Tuesday 19 July 2016

తల్లిని చంపి పుట్టిన రెండు రాక్షస శిశువులు - పాకిస్తాన్,తెలంగాణ!

          "పవిత్ర భూమి" అని పేరుపెట్టిన దేశం ఎంత అపవిత్రంగా పుట్టిందో తెలుసుకుంటే హిందువులు క్రీ.శ 1901 నంచి క్రీ.శ 1950ల మధ్యలో ఒక అర్ధశతాబ్ది పాటు తమమీద జరుగుతున్న కుట్రని ఏమాత్రం తెలుసుకోలేక ఎంత అమాయకంగా వంచింపబడినారో తెలుస్తుంది!క్రీ.శ 1890 దశకంలో కేవలం బీదరికంలో మగ్గుతున్న తమ సాటివారిని ఉద్ధరించడం కోసం ముస్లిం లీగ్ అనే ఒక సంస్థని విద్యావిషయిక వ్యవహారాలలో ముస్లిముల్ని సంఘటితపరచే ఉద్దేశంతో పెట్టిన వాళ్ళు క్రీ.శ 1905 కల్లా దానిని రాజకీయ సంస్థగా మార్చడమే కాకుండా హిందువులూ ముస్లిములూ రెండు వేరువేరు జాతులు కాబట్టి దేశానికి స్వాతంత్ర్యం ఇస్తే గిస్తే తమకు వేరే దేశం ఇవ్వాలే తప్ప హిందువులతో పొరపాటున కూడా కలిసి ఉండబోమని ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యటం మొదలుపెట్టారు.

          క్రీ.1930లలో కాంగ్రెసు పార్టీలో తనకొక మంచి స్థానం కోసం పోరాడి అక్కడ తనకిక మాట చెల్లుబడి లేదని తెలిసిన జిన్నా పూర్తిగా ముస్లిం లీగ్ రాజకీయాలకే అంటుగట్టుకుపోయి ద్విజాతి సిద్ధాంతానికి విశ్వసనీయతని తీసుకొచ్చి తను కూడా పాప్యులారిటీ తెచ్చుకుని ముస్లిముల్ని బుజ్జగించడానికి ఉదారవాద హిందువులు ప్రత్యేక నియోజకవర్గాలతో పాటు ఎన్నో తాయిలాలని ఇచ్చినా క్రీ.శ 1945-46 ఎన్నికల్లో మొత్తం ఎన్నికల ఫలితం పాకిస్తాను ఏర్పాటుకు వ్యతిరేకంగా రావడంతో నిరాశతో రాజకీయాల నుంచి విరమించుకుని ఇంటిపట్టున బతకటానికి సెటిలయిపోయిన తర్వాత మళ్ళీ  కద ఎట్లా మలుపు తిరిగి పాకిస్తాను ఆవిర్భవించిందో తెలుసుకుంటే హిందువులు తమ నాయకుల చేతుల్లోనే ఎంత తెలివితక్కువగా మోసపోయారో తెలుస్తుంది."మేము ఒకప్పుడు హిందువుల్ని పరిపాలించాం,ఇప్పుడు వాళ్ళ పరిపాలనలో బతకడమా!" అన్న అహంకారంతో ద్విజాతి సిద్ధాంతాన్ని పుట్టించి "లడ్కే లేంగే పాకిస్తాన్" అని మొండిపట్టు పట్టి ఆ లక్ష్యం కోసం రక్తపుటేరులు పారించిన వాళ్ళని అమాయకులుగా చిత్రిస్తున్నారు గత 70 యేళ్ళుగా సెక్యులరిస్టులు.భారత చరిత్రలో అత్యంత ప్రముఖమైన ఆనాటి ఎన్నికల్లో ముస్లిములు ఎక్కువగా ఉన్నచోట ముస్లిమేతరులు అబ్యర్ధులుగా నిలబదకుండా కట్టడి చేసి ముస్లిములకి మాత్రమే వోటు హక్కు ఇచ్చి,ఇతర ప్రాంతాల్లో కూడా, అంటే ముస్లిమేతరుల నియోజకవర్గాల్లో కూడా ముస్లిములు అబ్యర్ధులుగా నిలబడటానికి వెసులుబాటు ఇచ్చిన ఉదారవాద హిందువులు సాధించినది - వీళ్ళ ముఖం మీద తంతూ వాళ్ళు పాకిస్తానుని సాధించుకోవటం,వీళ్ళు హిందూ మతతత్వవాదులుగా సెక్యులరిస్టులతో గత డెబ్బయ్యేళ్ళుగా తిట్టించుకోవటం!

          అసలు గాంధీ ఈ చెంపని కొడితే ఆ హెంపని చూపించమనే అహింసాయుత పోరాటమే హేతువుకి లొంగనిది.దానికి తోడు ఇతను అరిభీకరంగా విదేశీవస్త్రదహనం స్వదేశీలవణఖాదనం అని ఏదన్నా కొత్త కార్యక్రమం మొదలుపెట్టి నాలుగు రోజులన్నా గడవక ముందే ఇంగ్లీషువాళ్ళు వచ్చి ఒక్కణ్ణి కూడా వదలకుండా కాంగ్రెసు నాయకుల్ని అరెస్టు చేసి జైళ్ళకి తరలించేవాళ్లు. నాయకులు లేకపోవటంతో కొద్ది రోజుల్లోనే అవి మెల్లమెల్లగా అణగారిపోయేవి.ఆ రకమైన కార్యక్రమాలతో పోరాటాన్ని అనంతకాలం వరకూ సాగదీసినా మనకి స్వతంత్రం వచ్చి ఉండేది కాదు.మీరు జాగ్రత్తగా గాంధీ ఉద్యమాలు ఎన్ని విజయవంతమయ్యాయి అని పరిశీలిస్తే ఏ ఒక్కటీ ఆ కార్యక్రమాల్ని ప్రారంభించినప్పుడు చెప్పిన లక్ష్యాల్ని చేరుకోలేకపోయాయని తెలుస్తుంది.కేవలం వాటివల్ల కలిగిన సంచలనాన్నీ మీడియా కవరెజినీ మాత్రమే మనకు గాంధీ విజయాలుగా నమోదు చేసి చెప్తున్నారు గాంధేయవాదులు."భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడంలో గాంధీ ప్రభావం ఎంత?" అని ఒక జర్నలిస్టు అడిగితే బ్రిటిష్ అధికార ప్రతింధి "చా..లా..త..క్కు..వ" అని స్పష్టంగా అన్నాడు - ఎందుకు తక్కువన్నాడో కారణాల్ని కూడా విపులీకరించి చెప్పాడు,ఇంతోటి ప్రభావశీలమైన ఉద్యమం వెనక్కాల హిందువులూ,సెఖ్ఖులరిస్టులూ దెబ్బలు తంటూ అఘోరిస్తుంటే ముస్లిం లీగు వాళ్ళు వీటికి దూరంగా ఉండి మరో పనిలో తలమునకలుగా ఉన్నారు.

          ముస్లిం లీగ్ వాళ్ళు ఈ కార్యక్రమాలకి దూరంగా ఉండి ఆ సమయంలో ఇంగ్లీషువాళ్ళతో తమకు మరిన్ని తాయిలాల కోసం,ప్రత్యేక హక్కుల కోసం,వీలయితే స్వాతంత్ర్యానంతరం తమకే అధికారాన్ని ఫిరాయించుకోవడం కోసం మంతనాలు చేస్తూ ఉండేవాళ్ళు.ఈ తొక్కలో నెహ్రూ మార్కు సెఖ్ఖులరిస్టులు అక్బరునీ,బాబరునీ ఎంత మోసినా అవతలి వైపు వాళ్ళు కోరుకున్నది మాత్రం ఔరంగజేబు కాలం నాటి హవానే!


పాకిస్తాను యొక్క ప్రత్యేకత ఏమిటి?ద్విజాతి సిద్ధాంతం యొక్క ప్రామాణికత ఏమిటి?


          పాకిస్తాను కాక ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలన్నీ ఆయా ప్రాంతాలలో ప్రవక్త ప్రవచించిన ఇస్లాము ధర్మం క్రమేణా బలీయమై సహజంగా ముస్లిముల జబాభా ఎక్కువవడంతో ఏర్పాటయిన దేశాలు.పాకిస్తాన్ మాత్రం మత ప్రాతిపదికన రాజకీయ పోరాటం ద్వారా ఏర్పడిన దేశం.క్రీ.శ 2015లో పాకిస్తాన్ జనాభా 191 మిలియన్లు ఉంటే జిన్నా అప్పట్లోనే 100 మిలియన్ల ముస్లిముల గురించి మాట్లాడేవాడు. అది కేవలం అప్పటి పంజాబ్,సింధ్ లాంటి రెండు మూడు రాష్ట్రాలలో ఉన్న ముస్లిముల సంఖ్య కాదు,మొత్తం భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న ముస్లిములని కలిపితే వచ్చిన సంఖ్య.కమ్యునిష్టోళ్ళూ, కాంగ్రెసోళ్ళూ ఎంత నికృష్టులో చూడండి!ముస్లిములకి ప్రత్యేకదేశం అడిగిన వాడు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న అందరు ముస్లిముల కోసం పాకిస్తాన్ అడిగాడు,మరి పాకిస్తాన్ ఏర్పడినాక వీళ్ళని తీసుకుపోవాలి గదా!ఎందుకు వదిలేశాడు?పాకిస్తాను ఏర్పాటు కోసం దైరెక్ట్ యాక్షన్ డే నాటి ఒక్క రాత్రిలోనే 5000 మందిని హతమార్చిన బొంబాయి ముస్లింలు పాకిస్తాన్ ఏర్పడింది గద, ఆ పవిత్రభూమికి సంతోషంగా తరలి పోవచ్చునే!

          ఆ ముక్క అడిగినందుకు పటేల్ హిందూ మతోన్మాది అయిపోయాడు.క్రీ.శ 1946లో జరిగిన ప్రావిన్షియల్ ఎలెక్షన్లలో మొత్తం 1585 నియోజకవర్గాలలో ముస్లిం లీగ్ పోటీ చేసిన 492 నియోజకవర్గాలలో ముస్లిములు 429 స్థానాలలో పాకిస్తాన్ కోసం పట్టుబడుతున్న ముస్లిం లీగ్ పార్టీని గెలిపించారు!ఇవన్నీ ఇప్పుడు పాకిస్తాన్ ఏర్పడిన ప్రాంతాలలో లేవు.బొంబాయిలో ముస్లిములు పాకిస్తాన్ కోరుకోవడంలో అర్ధం ఏమిటి?పాకిస్తాన్ ఏర్పడితే అక్కడికి వెళ్ళి తరించాలని కాదా!ఆ ఎన్నికల్లో భారతదేశంలోని 90% ముస్లిములు పాకిస్తాను ఏర్పాటును సమర్ధించారు.కాంగ్రెస్ పార్టీకి అత్యధిక శాతం వోట్లు వచ్చిన క్రీ.శ 1984లో ఆ పార్టీకి పోలయిన వోట్ల శాతం కేవలం 49% మాత్రమే!మరి అంత బలంగా పాకిస్తానును కోరుకున్నవాళ్ళు అది యేర్పడిన తర్వాత కూడా ఎందుకు ఇక్కడే ఉండిపోయారు అని అడగటం కూడా తప్పయిపోయింది పాకిస్తాను ఏర్పాటుకి పూర్తి సహాయ సహకారాలు అందించిన కమ్యునిష్టులకి, ఎందుకో?హిందువులు ఎర్రిపప్పలు గనక!.

