Tuesday, 30 October 2018

ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర విశేషాలు - ఉపోద్ఘాతం

     మొదటి స్వాతంత్య్ర పోరాటం సఫలమైనట్లే అయి చివర్లో దురదృష్టం కొద్దీ విఫలమై ఏ పోరాటం ఇంగ్లీషువాళ్ళని తరిమికొట్టటానికి ప్రారంభించారో ఆ పోరాటమే ఇంగ్లీషువాళ్ళు మరింత పాతుకుపోవటానికి ఉపయోగపడింది!అప్పటినుంచి రెండవ స్వాతంత్య్ర పోరాటం మొదలయ్యేలోపు భారతీయ సమాజం ఎట్లా ఉండేది?

     ఆధునిక భారతదేశ చరిత్ర అనే అంశాన్ని తరచిన చరిత్రకారులూ పాత్రికేయులూ మేధావులూ విశ్లేషకులూ  ఈ కాలాన్ని గురించి చెప్పేటప్పుడు కాంగ్రెసు పార్టీ స్థాపనతో మొదలుపెట్టి రాజకీయాలనే స్పృశించారు తప్పితే సమాజం గురించి ఎవరూ పట్టించుకోలేదనే చెప్పాలి."మనల్ని విదేశీయులు పరిపాలిస్తున్నారు!","విదేశీయులు పాలించడం వల్లనే మనకి అన్యాయం జరుగుతున్నది!","వీళ్ళని వాళ్ళ దేశానికి తరిమికొట్టి స్వతంత్రం తెచ్చుకోనిదే మనదేశం(?) బాగుపడదు!" అనే రాజకీయ భావనలు రావడానికి పునాదియైన అప్పటి భారతీయ సమాజం గురించి మనకి  వాస్తవాలు తెలియడం లేదు.ఎందుకంటే, అప్పటి సమాజం గురించి చెప్పాలనుకుంటున్న ఇప్పటి మేధావుల్లో ప్రతి ఒక్కరికీ ఒక పొలిటికల్ ఎజెండా ఉంది - తమ ఎజెండాకి వ్యతిరేకమైన విషయాల్ని దాచేసి అనుకూలమైన విషయాల్ని మాత్రమే చెప్పారు!

     ఇలాంటి చిక్కులు ఎదురైనప్పుడే మనుషులకి కాలయంత్రం లాంటి ఫాంటసీల మీదకి మనసు పోతుంది - మనమే వెళ్ళి చూస్తే పోతుంది గదా వాళ్ళూ వీళ్ళూ చెప్పే అబద్ధాలని నమ్మడం దేనికి?అయితే, కాలంలో ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహార్మ్,రిజల్టులో కూడా గ్యారెంటీ లేదు!కానీ తక్కువ ఖర్చుతో కాలంలో ప్రయాణాన్ని సాధ్యం చేసే సాధనం ఒకటి ఉంది - అదే, సాహిత్యం!ఒక కాలం గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి ఆ కాలపు ప్రముఖ వ్యక్తుల జీవితచరిత్రలు గానీ ఆత్మకధలు గానీ అధికారికమైన విషయనిధులు(DATA BANKS) అవుతాయి.అలాంటి వాటిలో సా.శ. 18వ శతాబ్ది నాటి సమాజం గురించి దాని నైసర్గిక వర్ణనతో సహా తెలుసుకోవడానికి ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర అనే ట్రావలాగ్ కన్న విలువైనది మరొకటి లేదు.

     వేరే వ్యక్తి చెప్పినదాన్ని నేను మీకు చెప్తున్నానని అనగానే "ఇతన్ని నమ్మవచ్చునా!అబద్ధాలు చెప్పడం లేదని గ్యారెంటీ ఏమిటి?" అనే సందేహం వస్తుంది.కానీ ఈయన కాశీయాత్ర చరిత్ర రాసింది ఉబుసుపోక కోసం కాదు - అప్పటికే రెండుసార్లు కాశీ వెళ్ళి వచ్చి మూడోసారి వెళ్తున్నప్పుడు ఒక స్నేహితుడు తనకూ ఇతరులకూ సహాయకారిగా ఉంటుందని అడిగితే రాసి ఇచ్చినది,స్నేహితుడికీ ఇకముందు కాశీ వెళ్ళానుకున్నవాళ్ళకీ ఉపయోగపడటం కోసం రాసేదాంట్లో అబద్ధాలు చెప్తే ఉన్న పరువు పోతుంది, కదా!

     మొదటి ముద్రణ సా.శ 1838లో జరిగింది - అంటే ఆయన రాసినది మిత్రుడు చదివి మెచ్చుకుని అందరికీ పనికొస్తుందని అనుకోవడానికీ ప్రచురణ సిద్ధమవటానికీ ఏళ్ళు పట్టదు కదా!సా.శ. 2018లో ఉన్న మనం సా.శ 1820ల నాటి భారతదేశాన్ని చూడబోతున్నాం - కాలంలో ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా?



ఎంతమంది ప్రయాణీకులు ఉన్నారో లెక్క తెలిస్తేనే గానీ ఈ బండి కదలదు.
-----------------------------------------------------------------------------------------

2

Thursday, 25 October 2018

మతము లన్నిటి నడుమ ఏ మతము మంచిది?దైవము లందరి నడుమ ఏ దైవము సర్వోన్నతం!

అర్జునుడికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించినట్టు మీకు నేను భారతీయ సనాతన ధర్మం యొక్క విశ్వరూపాన్ని చూపించబోతున్నాను!అసలు వేదంలోనే "న తస్య ప్రతిమా అస్తి!" అని తన గురించి తను చెప్పుకున్న దైవం మళ్ళీ అవతారం అనే పేరున రూపం ధరించడమూ ఆ రూపాలను హిందువులు భక్తితో ఆరాధించడమూ ఏమిటి అని కొందరు పండితులకే అనుమానాలు  వస్తుంటే దేవుణ్ణని చెప్పుకున్న శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం ఎట్లా చూపించగలిగాడు?విశ్వం లోపల ఉన్న భూమి మీద నుంచుని విశ్వం మొత్తాన్ని ఎట్లా చూపించగలడు?మొత్తం చూపించాలంటే విశ్వం బయటికి తీసుకెళ్ళాలి - తన నుంచే సమస్తమూ పుడితే ఇంక దీనినుంచి బయటికి వెళ్ళటం సాధ్యమా!ఇంకొక మెలిక కూడా వుంది - దేవతలు కూడా చూడలేరు అంటూనే మనిషైన అర్జునుడ్ని పట్టుకుని నీకు నేను చూపిస్తున్నాను అంటున్నాడు,ఇదేం తిరకాసు?

సంస్కృత సాహిత్యం,అందులోనూ ధార్మిక సాహిత్యం చాలా మార్మికమైనది - ఉన్నది ఉన్నట్టు చూసి మనకి ఎలా అర్ధమైతే దాన్నే ఫిరాయించేసుకుంటే సాయిబుల్లోనో కిరస్తానుల్లోనో నాస్తికుల్లోనో కలిసిపోవడం ఖాయం!నిజానికి, అక్కడ ఆయన చూపించిందీ ఈయన చూసిందీ ఏమీ లేదు - దివ్యదృష్టి ఇవ్వడం కూడా మిధ్యయే!విశ్వానికీ దైవానికీ ఉన్న సంబంధం గురించి కొన్ని గంభీరమైన విషయాలని ఆయన చెప్పాడు,ఈయన జ్ఞానపు స్థాయిని పెంచుకుని అర్ధం చేసుకోగలిగాడు - అంతే!అంతకుమించి సాగదీసి ఆలోచిస్తే దుర్యోధనుడితో సహా కౌరవసైన్యాన్ని తను ఎప్పుడో చంపేశానని అంటున్నాడు కదా,ఇంకా అర్జునుడూ పాండవసైన్యమూ వాళ్ళని చంపాల్సిన అవసరం దేనికనే పిచ్చి డౌట్లు కూడా వస్తాయి!ఒక ముగ్గుబుట్టలాంటి చింపిరిజుట్టున్న పిచ్చి ముసిల్దానికి ఆల్రెడీ ఈ అనుమానం వచ్చేసింది - తెలివైన వాళ్ళు గనక హిందువులకి రాదులెండి, వస్తే ప్రమాదమే!

భారతీయ సనాతన ధర్మం యొక్క విశ్వరూపాన్ని చూడాలంటే ముందు కొన్ని విషయాలని తెలుసుకోవాలి.జుదాయిజం నుంచి పుట్టిన రెండు శాఖల కన్న ఒకింత వెనకబడి తడబడుతున్న హిందూమతం ఇవి ఉనికిలోకి రాకముందు ప్రపంచమంతటా వ్యాపించి తను అడుగు పెట్టిన ప్రతిచోట అక్కడ నెలకొని ఉన్న అజ్ఞాన తమస్సును తన విజ్ఞాన ఉషస్సు యొక్క మృదుస్పర్శతో పోగొట్టి ఆయా మానవ సమూహాలు గొప్ప సంస్కృతులను నిర్మించుకోగలిగేటట్లు చేసింది.ఒక హిందువుగా నేను ఈ మాట చెబితే హిందువులు స్వమతాభిమానం చూపించి నమ్మెయ్యడమూ హైందవేతరులు అనుమానించడమూ సహజమే!కానీ, హిందూ మతస్థులు కానివాళ్ళు తమ మతాన్ని గురించి ఆ మాట చెప్పుకోవటానికి బదులు తమకి సంబంధం లేని హిందూమతానికి  ఆ ఖ్యాతిని కట్టబెడుతుంటే మన వెనకటి తరాల వాళ్ళు సాధించిన విజయాల్ని పొగుడుకోవటానికి మనం ఎందుకు సంశయించాలి?

వాళ్ళెవరో India, that is bharat - so Great! అని ఒప్పుకుని దీని గురించి తెలుసుకోవటం అల్లాటప్పా గోంగూరకట్ట కాదని Indology అనే ఒక వైజ్ఞానిక శాఖనే తెఱిచి పరిశోధనలు చేసి ఎన్నో వాస్తవాలని వెలికి తీస్తుంటే హిందువులు కనీసపు ఆసక్తిని కూడా చూపించకపోతే ఎట్లా!వాళ్ళందరూ సత్యం పట్ల నిబద్ధతతో తమ తమ మత విశ్వాసాలను పాటిస్తూనే భారత దేశపు ఔన్నత్యాన్నీ సనాతన ధర్మం యొక్క విశిష్టతనీ గుర్తించిన సత్యాన్వేషులు - హిందూమతానికి బాకా కొట్టి భజనలు చెయ్య లేదు, గొప్పల్నీ తప్పుల్నీ ఉన్నవి ఉన్నట్టు చెప్పారు!

"Christianity doesn't exist, Jesus Christ never existed.Jesus Christ was an invention by the orthodox bishops at the Councel of Nicaea. That's what he was. He was the idea ,but they were,they wanted to create the ideal the deity to make people to slaves and that deity was tirn the other cheek love thy neighbor and tgis is why we're in a mess.Today, you know not thy enemies and all this crap.This is a great way to subjugate people.You know Don't make them sell their sheep bringing in the sheaves and  these innocent sheep here are more intelligent than Christians. The vedas on the other hand like all in a European and all most in even like all indigenous spiritual traditions all over the world,  tell you fight back to defend yourself.And,  Christianity itself  is Jewish.It's radical jewish offset, a sect,like a kind of branch. Davidians or isis that broke away from judaism and the jews also were cruel while killing others,they were  killing anyone that they deemed to be, you know, sinners." - ఇది అన్ని మతాలనీ తులనాత్మకమైన అధ్యయనం చేసిన ప్రపంచ స్థాయి మేధావులు సూత్రీకరించిన వాస్తవం.

ఇవ్వాళ మాదే అత్యున్నతమైన మతం,మా ప్రవక్తయే జగద్రక్షకుడు,మా దేవుడే సర్వేశ్వరుడు అని డబ్బా కొట్టుకుంటున్న  క్రైస్తవీయ మహమ్మదీయ మతాలు రెండూ జుదాయిజం యొక్క వికృత శిశువులు అనేది ఆయా మతాల వారు కూడా ఒప్పుకు తీరాల్సిన యదార్ధం - అది యెప్పుడో తేటతెల్లమై పోయింది.వికృత శిశువులు అని యెందుకు అంటున్నానంటే, అంతస్సారాన్ని బట్టీ ఆచరణా విధానాలని బట్టీ జుదాయిజం సనాతన ధర్మానికి చాలా దగ్గిరగా ఉండే ఆదర్శవంతమైన జీవనవిధానం కాగా ఈ క్రైస్తవీయ మహమ్మదీయ మతాలకి రూపకల్పన చేసినవారు ఈ జుదాయిజం నుంచి కొన్ని మంచి విషయాలని తీసుకుని ఇతరుల్ని తమకి బానిసల వలె పడివుండేటట్లు చేసుకోవడానికి పనికి వచ్చే స్వంత పాండిత్యపు కొత్త సూత్రీకరణల్ని కలిపి తమ మతాల్ని సృష్టించుకున్నారు.

