Monday 4 July 2016

చలం తలలోని మెదడును ఉపయోగించి రాసిన బ్రాహ్మణీకం మోకాలిలోని మెదడును మాత్రమే ఉపయోగించేవాళ్ళకి అర్ధం కాకపోవటం సహజమే కదా - శ్రీనివాసా!

         "నువ్వు గొప్పవాడివని నాకు తెలుసు గానీ నిన్ను పొగడ్డానికి మాత్రం మనస్కరించటం లేదు?!" - ఈ ముక్కని మీ గురించి మీతోనే ఎవరయినా అన్నారనుకోండి - అతను మిమ్మల్ని తిడుతున్నాడో,పొగుడుతున్నాడో,నిందాస్తుతితో ఎటకారం చేస్తన్నాడో ఒక పట్టాన అర్ధమయి చావదు,కదూ!కొందరంతే,"ఇన్నాళ్ళూ మాకర్ధం కానివి మీరు మాట్లాడారు,,ఇప్పుడు మీకే కాదు మూగకు మాటొచ్చినటు మాకు కూడా అర్ధం కాకుండా మాట్లాడే తెలివి వచ్చేసింది - కాబట్టి  మీరు మాట్లాడొద్దన్నా వూర్కోం.వింటున్న మీకే కాదు,మాట్లాడుతున్న మాకు కూడా అర్ధం కానంత గొప్పగా మాట్లాడగలం!ఏమనుకున్నారో?" అని వార్నింగులు ఇచ్చి మరీ చెత్త మాట్లాడుతూ ఉంటారు."ఒరేయి శాస్త్రీ!ఇదంతా కలంతోనే రాశావుట్రా?" అనే కొంటె బొమ్మల బాపు కార్టూనులోని కవికుంజరంలా వాళ్లు దేంతో ఆలోచించారో మనం కూడా దాంతోనే ఆలోచిస్తే తప్ప వాళ్ళ మనసు లోపలి అసలు గోలేంటో మనకి అర్ధమయి చావదు!మనమేమో తలలో ఉన్న మెదడుతో అలోచించేవాళ్ళం,వాళ్ళేమో మోకాలిలో ఉన్న మెదడుతో ఆలోచిస్తూ ఉంటారు - కాబట్టి అధాట్న వాళ్ళు రాసినవి చదవగానే మనలాంటివాళ్ళకి గందరగోళం అనిపించటం సహజం.

  మనకి అప్పుడప్పుడు బోరు కొడుతుంది!యెందుకు బోరు కొడుతుందని అడక్కండి,ఇప్పుడు మీరు అడిగినా సరే, బోరు గురించి గంభీరమైన విషయాలు చెప్పి మిమ్మల్ని బోరు కొట్టించే ఉద్దేశం నాకు లేదు:-)బోరు కొట్టినప్పుడు మనం సవాలక్ష పన్లు చేస్తాం - ఒకే రకం బోరు కైనా ఒక్కో మనిషి ఒక్కో ఆల్టర్నేటివ్ చూసుకుంటాడు.కానీ కుక్కలకి మాత్రం ఏ రకమయిన బోరు కయినా ఒకటే కాలక్షేపం - హాయిగా తోక వూపుకోవటం!అన్ని కుక్కలకీ అన్ని బోరులకీ ఓకే పరిష్కారం - ఈ తోక వూపుడు కార్యక్రమం!అలాగే ఇంగ్లీషువాళ్ళకీ, తర్వాత కమ్యూనిష్టులకీ, ఆ తర్వాత స్త్రీవాదులకీ,ఇంకా తర్వాత దళితులకీ ఈ దేశంలోని అన్ని సమస్యలకీ బ్రాహ్మణులే కారణం అనే వాదన చాలాకాలం ముంచీ కాలక్షేపంతో కూడిన ఆనందాన్ని కలిగిస్తున్నది. వారి అపరిమతమైన ఆనందానుభూతిని భగ్నం చేసే క్రూరత్వం నాకు లేదు - అమ్మతోడు,నిజం!మోకాలి లోని మెదడుతో ఆలోచించేవారి పాండిత్యాన్ని అర్ధం చేసుకోలేక తలలోని మెదడుతో ఆలోచించేవారికి ఏర్పడిన గందరగోళాన్ని తగ్గించడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తున్నాను. అసలువారి పాండిత్యాన్ని అవమానించేటంత స్థాయిలో సమ్యక్-జ్ఞానం గానీ వారిని తలతో ఆలోచింపజెయ్యగలిగిన సమర్ధత గానీ నాకు లేవు గాబట్టి శ్రీనివాసుడు లాంటివారిలా వారిని మార్చడానికి నేను పొరపాటున కూడా ప్రయత్నించను - ఆకాశంలో ఎర్రగా ఉన్న సూరీణ్ణి సూడంగానే అక్కడేదో మర్దరు జరిగిపోయిందన్నట్టు బులబులాగ్గా కతలల్లేస్కుంటా కూసింత కలాపోసన జేస్కోకపోతే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది సెప్పండి!ఆళ్ళట్టాగే మాట్టాడాల,మన్లాంటోళ్ళం ఫుల్లుగా నవ్వుకోవాల - అద్గదీ సంగతి:-)

     అసలు ఈ తోకను వూపే దృశ్యం పోలికలోనే వారికి పెద్ద కుట్ర కోణం కనబడవచ్చు కాబట్టి ముందుగానే  నావైపునుంచి నేను కొన్ని విషయాలు స్పష్టం చేస్తాను.కేవలం పెర్స్పెక్టివ్ డిఫరెన్స్ అనే వారికి నచ్చిన వాదనా పద్ధతికి పనికొస్తుందనే ఈ తోక వూపే కుక్క వుదాహరణ తెసుకున్నాను తప్ప హెచ్చార్కె గారిని కించపరిచే ఉద్దేశం నాకెంతమాత్రమూ లేదు.ఈ కాలంలో పుట్టిన ముప్పాళ్ళ రంగనాయకమ్మకి నచ్చిన మార్క్సీయ భావజాలం ప్రకారం రాయని ఆ కాలంలో పుట్టిన వాల్మీకి చేసిన తప్పునే చలం కూడా చేశాడు గాబట్టి తిడితే చలాన్నే తిడతాను తప్ప హెచ్చార్కె గారిని పల్లెత్తు మాట కూడా అనను.

     సనాతనులకి ఈ పెర్స్పెక్టివ్ డిఫరెన్సుల గోల లేదు.ఒకే విషయం గురించి ఒక్కోడూ ఒక్కోమాట చెప్తున్నప్పుడల్లా "ఏకం సత్ విప్రాని బహుధా వదంతి" అని సర్ధి చెప్పేసుకుని అప్పటికి ఏది బెస్టుగా పనికొస్తుందో దాన్ని పాటించేసేవాళ్ళు!అదే అలవాటు చొప్పున ఏ ప్రాంతం నుంచి ఏ మతస్థుడు వచ్చినా చక్కగా ఆతిధ్యమిచ్చి ఇళ్ళూ గుళ్ళూ కట్టుకునే చోటిచ్చి "నీ నిష్ఠ నువ్వు పాటించుకో, నా నిష్ఠ నేను పాటించుకుంటా"నని చెప్పేసి "వసుధైక కుటుంబ భావన"ని అతి ప్రాచీన కాలంలోనే వూహించి,బోధించి,సాధించి సుమారు అరవై వేల సంవత్సరాల వెనకటి కాలం నుంచి ఇప్పటికీ స్వయంచాలిత గడియారంలా తప్పుల్ని సరిదిద్దుకుంటూ తనలో కలిసిన సమస్తాన్నీ తనవెంట లాక్కుపోయే జీవనదీప్రవాహంలా కాలాలు దాటుకుని నడుస్తూ ఉన్న ఈ సనాతన ధర్మానికి కట్టుబడినవారు తమ చుట్టూ ఎన్ని సంక్షోభాలు చెలరేగుతున్నా చలించకుండా ప్రశాంతజీవనం సాగిస్తూనే ఉన్నారు!"ఇప్పటి సమస్య యేంటి?దానికి పరిష్కారం యేంటి?ఏది ప్రశాంతంగా ముందుకు నడిచహెతందుకు ఉత్సాహపరుస్తుంది?" - అంతకు మించి సనాతనులు ఈ పెర్స్పెక్టివ్ డిఫరెన్సుల గనదరగోళంలో పడరు.మనోభావాలు దెబ్బతినడం అంటే యేంటో వారికి తెలియదు!ఎటొచ్చీ మెకాలే మహానుభావుడు మనకి ఇంగ్లీష్ నేర్పకపోయుంటే బ్రాహ్మల చేతుల్లో చచ్చిపోయి ఉండేవాళ్ళం అని నమ్ముతున్న వాళ్ళకి బ్రాహ్మలు చెప్పిన ప్రతిదాన్నీ మరో వైపు నుంచి చూసి ఆ కుట్రకోణాన్ని అర్ధం  చేసుకోవాల్సిన అవసరం ఉంది గాబట్టి ఈ పెర్స్పెక్టివ్ ఔట్లుక్ అనేది పుట్టుకొచ్చింది.తలలోని మెదడుతో ఆలోచించే మనం ఇట్లా సూటిగా "కుక్క తోకని వూపుతుంది" అనేస్తే మోకాలిలోని మెదడుతో ఆలోచించేవారికి అందులో కుట్ర ఉన్నట్టు కనపడుతుంది.ఆ కుట్రని తను కనుక్కుని మిగిలిన మోకాలిలోని మెదడుతో ఆలోచించేవారిని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు మన గ్రూపులో చేరకుండా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా డిఫరెంట్ పెర్స్పెక్టివ్ చాలా అవసరం.

     మీకు బోరు కొట్టినా సరే మరోసారి కుక్క-తోకని-వూపటం అనే దృశ్యాన్ని మీ కళ్ళముందు ఉంచబోతున్నాను.ఇప్పుడే కాదు,ఈ పోష్టు నిండా ఈ దృశ్యాని మీ కళ్ళ ముందు నుంచి పోనివ్వకండి!కనుక్కోగలిగిన వాడికి ఈ ఒక్క దృశ్యంలోనే సమస్త విద్యల్నీ సుబోధకంగా అర్ధం చేసుకోగలిగిన పాండిత్యం వస్తుంది - కాలభైరవస్వామి దీక్ష అంటారు దీన్ని!ఉదాహరణకి "కుక్క తోకని వూపుతుంది" అన్న  సిద్ధాంతంలో బ్రాహ్మణుల కుట్రని కనుకున్న పెద్దమనిషి తనని ఆ కుట్రనించి కాపాడుకోవటానికి చేసే వ్యూహాత్మక మేధోవికసన సంభరితమైన విశ్లేషణ ఎలా ఉంటుంది అనేది మనకి తెలియాలంటే మనం కూడా కాసేపు తలలోని మెదడుతో కాకుండా మోకాలిలోని మెదడుతో ఆలోచించాలి - మరో దారి లేదు!వారొక వేళ తమలో తాము చెప్పుకోవడానికయితే అట్టే శ్రమపడనకరలేదు.కానీ అందరితో ఒప్పించాలంటే కొంచెం శ్రమ పడాలి గదా, మనకి కూడా వారి విశ్లేషణ నమ్మదగ్గదే అనిపించాలి గదా!లేకపోతే మనం తాటాకులు కట్టేస్తాం,అవునా?కుక్క తోకని వూపుతుంది అనే ప్రతిపాదనలోని కుట్రని తప్పించుకోవాలంటే తోకయే కుక్కని కదిలిస్తుంది అని నిరూపించగలిగితే చాలు!ఆర్య - ద్రవిడ ఆక్రమణ తిరగమోత సిద్ధాంతాన్ని వండి వార్చటానికి రొమిల్లా ధాపర్ గారు ఎంత కఠోరంగా శ్రమించారో గుర్తు చేసుకుని ఉత్తేజితులై తోకయే కుక్కని కదిలిస్తుంది అన్న దానికి సాక్ష్యంగా తెచ్చుకోవడానికి కుక్క యొక్క ప్రతి కదలికనీ నిశితంగా పరిశీలించాలి.లించగా లించగా హఠాత్తుగా ఒక విషయం పత్యేకంగా కనిపిస్తుంది - కుక్క ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే తోకని కదిలిస్తుంది - నడిచేటప్పుడు,పరిగెత్తేటప్పుడు తోకని కదిలించదు:కొన్ని కుక్కలయితే తోకని కాళ్ళమధ్యన ఇరిక్కించుకుంటాయి!హమ్మయ్య, తలలోని మెదడుతో ఆలోచించేవాళ్ళని వాదనలో గెలవటానికి ఒక తిరుగులేని సాక్ష్యం దొరికేసిందోచ్!

     "పైన టైటిలు యేంటి?ఈ కుక్క తోక వూపడు గొడవ యేంటి?హరిబాబుకి మెంటల్ వచ్చేసిందా?ముద్రగడ గురించిన వార్తలు మరీ ఎక్కువగా ఫాలో అయ్యాడా?" అని మీరు అనుకుంటే అది శానా తప్పు.ముందే చెప్పాను విషయం కాంప్లికేటెడ్,జాగత్తగా ఫాలో అవ్వాలని!కొన్ని విషయాల్ని సూటిగా చెప్పలేం.అసలే నేను కబాలి గాణ్ణి  దానికి తోడు "చుట్టూ చుట్టి వచ్చావా?చూపుడువేలితొ గుచ్చావా!" అనే మూడ్ ఆవహించి ఉంది - రివోల్టిస్తే పిచ్చెక్కిస్తా:-) ఆదికాలం నుండీ ప్రపంచంలోని ఆలోచనాపరులు "తలలోని మెదడును ఉపయోగించి ఆలోచించేవాళ్ళు","మోకాలిలోని మెదడును ఉపయోగించి ఆలోచించేవాళ్ళు" అని రెండు రకాలుగా విడిపోయి ఈ జగన్నాటకంలో ఎవరి పాత్రని వారు పోషిస్తూ కాలచక్రం ఆకులకి బంకలా అతుక్కుని తాము అతుక్కున్న ఆకు నేలకి తగిలి తమని నలిపినప్పుడు ఏడుస్తూ పైకి వెళ్ళి చిటారుకొమ్మన తమని నిలబెట్టినప్పుడు ఇకిలిస్తూ మల్లాగుల్లాలు పడుతున్నారు.అయితే,ఈ త.మె.ఉ.ఆ గాళ్ళు మహా ముదుర్లు,తమ ఆకు కొంచెం  కిందకి వెళ్ళబోతుందని తెలియంగానే వెంఠనే ఎలర్టయ్యి అసుంటా పక్కకి జరిగి నలుగుడును తప్పించుకుంటున్నారు.పైగా అమాయకులైన మో.మె.ఉ.ఆ గాళ్ళు తప్పించుకోలేక అవస్థలు పడుతుంటే క్రూరంగా కేరింతలు కొట్టి ఆనందిస్తున్నారు - దాంతో కొందరు శ్రీనివాసుడు లాంటి మంచి త.మె.ఉ.ఆ గాళ్ళు ఎట్లాగయినా మో.మె.ఉ.ఆ గాళ్ళని రకషిద్దాం అని ఎంత ప్రయత్నించినా హెచ్చార్కె లాంటివాళ్ళు ఇంకా మొండికెత్తిపోతున్నారే తప్ప శ్రీనివాసుడు ఆశించిన మార్పు రావడం లేదు.దాంతో తన శ్రమ వృధా అవుతున్నందుకు విసుక్కుని అశాంతికి లోనవుతున్న శ్రీనివాసుడు తరహా అజ్ఞానులకి హెచ్చార్కె లాంటి జ్ఞానుల ఆంతర్యాన్ని బోధపర్చాలంటే ఇంత పెద్ద ఉపోద్ఘాతం/మొదటిసుత్తిదెబ్బ చాలా అవసరం.ఇట్నించి నరుక్కొస్తే పని జరగనప్పుడు అట్నించి నరుక్కు రమ్మన్నారు పెద్దలు, విన్లేదూ!