          ఈ ద్విజాతి సిద్ధాంతానికి ఉన్న త్రిమూర్తులలో మొట్టమొదటిసారి ఒక మాటగా వదిలినవాడు ముస్లిం లీగ్ వ్యవస్థాపకుడైన సయ్యద్ అహ్మద్ ఖాన్(క్రీ.శ 1817-1898),దానికి తాత్విక ప్రాతిపదికను కల్పించినవాడు మహమ్మద్ ఇక్బాల్(క్రీ.శ 1877-1938).ఆ తాత్వికతని రాజకీయ వాస్తవికతగా మార్చినవాడు మహమ్మదాలీ జిన్నా(క్రీ.శ 1871-1948) - మొత్తం ద్విజాతి సిద్ధాంత ప్రచారకర్తలు చాలామంది ఉన్నా వీళ్ళు ముగ్గురిలో ఏ ఒక్కరు దీన్ని పట్టించుకోకపోయినా అది ఈ స్థాయిలో బలాన్ని పుంజుకుని ఉండేది కాదు.ఈ సిద్ధాంతం మొత్తం మనిషి యొక్క అస్తిత్వాన్ని అతని మతమే నిర్ణయిస్తుంది కాబట్టి హిందువులు,ముస్లిములు ఒక జాతి కాదు అని చెప్పటం. భాషాపరమైన,మతపరమైన,ఆచారపరమైన వైవిధ్యాలు ఉన్నవాళ్ళు ఒక ప్రదేశంలో ఎంతగా కలిసిమెలిసిపోయి సహజీవనం చేస్తున్నప్పటికీ వారిని ఒకే జాతిగా గుర్తించడానికి వీలు లేదనేది వారి వాదనలోని మరొక ముఖ్యమైన అంశం.వీరి వాదన ప్రకారం "ఒక దేశపు ముస్లిం స్వదేశపు ముస్లిమేతరుడి పట్ల కన్నా మరొక దేశపు ముస్లిం పట్ల సహానుభూతిని కలిగి ఉంటాడు" కాబట్టి ఈ సహానుభూతిలో భేదం ఉన్న హిందువులు,ముస్లిములు ఒకటి కాదు అని తేల్చి చెప్పారు.వింతేమిటంటే,మహమ్మదాలీ జిన్నాకి ప్రాదేశిక సరిహద్దులతో ఒక ముస్లిం దేశాన్ని ఏర్పాటు చేయటానికి దారి చూపించిన ఇక్బాల్ సరిహద్దులు లేని అవిభాజ్యమైన ఇస్లామిక్ ప్రపంచాన్ని గురించి కలలు కన్నాడు!"Butān-e raⁿŋg ō-xūⁿ kō tōṙ kar millat mēⁿ gum hō jā; Nah Tūrānī rahē bāqī, nah Īrānī, nah Afġānī (Destroy the idols of color and blood ties, and merge into the Muslim society; Let no Turanians remain, neither Iranians, nor Afghans)" - అనే పంక్తులకి అర్ధం యేమిటి?ఆఖరుకి జిన్నా ద్వారా జరిగింది యేమిటి?మతమే హిందువుల్ని,ముస్లిముల్ని విడదీస్తుంది అని అంత గట్టిగా నొక్కిచెప్పి మా మతస్థులకి ఒక దేశం కావాలని విడిపోయినవాళ్ళు ద్విజాతి సిద్ధాంతం అనే పదానికి సార్ధకత తీసుకురావాలంటే ఇరాన్,ఇరాక్,ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని ప్రపంచంలో ఉన్న అన్ని ముస్లిం దేశాల్నీ కలిపి ఒకే దేశంగా యేర్పాటు చేసి చూపించాలి - చెయ్యగలరా?

          ఈ ద్విజాతి సిద్ధాంతం అనేది వీళ్ళ బుర్రల్లో సొంతంగా పుట్టింది కాదు,ఇంగ్లీషువాళ్ళు చేసిన "భారతీయులు ఒకే జాతి కాదు,అనేక జాతుల సమాహారం - కాబట్టి స్వాతంత్య్రానికి అర్హులు కారు, జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుస్థిరంగా ఉండలేరు" అన్న సూత్రీకరణ నుంచి కొట్టుకొచ్చిన మాట!మరొక తమాషా ఏమిటంటే ముస్లిములలో మతం ద్వారా అధికారం సాధించుకోవాలనుకున్నవాళ్ళు తమకి దేశాన్ని సాధించుకోవటానికి ఎంత ఉత్సాహంగా వాడుకున్నారో హిందువులలో మతం ద్వారా అధికారం సాధించుకోవాలనుకున్నవాళ్ళు ముస్లిముల్ని ఈ దేశంతో సంబంధం లేనివాళ్ళుగా చిత్రీకరించటానికి అంత ఉత్సాహంగా వాడుకుంటున్నారు - ప్రవచించిన వారికీ వారి వ్యతిరేకులకీ ఒక్కలాగే ఉపయోగపడుతున్న వింత సిద్ధాంతం ప్రపంచంలో ఇదొక్కటే!

పాకిస్తాను ఎవరికోసం యేర్పడింది?పాకిస్తాను ఇవ్వాళ ఎట్లాంటి స్థితిలో ఉంది!


          సెటైరికల్ కౌంటర్ ఇవ్వడం కోసం వాడలేదు నేను "ఎర్రిపప్పలు" అని!ఒకవైపున బ్రిటిషువాళ్ళు,ఒకవైపున కమ్యునిష్టులు నడిమధ్యన కాంగ్రెసువాళ్ళు ఉండి ఆ యాభయ్యేళ్ళపాటు తమ తమ వ్యూహాత్మకమైన రాజకీయ సమీకరణాలతో దేశాన్ని విడగొట్టి - లాభంగా వచ్చే అధికారాన్ని తాము అనుభవించి మతతత్వవాదులు అనే చెడ్దపేరునీ ముస్లిముల్ని క్రూరంగా అణిచివెయ్యాలని చూసి దేశవిభజనకి కారకులైన పాపాన్ని హిందువుల మీద వేశారు, ఎంత దారుణం!

          భారత ఉపఖండంలోని హిందువులు,ముస్లిములు అప్పటికే కొన్ని శతాబ్దాలుగా కలిసి ఉండటం గురించి  క్రీ.శ 1001లో అల్-బెరూని తన కితాబ్-ఉల్-హింద్ పుస్తకంలో "భారతీయ హిందూ సమాజం కొన్ని శతాబ్దాల నుంచి ఈ ప్రత్యేక స్వభావాన్ని ప్రదర్శిస్తున్నది.ఈ రెండు సంస్కృతులూ, హిందువులు మరియూ ముస్లిములు,రెండు సమాంతర ప్రవాహాల వలె సాగుతూ అప్పుడప్పుడూ స్పర్శించుకోవడమే తప్ప పూర్తిగా కలిసిపోలేదు" అని విశ్లేషించాడు.ఇందులోని రెండు విడివిడి అంశాలలో ప్రతి అంశమూ - సమాంతరంగా ప్రవహించడమూ నిజమే,పూర్తిగా కలవకపోవడమూ నిజమే - కానీ, ఇది అన్ని జాతుల మధ్యనా ఉన్నదేనని శతాబ్దాలుగా కలిసి బతుకుతున్న రెండు సోదర జాతుల్ని కేవలం ఒక యాభయ్యేళ్ళ కాలంలో విడగొట్టి అనంత కాలపు శత్రువులుగా నిలబెట్టిన వారిలో ఎవరికీ తోచలేదు - ఒక అబద్ధపు సిద్ధాంతం రెండు సోదర జాతుల్ని శత్రువుల్ని చేసింది!

          ఒక శతాబ్దం క్రితం మొదలైన కుట్ర ఇప్పటికీ ఎంత విజయవంతంగా నిర్వహించబడుతున్నదో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు హిందువులు - మరీ ఇంత అమాయకత్వమా!ఈ మాట అంటున్న నేను కూడా ఒక వారం క్రితం వరకూ మహమ్మదాలీ జిన్నా గురించి అజ్ఞానంలోనే ఉన్నాను! ఒక విషయం తెలియక పోవటం వల్ల అజ్ఞానంలో ఉండటం తప్పు కాదు, ఇప్పటి వరకు మనం నమ్ముతున్నవి అబద్ధాలనే ఒక నిజం తెలిశాక కూడా లేనిపోని మొహమాటాలతో అబద్ధాలతో సహజీవనం చెయ్యటమే తప్పు!బ్రిటిషు వాళ్ళు దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఒప్పుకునే ముందు ఒక ప్రతిపాదన పెట్టారు "రష్యా నుంచి పశ్చిమ దేశాలకు ప్రమాదం ఉంది గాబట్టి వాళ్ళని అడ్డుకోవడానికి సైనిక స్థావరాలు పెట్టుకోవడానికి మీరు ఒప్పుకోవాలి" అని. పటేల్ బృందం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తిరస్కరించారు.లార్డ్ వేవెల్ అదే ప్రతిపాదనని జిన్నా ముందు పెడితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా,"అది సమస్యే కాదు,మా ముస్లిములకి కమ్యునిష్టులు బద్ధశత్రువులు కదా,ఈ హిందువులు,వీళ్ళేమి పోట్లాడగలరు?" అనేశాడు. ఈ ఒక్కముక్కతో నాకు అప్పటివరకూ జిన్నా అంటే ఉన్న గౌరవం మట్టిగొట్టుకు పోయింది - ధూత్తేరీ!ముస్లిముల స్వాభిమానం కోసం,వాళ్ళు గర్వంగా తలయెత్తుకు నిలబడటం కోసం పాకిస్తానుని సాధిస్తున్నానని ప్రజల ముందు చెప్పినవాడు తన దేశాన్ని ఇతర దేశస్థులకి సైనికస్థావరంగా ఉంచటమంటే ఆత్మద్రోహం,జాతిద్రోహం అని తెలియనంతటి అమాయకుడా లాయరు వృత్తిలో రాటుదేలి పైకొచ్చిన ఈ మేధావి?

          కమ్యూనిష్టులు,ముఖ్యంగా భారతదేశపు కమ్యూనిష్టులు,అందులోనూ ఆంధ్రప్రాంతపు కమ్యూనిష్టులు అప్పుడప్పుడూ చారిత్రక తప్పిదాల ఒప్పుకోలు సమావేశాలు నిర్వహిస్తుంటారు, ఎప్పుడెప్పుడు?కొన్ని దశాబ్దాల పాటూ ఒక రెటమతం పనిని ఇతర్లు "ఒరే నాయనలూ!దానివల్ల తప్పుడు ఫలితం వొస్తుంది,వొద్దురా" అని చిలక్కి చెప్పినట్టు చెప్పినా "ఠాట్!మార్క్సిజం అంటే యేంటో తెలియని పుచ్చొంకాయవి నువ్వు చెప్పడమా,మేము వినడమా!" అని ఘీంకరిస్తూ చెయ్యాల్సిన మఠధ్వంసమంతా చేసేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించుకోలేం అని తెలిసిపోయాక అప్పుడు చేస్తారు,మరోసారి మరొక చా.త.ఒ.స వరకూ మళ్ళీ తమ రెటమతం పనులు యధావిధిగా చేస్తూ ఉంటారు.మిగిలినవాట్ని క్యామెడీలుగా తీసుకున్నా పాకిస్తాను ఏర్పాటులో వీళ్ళు చూపించిన అత్యుత్సాహం వల్ల విడిపోయిన ఈ రెండు భూభాగాల లోని ప్రజలకి జరిగిన హాని యేమిటో తెలుసుకోవలసిన వాళ్ళు తెలుసుకుంటే చారిత్రక తప్పిదాల ఒప్పుకోళ్ళు కాదు - ఏకంగా ఎలిజీ మీటింగులే పెట్టుకోవాల్సి ఉంటుంది!నోరు తెరిస్తే మేము కార్మిక,కర్షక,పీడిత,తాడిత జాతుల విముక్తి కొరకు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూ మా ఆఖరి రక్తపుబొట్టుని కూడా ధారపోస్తాం అని చెప్పే వీళ్ళు పాకిస్తాన్ ప్రజానీకాన్ని పశ్చీమదేశాల సామ్రాజ్యవాదపు ఉక్కుపిడికిలి కిందకి సాగనంపారు, భారతదేశానికి పక్కలో బల్లెంలాంటి పొరుగుదేశాన్ని తీసుకొచ్చారు!

