సీ|| ఆంధ్ర బిర్యానీని పేడ యనిం డొక
బాడుఖావు! పరుల భోజనాన్ని
కావరమున వెటకారించె టోడు మ
నిషె కాడుగా, పవరిచ్చి రెట్ల
ఘనమైన గా తెలంగాణోళ్ళు? మొదలెమొ
మా తిండిపై వూస్తడా, అటెన్క
మమ్ముల్ని కడుపుల బెట్కొని సూస్తడా!
గిట్ల జూస్తె పురుషుడూ గట్ల జూస్తె
తే|| ఆడదీ ఐన బహురూపి లాగ వుంది
గా దిమాగు యెక్వోని నయా జమాన!!
వూరు పేరు లేనోళ్ళు గొప్పోళ్ళ నేందొ
పనికిమాలినో ళ్ళంటున్రు పొగరు బట్టి!!!
(28/07/2014)
______________________________________________________
బాడుఖావు! పరుల భోజనాన్ని
కావరమున వెటకారించె టోడు మ
నిషె కాడుగా, పవరిచ్చి రెట్ల
ఘనమైన గా తెలంగాణోళ్ళు? మొదలెమొ
మా తిండిపై వూస్తడా, అటెన్క
మమ్ముల్ని కడుపుల బెట్కొని సూస్తడా!
గిట్ల జూస్తె పురుషుడూ గట్ల జూస్తె
తే|| ఆడదీ ఐన బహురూపి లాగ వుంది
గా దిమాగు యెక్వోని నయా జమాన!!
వూరు పేరు లేనోళ్ళు గొప్పోళ్ళ నేందొ
పనికిమాలినో ళ్ళంటున్రు పొగరు బట్టి!!!
(28/07/2014)
______________________________________________________
నాకు మొదటి నుంచీ తెలంగాణా వుద్యమాన్ని గురించి ఒక సందేహం పట్టి పీడిస్తూ ఇప్పటికీ జవాబు దొరక్కుండా యేడిపిస్తుంది - అంత చదువుకుని ఇంత చెత్తగా మాట్లాడుతున్నారు, యేమిటి వీళ్ళ సంస్కారం? పోనీ తెలంగాణా సంస్కృతే అంత అనుకుందామా అంటే - నాకు వస్తుతః తెలియదు గనక వారూ వీరూ చెప్పిందే ఆధారం, మరి గొల్లపూడి మారుతీ రావు గారి దగ్గిర్నుంచీ అందరూ చాలా గొప్పగా పొగుడుతున్నారు!యెంత వైరుధ్యం?యే ప్రజల కోసం పోరాడుతున్నాం అంటున్నారో ఆ ప్రజల సంస్కారానికి యే మాత్రం సంబంధం లేకుండా ప్రవర్తించే వాళ్ళు తామే తెలంగాణా ప్రజలకు నిజమయిన ప్రతినిధులుగా డప్పు కొట్టుకుంటున్నారు!
న్యాయ పోరాటం పేరుతో వీళ్ళు చేసిన వుద్యమ విధానాన్ని చూస్తే ప్రపంచంలో న్యాయం కోసం పోరాడిన వాళ్లంతా సిగ్గుతో తల దించుకోవాలి!మా వుద్యోగాలు లక్షల్లో లాకున్నారు, మమ్మల్ని మా హైదరాబాదు నుంచే మెడబట్టి గెంటేసి కులుకుతున్నారు - కావాలంటే గిర్గ్లానీ రిపోర్టు చూడండని యెక్కడ బడీతే అక్కద రెచ్చి పోయారు, చదువుకున్న వాళ్ళు మరీ ఇంతగా అబధ్ధాలు చెప్పగలరని అనుకోలేదుగా - ఈ మధ్య వరకూ నేనూ నిజమే నని నమ్మేశా!తీరా చూస్తే ఆయన వీళ్ళ వాదనకి పూర్తి విరుధ్ధంగా వుల్లంఘనలు అన్ని జోన్ల లోనూ జరిగాయి, అందరూ నష్టపోయారు అని నిక్కచ్చిగా చెప్పాడు.ఈ ప్రస్తావన మూడుసార్లు గ్రీన్ స్టార్ అనే తెలంగాణా మేధావి నుంచి వచ్చింది.మొదట మాలతీ మాధవం బ్లాగులో ఈ విభజన గురించి ఆమె నాకు ఈ లెక్కలూ డొక్కలూ యేమీ తెలియవు కానీ విడిపోవటం బాధగా వుంది అనే ధోరణిలో వుంటే అరిభీకరంగా చెల రేగిపోయాడు - గిర్గ్లానీ రిపోర్టు గురించి. ఒక లింకు గూడా ఇచ్చేశాడు - అది గిర్గ్లానీ గారు ఈనాడు కి ఇచ్చిన ఇంటర్వ్యూ.అక్కడా విలేఖరి యెవరు నష్ట పోయారు, యెవరు లాభ పడ్డారు? అని అడిగితే అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి వెళ్ళగలిగిన వాళ్ళు లాభ పడ్డారు, వెళ్ల లేని వాళ్ళు నష్ట పోయారు అని చెప్పాడు.ఆమె ఈ పాయింటు యెత్తి జవాబు చెప్పాక మళ్ళీ అటు నుంచి జవాబు లేదు?