     వ్యూహాలన్నీ దిట్టంగా వేసి,సైన్యాన్ని చక్కగా మొహరించి,శంఖం వూదేశాక ఇంక రంగంలోకి దిగాలి కదా  - ఇప్పుడు దిగుదాం!ఎక్కడో ఒకచోట తను గందరగోళంలో ఉన్నట్టు చెప్పిన హెచ్చార్కె గారు మొదట "అన్న ద్వేషం"లో ఏమి చెప్పదలుచుకున్నారు?ప్రధాన విషయం బ్రాహణీకం నవలని చలం కధలోని విలన్ పాత్రకి అంటగట్టిన బ్రాహ్మణేతరోద్యమాన్ని అవమానించటానికీ బ్రాహ్మణుల్ని పొగడటానికీ రాస్తే ఇప్పటి వరకూ విమర్సకులెవరూ కనుకోలేని ఆ పరమసత్యాని తను కనుక్కున్నానని నవలలోని కొన్ని భాగాల్ని ఉటంకించి నిరూపించటం.కానీ వ్యాసం మొదలుపెట్టింది తన బాల్యపు అనుభవాలతో - బహుశా తన బ్రాహ్మణ ద్వేషానికి మూలకారణాల్ని చెప్పడం ద్వారా ముందరి వాదనకి బలం చేకూరుతుందని భావించి ఉండవచ్చు!అదంతా నాకు అనవసరం అనిపించినా రచయిత రాసేశాడు గనక,అచ్చులోకి వచ్చేసింది గనక చదవటం నుంచి తప్పించుకోలకపోయాను.కానీ అప్పటి వరకూ వాళ్ళింట్లో స్వేచ్చగా తిరిగిన ఈయనని  ఆ బ్రాహ్మణూడు ఒక్కసారిగా అట్లా మందలించడం,దానికి మనసు విరిగిపోయి ఈయన బ్రాహ్మణద్వేషి అయిపోవడం మరీ సినిమాటిక్ మెలోడ్రామా అనిపిస్తున్నది నాకు.సరే,ఆయన సొంతగొడవ ఆయనది,ఆయన అనుభూతులు ఆయనవి,ఆయన అర్ధం చేసుకునే పద్ధతి అది - వాట్ని గురించి యేమీ విమర్శించను!కానీ,"హిస్టారికల్ బుద్ధా" అనే పరమ వాస్తవికమైన గ్రంధంలో బుద్ధుడి కాలానికి కూడా మనుషులు పుట్టిన కులంలోనే అంటుగట్టుకుపోకుండా కులాన్ని మార్చుకునే వీలు ఉండేదనీ,వృత్తులకి అనుబంధంగా కులాలు యేర్పడినాయనే చారిత్రక పరిశోధనల వాసన లేని ఒక మామూలు మధ్యతరగతి కుటుంబీకుడిగా ఉన్న బ్రాహ్మణుణ్ణి తన జ్ఞానపు పరిధికి మించిన ప్రశ్న అడిగితే ఏమి చెబుతాడు?ఈ హెచ్చార్కె గారినే తనకి తెలియని విషయం గురంచి ఎవరయినా చెప్పి తీరాల్సిందేనని రెట్టించి అడిగితే యేమి చేప్తాడు?

     సకలకళావల్లభుడు అనే పదానికి శ్రీరమణ గారు అన్ని ప్రక్రియల మీదా రెట్ట వేసిన పిట్ట అనే సరదా అనువాదం చేశాడు.అట్లాగే ఈయన కూడా బీఫ్ వివాదం నుంచి మహిషాసురుణ్ణి మూలవాసీల దేవుడని అంటూ వచ్చిన కరపత్రం వరకు గల అన్నింటి మీదా విరుచుకు పడ్డాడు.ప్రపంచంలో తొలిసారిగా వ్యవస్థీకృతంగా వ్యవసాయం,పశుపోషణ మొదలు పెటింది భారతీయ సనాతనులే - అది కూడా గోజాతితోనే మొదలైంది!అప్పటి నుంచి భారతీయుల సామాజిక జీవితం మొత్తం గోమాతను దేహమాత,దేశమాత,దేవమాత తదాదిగా గల పంచమాతృకలలో ఒక మాతగా చేసుకుని పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు!గోవునే ఎందుకు పూజించాలి,గేదెనీ మేకనీ ఎందుకు పూజించరాదు అని మహా రౌద్రంగా అడుగుతున్నవారు వాటికి ఒక్కరోజునైనా తిండి పెట్టి పోషించి రక్షించిన దాఖలాలు ఉన్నాయా?ఇప్పటి నుంచీ గేదె భక్తులూ మేక భక్తులూ వాట్ని కూడా రక్షించి పూజించుకోవచ్చు కదా!ఎవరు వద్దన్నారు?మహిషాసురుణ్ణి పొగుడుకుంటూ వేసిన కరపత్రం గురించి స్మృతి ఇరానీ గొంతు వణకటం గురించి మాత్రమే పట్టించుకుని వ్యంగ్యాలు విసురుతున్న ప్రబుద్ధులు మరి అందులో దుర్గను సెక్స్ వర్కర్ అనటం గురించి ఎందుకు మర్చిపోతున్నారు?ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా అంతా తెలిసినట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ మోకాలిలోని మెదడుతో ఆలోచించేవాళ్ళకి సహజ లక్షణం కాబోలు!

     కరపత్రంలో దుర్గని సెక్స్ వర్కర్ అన్నదాన్ని సమర్ధించటానికి చివరి వాక్యంలో "ఇప్పుడు కరపత్రంలో తమ మూలవాసి రాజుని మోసగించి చంపిన స్త్రీని వాళ్ళు ఏదో అన్నారని అంతగా వూగిపోయి డిప్రేవిటీ అంటూ అరుస్తారా?ఇదంతా ప్రజాస్వామ్యం కిందకి వస్తుందా?" అని అడుగుతున్న ఈ పెద్దమనిషికి ప్రజాస్వామ్యం యొక్క మౌలిక లక్షణం మెజార్టీ అభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన ఉండటం అని నిజంగానే తెలియదా?అధికారం మెజార్టీ పౌరుల అభిప్రాయాన్ని ప్రతిబింబించటం ప్రజాస్వామ్యానికి మొదటి లక్షణం అయినప్పుడు ఆ మెజార్టీ ప్రజల సంస్కృతిని అధిక్షేపించటం ప్రజాస్వామ్యబద్ధమైనది అని  కేవలం తోకయే కుక్కని కదిలిస్తుంది అని వాదించగలిగిన మోకాలిలోని మెదడుతో ఆలోచించేవాళ్ళు మాత్రమే చెయ్యగలరు!తెలంగాణ వాళ్ళు అధికారికంగా ఇవ్వాళ మా ప్రాంతాన్నేలిన గొప్ప రాణి అని రుద్రమదేవి గురించి  మురుసుకుంటున్న కాకతీయులంటే సమ్మక్క సారక్కల అభిమానులకి ద్వేషం!వీళ్ళలో ఎవడయినా  ఇప్పటికిప్పుడు మేడారం నడిబొడ్దున నిలబడి కాకతీయుల్ని కీర్తిస్తూ మాట్లాడి క్షేమంగా వెనక్కి తిరిగి రాగలడా?

     సరే,పిట్టకధలుగా చెప్పిన అప్రస్తుత విషయాల్ని ఇంతటితో వదిలి వ్యాసంలోని ముఖ్యవిషయం సంగతి చూద్దాం.ఇన్నేళ్ళుగా ఏ గొప్ప విమర్సకుడికీ తోచని ఒక కొత విషయం ఈయన కనిపెట్టేశాడు - చలం బ్రాహ్మణీకం అనే నవలని బ్రాహ్మణుల్ని పొగడ్డానికీ విలన్ అయిన రామయ్యనాయుడికి అంటగట్టిన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని విమర్శించటానికీ రాశాడని!అదేదో మహద్రచన అయినట్టు దాన్ని ప్రశంసించిన కుహనా ఫెమినిస్టులూ,దాన్ని ఆధారం చేసుకుని కేంద్ర సాహిత్య సత్కారాలు అందుకున్నవాళ్ళంతా అది కాకతాళీయంగా చెయ్యలేదనీ వారు కూడా చలం వంటి కుట్రదారులేననేందుకు తన దగ్గిర  సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నాడు.తన వాదనని బలంగా నిరూపించే ఆధారాలు నవలలోనే వున్నాయంటున్నాడు!మొదటి ఆధారంగా ఇతరత్రా మంచివాడు అని చెప్పి, రామయ్యనాయుడు సుందరమ్మకి సాయం చెయ్యడానికే వెళ్ళినట్టు చెప్పి,ఆమె కులం ఏమిటో తెలిశాక "బ్రాహ్మణ స్త్రీని అలా చయాలనిపించిన విపరీత మనస్తత్వం వల్ల అలా చేశాడట" అని చలం మాటల్ని చెప్పి దానికి తను "మరో మాటలో బ్రాహ్మణవ్యతిరేకోద్యమ మనస్తత్వంతో అలా చేశాడు అని చెలం పలు విధాలుగా ఎస్టాబ్లిష్ చేశాడు" అనే వాదన చేస్తున్నాడు.రెండవ ఆధారంగా చివరి సన్నివేశంలో రామయ్యనాయుడు తనని మోసం చేశాడని తెలిసి నిర్ఘాంతపోయి చస్తూ చస్తూ చూసిన కోపపు చూపుకి తనలోని గిల్ట్ వల్ల  భయపడి వెనక్కి వెనక్కి జరిగి బుడ్డి దీపం అంటుకుని రామయ్యనాయుడు చచ్చిపోయే సనివేశాన్ని బ్రాహ్మణీకపు మహత్యాన్ని ఉగ్గడించటానికే అట్లా రాశాడనే వాదన   చేస్తున్నాడు.

     మొదటి వాదనలోని ఔచిత్యం గురించి తెలుసుకోవడానికి సాహిత్యసృజన విషయం పక్కకి పెట్టి వాస్తవ సమాజంలోని సామాన్యుల నుంచి మహనీయుల వరకు ఏ వ్యక్తిని తీసుకున్నా ఏ ఒక్క వ్యక్తిలోనూ 100% మంచీ 100% చెడూ ఉండటం లేదని తెలుస్తుంది!అయినా సరే,పట్టువదలని విక్రమార్కుడిలా  ఎవరయినా 100% మంచివాడి కోసం గానీ 100% చెడ్డవాడి కోసం గానీ గడ్డివామిలో సూదిని వెతికినంత దీక్షగావెతికి పట్టుకోదల్చుకుంటే రెండే రెండు చోట్లు ఉన్నాయి - పిచ్చాసుపత్రులు,అధమస్థాయి రచయితల సాహితీరూపాలు.ఆ రెండు క్యాటగిరీలనీ సమాజం ఎక్కువ కాలం భరించలేదు!అందుకే మొదటి రకం వ్యక్తుల్ని నాలుగ్గోడల మధ్యన ఉంచడం,రెండవ రకం వ్యక్తుల్ని తొందరగా మర్చిపోవడం జరుగుతున్నది.ఒక అత్యున్నత భావశిఖరం మీద నిలబడి తమ చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఏ రకం వ్యక్తిత్వాల్ని అలవర్చుకుంటే ఇప్పటికన్నా మెరుగ్గా బతకవచ్చునో అలాంటి వ్యక్తిత్వాన్ని కధానాయకుడికీ ఏ రకం వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే జీవితం దుఃఖభాజనం అవుతుందో అలాంటి వ్యక్తిత్వాన్ని ప్రతినాయకుడికీ ఆపాదించి మొత్తం సమాజానికి దిశానిర్దేశంగా పనికొచ్చే సాహిత్యాన్ని సృజించగలిగిన రచయితలు రూపుదిద్దిన పాత్రలు అజరామరంగా ఉండటానికి కారణం మంచిచెడుల మేలుకలయికగా అల్లిన వాటి నిర్మితిలోని వాస్తవికతయే!ఆ లక్షణాన్నే తపు పట్టినవాడు సాహితీ విమర్శకి దూరంగా ఉంటే తనకీ ఇతర్లకీ చాలా ఉపకారం చేసినవాడవుతాడు.

     ఈ రోజున ప్రపంచంలో క్రౌర్యానికి పరాకాష్టగా నిలబడిన అడాల్ఫ్ హిట్లర్ రాజకీయ జీవితం సమసమాజాన్ని వూహించే బాత్ సోషలిస్టు పార్టీలో మొదలైంది!ఆర్యులు గొప్పవాళ్ళని అనుకోవటంలోనూ,ప్రపంచాన్నంతా ఆర్యులతో నింపెయ్యాలని అనుకోవటంలోనూ,దాన్ని సాధించటంలోనూ తప్పు లేదు - స్నేహపూర్వకమైన శాంతియుత మార్గంలో సాధించి ఉంటే వసుధైకకుటుంబభావనని నిజం చేసి చూపించిన చరితార్ధుడుగా మిగిలి ఉండేవాడు!కానీ,దాన్ని కొంచెం వంకర తిప్పి యూదు జాతితో మొదలుపెట్టి తనకి నచ్చని వాళ్ళని అంతం చెయ్యడం ద్వారా సాధించాలనుకోవడం వల్లనే అది తప్పుగా మారింది, అవునా?అట్లాగే రామయ్యనాయుడు సుందరమ్మని అనుభవించటం తప్పు లేదని తనని తను జస్టిఫై చేసుకోవటానికి బ్రాహ్మణ వ్యతిరేకతని మెలితిప్పి వాడుకున్నాడు అని మాత్రమే చెలం ఎస్టాబ్లిష్ చేశాడు.దీని గురించి నేను సారంగలో కలగజేసుకుని చెప్పింది ఇది:"నేను బ్రాహ్మణీకం సొంతంగా చదివి ఉన్నాను.చాలా కాలమైంది.కానీ ఇప్పుడు ఈ ప్రస్తావనల వల్ల మళ్ళీ గుర్తు చేసుకోగలిగాను. హెచ్చార్కె గారి అసలు వ్యాసం నేను చదవలేదు, లింకులుగా ఇచ్చిన ప్రతివిమర్శ మాత్రమే చదివినా కధలో ఆ బ్రాహ్మణ స్త్రీకి మహత్యం అంటగట్టినట్టు అప్పుడు చదివేటప్పుడూ అనిపించలేదు,ఇప్పుడు కూడా చలం నాయుడు చెడగొట్టింది ఒక బ్రాహ్మణ స్త్రీని గాబట్టి నాయుడు పాత్రని చంపాడని అంటే ఒప్పుకోవడం కష్టం.కధలోని విషయం సూటిగా చెప్పాలంటే ఒక కష్టంలో ఉన్న వ్యక్తిని ఆ కష్టాన్ని గట్టేక్కిస్తానని కబుర్లు చెప్పి మోసం చెయ్యడం ఎట్లా ఉంటుందో బొమ్మకట్టినట్టు అతి దగ్గిర్నుంచి చూపించటం, నాయుడి శూద్రత్వాన్ని ఆ స్త్రీ బ్రాహ్మణత్వాన్ని మాత్రమే పట్టించుకోకుండా మన చుట్టూ చూస్తే ఎక్స్ప్లాయిటేషన్ యొక్క పిక్చర్ ఇదే కదా!చలం చేసిన అసలైన ట్రిక్ మోసం చేసేవాడు తనకి తను ఇచ్చుకునే జస్టిఫికేషన్ ఎట్లా ఉంటుందో విప్పి చూపించటం!నాయుడు ఒకప్పుడు తను బ్రాహ్మల వల్ల అన్యాయానికి గురై ఆ కులం మీదనే ద్వేషం పెంచుకుని,ఇక్కడ కనబడుతున్నది బ్రాహ్మణస్త్రీ గాబట్టి రేప్/బలాత్కారం/కపటసంభోగం చెయ్యడంలో ఎలాంటి తప్పూ లేదని అనుకోవడమే కధలోని మెలిక!నాయుడి స్థానంలో హిట్లర్ అనే మరొక వ్యక్తిని నిలబేడితే చరిత్రలో అతడు చేసిందీ ఇదే కదా! మొదట యూదుజాతి మీద దుష్ప్రచారం చేసి అలాంటి యూదుల్ని కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో ఉంచటం,గ్యాస్ చాంబర్లలఒ చంపడం తప్పు కాదనే జస్టిఫికేషన్ తెచ్చుకున్నాకనే ఆపని అంత ధీమాగా చెయ్యగలిగాడు!హెచ్చార్కె గారు ఆ కోణాన్ని పట్టించుకుని ఉంటే బాగుండేది,ఎజెండా,ఐడియలాజికల్ న్యారోనెస్ మనస్సులో సుడులు తిరుగుతునవాళ్ళు సాహిత్యవిమర్శ వైపుకి పోకుండా ఉంటే మంచిది!" - నిజానికి తలలోని మెదడుతో ఆలోచించగలిగిన వాళ్ళకి ఈ ఒక్క విశ్లేషణలోనే హెచ్చార్కె గారి రెండు వాదనలకీ కలిపి జవాబులు దొరుకుతాయి:-)

     బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమం అనగానే అందరికీ మొదట గుర్తుకొచ్చేది తమిళుడైన పెరియార్.కానీ క్రీ.శ 1879లో పుట్టి క్రీ.శ 1973లో చనిపోయిన ఇతనికన్నా రెండు దశాబ్దాల ముందరే తెలుగువాడైన వెలమ కులానికి చెందిన ముద్దు నరసింహం తొలిసారిగా బ్రాహ్మణాధిక్యత మీద రణభేరి మోగించాడు.ఇతని వివేకవర్ధిని వ్యాసాలు వీరేశలింగం పంతులు,గురజాడ అప్పారావు వంటి చాలామందిని హిందూ సమాజంలో విప్లవాత్మకమైన సంస్కరణల్ని తీసుకురావటానికి ఉత్సాహపరిచాయి.ఇప్పుడు దొరకడం లేదు గానీ వాటిని చదివిన వారు ప్రశంసించిన తీరు చూస్తుంటే ఆ చిచ్చరపిడుగే ఈ చిచ్చరపిడుగై పుట్టాడా అని అనుమానంగా ఉంది:-)అయితే ముద్దు నరసింహం దగ్గిరనుంచి పేరియార్ వరకు ఉన్న బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ సారధులు ఎవరూ పూర్తిగా హిందూమతాన్ని ద్వేషించలేదు -కాలదన్నుకుని పోలేదు!కేవలం బ్రాహ్మణులకి జరుగుతున్న అధికమైన గౌరవ మర్యాదల పట్ల ఈర్ష్యా, పౌరోహిత్యపు అవసరాల కోసం బ్రాహ్మలకి ఇస్తున్న సంభావనల ఖర్చు గురించిన లోభితనమూ మాత్రమే నాకు కంబడుతున్నది నాకు వారి వాదనలలో.ఎందుకంటే బ్రాహ్మణాధిక్యతని ఎదిరించటానికి వారు కష్టపడి కనుక్కున్న బ్రహ్మాండమైన సొల్యూషన్లు రెండు!స్వసంఘపౌరోహిత్యం:యజ్ఞోపవీతాన్ని విశ్వబ్రాహ్మణులు,వైశ్యుల వంటి కులాల వారు కూడా ధరిస్తున్నప్పటికీ,వారికి శాస్త్రాన్ని అనుసరించి చేసేదీ తమకు వైదిక పద్ధతిన చేసుకునేదీ బ్రాహ్మణులే!అలా కాకుండా ప్రతి కులంలోనూ కొందరు వేదం చదివి పౌరోహిత్యపు విధి విధానాల్ని తెలుసుకుని తమ కులానికి తామే వైదిక కర్మల్ని చేయించగలిగే యేర్పాటు.అసలు వైదిక కర్మలు అక్కరలేదు అనటం లేదు,ఉండాలి!కానీ,బ్రాహ్మల ద్వారా కాకుండా తమకు తామే లాగించేసుకోవాలి!ఇది పెద్ద తల్నొప్పి యవ్వారం అని మీకూ తెలుసు - తలలోని మెదడుతో ఆలోచించే బుద్ధిమంతులు గనక!మొదట్లో బులపాటానికి చవగ్గానే చేసినా తర్వాత్తర్వాత వీళ్ళూ చెట్టెక్కి కూచోరని గ్యారెంటీ యేమిటి?వేదజ్ఞానార్హత:ఈ పౌరోహిత్యాలతో సంబంధం లేకుండా వేదాధ్యయనం మీద అధికారం వల్లనే బ్రాహ్మణులు చెట్టెక్కి కూర్చున్నారని అనుకుని వేదాధ్యయనం కోసం పోటీ పడటం.ఇది కూడా చెత్త సొల్యూషనే,ఎందుకంటే ఒక అకంసాలికి తన వృత్తిలో నైపుణ్యం కావాలంటే సీనియర్ల దగ్గిర చేరి ఆ వృత్తికి సంబంధించిన మెళకువలు నేర్చుకుంటే పొట్ట గడుస్తుంది గానీ సంగీతము చేత బేరసారము లుడిగెన్ అన్నట్టు శుష్క యజుర్వేదాలు చదివితే యేమొస్తుంది?

     నిజానికి చారిత్రకంగా పరిశీలించి చూస్తే అన్ని వృత్తుల మీదా అందరూ కుల వ్యవస్థ ద్వారా మోనాపలీ సాధించుకోవటం పూర్తయ్యాక ఇక మిగిల్న పౌరోహిత్యాన్ని వృత్తిగా తీసుకుని బ్రాహ్మణ కులం ఏర్పడిందనేది వాస్తవం.ఆ డిమాండ్లు/సొల్యూషన్లు అనబడే సూత్రీకరణల తింగరితనం వల్ల ఎంత గొప్పగా మొదలైందో అంత వేగంగా బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమం చల్లారిపోయింది.వీరేశలింగం పంతులు గానీ గురజాడ అప్పారావు గానీ అందులోని మెయిన్ కంటెంటుని వదిలి సంస్కరణలకి ఉపయోగించుకున్న కాలానికే అది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంది.ఈయన రామయ్యనాయుడు పేరును బట్టి ప్రస్తావించిన త్రిపురనేని రామస్వామి చౌదరి స్థాపించిన సూతాశ్రమం ఆయన పోగానే మూతబడింది.ఇంకా చలం నాటికి బలంగా ఉన్నది అంటాడు చూడండి చోద్యం గాకపోతేనూ!తన కాలానికి బలంగా ఉన్నా ఉండకపోయినా ఆ మంచివారిలో ఎవరినీ చెలం అవమానించలేదు కదా,హిట్లర్ మాదిరి ఆ సిద్ధాంతాన్ని తన దురద తీర్చుకోవటానికి రామయ్యనాయుడు సపోర్టు తెచ్చుకోవడాన్ని తప్పు పట్టటం మొత్తం బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమాన్ని తప్పు పట్టటం అని మోకాలిలోని మెదడును ఉపయోగించి ఆలోచించగలిగే వాళ్ళు మాత్రమే అనగలరు!ఈ లెఖ్ఖన పౌలస్త్యబ్రహ్మమనుమడు అని చెప్పి సీతాపహరణం చేయించినందుకు బ్రాహ్మలంతా ఇకనుంచీ వాల్మీకిని దుమ్మెత్తి పొయ్యాలా, బాఘానే ఉంది సంబడం:-)

     గిరీశాన్నీ,లుబ్ధావధాన్లనీ బ్యాపనోళ్ళని చెప్పి వెక్కిరించినందుకు గురజాడ అప్పారావును కూడా ఉతికి ఆరెయ్యాలి,సంస్కర్తగా ఎందుకు కీర్తిస్తునట్టు?అన్నట్టు గురజాడ మధురవాణితో సుకుమారంగా చెప్పించకపోతే సున్నితహృదయుడిగా కనబడే సౌజన్యారావులో ఉన్న యాంటీనాచ్చి ఉద్యమంలోని మూర్ఖత్వం కూడా మనకు తెలిసేది కాదనుకుంటాను!ఒక సాహిత్యరూపంలోని పాత్రచిత్రణ వాస్తవికంగా ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి లక్షణగ్రంధాలూ అలంకారిక శాస్త్రాలూ మొత్తం తిరగెయ్యడం అనవసరం - జస్ట్ కామన్ సెన్సు చాలు!నేను వేసిన మొదటి కామెంటులో ఉన్నది అర్ధమయ్యి శ్రీనివాసుడు గారు ఇచ్చిన అసలు ఈ సీరియల్ గొడవకి అంకురార్పణ చేసిన "అన్నద్వేషం - బ్రహ్మద్వేషం" వ్యాసం చదివాను.అక్కడే నా ఫైనల్ ఒపీనియన్ చెప్పాను.అది ఇలా ఉంది:ఇప్పుడు “అన్నద్వేషం-బ్రహ్మద్వేషం” వ్యాసం చదివాను.ముఖ్యంగా బ్రాహ్మణీకం గురించిన రెండు పేరాగ్రాఫులూ స్పష్టంగా చదివాను.హెచ్చార్కె గారు పక్షపాతమే చూపించారు విశ్లేషణలో. సుందరమ్మకి వచ్చిన కోపానికి కారణాన్ని చలం ఎస్టాబ్లిష్ చేసిన తీరు కూడా నేను పైన ఇచ్చిన విశ్లేషణనే బలపరుస్తున్నది,గమనించండి! సుందరమ్మకి వచ్చిన తీవ్రమిన కోపానికి ఉన్న మోటివ్ ఆమె కేవలం బ్రాహ్మణస్రీ అవడం వల్ల అని చలం చెప్పాడా?తన అసహాయతని ఉపయోగించుకోవడం కన్నా మరొక బాధ ఉంది.తన కొడుకు ప్రాణం గురించి కదా అంతకి సిద్ధపడింది.ఇప్పుడు ఇతను తాపీగా నేను డాక్టర్ని కాదు అని చెప్తే అక్కడున్నది దళితస్త్రీ అయినా అంత కోపమూ వస్తుంది కదా!అసలు కధ చదివి చాలా కాలమయినా,హెచ్చార్కె గారి విశ్లేషణ ఆ కధకి అన్యాయమే చేసిందనే నా అభిప్రాయాన్ని మార్చుకునేటందుకు తగిన కారణం కనపడటం లేదు.చలం జస్టిఫికేషన్ గురించి చెప్పటానికే ఆ కధ రాశాడు.జస్టిఫికేషన్ అనే పాయింటుని బలంగా చెప్పడానికి నాయుడికి ఉన్న బ్రాహ్మణ ద్వేషం ఒక ఉపాంగం మాత్రమే!చలం బ్రాహ్మణుడే కావచ్చు,కానీ బ్రాహ్మణీకం అనే పేరుకి కూడా సుందరమ్మ యొక్క బ్రాహ్మణీకం ఆమే యొక్క పవిత్రతని కాపాడలేకపోయింది అనే వ్యంగ్యసూచన!రచయిత వ్యంగ్యం కోసం వాడుకున మరొక చిన్న మాట “నాయుడు ఆమె కోపంలో దెయ్యాన్నీ మహిషాసుర మర్దిని చూడటం” అనేది.శ్రీశ్రీ విప్లవకవి,కమ్యూనిజానికి సపోర్టుగా నిలబడి జంధ్యాన్ని ఎంపేశాడు.కానీ తన కవిత్వంలో పురాణ కధల,పాత్రల పోలికల్ని తీసుకోలేదా?మెయిన్ పాయింటు మనస్సులో నిశ్చయించుకున్నాక కధకుడు గానీ కవి గానీ వాతావరణాన్ని సృష్టించడానికి పోలికలూ,సన్నివేశ కల్పనలో చేసే చమత్కారాలూ ఎక్కడినుంచయినా తీసుకోవచ్చు,అది రచయిత లందరూ చేస్తున్నదే కదా!మెయిన్ పాయింటు ముఖ్యం!ఒక్కోసారి శిల్పం రీత్యా అవసరమయితే మెయిన్ పాయింటుకి వ్యతిరేక ధోరణిలో కూడా మెయిన్ పాయింటుని బలంగా ఎక్కించవచ్చు.కవి నిరంకుశుడు.కదకుడు నియంత.ముమ్మాటికీ హెచ్చార్కె గారు బ్రాహ్మణీకం కధని సరిగ్గా అర్ధం చేసుకోలేదనే నాకనిపిస్తున్నది.స్వస్తి!"ఈ కధకి ఫలశృతి ఏమిటి?బ్రాహ్మణ స్త్రీని ఆశించిన అబ్రాహ్మణుడు మాడిపోతాడని చెప్పడమేగా?" అని అంత భీకరంగా గర్జించి మిగిలిన వాళ్ళు చలం బ్రాహ్మణీకపు మహత్యానికి గురయి రామయ్యనాయుడు చచ్చిపోయాడని ఎక్కడయినా నొక్కి వక్కాణించాడా అని నిలదీస్తే "అయ్యయ్యో అవి చలం మాటలే" అని మళ్ళీ ఆ వాక్యాన్ని యధాతధంగా కాపీ/పేస్టు చేసిన మొద్దబాయికి అదే వాక్యంలో రామయ్యనాయుడు కాలి బూడిదై చావటానికి ముందే సుందరమ్మ చచ్చిపోయినట్టు చలం స్పష్టంగా చెప్పి ఉన్నాడని అర్ధం కాకపోతే,నాకర్ధం కానిదంతా తప్పే అన్న నత్కీరుడి లాజిక్ ప్రకారం ఆలోచిస్తే అది ఖచ్చితంగా చలం తప్పే!ఇది చదివేవాళ్ళు అందరూ తలలోని మెదడుతో ఆలోచించేవాళ్ళు మాత్రమే ఉండరు,మోకాలులోని మెదడును మాత్రమే ఉపయోగించేవాళ్ళు కూడా చదివే అవకాశం ఉండొచ్చు,వాళ్ళకి కూడా అర్ధం అవ్వాలంటే ముప్పాళ రంగనాయకమ్మలా సుత్తి రాయాలి అని తెలుసుకోలేకపోయాడు చలం - పాపం!

     కధలో చలం మాటలివి "ఈ లోకపు సంకుచిత వాసనల్ని, శరీరపు స్వల్ప బంధనాల్ని తెంచుకున్న ఆమె(సుందరమ్మ) ఆత్మ అతిక్రమించి వూర్ధ్వలోకాల జ్వలించే మహాశక్తులతో - బ్రాహ్మణ తేజస్సుతో సంబంధం కల్పించుకుంది...(రామయ్య) ఇంకో కాలు వెనక్కి వేశాడు.ఆమె కళ్ళలోంచి జవ్లించే వెలుగును భరించలేక భగ్గున మండిపోయినాడు.నిలువునా కాలిపోయినాడు.భస్మమైనాడు.వెనుకనే మందే దీపం అతని పంచె కంటుకుందా?అతని శరీరం లోంచి కాళ్ళమధ్య నించి లేచిందా మంట.... బ్రాహ్మణ కడపటి మహత్యం బ్రాహ్మణీకం ఈ కలియుగాన సుందరమ్మతో అంతమైంది" అని ముక్కస్య ముక్కగా యెత్తి రాసేటప్పుడైనా తలలోని మెదడుతో చదివి అర్ధం చేసుకుని ఉంటే రామయ్యనాయుడు కాలిపోకముందే సుందరమ్మ ఆత్మ వూర్ధ్వలోకాలని చేరినట్టు చెప్పడం ద్వారా ఆమెకి మహత్యాలు అంటగట్టలేదని అర్ధమై ఉండేది.