          1969లో ఇ.యం.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కేరళ ప్రభుత్వం భారతదేశం నడిబొడ్డున పాకిస్తాను తరహాలో ముస్లింల కోసం మల్లపురం జిల్లాని ఏర్పాటు చేసింది - రాజ్యాంగబద్ధంగానే!అంత ఖర్మ ఏం దాపరించింది?ప్రభుత్వం తనదేగా,ప్రత్యేకంగా ఒక జిల్లా ఏర్పాటు చేస్తేనే తప్ప వాళ్ళకి రక్షణ ఉండదని అనుకున్నట్టు లేదూ!అసలు బ్రిటిషువాళ్ళు ముస్లిం నాయకుల్లో ఆశలు రేకెత్తించినా ఈ కమ్యూనిష్టులు ఆ మిధ్యా కారణాల మతప్రాతిపదిక ఉన్న వేర్పాటువాద ఉద్యమాన్ని సత్యప్రమాణం గల విమోచన ఉద్యమంగా నిర్వచించి తలకెత్తుకుని సమర్ధించకపోతే అంతగా ప్రభావశీలమై ఉండేది కాదు.ప్రజాభిమానం గాంధీ నేతృత్వంలో ఉన్న కాంగ్రెసుకి ఎక్కువగానే ఉంది.కాంగ్రెసు పార్టీ విభజన జరగకుండా స్వతంత్రం తెచ్చుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది.కానీ,స్టాలిన్ డిక్రీని ఫాలో అవుతున్న కమ్యునిష్టులు బాహాటంగా పాకిస్తాన్ ఏర్పాటున్ సమర్ధించి పూర్తి సహాయ సహకారాలు అందించారు!అప్పట్లో బహుళ పార్టీ సభ్యత్వం అఘోరించేది.తొలిదశలో వాళ్లూ వీళ్ళూ అని తేడా లేకుండా అప్పుడున్న ఒకే ఒక రాజకీయ సంస్థ అయిన కాంగ్రెసు సభ్యులే!తర్వాతి దశలో తమ ఎజెండాలకి తగ్గట్టు వేరే పార్టీలు పెట్టుకున్నా కాంగ్రెసు పార్టీ సభ్యత్వాన్ని కూడా కొనసాగించేవాళ్ళు - చర్చల్లోనూ,వోటింగుల్లోనూ పాల్గొని కాంగ్రెసు పార్టీకి సంబంధించిన కీలకమైన  నిర్ణయాల్ని కూడా ప్రభావితం చెయ్యగలిగేవాళ్ళు! కమ్యూనిష్టులు బాహాటంగా పాకిస్తాన్ ప్రతిపాదనని సమర్ధించాక, మిలిటరీ స్థావరాల ఏర్పాటుకి జిన్నా ఒప్పుకున్నాక,కాంగ్రెసు పాకిస్తాన్ ఏర్పాటుతో కూడిన స్వాతంత్ర్యానికి ఒప్పుకోకపోతే బ్రిటిషువాళ్ళ దగ్గిర మరో ప్రమాదకరమైన తురుపుముక్క ఉంది -  అప్పటికి సుస్థిరంగా ఉన్న 500 సంస్థానాలకీ సర్వాధికారాలు దఖలుపరుస్తూ స్వతంత్రం ఇచ్చేస్తే?అట్లా కమ్యూనిష్టుల స్టాలిన్ డిక్రీ ప్రభావిత పాకిస్తాన్ అనుకూల విధానం వల్లనే పాకిస్తాన్ ఏర్పాటు వాస్తవరూపం దాల్చింది!

          ఇవ్వాళ కామన్సెన్సుతో మనం అనుకుంటున్న ఆలోచన,"మత ప్రాతిపదిక మీద దేశాన్ని విడగొట్టి ముస్లిములకి వాళ్ళ దేశం పంచి ఇచ్చేశాక ఇక మిగిలిన దేశం హిందువులదే కదా!" అనేది అప్పుడు ఒక కాంగ్రెసు నాయకుడు పైకే అనేశాడు,గట్టిగా వాదించాడు కూడాను.అయితే, అప్పటికే నెహ్రూని ఫాబియన్ లెఫ్టిస్ట్ అని వెక్కిరించుకుంటూ ఉన్న కమ్యూనిస్టుల పట్ల ఉన్న వ్యామోహంతోనూ పశ్చిమ దేశాలలో గుడ్ సమరిటన్ ఇమజి కోసమూ నెహ్రూ సెక్యులరిజానికి మొగ్గు చూపాడు.తమాషా యేమిటంటే, భారతదేశం తప్ప ప్రపంచంలో ఏ దేశమూ సెక్యులరిజానికి ఇంత నిజాయితీగా కట్టుబడలేదు - దీనివల్ల దేశానికి ఒనగూడిన ప్రయోజనం ఏమిటి?

          భారతదేశానికి జరిగిన నష్టం గురించి కాసేపు మర్చిపోయి పాకిస్తాను ఏర్పాటు ఎవరి ప్రయోజనం కోసం ఏర్పడిందో తెలుసుకోవాలంటే సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి తెలుసుకుంటే చాలు!రాజవంశంలో పుట్టి రాజభోగాల మధ్యన పెరిగి మొఘల్ సామ్రాజ్యానికీ దానిని సమూలంగా పెరికివేసి ఏర్పడిన బ్రిటిష్ సామ్రాజ్యానికీ ఒకే రకమైన విధేయతతో ఉపయోగపడిన కులీనత ఇతనిది!ఇంగ్లీషువాళ్ల మీద జరిగిన 1857 తిరుగుబాటులో పాల్గొనడం ద్వారా ముస్లిములు తప్పు చేశారని వాదిస్తూ "The Causes of the Indian Mutiny" పుస్తకం రాసి ప్రకంపనలు సృష్టించిన ఉద్దండుడు!ఒకవైపు ముస్లిములు తిరుగుబాటు చెయ్యటం వాళ్ళలోని చాందసవాద భావాలతో చేసిన హరాంజాదీగా విమర్శించి మరోవైపు బ్రిటిషువాళ్ళని కూడా ఈ దేశపు నిజమైన పరిస్థితిని అర్ధం చేసుకోకుండా దుర్మార్గమైన విస్తరణకాంక్షని ప్రదర్శించారని విమర్శించి బ్రిటిషువాళ్ళకి కోపాన్ని కూడా తెప్పించాడు.ఈ పుస్తకంలో ఉన్న ఘాటుకి ఆగ్రాలో ఉన్న "Mufassilat Gazette Press" వాళ్ళు కూడా భయపడి మొత్తం 500 ఉర్దూ కాపీల్నీ వెనక్కి పంపించేశారు.ఇతనికి అత్యంత ఆత్మీయుడైన స్నేహితుడు రాయ్ శంకర్ దాస్ అయితే వీటిని బయటపెట్టి ప్రాణాల  మీదకి తెచ్చుకోవద్దని హెచ్చరించి,పార్లమెంటుకి గానీ మరే అధికార స్థానానికి గానీ పంపవద్దని బతిమిలాడి వినకపోయేసరికి కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.తను  బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియజేస్తున్నది ముస్లిముల బాగు కోసమే కాబట్టి అన్నిటికీ సిద్ధంగానే ఉన్నానని చెప్పి అంతపనీ చేశాడు.అయితే, పైస్థాయిలో ఉన్న ఇంగ్లీషువాళ్ళు దీనిని స్నేహపూర్వకమైన విమర్శగానే తీసుకున్నారు - ముస్లిములు తమమీద తిరుగుబాటు చెయ్యడాన్ని తప్పుపడుతున్నాడు కదా!

         వంశపారంపర్య రాజకీయ వారసత్వమూ,దాని మౌలిక లక్షణమైన దర్పంతో నిండిన కులీనతా,వెసులుబాటు వల్ల అబ్బిన అమోఘమైన పాండిత్యమూ ఉన్న ఇతడు క్రీ.శ 1857 నాటి తిరుగుబాటు తర్వాత తను ఎంత ప్రయత్నించినా ఇంగ్లీషువాళ్ళు ముస్లిముల్ని దూరంగా ఉంచటం గమనించి దీనికి తరుణోపాయం ముస్లిములకి ఆధునికతని అలవాటు చెయ్యడమేనని గ్రహించాడు.ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీని స్థాపించాడు.ఇతని భావజాలం దేశానికి బ్రిటిషువాళ్ళ నుంచి స్వాతంత్ర్యాన్ని కోరుకునే జాతీయతని వ్యతిరేకించే ఆంగ్ల ప్రభుత్వ విధేయత కాబట్టి ముస్లిముల్ని బాగా ఆధునికం చేసి ఆంగ్లప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదించుకునేటట్లు చెయ్యడమే ఇతని ప్రయత్నాల వెనక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం.ఆలీఘర్ చేరుకున్నాక పూర్తిగా విద్యావిషయాల్లో ముస్లిముల్ని ఆధునికంగా తీర్చిదిద్దటానికి కృషి చేసి చాలామందికి మార్గదర్శకుడయ్యాడు.తర్వాత ముస్లిం లీగ్ నాయకులలో చాలామంది ఇతని ప్రోత్సాహం మూలంగా పైకి వచ్చినవారే.రాజకీయాధికారమనే బెల్లం చుట్తూ ఈగల్లా ముసురుకుని అధిక సౌకర్యాలు నొల్లుకునే మనస్తత్వం గలవాళ్లు అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళని అంటకాగి ఆ ప్రభుత్వం మీద పోరాడుతున్నవాళ్ళని వ్యతిరేకిస్తూ కాలం గడిపేశారు.పోరాటం విజయవంతమై ప్రభుత్వం చేతులు మారుతుండం తప్పదని తలిశాక కొత్త ప్రభుత్వంలో తమకి ఎదురుగాలి తప్పదని స్పష్టంగా తెలిసిపోవడంతో తమ ప్రాభవాల కోసం తమ మతం వాళ్ళనే పావులుగా వాడుకుని పులిజూదం ఆడారు.వీరి మోసాన్ని పసికట్టలేక భారతీయ ముస్లిములే కాదు పాకిస్తాన్ ముస్లిములూ ఘోరంగా మోసపోయారు!

          భారతీయ ముస్లిముల అక్షరాస్యత 59.1% హిందువులలో ఉన్న అక్షరాస్యత 65.1%తో పోలిస్తే దయనీయమైన స్థితిలో ఏమీ లేదు.సంఖ్యాపరమైన పెరుగుదల కూడా గణనీయంగానే ఉంది.అదే పాకిస్తాన్ ముస్లిముల అక్షరాస్యత 43.9% మాత్రమే.అంత భీబత్సం సృష్టించి విశాల ముస్లిం ప్రజానీకం అభ్యున్నతి కోసం పాకిస్తాన్ ఏర్పరచుకున్నవాళ్ళు సాధించినది ఇది!ఆ కొంచెం చదువుకున్న వాళ్లలో ఎవరయినా చదువు కోసమో ఉద్యోగాల కోసమో దేశం దాటిపోతే పాకిస్తానీయులమని చెప్పుకోవడానికి సిగ్గుపడి భారతీయులమని చెప్పుకుంటున్న దుస్థితి దాపరించింది!సరిగ్గా అక్కడ పాకిస్తాన్ తమకు సైనిక విడిదిగా ఉందటం సామ్రాజ్యవాదులకు అవసరం గనక ఒక దేశంగా నిలిచి ఉంది తప్ప లేకుంటే ఎప్పుడో కుక్కలు చింపిన విస్తరి అయ్యుండేది!భారతదేశం ఎడ్వినా ప్రియుడి పంచశీల వ్యామోహం నుంచి బయటపడి చాణక్యుది మండల సిద్ధాంతాన్ని పరిగణనలోకి తెసుకుని వ్యూహాత్మకంగా కదిలి సామ్రాజ్యవాదుల్ని తరిమికొట్టి పాకిస్తానుని మిత్రదేశంగా మార్చుకోనంతకాలం భారతదేశానికి ప్రశాంతత ఉండదు!

          సూటిగా చెప్పాలంటే కొందరు ఇంగ్లీషువాళ్ళు దుర్మార్గులనీ వాళ్లని తరిమికొట్టాలనీ ఉద్యమం చేస్తుంటే కొందరు వీళ్ళని వ్యతిరేకించి ఇంగ్లీషువాళ్ళకి మిత్రులుగా ఉంటూ అధికారంలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు.ఇంగ్లీషువాళ్ళు క్రీ.శ 1857 తొలి సాయుధపోరాటాన్ని అణిచివెయ్యడానికి సాయపడింది పాటియాలా నవాబు.చివరి వరకూ వాళ్లు ఉపయోగించుకున్న పోలీసు బలగం.సైన్యం మొత్తం లండన్ నుంచి రాలేదు,ఇక్కడి వాళ్ళనే ఉపయోగించుకున్నారు.క్రీ.శ 1909లో పండిత మదన మోహన మాలవ్యా గారు "ఇంగ్లీషువాళ్ళు మనని అన్యాయంగా ఆక్రమించలేదు,మన దేశపు రాజుల సహాయ సహకారాల తోనే అధికారంలోకి వచ్చారు" అని ఖండితంగా చెప్పారు.ఏనుగుల వీరాస్వామయ్య గారు,గురజాడ అప్పారావు గారు,మరికొందరు సంస్కర్తలు ఇంగ్లీషువాళ్ళని సత్యమును నమ్మిన పరిపాలకులు అని ప్రశంసించారు.మరి క్రీ.శ 1915 వరకొ మన మేధావులు అంత మంచివాళ్ళని పొగిడిన ఆంగ్లేయులు హఠాత్తుగా ఇరవయ్యేళ్ళలో దుర్మార్గులు యెప్పుడు ఎట్లా అయ్యారు?గాంధీ గారి ఉద్యమం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో తెలియక కాంగ్రెసువాళ్లే బెంగపెట్టుకుంటూ ఉన్నారు.కాంగ్రెసు పార్టీ రాజకీయాలు నచ్చనివాళ్ళు జోకులు కూడా వేస్తున్న కాలంలో ఇంగ్లాండులో తమకు ఏర్పడిన ఇబ్బందుల వల్ల ఫెడీమని స్వతంత్రం ఇచ్చేస్తున్నాం అనేశారు.స్వతంత్రం అంటూ వస్తే దానికోసం పొరాడినవాళ్ళే అధికారంలోకి వస్తారు గానీ దూరంగా ఉన్నవాళ్ళు రారు గదా!ఈ క్యాటగిరీలో ముస్లిములూ,హిందువులూ కూడా ఉన్నారు.వాళ్ళు హిందూ మెజారిటీ ఉన్న కొత్తదేశంలో రెండవ స్థానానికి దిగడం ఇష్టం లేక మాకు వేరే దేశం కావాలని పట్టుబట్టారు.వాళ్ళు విడిపోయి దూరంగా పోతే తమకి పోటీ తగ్గుతుందని ఇటువైపు ఉన్న "అధికారం అనే బెల్లం చుట్టూ మూగే ఈగలు" కూడా సంతోషంగా ఒప్పుకున్నారు.వారిద్దరికీ తమ తమ గొర్రెల చేత/ప్రజలచేత విభజనకి ఆమోదముద్ర వేయించుకోవడానికి దొరికిన తొండి వాదన ద్విజాతి సిద్ధాంతం!అటూ ఇటూ ఉన్న అధికారమనే బెల్లం చుట్టూ మూగి సింహభాగం కొట్టేసే పోతరాజుల సౌకర్యం కోసం భారతదేశం విడిపోయిందే తప్ప వంద మిలియన్ల ముస్లిముల సంక్షేమం కోసం కాదు - దానికి సాక్ష్యమే ఇప్పటి పాకిస్తాన్ దుస్థితి!?