సనాతన ధార్మిక సాహిత్యంలో కనిపించే బ్రహ్మ, సరస్వతి జుదాయిజంలో కనిపించే అబ్రహాం, సారా అనే రెండు జంటల మధ్యన చాలా దగ్గరి పోలికలు ఉంటాయి.ఈ రెండు జంటల లోని స్రీ పురుషులకి ఒకేసారి సోదర సోదరి సంబంధమూ దాంపత్య సంబంధమూ ఉంటుంది.ముఖ్యమైన తేడా అల్లా బ్రహ్మ,సరస్వతి పేరుతో సనాతన ధార్మిక సాహిత్యంలో కనిపించే జంట మన వంటి పార్ధివ దేహధారులు కాక జ్ఞానరూపాలు మాత్రమే.జుదాయిజం యొక్క మూల ప్రవక్త అయిన అబ్రహాం మరియు అతని భార్య స్థానంలో ఉన్న సారాలు మాత్రం మనవంటి పార్ధివ దేహధారులే!

Psalm 78:2 
I WILL OPEN MY MOUTH IN A PARABLE;I WILL UTTER DARK SAYINGS OF OLD:"హిందూమతం యొక్క సాహిత్యం అంతా ఎవరికీ అర్ధం కాని సంస్కృత భాషలో ఉంటుంది.మా బైబిలు చూడండి ఎంత సరళమైన భాషలో ఉంటుందో!" అని జబ్బలు చరుచుకుంటున్న క్రైస్తవ మతప్రచారకుల బూటకాన్ని బయటపెట్టే వాక్యం ఇది!ఏసు వారి అనుచరులకే కొన్నిసార్లు ఆయన చెప్పిన నిగూఢమైన మార్మికమైన పిట్టకధలూ నీతివాక్యాలూ కలగలిసిపోయిన గందరగోళపు వచనానికి ఠారెత్తిపోయి ఒక్కండే ఉండగా అడిగితే "మీరు నా స్వజనులు!నేను చెప్పు సమస్తమూ మీకు మాత్రమే తెలియవలెను!ఓ నా ఇశ్రాయేలీయులారా,పొరపాటున మన మందలో చేరిన అన్యజనులకు తెలియకుండుటకు నేనట్లు మాట్లాడువాడను!నా తండ్రి నన్ను ఇశ్రాయేలీయుల కొరకే పంపియున్నాడు" అని తెగేసి చెప్పాడు. తమ తమ మాతృభాషల్లోకి అనువదించి శుద్ధ వచనంలో చెప్పినప్పటికీ ఒక పట్టాన అర్ధం కాకపోవడం బైబిలు మరియు ఖురాను యొక్క ప్రత్యేకత అయితే, హిందువుల వేదం సంస్కృతం తెలిసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది - భావం కూడా సూటిగా ఉంటుంది.

"India is, the cradle of human race, the birth place of human speech, the mother of history, the grandmother of legend, and the great grandmother of tradition. Our most valuable and most instructive materials in the history of man are treasured up in india only"
- Mark Twain.


ఎవరీ మార్కు ట్వెయిను గారు?హిందూ మతతత్వ వాదియా!కాదు, కాదు గాక కాదు.వినగానే పొట్టచెక్కలయ్యేలా ఒక్క జోకు వెయ్యటం ఎంత కష్టమో జబర్దస్తు టీవీ క్యామెడీల్ని చూస్తే తెలియడం లేదా!అట్లాంటిది, అరిస్తే హాస్యం స్మరిస్తే హాస్యం అన్నట్టు బతికి ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్న మహా మేధావి!మేధావిత్వం చాలామందిలో ఉంటుంది,కానీ డబ్బుకి సంబంధించిన వ్యవహారాల్లో ఈయన నిజాయితీ యెంత గొప్పదో తెలుసా!తన రచనల వల్ల వచ్చిన డబ్బుని పెట్టగూడని చోట్ల పెట్టుబడి పెట్టి తనతో పాటు ఇతర్లనీ నష్టపెట్టాడు.అయితే మళ్ళీ ఆర్ధికంగా కూడదీసుకోగానే తనవల్ల నష్టపోయినవాళ్ళని పేరుపేరునా గుర్తుంచుకుని చెల్లింపులు చేశాడు - నోటరీలూ గట్రా వుండి చచ్చినట్టు చెల్లించాలేమో అనే పరిస్థితి లేదు, అయినా చెల్లింపులు చేసేశాడు! అంత మంచితనం ఉండబట్టే అంత మంచి హాస్యం సృష్టించగలిగాడేమో - మన హిందూమతాన్ని పొగిడి ఉండకపొయినా మెచ్చుకోవచ్చు కదూ!

కొలంబస్ ఇండియాకి సముద్రమార్గం కనుక్కుందామని బయల్దేరి తను విడిది చేసినది అమెరికా అని తెలియక అక్కడివాళ్ళని రెడ్ ఇండియన్లు అని యెందుకు పేరు పెట్టాడు?అప్పటికే ఇండియన్ కల్చర్ అని తను తెలుసుకున్నది అక్కడ కనపడటం వల్లనే!ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ తమ ప్రాచీనతను తెలుసుకోవటం కోసం జరుగుతున్న త్రవ్వకాలలో అక్కడ ఒకనాడు హిందూమతం అత్యంత ప్రజాదరణ కలిగి ఉండేదని తెలియజెప్పే ఆనవాళ్ళు బయటపడుతున్నాయి.కానీ,అక్కడ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాటిని బయటికి రానివ్వటం లేదు.

"..These Jews are derived from the Indian philosophers;They are named by the Indians Calani.."
-Flavius Josephus(Book 1:22)

ఇంత స్పష్టమైన విషయాన్ని దాచిపెడుతున్నది యెందుకోసం?తమ మతం కొత్త మతం ఏమీ కాదనీ హిందూమతం నుంచి చీలిన జుదాయిజం నుంచి చీలిన పిల్లమతం అని తెలిస్తే ఏ హిందువు తమ మతంలోకి వస్తాడు?

ఈ భూమి మీద కొంతకాలం పాటు అత్యున్నత వైభవాన్ని అనుభవించి కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోయిన నాగరికతలతో ప్రస్తుతం అత్యున్నత వైభవాన్ని అనుభవిస్తూ కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోతున్న నాగరికతలను కలిపిన సమస్త నాగరికతలకీ మూలం వైదిక సాహిత్యమూ అది నిర్మించబడిన సంస్కృతమూ అనేది సాక్ష్యాధారాలతో సహా ఎప్పుడో రుజువైపోయిన గతితార్కిక చారిత్రక భౌతిక యదార్ధం!

వేదం అనే పదానికి మూల ధాతు రూపం "విద్" - దీనికి సమానార్ధకమైన ఆంగ్ల పదం "to know",అంటే మానవుడు తెలుసుకోవలసిన,తెలుసుకోదగిన,తెలుసుకోగలిగిన జ్ఞానం!వైదిక సాహిత్యంలో కనిపిస్తున్న అనేక సంస్కృత పదాలకి ఇతర భాషల్లోకి అనువదించటానికి సరైన పదాలు లేవు."ధర్మం" అనే పదానికి అర్ధం కోసం ప్రముఖమైన ఇంగ్లీషు డిక్షనరీలలో దేన్ని చూసినా ఈ విషయం తెలుస్తుంది."మీ అమ్మాయి పెళ్ళికి తెలుగులో మంత్రాలు చదివిస్తావా?" అని నన్ను అడిగి యేదో ఘనకార్యం చేస్తున్నట్టు విర్రవీగుతున్న ఎర్రిపప్పకి తెలియనిది యేమిటంటే "మంత్రం" అనే పదానికి సరైన పర్యాయపదం తెలుగులో లేదు.నాకు చాలెంజి చెయ్యడంలో చూపించిన తెలివిలో వెయ్యో వంతు తెలివిని ఆ మాట గురించి తెలుసుకోవాలనే దిశలో చూపించి ఉంటే ఆ నిజం తెలిసేది.

తెలుగులో కనీస పరిజ్ఞానం కూడా లేని ఒక గొట్టాంగాడు తెలుగు భాషాభిమాని వేషం కట్టి "నాకు పెళ్ళిమంత్రాలు తెలుగులో కావాలి!లేకపోతే నేనూరుకోను!కప్పెక్కి కూస్తా!రోడ్డెక్కి అరుస్తా!ఉరేసుకు చస్తా!" అని గోల చేస్తున్నాడు.అసలు వేదంలో ఉన్న వాటిని మాత్రమే "మంత్రం" అని పిలుస్తారు,అదే చందస్సు వాడి చెప్పిన ఇతర గ్రంధాలలోని వాటిని శ్లోకాలు అంటారు.అలాంటిది మంత్రాలు తెలుగులో కావాలంట ఆ ఎర్రిపప్పకి!తెలుగులోకి గానీ మరో భాషలోకి గానీ అనువదించటం కాదు,సంస్కృతంలోనే ఒక్క అక్షరాన్ని కూడా మార్చకూడనివి వేదమంత్రాలు.


వేదం బైబిలు వలె ఇశ్రాయేలీయుల సౌభాగ్యం కొరకు మాత్రమే చెప్పబడినది కాదు,వేదం ఖురాను వలె అరేబియన్ల  వైభవం కొరకు మాత్రమే చెప్పబడినది కాదు - సమస్త మానవాళికీ శాంతిభద్రతల్ని ఇవ్వడం కోసం చెప్పబడిన జ్ఞానబోధల సంకలనం!ప్రపంచ స్థాయి మేధావులూ పరిశీలకులూ ఒప్పుకున్న దాని ప్రకారమే మానవజాతి సృష్టించిన సాహిత్యంలో వేదమే అతి పురాతనమైనది, అత్యంత శాస్త్రీయమైనది!వేదం అపౌరుషేయం - అంటే మానవులు ప్రయత్నపూర్వకమైన అధ్యయనం, పరిశీలనం, చింతనం, ప్రయోగం, పరీక్ష, నిర్ధారణం వంటి ప్రక్రియల ద్వారా వీటిని తెలుసుకోలేదు,

ఋషులు తాము ఉద్ధరించబడి ఇతరులను ఉద్దరించగలిగే సత్యమైన జ్ఞానం కోసం సుదీర్ఘకాలం తపస్సు చేసిన అనంతరం వేరెవరో తమకి చెబ్తున్నట్టు ద్యోతకమైన విషయాలని యదాతధం బహిర్గతం చేసినవే వేదమంత్రాలు.అపౌరుషేయం అని చెప్పడం,అవి తమకి దేవుడు చెప్పాడనటం కొంతవరకు వారి వినయస్వభావాన్ని తెలియజేస్తున్నాయి - మానవప్రయత్నం ఉంటుంది,వారు తపస్సు మొదలుపెట్టినదే ఒక లక్ష్యంతో కదా!అదీ గాక అంత గంభీరమైన సత్యాన్ని కనుక్కోవడానికి ముందే వారు శ్రేష్ఠులైన గురువుల వద్ద అందుకు పనికొచ్చే అన్ని విద్యలూ అభ్యసించిన పండితశ్రేష్ఠులు - వారు గొర్రెల కాపర్లో నిశానీలో కాదు.ఎవరో వచ్చి  నోటికొచ్చింది వాగేసి ఇది నాకు దేవుడు చెప్పాడంటే ఒప్పేసుకుని వేదంలోకి చేర్చెయ్యటానికి ఇతర వైదిక ఋషులు గొర్రెలూ కాదు!