     నన్ను చంపి పోగులు పెట్టినా సరే తలలోని మెదడును మాత్రం చచ్చినా ఉపయోగించనని భీష్మించుకుని ఉన్న హెచ్చార్కె లాంటివాడు తలలోని మెదడును మాత్రమే ఉపయోగించగలిగిన శ్రెనివాసుడు చేసిన వాదనల్ని చచ్చినా ఒప్పుకోడు:-)అలా ఒప్పించాలనే దురద హరిబాబుకి మాత్రం పిసరంత కూడా లేదు,ఎందుకంటే హరిబాబు పుట్టేటప్పుడు బ్రహ్మలోకంలో ఒక విచిత్రం జరిగింది.ఆడాళ్ళు చెయ్యాల్సిన సృష్టికార్యం తన మొగుడు చెయ్యడం ఆడంగి పని అనిపించిందో యేమో తిక్క పుట్టి పని చెడగొట్టడానికి గీర్వాణి కొంచెం గోముగా చూసేసరికి ఆ చూపు పవరుకి అంతటి చతుర్ముఖుడూ ఢమాల్న పడిపోయి నన్నొక మాన్యుఫాక్చరింగ్ డిఫెక్టుతో బూమ్మీదకి వదిలేశాడు.అదేమిటంటే,తలలోని మెదడుతో పాటు మోకాలిలోని మెదడు కూడా ఫుల్ విగరుతో ఉండటం - ఇంకోళ్ళూ ఇంకోళ్ళూ అయిన గోగూర కట్ట గాళ్ళు అయిఉంటే ఈ రెండు మేదళ్ళూ కలిసి పంబ రేగిస్తుంటే చిన్నప్పుడే పిచ్చెక్కిపోయేవాళ్ళు.నేను చిచ్చరపిడుగును కదా,అందులోని సులుసూత్రం కనిపెట్టి మోకాలిలోని మేదడును మామూలప్పుడు జోకొడుతూ ఇలాంటి త.మె.ఉ.ఆ గాళ్ళ సాహితీసృజన చదివినప్పుడు దాన్ని నిద్ర లేపడం నేర్చ్గుకున్నా - అబ్బో,చాలా కష్టం లేండి!అసలు నేను ప్రత్యేకంగా లేపనక్కర్లేదు,తనలాంటివాళ్ళ కోసం ఆబగా,కక్కుర్తిగా ఎదురు చూస్తూ ఉంటుందేమో పాపం వెంఠనే గుర్తుపట్టేసి చాలా అనందిస్తుంటుంది.మరీ అదే పనిగా దాన్ని మెళకువగా ఉంచితే ప్రమాదం గదాని ఎక్కువగా ఇలాంటువాళ్ళవి నేను చదవడం లేదు.కానీ శ్రీనివాసుడు గారు ఇరికంచడంలో తప్పనిసరై ఇరుకుపోయా:-)

     బ్రాహ్మణీకం సరిగ్గా అర్ధం కాకపోవటానికి చలం ఏమైనా సంస్కృతంలో రాశాడా?కనీసం విశ్వనాధ సత్యనారాయణ టైపు గ్రాంధికం కూడా వాడలేదే!ఎంతసేపూ చలం సెటైర్లుగా వేసిన విశేషణాల్ని పేరు పేరునా ఉటంకించి ఇవి పొగడ్తలేగా అని ఇతర్న్లని దబాయిస్తున్నాడు గానీ "ఈ కలియుగాన సుందరమ్మతో బ్రాహ్మణీకం అంతమైపోయింది" అని బల్లగుద్ది చెప్తున్నా పట్టించుకోడు.పైగా చలం ఈ నవల్లోనూ ఇతర చోట్లా బ్రాహ్మణుల్ని విమర్శించాడు గదా పొగడాలనుకునవాడు అంత క్రూరంగా ఎందుకు విమర్శిస్తాడు అంటే దానికి చెప్పిన రీజనింగు ఇది.ఆ ముక్క చదువుతుంటే "ఆహ్హహ్హహ్హా!ఓహ్హొహ్హొహ్హో!!" అని పగలబడి నవ్వాలని తెగ సర్దా పుట్టేసింది.
------------------------------------------------
హెచ్చార్కె
“చెలం ఈ కథలోనే కాదు, చాల చోట్ల బ్రాహ్మణ కుటుంబాల లోని చాదస్తాల్ని గేఌ చేశారు. అది ఆ కులం బాగు పడ్డానికి పనికొచ్చే మాటలు. పనికొచ్చాయి కూడా. ఇవేవీ ‘బ్రాహ్మణత్వా’న్ని గేఌ చేయడం కాదు. బ్రాహ్మణత్వం అంటే కులాల్లో బ్రాహ్మణులు పవితృలని…”
హరిబాబు
అంటే చలం బ్రాహ్మణుల్ని “ఇప్పుడు మీరు పాటిస్తున్నది నిజమిన పవిత్రత కాదు,నిజమిన పవిత్రతని అలవాటు చేసుకోండి” అని గేలి చెయ్యడమో గడ్డి పెట్టడం కూడా మీకు నచ్చలేదు,అదీ యే పాయింటు మీద?ఆ విమర్శల్ని పట్టించుకుని సంస్కరించుకున్నదుకు!

అంటే,మీరు తిట్టడానికి పనికొచ్చేటట్టు బ్రాహ్మల్ని అట్లాగే ఉంచకండా బ్రాహ్మల్ని గేలి చీసి మంచివాళ్ళుగా మార్చెయ్యడం వల్ల చలం కూడా తప్పే చేఅశాదనన్మాట,బాగుంది వరస!
------------------------------------------------
     ఇందులో ఉన్న కిరికిరి యేంటో కొందరికి చదవగానే అర్ధమై ఉంటుంది,కదూ!బ్రాహ్మలు దుర్మార్గులై ఇతర కులాల్ని(మమ్మల్ని) అణిచేశారు,అందుకే మేము ద్వేషిస్తున్నాం అంటున్నాడు,మరి చలం తిట్ల వల్ల బ్రాహ్మణులు తమ దుర్మార్గాల్ని వొదులుకుంటే ఈయనకి కొత్తగా పుటుకొచ్చే నెప్పి యేంటి?"పొరపాట్న చలం తిట్ల వల్ల బ్రాహ్మలు మంచోళ్ళయిపోయిఉంటే ఇప్పుడు మేమెవర్ని తిట్టాలి?" అన్న యేడుపు కనబడింది నాకు ఇందులో.చిన్నప్పుడు చూసిన గోపాలరావు గారి అమ్మాయి సినిమాలో మోహన్ బాబు పాత్ర చాలా తమాషాగా ఉంటుంది.అందులో హీరో చంద్రమోహన్ హీరోయిన్ జయసుధని యెప్పుడు చూసినా గోపాలరావు అనే ఆసామీ ఇంట్లోనుంచి బయటికొస్తూ అక్నబడ్డంతో తను గోపాలరావుగారి అమ్మాయి అనుకుని పేమించేస్తాడు.ఈ క్యామెడీ ఆఫ్ ఎర్రర్సులో మోహన్ బాబు బహుశా హీరోయినుకి అన్నగా చెల్లిలికి ద్రోహం జరిగిందనో మరో కారణంతోనో హీరోని చంపాలని చూస్తూ ఫెయిలవుతూ నవ్వు పుటిస్తూ ఉంటాడు.ఆఖరికి కధలోని కంఫ్యూజన్ అంతా విడిపోయాక వాళ్ళ నాన్నని భుజం మీద గోకుతూ "ఇపుడు నేనెవర్ని చంపాలి?" అనడుగుతాడు అమాయకంగా.వాచికం మీద మంచి పట్టున్న మోహన్ బాబు చక్కిలిగింతలు పెట్టించేటంత గొప్పగా చెబుతాడు.అటువైపు నాన్న పాత్రలో ఉన్నవాడు నాగభూషణం - అబ్బో,ఇంక చూస్కోండి!"నన్ను చంపరా పీడా వొదుల్తుంది" అంటాడు.కళ జీవితాన్ని అనుకరిస్తుంది అంటారు,ఆ దర్శకుడు తన జీవితంలో అలాంటివాడిని ఎక్కడో చూసి ఉంటాడనుకుంటే అది నిజమేననిపిస్తుంది గానీ ఇప్పుడు హెచ్చార్కె గారు అచ్చు మోహాన్ బాబులా మాట్లాడుతూ అప్పుడప్పుడు జీవితం కూడా కళని అనుకరిస్తుందని అనిపిస్తూ అంతకన్నా పదింతలు నవ్వు తెప్పిస్తున్నాడు,అందుకన్నమాట "ఆహ్హహ్హహ్హా!ఓహ్హొహ్హొహ్హో!!"లు:-)

     బ్రాహ్మణుల్ని చలంలా సంస్కరించడం కోసం తిట్టటం తప్పు,హెచ్చార్కె లాంటివాళ్లకి బ్రాహ్మల మీద ఉన్న కసితీరేలా మాత్రమే తిట్టాలి,అంతే!చలం అన్యాపదేశంగా ప్రస్తావించిన బ్రాహ్మణులలోనూ మంచివాళ్ళున్నారని  పొరపాటున కూడా ఒప్పుకోకూడదు,అది బ్రాహ్మణుల పట్ల రగిలిపోతూ ఉండాల్సిన ద్వేషాగ్ని చల్లారుస్తుంది.ఇదీ హెచ్చార్కె గారి ఈ వ్యాస పరంపరలో పరుచుకుని ఉన్న మోకాలిలోని మెదడుతో ఆలోచించేవాళ్ళు మాత్రమే చెయ్యగలిగిన విశ్లేషణల లోని కొన్ని అర్ధవంతమయిన విషయాలు!!"రామాయణం కథలంటే ఖోపం. అన్నీ తప్పుడు ధర్మాలని. వీరత్వం కోసం కొట్టుకు చావడాలని." అనీ "ఐ రిపీట్ సర్, రామాయణ ధర్మమధర్మమే" అనీ సారంగలో కామెంట్లుగానూ "భారతం అంటే నాకు చాల అభిమానం.ప్రపంచంలో అంత గొప్ప ఎపిక్ స్టోరీ లేదని అనుకుంటాను.అందులో అడుగడుగున వచ్చే గోబ్రాహ్మణ పూజ అంటే పరమ అయిస్టం" అని చివరి వ్యాసంలోనూ అంటున్నాడు - అంటే ఇంకా డైలెమ్మా నుంచి బైటపడలేదు కాబోలు - పాపం పాపం!!నేను సారంగలో ఈ కధలో రామయ్యనాయుడు చేసినదానికీ అడాల్ఫ్ హిట్లర్ చేసినదానికీ చెప్పిన పోలికలు అర్ధమయితే చలం బ్రాహ్మణీకం నవలలో ఏమి చెప్పదల్చుకున్నాడో చాలా తేలిగ్గా అర్ధమవుతుంది.చివరిలో కలవరింతలాగ మహిషాసుర మర్దిని గుర్తు చేస్తూ కలగాపులగంగా చేసిన వర్ణన చలం యొక్క మామూలు రచనాశైలియే - ప్రత్యేకంగా సుందరమ్మకి మహత్యాలూ ంటగట్టానికి వ్హేసిన ట్రిక్కు కాదు.చలం రచనాశైలి ఇక్కడే కాదు "బుజ్జిగాడు" అని రమణాశ్రమం నుంచి అనుకుంటాను,ఒక పిచ్చుకని గురించి దైరీలా రాసే చోట కూడా చిన్నప్పుడు మనం రేడియోలో విన్న క్రికెట్ కామెంటరీలా యమా ఫాస్టుగా ఉంటుంది.రాసి,కొట్టేసి,తుడిచి,మళ్ళీ రాసినట్టు ముతక పద్ధతిలో కాకుండా కళ్ళముందు దృశ్యాల్ని చూస్తూ చూసిన దాన్ని చూసినట్టు బోమ్మ కట్టించడం చలానికి చాతనయినట్టు తెలుగుభాషలోనే కాదు ప్రపంచంలోని యే భాషారచయితకీ కుదిరిచావలేదు - ఎందుకనో!అది శ్రీశ్రీ చెప్పిన "అనుభవించి పలవరించడం",బ్రాహ్మలు మంచివాళ్లయ్యేందుకు తిట్టడం కూడా సహించలేని హెచ్చార్కె లాంటి మోకాలిలోని మెదడుతో మాత్రమే ఆలోచించేవాళ్లకి ఎప్పటికీ అర్ధం కాదు.

     ఈయన నిజంగా రామాయణ భారతాలు సొంతంగా చదివాడా?కనీసం చాలా తేలిక భాషలో రాసిన ఉషశ్రీ అనువాదమయినా చదివాడా!నాకయితే చదవలేదనే అనిపిస్తుంది.చదవటం, చదవకపోవటం, చదివినా అర్ధం కాకపోవటం, చదవకుండానే తిట్టిపొయ్యాలనే దురద పుట్టటం లాంటివాట్ని అటుంచితే నాక్కూడా అర్ధం కానిది - గోబ్రాహణ పూజ అసయ్యం అంటూనే కిరస్తానం ఐలయ్య దగ్గిర్నుంచీ గజస్నానం మురమ్నా వరకూ అది బ్రాహ్మణకులాధిపత్యాన్నీ గోబ్రాహ్మణ పూజనీ ఉగ్గడించటం కోసమే వ్యాసుడు కుట్రపూరితంగా రాశాడని బల్లగుద్దిచెప్తున్న  బారతాన్ని ఎట్లా ఇస్టపడుతున్నాడు?ఈ దైలెమ్మాని ఆయన ఎంత తొందరగా వొదుల్చుకుంటే అంత మంచిది!ఈ స్టేటుమెంటు మీకు అర్ధం కావాలంటే నా పోష్టు మొదట్లో ఇచ్చిన స్టేటుమెంటు తప్పనిసరిగా అర్ధం చేసుకోగలగాలి - స్వభావరీత్యా ఈ రెండూనూ మోకాలిలోని మెదడుతో ఆలోచించగలిగిన వాళ్ళు మాత్రమే విరజిమ్మగలిగిన మెచ్చుతునకలు!

     హెచ్చార్కె గారిని నేను మోకాలిలోని మెదడుతో మాత్రమే ఆలోచించగలిగిన వాళ్ళల్లో చేర్చటాన్ని నకారాత్మక వ్యంగ్యవైభవం కింద తీసుకుని తనని అవమానిస్తున్నానని కించపడవలసిన పనిలేదు.భారతజాతికే తలమానికమైన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి కాపు జాతికే హంవీర చూడామణి ముద్రగడ పద్మనాభం వరకు ఎంతోమంది లబ్ధప్రతిష్ఠులు ఉన్నారు!దళిత మేధావి కంచె ఐలయ్య గారు,మార్క్సిస్టు మేధావి మురమ్నా లాంటి ఎందరో మొక్కవోని పట్టుదలతో కుడియెడమల డాల్కత్తులు మెరయగ వీరంగాలు వేస్తూ ఎంతో పాప్యులారిటీ తెచ్చుకుంటున్నారు.తలలోని మెదడుతో ఆలోచిస్తే పాప్యులారిటీ రాదు.పాప్యులారిటీ తెచ్చుకోవాలంటే మోకాలిలోని మెదడుతొనే ఆలోచించాలి.కాకపోతే అసహనాన్ని తట్టుకోగలగాలి,ప్రశాంతత ఉండదు,నిరంతరం ద్వేషాగ్నిని ప్రజ్వలింపజేస్తూ ఉండాలి - అయితే ఇప్పటికే వాటికి అలవాటుపడిపోయారు గాబట్టి కొత్తగా పడాల్సిన కష్టం ఏమీ లేదు 

     కుక్క తోకని కదిలిస్తుంది అనే బ్రాహ్మణుల కుట్రని ఎదుర్కోవడానికి క్నాదు, తోక కుక్కని కదిలిస్తుంది అని వాదించగలిగినవాళ్ళు కొందరయినా ఉండాల్సిందే!మొత్తానికి ఈ పోష్టుకి ఫలశృతి ఏంటయ్యా అంటే "కత్తి గొప్పదా?కలం గొప్పదా?","విత్తు ముందా?చెట్టు ముందా?","గుడ్డు ముందా?పిల్ల ముందా?" లాంటి తింగరి డిస్కషన్ల లిస్టులోకి మరో కొత్త టాపిక్ వచ్చి పడింది.


కుక్క తోకని కదిలిస్తుందా?తోక కుకని కదిలిస్తుందా?హ్హిహ్హిహ్హీ!!