          పంచ మహా పాతకాల్లో తప్పు చెయ్యని వాణ్ణి తప్పు చేశాడని నిందించడం అంటారు!అంత పాపకార్యం కట్టి కుడుపుతున్నదో ఏమో!మహమ్మదాలీ జిన్నా పాకిస్తాను ఏర్పాటు చేసిన కొద్దికాలానికే నీలిగి చచ్చాడు!బలూచ్ తీవ్రవాదులు మితిమీరిన ద్వేషంతో రగిలిపోయి అతని ఇంటిని బాంబులతో పేల్చి పారేశారు!"బ్రతికియుండినంతకాలం పట్టుపరుపుల మీద శయనించిన మహరాజులైన నేమి వారి సమాధుల పైన దున్నలు,రాసభములు తొక్కకుండిన యది చాలును,అదృష్టమే!" అన్న కవివాక్కు నిజమయ్యేలా ఖాయిద్-ఎ-అజం సమాధి దగ్గిర బ్రోతల్ వ్యవహారాలు నడుస్తున్నాయి!సరిగ్గా ఒక శతాబ్ది తర్వాత ఆంధ్రుల్ని దొంగల కింద చిత్రిస్తూ అదే పద్ధతిలో విడిపోయిన నేటి తెలంగాణ ప్రాంతపు ప్రజలు నేడు తొలితరం పాకిసాను పౌరులు ఉన్న యుగసంధిలోనే ఉన్నారు,వీరి రేపటి భవిష్యత్తు కూడా ఇవ్వాళ్టి పాకిస్తానీయులలాగే ఉంటుందా?యేమో,తెలంగాణ పౌరసమాజం విజ్ఞతకి రానున్న దశాబ్దం ఒక పరీక్షా సమయం!

నిను వీడని నీడను నేనే,కలగా మెదిలే కధ నేనే!


     రెండు సంవత్సరాల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ప్రయోజనం పొందాలనే స్వార్ధంతో ఎటువంతి ముందస్తు చర్యలు లేకుండా,ఏ విధమైన ప్రణాళికలూ లేకుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది.విడిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సామాన్యప్రజలకు,ప్రభుత్వాధికారులకు,ఉద్యోగులకు కడగండ్లు మిగిల్చింది.తప్పనిసరిగా ఇవ్వాలని తెల్సినా ప్రత్యేకహోదాని బిల్లులో అధికారికమయిన అంశంగా చేర్చకుండా ఈరోజున ముఖ్యమంత్రి నుంచి అశేష ప్రజానీకం వరకు కేంద్రప్రభుత్వాన్ని బిచ్చగాళ్ళలా దేబిరించాల్సిన పరిస్థితి కల్పించింది.బిచ్చగాళ్ళ కయినా నాలుగిళ్ళు తిరిగితే ఏ దయగల తల్లయినా నాలుగు మెతుకులు విదులుస్తుందనే గ్యారెంటీ ఉంటుంది గానీ ఆంధ్రప్రజలు అది కూడా లేనంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు.రాజధాని కూడా ఏర్పాటు చెయ్యక్యండా విడదియ్యటం వల్ల ఇప్పుడు రాజధాని నిర్మాణమే భయాందోళనలకు గురిచేస్తున్నది.అధికారుల పంపకాలు ఇప్పటికీ పూర్తి కాలేదు,ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు.ఆంధ్రప్రదేశ్ రాష్త్రానికి సంబంధించ్హిన రికార్డులు లక్షల సంఖ్యలో తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉన్నట్టు తెలుస్తున్నది,అవి ఎప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేయబడతాయి?ఏతావాతా,ఆంధ్రప్రదేశ్ ఎవరికీ పట్టని వెలివేయబడ్డ రాష్ట్రంలా తయారయింది.ఉపయోగం ఉందో లేదో తెలియని ప్రత్యేకహోదా చుట్టూ వేటకోసం అడవిపందులు చేసే భీబత్సాన్ని తలపించే రాష్త్రంలోని అన్ని రాజకీయ పక్షాల నాయకులు చేస్తున్న ఆర్భాటాల్ని చూస్తుంటే ప్రజాస్వామ్య పరిపాలన మీదనే నమ్మకం పోయి రాజరికానికైనా తలవంచాలనేటంతగా నిర్వేదం కలుగుతున్నది! 

రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం!


    రాష్ట్రవిభజనని కోరుకున్నవాళ్లు "ఆంధ్రావాళ్లు మా ప్రాంతాన్ని దోచేశారు.అందుకే మేం వెనకబడిపోయాం.విడిపోతే ఇంతకన్నా గొప్పగానే బతగ్గలం" అనే మొండివాదన తప్ప సహేతుకమైన ఆధారాల్ని చూపించి శాస్త్రీయమైన విశ్లేషనతో విభజన యొక్క అవస్రాన్ని ఎవరికీ నిరూపించలేకపోయారు.తమ ప్రాంతపు ప్రజాప్రతినిధుల్నే తమ సభ్యత్వాలకి రాజీనామాలు చేయించడానికి "రాజీనామాలు చెయ్యకపోతే తెలంగానలో తిరగనివ్వం,తంతాం,గుద్దుతాం,నాలుకలు చీరేస్తాం" అనె రండాగొండి భాష మాట్లాడారు.చక్కని హేతుబద్ధమైన వాదనతో ఒప్పించగలిగితే ఈ బజారురౌడీల భాష మాట్లాడాల్సిన అవసరం ఏమిటి?ప్రపంచంలో అన్యాయాన్ని ప్రతిఘటించటానికి చేసిన ఏ న్యాయపోరాటమూ ఇంత జుగుప్సాకరంగా జర్గలేదు!ఆంధ్రప్రాంతపు కొందరు విచక్షణ గల రాజకీయనాయకులు ఈ పరిష్తితి వొహించి ఎన్నోసార్లు విభజనకి ఒప్పుకుంటున్నాం,కొంచెం సామరస్యమైన పద్ధతిలో చేసుకుందాం,ఒకచోత కూర్చుని చర్చించుకుని పంచుకోవాల్సినవి న్యాయంగా పంచుకుని విడిపోదాం అని బ్రతిమిలాడినా వినిపించుకోలేదు.సామరస్యమైన పద్ధతి అంటేనే విభజనని వ్యతిరేకించడం అనే అర్ధం వారికి వారే చెప్పేసుకుని మరింత మొండికెత్తారు తప్పిస్తే ఏనాడూ కనీసపు వివేకం కూడా చూపించలేదు."కలవటానికి ఏకాభిప్రాయం కావాలి గానీ విడిపోటానికి ఏకాభిప్రాయం అఖ్ఖర్లేదు" అనే తింగరి వాదన యెక్కణ్ణుంచి కొట్టుకొచ్చారో!అంటే,మేం విడిపోవాలనుకుంటున్నాం గాబట్టి మాకు మా రాష్త్రం కావాలి - అంతే!మీరు చెప్పేది మేము వినం అనే ఏకపక్షపు అపజాస్వామికపు వాదనలే చేశారు.ఉద్యమవీరులు మొదటినుంచీ 23 జిల్లాల నుంచీ ఎన్నికైన శాసనసభ్యుల మధ్య జర్గాల్సిన చర్చలకి గానీ వారి వోతింగులకి గానీ ఏమాత్రం విలువ ఇవ్వకుండా కేంద్రం ఆర్టికిల్ మూడు ద్వారా విడగొట్టి ఇచ్చే ఏకపక్షపు విభజనయే మాకు కావాలని భీష్మించుకోవడం వల్లనే ఈనాడు 13 జిల్లాల తెలుగు ప్రజల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకార బంధురమై ఎంతటి మేధావికైనా అభివృద్ధి సంగతి దేవుడెరుగు,ఏనాటికైనా సొంతకాళ్ళ మీద నిలబడగలుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి నెలకొనింది!ఈ దుస్థితికి ఎవరు బాధ్యత తీసుకుంటారు?

పోతే పోనీ పోరా!ఈ పాపపు జగతిన శాశ్వత మెవడురా!


     నోరుగలవాళ్ళు గనక యాభై అరవై యేళ్ళు మమ్మల్ని దోచుకుతిన్న పాపం ఇప్పుడు కట్టి కుడుపుతున్నదని కూడా అంటారేమో!విడిపోయి కలిసుందాం అని నీతులు చెప్తూనే సహకరించుకుంటూ విడిపోవటం కోసం ప్రయత్నించినప్పుడల్లా "ఇన్నాళ్ళూ మమ్మల్ని దోచుకుని బాగుపడ్డారు,ఇకముందు సాగదేమోనని బెంగతో కాళ్లబేరాని కొచ్చారు" అని రీజనింగులు లాగిన మెధావులు గదా!పోనీలే ఇన్నేళ్ళు తెలాంగాణోళ్లని దోచుకుతిన్న పాపం ఆంధ్రోళ్లని కట్టి కుడుపుతున్నదని సరిపెటుకున్నా,విడిపోతే ఇంతకన్నా గొప్పగా బత్కగలమని కలౌ గన్న తెలంగాణోళ్ళ పరిస్థితి గూడా పెనం మీదనుంచి పొయ్యిలో పడిన చందంగా తయారయింది గదా!విడిపోయేనాటికి మిగులురాష్ట్రం అన్న ధీమా,అప్పటికే 23 జిల్లాల నుంచి వచ్చే మొత్తం అవిభక్త రాష్ట్రపు నికరాదాయంలో 43% తీసుకొస్తున్న బంగారుగుడ్లుపెట్తేబాతు హైదరాబాదును మనమే కొట్టేశాం లెమ్మన్న భరోసాతో ఉన్నారు గానీ నిన్నటి నుంచ్జి నేటికీ,నేటి నుంచి రేపటికీ సమాజం నడిచే ప్రయాణంలో గతానుగతికంగా అల్లుకుపోయిన కార్యకారణశృంఖల యొక్క ఫలితాంశంగా కనపడే రేపటి తెలంగాణ ముఖచిత్రం కూడా ఉద్యమకాలపు దృశ్యాల మదిరిగానే ఉండదని గ్యారెంటీ యేముంది?

ఎవరికోసం?ఎవరికోసం?ఈ రీడిజైనింగ్లు,ఈ డబల్ బెడ్రూం ఫ్లాట్లు ఎవరికోసం!


     నీళ్ళు,నిధులు,నియామకాల్లో మొదటిదైన నీటిపారుదల కోసం ప్రాజెక్టుల రీడిజైంగు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజంటేషను యొక్క పూర్తిపాఠం చదవగానే నాకుకూడా అద్భుతమైన ప్లాను అనే అనిపించింది.ఈ దెబ్బతో తెలంగాణ రైతుల నీటికష్టాలు తీరుతాయి అనే నమ్మకం కలిగింది.కానీ,ఎందుకైనా మంచిది ఈ పెద్దమనిషి మాటల్లో నిజమెంత ఉందని పరిశీలించి చూస్తే ఎంతో అమాయకంగా ఓట్లేసి గెలిపించి అధికారం కట్టబెట్టి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నవాళ్ళని ఎంత తెలివిగా బురిడీ కొట్టిస్తున్నాడో అర్ధమై గుండె గుభేలు మనింది! 