వేదం మూడు కాలాలను గురించి మూడు ప్రపంచాలను గురించి ఇతర మతాల వారు తెలుసుకున్న దానికి వెయ్యిరెట్లు తెలుసుకోగలిగిన వైదికఋషులు దర్శించిన జ్ఞానం కాబట్టి అన్యులు వాటిని సవరించడానికి గానీ తిరస్కరించడానికి గానీ సంక్షేపించడానికి గానీ ప్రక్షేపించడానికి గానీ అధిక్షేపించడానికి గానీ అర్హులు కారు. వేదం ఎలా పుట్టింది అని ఇతమిత్ధం చెప్పలేనట్లే ఎప్పుడు పుట్టింది అనేది కూడా తేల్చి చెప్పడం కష్టం, కష్టమే కాదు నిలదీసి అడిగితే అసంభవం అని కూడా చెప్పవచ్చు!హేతువాదులైన శ్డాస్త్రజ్ఞులు కొందరు ఋగ్వేదంలో కొన్ని చోట్ల వర్ణించబడిన గ్రహతారకల స్థితిగతులను పరిశీలించి సుమారు 7000 BCE నుంచి 6000 BCE మధ్యన ఆయా సూక్తాలు చెప్పబడినట్లు నిర్ధారించారు.కానీ ఇలా నిర్ధారించెయ్యడంలో ఒక చిక్కు ఉంది.ఆ గ్రహతారకల అమరిక కొన్ని వేల సంవత్సరాల కొకసారి పునరావృతమవుతూ ఉంటుంది కాబట్టి ఆయా సూక్తాలు ఆ పునరావృతమయ్యే సంవత్సరాలలో ఎప్పుడైనా చెప్పబడి ఉండవచ్చు కదా!

University of Edinburghలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సంస్కృత భాషలో అపారమైన పాండిత్యం గల Prof. Keith వేదాల వయస్సును నిర్ధారించడానికి ఎంతో పరిశ్రమ చేసి "The determination of the age of the Samhitas will mostly remain a mere guess work!" అని తేల్చి చెప్పారు.మిగిలినవాళ్ళు చేసిన నిర్ధారణలనీ తన పరిశ్రమనీ కలిపి చూసుకుని విసుగెత్తి ఆయన ఆ మాట అన్నాడో లేక ఈయన ఇంత మాట అనేశాక కూడా వేదసాహిత్యాన్ని ఏదో ఒక కాలానికి కుదించుదామనే చిరాశతో చేశారో తెలియదు గానీ మిగిలినవాళ్ళు చేసిన నిర్ధారణలు ఇలా ఉన్నాయి:Maxmuller వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1200BCE నుంచి 1500BCE మధ్యన అని నిర్ధారించాడు.Keith మరియు McDonald వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1200BCE నుంచి 2000BCE మధ్యన అని నిర్ధారించారు.Whitney మరియు ఇతర్లు వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2000BCE వెనక అని నిర్ధారించారు.Winternitz వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2000BCE నుంచి 2500BCE మధ్యన అని నిర్ధారించాడు.Jacobi వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 3000BCE నుంచి 4000BCE మధ్యన అని నిర్ధారించాడు.Satyavrata Samashrami వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5000BCE వెనక అని నిర్ధారించాడు.Balagangadhara Tilak వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 6000BCE నుంచి 10000BCE మధ్యన అని నిర్ధారించాడు.Sampoornananda వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 18000BCE నుంచి 30000BCE మధ్యన అని నిర్ధారించాడు.Pt.Krishna Sastri Godbol వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 18000BCE వెనక అని నిర్ధారించాడు.Avinash Chandra Das Mukhopadhyaya వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 25000BCE నుంచి 50000BCE మధ్యన అని నిర్ధారించాడు.Lele Shastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 40000BCE నుంచి 54000BCE మధ్యన అని నిర్ధారించాడు.Rajpur Patangar Sastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 21000BCE అని నిర్ధారించాడు.Pavaki వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2,40,000BCE వెనక అని నిర్ధారించాడు.Pt.Dinanath Sastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 3,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Dr.Jvala Prasad వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Nobel Laureate Materlink వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 70,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Maahrshi Dayananda వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 200,00,00,000BCE వెనక అని నిర్ధారించాడు.భారతదేశం బయట ఉండి వేదం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారికీ భారతదేశం లోపల ఉండి వేదం గురించి తెలియని వారికీ తొలిసారి వేదాలను పరిచయం చేసిన మ్యాక్స్ ముల్లరు స్వయంగా వేదం యొక్క వయస్సు నిర్ధారించడం అసాధ్యం అని చెప్పి ఉన్నాడు కాబట్టి వేదం యొక్క ప్రాచీనతను నిర్ధారించడం అసంభవం - మధ్యలో పుట్టిన నడమంత్రపు గ్రంధాలు మధ్యలోనే నశించి పోతాయి గానీ ఆదియే కాదు అంతం కూడా లేకుండా నిలిచేది ఒక్క వేదమే!


సనాతన ధార్మిక సాహిత్యం ప్రకారం బ్రహ్మ కూడా వేదాలు గోచరించకముందు సరస్వతి పట్ల మోహానికి గురై ఆ శరీరాన్ని విసర్జించి నూతన దేహాన్ని ధరించినప్పటికీ సృష్టి చెయ్యలేని తన నిస్సహాయతను చూసుకుని ఎంతో వేదన అనుభవించి సుదీర్ఘకాలం పాటు తపస్సు చేశాకనే వేదవిజ్ఞానం లభ్యమైంది - అది తనకు గోచరించిన తర్వాతనే సృష్టి చెయ్యగలిగాడు.దాన్నిబట్టి వేదం అనేదానికి హిందువుల పౌరాణిక సాహిత్యంలోనూ బౌద్ధిక వికాసంలోనూ జీవన విధానంలోనూ ఎంత ప్రాధాన్యత ఉన్నదో తెలుస్తుంది. హిందువుగా జీవించడానికి బాప్తిజం, దావత్ లాంటి కార్యక్రమాలు ఏమీ లేవు వేదం చెప్పినది గొప్పదని ఒప్పుకుని పాటించితే చాలును.వేదాన్ని గౌరవించనివాడు హిందువు కాలేడు,వేదనింద చేసిన వాడు హిందువులకి శత్రువే అవుతాడు!

వేదం అంటే ఒకే ఒక పుస్తకం కాదు,వైదిక సాహిత్యంలో 18 విద్యాస్థానములు ఉన్నాయి.విద్యాస్థానం అంటే ఇంగ్లీషులో Branch of Study అని చెప్పుకోవచ్చు.వీటిలో శృతి అనే విభాగంలో ఋగ్వేదం,యజుర్వేదం,సామవేదం,అధర్వ వేదం అనేవి ఉన్నాయి - ఇది ఒక  భాగం మాత్రమే.అయితే,మిగిలిన అన్ని శాఖల్లోని విషయాలు అన్నీ ఈ నాల్గింటిలోని సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి.శృతి అనే విభాగంలో ఈ నాలుగూ తప్ప ఇంకేవీ లేకపోవడం వల్ల వేదం,శృతి అనేవాటిని పర్యాయపదాలుగా కూడా వాడతారు. వేదములు నాలుగు - 1.ఋగ్వేదం, 2.శుక్ల,కృష్ణ యజుర్వేదాలు, 3.సామవేదం, 4.అధర్వ వేదం. వేదాంగములు ఆరు - 1.శిక్ష(Phonetics), 2.శిక్షా కల్ప(Study of Rituals), 3.వ్యాకరణ(Grammer), 4.నిరుక్త(Etumology), 5.ఛందం(Prosody), 6.జ్యోతిషం(Astronomy). ఉపాంగములు నాలుగు - 1.మీమాంస, 2.న్యాయశాస్త్రం, 3.పురాణములు, 4.ధర్మశాస్త్రము. ఉపవేదములు అనేకం కానీ ముఖ్యమైనవి  - 1.ఆయుర్వేదం(Medical Science), 2.అర్ధశాస్త్రం(Economic Science), 3.ధనుర్వేదం(Military SCience), 4.గాంధర్వవేదం(Musical Science).


వేదాలను శృతి(Revealed) అని అంటే మిగిలినవాటిని స్మృతి(Memorizes) అని అంటారు.శృతి అనే విభాగంలో నాలుగు ఉపవిభాగాలు ఉంటాయి - ఋగ్వేదం(Collection of Prayers), యజుర్వేదం(Sacrificial Manual), సామవేదం(Rigvedic hymns in musical form), అధర్వవేదం(Magical Charms) - ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉపవిభాగాలుగా ఏర్పరచబడి ఉంది:1.మంత్రసంహిత->ప్రధానమైన భాగం.ఋగ్వేదంలోని మంత్రాలను మాత్రం ఋక్కులు అంటారు.మిగిలినవాటిని మంత్రాలు అంటారు - వీటిని అందరూ అధ్యయనం చెయ్యవచ్చు 2.బ్రాహ్మణములు->ఆయా సంహితలలోని విషయానికి వ్యాఖ్యానములతోనూ కర్మకాండలకు సంబంధించిన వివరాలతోనూ కూడుకున్న వచనభాగం - వీటిని సంహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఆసక్తి గలవారికి మాత్రమే బోధిస్తారు 3.అరణ్యకములు->ప్రతి వేదమంత్రానికీ సామాన్య అర్ధం,సాంకేతిక విశేషం,ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి గనుక వాటిమధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం - నాగరికులకూ లౌకికులకూ ఇవి అనవసరం గనక ఆచార్యత్వాన్ని కోరుకుని అరణ్యవాసానికి ఇష్టపడినవారికి మాత్రమే బోధిస్తారు 4.ఉపనిషత్తులు->ప్రధానమైన సంహిత మీద పూర్తి అధికారం కోరుకునే నమ్మకస్తులైన శిష్యులకు మాత్రమే వారి గురువులు బోధిస్తారు.

"అనంతా వై వేదాః" అని చెప్పిన ప్రకారం వేదం  మొదలూ తుదీ లేనిది. మానవులు తెలుసుకోవలసిన మొత్తం జ్ఞానం ఒక హిమాలయ పర్వతశ్రేణి అనుకుంటే, భగవంతుడి కృప వల్ల సనాతన ధార్మిక ఋషులు తెలుసుకోగలిగినది మొదట మనం చేరుకున్న పర్వతం నుంచి తీసిన మన పిడికిట పట్టగలిగిన ఇసుక కుప్ప అనుకుంటే - ఇతర దేశాల వారిని కళ్ళు చెదిరేటట్టు చేస్తున్న ఇంతటి విస్తారమైన జ్ఞానం కూడా మరీ అంత కొంచెమేనా!వేదం పరిస్థితే ఇలా ఉంటే తోరా,బైబిల్,ఖురాన్ సంగతేంటి?

"ఆదియందు వాక్యము పుట్టెను!" అని పుట్టినప్పట్నుంచీ అఘోరిస్తూ ఇప్పటికీ "ఏమిటి ఆ వాక్యం?" అని నిలదీస్తే నీళ్ళు నమలడం తప్ప ఇదీ ఆ వాక్యం అని చెప్పలేని అర్ధపాండిత్యపు కూష్మాండం గాళ్ళతో మనకి పోలికలూ జ్వాలికలూ పోట్లాటలూ కాట్లాటలూ దేనికి గానీ దేవుడు తమకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేశాడని సంబరపడిపోయి పప్పన్నం తింటూ కూర్చున్నారా మనవాళ్ళు అని చూస్తే ఏమి కనిపిస్తుంది?వైదిక సాహిత్యం మీద తులనాత్మకమైన అధ్యయనం చేసిన సర్వులూ ఒప్పుకుంటున్నది మొదట ఆవిర్భవించినది ఋగ్వేదమే నని - అంతటి ప్రాచీన కాలంలో కూడా అప్పటి ప్రజలు ఎంత వైభవోపేతమైన జీవితం గడిపారో తెలుసుకుంటే, అవి పరిశోధకులు చెప్పిన వాస్తవాలే అయినప్పటికీ నమ్మలేని విషయాల్ని నేను కల్పించి చెబుతున్నట్టు అనిపిస్తుంది - అంతటి గొప్ప సంస్కృతికి దూరం అయినందుకు మనమీద మనకే అసహ్యం కూడా పుట్టవచ్చు!

అసలు వైదిక సంస్కృతి ఎంతమేర విస్తరించిందీ అని చూస్తే మధ్యభారతంలో ఎక్కువ ప్రభావశీలమై ఉంది,ఈశాన్య భారతంలో బలహీన స్థాయిలో ఉంది,దక్షిణ భారతంలో కూడా ఉన్నత స్థాయిలోనే ఉంది,పశ్చిమాన ఆఫ్ఘనిస్థాన్ వరకు చెప్పుకోదగిన స్థాయిలోనే ప్రభావశీలమై ఉంది.అయితే, ఆఫ్ఘనిస్థానుకు ఇవతలనే ఉన్నప్పటికీ వైదిక సంస్కృతికి చెందిన హరప్పా,మొహంజెదారో వంటి నగరాల్ని కూడా కలిగి ఉన్న ప్రాంతం మననుంచి విడిపోవటం వల్ల దాన్ని వదిలేసి ఒక దేశం రూపంలో ఇప్పుడు మనకి కనపడుతున్న భూఖండమే సనాతన ధర్మానికి మూలస్థానం అని మనం గర్వించవచ్చు!