38 comments:

  1. హరిబాబు గారూ!
    మీ విలువైన సమయాన్ని బ్రాహ్మణద్వేషంతో రగిలిపోతున్న మో.మె.స్వాములవారి తాత్త్విక భావజాలాన్ని విశ్లేషించడానికి వెచ్చించినందుకు శ్రీనివాసుడి బోలెడు నెనర్లు.
    అయితే, నా చిన్న సందేహం ఏమిటంటే వారికున్న వైయుక్తిక తిక్క కాలక్రమేణా తమ తాత్త్విక భూమ్యాకర్షణశక్తి ఫలితంగా మెదడు మోకాలునుండి అరికాల్లోకి జారిపోయిందేమోనని.
    మన సకల దౌర్భాగ్యాలకూ మూలకారణం బ్రాహ్మణులేనని భారతదేశంలోని సకల ఉద్యమాలూ ప్రజలని తప్పుదోప పట్టించడం ఒక చారిత్రక విషాదం.
    గట్టిగా అడిగితే బ్రాహ్మణులు కారని, బ్రాహ్మణవాదమని బుకాయించడం, అదేమిటో వివరించండి అంటే వింత వాదనలు చేయడం పరిపాటిగా మారింది.
    వీరంతా వర్తమానంలోని నిజమైన సమస్యలను వదిలేసి కులగజ్జితో ప్రతి విషయాన్ని గోకి, కోతిపుండును బ్రహ్మరాక్షసిగా చేస్తున్నారు.
    &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
    సామినేని హితసూచని లభ్యస్థానం
    http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=7673&PHPSESSID=
    http://www.worldcat.org/title/hitasucani/oclc/244566840
    &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
    సామినేని వారి గురించిన వ్యాసాలు
    http://archive.andhrabhoomi.net/content/s-3786
    http://wwa.andhrabhoomi.net/content/sahiti-35

    http://www.visalaandhra.com/literature/article-14016

    ReplyDelete
  2. HRK అనగా ఎవరండీ?

    ReplyDelete
    Replies
    1. HRK అంటే ఆయనొక్కడే నిజాయితి పరుడని భావించే వ్యక్తి. సూడో సెక్యులర్.

      మార్క్సిస్ట్ కాని అమెరికాలో ఉంట్టున్నాడు. మార్క్సిస్ట్ ల గుణాలు పుష్కలం గా ఉన్నాయి. ఆత్మస్తుతి పరనిందా. హిందూ మతంలో అన్ని అవలక్షణాలే కనిపిస్తాయి. అందునా బ్రాహ్మణులను విమర్శించి మేధావిగా అయ్యామని భావించటం. ఇతర మతాల గురించి పన్నెత్తి ఒక్క చిన్న వ్యాఖ్య చేయకపోవటం. ఇవ్వన్ని కమ్యునిస్ట్ ల లక్షణాలు. వయసు మళ్ళి పదవి విరమణ చేసినా ఆలోచనలలో ఏ మాత్రాం పరిణతిలేని వ్యక్తి.
      ఈయనతో పాటు అరణ్య కృష్ణ అనే ఇంకొకతను ఉంటాడు. వీళ్లకి దేవుడంటే నమ్మకం లేదు. హిందూ ధర్మం గురించి ఎమీ తెలియదు. అదంటే గౌరవం లేదు. అంతటి తో అగాలి కదా!
      ఈ పుచ్చొంకాయల చర్చ ఎమిటంటే దేవాలయాల్లో పూజారులను సర్విస్ కమీషన్ ప్రవేశ పరీక్ష పెట్టి తీసుకోవాలంట. నాస్థికులకు హిందువుల సంగతి ఎందుకు? వీళ్లని ఎవరైనా సలహ అడిగారా? వీళ్ల అడవిలో అన్నల పార్టికి గణపతిని తీసి బి.వి.రాఘవులను అధ్యక్షుడిగా చేయమని కిషన్ రెడ్డి సలహాలిస్తే ఒప్పుకొంటారా? ఒక్క రోజు దేవాలయం పోని వీరు సోషల్ మీడియాలో చేరి హిందువులకు సలహాలు పడేసేవాడే..

      _________________

      బ్రాహ్మణులు నాస్తికులు, దైవ హంతకులు అని ఇటీవలొక కొత్త రకం బ్రాహ్మణ వాద చతురోక్తి. బహుశా ఇలాంటి ‘అద్భుత ప్రకటన’లే వీరు చెప్పే వ్యంగ్యార్థాలో గూఢార్థాలో అయ్యుంటాయి. వాదం కోసం అది ఒప్పుకుందాం. మరి, దేవాలయాల్లో ఈ దైవ హంతకులైన ‘భూసురులు’ పూజారులుగా వుండొద్దని కొత్తాంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ వద్ద ప్లాకార్డులు పట్టుకుని మీరు డిమాండ్ చేయండి. మీకు మద్దతుగా మా ప్లకార్డులతో మేమూ వస్తాం. భలే మంచి ఐక్య సంఘటన అవుతుంది. దేవాలయాల్లోంచి బ్రాహ్మలను... అనగా ‘దైవ హంతకుల’ను... తీసేసి, పూజారి ఉద్యోగాలలో వేల ఏండ్లుగా వున్న రిజర్వేషన్ విధానాన్ని తొలగించి వేద్దాం. శూద్రులకు, దళితులకు ఆ ఉద్యోగాలివ్వాలందాం. వీళ్లు భూసురులమని ఎన్నడూ చెప్పుకోలేదు గనుక, దేవాంతకులు కారు కదా?! దీనికి అయ్యగారు సిద్ధమా?

      అయినా ఆ ... వ్యంగ్యార్థమో గూఢార్థమో.... ఒక అర్థం వున్న మాట నిజమే. బ్రాహ్మణులు తమను తాము దేవుళ్లుగా ప్రకటించుకోడమంటే అసలు దేవుడిని తీసెయ్యడమే అని వీరి కవిత్వం. కాని కుదరదు. బ్రాహ్మలు ఆకాశ దేవుళ్లమని చెప్పుకోలేదు, భూమ్మీది దేవుళ్లమని చెప్పుకున్నారు

      https://www.facebook.com/hecharke/posts/1255530227790411

      Delete
  3. శ్రీనివాసుడు గారు,
    నేను నిస్తేజపరచటం కాదు.మీ కామెంట్లని మెయిల్ బాక్సులో చూశాను.కానీ నా బ్లాగులో రావడం లేదు.అడ్మిన్ సెట్టింగ్స్ మెనూలో చూస్తే గూగుల్+ నుంచి వచ్చే కామెంట్సుని చూపించే ఆప్షన్ దగ్గిర నో అని ఉంటే యస్ కింద మార్చాను.దానివల్ల మామూలుగా నా బ్లాగులో ఇద్వరకట్లా కామెంట్లు వెయ్యలేకపోతున్నారని ఇప్పుదే తెలిసింది.మోద్ట్లో మెరు గూగుల్+ నుంచి కామెంటు వేశారా?ఇప్పుడు సెట్టింగ్స్ మార్చాక జై గొట్టిముక్కల గారి కామెంటు ఒకటే కనబడుతున్నది.మార్చేటప్పుడు అది క్యుములేటివ్ ఆప్షన్ అనుకున్నాను.యస్ అంటే కలుపుతుందని అనుకున్నాను గానీ అయ్తే అవి లేకపోతే ఇవీ చూపిస్తున్నదని అనిపిస్తున్నది!

    ఇప్పుడు ప్రయత్నించి చూదండి.

    ReplyDelete
    Replies
    1. నెనర్లు హరిబాబుగారూ!
      మతి వంకర వర్మ క్రొత్తగా ఈ రోజు ఆ పత్రికలో ‘‘మతము, నాస్తికత్వము, నాస్తికమతము ’’ అని వ్రాసేడు. చూశారా?
      హిందూవాదులు, కమ్యూనిస్టులూ, పెట్టుబడిదారులూ కలసి అమాయకంగా దోపిడీకి గురవుతున్న దళిత, ముస్లిం, వెనకబడినవర్గాలవారిని ఎలా ముట్టడించారో పాపం! వివరంగా విశదీకరించాడు.
      మనందరినీ ఆ పత్రిక యాజమాన్యంవారు నిషేధించారు కాబట్టి ఇక వారి ఇష్టం.
      ఆ వ్యాసంలో ఒక మచ్చుతునక,
      ’’హిందూవాదం కూడా పురోగతి అనే భావన మీదే ఆధారపడి ఉండి. చరిత్ర పురోగమనం అనే విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. హిట్లర్ నేషనలిజం అన్నా, సావర్కర్ హిందూ నేషనలిజం అన్నా ఈ ఆధునిక అభివృద్ధి భావనల మీదే ఆధారపడ్డాయి. అందరూ ఏదో రూపంలో త్యాగశీలతనే కొనియాడారు. కానీ త్యాగం చేసేవారూ, నాయకత్వం వహించేవారి మధ్య అగాథం అలాగే నిలిచిపోయింది. మొత్తం మీద కమ్యూనిజం, హిందూయిజం- ఈ రెండూ, కొందరు అగ్రవర్ణాల వారు పెట్టుబడిదారీ వ్యవస్థలో రాణించడానికి పునాదిగా పని చేసాయి. కమ్యూనిజం, కమ్యునిష్టు ఉద్యమాలు పునాది అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ, గ్లోబలైజేషన్ ఉపరితలం అనవచ్చు. అంటే కమ్యునిజం మానవుల్ని, అంటే అగ్ర కులాల్ని మాత్రమే సంప్రదాయ బంధనాల నుంచి విముక్తం చేసి, నగరీకరణలో, గ్లోబలైజేషన్లో భాగం చేసాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఇందుకు మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి.’’
      ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
      ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
      ఇక, మీ వ్యాసం గురించి నా వ్యాఖ్య,
      హరిబాబు గారూ!
      మీ విలువైన సమయాన్ని బ్రాహ్మణద్వేషంతో రగిలిపోతున్న మో.మె.స్వాములవారి తాత్త్విక భావజాలాన్ని విశ్లేషించడానికి వెచ్చించినందుకు శ్రీనివాసుడి బోలెడు నెనర్లు.
      అయితే, నా చిన్న సందేహం ఏమిటంటే వారికున్న వైయుక్తిక తిక్క కాలక్రమేణా తమ తాత్త్విక భూమ్యాకర్షణశక్తి ఫలితంగా మెదడు మోకాలునుండి అరికాల్లోకి జారిపోయిందేమోనని.
      మన సకల దౌర్భాగ్యాలకూ మూలకారణం బ్రాహ్మణులేనని భారతదేశంలోని సకల ఉద్యమాలూ ప్రజలని తప్పుదోప పట్టించడం ఒక చారిత్రక విషాదం.
      గట్టిగా అడిగితే బ్రాహ్మణులు కారని, బ్రాహ్మణవాదమని బుకాయించడం, అదేమిటో వివరించండీ అంటే వింత వాదనలు చేయడం పరిపాటిగా మారింది.
      వీరంతా వర్తమానంలోని నిజమైన సమస్యలను వదిలేసి కులగజ్జితో ప్రతి విషయాన్ని గోకి, కోతిపుండును బ్రహ్మరాక్షసిగా చేస్తున్నారు.
      ఈ రియాక్షనరీ భావజాలాన్ని ఎదుర్కోవడం ఎలాగో ఒక పట్టాన బోధపడడంలేదు. వారి మానాన వారిని వదిలేస్తే గోబెల్స్ కూడా గొప్పవాడే అంటారేమో!
      &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
      సామినేని హితసూచని లభ్యస్థానం
      http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=7673&PHPSESSID=
      http://www.worldcat.org/title/hitasucani/oclc/244566840
      &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
      సామినేని వారి గురించిన వ్యాసాలు
      http://archive.andhrabhoomi.net/content/s-3786
      http://wwa.andhrabhoomi.net/content/sahiti-35

      Delete
  4. శ్రీనివాసుడు8 July 2016 at 05:07

    నెనర్లు హరిబాబుగారూ!
    మతి వంకర వర్మ క్రొత్తగా ఈ రోజు ఆ పత్రికలో ‘‘మతము, నాస్తికత్వము, నాస్తికమతము ’’ అని వ్రాసేడు. చూశారా?
    హిందూవాదులు, కమ్యూనిస్టులూ, పెట్టుబడిదారులూ కలసి అమాయకంగా దోపిడీకి గురవుతున్న దళిత, ముస్లిం, వెనకబడినవర్గాలవారిని ఎలా ముట్టడించారో పాపం! వివరంగా విశదీకరించాడు.
    మనందరినీ ఆ పత్రిక యాజమాన్యంవారు నిషేధించారు కాబట్టి ఇక వారి ఇష్టం.
    ఆ వ్యాసంలో ఒక మచ్చుతునక,
    ’’హిందూవాదం కూడా పురోగతి అనే భావన మీదే ఆధారపడి ఉండి. చరిత్ర పురోగమనం అనే విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. హిట్లర్ నేషనలిజం అన్నా, సావర్కర్ హిందూ నేషనలిజం అన్నా ఈ ఆధునిక అభివృద్ధి భావనల మీదే ఆధారపడ్డాయి. అందరూ ఏదో రూపంలో త్యాగశీలతనే కొనియాడారు. కానీ త్యాగం చేసేవారూ, నాయకత్వం వహించేవారి మధ్య అగాథం అలాగే నిలిచిపోయింది. మొత్తం మీద కమ్యూనిజం, హిందూయిజం- ఈ రెండూ, కొందరు అగ్రవర్ణాల వారు పెట్టుబడిదారీ వ్యవస్థలో రాణించడానికి పునాదిగా పని చేసాయి. కమ్యూనిజం, కమ్యునిష్టు ఉద్యమాలు పునాది అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ, గ్లోబలైజేషన్ ఉపరితలం అనవచ్చు. అంటే కమ్యునిజం మానవుల్ని, అంటే అగ్ర కులాల్ని మాత్రమే సంప్రదాయ బంధనాల నుంచి విముక్తం చేసి, నగరీకరణలో, గ్లోబలైజేషన్లో భాగం చేసాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఇందుకు మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి.’’
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    ఇక, మీ వ్యాసం గురించి నా వ్యాఖ్య,
    హరిబాబు గారూ!
    మీ విలువైన సమయాన్ని బ్రాహ్మణద్వేషంతో రగిలిపోతున్న మో.మె.స్వాములవారి తాత్త్విక భావజాలాన్ని విశ్లేషించడానికి వెచ్చించినందుకు శ్రీనివాసుడి బోలెడు నెనర్లు.
    అయితే, నా చిన్న సందేహం ఏమిటంటే వారికున్న వైయుక్తిక తిక్క కాలక్రమేణా తమ తాత్త్విక భూమ్యాకర్షణశక్తి ఫలితంగా మెదడు మోకాలునుండి అరికాల్లోకి జారిపోయిందేమోనని.
    మన సకల దౌర్భాగ్యాలకూ మూలకారణం బ్రాహ్మణులేనని భారతదేశంలోని సకల ఉద్యమాలూ ప్రజలని తప్పుదోప పట్టించడం ఒక చారిత్రక విషాదం.
    గట్టిగా అడిగితే బ్రాహ్మణులు కారని, బ్రాహ్మణవాదమని బుకాయించడం, అదేమిటో వివరించండీ అంటే వింత వాదనలు చేయడం పరిపాటిగా మారింది.
    వీరంతా వర్తమానంలోని నిజమైన సమస్యలను వదిలేసి కులగజ్జితో ప్రతి విషయాన్ని గోకి, కోతిపుండును బ్రహ్మరాక్షసిగా చేస్తున్నారు.
    ఈ రియాక్షనరీ భావజాలాన్ని ఎదుర్కోవడం ఎలాగో ఒక పట్టాన బోధపడడంలేదు. వారి మానాన వారిని వదిలేస్తే గోబెల్స్ కూడా గొప్పవాడే అంటారేమో!
    &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
    సామినేని హితసూచని లభ్యస్థానం
    http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=7673&PHPSESSID=
    http://www.worldcat.org/title/hitasucani/oclc/244566840
    &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
    సామినేని వారి గురించిన వ్యాసాలు
    http://archive.andhrabhoomi.net/content/s-3786
    http://wwa.andhrabhoomi.net/content/sahiti-35