     1947లో రాష్త్రాల సమాఖ్యగా అవతరించిన భారత్దేశంలోని ఒక రాష్తర్ప్రబుత్వం తన రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టు కటుకోవాలంటే సంకల్పానికీ నిర్మాణానికీ మధ్య ఎన్నో దశలు ఉన్నాయి,పధతులు ఉన్నాయి - సమయం,సహనం కూడా అవసరమే!ఈయన దణ్ణాలు పెడుతూ పొగిడిన కాకతీయ ప్రభువులు సర్వస్వతంత్రులు గాబట్టి సంకల్పించిన వెంటనే కట్టెయ్యగలిగారు,ఈయనకి కూడా కేంద్రం అనుమతులు ఇవ్వాల్సిన పని లేకుండా తెలంగాణ మీద సర్వాధికరాలు దఖలుపడితే తప్ప వాళ్ళు నిర్మించినంత తొందరగా ఈయన కట్టలేడు.పెండింగులో ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల గురించి "తెలంగాణ ప్రాజెక్టులు అంటే చాలు,పెండింగులో పెట్టస్తారు" అంటున్నవాడు ఆంధ్రా,రాయలసెమకి చెందిన ప్రాజెక్టులు కూడా పెండింగులో ఉన్నాయని ఎందుకు మర్చిపోయాడు అమోఘమయిన జ్ఞాపకశక్తి గల ఈ మేధావి?అందులో నిజమే ఉన్నా ఇప్పుడు చెయ్యగలిగింది లేదు,నోటిదురద తీర్చుకోవటం తప్ప - బతిమలాడుకునో దెబ్బలాడో అనుమతులు తొందరగా తెచ్చుకోవటం తప్ప మరోదారి లేదు!అది వదిలేసి ఈ ప్రజంటేషన్లు తయారుచెయ్యడం వల్ల ఉపయ్తోగం ఏమిటి?పాత ప్రాజెక్టులకి కొత్త డిజైన్లు తయారు చేసినంత మాత్రాన ఈ కొత్త డిజైన్లు పట్టుకుని ఇప్పటికిప్పుడు కట్టుకోవటం ఎట్లా కుదురుతుంది?వీటిని కూడా కేంద్రానికి పంపించాల్సినదె గదా, అఖ్ఖర్లేదా!రెడ్డొచ్చె మొదలాడు న్నట్టు ఇప్పుడు పంపిస్తే వీటికి అనుమతులు ఎప్పటికి వస్తాయి?మరి,కేంద్రానికి ఆల్రెడీ పంపించి పెండింగులో ఉన్న పాత ప్రాజెక్టుల సంగతేంటి?

     ఇంకా ఘోరం ఏంటంటే,రాజ్యాంగబద్ధమైన ఎన్నికలప్రక్రియలో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఉన్న చట్టాలని ఉపయోగించుకుని పరిపాలించిప్రజల్లో తెలంగాణ భవిష్యత్తు పట్ల ఉన్న భయసంకోచాల్ని పోగొట్టటానికి బదులు "అనుమతులు లేకపోయినా సరే,  మొదలుపెట్టేద్దాం,పిడుగులు కురిపిద్దాం,భూకంపాలు పుట్టిద్దాం" అని పక్కా కబ్జాదారులా మాట్లాడుతూ కాస్తోకూస్తో తెలివితేటలు గలవాళ్లని అందులో ఉన్న మతలబు అర్ధమై భయభ్రాంతులకి గురి చేస్తున్నాడు.కబ్జా అంటే యేంటి - మొదట తనది కాని స్థలంలో అక్రమ కట్టడాలు కట్టేసుకుని తర్వాత ప్రభుత్వపెద్దలకి చేతులు తడిపి క్రమబద్ధీకరించేసుకోవటం,అంతేనా?సాక్షాత్తూ ముఖ్యమంత్రియే కబ్జాదారులా రెచ్చిపోతుంటే మీ ఇంటిని కబ్జా చేసిన దగాకోరుల్ని మీరు నిలవరించగలరా?"స్వయంగా మ ముఖ్యమంత్రి చేస్తుంటే తప్పు లేదు గానీ నేను చేస్తే తప్పేంటి?రాజు చెయ్యగా నోర్మూసుకుని బంటు చెయ్యగా అడ్డుకోవటం అన్యాయం!" అని అతనంటే?

కల ఇదనీ నిజ మిదనీ తెలియదులే,బ్రతుకింతేనులే!


     ఎప్పట్నించో రూపాయి బిళ్లలు నదుల్లో వేస్తున్నానని సాక్ష్యాలు గూడా చూపిస్తున్నాడు గాబట్టి ఎట్లాగోట్లా ప్రాజెక్టుల్ని పూర్తి చెయ్యాలనే తపనతో చేస్తున్నాడు లెమ్మని అనుకున్నా రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న కేంద్రం ఇక్కడ కురిపంచే పిడుగులకి భయపడిపోయి అనుమతులు ఇచ్చేస్తుందా?సాంకేతికంగా అనుమతులు లేనప్పుడు కోర్టులు కలగజేసుకుని ఆపివేసే అవకాశమూ ఉంది కదా!అయితే,అసలు కిటుకు అది కాదు - ప్రాజెక్టులకి అనుమతులు నిరాకరించబడినా,కోర్టుల ప్రమేయం ద్వారా ఆగిపోయినా సెంటిమెంట్లు రెచ్చగొట్టే వీలు తెలంగాణలో అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉంటుంది,పైగా కట్టిన దానికి కంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వక తప్పదు,ఔనా?అదంతా తెలంగాణ ప్రజల కష్టార్జితమే గదా!ఆ కంట్రాక్టర్లు ఇచ్చే మామూళ్ళ కోసమే గదా అన్ని పార్టీల నాయకులూ అధికార పార్టీలోకి వరదలుగా వచ్చి పడుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే అది కాంట్రాక్తర్ల పనియే, నాయకులు ఇచ్చిపుచ్చుకుంటూ దాన్ని జరిపిస్తారు.ఆ భవనానికి వాస్తు సరిగ్గా లేదు,ఈ భవనానికి పగుళ్ళు ఉన్నాయి,వీటిని కూల్చి కట్టాలి అని పదవిలోకి వచ్చిన కొత్తల్లోనే చేసీన్ హడావిడి వెనక కూడా కాంట్రాక్టర్లకి ఆదాయం సమకూర్చి పెట్టాలనే రంధి తప్ప మరొకటి లేదు!కాంట్రాక్టర్లకి రంగూ,రుచీ,వాసనా ఉండవనే నిజం ఈమధ్యనే హరీష రావు గారికి బోధపడింది,తక్కిన జనాలకి కూడా త్వరలోనే తెలుస్తుంది, కొంచెం ముందూ వెనకా - అంతే! 

అంతా భ్రాంతియేనా?ఆశా నిరాశేనా?జీవితాన వెలుగింతేనా?


     ఎక్కడో దూరంగా ఉండి పత్రికల్లో వార్తలు చదువుతూ ఉన్న నాకు ఇని సందేహాలు వస్తున్నాయి,ఇంత ఆందోళనగా ఉంది గానీ కళ్ళముందు జరుగుతున్న జగన్నాటకాలు చూస్తున్నా తేలంగాణ మేధావులు మాత్రం "చూస్తూ చూస్తూ రెండేళ్ళు గడిచాయి, ఇంకా ఎనిమిది సంవత్సరాల తరువాత కూడా మీరూ నేనూ ఇక్కడే బ్లాగ్లోకంలో ఉంటాము.తెలంగాణా ఏర్పడగానే ఎన్నో ఉపద్రవాలు జరుతాయని ఊహాగానాలు చేసిన వారు అంతర్థానం అయ్యారు ఎందుకో ఏమో?" అని దీర్ఘాలు తీస్తూ అరమోడ్పు కనులతో అజాగళస్తనముల వంటి దివాస్వప్నములలో విహరిస్తూ చిదానందమూర్తుల లాగ కాలం గడిపేస్తున్నారు!ఇంతవరకు నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతోనూ,దబల్ బెడ్రొం ఫ్లట్ల పేరుతోనూ కాంట్రాక్టర్ల ఆకలి తీర్చడానికి చూట్టమే తప్ప సామాన్యప్రజలకి పనికొచ్చే పని ఒక్కటి చెయ్యలేదు.వాహనాల రీవ్రిస్ట్రేషన్ దగ్గిర్నుంచి గుడుంబా వాడకాన్ని తగ్గించటానికి కల్తీకల్లు అమ్మటం వరకు ఎన్నో పిచ్చి నిర్ణయాలు తెసుకున్నా ముఖ్యమంత్రి ఇంకా మేధావిగానే పరిగణించబడుతున్నాడు - ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్న లెఖ్ఖన!జరగాల్సిన భీబత్సమంతా జరిగిపోయి తెలంగాణ మొత్తం చంకనాకిపోయాక అప్పుడు కళు తెరిచి "అర్రెర్రెడ్డెడ్డెడ్డె, గిదేంది?గదేంది?గట్లట్ల అయితనుకుంటె గిట్లెట్ల అయితంది?ఎవళ్ళు జేసిన్రు?ఎవర్ని దిట్టాలె?" అని మళ్ళీ జజ్జనకరెజనారేలు మొదలుపెడతారేమో!

దేవుడనేవాడున్నాడా అని ఆంధ్రులకు కలిగెను సందేహం?


     విభజన ప్రహసనం ఆఖరి సన్నివేశం పెప్పరు స్ప్రే భాగోతాలు దాటి ఎవడు యస్సన్నాడో ఎవడు తూచ్చన్నాడో స్పీకరు మహాతల్లికే తెలియని గందరగోళంలో స్పీకరుకి ముందే ఇవ్వబడ్డ ఆల్టిమేటం ప్రకారం ఆవిడగారు అన్నిట్నీ యస్సుల కిందే లెక్కేసి మమ అనిపించేశాక ఒక తమాషాతో పొర్తయింది!సుషమా స్వరాజు తెలనాణోళ్ళని "ఈ చిన్నమ్మని గుర్తుంచుకోండి" అని బతిమిలాడుకునే విచిత్రమైన సన్నీవెశం అప్పుడు అనుకోకుండా జరిగందని అనుకున్నాము గానీ ఇప్పుడు ఆలోచిస్తే విభజన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ మట్టిగొట్టుకుపోవటం ఖాయమని అందరికీ తెలిసిపోయి ఇంకా వాళ్ళ వోట్లతో యేంపని అనుకున్నట్టు లేదూ!అందరితో పాటు ఆంధ్రావాళ్ళ మద్దతు కూడా కావాలి గదా అని అనుకుని ఉంటే అస్సలు ఆంధ్రావాళ్ళని పలక్రించకుండా యెందుకుంటుంది?ఎప్పుడూ వోట్ల కోసం నానా గడ్డీ కరిచే కాంగ్రెసు కూడా ఆంధ్రాలో వోట్లు పడవు అని తెలిసినా ఇలాగే విభజించాలని ఎందుకు తహతహలాడింది?

ఎవరో!ఎందుకీరీతి సాధంతురు!ఏల పగబూని వేధంతురు?


     నిజమే,ఎవరో పనిగట్టుకుని విభజన ద్వారా తెలంగాణ అనే కొత్త రాష్ట్రాన్ని పుట్టించటమే కాకుండా పాత రాష్ట్రాన్ని గిట్టించటమూ నేను కళ్ళారా చూడాలి అని పంతం పట్టి కూర్చుంటే అతన్ని సంతోషపెట్టటానికి జరిగినట్టు ఉంది విభజన తొలినాటి నుంచీ అది పూర్తయ్యేవరకు జరిగిన కధంతా!దాసరి నారాయణ రావు కూడా విభజనలో ఒక బ్రోకర్ ఉన్నాడు అన్నాడు,ఎవడు వాడు?అలా కాదనుకంటే,నూరేళ్ళకి పైబడి ప్రజా జీవితంలో ఉన్న పార్టీలో ఉండి ఎంతో కాలం నుంచీ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న సీనియర్ నయకులు కూడా విభజన తర్వాత ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వాడిమీదవీడూ వీడిమీదవాడూ దొంగకేసులు పెట్టుకుంటుంటే అటూ ఇటూ ఉన్న బుద్ధిమట్టుగాళ్ళు "మా ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని ఎంత చావుదెబ్బ కొట్టాడో!","మా ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రికి ఎంత గట్టి రిటార్టు ఇచ్చాడో!" అని మురుసుకోవటానికి పనికొచ్చే విధంగా వొదిలారు తప్ప సయోధ్యగా విడిపోయి సహకరించుకునేటందుకు అవసరమైన ప్రతిపాదన ఒక్కటీ ఎందుకు వుంచలేకపోయారు?