ఈ క్లూ పట్టుకుని అసలీ గిర్గ్లానీ గారు యేం చెప్పాడు అనే అనుమానం వొచ్చి వెతికితే ఈ లింకు దొరికింది.తీరిగ్గా అదంతా చదివి ఈ వడ్లగింజలో బియ్యపు గింజ కింత రాధ్ధాంతమా? అనే పోస్టు వేశాను.ఆయన ఈ జోనల్ సిస్టం గురించి చాలా చెప్పాడు.మొత్తం మీద దాని సారాంశం యేమిటంటే - అది కానీ అంతకు ముందు ఈ వుద్యోగాల విషయాలకి స్మబంధించిన రిపోర్టుల స్వభావ మంతా ఒకటే!మామూలుగా యే శాఖలో నయినా శాఖాదిపతులుగా గెజిటెడ్ స్థాయి గలిగిన అధికార్లు వుంటారు.వీళ్లు కింది స్థాయిలో నాన్-గెజిటెడ్ వాళ్లని తీసుకోవటానికి సంబంధించిన తకరారు లో వీటి ప్రమేయం వస్తుంది.పాత రిపోర్టులతో సహా తన రిపోర్టు కూడా యెందుకని నిరుపయోగం అవుతుందో కూడా చెప్పాడు.ఈ రిపోర్టు లన్నీ సలహాల కోసమే తప్ప అధికారికం గా పాటించి తీరాలన్న నిబంధన యే రిపోర్టు విషయంలోనూ లేదు.అన్ని రకాల నిబంధనల కన్నా పైన ఆ అధికారి విచక్షణ మాత్రమే నిర్ణయానికి కీలకం అని ఆయనే చెప్పాడు.ఈ రిపోర్టు ల్లోని అంశాల్ని ప్రభుత్వ పరమయిన విధి విధానాల్లోకి అంటే రూల్ బుక్ లోకి యెక్కించనంత వరకూ యేమీ ఫలితం వుండదన్నాడు. యెందుకంటే, శాఖాపరంగా ఒక వుద్యోగి మీద దర్యాప్తు జరపాలంటే తను తన రూల్ బుక్ ని ఫాలో అయ్యాడా లేదా అనే చూస్తారు తప్ప గిర్గ్లానీ రిపోర్టును ఫాలో అయాడా లేడా అని చూడరు.ఇంకా ఇంట్రో లోనే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి మామూలు వాళ్ళకి కాదు - వీటి గురించి ప్రభుత్వాన్ని యెలర్ట్ చెయ్యాల్సిన ప్రభుత్వ సలహాదార్లకే గందరగోళం వుందన్నాడు. అంత గందరగోళం వున్నప్పుడు జరిగిన వాట్ని కూడా కావాలని తమకు అన్యాయం చేసినట్టుగా గయ్యాళి తనంతో రెచ్చి పోయారు!మరి అన్ని ప్రాంతాల్లోనూ వుల్లంఘనలు జరిగాయి, అన్ని ప్రాంతాల వాళ్ళూ నష్ట పోయారు అని ఆయన తెగేసి చెప్పినప్పుడు ఆంధ్రా రాయలసీమ వాళ్ళకీ అన్యాయం జరిగినట్టే కదా?ఆ అన్యాయానికి తెలంగాణా వాళ్ళు కారణ మయినట్టే కదా?