    http://www.visalaandhra.com/literature/article-14016

    ReplyDelete
  5. నెనర్లు హరిబాబుగారూ!
    మతి వంకర వర్మ క్రొత్తగా ఈ రోజు ఆ పత్రికలో ‘‘మతము, నాస్తికత్వము, నాస్తికమతము ’’ అని వ్రాసేడు. చూశారా?
    హిందూవాదులు, కమ్యూనిస్టులూ, పెట్టుబడిదారులూ కలసి అమాయకంగా దోపిడీకి గురవుతున్న దళిత, ముస్లిం, వెనకబడినవర్గాలవారిని ఎలా ముట్టడించారో పాపం! వివరంగా విశదీకరించాడు.
    మనందరినీ ఆ పత్రిక యాజమాన్యంవారు నిషేధించారు కాబట్టి ఇక వారి ఇష్టం.
    ఆ వ్యాసంలో ఒక మచ్చుతునక,
    ’’హిందూవాదం కూడా పురోగతి అనే భావన మీదే ఆధారపడి ఉండి. చరిత్ర పురోగమనం అనే విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. హిట్లర్ నేషనలిజం అన్నా, సావర్కర్ హిందూ నేషనలిజం అన్నా ఈ ఆధునిక అభివృద్ధి భావనల మీదే ఆధారపడ్డాయి. అందరూ ఏదో రూపంలో త్యాగశీలతనే కొనియాడారు. కానీ త్యాగం చేసేవారూ, నాయకత్వం వహించేవారి మధ్య అగాథం అలాగే నిలిచిపోయింది. మొత్తం మీద కమ్యూనిజం, హిందూయిజం- ఈ రెండూ, కొందరు అగ్రవర్ణాల వారు పెట్టుబడిదారీ వ్యవస్థలో రాణించడానికి పునాదిగా పని చేసాయి. కమ్యూనిజం, కమ్యునిష్టు ఉద్యమాలు పునాది అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ, గ్లోబలైజేషన్ ఉపరితలం అనవచ్చు. అంటే కమ్యునిజం మానవుల్ని, అంటే అగ్ర కులాల్ని మాత్రమే సంప్రదాయ బంధనాల నుంచి విముక్తం చేసి, నగరీకరణలో, గ్లోబలైజేషన్లో భాగం చేసాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఇందుకు మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి.’’
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
    ఇక, మీ వ్యాసం గురించి నా వ్యాఖ్య,
    హరిబాబు గారూ!
    మీ విలువైన సమయాన్ని బ్రాహ్మణద్వేషంతో రగిలిపోతున్న మో.మె.స్వాములవారి తాత్త్విక భావజాలాన్ని విశ్లేషించడానికి వెచ్చించినందుకు శ్రీనివాసుడి బోలెడు నెనర్లు.
    అయితే, నా చిన్న సందేహం ఏమిటంటే వారికున్న వైయుక్తిక తిక్క కాలక్రమేణా తమ తాత్త్విక భూమ్యాకర్షణశక్తి ఫలితంగా మెదడు మోకాలునుండి అరికాల్లోకి జారిపోయిందేమోనని.
    మన సకల దౌర్భాగ్యాలకూ మూలకారణం బ్రాహ్మణులేనని భారతదేశంలోని సకల ఉద్యమాలూ ప్రజలని తప్పుదోప పట్టించడం ఒక చారిత్రక విషాదం.
    గట్టిగా అడిగితే బ్రాహ్మణులు కారని, బ్రాహ్మణవాదమని బుకాయించడం, అదేమిటో వివరించండీ అంటే వింత వాదనలు చేయడం పరిపాటిగా మారింది.
    వీరంతా వర్తమానంలోని నిజమైన సమస్యలను వదిలేసి కులగజ్జితో ప్రతి విషయాన్ని గోకి, కోతిపుండును బ్రహ్మరాక్షసిగా చేస్తున్నారు.
    ఈ రియాక్షనరీ భావజాలాన్ని ఎదుర్కోవడం ఎలాగో ఒక పట్టాన బోధపడడంలేదు. వారి మానాన వారిని వదిలేస్తే గోబెల్స్ కూడా గొప్పవాడే అంటారేమో!
    &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
    సామినేని హితసూచని లభ్యస్థానం
    http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=7673&PHPSESSID=
    http://www.worldcat.org/title/hitasucani/oclc/244566840
    &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
    సామినేని వారి గురించిన వ్యాసాలు
    http://archive.andhrabhoomi.net/content/s-3786
    http://wwa.andhrabhoomi.net/content/sahiti-35

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాసులు గారూ,
      అసలే కోతి,ఆపైన కల్లు తాగింది,ఆపైన నిప్పులు తొక్కింది అన్నట్టు అసలే కమ్యునిష్టు,ఆపైన అమెరికాలో బతికాడు,ఆపైన రితైర్ అయ్యాడు!

      మొదట కాశీ గురించి మెల్విల్లె రాణా గారితో కలిసి చేసిన వర్క్ గురించి ఒక పోస్ట్ సగం పూర్తయి ఉంది.అది పబ్లిష్ చేశాక రాయడం కోసం "బ్రాహ్మణులకు ప్రాధాన్యత లేని హిందూమతం నిలబడుతుందా?హిందూమతానంతర భారతదేశం నిజంగా ఆవిర్భవిస్తుందా!" అని ఒక టాపిక్ మనసులో ఉంది.ఈ వ్యాసంలో కొద్దిగా చర్చించిన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం పుట్టుక,ప్రాభవం,బలహీనతలు,అదృశ్యం గురించి విస్తృతంగా చెబుతాను.బౌధ,క్రైస్తవ,అహ్మదీయ మతాల చరిత్ర కూడా వస్తుంది.ఆధునిక శాస్తరవేత్తలు చెప్పిన దాని ప్రకారమే సుమారు 70,000 సంవత్సరాల క్రితం నున్వ్హి ఇక్కడ సనాతన ధర్మం ఒక ప్రవక్త గానీ,ఒక గ్రంధం గానీ,ఒక సంస్థ గానీ లేకుండా వైదిక కాలం అని మనం చెప్తున్న క్రీ.పొ 4,000 సంవత్సరాల కాలం నాటికే అంత గోప సాంకేతీకతతో నగరాలు నిర్మించే స్థాయికి చేరుకోగలిగారు!బుద్ధుడు క్రీ.పూ 6వ శతాబ్దం వాడు,క్రీస్తు సరే సరి,అహ్మద్ ఖురేషీ క్రీ.శ 6వ శతాబ్దం వాడు - తాతకి సుద్దులు నేర్పినట్టు వీళ్ళు భారతీయులకి నేర్పిందేమిటి?

      ఇలాంటివన్నీ ప్రస్తావిస్తాను.దానితోపాటు హిందూమతం కూడా కొంత మారాల్సి ఉందని నాకనిపిస్తునది - అది కూడా చెప్తాను.సమయం మాత్రం చాలా ఎక్కువే పడుతుంది!మధ్యలో ఇలాంటి సమయానికి తగ్గ పోష్టులు కూడా అవసరమే కాబట్టి వీటినీ వదలను:-)

      Delete
  6. మన బాదలన్నిటికీ బాపనోళ్ళే కారణవంటగదా! ఏసేద్దామా? ఆళ్ళనెవళ్ళనో ఇట్లరేసేసినట్టు :)

    ReplyDelete
  7. హరిబాబు గారూ!
    పెరుమాళ్ మురుగన్ కేస్లో హైకోర్టు తీర్పు లోకి కొన్ని అంశాలివి.
    http://epaper.andhrajyothy.com/c/11616378
    న్యాయస్థానం తీర్పు మూల ప్రతి సంపూర్ణంగా
    http://www.thehindu.com/multimedia/archive/02921/Perumal_Murugan_ca_2921087a.pdf
    దీనిపై కొంత చర్చ జరగవలసిన అవసరంవున్నట్లుగా తోస్తోంది. మీకు తీరుబడివుంటే ప్రయత్నించండి.

    తరువాత, శవ శంకర ఖర్మ అనే వీర భూతం వచోవమనాలని, దానికి ఒక అధ్యయనశీలి యొక్క ప్రతిస్పందనలని కూడా వీలుంటే చూడండి.
    http://magazine.saarangabooks.com/2016/07/07/%e0%b0%ae%e0%b0%a4%e0%b0%ae%e0%b1%81-%e0%b0%a8%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf%e0%b0%95%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%ae%e0%b1%81-%e0%b0%a8%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf/#comment-61083

    ReplyDelete
    Replies
    1. పెరుమాళ్ మురుగన్ నవలలో చెప్పిన ఆచారం అక్కడి దేవాలయంలో నిజంగా ఉందా?లేదని దాన్ని విమర్శిస్తున్నవారి వాదన!ఆ సంప్రదాయం అక్కడ లేకుండా పెరుమాళ్ కల్పించినదే అయితే అది ఖచ్చితంగా అతని తప్పే అవుతుంది!అదే నిజమయితే, వారి వాదన నిజం కావడం వల్లనే పెరుమాళ్ మురుగన్ అప్పట్లో వెనక్కి తగ్గాడనేది కూడా మనం అర్ధం చేసుకోవచ్చు.రొమిల్లా దప్పార్ పులిమిన "ఆర్యుల దాడి - ద్రవిడుల అణచివేత" పులుముడు అబధం అని తేలడానికి దశాబ్దాలు పట్టింది - గట్టిగా లెక్కిస్తే ఒక శతాబ్దం!ఈ మధ్యనే ఒక తెలుగు రచయిత "ఆకాశ దేవర" కధ ఇదే రకం ఇతివృత్తంతో రాసినట్టు చదివాను.కాకపోతే ఆ కధలో ఉన్నది వ్యంగ్యం అనీ వాస్తవంగా జరిగిన కధ కాదనీ తెలిసిపోతూనే ఉంటుంది.కానీ పెరుమాళ్ చేసింది అది కాదు.వూరి పేరు చెప్తున్నాడు,దేవాలయం పేరు చెప్తున్నాడు,అక్కడ ఆ సంప్రదాయం ఉందని చెప్తున్నాడు,ఆ సంప్రదాయం వల్లనే కధలోని పాత్ర ఆ సంక్షోభానికి గురయిందని గట్టిగా చెప్తున్నాడు.ఆ ఆలయంలో ఆ సంప్రదాయం లేకపోతే అది ఖచ్చితంగా అతని తప్పే!ఇప్పుడితను చెప్పింది ఖండించకుండా వూరుకుంటే ఆ అబద్ధం నిజమైపోతుంది!

      అకక్డ లేని ఆచారాని ఉన్నట్టు కల్పిస్తే ఇప్పటికీ అతన్ని వ్యతిరేకించాల్సిందే!

      Delete
    2. The Hindu link given above gives the full 160 page judgment. Please read it in full: I found it extremely interesting.

      Delete
    3. మొదట రెలీజయినప్పుడు ఎవరూ మాట్లాడలేదు ఇంగ్లీషు వెర్షన్ వచ్చాకే గొడవ చేస్తున్నారు అనటం కూడా తప్పే!మద్రాసులో ఉన్నా తమిళమొక ముక్క కూడా రాని నాలాణ్టివాళ్ళు తమిళప్రతి రాగానే చదివి అర్ధం చేసుకోవటం కుదరదు కదా!ఎవరయినా చదివి అందులో ఉన్న కంటెంటు అర్ధం అయ్యాకే రెస్పాండ్ అవుతారు,జరిగింది కూడా అదే.అందులో దురుద్దేశాలూ,కుట్రా అంతగట్టే బదులు వాస్తవం అతను చెప్పినట్టు ఉందా అని చూస్తే చాలదా?అప్పుడు విమర్శించలేదు,ఇప్పుదు విమర్శిస్తున్నారు అనే వాదన కూడా తప్పే.

      Delete
    4. పెరుమాళ్ మురుగన్ రాసింది చరిత్రను ప్రతిబింబించే నవల అని చెప్తూ అతను వర్ణించిన ఆచారం ఆ దేవాలయంలో ఏనాడైనా పాటించబడిందా లేదా అనే విషయాన్ని కోర్టు ఎందుకు వదిలేసింది?అసలు పిటిషన్ వేసిన వ్యక్తి ముఖ్యమైన వాదన "ఆ ఆలయంలో లేని ఆచారాన్ని ఉన్నది అని చెప్పి ఆలయాన్నీ ఆ అలయదర్శనం ద్వారా పిల్లల్ని కన్న ఆడవాళ్లని అవమానించాడు" అని అయితే పాతబూతు పురాణాల్ని సాక్ష్యం చూపించి బూతు ఇదివరకొ ఉందిగా అనేస్తే సరిపోతుందా?పిటిసనర్ ఒక విషయం గురించి ప్రస్తావిస్తే కోర్టువారు మరొక విషయం గురించి తీర్పు చెప్పడం ఏంటి?వీపు మీద తంతే మూతి పళ్ళు రాలినట్టు లేదూ!

      ఇప్పుడు కాకపోయినా ఓకప్పుదైనా అలాంటి ఆచారం అక్కడ ఉంటే,ఉందని నిరూపిస్తే అప్పుడు మాత్రమే పెరుమాళ చేసింది కరెక్ట్ అవుతుంది!లేని పక్షంలో కోర్టు ఇచ్చిందే తప్పుడు తీర్పు!పరమ వాస్తవికంగా చిత్రవిచిత్రమైన సనివేశకల్పనతో ఎంత అద్భుతమైన రచనావిన్యాసం చూపించినా సరే,ఒక ఆలయ చరిత్రని రూపుమార్చి రాస్తే చూస్తూ వూరుకోవడమేనా?

      Delete
    5. "అతను వర్ణించిన ఆచారం ఆ దేవాలయంలో ఏనాడైనా పాటించబడిందా లేదా అనే విషయాన్ని కోర్టు ఎందుకు వదిలేసింది?" -

      కోర్టు దాని గురించి వాఖ్యానించిందండి. ఒక ఆచారం ఉండేదా లేదా అనటానికి శిష్టులు రికార్డ్ చేసిన చరిత్రే ఉండాలా, స్థానిక జానపద సాహిత్యంలో ఉన్నది చరిత్ర కిందకి ఎందుకు రాదు అని ప్రశ్నించింది. పెరుమాళ్ మురుగన్ నవలలో వాడిన ప్రాంతంలో ఈ పాతకాలం ఆచారం గురించి స్థానిక జానపద ప్రస్థావనలున్నాయని విన్నాను/చదివాను.

      ప్రాచీన కాలంలో మన దేశంలో చాలాచోట్ల ఇలాంటి ఆపద్దర్మ ఆచారం ఉందని ప్రస్థావిస్తారు చరిత్రకారులు. తాపీధర్మారావుగారు కూడా ఉదాహరణలు ఇచ్చినట్టున్నారు.

      ఈ నవలలో తప్పొప్పుల సంగతి పక్కనపెడితే, ఈ తీర్పు రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్చ గురించి చేసిన చాలా బ్యాలెన్స్‌డ్ వాఖ్యానం. భవిష్యత్తుల్లో వివాదాస్పద పుస్తకాల నిషేధం మీద దీని ప్రభావం ఉంటుంది. Davinci code మూవీని క్రైస్తవ సంఘాలు బ్యాన్ చేయించిన సందర్భంలో బాలగోపాల్ కూడా ఇలాంటి వ్యాసమే రాసినట్టున్నారు.

      Delete
    6. @Chaitanya
      అయితే నాకు ఓకే:-)

      Delete
    7. Next, the Madhorubagan idol is on the book’s cover. A competent counsel was not employed to bring these facts to the notice of the court. The court needs assistance of branded counsels. But all of them were appearing for the liberals, writer and publisher. The person concerned had to be persuaded to come to court. All instrumentalities in India are being drawn into the vortex of liberalism, including courts. To take a position otherwise would be deemed illiberal. This overall thinking is affecting institutional independence. Women, the principal affected parties here, were not heard in this court. The court should have said we want some women of that area who practice this ritual to come and say what their opinion is. You charge them with carrying the illegitimate children of third parties but you don’t want to hear them. This judgment has created a huge misapprehension. It has to be withdrawn and the case reheard.

      http://www.thehindu.com/news/national/tamil-nadu/article8831637.ece

      Delete
    8. This comment has been removed by the author.

