Friday 20 June 2014

తెలంగాణా చరిత్ర యెంత ఘనమయినదో!

గతంలో తెలంగాణా వారు మహా భారత యుధ్ధంలో పాందవుల పక్షాన పోరాడారు, ఆంధ్రా వాళ్ళు కౌరవుల పక్షాన పోరాడారు అన్నారు కదా!

భారత ప్రభుత్వం చరిత్ర కు సంబంధించి మాపుల్ని కూడా ఉదహరించింది. వాట్ని ఆధారం చేసుకుని చూస్తే బహమని సుల్తానుల కాలంలో తెలంగాణా అని కనబడుతున్న భూభాగం వరంగల్, విజయవాడ, రాజమండ్రి కలిసిన సముద్ర తీర ప్రాంతంగా కనిపిస్తున్నది మరి?

బహమనీ రాజ్యం మ్యాప్

బహమనీ రాజ్యం విశేషాలు

మహా జనపదాల మ్యాప్

శాతవాహనుల రాజ్యం మ్యాప్

ఆ మహా భారత కాలంలో పాండవుల తరపున యుధ్ధం చేసిన వారి అనువంశికత ఇప్పుడు ఉన్నదా ఈనాటి తెలంగాణాలో? ప్రపంచంలో జాతులను గుర్తించటానికి మూడే మూడు ఆధారాలు.మొదటి కాలం తెగలుగా ఉన్నప్పుడు పుట్టుక కు సంబంధించిన కుదురు జాతిని నిర్నయించేది.భరత గణం తృత్స గణం – ఇలా.తరవాత మహా జనపదాలు వచ్చాక ప్రాంతం ఆధార మయింది: అంగ, వంగ, కళింగ – ఇలా.ఈ మహా జనపడాల్ని చూపంచే ఒక మాపులో తెలింగ అనే ప్రాంతాన్ని చూశాను.అది సముద్రతీరాన్ని తాకుతున్నది మరి?

ఈ దశ దాటిన తర్వాత అర్వాచీన కాలంలో ప్రపంచమంతటా ప్రాంతమే జాతిని నిర్ణయిస్తున్నది. భాష కూడా ఆ జాతి పేరుతోనే ఉన్నది. రష్యన్లు మాట్లాదేది రష్యన్ అనే దగ్గిర్నుంచి గుజరాతీలు మాట్లాడేది గుజరాతీ అనే వరకు.ఆధునిక కాలంలో ఒక్క తెలంగాణా వారికి తప్ప మిగతా ప్రపంచం లోని జాతు లన్నిటికీ ప్రాంతం, జాతి మరియు భాష అనే మూడింటికి అవినాభావ సంబంధం ఉంటుంది,అవునా కాదా?

వారు విడగొట్టుకున్న ఈ నాటి భాగం రజాకారుల్ని జనం మీదకి వొదిలి ఈ దేశంలోనే కలవనని భీభత్సం చేసిన నిజాముకు సంబంధించిన హైదరాబాదు రాష్ట్రం కాదా?

తెలింగ  వొచ్చి ఇప్పటి ఆంధ్రాలో కలుస్తున్నదని తెలిసాకనో యేమో ఇప్పుడు ఆసక లేదా  అశ్మక మీద పడ్దారు.అది చూస్తే మహారాష్త్ర తో కలుస్తుంది.యేమిటి సార్ ఈ గందరగోళం.ఇప్పటి తెలంగాణా స్థానంలో ఆ మాపులో ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఉంది.

ఈ వ్యాసం చూడండి!
అందులో అసక లేదా అశ్మక గురించి యేమి చెప్పారో చదవండి.

The Country of Assaka or the Ashmaka tribe was located in Dakshinapatha or southern India. In Buddha's time, the Assakas were located on the banks of the river Godavari (south of the Vindhya mountains). The capital of the Assakas was Potana or Potali, which corresponds to Paudanya of Mahabharata. The Ashmakas are also mentioned by Pāṇini. They are placed in the north-west in the Markendeya Purana and the Brhat Samhita. The river Godavari separated the country of the Assakas from that of the Mulakas (or Alakas). The commentator of Kautiliya's Arthashastra identifies Ashmaka with Maharashtra. The country of Assaka lay outside the pale of Madhyadesa. It was located on a southern high road, the Dakshinapatha. At one time, Assaka included Mulaka and abutted Avanti.