మరో చోట ఇదే పెద్దమనిషి గిర్గ్లానీ గారి ఈనాడు వ్యాఖ్యని కొంచెం మెలితిప్పి వాదిస్తూ కనబడ్దాడు.చర్చలో వారే ఈ రిపోర్టు గురించి యెత్తేసరికి అన్ని జోన్లలోనూ జరిగాయని అంటున్నారు కదా అనే జవాబు వేశాను.దానికి వారు "అన్ని జోన్లలో జరిగాయి, నిజమే. కాని వారు ఇంకో విషయం కూడా చెప్పారు, అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు అని. అంటే హైదరాబాదు అని నేను అనుకుంటున్నాను. అసలు ఏ ఏ జోన్ లలో ఎంతెంత అక్రమాలు జరిగాయో ప్రభుత్వమే ఒక శ్వేత పత్రం ఎందుకు విడుదల చెయ్యదు?" - అని మరో ప్రశ్న వేసారు. వారు అంటున్నది "అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు" - అని. కానీ ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిర్గ్లానీ గారు చెప్పింది ఇది,"ఒక్క తెలంగాణా వారే నష్టపోలేదు.అన్ని ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది.మేలు జరిగిందెవరి కంటే అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి తరలి వెళ్లగలిగిన వారు లబ్ధి పొందారు." ఆయన చెప్పింది వెళ్ళగలిగిన వాళ్ళు లాభ పడ్దారు అని.ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కృష్ణా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?స్పష్టంగా చెప్పిన దాన్నే ఒప్పుకోనప్పుడు శ్వేతపత్రాలు సాక్ష్యానికి పనికొస్తాయా?వారు యే గిర్గ్లానీ కమిటీ రిపోర్టును గురించి మాకు అన్యాయం జరిగిందని చెప్తుందని వూదరగొట్టారో ఆ రిపోర్టు తయారు చేసిన పెద్ద మనిషే అంత స్పష్టంగా మీ మాట తప్పు అంటుంటే ఇంకా శ్వేతపత్రం అంటారేమిటి? - అని నిగ్గదీశాను.మళ్ళీ జవాబు చెప్పలేదు,మౌనమే సమాధానం.మళ్ళీ అక్కదే మరొక పాయింటు మీద నాకౌ ప్రశ్న వేస్తే - మీ ప్రశ్నకి నేను జవాబు చెప్పేముందు మీరు నాకో ప్రశ్నకి జవాబు బాకీ వున్నారు ముందు అది తీర్చండన్నాను.అదీ భేతాళుడి ఆఖరి ప్రశ్నే అయింది - అంతతో నాకు మల్ళీ ఆ ప్రశ్న యెవ్వర్నీ వెయ్యకూడదన్నంత విరక్తి పుట్టింది!
అసలు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం యేమిటంటే |violations| అంటున్న |deviations| అన్ని జోన్ల లోనూ సమానంగానే జరిగాయి, ప్రత్యేకంగా ఒక జోను నష్టపోయింది అని చెప్పలేం అని అంత ఖచ్చితంగా చెప్తే మాకు అన్యాయం జరిగిందని గిర్గ్లానీ కమిషన్ రిపోర్తులో ఉంది, వెళ్ళి చూసుకోండని వీరంగాలు వేశారు. మిగతా అన్ని జోన్లలోనూ అంతా బాగనే ఉండి ఒక్క తెలంగాణాలోనే జరిగితే కదా వారికి ప్రత్యేకంగా అన్యాయం జరిగినట్టు?ఇంత కాలం నేను అసలు గిర్గ్లానీ కమిటీలో యేం ఉందో చూడాలని అనుకోకపోవటానికి కారణం మేధావులూ విద్యావంతులూ సంస్కారం గలిగిన వాళ్ళు మరీ దుర్మార్గంగా అబధ్ధాలు చెప్తారా అనే భరోసా తోనే!తీరా చూస్తే పరిస్థితి ఇది.