      Delete
    9. చదువరుల్లో కొందరికి నచ్చని పుస్తకాన్ని నిషేధించటం అవసరమా కాదా అనే జనరల్ విషయాలతో నిండిన సాంకేతిక అంశాలని మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్టు తీర్పు పూర్తిపాఠం చదివాక కూడా స్పష్టంగా తెలుస్తున్నది.అలాంటి ఆచారాలు గతకాలంలో కొన్ని చోట్ల ఉండటం వేరు,ప్రత్యేకంగా ఒక వూరి పేరునీ,ఒక ఆలయాన్ని ప్రస్తావించి అక్కడ లేని ఆచారాన్ని ఉన్నట్టు చెప్పటం నిజమే అయిన పక్షంలో పెరుమాళ్ తన వూరికి వెళ్ళి తన గ్రామస్తులకి ఏ సమాధానం చెప్పగలడు?అయీతె నేనిప్పుడు ఏదయిన అమసీదు చుట్టూరానో,దర్గా చుట్టూరానే ఏదయిన ఐలాంటి కల్పననే చేస్తే కోర్టులూ,ఈ పెరుమాళ్ సమర్ధకులూ,చైతన్య గారూ నన్ను సమర్ధిస్తారా?నాకు కూడా పెరుమాళ పరిస్థితియే దాపరిస్తే ఎటువైపు నిలబడతారు!రచహయిత ఏదో ఆ దంపతులు లేక మరి కొందరు తప్పనిసరి చేస్తున్నట్టు కూడా కాదు,పుస్తకంలో నుంచి ఎత్తి చూపించిన భాగాల్ని కొన్నింటిని చూసినా అక్కడ ఆ ఆఅరం పేరుతో విచ్చలవిడి వ్యభిచారం జరుగుతున్నట్టు నవల మొత్తంలో చాలా చోట్ల ఉన్నట్టు వర్ణించినట్టు తెలుస్తునది.

      మేధావుల నుంచి పెరుమాళ ఎలాంటి రక్షణ తీసుకున్నాడో అలాంటి రక్షణ నాకొ వస్తుందనే గ్యారెంటీ ఉంటే నేను కూడా ఏదో ఒక చర్చి చుట్టూరానో దర్గ అచుట్టూరానో ఇలాంటి రంజైన కధ అల్లడానికి సిద్ధంగా ఉన్నాను!

      Delete
    10. కోర్టువారి ఆందోళన అంతా పబ్లిషర్లకి జరిగే నష్తము,రచయితకి కలిగే దుఃఖము గురించి తప్ప నవలలో అంత ధాటిగా ఓక్ వూరి పేరు చెప్పి,ఒక ఆలయం పేరు చెప్పి చిలవలు పలవలుగా అక్కడ లేని ఆచారం ఉన్నట్టు వాస్తవికంగారాయడం వల్ల అక్కడ సంతానవతులైన తలులకి జరిగే సామాజిక పరమైన అవమానం ఎందుకు గుర్తుకు రాలేదో!

      Delete
    11. @హరిబాబుగారు,
      మధ్యలో నేను సమర్థించటం ఏమిటండోయ్ :-)
      నేను పెరుమాళ్ మురుగన్‍నీ సమర్థించలేదు/వ్యతిరేకించలేదు. నేనా పుస్తకమే చదవలేదు. కాబట్టి ఆ నవల పై నా అభిప్రాయం సరైనది కాకపోవచ్చు. కానీ నవలలో వివాదాస్పద విషయమైన నియోగం గురించి వినిపిస్తున్న ఇరుపక్షాల వాదనలు విని ఒక అవగాహనకి వస్తున్నానంతే.

      ఇకపోతే శ్రీరాం గారు లింక్ ఇచ్చిన వ్యాసం నేనూ చదివాను. ఎప్పుడో శతాబ్దం కిందట ఉండేదన్న ఆచారాన్ని గురించి, ఇప్పుడు ఏ మహిళలొచ్చి వాళ్ళ భావాలు చెప్తారండి. ఐనా ఇలాంటివన్నీ ఆపద్దర్మంగా చేసే పనులు, ఎవరండి దాన్ని బైటికి చెప్పుకొనేది, కోర్టుకొచ్చి మాట్లాడేది. ఇప్పటి ఆర్టిఫిషిల్ ఇన్‍సెమినేషన్‍ లాంటి మూడో వ్యక్తి ప్రమేయమూ పరిచయమూ అవసరం లేని పక్కా సైంటిఫిక్ పద్దతిలో కన్నవాళ్ళే ఆ మాట బైటికి చెప్పుకోవటం లేదు. ఆ నవలలో టైమ్‍లైన్ కూడా కాస్త పాతదే అనుకుంటా. ఆ ప్రాంతంలో ఇప్పటి ఆడవాళ్ళ మీద నిందలు మోపటం కిందకి వస్తుందంటారా. ఇక వర్ణనలు శ్రుతిమించాయో లేదో నాకు తెలీదు, నేను చదవలేదు. వాటి గురించి విమర్శలు సహేతుకమే కావచ్చు (కోర్టు తీర్పులో ఒకచోట పల్లెయాసలో రాసినప్పుడు మొరటుగా అనిపించటం మామూలే అన్నట్టుంది).

      కానీ అసలా ఆచారమే మేం ఎరగం అన్నట్టు వాదించటం కష్టమనుకుంటా. నియోగ పద్దతిలో పిల్లల్నికనటం భారతదేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల, చాలా మతాల్లో (బైబిల్లో కూడా రెఫరెన్సులున్నట్టున్నాయ్) ఒకప్పుడు ఉన్నదే. కలియుగానికి నియోగం పనికిరాదని పెద్దలు చెప్పినట్టున్నారు.

      తిరుచెంగోడ్‍లోని అర్థనారీశ్వర ఆలయంలో ఒకప్పుడు ఏడాదికొకసారి ఇలాంటి ఆచారానికి అవకాశం ఉండేదని స్థానిక ఇతిహ్యం ఉందంటున్నారు. నాకైతే ఇది అసాధ్యం అని అనిపించటం లేదు, ఒకప్పుడు దేశంలో చాలా చోట్ల ఉండేదని విన్న విషయమే కాబట్టి, భర్త ఒప్పుకోలుతో నియోగం ఒకప్పుడు ధర్మబద్దమైన విషయమే కాబట్టి.

      ఇక ఈ ప్రాంతంలో, ఈ ఆలయపరిధిలో ఒకప్పుడైనా ఇది ఉండేదా అని నిగ్గుతేల్చాలి అంటే, ఉండేదని స్థానిక ఐతిహ్యం ఉందని సమర్థకుల వాదన. అలా ఎప్పుడూ లేదని వ్యతిరేకులూ అనటం లేదు. ఎప్పుడో శతాబ్దం కిందటి ఉండేదాని గురించి ఇప్పుడు ఎముకలు మెళ్ళో వేస్తావా అని వాళ్ళ కోపం.

      ఒకప్పటికి ఇప్పటికి లైంగిక విషయాల్లో హిందువుల భావాలు దాదాపు తిరగబడిపోయాయి కాబట్టి, పాత ఆచారాల గురించి ఎవరు ఎప్పుడు ఎలా తవ్వినా ఈ డైలమా, ఆగ్రహం తప్పదు. కోర్టు దాని గురించే మాట్లాడుతూ హిందువులు వలసపాలనలో అలవాటు చేస్తుకున్న ఈ లైంగికత గురించిన అతిసున్నితత్వాలు (విక్టోరియన్ మోరాలటీస్) వదిలించుకోవాలని, మన పూర్వికులకే మనకన్నా లైంగికత గురించి విశాలదృష్టి ఉండేదని ప్రస్థావించింది.

      ఇక నేను క్రితం కామెంట్లో ఈ తీర్పుని మెచ్చుకుంది ఈ నవల గురించి కాదు. భావప్రకటన స్వేచ్చ పరిమితుల గురించి చేసిన జెనరల్ వాఖ్యానం గురించి. రాన్రాను దాని పరిధి కుచించుకుపోతుంటే, ఈ తీర్పు కాస్త విశాలం చేసిందనుకుంటున్నా. దీని ప్రభావం రేపు మిగతా మతాల/వర్గాల వారిపైన ఐనా ఉంటుంది. మీరో పుస్తకం రాసినా ఉంటుంది :-)

      Delete
    12. భావ ప్రకటనా స్వేచ్చ అని విదేశి అరువుతెచ్చుకొన్న మార్క్సిస్ట్ సిద్దాంతాలతో హిందువుల మనోభావలను దెబ్బతీస్తూపోవటం సమజంసం కాదు. అది మనదేశానికి మంచి చేయదు.తీవ్రంగా నష్టపోతాము. ఇప్పటికే లిబరల్స్ ప్రవచించే సూడో సెక్యులరిజం ను హిందువులపై రుద్ది వాళ్లని తీవ్రంగా దెబ్బతీశారు.


      Delete
    13. @chaitanya
      Take it as just for fun!I support rejection of baning,bUt I sincerely condemn perumal murugan by combining fact and fiction in a sublingual maaner.wait for my post on this.he is not a writer with social esponsibility and he has not served any paositive purpose by his distortion of the facts with distorted vengence!

      what the courts is calling victorian morality is rhetorical statement only.In fact you and other supporters of murugan and even the court is in the influence of victorian morality!

      can you define the term "victorian morality" and how could you apply it for the people who are against lyimg about a a place,a temple,anad a culture!Thewriter himself accepted his helplessness in the ambigous nature and failed to stood firm on that matter.anyway I am touching the subject of travauils of motherhood and technocalities about "getting child by god's grace"!

      I am not against the freedaom of speech,but how do you use it!

      Delete
    14. *ఆ ప్రాంతంలో ఇప్పటి ఆడవాళ్ళ మీద నిందలు మోపటం కిందకి వస్తుందంటారా? *

      తప్పకుండా వస్తుంది. మన రాష్ట్రం లో కొన్ని ప్రాంతాలు కొన్నిటికి ప్రసిద్ది ఉదా|| చిలకలూరి పేట. ఆ ఊరి పేరు చెపితే ఆ ఊరి ప్రత్యేకత స్పురిస్తుంది. అమెరికాలో పని చేసే నా కొలీగ్ ఆ ఊరివాడు. ఒక సారి మీదేవూరు అని అడిగితే ఎంతో తటపటాయిస్తూ చిలకలూరి పేట అని చెప్పాడు. దీనిని ఈ సంఘటనకు అన్వయిస్తే

      కాలం మారి ఉండవచ్చు గాని ఆ ఊరు, ఆ ఆచారం పాటించే
      (కులానికి సంబందించిన) వారు, ఇంకా ఉండిఉండవచ్చు.
      ఈ పుస్తకాలను చదివి,వాదవివాదాల వలన మీడీయాలో, పేపర్లలో వచ్చిన వార్తలను ఆ ఆచారం గతం లో పాటించిన ఊరివారిని గాని లేక కులానికి సంబందించిన వారిని వేరే దృష్టి తో ప్రజలు చూడవచ్చు. ఇలా గతం లోడి ఇప్పటివారికి ఇబ్బంది కలిగించాల్సిన అవసరమేమిటి? సో కాల్డ్ లిబెరల్ వాల్యుస్ ప్రవచకులకుండే గొప్ప పరిణతి సామాన్య ప్రజలకు ఉండవు.

      Delete
    15. I agree with Chaitanya the judgment is very balanced. The learned judges considered a good deal of case law including the Taslima Nasreen & DaVinci Code judgments.

      @UG SriRam:

      "A competent counsel was not employed to bring these facts to the notice of the court. The court needs assistance of branded counsels."

      If true, I am surprised that a powerful body like the Hindu Munnani (one of the respondents) did not deem this necessary. They are not short of either funds or support base.

      "Women, the principal affected parties here, were not heard in this court"

      Surely no one stopped women's associations from impleading themselves? You may also like to note the following:

      a. No women were present even at the so called "peace negotiations"
      b. The bench included a Tamil lady judge

      "It has to be withdrawn and the case reheard"

      Why not appeal the judgment in the Supreme Court?

      @Haribabu Suranenii:

      "నాకు కూడా పెరుమాళ పరిస్థితియే దాపరిస్తే ఎటువైపు నిలబడతారు!"

      FYI తస్లీమా నస్రీన్ కేసులో నేను ఆవిడ వైపే ఉన్నాను.

      Delete
    16. శ్రీరాం గారు,
      నాకూ ఇంజినీరింగ్‍లో చిలకలూరిపేటకి చెందిన ఫ్రెండ్ ఉండేవాడు. చేరిన కొత్తలో క్లాస్‍లో లెక్చరర్ అందరిని ఊర్లు అడుగుతున్నప్పుడు లేచి తన ఊరిపేరు చెబితే అందరూ గొల్లన నవ్వేవారు. మెల్లగా ఆ ఊరికి బైట ఉన్న పేరు అర్థంచేస్కుని తర్వాత గుంటూరు అని చెప్పేవాడు. ఇప్పుడు అనుకుంటా నేను, తను అలా వెనక్కి తగ్గకుండా స్పష్టంగా ఆ ఊరంటే మీకు తెలిసింది ఒక్కటే కాదు శుంఠలారా, దానికి ఇంకా చాలా విషయం ఉందని చెప్పి నిలబడి ఉంటే మరోలా ఉండేదని. అలా చెప్పాలంటే లైంగికత విషయంలో మన సమాజం పాటించే గుట్టు, అదేదో ఎవ్వరూ ఎప్పుడూ చెయలేదనట్టు ప్రవర్తించే అపరాధభావన, ఆ బేసిస్ మీద కొన్ని ప్రాంతాల పై, వర్గాల పై వెటకారాలు మొదలైనవి తగ్గాలి. విక్టోరియన్ మోరాలిటీస్ అంటోంది ఈ భావజాలాన్నే. ఆది మైధునం భగవంతుడి ఆజ్ఞకి విరుద్దంగా చేసిన పాపకార్యమని తలిచే క్రైస్తవ మతభావజాలం. మైధునాన్ని చాలా సహజ విషయంగా, పురుషార్థంగా, భగవంతుడిని చేరే ఒక మార్గంగా (తంత్ర) కూడా భావన చేసింది హిందూమతం. మన పూర్వీకులు వీటిని చాలా సహజంగా తీస్కున్నారని, దానికి ఇప్పుడు మనం కించపడిపోవలసిన పనిలేదని అర్థం చేస్కోవలసుంది. చిలకలూరిపేట వాళ్ళైనా, తిరుచెంగోడ్ వారైనా, ఎవడు తమ ప్రాంతపు పాతకథలు తవ్వుతాడో, ప్రస్తావిస్థాడో అని భయపడి వేరే ఊరి పేరు చెప్పుకోనవసరం లేదు. ఆ స్టిగ్మాని బ్రేక్ చేయవలసి ఉంది. వెనక్కి వెళితే ప్రతిచోటా ఇలాంటి గుట్టు పనులేవో ఉంటాయి. అప్పటి కాలమే అంత అని తీస్కోటమే చేయగలిగింది. నేను క్రితం కామెంట్లో చెప్పినట్టు లైంగికత విషయంలో హిందువుల భావజాలం తిరగబడిపోయింది మన ప్రాచీనులతో పోలిస్తే. ఎవడో ఒకడు పాత కథలు, పురాణాలు తిరగేసి అప్పట్లో ఇట్లంటా అట్లంటా అని బైటికి తీస్తూనే ఉంటాడు. దానికంతా రియాక్టవ్వటం అనవసరం. మన పూర్వీకుల కాలాన్ని, పరిస్థితుల్ని, వారి దృష్టికోణాన్ని అర్థం చేస్కొగలిగితే మనం కించపడిపోకుండా నిలబడోచ్చు. తరచి చూస్తే ప్రపంచం అంతా ఇవే కథలని అర్థం చేస్కోవచ్చు.

      Delete
    17. మన పూర్వీకులు వీటిని చాలా సహజంగా తీస్కున్నారు. ఇప్పటివాళ్ళు సహజంగా తీసుకొంటారు అది ఎప్పుడంటే ప్రాంతం,కులం మొదలైన వాటిని ప్రస్థావించకుండా ఉంటే. మీరనుకొనే విక్టోరియన్ మోరాలిటీస్ కన్నా ఇప్పుడు ప్రతి కులానికి,మతానికి,ప్రాంతానికి అప్పటికన్నా ఇప్పుడు ఎన్నోరెట్ల అస్థిత్వ భావన ఉంది. ఈ భావన సామాజికంగా, రాజకీయంగా ప్రాముఖ్యత వహిస్తున్నాది. ఒక్కపుడు ఇటువంటి పరిస్థితి లేదు.