సింధు నాగరికతా నిర్మాతలుగా ఇప్పుడు తెలిసిన జనసమూహం వైదిక సంస్కృతికి చెందినవారేనా అనేది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు.మౌలికమైన విషయాలు కలుస్తున్నాయి గానీ కొన్ని అంశాలలో విభిన్నతలు కనిపిస్తున్నాయి.హరప్ప వంటివి సర్వసంపద్విలసితమైన నగరాలు అయితే వైదిక సంస్కృతికి చెందిన ప్రజలు గ్రామ్యజీవనులు.ముందు ముందు జరిగే కొత్త పరిశోధనల అనంతరం ఈ చిక్కుముడి విడిపోవచ్చు.

మొత్తం మీద వైదిక సమాజం బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర అనే నాలుగు వర్ణాలు కలిసి ఏర్పడినది.వైదిక సంస్కృతి యొక్క అతి ముఖ్యమైన లక్షణం యజ్ఞభావనతో జీవించడం - యజ్ఞం అంటే అగ్నిలో ఓషధుల్ని వ్రేల్చి వాయువుని శుభ్రం చేసి మానవులని ఆరోగ్యవంతుల్ని చేసినట్టు వ్యక్తులు తమ సంపదలో కొంత భాగాన్ని సమాజానికి సమర్పించి సమాజం నుంచి గౌరవాభిమానాల్ని పొందడం!వైదిక సంస్కృతిలోని ప్రజలు తమ జీవితాల్ని ప్రభావితం చేసే ప్రకృతి శక్తులనే దైవభావనతో అర్చించారు. అప్పటి వారు పూజించిన ప్రధాన దైవాలు వాయు(air), మరుత్(storm), ఇంద్ర(rain), వరుణ(water), సూర్య(sun), అగ్ని(fire), పృధ్వి(earth), అరణ్య(forest) - దాదాపు దృశ్యమాన ప్రపంచంలో మానవుడికి భయాన్నీ ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ క్షేమాన్నీ కలిగించే ప్రతి చిన్న అస్తిత్వం పట్ల వారు గౌరవాన్ని ప్రకటించటం ఇందులోని విశేషం!కొందరు అల్పబుద్ధులకి ఇది పిచ్చితనం అనిపించవచ్చు గానీ లోనారసి చూడగలిగిన Sylvain Levi వంటి ఫ్రెంచి ఓరియంటలిస్టులు మాత్రం "The multiplicity of the manifestations of the Indian genius as well as their fundamental unity gives India the right to figure on the first rank in the history of civilized nations.Her civilization, spontaneous and original, unrolls itself in a continuous time across at least thirty centuries, without interruption, wuthout deviation." అని ప్రశంసలు కురిపిస్తున్నారు! 


వైదిక సంస్కృతి ఎలా పుట్టిందో ఎప్పుడు పుట్టిందో తెలియనట్టే ఎంతమేర వ్యాపించింది అని చెప్పడం కూడా కష్టమే!అయినప్పటికీ వైదిక సాహిత్యంలోని కొన్ని వివరాలను బట్టి చూస్తే అప్పుడు గాంధారం అని పిలిచిన ఇప్పటి ఆఫ్ఘనిస్థాన్ నుంచి అప్పుడు ప్రాగ్జ్యోతిషం అని పిలిచే ఇప్పటి అస్సాం వరకు వ్యాపించి ఉంది కాబట్టి ఇప్పుడు ఉత్తర భారతం అంటున్న అప్పటి మధ్యభారతం మొత్తం వైదిక సాహిత్యానికి మాతృస్థానం అని చెప్పటం సమంజసంగా ఉంటుంది.

ఋగ్వేద సాహిత్యంలో యమున ప్రస్తావన లేదు.హిమశ్రేణి ప్రస్తావన ఉంది కానీ వింధ్య ప్రస్తావన లేదు.ఇప్పుడు మనం  నదులలో శ్రేష్ఠమైనది అని చెప్పుకునే గంగకి సరస్వతి అదృశ్యం కాక మునుపు ఇంతటి ప్రాముఖ్యత లేదు కాబట్టి ఒకే ఒక్కసారి ప్రస్తావించబడింది - అదీ ఋగ్వేద కాలం ఆఖరి దశలో!అబ్రహామిక్ మత సాహిత్యంలో The Graet Flood అని వ్యవహరిస్తున్న పెద్ద వరద సరస్వతిని ముంచేసింది - ఆ సమయంలో ఇక్కడినుంచి వెళ్ళినవారే యూదులు.ఈ దురదృష్టకరమైన సంఘటనకి మనస్సు చెదిరి కకావికలై తమకు క్షేమకరమైన నివాసస్థలం కోసం చేసిన ప్రయాణమే "వలసకాండ"లో రూపం మారి కనిపిస్తుంది!

ఈ సరస్వతిని తిరిగి గుర్తుపట్టడం వల్లనే "ఆర్య-ద్రవిడ సంఘర్షణ" జరిగిందనే వికృత సిద్ధాంతం అబద్ధమని తేలిపోయింది!ఇంకొక విశేషం యేమిటంటే, ఆ ప్రాచీన ఋగ్వేద సాహిత్యంలోనే సముద్రాల ప్రస్తావన ఉంది - ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తున్నారో అక్కడ సముద్రాలు లేవు కాబట్టి ఆ సిద్ధాంతాన్ని భుజాల మీద మోసుకు తిరిగిన వారందరూ అవి ఇప్పటి సముద్రాలకి ప్రత్యామ్నాయం కాదనీ అతి పెద్ద జలరాశిని ఋగ్వేద ఆర్యులు సముద్రం అని వర్ణించారనీ చెప్పాల్సి వచ్చింది.కానీ ఋగ్వేద సాహిత్యంలోనే సముద్ర జలాలు ఉప్పగా ఉంటాయన్నది వారికి తెలుసుననీ వాటిమీద నౌకలతో ఇతర భూభాగాలతో సంబంధం పెటుకోవడం గురించిన ప్రస్తావనలు కూడా ఉన్నాయనీ గమనిస్తే ఈ దేశంలోనే పుట్టి ఈ దేశపు గొప్పతనాన్ని దాచెయ్యడంలో ఆ చరిత్రకారులు ఎంత కృతనిశ్చయులై ఉన్నారో తెలుస్తుంది - అటువంటివాళ్ళు రాసిన చరిత్రని మన పిల్లల చేత చదివిస్తున్నందుకు సిగ్గు పడాలి!

వైదిక ఆర్యులు ఋగ్వేద యుగం ముగిసిపోయి తర్వాతి వైదిక సాహిత్యం ప్రభవించే కాలానికి గంగా యమునల మధ్యన ఉన్న మైదాన ప్రాంతం చేరి అక్కడి నుంచి దక్షిణాదికి కూడా వ్యాపించారు - వింధ్యనీ దక్షిణాదికి అటూ ఇటూ ఉన్న రెండు సముద్రాలనీ రెండు పర్వతశ్రేణుల్నీ ప్రస్తావించడమే అందుకు సాక్ష్యం.Henry David Thoreau అనే ప్రముఖ ఆమెరికన్ విమర్శకుడు "In the great teaching of the Vedas,there is no touch of sectarianism. It is of all ages and nationalities and is the Royal road for the attainment of the Great Knowledge" అని చెప్పిన దాన్ని బట్టి అప్పటికే సనాతన ధర్మం ప్రపంచ స్థాయికి ఎదిగిందని అర్ధం చేసుకోవాలి.

కొందరు చరిత్రకారులు అప్పటి రాజ్యం ఇప్పటి ఆటవిక తెగలను పోలి చాలా ప్రాధమిక స్థాయిలో ఉండేదని చెప్పారు.కానీ కొత్త పరిశోధకులు రంగంలోకి దిగిన తర్వాత మరొక దృశ్యం కనబడుతున్నది - ఇప్పటి ఆధునిక రాజ్యాంగ వ్యవస్థలకు దీటైన సభ, సమితి, విధాత వంటి పండితుల సమూహం రాజుకు రాజ్యపాలనలో సహకరించేది, రాజు సర్వస్వతంత్రనియంత కాడు!ఋగ్వేద సాహిత్యంలో పురోహిత,సేనాపతి అనే పదవుల ఉద్యోగుల ప్రస్తావన మాత్రమే ఉంటే మలి వైదిక యుగంలో యువరాజు వంటి కొత్త పదాల వర్ణన కనిపిస్తుంది.గోవులు ప్రధానమైన ఉత్పత్తి సాధనం కాబట్టి యుద్ధాలు కూడా "గవిష్టి" అనే పేరుతో పశుసంపదని పెంచుకోవడం కోసం జరుగుతూ ఉండేవి.

ఋగ్వేద సాహిత్యంలో లేని జనపదాల ప్రస్తావన మలి వైదిక సాహిత్యంలో కనబడుతుంది, అంటే, రాజ్యం యొక్క విస్తీర్ణం ఎక్కువయి సరిహద్దుల రక్షణ కూడా కీలకమైనదని గుర్తించారని తెలుసుకోవాలి.ఋగ్వేద సాహిత్యంలో  సైనికనిర్మితి లేదు,కానీ మలి వైదిక యుగంలో పదాతి,అశ్విక,రధిక విభాగాలతో పూర్తి స్థాయి సైనికనిర్మితి ఏర్పడింది.ఋగ్వేద సాహిత్యంలో పన్నుల ప్రస్తావన లేదు.రాజు ప్రజలు సంతోషం కొద్దీ ఇచ్చిన కానుకల్ని మాత్రం స్వీకరించేవాడు.కానీ మలి వైదిక యుగం నాటికి పన్నుల వసూలు యంత్రాంగం పూర్తి రూపం  తెచ్చుకుంది - సంగృహీతి(Treasurer).భాగదుఘ(Tax Collector) వంటి ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.


రాజ్యపు సంపదని పెంచే ఆర్ధికరంగంలో భూమిని దున్ని చేసే వ్యవసాయం,పశుపాలన మీద ఆధారపడిన వ్యాపారం అనే రెండు పద్ధతులూ లాభసాటిగానే ఉండేవి.ఈ రెండు రకాల ఆర్ధికరంగాల్లోనూ కీలకమైన పాత్రని పోషించడం వల్లనే గోజాతికి అంతటి విశిష్టమైన స్థానం లభించింది - గోపూజ అనేది ఆ జాతి తమకు కలిగిస్తున్న సౌభాగ్యానికి కృతజ్ఞతను తెల్పడం లాంటిది,కృతజ్ఞత అంటే ఏమిటో తెలియనివాళ్ళే హిందువుల గోపూజనీ నదీపూజనీ విమర్శిస్తారు.Carpenter, Potter, Blacksmith, Goldsmith, Gem-Specialist, Hunter, Star-Gazer/Astronomer, Chariot-Driver, Dancer,Singer, Musician, Fisherman, Merchant,Surgeon వంటి వాటిని ఎక్కువ ప్రస్తావించడం వల్ల ఈ వృత్తులు మంచి ఆదాయం తెస్తూ ఉండేవని అనుకోవాలి.Elephant-rearer, Shepherd, Weapon-Manufacturer, Conch-Blower, Gardener, Watchman, Calculation-Expert వంటి వృతులను కూడా అక్కడక్కడ ప్రస్తావించారు.వీరిలో ఆర్ధికవ్యవస్థకి సంబంధించిన లావాదేవీల్ని లెక్కించే గణకులు(Calculation-Experts) ఇప్పటి NRIల మాదిరి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా తెచ్చేవారు - ఇక్కడి గణకుల్ని ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు!

మలి వైదికయుగం పూర్తయ్యేసరికి పురోహిత-రాజరిక వ్యవస్థలు పరస్పరాశ్రితం అయ్యాయి.రాజు యొక్క అర్హతానర్హతల్ని నిర్ణయించడం,రాజును మూర్ధాభిషిక్తుణ్ణి చెయ్యటం,రాజు చేత సత్కార్యాలు చేయించి కీర్తిని పెంచడం పురోహితుల విధి.దీనికి బదులు పురోహితులకి గౌరవమర్యాదల్నీ ఆర్ధిక భద్రతనీ కలిగించడం రాజపురుషుల విధి.