అసలు ఒక విషయం నిజమా అబధ్ధమా అని యెలా కనిపెట్టాలి?ఒక విషయం గురించి యెదటి వ్యక్తి వెయ్యి వాక్యాలు చెప్తే మొదటి వాక్యానికీ వెయ్యవ వాక్యానికి అర్ధంలో తేడా వొస్తే అబధ్ధం అని తేలుసుకుంటాం, కదా? ఒక వేళ ఈ వెయ్యి వాక్యాల్లో యే విరుధ్ధతలూ లేకపోయినా వెయ్యిన్నొకటో వాక్యం కొత్తగా తెలిసి దానికి గట్టి సాక్షాలు ఉంటే ఈ వెయ్యి వాక్యాలూ నిజమనిపించేటట్టు అంతా యేకసూత్రంగా ఉన్నా అవన్నీ అబధ్ధాలు అయి పోతాయి,అవునా? ఇప్పుడు అసలు విషయంలో వైరుధ్యాలు ఉన్నా యెదటి వాళ్ళకి తెలిసే వీలు లేదనుకుని వాటిల్లో కొన్నిట్ని దాచేసి అంతా తమ వాదానికి అనుకూలంగా ఉన్నవాట్ని మాత్రమే చెప్తే అబధ్ధం కూడా నిజమయి పోతుంది గదా!తెలంగాణా వాదులు వాదనల్లో ఇదే పద్ధతిని అనుసరించారు.వారంతట వారు చెప్తే తమకు అనుకూలంగా లేని సగాన్ని దాచేసి అనుకూలంగా వున్న సగాన్ని మాత్రమే చెప్పటం,ఇతర్లకి ఆ మిగతా సగం కూడా తెలిసి నిలదీస్తే చల్లగా జారుకోవటం!!
కలిసుండడం వల్ల తెలంగాణా భాషకి అన్యాయం జరిగిందనీ కృష్ణా జిల్లా మాండలికాన్ని అధికార భాషగా చేస్తే భరించాల్సి వొచ్చిందనీ చెబుతున్నారు. అది నిజమేనా? నిజంగా కృష్ణా జిల్లా మాండలికం ఇలాగే ఉంటుందా? కృష్ణా జిల్లా మాండలికాన్నే గనక కుట్ర పూరితంగా పైకి తీసుకొస్తే ఒక్క తెలంగాణా వాదులేనా రాయల సీమ వాళ్ళూ గొడవ చెయ్యరా? యే ఇద్దరు రెండు వేర్వేరు జిల్లాల నుంచి వొచ్చ్చిన వాళ్ళు యెవడి భాషలో వాడు మాట్టాడుకుంటూ పోతే వ్యవహారం నడుస్తుందా? అందువల్ల అప్పటి వాళ్ళు మాండలిక వ్యవహారిక తెలుగు ని కాకుండా అందరూ అర్ధం చేసుకొగలిగే విధంగా భాషని సామాన్యీకరించారు? ఇప్పుడు బ్లాగుల్లో మనందరం వాడుతున్నదీ అదే, యే ప్రాంతీయ పదాలూ లేని అందరికీ అర్ధమయ్యే సామాన్య తెలుగు. ఇది కూడా తప్పేనా?ఆయా మాండలికాలకి ఆదరణని కల్పించడం అనేది ఆ భాషలో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు తమ రచనల్లో ఉపయోగించి మిగిలిన వారికీ పరిచయం చేస్తే మిగిలిన వారు అందులోని స్వారస్యాన్ని గ్రహించి మెచ్చుకుంటారు. తిక్కన గారు తన పదిహేను పర్వాల తెలుగు భారతంలో నెల్లూరు జిల్లా మాండలికపు సొంపుని వాడినట్టుగా శ్రీ శ్రీ గారు చెప్పగా విన్నాను. ఆ రకంగా నెల్లూరు జిల్లా మాండలికం తన పలుకుబడులతో సహా భారతేతిహాసంలో ఒక భాగం కాగలిగింది. దీన్ని యెవరయినా వ్యతిరేకించగలరా? మరో విధంగా యే ఒక్క భాష నయినా అధికారికంగా ప్రోత్సహిస్తే మిగిలిన వారు ఊరుకుంటారా?