మరో లింకు చూడండి!!
అందులో అసక లేదా అశ్మక గురించి యేమి చెప్పారో చదవండి.

Assaka / Ashmaka
Assaka, also known as Ashmaka was a kingdom that was located in the south of India. During the time of Buddha, this tribe was located on the banks of river Godavari. The capital city of Assaka was known as Potana. It was situated in central India and extended till southern India. It is estimated that Assaka was situated roughly at the place where modern day Maharashtra is located.

మరో లింకు చూడండి!!!
అందులో అసక లేదా అశ్మక గురించి యేమి చెప్పారో చదవండి.

Assaka or Ashmaka: It was located in the southern part of India. The Assaka had its capital at Potali or Potana. It is believed that Ashmaka was located roughly at the place where present day Maharashtra is located.

పక్క రాష్త్రం లోని రాజ్యాల్ని తమవిగా చెప్పుకుంటున్నారు!

నేను ఒక తెలంగాణా వారి బ్లాగు పోష్టులో ఒక టపాను చూశాను.అక్కడ నేను ఒక ప్రశ్న అడిగాను.
"ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు" - అనే ప్రస్తావన చూసి

అయ్యా,
ఈ అర జిల్లాకు అర్ధ మేమిటో సెలవిస్తారా?భౌగోళికంగా కానీ, సామాజికంగా కానీ,సాంస్కృతికంగా కానీ, వ్యావకారికంగా కానీ అయితే మూడు జిల్లాలు లేకపోతే రెండు జిల్లాలు ఉంటాయి.కానీ మీరు రెండున్నర జిల్లాలు అంటున్నారు.దాని అర్ధం కొంచెం విపులంగా వివరిస్తే బాగుంటుంది.

ఉద్యమం మొదటి నుంచీ ఈ “రెండున్నర జిల్లల భాషని మా మీద రుద్దిన్రు” అనే మాటతో చాలా చేశారు!యే రెండున్నర జిల్లాల భాషని గురించి మీరు చెప్తున్నారు? ఆ రెండున్నర జిల్లల భాషని అందరి మీదా రుద్దడమే జరిగీతే మీరు కాకుండా మిగతా జిల్లాల వాళ్ళు వ్యతిరేకించరా?భాషాభిమానం మీకు మాత్రమే ఉందా?

ఒక కృష్ణా జిల్లా వ్యక్తీ ఒక కరీం నగర్ జిల్లా వ్యక్తి మొదటి సారి కలవగానే తమ తమ మాందలికాల్లో మాట్లాడుకోవటం మొదలు పెడితే ఆ సంభాషణ యెలా ఉంటుందో తెలుసుకోగలరు కదా? ఇప్పుడు మనం బ్లాగుల్లో కూడా అందరికీ అర్ధమయ్యేలాగా ఇలాగే యెందుకు మాట్లాడుకుంటున్నాం?విభజనకు పూర్వం 23 జిల్లాలు ఉండేవి కదా, వాళ్ళందరూ అర్ధం చేసుకోవడానికి యాసలు లేకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విధంగా యేర్పాటు చేస్తే దాన్నీ తప్పు పడుతున్నారే?మీ కన్నా రాయల సీమ వాళ్ళకి రోషం మరీ యెక్కువే, వాళ్ళని మీలో కలుపుతున్నాం అన్నప్పుడు “వామ్మో, సీమోళ్ళు?!” అనేశారు మీరు.నిజంగా మా భాషనే అందరి మీదా రుద్దటం జరిగితే వారెందుకు యెదురు తిరగలేదో?మీరంటున్న రెండున్నర జిల్లాల భాష అనే పదబంధంలో మీ వెటకారంతో కూడిన అతి తెలివి తప్ప ఇంకేదయినా ఉందా?సూచనగా కృష్ణా గుంటూరు జిల్లాలని గురించి అంటున్నారని తెలుస్తుంది(అర జిల్లా యేదో మీరు చెప్పాలి) గాబట్టి ఒక మాట అడుగుతున్నాను, నిజంగా కృష్ణా జిల్లాకి తనకంటూ ప్రత్యేక మయిన మాండలికం లేదా, ఇప్పుడు మామీద రుద్దారు అంటున్న ఈ భాష లాగే ఉంటుందా?