బాబూ,వినరా, అన్నాతమ్ములా కధ ఒకటి!!


     సుమారు పన్నెండేళ్ళ క్రితం ఈసారి ఎట్లాగైనా స్వతంత్ర తెలంగాణను సాధించుకోవాలని నిశ్చయించుకుని వ్యూహరచన చేసినవారిలో చంద్రబాబుని ఉద్యమ మెయిన్ విలన్ స్థానంలో నిలబెట్టాలని సూచించిన వ్యక్తి ఎవరో గానీ అతను కాలాంతక నరాంతక దేవాంతకులను మించిన అఖండుడు!ఎందుకంటే,వారిలో తమ ప్రసంగాలను విన్నవాళ్ళు ఆత్మహత్యలకు సైతం ప్రేరేపించగలిగిన చతురత ఉన్నప్పటికీ,సాంకేతికంగా ఆర్టికిల్ మూడు అనే బ్రహ్మాస్త్రం వారి వద్ద ఉన్నప్పటికీ - చంద్రబాబుని ఖాళీగా ఉండనిస్తే తనకి జాతీయస్థాయిలోని అన్ని రాజకీయ పక్షాలలో ఉన మిత్రులను ఉపయోగించుకుని ఈ దుర్మార్గమైన ఏకపక్షపు విభజనని చాలా తేలిగ్గా అడ్డుకోగలిగిన సమర్ధుడు.అందుకే విభజనని సూత్రప్రాయంగా ఒప్పుకుంటూ ఎన్నిసార్లు ప్రకటనలు చేసినా,ఉత్తరాలు ఎప్పుడు ఏ రకంగా అడిగితే అప్పుడు ఆ రకంగా ఇచ్చినా పదే పదే అతనినే టార్గెట్ చేశారు గానీ పదేళ్ళు తాత్సారం చేసినా,ఆఖరి దశలో కికురెతో అంత గడబిడ చేయించినా కాంగ్రెసుని ఒక్క మాట కూడా అనలేదు - నా ఉద్దేశంలో కికురె భాగోతం కూడా ముందుగానే వేసుకున్న ప్లానులోని ఒక అంకం మాత్రమే!అప్పుడూ ఇప్పుడూ పదవుల కోసమే రాజకీయాలు చేసే చిల్లర మల్లర పొలిటీషియన్లకి అలాంటి టార్గెట్ బాబు అనే ప్లాను తోచి చస్తుందంటే నమ్మటం కష్టమే - సాయుధ పోరాటపు రణతంత్రం పట్టుబడిన వాళ్ళకి మాత్రమే అలాంటి క్రూరమైన వ్యూహాలు పన్నటం కుదురుతుంది!

     "టార్గెట్ బాబు" అన్న ఎత్తుగడకి ఉన్న కొసరు కారణం ఆఖరి దశలో విభజనని అడ్డుకోనివకుండా చెయ్యటం అయితే,అసలు కారణం తెలియాలంటే బాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ జరిగిన కొన్ని ప్రముఖమైన విషయాల్ని గుర్తు చేసుకోవాలి.ముందు ముందు తెలంగాణలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అతను ఈజీగా తండ్రి చేసిన మంచిపనుల్ని కంటిన్యూ చేస్తూ పోవచ్చు గానీ ప్రజలందరూ దేవుడిలా కొలిచే రామారావుని పడగొట్టి వచ్చినవాడిగా బాబు కొంతయినా అభివృద్ధి చేసి చూపించకపోతే "వెన్నుపోటు దారు","మామను చంపిన అలుడు" లాంటి చెడ్డపేర్లు మాత్రమే స్థిరపడి పోతాయి తప్ప అంత సాహసం చేసినందుకు ఆశించిన మంచిపేరు చచ్చినా రాదు,అవునా!అది అతనికీ తెలుసు గనక బుద్ధిగానే పనిచేశాడు.తొమ్మిదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని సంపన్న రాష్త్రంగా మార్చాడు.లక్ష కోట్లకు పైబడిన బడ్జెట్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాడు.హైదరాబాదుకు హైటెక్ హంగులు అద్దాడు.

     కానీ యేమి లాభం?రామహత్యాపాతకం పనిచేసింది కాబోలు - సకాలంలో వర్షాలు పడకపోవటం,రైతులు కష్తాలు పడటం,కంప్యూటరు వెనక్కాల కూర్చుని మనుషుల్ని పట్టించుకోలేదన్న అప్రదిష్టా కలిసి రోగశేఖర రెడ్డికి పదవిని కోల్పోయాడు!పాకిస్తాను ఏర్పాటులో పక్కతాళం వేసిన కమ్యునిష్టుల లాగే ఇక్కడి నక్సలైట్లు ఈ బూర్జువా నియంతకి గాలికొట్తి అధికారంలోకి వచ్చేలా చేసి తర్వాత ఛత్రపతి శివాజీని బంధించిన ఔరంగజేబుని ఇమిటేట్ చేస్తూ పద్మసరస్సునివాసి వేసిన ఎత్తుల్తో అణగారిపోవటం మీకూ తెలుసు!ఆ ద్రోహం తర్వతనే వారిలో ఇక రాష్ట్రాన్ని చీలిస్తే తప్ప మళ్ళీ పుంజుకోలేమనే నమ్మకం వారికి కలిగింది.ఇప్పుడు కేసేఅర్ కూడా నిర్దాక్షిణ్యంగా అణగదొక్కాక ఉసూరుమన్నారు గానీ అప్పట్లో చంద్రబాబు నీడ లేకుంటే చాలు,విడిపోయాక తెలంగాణలోని అసమర్ధపరిపాలనని అడ్డుపెట్టుకుని,తొలినాటి అరాచకత్వపు గందరగోళాన్ని ఉపయోగించుకుని ఎకాఎకిన అధికారమే చేపట్టవచ్చుననే హుషారు వచ్చేసింది వారికి!ప్రజల కోసం ప్రాణాలర్పిస్తూ త్యాగమూర్తులుగా పేరు తెచ్చుకోవడం వల్లనో,వారి భావజాలం పట్ల వ్యామోహం ఉండటం వల్లనో,వాళ్ళ వల్లనే తెలంగాణ ఏర్పడినదనే కృతజ్ఞత వల్లనో కొందరు ఒపుకోకపోవచ్చు గానీ బాబు రహిత తెలంగాణని కోరుకుని విభజన ప్రక్రియలో అతని ప్రమేయాన్ని ఏమాత్రం ఉంచకూడదని ఆ విధంగానే విభజనని జరిపించిన వారి క్రూరమైన వ్యూహమే విభజిత మాతృరాష్త్రం యొక్క దుస్థితికి ముఖ్యమైన కారణం!దూరదృష్టీ,కార్యదీక్షా పుష్కలంగా ఉన్న అతని నేతృత్వంలో ఆర్ధికాభివృద్ధి పరుగులు పెడుతూ అసమానతలు తగ్గుతూ ఉంటే సుఖంగా బతుకుతున్న ప్రజల్లో సాయుధ పోరాటం పట్ల ఆకర్షణని పెంచటం కష్తం కదా!అందువల్లనే తమకి నమ్మకద్రోహం చేసిన రోగశేఖర రెడ్డి కన్నా చంద్రబాబు పట్లనే ఎక్కువ వ్యతిరేకతని వారు పెంచుకున్నారు,ఇతర్లకి పెంచారు. 

విధి ఒక విషవలయం!విషాద కధలకు అది నిలయం!!


     ఇప్పటి ఉద్యమంలో వీరావేశంతో పాల్గొన్నవారిలో మూడురకాల వ్యక్తులు ఉన్నారు.పైన చెప్పిన నక్సలైట్లు వ్యూహరచన చేస్తే కొత్త రాష్త్రంలో తమకు దక్కబోయే లాభాల కోసం ఉద్యమాన్ని పోషించిన కాంట్రాక్టర్లు వారితో కలిసిన చిత్రమైన గుంపు!పరస్పర వ్యతిరేక శక్తులు సంఘర్షించకండా సహకరించుకుంటూ ఈ చరిత్రను నిర్మించటం విశేషం!రెండో రకం వ్యక్తులు నక్సలైట్ ఉద్యమంలో పూర్తికాలం పని చెయ్యకపోయినా వారిపట్ల ఆకర్షణ ఉన్నవాళ్ళు. అంటే,ఒకాయన శ్రీశ్రీ గురించి "లెఫ్టుకే ఉంటాడు గానీ రైటుకీ జరుగుతాడు" అన్నట్టు గవర్నమెంటు వాళ్ళని చంపుతున్నప్పుడు జాలిపడుతూ నక్సలైట్లు వేరేవాళ్ళని చంపుతున్నప్పుడు వాళ్ళకి దూరమవుతూ గడబిడ చేస్తూ బతుకుతున్న "మధ్యే మధ్యే ఆచమనం సమర్పయామి" గాళ్ళు!ఇక మూడోరకం ఎవరంటే పై స్థాయిలో వ్యూహకర్తలూ,వారి వందిమాగధులూ కలిసి చేస్తున్న సాహితీకౌశలపు మాయాజాలనికి మెస్మరైజ్ అయిపోయి వాళు నాటిన "ఆంధ్రోళ్ళ పెత్తనం","తరతరాల తెలంగాణ అణచివేత","బాబు కుట్ర" అనే విత్తనాలకి ఎరువులుగా ఉపయోగపడే బుడ్డా మురళి లాంటి దారితప్పిన మేకపిల్లలు!

చెబితే వింటివ గురూ గురూ?వినకే చెడితిర శిష్యా శిష్యా!


     బుడ్డా మురళి గారు నేను బ్లాగుల్లోకి రాకముందునుంచీ రచనలు చేస్తున్న సీనియర్ రాజకీయ విశ్లేషకులు!వారి నేతాశ్రీ వ్యాస పరంపర చదివి చాలామందికి లాగే నేనూ ఆయనకి అభిమాని నయ్యాను.ఎంత సీరియస్ విషయాన్నయినా సటిల్ హ్యూమరు రంగరించి ఎంతవరకు చెప్పాలో అంతవరకు మత్రమే చెప్పి తప్పుకోగల్గిన బ్రివిటీ ఆయనకి మాత్రమే సొంతం.ఈ బ్రివిటీ కోసం మొదట్లో నేను చాలా తంటాలు పడి నాకది కుదిరేది కాదని లేటుగా తెలుసుకుని వొదిలేశాను.కానీ మిగతా విషయాల్లో.ముఖ్యమైనది పెద్ద పెద్ద వాక్యాల్ని చిలవలు పలవలుగా అల్లుకుపోవటంలో ఉన్న పోలికల్ని చూస్తే ఆయన నాకు గురుతుల్యుడు అని నేనంటే కాదని మీరూ అనలేరు,అవునా?కాని,ఈ మధ్యనే కొద్ది వారాల తేడాతో ఈయన వేసిన రెండు పోస్టులు చదివాక గోబెల్సు తరహా ప్రచారం ఎంతటి మేధావినైనా ఎంతటి అధమస్థాయికి దిగజారుస్తుందో అర్ధమైంది.నేను మాత్రం పొరపాటున గూడా అటువంటి దుస్థితికి దిగజారకుండా ఉండేటట్లు నిగ్రహంగా ఉంచమని దేవుణ్ణి వేడుకుంటున్నాను - అది గుర్తొచ్చినప్పుడల్లా!