మరి ఇంతటి భాషాభిమానమూ అందెశ్రీ గారు నూతన తెలంగాణా రాష్ట్ర గీతం ఆ పాత తెలుగు లోనే రాసినప్పుడు యేమయ్యిందో?యేది చేసినా వాళ్లంతట వాళ్ళకి తోచి చెయ్యాలే తప్ప మనం చెప్పితే తప్పన్నమాట!నేను ఒక తెలంగాణా వారి బ్లాగు పోష్టులో ఒక టపాను చూశాను. అక్కడ నేను ఒక ప్రశ్న అడిగాను. "ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు" - అనే ప్రస్తావన చూసి అయ్యా, ఈ అర జిల్లాకు అర్ధ మేమిటో సెలవిస్తారా?భౌగోళికంగా కానీ, సామాజికంగా కానీ,సాంస్కృతికంగా కానీ, వ్యావకారికంగా కానీ అయితే మూడు జిల్లాలు లేకపోతే రెండు జిల్లాలు ఉంటాయి.కానీ మీరు రెండున్నర జిల్లాలు అంటున్నారు.దాని అర్ధం కొంచెం విపులంగా వివరిస్తే బాగుంటుంది. మొదలు పెట్టటమే రెండున్నర జిల్లాలు అని మీరు యెంత వెటకారంగా మాట్లాడినా మేము ఆ వ్యంగాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తే మిమ్మల్ని మీ భాషని ఆదరంగా చూసుకున్నట్టు అవుతుందా?ఇంతకీ ఆ “రెండున్నర జిల్లాల” పేర్లు చెప్తారా మీ నోటితో? అని అడిగాను
దానికి అక్కడ వారిలో ఒకరు ఇచ్చిన జవాబులోని మొదటి భాగం ఇది: (ఇది 1969ల కాలోజి రాసిన పెద్ద కవితలో చిన్న భాగము) ఇగ రెండున్నర జిల్లాలు అంటే క్లియర్ గానే చెప్పిన. 1. కృష్ణా, 2. గుంటూరు 3. ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము.మళ్ళీ అడిగాను,యేమని? ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము – అనేది యేంటి? ప్రత్యేకంగా ఆ జిల్లాలు రెండూ విడివిడిగానే ఉన్నాయి.అందుకనే అడుగుతున్నా, అయితే మూడు జిల్ల్లాలు లేదా రెండు జిల్లాలు అని మామూలు వాళ్ళు అంటారు.కానీ పైత్యకారి తనం ఉన్న వాళ్ళు మాత్రమే రెండున్నర జిల్లాలు అనే వెటకారం ఆడుతారు, అవునా కాదా?నేను దాని గురించి బాబూ అడుగుతున్నది!ఆ పైత్యకారి వెటకారాన్ని కూడా మీరు మమ్మల్ని పొగిడినట్టుగా భావించి మిమ్మల్ని నెత్తినపెట్టుకోవాలన్న మాట. దీనికి వారింకా జవాబు చెప్పలేదు,యేమి చెప్తారో మన కనవసరం.ఒకటి మాత్రం నిజం,అలా మనల్ని వెక్కిరించిన కాళోజీకి మనం కూడా నీరాజనాలు పట్టాం ప్రజాకవి బిరుదు నిచ్చి పొగిడాం, యెందుకు?ఫలితం యేమిటి?
ఇంతకీ అన్నాన్ని తిట్టిన వాడికి పరిహారం మన పెద్దవాళ్ళు అనుభవంతో తరచి చూసి యేం చెప్పారో తెలుసా?అన్నాన్ని తిట్టిన వాడికి అన్నం దొరక్కుండా పోతుంది, వున్నా తీనలేని దౌర్భాగ్యం దాపరిస్తుంది!మనిషిని తిట్టినా తప్పు లేదు, మనిషిలో తప్పూ వొప్పూ వుండొచ్చు.డబ్బుని తిట్టినా తప్పు లేదు అది పాపపు సొమ్మూ కావచ్చు, కానీ పాపపు తిండి వుంటుందా?!సత్యధర్మన్యాయ ప్రతిష్ఠిత మయిన నా గురు పరంపర - వ్యాస పరాశరాది శిర్డి సాయినాధ పర్యంతం వున్న నా గురు పరంపర - పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా,ఆ తిట్టిన వాడికీ, పక్కనే వుండి కూడా అది తప్పని అతనికి బుధ్ధి చెప్పని వాళ్లకీ, అతనికి అప్రతిహతమయిన అధికారమిచ్చి అచ్చోసిన ఆంబోతులా వొదిలిన వాళ్లందరికీ ఆ పాపంలో భాగం వుంటుంది.ఆ పాపం తన ఫలితాన్ని తప్పకుండా చూపిస్తుంది.