      ఈ అస్థిత్వ భావన పిచ్చి ముదరటానికి ప్రధాన కారణం లెఫ్ట్ లిబరల్స్. వీళ్ళు హిందువులను కుల,ప్రాంత,క్లాస్ కోణాలలో విశ్లేషణలు చేసి,చేసి పుస్తకాలు,వ్యాసాలు రాసి రాసి, ప్రతివారికి ఎదో ఒక ఐడేంటిటి క్రియేట్ చేశారు. రాజకీయ పార్టిలు వాటిని దశాబ్దాలుగా ఎన్నికలలో ఉపయోగించుకొంట్టు వస్తున్నారు. పరిస్థితిని ఎంత వరకు తీసుకొచారు అంటే ఇప్పుడు సదుద్దేశంతో ఒక అంశంపై మాట్లాడిన అది ఎదో ఒక వర్గానికి నొప్పికలిగిస్తుంది.



      * ఒక్కటే కాదు శుంఠలారా, దానికి ఇంకా చాలా విషయం ఉందని చెప్పి నిలబడి ఉంటే మరోలా ఉండేదని.... ఆ స్టిగ్మాని బ్రేక్ చేయవలసి ఉంది. వెనక్కి వెళితే ప్రతిచోటా ఇలాంటి గుట్టు పనులేవో ఉంటాయి.*

      ఎవరిని ఏడ్యుకేట్ చేస్తావు? ఎంతమందిని ఏడ్యుకేట్ చేస్తావు? ఈపేపర్లలో రాసే గొప్ప మేధావుల రాతలు చదివి ప్రజల పర్సేప్ షన్ మారిపోతుందా? సుమారు 100 ఏళ్లుగా లెఫ్ట్ మేధావులు ఏడ్యుకేట్ చేసే సమస్యలు లిస్త్ తీసుకో, వాటిలో మార్పేమి ఉండదు. కారణం సమాజం లో మార్పులు ఊహించినంత త్వరగా రావు. గతం తో పోలిస్తే ఎంతో కొంత మార్పు ఐతే ఉంట్టుంది కాని ప్రజల అభిప్రాయాలు,స్వభావం,ప్రవర్తన పూర్తిగా మారిపోదు. పూరిత్గా మారినది బొగ్గులు, కట్టేలు పోయి గాస్ వాడకం, కరెంట్, ట్.వి., సెల్ ఫోన్ ఇటువంటివి మాత్రమే!

      Delete
    18. @ Jai,
      Why not appeal the judgment in the Supreme Court?

      May be they will go to Supreme court.

      Delete
    19. UG Sriram,

      నేను ఎవ్వరినీ ఏడ్యుకేట్ చేయమనట్లేదు, చేయలేం కూడా. చేయవలసినది ఎవరినో ఏడ్యుకేట్ చేయటం కాదు, మనలో ఉన్న అపరాధభావనని వదిలించుకుని నిలబడటం. మన ఊర్లో వ్యభిచారం జరిగేదనో, మన ఊరి గుళ్ళో ప్రాచీనకాలంలో ఇప్పటి మొరాలటీస్‍కి సరిపడని ఆచారమేదో మన తాతాల కాలంలో ఉండేదనో, ఇలా ఎప్పటివో ఏ కాలానివో, లేదా ఇప్పటివే ఐనా మన వర్గం వారో, మన కులంవారో ఎవరో చేస్తున్నారనో, ఇలా మనకి నేరుగా సంబంధంలేని ప్రతి విషయం గురించి మనం నూన్యత చెందటం అనవసరం. దాని గురించి ఎవడు మాట్లాడినా, అది మనల్నే అన్నట్టు ఫీలవ్వటమూ అనవసరం. దాన్ని వదిలించుకుని నిలబడితే సమాజమే వెటకరించటం మాని వెనక్కి తగ్గుతుంది మెల్లగా. అదే నేను చెప్పిన స్టిగ్మాని బ్రేక్ చేయటం.

      లెఫ్ట్ లిబరల్స్ పుణ్యమాని సమాజంలో ప్రతివారికీ అస్థిత్వ భావన పెరిగిపోయిందన్న మీ వాదన నిజమే. దానర్థం ముందుకి అదే దారి అని కాదు కదా. ప్రతివాడూ ఎదటి వర్గం చరిత్ర తవ్వటం మొదలెట్టాక, ఎప్పటివో పాత ఆచారాలు, పురాణాల మీద ఎంతకాలం మనోభావాలు గాయపరుచుకుంటారు జనం. హిందువులు ఇలాంటి విషయాల గురించి సమర్థింపులకి, సంజాయిషీలకి దిగితే, మన పూర్వీకులందరినీ, మన గత చరిత్రలో ఎన్నో విషయాలని సమర్థించుకోవలసి వస్తుంది. సమస్య అది కూడా కాదు, ఇప్పటి హిందువులకి పట్టిన గతి ఏమిటంటే, ఏవైతే తమ పూర్వీకులు చాలా సహజంగా తీస్కున్నారో, పాటించారో, గౌరవించారో, ఆ విలువల పట్ల, ఆ ఆచారాల పట్ల ఒక స్టిగ్మా డెవలెప్ చేస్కున్నారు. చేసుకుని తమ ఇప్పటి విలువలు, ఆచారాలే సనాతనంగా ఈ ధర్మంలో ఉన్నాయనే భ్రమలో ఉన్నారు. ఎవడైనా పాత పుస్తకాలు తవ్వి ఇప్పటి విలువలకి తగినవేవో పాతకాలంలో ఉండేవని చెప్పగానే కన్‍ఫ్యూసై ఆవేశపడుతున్నారు. అప్పటికవి సహజమే, వాటి గురించి మనం నూన్యత చెందాల్సిందేమీ లేదని చెప్పాల్సిందిపోయి, అన్ని వర్గాలు హైపర్ సెన్సిటివ్ ఐపోయారు, కాబట్టి మేమూ అలాగే ఉంటామనే ధోరణిలోపోతే హిందువులు రోజూ మనోభావాలు గాయపర్చుకోవలసి వచ్చేనన్ని విషయాలుంటాయి మన పాత పుస్తకాల్లో. ఆచార వ్యవహారాల్లో, విలువల్లో మన పూర్వీకులకన్నా మనం చాలా మారిపోయాం మరి. ఇప్పటి కళ్ళతో చూస్తే అవన్నీ స్కాండలస్‍గానే కనిపిస్తాయి. హైందవేతర వర్గాలు వాటిని ఎత్తిచూపి స్కాండల్స్ అనే అంటాయి. వాటిని అప్పటి సమాజం దృష్ట్యా చూడాలి కానీ ఇప్పటి కళ్ళతో కాదని చెప్పాలి కానీ, అబ్బే అవేం లేవు, నువ్ దాని గురించి మాట్లాడకూడదు అని ఎంతని దబాయించగలరు.

      Delete
  8. @neehaarika
    ఏకపక్షంగా ఎవరో అనామకులకి జవాబులూ,ప్రతి జవాబులూ,వార్నింగులూ ఇస్తే ఎట్లా?ఆ వ్యాఖలు చూపించి జవాబులు చెప్పటం మర్యాద,కాదా?మీ సొంత కామెంట్లని ఎన్నిసార్లు ఎకక్డెక్కడ వేసి,తీసి ఏం చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు.కానీ మీరు జవాబు చెప్పదల్చుకున్నప్పుడు ఆ కామెంటును ఉంచాలి కదా!ఇతర్లకి చిరాగ్గా ఉంటుంది - ఆలోచించండి.
    -------------------------------
    అని తనకి ఒక సదుద్దేశంతో ఇచ్చిన సలహాకి "నా బ్లాగు నా ఇష్టం" అని మొండిగా జవాబు చెప్పినా ఎవరూ పట్టించుకోరు,కానీ "లాడెనుకి నేనూ నాకు లాడెనూ" అని దీర్ఘాలు తీసీన ఈ వివాహిత తన తప్పేమీ లేకుండా నా బ్లాగు దగ్గీర తనకి ఘోరమయిన అవమానం జరిగిందని నన్ను బ్లేం చేస్తున్నది,చూదండి!
    -------------------------------
    @ హరిబాబు గారు,
    మీ బ్లాగులో బూతులు వ్రాస్తున్నారని మీ బ్లాగులో కమెంట్స్ వ్రాయనని చెప్పాను కదా ? అటువంటి నేను బూతులు వ్రాస్తున్న అజ్ఞాతల కమెంట్స్ ఎందుకు ప్రచురిస్తాను ? వాడేమి వ్రాస్తున్నాడో వాడికి తెలుసు. మీకు తెలియనక్కరలేదు. బూతులు వ్రాస్తే దాన్ని ప్రచురించాలంటే నాకు చిరాకు. ఏమి చేయమంటారు ?
    -------------------------------
    తనేమైనా ఆకాశం నుంచి వూడిపడిందా?తను ఏరకంగా మాట్లాడినా తప్పు లేదు గానీ ఇతర్లు మాత్రం తనని వ్యతిరేకించకూడదా!
    -------------------------------
    @ హరిబాబు గారు,
    మీ బ్లాగులో బూతులు వ్రాస్తున్నారని మీ బ్లాగులో కమెంట్స్ వ్రాయనని చెప్పాను కదా ? అటువంటి నేను....
    @నీహారిక గారూ,
    పెళ్ళి కెదిగిన కొడుకు ఉన్న ఒక వివాహిత "లాడెనుకి నేనూ,నాకు లాడెనూ" అని దీర్ఘాలు తీస్తూ రాయడం ఏ నియమాల కింద సభ్యతాయుతమైన భాష కింద వస్తుంది?

    పత్తిత్తులా మాట్లాడకండి.నా బ్లాగులో మిగతా వ్యాఖ్యాతల్లో కొందరు ఇతరుల పట్ల "కల్లు తాగిన కోతిలా" అన్న మాట వాడినప్పుడు నాకు నచ్చకపోయినా సహించాను - వదనలో పర్తివారూ సామెతల్ని
    వాడుకోవటం మామూలే గనక!అదే ఇతర్లని "వీడు మళ్ళా వచ్చాడు" అని ఉన్న కామెంట్లు న అనతట నేనే తీసేసి వాళ్ళకి సజషన్ ఇచ్చాను.నా బ్లాగులో మెరేదో సభ్యతాయుతంగా రాస్తే ఇతర్లు మీతో
    బూతులు మాట్లాడినట్టు ఇప్పుడు చెప్తే అది నాకూ నా బ్లాగుకీ అవమానం - దయచేసి నా బ్లాగుకి సంబధించిన మీ అభిప్రాయం తప్పని ఒప్పుకోండి!
    -------------------------------
    రాజకీయ పరిజ్ఞానమూ,సభ్యతా సంస్కారాలూ అన్నీ తనవద్దనే పోగుపడినటు ఇతర్లకి నీతులు చెప్తున్న ఈ స్వైరిణి శూర్పణఖ అభిమాన సంఘం అధ్యక్షురాలు నా బ్లాగునీ నా బ్లాగులో కామెంట్లు వేసేవాళ్ళనీ తప్పు పడితే నేనెందుకు సహించాలి?నా ప్రశ్నని ప్రచురించకుండా,దానికి జవాబివ్వకుండా ఈవిడ ఎవరికి నీతులు చెప్తున్నది?తను వాగేటప్పుడు సందర్భశుద్ధి చూసుకోదు గానీ ఇతర్లకి మాత్రం పోష్టుకీ ప్రశ్నకీ సంబంధం ఉండాలని నీతులు చెప్తే ఎవడు వింటాడు?

    ReplyDelete
  9. Hari Babu Garu,

    Latest report of Indus civilization is that its date is pushed back and now estimated around 10, 000/- years back (8000 BC).

    http://scroll.in/latest/808978/indus-era-dates-back-further-than-thought-older-than-egypt-mesopotamia-iit-asi-scientists.

    ReplyDelete
    Replies
    1. వెంకట రామ్ గారూ,
      మీరు మరొక బ్లాగులో ఇచ్చిన లంకెలు మహత్తరంగా వున్నాయండీ. మన సనాతన సంస్కృతి ఒక్క రక్తపుబొట్టుకడా చిందించికుండా, ఒక్క యుద్ధం కూడా చేయకుండా ఎన్నెన్ని దేశాలలో పరిఢవిల్లిందో తెలిపే చాలా చక్కటి సమాచారాన్ని నాలుగైదు లింకులుగా ఇచ్చారు,
      మీకూ, ఇలాంటి అపూరూపమైన సమాచారాల లంకెలను ఇచ్చే యూజీ శ్రీరామ్ గారికి జమిలిగా మప్పిదాలతో
      .......శ్రీనివాసుడు.

      Delete
    2. @శ్రీనివాసుడు,

      Three Sufi Muslim singers hacked in Bangladesh

      http://www.thedailystar.net/country/3-bauls-hacked-chuadanga-1255072

      Delete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. పెరుమాళ్ మురుగన్ కేస్, దాని తీర్పు కాపీ నేనిక్కడ ఇచ్చినందుకు మీరంతా చక్కగా చర్చించడం ఆనందంగా వుంది. న్యాయమూర్తి తీర్పు నాకైతే కొంత అస్పష్టంగా, అసమతౌల్యంగా అనిపించింది. దీని గురించి శ్రీరామ్ గారు ఇచ్చిన హిందూ పత్రికలోని వ్యాసంలో చెప్పిన విషయాలు కొంత ఆలోచించదగ్గవిగా వున్నాయి. రాబోయే రోజుల్లో ఆ తీర్పు సమర్థకులు, వ్యతిరేకులు వివరంగా మాధ్యమాల్లో చర్చిస్తారు. అప్పుడు మనకి మరిన్ని కోనాలు తెలిసే అవకాశముందని నా భావన.
    ......శ్రీనివాసుడు....

    ReplyDelete
  12. హరిబాబు గారు.



    సాధారణం గా మనం గతం లో మాత్రుస్వామ్య వ్యవస్థ ఉండేది, కాలక్రమేణ అది పతనమై పిత్రుస్వామ్య వ్యవస్థ వచ్చిందని చదువుతూంటాం. కాని మన కళ్ళ ముందు నేడు వెస్ట్ లో మాత్రుస్వామ్య వ్యవస్థ పతానావస్థలో ఉంది. ఈ మాత్రుస్వామ్య వ్యవస్థ పుట్టుకకి మూల కారణమైన స్రీవాదం. దీనిని మొదట లెనిన్ సామ్రాజ్య విస్తరణ కాంక్షకోసం ఎలా సృష్టించి ఉపయోగించాడో మొదలు పెట్టి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలను వాటి విషయాలను కొన్నేళ్ళుగా వివరాలు సేకరించి ఈ బ్లాగులో రాశాను. మీరు ఒకసారి చదవండి.



    http://ssmanavu.blogspot.in/2016/06/blog-post_28.html



    ప్రస్తుతం యురోప్ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. అది ఇక కోలుకొనే పరిస్థితే లేదు. చాలా మంది పౌరులు ప్రభుత్వ సబ్సిడిలు తీసుకొంట్టు,జీవిస్తున్నారు వారి వద్ద ఏ సేవింగ్స్ లేవు. ప్రజల వద్ద, ప్రభుత్వాల వద్ద అప్పులే మిగిలాయి. సంపన్నుల వ్యవహారం మన విజయమాల్యాకు ఏ మాత్రం తీసిపోదు.



    ప్రస్తుత పరిస్థితి ఎంత ఘోరం గా ఉందంటే అక్కడి ప్రభుత్వాలు వ్యబిచారం, డ్రగ్స్ పై వచ్చే సొమ్మును కూడా జిడిపి లో కలిపి లెక్కవేసుకొంట్టున్నారు. ప్రభుత్వాలదగ్గర వెల్ఫేర్ స్కీం లకిచ్చేందుకు డబ్బులు లేవు. ఈ స్కీం ల వలన లబ్ది పొందూతూ వచ్చిన మహిళలు/సింగిల్ పేరేంట్స్ నేడు తీవ్ర ఇబ్బందులకు లోనౌతున్నారు. వారి పరిస్థితి పోను పోను అగమ్య ఘోచరంగా తయారయ్యే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. యురోప్ సివిలైజేషనే ఒక ఊహ, అది లేదని ఎప్పుడో గాంధి అన్న మాటలను గుర్తుకుచేసుకొని ,గ్రీస్ మాజీ ఆర్ధిక శాఖ మంత్రి ఒక టౌన్ హాల్ లో చెప్పాడు.

    ReplyDelete
    Replies
    1. Pls watch below videos

      https://www.youtube.com/watch?v=eU6YDB9lqjQ

      https://www.youtube.com/watch?v=UxpVwBzFAkw

      Delete
  13. This comment has been removed by the author.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...