     మొదటి పోస్టు చంద్రబాబు మనవడికి సంబంధించిన ఫంక్షన్ ఏదో జరిగినప్పుడు:."పుట్టబోయే శిశువులకి కూడా వంశపారంపర్య రాజ్యాధికారాన్ని దఖలు పర్చే మధ్యయుగాల నాటి సంరంభం కనిపిస్తున్నదహో!" అని తీవ్రస్థాయిలో యేకిపారేశారు.రెండో పోస్టు కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల బాధ్యతల్ని కేటీఆర్ గారికి అప్పజెప్తున్న వార్త వచ్చినప్పుడు:"ఒక సమర్ధుడైన యువనేతకి అనుభవజ్ఞుడైన తండ్రి బాధ్యతల్ని అప్పజెప్తూ ఇస్తున్న శిక్షణా కార్యక్రమం"గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు.మొదటి పోస్టు వేనాటికే కర్ణాకర్ణిగా కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి పీఠానికి కూడా కేటీఆర్ పేరు వినబడుతున్నది,అవునా కాదా?ఆ రెండు పోస్టుల్లో ఏదోఒకటి రాయకుండా ఉండిఉంటే నాకిప్పుడు దొరికిపోయేవాడు కాదు.మొదటి పోస్టు వేస్తున్నప్పుడు ఇదేపని కేసీఆర్ చేసినప్పుడు పొగడాల్సి వస్తుంది,ఇప్పుడిట్లా బాబుని విమర్శిస్తే ఎవరన్నా నన్ను తప్పు పడతారేమో అనే అనుమానం రాలేదు - తొందర!రెండో పోస్టు రాస్తున్నప్పుడు ఇదేపని బాబు చేసినప్పుడు విమర్శించాను,ఇప్పుడిట్లా కేసీఆర్ గార్ని పొగిడితే ఎవరన్నా నన్ను తప్పు పడతారేమో అన్న అనుమానం రాలెదు - నిర్లక్ష్యం!

     బాబయినా కసీయారయినా పాలిటిక్సులోకి వచ్చారూ అంటే చెప్పీన్ మాటలకి చప్పట్లు కొటించుకోవటం,ఎన్నికల్లో నిలబడితే ఓట్లు రప్పించుకోవటం కోసమే గదా!చప్పట్లు కొట్టించుకోవాలంటే మీకు ఫలానాది చేస్తానని చెప్పాలి,ఓట్లు రాబట్టుకోవాలంటే మీకు ఫలానాది చేశానని చూపించుకోవాలి - కావాలని ఒక ప్రాంతానికి అన్యాయం చేసి ఆ ప్రాంతం వాళ్ళని ఓట్లు అడగగలడా?

పయనించే ఓ చిలుకా - ఎగిరిపో, పాడైపోయెను గూడు!


     ఈయనొక్కడే కాదు,నేను చూసిన ప్రతి తెలంగాణ వాది ఇంత గందరగోళంలోనే ఉన్నాడు."చూస్తూ చూస్తూ రెండేళ్ళు గడిచాయి, ఇంకా ఎనిమిది సంవత్సరాల తరువాత కూడా మీరూ నేనూ ఇక్కడే బ్లాగ్లోకంలో ఉంటాము.తెలంగాణా ఏర్పడగానే ఎన్నో ఉపద్రవాలు జరుతాయని ఊహాగానాలు చేసిన వారు అంతర్థానం అయ్యారు ఎందుకో ఏమో?" అని దీర్ఘాలు తీస్తున్న పెద్దమనిషి శతకోటి లింగాల్లో ఒక బోడిలింగం అన్నట్టు జరిగిన గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల గురించి స్టాటిస్టిక్సూ,అడ్డనిలువుల టేబుళ్ళూ,గ్రాఫులూ,రిఫరెన్సులూ,కంపారిజన్లూ వదకట్టి గిలకొట్టి తిరగేసి మరగేసి మూడు పోష్టులు రాశాడు గానీ "స్వతంత్ర తెలంగాణపు నికరమైన వార్షికాదాయం ఎంత?వచ్చే ఎనికల్లో మళ్ళీ పవరులోకి రావడానికి ఉపయోగపడతాయని వూహిస్తూ సంక్షేమ పధకాలకి పెడుతున్న ఖర్చు ఎంత?ఆదాయంలో సింహభాగం వీటికే ఖర్చుపెడితే అభివృద్ధికి ఎక్కణ్ణించి డబ్బు తేవాలి?ఆదాయానికి మించి ఖర్చు చెయ్యటం ద్వారా పెరిగే అప్పుల్ని తీర్చడానికి గవర్నమెంటు దగ్గిర ఉన ప్లాను ఏమిటి?" అని ప్రశ్నించుకుని విషయాలని తెలుసుని రాస్తే బాగుండేది కదా!

     చాలామందికి వస్తున్నట్టే డబల్ బెడ్రూం ఫ్లాట్ల పధకం గురించి నాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి - ఇదసలు సాధ్యమేనా?మొత్తం రాష్త్రంలోని బీదవాళ్ళు ఎంతమంది?అందరికీనా అర్హులైన కొందైకేనా?అర్హత ప్రాతిపదిక ఏంటి?ఆశిస్తున్న వాళ్ళలో నికరంగా అర్హులైన లబ్దిదారులు ఎంతమంది ఉన్నారు?కుటుంబం అంటే భార్యా భర్తలూ వాళ్ళ ఇద్దరు పిల్లలు మాత్రమే అయితే నలుగురు,కానీ ఇద్దరిలో ఎవరో ఒకరికి ముసలి తలిదండ్రులు ఉంటే మొతం ఆరుగురు స్వేచ్చగా తిరగటానికి ఎంత స్థలం అవస్రం?అపాటుమెంట్లుగా కడితే బిల్డింగుకీ ప్రహరీకీ మధ్యన స్పేస్ కావాలి.విడిగా ఇల్లు కడితే ఓవరాల్ స్పేస్ మల్టిపలి అవుతుంది.గవర్నమెంటు దగ్గిర అంత బ్జూమి లేకపోతే కొనాల్సి ఉంటుంది.ఈ దబ్బ్బంతా తన సొనత్ జేబునుంచి పెట్టడం లేదు,ప్రజలందరి కష్టార్జితం!ప్రజలకి సంతృప్తి కలిగినా కలగకపోయినా ఇది కూడా కాంట్రాక్టర్లు పండగ చేసుకోవటానికి పనికొచ్చే యవ్వారమే కదా!ఇవ్వాళ తెలంగాణలో కాంట్రాక్తర్ల లక్కే లక్కు!కురో కుర్రు!వెలమదొర పాలన గట్లనె ఉంటది బిడ్డ!ఓర్చుకోవాలె తల్లి!గమ్మునుండవె చెల్లి!తిరగబడ్తనంటె నడ్డి విరిగేను మల్ల!తెలంగాణం బతుక్ ఇంక గుటుక్,బుడుంగ్!కోదండరాం పలుకు బుడుంగ్,బుడుంగ్!కంచ్గె ఐలయ్య పలుకు బుడుంగ్, బుడుంగ్!మేడారం సమక్క సారక్క పలుకు బుడుంగ్,బుడుంగ్!అల్లాండం బెల్లాండం బతుకమ్మ పలుకు బుడుంగ్,బుడుంగ్!బుడుబుడు బుడుంగ్!!

తెలుగు జాతి మనది,నిండుగ వెలుగు జాతి మనది అన్నది మొదట సినారె కాదు!


    మాటిమాటికీ మా సంస్కృతి వేరు,మేం ఆంధ్రోళ్లతో కలవలేం,అందుకే యాభయిల్లో కలవకుండా ఉండటానికి గొదవ చేశాం,అప్పుడు బలవంతంగా కలిపేశారు అని అంటున్నారు గానె తెలుగువాళ్లని ఒక్కటి చేసి బలమైన జాతిగా నిలబేట్టాలని మొదటిసారిగా ఆలోచించింది కాకతీయుల కాలం నాటి రాజనీతిజ్ఞులు!రుద్రమదేవి తాతగారైన రుద్రదేవ మహారాజు ఈ ప్రాంతానికి ఉన్న భౌగోళీక్ రాజకీయ ప్రాధాన్యతని బట్టి మొదలుపెడితే కాకతీయ సేనానులైన తదనంతరపు నాయక రాజులూ రెడ్ది రాజులూ తమ శక్తి కొద్దీ ఆ లక్ష్యానికి అనుగుణంగానే నడుచుకున్నారు.రుద్రదేవ మహారాజూ అతని పుత్రుదైన గణపతి దేవ మహారాజూ నచ్చిన వాళ్లని వివాహ సంబంధాల ద్వారానూ,నచ్చని వాళ్ళని యుద్ధవ్యూహాలతో అణచివెయ్యడం ద్వారానూ మచ్చిక చేసి తెలుగు ప్రజల యేకత్వానికి నారు వేసి పాదులు తీర్చి నీరు పోసి నిన్నటి వరకు అది అఖండంగా సాగిపోయేలా చేశారు!ముఖ్యంగా గణపతి దేవుడు మరింత శ్రద్ధ తీసుకుని అన్ని పండుగల్నీ ప్రభుత్వపరంగా నిర్వహించి ప్రజల్ని కూడా ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేసి తెలుగు ప్రజల ఆచార వ్యవహారాలు ఒకేలా ఉండేటట్లు చేశాడు.అందువల్లనే స్థూలంగా తెలుగువారి ఆచార వ్యవహారాలు కులాల కతీతంగా ఉన్నాయి.

     కాకతీయ ప్రభువులు తెలుగు ప్రజల్ని ఏకజాతిగా నిలబెట్టాలనుకోవడం వెనక అప్పటి రాజకీయ వాతావరణం,ఇక్కడి భౌగోళిక అనుకూలతలూ రెండూ ముఖ్యమైన కారణాలే.ఉత్తరాదిన బలమైన ఢిల్లీ మహమ్మదీయుల పాలనలోకి వెళ్ళి దక్షిణాదిలో కీలకమైన ఈ ప్రాంతాన్ని వశం చేసుకోవాలని ప్లానులు వేస్తున్న కాలం అది.అప్పటికే పక్కన బహమనీ సుల్తానులు బలంగా ఎదుగుతూ దక్షిణాది మొత్తాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు.భౌగోళీకంగా చూస్తే మొత్తం భారతదేశం ఒక అక్షయపాత్ర లాంటిది.గజినీ ఒక్కడే ఏడాది కొక్కసారి చొప్పున 18 సార్లు కొల్లగొట్టుకు పోయినా అతనటు వెళ్ళగానే మళ్ళీ పూర్ణకుంభంలా పైకి లేస్తూ ఉండేదంటే సంపదల్ని సృష్టించడంలో అప్పటి మనవాళ్ళు ఎంత నేర్పరులో అర్ధమవుతుంది కదా!ఆ స్థాయిలో సంపదని సృష్టించే దమ్ము ఈనాటివాళ్ళకి లేకపోబట్టి గానీ ఉంటేనా?!ప్రపంచ జనాభాలో నాలుగోవంతు జనాన్ని కూర్చోబెట్టి మేపుతూ నిన్నటి రోజున ఎవడో వలస రాజ్యంగా చేసుకుంటే లబోదిబోమని అఘోరించినమనం రేపటి రోజూన్ ఎలాంటి కుయుక్తులూ మరెలాంటి యుద్ధాలూ వ్హెయ్యకుండానే ప్రపంచాన్ని శాసించగలం!అంత గొప్ప దేశంలో కిందివైపున ఉన్న సముద్రతీరం పర్పంచానికి కలుపుతూ పైన  ఉన్న విధ్యసానువుల ద్వారా ఉత్తర దక్షిణాల్ని కలుపుతూ దేశపు రాజకీయార్ధిక రంగాల మీద ప్రభావం చూపగలిగే కీలకమైన స్థానంలో ఉంది ఈ ప్రాంతం.అందుకే కాకతీయ ప్రభువులూ,వారి సామంతులూ,అసఫ్ జాహెలూ,ఆదిల్ షాహీలూ,నిజాం షాహీల వరకు అందరూ దీన్ని చెదరనివ్వకుండా వచ్చారు.ఆఖరి నిజాము తన అవసరం కొద్దీ విదగొట్టాక నైజాం,సీడెడ్,కోస్తా పేర్లు బాగ అలవాటయ్యాకనే ఈ తేడాలు వచ్చాయి.

     స్వతంత్రం వచ్చాక అంతటి దూరదృష్టి లేని అప్పటి కాన్రెసు నాయకులు ప్రజలు ఎంత బలమైన సపోర్టు ఇచ్చినా జాతీయస్థాయిలో ఏనాడూ బలంగా ఉండలేదు.కనీసం వాళ్ళ పార్టీలోని కోటరీలోకి కూడా ఎదగలేదు!ఇప్పుడు చూస్తే అక్కడ చక్రం తిప్పడం సంగతి అటుంచి ఒక చోట కూర్చుని చర్చించుకుని చిటికెలో పరిష్కరించుకోగలిగిన చిన్న చిన్న సమస్యల్నే ఈగో ప్రాబ్లెంసుతో పెద్దవి చేసుకుని ఒకళ్ళనొకళ్ళు మీడియాలో అల్లరి పెట్టుకుంటూ ప్రపంచం ముంగిట తెలుగువాళ్ళ పరువు తీస్తున్నారు.ఒకసారి మీడియా ముందు నిలబడి చెత్త మాటలు మాట్లాడితే ప్రపంచంలో ఏమూల ఉన్న ఏ దేశస్థుడికయినా తెలిసిచస్తుంది,తెలిసిన ప్రతివాడూ పగలబడి నవ్వుకోవటానికి తప్ప ఎందుకు పనికొస్తాయనే ఇంగితం కూడా లేదు - వీళ్ళ చదులు తగలెయ్య!ఈ బజారు భాష మాట్లాట్టానికీ ఎ కాంట్రాక్టర్ల చెప్పులు నాకే కుక్కపన్లకీ అన్నేసి ఏళ్ళు వేస్టు చేసి అంతేసి డబు వేస్టు చెయ్యాలా - ధూ,నీయ్యవ్వ!

