారు చాలా సహజంగా. ఈ పెళ్ళి అనే దానిలో వుండాల్సిన మౌలిక సూత్రాల చుట్టూ తిరిగే కధ కాబట్టి దానితో ప్రతివాళ్ళూ అటాచ్ అవుతారు. ఒక ఆదర్శవంతమయిన జంట యెలా వుండాలి అనేదానికి వుదాహరణగా వుండటం వల్లనే పెళ్ళి పత్రికల్లో "జానక్యాః కమలా" శ్లోకాన్ని వేసేవాళ్ళు!పాత కాల్పు కావ్యాలన్నింటి లోనూ అభూత కల్పనలూ, ఇప్పటి దృష్టితో చూస్తే నమ్మలేని విషయాలూ చాలా వున్నాయి.రామాయణంలో వున్న కల్పనలు కూడా వాటికి యెక్కువా కాదు,తక్కువా కాదు.

      మౌలికంగా సామాజిక,రాజకీయ,సాంస్కృతిక ధర్మాలన్నింటికీ మూలమయిన దాంపత్య ధర్మం మీద రామాయణం పట్టు సాధించింది.ముప్పాళ్ళ రంగనాయకమ్మ హుందాగా రామాయణం మీద ఒక విమర్శ చెయ్యాలి అని అనుకుంటే మొదట ఆ ధర్మం తప్పు అని చెప్పి దానికి తను ప్రతిగా అంతకన్నా వున్నతమయిన దాన్ని ప్రతిపాదించి వుంటే నేను చాలా సాదరంగా ఆ విమర్శని ఆహ్వానించి వుండేవాణ్ణి!

      నాకు ఆచరణ కోసం ఇప్పటి కన్నా వున్నతమైనది యెవరయినా ప్రతిపాదిస్తే తప్పకుండా దానినే అనుసరించడానికి వెనుకాడను.నేను పాటించేది హిందూ ధర్మాన్ని మాత్రమే.ఆ ధర్మం ఈ ముప్పాళ్ళ రంగనాయకమ్మ ప్రతిపాదించిన వున్నత ధర్మాన్ని పాటించడానికి నాకు అడ్డు రాదు కూడా!కానీ ఆవిడ చేసింది అలాంటి సీరియస్ పని కాదు.ఆవిడ సీరియస్ గా చెయ్యలేదని కూడా మీకు తెలుసు.నేనువ్యత్తిరేకించినది విమర్శ లోని వెకిలితనాన్ని, అనతే తప్ప రామాయణం పట్ల నాకు మూఢభక్తి లేదు.

      వెకిలితనానికి జవాబు కూడా వెకిలిగా ఇస్తేనే బ్యాలెన్సు సరిపోతుంది?!అది నా అభిప్రాయం మాత్రమే!?
      >>
      ఇక మీరు చెప్పిందీ, Iconoclast గారు చెప్పిందీ సరిపోయింది కదా!

      yes, I agree with him.No regret!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...