మొదలు పెట్టటమే రెండున్నర జిల్లాలు అని మీరు యెంత వెటకారంగా మాట్లాడినా మేము ఆ వ్యంగాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తే మిమ్మల్ని మీ భాషని ఆదరంగా చూసుకున్నట్టు అవుతుందా?ఇంతకీ ఆ “రెండున్నర జిల్లాల” పేర్లు చెప్తారా మీ నోటితో?
అని అడిగాను.
దానికి వారిలో ఒకరు ఇచ్చిన జవాబులోని మొదటి భాగం ఇది:
(ఇది 1969ల కాలోజి రాసిన పెద్ద కవితలో చిన్న భాగము)
ఇగ రెండున్నర జిల్లాలు అంటే క్లియర్ గానే చెప్పిన.

1. కృష్ణా, 2. గుంటూరు 3. ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము.

మళ్ళీ అడిగాను,యేమని?
ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము – అనేది యేంటి? ప్రత్యేకంగా ఆ జిల్లాలు రెండూ విడివిడిగానే ఉన్నాయి.అందుకనే అడుగుతున్నా, అయితే మూడు జిల్ల్లాలు లేదా రెండు జిల్లాలు అని మామూలు వాళ్ళు అంటారు.కానీ పైత్యకారి తనం ఉన్న వాళ్ళు మాత్రమే రెండున్నర జిల్లాలు అనే వెటకారం ఆడుతారు, అవునా కాదా?నేను దాని గురించి బాబూ అడుగుతున్నది!ఆ పైత్యకారి వెటకారాన్ని కూడా మీరు మమ్మల్ని పొగిడినట్టుగా భావించి మిమ్మల్ని నెత్తినపెట్టుకోవాలన్న మాట.

దీనికి వారింకా జవాబు చెప్పలేదు,యేమి చెప్తారో మన కనవసరం.ఒకటి మాత్రం నిజం,అలా మనల్ని వెక్కిరించిన కాళోజీకి మనం కూడా నీరాజనాలు పట్టాం ప్రజాకవి బిరుదు నిచ్చి పొగిడాం, యెందుకు?ఫలితం యేమిటి?

ముందు కాలంలో తప్పనిసరిగా తెలిసి వచ్చే విషయం ఒకటి ఉంది.ఇంకెంతో కాలం తెలుగు వాళ్లని కేవలం భాష తో ఒక్కటిగా ఉంచటం సాధ్య పడక పోవచ్చు.ఆంధ్ర ప్రాంతం లోని మేధావులు యెంత తొందరగా "రాష్ట్రాలుగా విడిపోయినా మనం భాష పరంగా ఒక్కటే" అనే మిధ్యని వొదిలించుకుంటే అంత మంచిది.ఈ అభిప్రాయాలు యెవరిలో ఉన్నా సరే అవి కేవలం అమాయకపు మాటలు మాత్రమే.ప్రాంతం పేరుతో స్వంత అస్తిత్వం కోసం అంత ద్వేషాన్ని రెచ్చగొట్టి విడిపోయింది తెలుగు వాళ్ళ మనే పేరుతో కలిసి ఉండడానికా?

వారు కోరుకున్నది ప్రత్యేక అస్తిత్వం, అస్తిత్వం నిరూపణ కావాలంటే పోటీ పడి గెలవాలి.వాళ్ళు పతీదానిలోనూ ప్రాంతంగా పోటీ పడుతుంటే ఆంధ్రావాళ్ళు మాత్రమే మనందరం తెలుగువాళ్ళం అని మురుసుకుంటూ ఉండాలా?