మరో చోట ఇదే పెద్దమనిషి గిర్గ్లానీ గారి ఈనాడు వ్యాఖ్యని కొంచెం మెలితిప్పి వాదిస్తూ కనబడ్దాడు.చర్చలో వారే ఈ రిపోర్టు గురించి యెత్తేసరికి అన్ని జోన్లలోనూ జరిగాయని అంటున్నారు కదా అనే జవాబు వేశాను.దానికి వారు "అన్ని జోన్లలో జరిగాయి, నిజమే. కాని వారు ఇంకో విషయం కూడా చెప్పారు, అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు అని. అంటే హైదరాబాదు అని నేను అనుకుంటున్నాను. అసలు ఏ ఏ జోన్ లలో ఎంతెంత అక్రమాలు జరిగాయో ప్రభుత్వమే ఒక శ్వేత పత్రం ఎందుకు విడుదల చెయ్యదు?" - అని మరో ప్రశ్న వేసారు. వారు అంటున్నది "అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు" - అని. కానీ ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిర్గ్లానీ గారు చెప్పింది ఇది,"ఒక్క తెలంగాణా వారే నష్టపోలేదు.అన్ని ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది.మేలు జరిగిందెవరి కంటే అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి తరలి వెళ్లగలిగిన వారు లబ్ధి పొందారు." ఆయన చెప్పింది వెళ్ళగలిగిన వాళ్ళు లాభ పడ్దారు అని.ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కృష్ణా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?స్పష్టంగా చెప్పిన దాన్నే ఒప్పుకోనప్పుడు శ్వేతపత్రాలు సాక్ష్యానికి పనికొస్తాయా?వారు యే గిర్గ్లానీ కమిటీ రిపోర్టును గురించి మాకు అన్యాయం జరిగిందని చెప్తుందని వూదరగొట్టారో ఆ రిపోర్టు తయారు చేసిన పెద్ద మనిషే అంత స్పష్టంగా మీ మాట తప్పు అంటుంటే ఇంకా శ్వేతపత్రం అంటారేమిటి? - అని నిగ్గదీశాను.మళ్ళీ జవాబు చెప్పలేదు,మౌనమే సమాధానం.మళ్ళీ అక్కదే మరొక పాయింటు మీద నాకౌ ప్రశ్న వేస్తే - మీ ప్రశ్నకి నేను జవాబు చెప్పేముందు మీరు నాకో ప్రశ్నకి జవాబు బాకీ వున్నారు ముందు అది తీర్చండన్నాను.అదీ భేతాళుడి ఆఖరి ప్రశ్నే అయింది - అంతతో నాకు మల్ళీ ఆ ప్రశ్న యెవ్వర్నీ వెయ్యకూడదన్నంత విరక్తి పుట్టింది!
అసలు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం యేమిటంటే |violations| అంటున్న |deviations| అన్ని జోన్ల లోనూ సమానంగానే జరిగాయి, ప్రత్యేకంగా ఒక జోను నష్టపోయింది అని చెప్పలేం అని అంత ఖచ్చితంగా చెప్తే మాకు అన్యాయం జరిగిందని గిర్గ్లానీ కమిషన్ రిపోర్తులో ఉంది, వెళ్ళి చూసుకోండని వీరంగాలు వేశారు. మిగతా అన్ని జోన్లలోనూ అంతా బాగనే ఉండి ఒక్క తెలంగాణాలోనే జరిగితే కదా వారికి ప్రత్యేకంగా అన్యాయం జరిగినట్టు?ఇంత కాలం నేను అసలు గిర్గ్లానీ కమిటీలో యేం ఉందో చూడాలని అనుకోకపోవటానికి కారణం మేధావులూ విద్యావంతులూ సంస్కారం గలిగిన వాళ్ళు మరీ దుర్మార్గంగా అబధ్ధాలు చెప్తారా అనే భరోసా తోనే!తీరా చూస్తే పరిస్థితి ఇది.