ఏటిలోని అలలు ఏరు విడిచి పోలేవు!ఎదలోపలి మమకారం బాదు విడిచి రానీదు!!


     తెలంగాణ లోని సాధుసజ్జనులు ఒక విషయానికి నన్ను క్షమించాలి!ఈ దుర్మార్గపు వ్యవహరంలో తలదూర్చకపోయినా మె బతులులు మార్తాయనే ఆశతో ఉండి కొత్తగా ఏర్పడిన అమె రాష్ట్రాని రాక్షసశిశువు అనడం మీకు కష్తం కలిగిస్తుందని నాకు తెలుసు,కానె మీలో కొందరు రాష్త్రం ఏర్పడీన రెండేళ్ళ తర్వాత కూడా మీ రాష్ట్రపు అభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి బదులు ఇంకా ఉద్యమకాలపు వీరావేశాన్నే ప్రదర్శిస్తూ ఆంధ్రద్వేషానికే అంటిపెట్తుకుని ఉండటం చూసి చిరాకు పుట్టి వాళ్ళకీ మీకొ కొంచెం చురుకు పుటించటం కోసమే ఇప్పుడు తెలంగాణ ఉన్న స్థితిలోని నెగిటివ్ అంశాల్ని మాత్రమే తీసుకుని విమర్శిస్తూ కొందరు వ్యక్తుల్ని పేర్లతో సహా ప్రస్తావిస్తూ ఇబ్బందిన్ కూడా కలిగించినా సందేహించహ్కుండా ఈ పోష్టుని వేశాను.నిజానికి సారంగలో ఒక చిత్రమైన అనుభవం ఎదురవకుండా ఉంతే ఈ పోస్టు ఇలా వచ్చేది కాదు.అక్కద రీ-పబ్లిష్ అయిన "ఆంధ్రోళ్ళ కత్తికి ఇంకెన్నాళ్ళు ధారపడదాం?" అనే వ్యాసం చదివి అంతకుముందు పైన ప్రస్తావించిన మశాలనింటి ప్రభావం కలిసి ఇక్కడి తలకటులో ఉన్న వాక్యమూ,పాకిస్తాను గురించి ఒక పేరా,తెలంగాణ గురించి ఒక పేరా కలిపిఒక కామెంటు వేశాను.మొదట ప్రచురించబడి,సారంగ వారి అల్వాటు చొపున నాలుగు రోజుల తర్వాత మాయమైపోయింది.అది మాయమయ్యే ముందర రచయిత దాని చదివి ఇచ్చిన జవాబు మాత్రమే అక్కడ ఉంది 

     ఇపుడు.ఇవ్వాళ డాబుసరికి దొరగారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తాడని పొగుడుతున్నాడు గానీ చెన్నారెడ్డి స్వార్ధ రాజకీయపు ఔన్నత్యం ఎవడికి తెలియదు?తన అవసరం కోసం అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేయ్యడానికి రగిలించి పైకెత్తి తన అవసరం తీరగానే దాని తుంగలో తొక్కి కోరుకున్న పదవిని అందుకున్న ఆ పేరు గొప్ప ఉద్యమానికి వ్యతిరేకంగా రాశాడని శ్రీశ్రీని కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టు పీకి విమర్శిస్తున్నాడు రచయిత!మరి,ఇవ్వాళ వీళ్ళు శిలావిగ్రహం పెట్టుకుని గౌరవించిన తెలంగాణ ప్రాంతపు కవి దాశరధి కూడా దాన్ని విమర్శించాడ్య్ కదా!వ్మర్శించహ్డమే కాదు,ఉద్యమకారులకి నచ్చజెప్పడానికి వెళ్ళిన దాశరధిని కాళోజీ నీ మందుల ఖర్చు భరించిన ఆంధ్రోళ్ళకి వూడిగం చహెస్తున్నావు నువ్వు అని ముఖాన్నే అనేసి చిన్నబుచ్చుకుని వెనకి వెళ్ళిపోయేలా చెయ్యడం ఎంత క్రూరమైన పని!ఉచితానుచితాలు చూడకుండా తమని వ్యతిరేకించిన ప్రతివాడూ ఎదిరి పక్షం వాడే అని తీర్మానించుకుని ఫెడీమని మనస్సు చివుక్కుమనేటట్టు ఎంత మాట పడితే అంత మాట అనగలిగిన నోటిదురుసుతనాన్ని తెలంగాణ వాళ్ళు ఎంత తొందరగా వొదులుకుంటే అప్పటి నుంచే వాళ్ళకి వైభవోజ్వలశకం మొదలవుతుందనేది నోరు మంచిదైతే వూరు మంచిదవుతుందన్న సామెత లాంటి సత్యం!యేది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!! 

10 comments:

  1. సర్
    ఇక్కడ తల్లి ఎవరు ? ఆంధ్రప్రదేశ్ ఆ ? ఇండియానా ?
    అయినా పాకిస్తాన్ తో తెలంగాణాని పోల్చడం బాలేదు

    ReplyDelete
  2. విడిపోయి బావుకున్నది ఏమీ లేదు నిజం నిలకడమీద తెలుస్తుంది.

    ReplyDelete
  3. సార్ మీరు వ్రాసిన లంబా చౌడా వ్యాసం చదవాలంటే కష్టం. శీర్షిక అదుర్స్. ముమ్మాటికీ నిజం. తెలంగానా తెలుగుతల్లిని చంపితే పాకి భరతమాతను చంపింది.

    ReplyDelete
  4. మాకు ఆ సిద్దిపేట వాడు ముఖ్యమంత్రి గా ఉండటం ఏంటి ? మా రాష్ట్రం మాకు కావాలి .
    ఇక్కడ మా రాష్ట్రం అంటే ఖమ్మం , నల్గొండ , మహబూబ్ నగర్ , మెదక్ , రంగా రెడ్డి , హైద్రాబాద్ జిల్లాలతో మాకు రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలి . కావాలనుంటే హైద్రాబాద్ ని ఉమ్మడి రాజధాని గా 10 ఏఅర్స్ ఇస్తాం .

    ReplyDelete
  5. నిజానికి మా జిల్లాలే తెలంగాణాకి ఎక్కువ ఆదాయాన్ని ఇస్తున్నవి . మా ఆదాయాన్ని వాలు దోచుకుంటున్నారు .
    మాకు బతకమ్మ ఆడాల్సిన అవసరం లేదు . దీనికి తాగుబోతు కూతుర్ని అద్దం పెట్టి డబ్బులు తగలేస్తున్నారు . మా మీద మీ పండగలు , యాసని రుద్దుతున్నారు . మా స్వతంత్ర రాష్ట్రం మాకు కావాలి . మీ ప్రాంతము వాళ్ళకి జై జై లు కూతుకుంటూ తిరగాల్సిన అవసరము లేదు .

    ReplyDelete
  6. లోగడ తెలంగాణా వాదులే నొక్కి చెప్పిన మాటలున్నాయిగా. విడిపోతామనుకునే వాళ్ళ మాట చాలనీ - కలిసుందామనే వాళ్ళ మాటకు విలువలేదనీ. అంచేత మీ ప్రత్యేకరాష్ట్రం డిమాండును ఈ దేశం అంతా ఒప్పుకోవాలె. ఇంకా మాట్లాడితే ప్రపంచం అంతా ఒప్పుకోవాలె. మీ క్కావలసిన రాస్ట్రం మీకు ఇవ్వాల్సిందే -అవసరం పడితే రాజ్యాంగాన్ని మార్చి ఐనా సరే. నలుగుర్నీ తలుపులేసి తన్ని ఐనా మీ రాష్ట్రం మీకిమ్మని అడగండి. పోయి మీరు సకలజనుల సమ్మెలూ వగైరా జేసుకోండి మరి.

    ReplyDelete
  7. మాకు సకల జనుల సమ్మె చేయవల్సిన పని లేదు . ఇప్పుడు అధికారం లో ఉన్న BJP చిన్న రాష్ట్రాలకు అనుకూలం కాబట్టి మాకు ప్రాసెస్ ఈజీ అవుతున్నది . మా తాగుబోతు ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి విషయాన్ని మేము వాడుకుంటాము , దీని సపోర్ట్ కొరకు పక్క న ఉన్న మూడు రాష్టాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాయబోతున్నాము

    ReplyDelete
  8. హరిబాబు గారూ!
    నిన్నటి ఆంధ్రజ్యోతిలో కష్మీర్ సమస్యపై ఒక విశ్వవిద్యాలయ విద్యార్థి వ్రాసిన పచ్చకామెర్ల వ్యాసం ఒకటి వచ్చింది. ఎడమ, ఎడమాతి ఎడమ, ప్రగతిశీల, మహిళా రియాక్షనరీ శక్తులకు మన తెలుగు పత్రికలన్నీ దాసోహం అంటున్నాయనేందుకు ఈ వ్యాస ప్రచురణ ఒక ఉదాహరణ. ఒక్క ఆంధ్రభూమి తప్పిస్తే మిగతా తెలుగు పత్రిక, మాధ్యమ లోకమంతా నాణేనికి రెండో వైపు అంటే రైటిస్టు భావాలు కలిగినవాళ్ళ, స్వతంత్రంగా ఆలోచించేవాళ్ళ భావనలను వేటినీ ప్రచురించడంలేదు. ఇది ఎప్పటినుండో జరుగుతూనేవుంది.
    హఫింగ్టన్ పోస్టులో వచ్చిన వ్యాసాన్ని తెలుగులోకి అనువదించి పైన చెప్పిన వ్యాసంగా ఆంధ్రజ్యోతివారు వేసేరు.
    విచిత్రమేమంటే, ఆ వ్యాసం క్రింది వ్యాఖ్యలలోనే ఆ వ్యాసరచయితని శుభ్రంగా తోమి, తూర్పారపట్టి, అతడి అపరిపక్వతను ఎండగట్టేరు. వాటి గురించి ఆంధ్రజ్యోతిలో ప్రచురించరు.
    ఈ నేపథ్యంలో మీరు మీ బ్లాగులో రైటిస్టులని, స్వతంత్రంగా ఆలోచించేవారిని కష్మీర్ సమస్య గురించి వ్రాయమని ఆహ్వానించవలసినదిగా మనవి.
    ప్రథమంగా పైన చెప్పిన వ్యాసాన్ని గురించి ఆలోచించండి.
    దాని లంకె ఇస్తున్నాను,
    ’’I Am A Kashmiri Hindu And I Raise My Voice Against The Indian State's Onslaught On Kashmir‘‘
    http://www.huffingtonpost.in/kartik-maini/kashmiri-muslim-lives-matter/
    ఆంధ్రజ్యోతి వ్యాసం
    ‘‘నేను కష్మీరీ హిందువుని’’
    http://epaper.andhrajyothy.com/c/11816225

    వార్తా పత్రికలే కాదు, వెబ్ లోకంలో కూడా స్వేచ్ఛగా వ్రాసేవారి అభిప్రాయాలు అతి తక్కువగా ప్రచురితమవుతున్నాయి. ఏ అజెండా లేకుండా నిష్పాక్షికంగా సమస్యను చూడగలిగితేనే సత్యం బోధపడుతుంది.
    మీ బ్లాగులో అలా వ్రాసేవారిని ఈ విషయంపై వ్రాయవలసినదిగా ఆహ్వానించండి.
    ........శ్రీనివాసుడు.

    ReplyDelete
  9. @neehaarika
    ప్రేమకీ ,ఆరాధనకీ తేడా ఏమిటండీ అని మళ్ళీ అడుగుతారేమో మనల్ని చూసి కుక్క సంతోషంతో తోక ఊపిందనుకోండి అది ప్రేమ...నా తోక ఊపుడుకి ప్రతివారూ పడితీరతారు అని మనకు మనమే అనేసుకోవడం ఆరాధన !
    @haribabu
    అంత ఆరాధన ఉండబట్టే ఈ BITCH(ఆడకుక్క) పైట లాంటి తోక వూపుకుంటూ "నాకు లాడెనూ,లాడెనుకి నేనూ" అని పులకించిపోయింది:-)

    ReplyDelete
  10. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...