సామాజిక జీవితంలో కుటుంబవ్యవస్థ బలమైనది - అప్పటి కుటుంబాలూ ఇప్పటి కుటుంబాలూ ఒక్కటి కావు,అప్పటి కుటుంబాలు ఇప్పటి గోత్రాలకి సమానం!అంటే,ఇవ్వాళ్టి గోత్ర పురుషుడు తొలినాళ్ళలో తండ్రి యొక్క కుటుంబం నుంచి విడిపోయి గానీ ఆర్ధికంగా ఎదగటం వల్ల కొత్త గుర్తింపును తెచ్చుకోవటం వల్ల గానీ సొంత ఇల్లు కట్టుకుని తన పేరున ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకునేవాడు.అతని తర్వాతి తరాల వాళ్ళు అతని కుటుంబం అయ్యేవాళ్ళు - ఉమ్మడి కుటుంబం కాబట్టి తండ్రి కావచ్చు తాత కావచ్చు ముత్తాత కావచ్చు ఎవరు జీవించి ఉంటే ఆ వ్యక్తియే కుటుంబానికి యజమాని.తొలి తరం కుటుంబపెద్ద పేరున గోత్రం స్థిరపడింది.


ఈ కుటుంబపెద్దనే గృహపతి అని పిలిచారు.ఒక్క యజమాని హోదా లేదనే తప్ప కుటుంబపెద్ద యొక్క భార్యకి సర్వాధికారలు ఉండేవి.ఒక విధంగా చూస్తే పురుషుడు సామాజిక జీవితం మీద దృష్టి కేంద్రీకరించడం,స్త్రీ కుటుంబ పాలన చెయ్యడం అనే సర్దుబాటు అది - గృహిణి,గృహం అనేవి విడదీయలేని అంశాల కింద పేర్కొనడాన్ని బట్టి గృహపతి,గృహపత్ని ఇద్దరికీ సమాన స్థాయి ఉన్నదనేది స్పష్టం!పురుషుడికి కుటుంబ యాజమాన్యం దఖలు పర్చటం అనేది కుటుంబం యొక్క ఉమ్మడి ఆస్తుల మదింపు,వారసత్వ విభాగం,ఇతరులతో భాగస్వామ్య ఒప్పందాలు, రాజ్యానికి కట్టవలసిన పన్నులు వంటివాటిలో చిక్కులు రాకుండా చేసిన ఏర్పాటు కావచ్చు - పురుషుడికి గల ఈ సాంకేతికపరమైన వెసుబాటును తీసేస్తే బాధ్యతలు మాత్రం ఇద్దరికీ సమానంగానే ఉండేవి.

"కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయేషు ధరిత్రి - షట్కర్మ నారి కులధర్మపత్ని" అని స్త్రీలకి మాత్రం సుత్తేసి వూరుకోలేదు."కార్యేషు యోగి, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః, క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖమిత్రం - షట్కర్మ యుక్తః ఖలు ధర్మనాధః" అని పురుషులకి కూడా నొక్కి చెప్పారు.

ఇంటా బయటా స్త్రీకి వైదిక సమాజం ఇచ్చిన భాగస్వామ్యాన్ని గమనిస్తే ఈ కాలపు ఆండోళ్ళు మమ్మల్ని వేదకాలంలోని మగాళ్ళు చూసుకున్నట్టు చూసుకోండని రాండోళ్ళు మోగించటం ఖాయం - మహిళలకు వైదికయుగం స్వర్ణయుగమే!బహుభార్యాత్వం  అనేది రాజకీయ అవసరాల కోసం రాజులకీ పై స్థాయి వారికి మాత్రమే పరిమితమైంది.నూటికి నూరు శాతం స్వతంత్రత అంటే ఒక విధమైన అరాచకత్వమే,నూటికి నూరు శాతం సమానత్వం అంటే ఒక విధమైన అసంతుష్టత్వమే - పురుషుడికీ నియమాలూ నిబంధనలూ ఉన్నప్పుడు స్త్రీకి రక్షణనీ గౌరవాన్నీ మర్యాదనీ ఇవ్వటం కోసం చేసిన ఏర్పాట్లని కూడా అన్యాయం అనేవాళ్ళు నైతికభ్రష్టత్వాన్ని కోరుకుంటున్నారని అర్ధం చేసుకోవాలి.బాల్యవివాహం అనేది ఆనాడు లేదు - స్త్రీకి యుక్తవయస్సు వచ్చాకనే వివాహం,అదీ పెద్దల నిర్ణయం/ఆమోదంతో పనిలేని స్వయంవరం అనే ఏర్పాటు కూడా ఉన్నది!భర్త చనిపోతే ఇప్పటివలె జీవితాంతం ఒంటరితనం అనుభవించనక్కరలేదు - విధవలకు పునర్వివాహం ధర్మబద్ధమే!


యజుర్వేదం 10:03 women should be valiant అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should earn fame అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should be scholars అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should be illuminating అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should be wealthy అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should be intelligent అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should take part in legislative Chambers అని చెబుతుంది.ఋగ్వేదం 10:85:46 women should lead nation as a ruler అని చెబుతుంది.అధర్వవేదం 09:09:02 women should Ride on Chariots అని చెబుతుంది.యజుర్వేదం 16:44 women should participate in war అని చెబుతుంది.

వేదాధ్యయనం చెయ్యాలనుకున్న స్త్రీలకి ఉపనయన సంస్కారం ద్వారా  అర్హత కల్పించబడుతూ ఉండేది.అపాల,ఘోష వంటి స్త్రీలు మంత్రద్రష్టలై ఋషిత్వాన్ని కూడా సాధించారంటే ఇంక అసమానతకి తావు యెక్కడ?సృష్టిలోని చలనానికి కారణమైన శక్తికి స్త్రీ రూపం ఇచ్చి సృష్టికి కర్తయే ఆమె అబి చెబుతుంటే హిందువుల మతగ్రంధాలు స్త్రీని రెండవ స్థానంలోకి నెట్టేశాయి అనేది అర్ధం లేని వాదన.వైదిక యుగంలో ఆలయ నిర్మాణం కానీ మూర్తిపూజ కానీ లేదు.ఉభయ సంధ్యలలో చేసే వ్యక్తిగత ప్రార్ధనలూ యజ్ఞం జరిగే సందర్భాలలో చేసే సామూహిక ప్రార్ధనలూ తప్ప మరొక రకమైన ఆరాధనా పద్ధతి లేకపోవటం వల్ల "అగ్ని" అనే పురుషదేవతాస్వరూపం ఒక్కటే ఎక్కువ కీర్తించబడుతూ ఉండేది. తర్వాత కాలంలో ప్రముఖ స్థానం పొందిన బ్రహ్మ(god of creatoion),విష్ణు(god of nourishment),మహేశ్వరుల(god of annihilatio) కన్న ముందు సరస్వతి(godess of cducation),లక్ష్మి(godess of affluence),పార్వతి(godess 0f protection) అనే త్రిమాతలు వైదికయుగంలోనే ప్రముఖస్థానం  పొందారు.వీళ్ళని జంటల్ని చేసింది హిందూద్వేషులు అనుకుంటున్నట్టు వాళ్ళ కామతృష్ణని తీర్చటం కోసం కాదు: creation-education అనే వాటి మధ్య complementary relationship, nourishment-affluence అనే వాటి మధ్య projectile relationship, annihilation-protection అనే వాటి మధ్య supplementary relationship ఉంటాయి అని ఆర్యఋషులు చెబుతున్నట్టు అర్ధం చేసుకోవాలి.

కాళిక అనే దేవత శివుడు అనే దేవుడి అర్ధాంగి - శివుడికి ఈ దేవత పేరు లాంటిదే అయిన కాళుడు అనే పేరు కూడా ఉంది.annihilation అనే ఒక తత్త్వానికి కాళుడు పురుషరూపం అయితే కాళిక స్త్రీరూపం అవుతుంది - వీళ్ళిద్దరూ చేసేది దుర్మార్గుల్ని annihilate చెయ్యటం ద్వారా సన్మార్గుల్ని protect చెయ్యటం.అయితే హిందూమతానికి సంబంధించిన ఈ కాళి అనే దేవతకి మెక్సికో ప్రాంతంలో దేవాలయం ఉండటానికి కారణం ఏమిటి?కాలిఫోర్నియా నగరం పేరులో ఉన్నది కాళియే - నిజం!సమస్త ఇశ్రాయేల్ అని అర్ధం వచ్చే హీబ్రూ భాషలోని kal-Israel ఆనె పదం నుంచి తొంగి చూస్తున్నది కూడా కాళికయే - Kal Yisroel:All Israel[to be found in jewish glossory].అమెరికా ఖండం లోని ప్రాచీన మయన్ నాగరికత నిర్మాతల జాతినామంలో ఉన్నది కూడా మాయ అనే హిందూ దేవత నామధేయమే!ప్రాచీన aztec సమూహం అజ మహారాజు పేరునే తమ జాతినామం కింద స్వీకరించారు!అక్కడా ఇక్కడా అని లేదు ఒకప్పుడు ప్రపంచం మొత్తం సనాతన ధర్మపు ఆదిప్రణవనాదమే ప్రతిధ్వనిస్తూ ఉండేది!ఇప్పటి క్రైస్తవం పుట్టిన జుదాయిజం సర్వమూ షివమయమే - Ish, Yish, Is, Isa,Issa వంటి దైవసంబంధమైన సంబోధనలు అన్నీ శివనామం యొక్క అపభ్రంశ రూపాలే!బైబిలు పాత నిబంధనలోని వ్యక్తుల పేర్లూ ప్రాంతాల పేర్లలో సంస్కృత మూలాలు స్పష్టంగా కనబడతాయి - yahweh యొక్క consort పేరు asura!న్యూయార్క్ నగరంలో యూదులు తమకోసం నిర్మించుకున్న యూనివర్సిటీకి yeshiva university అని పేరు పెట్టుకున్నారు!పాత నిబంధనలో తరచు కనిపించే seven అనే సంఖ్యాపదం కూడా శివనామమే - He is the Lord of Seven Worlds, Seven Rivers, Seven Churches!భయదనర్తనం చేసే హిందూ దేవుడైన ప్రళయ కాలరుద్రుడినే క్రైస్తవులు తీసుకుని "యహోవా రోషము గల దేవుడు!" అని చెప్పుకున్నారు.వలసకాండలో కనిపించే యహోవా యొక్క ఉగ్రత్వం పరమశివుడు ప్రళయతాందవం చేస్తున్నప్పడు జరిగే భీబత్సాలకి సంబంధించిన వర్ణన!అయితే హిందువుల శివుడికి మనుషులు ధర్మహాని చేస్తూ సాధుసజ్జనుల్ని హింసిస్తే కోపం వస్తుంది,క్రైస్తవుల యహోవాకి మనుషులు యెన్ని తప్పుడుపన్లు చేసినా పర్లేదు గానీ తనని నమ్మకపోతే మాత్రం కోపం వస్తుంది.హిందువుల దేవుడు మనుషులు తనని నమ్మకపోయినా మంచిగా ఉంటే చాలు కటాక్షిస్తాడు,క్రైస్తవుల దేవుడు మనుషులు మంచిగా ఉన్నా తనని నమ్మకపోతే తప్పకుండా శిక్షిస్తాడు.

పరం గురించి ఆలోచించే అవసరం లేని ఇహం లోని అన్ని పార్శ్వాలనూ కూలంకషం తడిమిన వైదిక యుగం నాటి భారతీయసమాజానికి సాటి రాగలిగిన మరొక మానవ సమాజం అప్పుడే కాదు భూమి మీద ఇప్పుడు కూడా లేదు. భక్తియార్ ఖిల్జి నలంద దహనం దగ్గిర్నుంచి ఇప్పటివరకు గడచిన సుమారు వెయ్యేళ్ళ కాలం వైదిక సంస్కృతికి చీకటియుగం అని చెప్పాలి.!భక్తియార్ ఖిల్జి వంటివాళ్ళు దోచుకున్నంత సంపద దోచుకుని సంస్కృతిని ధ్వంసం చేసి పోవటానికీ ఇతర్లు ఇక్కడ తిష్ఠ వేసుకు కూర్చుని అధికారం ఆశ చూపించి మనలోని కొందర్ని మన సంస్కృతికి శత్రువులను చెయ్యటానికీ ఆ సంస్కృతిని అంటిపెట్టుకుని ఉండటం వల్ల ఈ దేశానికి పట్టిన వైభవం వారిలో ఈర్ష్యను రగిలించటమే కారణం!

“ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః క్రోధనో నిత్యశంకితః
పరభాగ్యోపజీవీ చ షడేతే దుఃఖభాగినః”
ఇది నారాయణ పండితుని హితోపదేశం, మిత్రలాభం లోని శ్లోకం. ఒకరిని చూచి ఈర్ష్య పడేవాడు, అత్యాశాపరుడు, సంతృప్తి లేనివాడు, కోపస్వభావం కలవాడు, నిత్యశంకితుడు, ఇతరుల సంపదపై ఆధారపడి జీవించేవాడు – ఈ ఆరుగురు నిత్య దుఃఖితులని ఈ శ్లోకం చెప్తోంది.



అలాంటి ఈర్ష్యాళువుల కన్ను వైదిక యుగం నుంచీ సా.శ 17వ శతాబ్దం వరకు ప్రపంచం మొత్తం మీద పుట్టే సంపదలో మూడొంతుల నుంచి నాలుగొంతులకి తగ్గకుండా సృష్టించగలిగిన భారతదేశం మీద పడింది - అంతటి వైభవమూ నరుడి కంటికి నల్లరాయి పగులుతుందన్నట్టు పిగిలిపోయింది!

సృష్టికి ముందునుంచే ఉనికిలో ఉండి తను గోచరం కావడం వల్లనే బ్రహ్మకు కూడా మోహాన్ని చెదరగొట్టి సృష్టి రచనకు కావలసిన శక్తియుక్తులని ప్రసాదించి సృష్టిని నడిపిస్తున్న వైదికధర్మం భారతీయ సమాజంలో ఒక వెయ్యేళ్ళ పాటు తన ప్రాభవాన్ని కోల్పోవడం ఏమంత పెద్ద విషయం కాదు.హిందువులు తమ పొరపాటును గ్రహించారు.వేదం పట్ల ఆసక్తి పెరిగింది.పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి సాధించాలనే పట్టుదల కనిపిస్తున్నది.అయితే సామాజికులలో కనిపిస్తున్న ఈ అంకితభావం రాజకీయవాదులలో కనిపించడం లేదు.వైదిక సంస్కృతి తిరిగి లేస్తున్నదని పసికట్టిన హిందూద్వేషులు కూడా దాడిని పెంచిన తరుణంలో బలమైన రాజకీయ నాయకత్వం లేకపోతే దాడిని ఎదుర్కోవటమూ తిప్పికొట్టటమూ కష్టమౌతుంది.అలాంటి రాజకీయ సంఘటన జరగడానికి కూడా హిందువులు తమ జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవాలి.

మన మతాన్ని బలహీనం చెయ్యడానికి హిందూద్వేషులు మూడు ముఖ్యమైన విషయాలని ఎంచుకున్నారు - 1).బ్రాహ్మణాధిక్యత,2).మూర్తిపూజ మరియు బహుళదేవకీర్తనం, 3).పురాణకధలలోని అసంబద్ధత అనేవి.నిజానికి వాళ్ళు హిందూమతంలోనే ఉన్నాయని చెబుతున్న ఇవే లోపాలు వాళ్ళ మతాల్లో కూడా ఉన్నాయనేది వాళ్ళకి తెలియటం లేదు.

"బ్రాహ్మణులు హిందూమతానికి సంబంధించిన అన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని ఒళ్ళలిసే పనులకి పోకుండా కూర్చుని తింటూ ఇతర్ల మీద పెత్తనం చేస్తున్నారు!" అనేవాళ్ళకి క్రైస్తవంలో పాస్టర్ల్కూ ఇస్లాములో ముల్లాలూ కూడా రికామీగా తిరుగుతూ జనం మీద పడి బతకటం ఎందుకు కనిపించటం లేదు?మనం చేస్తున్న స్థాయిలో కాదు గానీ క్రైస్తవులు శిలువకీ ముస్లిములు నల్లరాయికీ చేస్తున్నది కూడా ఒకింత తక్కువ స్థాయిలోని మూర్తిపూజయే కదా!మనకున్న విస్తారమైన పౌరాణిక సాహిత్యంలో అక్కడొకటీ ఇక్కడొకటీ తప్పులు కనిపెడుతున్న వాళ్ళకున్న అతి తక్కువ పురాణకధల్లోనే లెక్కలేనన్ని బూతులు కనపడుతున్నాయి కదా!వాళ్ళ మతసాహిత్యం మనకి తెలియదని వాళ్ళ ధైర్యం - ఒకవేళ తెలుసుకుని రెట్టించి అడిగితే "ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు!మేం మీలో తప్పులు పడితే తిరిగి మీరు మాలో తప్పులు పడితే అది ఉడుకుమోత్తనం అవుతుంది కానీ మీ మతం మా మతం కన్న గొప్పదని ఋజువు చేసినట్టు కాదు!" అని అడ్డం తిరిగి వాదిస్తారు.

వాళ్ళ పురాణ కధలు మన పురాణ కధల నుంచి కాపీ కొట్టినవి కాబట్టి వాటి అసలు అర్ధం వాళ్ళకి తెలియదు,కానీ మనం మన పురాణ కధలకే కాక వాళ్ళ పురాణ కధల వెనక ఉన్న అసలైన అర్ధం కూడా చెప్పగలం - ఎందుకంటే, మన పౌరాణిక సాహిత్యకర్తలు వైదిక సాహిత్యంలో కనిపించే శాస్త్రీయతకి లోబడే ఆ రచనల్ని కూడా చేశారు!ఉదాహరణకి శివుడూ విష్ణువూ ఒకరితో ఒకరు యుద్ధం చెయ్యటం, బ్రహ్మ శివుడి భార్యకేసి కసిగా చూడటం,శివుడు బ్రహ్మ తలని గోటితో తుంచెయ్యడం,తన గోరుకి అతుక్కున్న బ్రహ్మకపాలాన్ని వదిలించుకోవడానికి శివుడు భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలని సందర్శించడం లాంటి కధల్ని సృష్టి నడవటానికి కారణమైన "మాయ - లీల" అనే శక్తులను గురించి ప్రజలకి అర్ధం అయ్యేటట్లు చెప్పటం కోసం కల్పించారు.

వేదంలోనూ భాగవతంలోనూ పురాణాలలోనూ అసలు సృష్టి ఎలా జరిగిందనేదానికి ఒకే ఒక విశ్లేషణ ఉంది - పదార్ధ తత్త్వాలు అన్నీ మహత్తత్వం అనే మాయ వల్లనే ఏర్పడుతాయి.ఈ మాయ కూడా ఈశ్వర స్వరూపమే కాబట్టి జీవులు కూడా పరమేశ్వరుని నుంచి ప్రభవించిన పరమేశ్వరుని స్వరూపాలే కానీ ఆ సత్యాన్ని జీవులు తెలుసుకోలేవు - కారణం మాయ తనకు తనే ఒక ముసుగులా మారి జీవులకి తమలోని ఈశ్వరతత్త్వాన్ని గ్రహించే వీలు లేకుండా చేస్తుంది.ఈ ముసుగు తొలగిపోతే సృష్టిని నడిపిస్తున్న పరమేశ్వరుని లీల తెలుస్తుంది - అదే మోక్షం!అయితే , మాయ ముసుగును వేసినది భగవంతుడే కాబట్టి ఆయన తనంతట తను తొలగించడు - అది జీవుడు ప్రయత్నపూర్వం చెయ్యాల్సిన దుష్కర కార్యం.

అసలైన సృష్టికర్త ఒక్కడేననీ ఆ ఏకేశ్వరుడిని మనం కంటితో చూడలేమనీ సాక్షాత్తూ వేదం చెబుతూనే ఉంది,భాగవతంలోని విరాట్పురుష వర్ణన ప్రకారం అనంతకోటి విశ్వాలలోని ప్రతి విశ్చమూ మన విశ్వం యొక్క నిర్మితినే పోలివింటుంది.విశ్వాన్ని నిలబడి ఉన్న  అండంలా వూహించుకుంటే కింద మహావిష్ణువూ పైన మహాశివుడూ ఉంటారు.నిరంతరం ధ్యానమగ్నులై ఉంటూ మాయకు లోబడకపోవటమే వీరి ప్రత్యేకత - దృశ్యమాన ప్రపంచం నిర్మించబడిన మాయావరణానికి లోపలనే ఉన్నారు కాబట్టి సర్వేశ్వరుడి లీలావినోదం ప్రకారమే వీరు కూడా అప్పుడప్పుడు మాయకు లోబడుతూ ఉంటారు. మాయ కూడా ఈశ్వరస్వరూపమే కాబట్టి దానికి లోబడటం నేరమో ఘోరమో కూడా కాదు.ఎటూ అది ముసుగే కాబట్టి ప్రధానపాత్ర దాన్ని లాగిపారేసి అసలు తత్త్వాన్ని చూడటంతో కధ పూర్తయిపోతుంది, అంతే!

ఏసు శిష్యులు "నీవు రెండవ తూరి ఎప్పుడు వత్తువు?" అని అడిగి "మీరు జీవించియున్న కాలముననే వత్తును!" అని క్రీస్తు చెప్పిన జవాబు విని గంపెడాశతో బతికినంతకాలం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి వాళ్ళు చచ్చిపోయిన ఇన్ని తరాల తర్వాత కూడా బూర వూదుకుంటూ వచ్చే క్రీస్తు రెండవ రాకడ కోసం చెవులు రిక్కించుకుని ఎదురు చూస్తున్న గొర్రెలకి ఇవన్నీ అర్ధం కాకపోయినంతలో నష్టమేమీ లేదు గానీ ఇలా అర్ధం తెలుసుకుని ధృఢమైన నమ్మకం పునాదుల మీద నిలబడిన హిందువులు లక్ష డాలర్లు ఇచ్చినా మతం మారిపోరు.

అప్పుడు గాంధారలో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది, సింధ్ హిందువులు మతం మారారు పాకిస్తాన్ అయ్యింది, ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది, ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది, బెంగాలులో మతం మారారు బంగ్లాదేశ్ అయ్యింది.

ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల "మతం మారండి మతం మారండి" అని. మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని, మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది. మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే!

ప్రపంచ చరిత్రలో:ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి ->ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->గ్రీకు నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->మాయన్ నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->మంగోలియా నాగరికత నాశనం అయ్యింది, క్రైస్తవం అడుగుపెట్టింది->చైనీస్ నాగరికత నాశనం అయ్యింది

భారత చరిత్రలో:ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->అఖండ భారతం ముక్కలయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->కుల గొడవలు పెంచారు, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->సనాతన సామాజిక వ్యవస్థ ను కూల్చారు, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెడుతున్నారు.

మళ్ళీ వీళ్ళెవరో కాదు,సరస్వతి ఎండిపోయినప్పుడు అటువైపుకు వలసపోయి  మూలంతో సంబంధం తెగిపోయి పోగొట్టుకున్న పాలు తేనెలు పొంగిపొర్లే పాడిపంటలతో నిండిన భూతలస్వర్గం కోసం అలమటిస్తున్న మందభాగ్యుల వారసులే!ఎక్కడ పోగుట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్నట్టు తిరిగి వైదిక సంస్కృతిని పునరుద్ధరించడం వల్లనే మనం క్షయం లేని వృద్ధిని సాధించి ప్రపంచానికి శాంతిభద్రతల్ని ప్రసాదించగలమనేది వ్యాసపరాశరాదిషిర్దిసాయినాధపర్యంతం ఉన్న గురుపరంపర పాదాల సాక్షిగా నేను చెబుతున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

Tuesday, 9 October 2018

భీష్ముడు కూడా శ్రీమహావిష్ణువు అవతారమేనా?ఎందుకు కాకూడదు - స్వఛ్చంద మరణమూ అవతార పరిసమాప్తీ ఒకటే కదా!

ప్రథమ స్కంధము : ఉపోద్ఘాతము
1-1-శా.
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.

భావము:
సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరి తనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. 

హరివాక్యం:
ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధ ప్రారంభ పద్యం - భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమానమైన పద్యం. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే ఆరు అద్భుత ప్రయుక్తాలు భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షణ చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు. 