అసలు ఒక విషయం నిజమా అబధ్ధమా అని యెలా కనిపెట్టాలి?ఒక విషయం గురించి యెదటి వ్యక్తి వెయ్యి వాక్యాలు చెప్తే మొదటి వాక్యానికీ వెయ్యవ వాక్యానికి అర్ధంలో తేడా వొస్తే అబధ్ధం అని తేలుసుకుంటాం, కదా? ఒక వేళ ఈ వెయ్యి వాక్యాల్లో యే విరుధ్ధతలూ లేకపోయినా వెయ్యిన్నొకటో వాక్యం కొత్తగా తెలిసి దానికి గట్టి సాక్షాలు ఉంటే ఈ వెయ్యి వాక్యాలూ నిజమనిపించేటట్టు అంతా యేకసూత్రంగా ఉన్నా అవన్నీ అబధ్ధాలు అయి పోతాయి,అవునా? ఇప్పుడు అసలు విషయంలో వైరుధ్యాలు ఉన్నా యెదటి వాళ్ళకి తెలిసే వీలు లేదనుకుని వాటిల్లో కొన్నిట్ని దాచేసి అంతా తమ వాదానికి అనుకూలంగా ఉన్నవాట్ని మాత్రమే చెప్తే అబధ్ధం కూడా నిజమయి పోతుంది గదా!తెలంగాణా వాదులు వాదనల్లో ఇదే పద్ధతిని అనుసరించారు.వారంతట వారు చెప్తే తమకు అనుకూలంగా లేని సగాన్ని దాచేసి అనుకూలంగా వున్న సగాన్ని మాత్రమే చెప్పటం,ఇతర్లకి ఆ మిగతా సగం కూడా తెలిసి నిలదీస్తే చల్లగా జారుకోవటం!!
కలిసుండడం వల్ల తెలంగాణా భాషకి అన్యాయం జరిగిందనీ కృష్ణా జిల్లా మాండలికాన్ని అధికార భాషగా చేస్తే భరించాల్సి వొచ్చిందనీ చెబుతున్నారు. అది నిజమేనా? నిజంగా కృష్ణా జిల్లా మాండలికం ఇలాగే ఉంటుందా? కృష్ణా జిల్లా మాండలికాన్నే గనక కుట్ర పూరితంగా పైకి తీసుకొస్తే ఒక్క తెలంగాణా వాదులేనా రాయల సీమ వాళ్ళూ గొడవ చెయ్యరా? యే ఇద్దరు రెండు వేర్వేరు జిల్లాల నుంచి వొచ్చ్చిన వాళ్ళు యెవడి భాషలో వాడు మాట్టాడుకుంటూ పోతే వ్యవహారం నడుస్తుందా? అందువల్ల అప్పటి వాళ్ళు మాండలిక వ్యవహారిక తెలుగు ని కాకుండా అందరూ అర్ధం చేసుకొగలిగే విధంగా భాషని సామాన్యీకరించారు? ఇప్పుడు బ్లాగుల్లో మనందరం వాడుతున్నదీ అదే, యే ప్రాంతీయ పదాలూ లేని అందరికీ అర్ధమయ్యే సామాన్య తెలుగు. ఇది కూడా తప్పేనా?ఆయా మాండలికాలకి ఆదరణని కల్పించడం అనేది ఆ భాషలో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు తమ రచనల్లో ఉపయోగించి మిగిలిన వారికీ పరిచయం చేస్తే మిగిలిన వారు అందులోని స్వారస్యాన్ని గ్రహించి మెచ్చుకుంటారు. తిక్కన గారు తన పదిహేను పర్వాల తెలుగు భారతంలో నెల్లూరు జిల్లా మాండలికపు సొంపుని వాడినట్టుగా శ్రీ శ్రీ గారు చెప్పగా విన్నాను. ఆ రకంగా నెల్లూరు జిల్లా మాండలికం తన పలుకుబడులతో సహా భారతేతిహాసంలో ఒక భాగం కాగలిగింది. దీన్ని యెవరయినా వ్యతిరేకించగలరా? మరో విధంగా యే ఒక్క భాష నయినా అధికారికంగా ప్రోత్సహిస్తే మిగిలిన వారు ఊరుకుంటారా?