ఈ యాభై యేళ్ళుగా చేస్తున్నట్టు చూసీ చూడనట్టుగానో, అంత ప్రమాదం యేమీ జరగదులే అని మనకి మనమే సర్ది చెప్పుకోవడం వల్లనే ఇప్పటి స్థితి వచ్చింది, ఇక ముందు కూడా ఇదే అమాయకత్వం ప్రదర్శిస్తే మన ప్రాంతపు భవిష్యత్తు మనల్ని క్షమించదు.వాళ్ళెప్పుడో ముసుగులు విప్పేశారు.మనం కూడా విప్పెయ్యాలి వీలయినంత తొందరగా!

ఇంకా తెలుగువాళ్ళు- వాళ్ళని కలపడం అనే సుత్తి రెండు చోట్లా అధికారాన్ని ఆశించే తెదెపాకి మాత్రమే అవసరం,మనకి కాదు. ఆ రెండు కళ్ళ సిధ్ధాంతం చాటున మన రాష్ట్రానికి బెండు వెయ్యకుండా కళ్ళు తెరుచుకుని గమనించాలి.

10 comments:

  1. Time for only Andhra parties/media& voice

    ReplyDelete
  2. మీ బ్లాగును బ్లాగ్ వేదికలో చేర్చండి.
    http://blogvedika.blogspot.in/

    ReplyDelete
  3. నిజానికి జాగ్రత్తగా గమనిస్తే ప్రతి 20 మైళ్ళకు యాస మారతా ఉంటుంది చాలా చోట్ల.

    వీళ్లు పడి ఏడిచే క్రిష్ణ జిల్లానే తీసుకొంటే దిగువ క్రిష్ణా (చల్లపల్లి దిగువ, దివిసీమ ప్రాంతం) యాస ఒకటి అయితే, గుడివాడ,బెజవాడ యాస దగ్గరగా ఉంటే, నందిగామ (పాత ముక్త్యాల పరిగణా) ప్రాంతం యాస నైజాం కు దగ్గరగా ఉంటే, నూజువీడు ప్రాంతం వేరే గా ఉంటుంది.
    అలాగే గుంటురు జిల్లాలఓ కూడా తెనాలి ప్రాంతం ది ఒక యాస అయితే, బాపట్ల ప్రాంతం ది మరో యాస, ఇక పలనాడు ప్రాంతం యాస వేరు అని చెప్పక్కర్లేదు.

    మరి ఈ జిల్లాలో ఏ యాస ను ఎవరు ఎవరి మీద రుద్దుతున్నట్లు? ఆయా జిల్లాలలో నే అన్ని యాసలు ఉంటే, వాటిని ఒక్క గాటన గట్టే వాళ్ళ తెలివితేటలు ను ఏమి అనాలి, యాస కోసం విడిపోవటం మొదలెట్టితే ఈ జిల్లాలో ఎన్ని జిల్లాలగాను, రాష్ట్రాలు గాను విడిపోవాలి?

    ఇక వాళ్ళ (తెలబానుల్) అతి తెలివితేటలు, అర్ద తెలివితేటలు గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే.

    ఇక సెంద్రబాబు ఎంత త్వరగా తాను A.P. మాత్రమే C.M. ని అని గుర్తిస్తే అంత మంచిది అని నా ఉద్దేశ్యం, వాళ్లు త్రాగు నీటికి, నారు మళ్ళు పోసుకోవటానికి 10 టి. ం. సి. నీళ్ళు కూడా వదలకుండా రాజకీయం చేస్తున్నప్పుడు, ఫీజు ల కోసం ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవటం మొదలు పెట్టి, అదే పని విద్యుత్తు గురించి అంటే గుండెలు బాదుకోవటం మొదలు పెట్టినప్పుడు అయినా సెంద్ర బాబుకు అర్ధం అయ్యి ఉండాలి It takes two to play Tango అని.
    ఇంకా అర్ధం కాకపోతే 2019 లో మాత్రం గజన్ కు రెడ్ కార్పెట్ పరిచినట్లే!