పోతన గారి గురించి మనకి చాలా కల్పిత కధలు ఉన్నాయి.ఆయనొక బీదరైతు అనుకుంటూ ఉంటారు చాలామంది ఆ కధల్ని బట్టి.కానీ తన తాత తండ్రులైన భీమన సోమనలకు చేర్చిన మంత్రి అనే పదం వాళ్ళు రాజసభలో మంత్రిగా ఉందేవాళ్ళని సూచిస్తున్నది - ఇప్పటి ప్రభుత్వోద్యోగులకి ఉండే ఇలాంటి బిరుదుల్ని ఆ హోదా లేనివాళ్ళు పెట్టుకోకూడదు కదా!ఇతనికి మాత్రం ఆ పొడ గిట్టక స్వతంత్రజీవనం గడిపాడని అనుకోవచ్చు."మనుజేశ్వరాధములు" అనే మాట ఛందస్సు కోసం వాడినట్టు కాక మనస్సులో ఉన్న కసిని బయటపెట్టుకుంటున్నట్టు పద్యం మొత్తం మీద ఖంగున మోగుతుంది!

ఇప్పుడు మనమనుకుంటున్నట్టు ఏదో మారుమూలాన నాలుగైదెకరాల మడక దున్నుకుంటూ బీదరికం అనుభవించే దుర్గతిలో లేడనీ లౌక్యం తెలిసిన పెద్ద రైతు అనీ అనుకోవాలి.అదీగాక,ఆనాడు కూడా కవిత్వం రాయాలంటే తను రాయడానికి తాళపత్రాలు సిద్ధం చేసుకోవడం దగ్గిర్నుంచీ ప్రచారం కోసం ప్రతులు తీయించడం వరకూ ఇవ్వాళ్టి లాగానే చాలా శ్రమా వ్యయమూ కలిసిన వ్యవహారం - అందుకే అప్పుడూ ఇప్పుడూ కవులకీ కళాకారులకీ రాజాశ్రయం తప్పదు!ఇతనికి తగినంత ధనం ఉన్నది గనక రాజాశ్రయం అవసరం లేకపోయింది,అవసరం లేదు గనక తిట్టగలిగాడు!

మధురాధి పతే రఖిలం మధురం అన్నట్టు పోతన గారి కవిత్వంలో రమ్యం కాని భాగం ఏదీ లేదు!ప్రస్తుతానికి భీష్మ పితామహుడు అవతార పరిసమాప్తి ముందు సాక్షాత్తూ శ్రీకృష్ణుణ్ణి చూస్తూ స్తుతిస్తూ చెప్పిన పద్యాలను గురించి చెప్పాలనుకుంటున్నాను.గతంలో గరికపాటి వారు "హయరింఖాముఖ,కుప్పించి యెగసిన" పద్యాలను గురించి చెప్పటం విన్నాను.చాలా బాగా చెప్పారు.అయితే,ఇప్పుడు నేను వాటిని చదువుతున్నప్పుడు కొన్ని కొత్త ఆలోచనలు పుట్టాయి.వాటిని మీతో పంచుకుంటాను.

ప్రథమ స్కంధము : భీష్మనిర్యాణంబు


హరివాక్యం:
అవతార పురుషులైన శ్రీరాముడూ శ్రీకృష్ణుడూ తమ కార్యం పూర్తి కాగానే తమ పార్ధివ దేహాల్ని విడిచిపెట్టి నిజస్థానం చేరిన విధంగానే అర్జున  శస్త్రాలకి ఖిలమై నీరసించిన ప్రాణజ్యోతిని దేహధర్మానుసారం అప్పుడే పోనివ్వకుండా నిలిపి ఉంచి తను కోరుకున్న సుముహూర్తంలోనే విడువగలిగిన భీష్ముడి నిర్యాణం ఆ ఇద్దరి అవతార పరిసమాప్తికి సమానమైనదే!


ఇతని జననం కూడా విశిష్టమైనదే - శివపత్ని అయిన గంగ ఇతని కోసం మానవదేహం దాల్చి శంతనపత్ని కావలసి వచ్చింది!ఇతను తొలిసారి తన తండ్రికి దాదాపు పన్నెండేళ్ళ వయస్సులో కనిపిస్తాడు.అక్కడ సంవత్సరం చెప్పినట్టు చూడలేదు నేను,కానీ పూర్తి యవ్వనంలో ఉన్నట్టూ చెప్పలేదు, మరీ పసిబాలుడిలా ఉన్నట్టుగానూ చెప్పలేదు - కాబట్టి ఉజ్జాయింపు అంచనా వేశాను.శ్రీకృష్ణుడి జనన కధనం ప్రకారం తను బొడ్డు తాడు తెంచుకుని పుట్టలేదు - మొదట పన్నెండేళ్ళ బాలుడిలా కనబడి నేను మీకు పుత్రుడినౌతున్నానని చెప్పి మరుక్షణం దేవకి ఒడిలో శిశువులా చిరునవ్వులు చిందిస్తూ కనబడతాడు. బౌద్ధమతానికి ప్రారంభకర్త అయిన గౌతమ బుద్ధుడు కాక విష్ణువు అవతారమైన సుగత బుద్ధుడు పెంపుడు తండ్రి ముందు కనబడినప్పటి వయస్సు పన్నెండేళ్ళు అని చాలా స్పష్టంగా ఉంటుంది!

అసలు రహస్యం ఏమిటో తెలియడం లేదు గానీ బాల వటువుగా బలిని సందర్శించే వామన మూర్తి కూడా దాదాపు పన్నెండేళ్ళ వయస్సులో ఉండటమూ కపిలముని తన తల్లికి జ్ఞానబోధ చేసినప్పటి వయస్సు కూడా ఇదే స్నిగ్ధయవ్వనం కావడమూ నేను గమనించాను.అన్నింటి మధ్యన బలమైన కారణం ఉంటే పెద్దలు చెప్పాలి - అది నా ప్రస్తుత జ్ఞానానికి అతీతమైన విషయమే!బహుశా వేదాధ్యయనం మొదలుపెట్టడానికి నిర్దేశించిన వయస్సు కావచ్చునని నేను వూహిస్తున్నాను.

అలా జనన మరణ విశేషాలు రెండింటిలో వాసుదేవసముడైన శ్రీ భీష్మ పరంధాముడు కట్టెదుట నిల్చిన శ్రీ కృష్ణ పరంధాముణ్ణి చూసి ధన్యుడై సాటి మానవులు తరించడం కోసం కొన్ని దివ్యమణుల్ని వెదజల్లుతున్నాడు!

1-219-మ.
"త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
భావము:
“ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన మా శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.

1-220-మ.
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.
భావము:
గుఱ్ఱాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా ఎఱ్ఱగా అవుతున్నా; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.

హరివాక్యం:
గుఱ్ఱాల్నీ,వాటి కాలి గిట్టల్నీ,వాటినుంచి రేగిన  ధూళిని కూడా వర్ణించాలా?అవేం అందమైన అమ్మాయిల కళ్ళా,చెంపలా,పెదవులా,వక్షోజాలా,నడుమా,పిరుదులా,తొడలా,పాదాలా - అబ్బో!ఆనాటి ప్రబంధ కవుల నుంచీ ఈనాటి సినిమా కవుల వరకూ పోల్చని పోలిక లేదు.అయినా తనివి తీరడం లేదు.ఈయనేమిటండీ,గుర్రాల మీదా వాటి కాలిగిట్టల మీదా వాటినుంచి పైకి లేస్తున్న దుమ్ము మీదా ఇంత అందమైన పద్యం చెప్పాడు!

కుసింత వెరైటీ కోసం చెప్పాడా!కాదండి!ఆ గుర్రాల్ని పొగడాల్సిందే!వాటి అదృష్టమే అదృష్టం!ఏ క్షణాన సారధిత్వానికి ఒప్పుకున్నాడో ఆ క్షణం నుంచీ వాటికి ఆయన చేసిన సేవలు ఎలాంటివో చూడండి!మేత పెట్టటం,నీళ్ళు తాపించడం,ఒళ్ళు కడిగి శుభ్రం చేయడం,మెత్తని శయ్యలు అమర్చడం,వాత్సల్యంతో ఒళ్ళంతా నిమురుతూ కబుర్లు చెప్పడం - యశోదానందులకి చేశాడా దేవకీ వసుదేవులకి చేశాడా రుక్మిణీ సత్యభామలకి చేశాడా ఇవన్నీ!

పెద్దలు ఏమిటో చెప్తారు, కొందరు దేవతలూ ఋషులూ  శ్రీమహావిష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తున్నాడని తెలియగానే కోతులై పుట్టారనీ శ్రీకృష్ణుడిగా అవతరిస్తున్నాడని తెలియగానే గోపికలై పుట్టారని.ఈ లింకులు కలిపే పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే శ్రీకృష్ణుడి బొటనవేలికి గాయం చేసినవాడు రామాయణ కావ్యంలోని వాలి అనేవరకు వెళ్ళింది! వాలి పగ తీర్చుకోవటం కోసం వరం పొంది మళ్ళీ పుట్టటం అంటే వాణ్ణి చంపటం అన్యాయం అంటున్నట్టు కాదూ!మూడు కాలాలనీ ముడి వేసి చూడగలిగిన వాడూ యోగశక్తితోనే తనువు చాలించగలిగినవాడూ గాంధారి శాపాన్ని మన్నించడం కోసం ఒక మిషని కల్పించుకోవడానికి మామూలు బోయవాడు చాలడా?రామాయణ కాలం నాటి వాలి మళ్ళీ జన్మ యెత్తి రావాలా!పౌరాణికులు ఇలాంటి అతి చేష్టల్ని తగ్గించుకోవాలి.ఇంతకీ అంతటి మేధావులు శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకుంటాడని తెలిసి ఆడుకోవడంతోనే సరిపెట్టుకున్నారు గానీ ఈ గుర్రాలై పుట్టాలని ఎవరూ అనుకోలేదేమిటో - ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్సయ్యారు?



ఇలాంటివి అదృష్టంతో రావండి!అర్హత ఉండాలి.మానవజాతిలో అపుడప్పుడూ కొందరు జాతవేదులు ప్రభవిస్తారు - కాలానికి అవసరమై పుట్టిన ముహూర్తం వల్లనో, పుట్టి పెరిగిన కుటుంబ వాతావరణం వల్లనో,మిత్రబాంధవ సంపర్కం వల్లనో కొందరికి ప్రత్యేకించి గురువులెవరూ లేకపోయినా తమ జన్మకారణం తెలుస్తుంది.ఆ జాతవేదులనే ఈ అశ్వాల రూపంలో భావించితే అర్ధం అద్భుతః అనిపిస్తుంది - దైవకార్యం నెరవేర్చే జాతవేదులకి కూడా భగవంతుడు ఇవే సేవల్ని చేస్తాడు!మహాకవి పోతన ఇక్కడ స్మరిస్తున్నది అలాంటి జాతవేదులనే!

1-221-మ.
నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.
భావము:
ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తూ రథాన్ని తీసుకు వెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో, కౌరవపక్ష రాజు లందరిని పేరుపేరునా చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో -  ఆ శ్రీకృష్ణపరమాత్మ నా హృదయపద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక.

1-222-క.
తనవారిఁ జంపఁజాలక
వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.
భావము:
రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుదీస్తున్న ధనుంజయునికి మహా మహిమాన్వితమైన గీతోపదేశం చేసి, సందేహాలు పోగొట్టి, యుద్ధంలో ముందంజ వేయించిన వాని; మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిఢవిల్లుగాక.

1-223-సీ.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి; 
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ; 

నుఱికిన నోర్వక యుదరంబులో నున్న; 
జగముల వ్రేఁగున జగతి గదలఁ; 

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ; 
బైనున్న పచ్చనిపటము జాఱ; 

"నమ్మితి నాలావు నగుఁబాటు సేయక; 
మన్నింపు" మని క్రీడి మరలఁ దిగువఁ;

1-223.1-తే.
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి 
"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున" యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
భావము:
ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది; కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి; ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది; చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది; “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవ ” ద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే గోపాల దేవుడే నాకు రక్ష.

హరివాక్యం:
ఈ జంట పద్యాలలోని సీస పద్యపు ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క విచిత్రమైన వైరుధ్యం ఉంది.వీటన్నిటికీ తేటగీతి చివరి రెండు పాదాల్లో జవాబు దొరుకుతుంది!మొదటి పాదంలోని వైరుధ్యం:భూమి మీద ఎక్కడో కురుక్షేత్రం అనేచోట మెరిసిన ఈయన కుండలాల తళుకులు ప్రపంచం మొత్తాన్ని ఎట్లా వెలిగిస్తాయి?దీనికి గరికిపాటి వారు చెప్పినది బాగుంది గనక దాన్నే ఖాయం చేద్దాం.అదేమిటంటే, లలితాసాహస్రంలో కనత్కనకతాటంకయుగళే అని ఉంటుంది.ఈయనా ఆవిడా ఒకరే అని అనుకుంటే అది విచిత్రం అనిపించదు.