మరి ఇంతటి భాషాభిమానమూ అందెశ్రీ గారు నూతన తెలంగాణా రాష్ట్ర గీతం ఆ పాత తెలుగు లోనే రాసినప్పుడు యేమయ్యిందో?యేది చేసినా వాళ్లంతట వాళ్ళకి తోచి చెయ్యాలే తప్ప మనం చెప్పితే తప్పన్నమాట!నేను ఒక తెలంగాణా వారి బ్లాగు పోష్టులో ఒక టపాను చూశాను. అక్కడ నేను ఒక ప్రశ్న అడిగాను. "ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు" - అనే ప్రస్తావన చూసి అయ్యా, ఈ అర జిల్లాకు అర్ధ మేమిటో సెలవిస్తారా?భౌగోళికంగా కానీ, సామాజికంగా కానీ,సాంస్కృతికంగా కానీ, వ్యావకారికంగా కానీ అయితే మూడు జిల్లాలు లేకపోతే రెండు జిల్లాలు ఉంటాయి.కానీ మీరు రెండున్నర జిల్లాలు అంటున్నారు.దాని అర్ధం కొంచెం విపులంగా వివరిస్తే బాగుంటుంది. మొదలు పెట్టటమే రెండున్నర జిల్లాలు అని మీరు యెంత వెటకారంగా మాట్లాడినా మేము ఆ వ్యంగాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తే మిమ్మల్ని మీ భాషని ఆదరంగా చూసుకున్నట్టు అవుతుందా?ఇంతకీ ఆ “రెండున్నర జిల్లాల” పేర్లు చెప్తారా మీ నోటితో? అని అడిగాను
దానికి అక్కడ వారిలో ఒకరు ఇచ్చిన జవాబులోని మొదటి భాగం ఇది: (ఇది 1969ల కాలోజి రాసిన పెద్ద కవితలో చిన్న భాగము) ఇగ రెండున్నర జిల్లాలు అంటే క్లియర్ గానే చెప్పిన. 1. కృష్ణా, 2. గుంటూరు 3. ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము.మళ్ళీ అడిగాను,యేమని? ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము – అనేది యేంటి? ప్రత్యేకంగా ఆ జిల్లాలు రెండూ విడివిడిగానే ఉన్నాయి.అందుకనే అడుగుతున్నా, అయితే మూడు జిల్ల్లాలు లేదా రెండు జిల్లాలు అని మామూలు వాళ్ళు అంటారు.కానీ పైత్యకారి తనం ఉన్న వాళ్ళు మాత్రమే రెండున్నర జిల్లాలు అనే వెటకారం ఆడుతారు, అవునా కాదా?నేను దాని గురించి బాబూ అడుగుతున్నది!ఆ పైత్యకారి వెటకారాన్ని కూడా మీరు మమ్మల్ని పొగిడినట్టుగా భావించి మిమ్మల్ని నెత్తినపెట్టుకోవాలన్న మాట. దీనికి వారింకా జవాబు చెప్పలేదు,యేమి చెప్తారో మన కనవసరం.ఒకటి మాత్రం నిజం,అలా మనల్ని వెక్కిరించిన కాళోజీకి మనం కూడా నీరాజనాలు పట్టాం ప్రజాకవి బిరుదు నిచ్చి పొగిడాం, యెందుకు?ఫలితం యేమిటి?
ఇంతకీ అన్నాన్ని తిట్టిన వాడికి పరిహారం మన పెద్దవాళ్ళు అనుభవంతో తరచి చూసి యేం చెప్పారో తెలుసా?అన్నాన్ని తిట్టిన వాడికి అన్నం దొరక్కుండా పోతుంది, వున్నా తీనలేని దౌర్భాగ్యం దాపరిస్తుంది!మనిషిని తిట్టినా తప్పు లేదు, మనిషిలో తప్పూ వొప్పూ వుండొచ్చు.డబ్బుని తిట్టినా తప్పు లేదు అది పాపపు సొమ్మూ కావచ్చు, కానీ పాపపు తిండి వుంటుందా?!సత్యధర్మన్యాయ ప్రతిష్ఠిత మయిన నా గురు పరంపర - వ్యాస పరాశరాది శిర్డి సాయినాధ పర్యంతం వున్న నా గురు పరంపర - పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా,ఆ తిట్టిన వాడికీ, పక్కనే వుండి కూడా అది తప్పని అతనికి బుధ్ధి చెప్పని వాళ్లకీ, అతనికి అప్రతిహతమయిన అధికారమిచ్చి అచ్చోసిన ఆంబోతులా వొదిలిన వాళ్లందరికీ ఆ పాపంలో భాగం వుంటుంది.ఆ పాపం తన ఫలితాన్ని తప్పకుండా చూపిస్తుంది.