    Just my thoughts, not to deviate the topic though పైన వ్రాసిన దానిమీద ఈకలు పీకటానికి తెలబానులు ఎగబడి వచ్చినా నేను ఆశ్చర్యపోను :-)

    ఇక తెలబానుల పదం వాడవద్దని వ్రుత్తాంతి గారు అంటున్నారు, దానికి నేను రెడీనే, కాకపోతే వీళ్ల మెంటాలిటీ కు సరైన పదం తెలబానులు అని కాకుండా వేరేది సూచించమని మనవి.

    ReplyDelete
    Replies
    1. స్పందించినందుకు ధన్యవాదాలు!యాసల గురించి నాకు తెలియని విషయాల్ని కూడా చెప్పారు.కృతజ్ఞతలు.
      >>ఇక తెలబానుల పదం వాడవద్దని వ్రుత్తాంతి గారు అంటున్నారు,
      >>
      నేను వాడను కానీ మీరు వాడితే నిషేధించే టంత వ్యతిరేకత లేదు, మీ ఇష్టం!ఇక్కద నేను నిషేధించినా మీరు మాటల్లో వాడుతూనే ఉంటారు కదా,అటువంతప్పుడు మీమీద పెత్తనం చేసినట్లు ఉంటుంది.నా వరకూ నేను ఇతరుల మీద పెత్తనం చెయ్యను.

      Delete
  4. "ఇంకా తెలుగువాళ్ళు- వాళ్ళని కలపడం అనే సుత్తి రెండు చోట్లా అధికారాన్ని ఆశించే తెదెపాకి మాత్రమే అవసరం,మనకి కాదు"

    మీ నిర్ణయం తప్పక శ్లాఘనీయం. రాజకీయ నాయకుల/పార్టీల జోలికి నేను వెళ్ళను.

    తెలంగాణా ఆంద్ర రాష్ట్రాలు రెంటిలో తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగేతరులు ఉన్నారు. ఎవరు ఎ భాష మాట్లాడినా తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి.

    దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారు అవసరం అయినప్పుడు (ఉ. సాహిత్య పునర్జీవనం) తప్పక కలిసి పని చేయవచ్చు. ఇందుకు ఎటువంటి అడ్డంకులూ లేవు, రావు.

    ఆంధ్రకు నష్టం జరగడం ద్వారా తెలంగాణకు లాభం చేకూర్చాలని ఆంధ్రులు ఎవరయినా ఎప్పుడయినా అనుకొని ఉంటె అది ఇకనయినా మానుకోవాలి.

    మీ టపాలో చిన్న తప్పు దొర్లింది. కాళోజీ నారాయణరావు గారి బిరుదు ప్రజాకవి. మహాకవి బిరుదాంకితులు శ్రీశ్రీ.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. నిజమే, రాసేటప్పుదు పరధ్యాన్నంలో అలా రాశాను.తర్వాత చదివి సరి చూసుకునేటప్పుదు కూడా జాగ్రత్తగా పరిశీలించలేదు,ఇప్పుడు సరి చేసాను, కృతజ్ఞుడ్ని.

      Delete
  5. The region was located on the banks of the Godavari river, between the rivers Godavari and Manjira. It was the only Mahajanapada situated to the south of the Vindhya Range, and was in Dakshinapatha. It corresponds to districts Karimnagar, Nizamabad and parts of Adilabad, Nanded and Yavatmal in Telangana and Maharashtra states in current-day India.

    The capital of Ashmaka was Paudanyapura, the Prakrit name of Bahudhanyapura meaning "city of many grains", identified as present day Bodhan. The capital is variously called Potali, Potana or Podana, which now lies in the Nandura Tehsil.

    Source:
    http://en.wikipedia.org/wiki/Assaka

    Hope you got it correct now.

    ReplyDelete
  6. I don't believe wiki because any body can edit the text.I showed you the maps that were published by Indian government.can you show the evidence for the above info as a map?when all the other links are describing in a single phrase about asaka as part of Maharashtra, how could we believe only an exceptional single source?

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...