రెండవ పాదంలోని వైరుధ్యం:పధ్నాలుగు లోకాల ఈ బ్రహ్మాండాన్ని ఉదరంలో మోస్తున్నవాడు తన ఉదరంలో ఉన్న ఈ విశ్వంలోకి రావడమే ఒక వింత, మళ్ళీ ఇక్కడున్న ఒక చిన్న రధం మీద నుంచి నేల మీదకి దూకితే తనతో సహా తన ఉదరంలో ఉన్న ఈ విశ్వం కదిలిపోవాలి గదా - చిన్న అదురుతో ఆగిపోయిందేమిటి?దీనికి గరికిపాటి వారు చెప్పినది బాగానే ఉంది కానీ నేను మరో వైపు నుంచి చూద్దామనుకుంటున్నాను.

మనం ఉన్న విశ్వం యొక్క పరిమాణం ఎంత?తెలియదు!కానీ కొలవడానికి తీసుకున్న కొలత మన దేహమే,అవునా?మన దేహం తప్పించి మిగిలిన వాటిని మనకన్న ఎంత పెద్దది, మనకన్న ఎంత చిన్నది అని సాపేక్షంగా కొలుస్తున్నాం.అయితే, అనంతకోటి విశ్వాలలో అన్నీ ఇదే పరిమాణంలో ఉండాల్సిన పని లేదు - మరొక విశ్వం మన బొటనవేలి పరిమాణంలోనే ఉండవచ్చు!ఆ చిన్న పరిమాణంలో ఉన్న విశ్వం కూడా మన విశ్వంలో ఉన్న ఆన్నింటినీ కలిగి ఉండవచ్చు.ఇలా ఉన్న విశ్వాల అమరికలో మనం ఉన్న విశ్వంలో భగవానుడు దూకినది ఒక చిన్న రధం మీద నుంచి నేల మీదకి గాబట్టి మిగిలిన విశ్వం కదలదు.కానీ ఆయన ఉదరంలో ఉన్నవి మొత్తంగా కదులుతాయి గాబట్టి ఆ విశ్వాల లోపల ఉన్నవాళ్ళకి ఈ కదలిక తెలియదు.

మూడవ పాదంలోని వైరుధ్యం:చక్రం గిరగిరా తిప్పేస్తూ కోపంతో భీష్ముడి మీదకి ఉరుకుతుంటే పైనున్న ఊత్తరీయం జారిపోయిందట!ఇందులో విచిత్రం ఏముంది అనిపించవచ్చు అధాట్న చూడగానే!కానీ, అలవాటులో పొరపాటు అన్నట్టు ఇక్కడ ఒక అనౌచిత్యం ఉంది. యుద్ధరంగంలో రధికుడితో పాటు సారధి కూడా కవచాలూ శిరస్త్రాణాలతో కూడిన దుస్తులు ధరించాలి కదా - కొంచెం వేగంగా కదిలితేనే జారిపోయే పచ్చని పటము ఇక్కడ తొడగటం ఉచితమా!

సినిమా రాముళ్ళని చూసీ చూసీ మాయపొర కమ్మకుండా బుర్ర చురుగ్గా పనిచేస్తున్న ఒకాయన ఉషశ్రీ గారిని ఒక ప్రశ్న అడిగారు, "వయసొచ్చిన ప్రతి మగాడికీ గడ్డాలూ మీసాలూ పెరగటం సహజం కదా!అదీ ఒకసారి క్షురకర్మ మొదలెట్టాక మధ్యలో ఆపేస్తే రెట్టింపు వేగంతో పెరుగుతాయి కదా!మరి,పధ్నాలుగేళ్ళు అడివిలో గడిపినా రామలక్ష్మణుల మొహాలు నున్నగా ఉన్నాయేమిటీ?"  అని.ఉషశ్రీ గారు సినిమా వాళ్ళ మీద కాస్త విసుక్కుని నందిగ్రామం దగ్గిర భరతుణ్ణి కలిశాక తల మీదా ముఖం మీదా చంకల్లోనూ పెరిగిన వెంట్రుకల్ని తీసేసి తలంటు పోసుకుని కొత్త బట్టలు తొడుక్కుని అయోధ్యానగర ప్రవేశం చేసినట్టు వాల్మీకం నుంచే శ్లోకాలు ఉదహరించి చెప్పారు.

మనం చూస్తున్న దేవుళ్ళ పటాలన్నీ రవివర్మ లాంటి చిత్రకారులు గీసినవి.వాళ్ళకి ఆ మొహాల్లో పవిత్రత కనపడ్డానికి పసితనాన్ని సూచించే మీసాలు లేని మొహం గుర్తు అని ఒక మూఢనమ్మకం ఏర్పడిపోయింది.ఆ మూఢనమ్మకాల్నే సినిమా వాళ్ళూ కొనసాగించారు,తమ సొంత మానసిక రోగాల్ని కూడా వాటికి కలిపారు.యన్.టి. రామారావు చూడండి, రావణుడి వేషంలో కైలాసం వెళ్ళినా దుర్యోధనుడి వేషంలో సభకి వెళ్ళినా భుజం మీద గద ఉండాల్సిందే!సైకాలజీలో మనకి ఇష్టమైన వస్తువుల్ని ప్రతి చోటుకీ దేహానికి అతికించుకున్నట్టు వెంట తీసుకుపోవడాన్ని ఫెటిషిజం అంటారు.

అసలు దుర్యోధనుడు అలా గదని మోసుకుంటూ తిరగనూ లేదు.అసలు కృష్ణుడు కవచ శిరస్త్రాణాలు తొడక్కుండా యుద్ధరంగంలోకి వెళ్ళనూ లేడు.అయితే, పోతన గారు కూడా శ్రీకృష్ణుడికి సంబంధించినంతవరకు ఆయనకున్న భక్త్యావేశంతో ఒక రూపానికి అతుక్కుపోయాడు.అది అసహజమే గానీ రాసిన పోతన గారు భక్తుడు,చూస్తున్న భీష్ముడు భక్తుడు,చదువుతున్న మనమూ భక్తులమే - ఒక దణ్ణం పెట్టుకుని వదిలెయ్యడమే!

నాల్గవ పాదంలోని వైరుధ్యం:"బాబ్బాబు!నా పరువు తియ్యకు, వెనక్కిరా" అని బతిమిలాడుకోవడంలో వైరుధ్యం ఏముంది అని మీకు సందేహం రావచ్చు!కానీ కృష్ణుడు అంత ఆవేశం ఎందుకు తెచ్చుకున్నాడు?అర్జునుడు ఆపకపోతే నిజంగానే భీష్ముణ్ణి చంపేసేవాడేనా?లేదు,ఆ సంరంభం ఆర్జునుడికి చురుకు పుట్టించి భీష్ముడి కధని ముగించడానికి చేసిన నటన!అర్జునుడు తాతగారి మీద మమకారంతో యుద్ధంలో చూపించాల్సిన ధాటి చూపించకపోవడం వల్లనే కదా ఇంత గొడవ జరిగినది - ఒకసారి విషాదం అనుభవించి గీతాసారం విన్నాక మళ్ళీ బెంగ పుట్టుకు రావటం అసహజం కాదూ!నేను గతంలో చెప్పి ఉన్నాను,ఇవ్వాళ చూస్తున్న లక్ష శ్లోక విస్తారమైన భారతం అంతా వ్యాస విరచితం కాదు,అందరూ తలా ఒక చెయ్యి వేసి పెంచి ఇంత పెద్దది చేశారని - దానికి ఇది సాక్ష్యం!

అసలు వ్యాసుడు రాసినవి 4000 అయితే శిష్యులు 6000 రాసినవి కలిపిన మొదటి రూపం 10,000 శ్లోకాలు మాత్రమే అని అంటారు.ఈ మధ్యనే ఆ మూలకధని మాత్రమే తీసుకుని జయం పేరుతోనే ఒకరు నవల వ్రాసినట్టు చదివాను.

అయితే,చేర్పుల వల్లనే ఆ కావ్యం మోనాలిసా నవ్వులా ధర్మతత్వజ్ఞులకు ధార్మిక గ్రంధంలా ఆధ్యాత్మిక వేత్తలకు మోక్షసాధనంలా కనబడుతూ అనితర సాధ్యమైన విశిష్టతని దక్కించుకున్నది!గీతకి ఇవ్వాళ ఉన్న విశ్వవ్యాప్తమైన ప్రాచుర్యం అక్కడ అమరిపోవడం వల్లనే కదా!కిం కర్తవ్యతా విమూఢుడైన ప్రతివాడూ తనని తను విషాద యోగంలో ఉన్న అర్జునుడితో పోల్చుకోవడమూ గీతాబోధ సమస్తమూ తనకే జరుగుతున్నట్టు భావించడమూ గీతని ఆ కధనుంచి విడదీస్తే జరగదు!మూలకధకీ నేటి కధకీ మార్పులు ఎలా జరిగాయో తెలుసుకోవడం వరకు మంచిదే గానీ ప్రస్తుతం మనకి తెలిసిన కధని మర్చిపోవడం అనవసరం - మర్చిపోలేం కూడా!

1-225-క.
పలుకుల నగవుల నడపుల
నలుకల నవలోకనముల నాభీరవధూ
కులముల మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.
భావము:
తియ్యని మాటలతో మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్చూపులతో వ్రజవధూమణుల వలపులు దోచుకొనే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తాను.

1-226-ఆ.
మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగమండపమునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది
దేవుఁ డమరు నాదు దృష్టియందు
భావము:
మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు..

1-227-మ.
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థిం
తు శుద్ధుండనై."
భావము:
ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను."

హరివాక్యం:
ఇక్కడ పోతన గారు హైందవద్వేషులు సదా విమర్శించే హైందవధర్మంలోని మూర్త్యారాధన మరియు బహుళ దేవతా ప్రశస్తి అనే రెండు ముఖ్యమైన విషయాలకీ తిరుగులేని సమర్ధన ఇచ్చేస్తున్నాడు!ఇక్కడే కాదు, సనాతన ధార్మికులు సృష్టించిన ఆధ్యాత్మిక సాహిత్యంలో ఉన్న విశిష్టత ఏమిటంటే సాహిత్యానికి సంబంధించిన రమ్యత,గాఢత కూడా ఉండి గుర్తుంచుకోవడం తేలిక అవుతుంది. విదేశీయులూ వేరే మతస్థులు కూడా సనాతన ధర్మానికి ఆకర్షితులు కావడానికి వాటిలోని వస్తుగతమైన తార్కికతతో పాటు శైలిపరమైన సౌందర్యం కూడా ఒక కారణమే!

ఏం చెప్తున్నాం అన్నదానితోపాటు ఎలా చెప్తున్నాం అనేది కూడా ముఖ్యమే - అన్నప్రాశన నాడే ఆవకాయ పెట్టేస్తే పిల్లాడు అల్లాడిపోతాడు!ఎంతటి పండితుడికైనా నిర్గుణ పరబ్రహ్మ మీద మనస్సు లగ్నం చెయ్యడం దాదాపు అసాధ్యమే - అసలు ఆ పదాన్ని పరిచయం చేసినవారికే దాని పూర్తి అర్ధం తెలియదు పాపం!నేనయితే నిర్గుణోపాసనని తిరస్కరిస్తాను కూడా.ఎందుకంటే,జ్ఞానం కోసం జ్ఞానం,కళ కోసం కళ వంటి పనికిమాలిన లక్ష్యాలు పెట్టుకుంటే ఇహానికీ పరానికీ పనికిరాకుండా పోతాం.మన దేహాలు తయారైన పృధివ్యాపస్తేజోవాయురాకాశాల మూలతత్వం మహదహంకారం - అది కూడా భగవత్స్వరూపమే!మనల్ని మోహానికి గురి చేసి పతనం చేస్తున్నదని అనుకుంటున్న మాయ కూడా భగవంతుడి కన్న వేరు కాదు, అవునా?మరి, రూపధారులమైన మనం భావనామరూప సంకీర్తనం చెయ్యడానికి భయపడటం గానీ సంకోచపడటం గానీ అవసరమా?"మేం విగ్రహారాధనని వ్యతిరేకిస్తున్నాం!" అని అంటున్నవాళ్ళే అలవాటులో పొరపాటుగా కాకుండా బరితెగించి విగ్రహారాధన చేసేస్తూ ఉంటే హిందువులు సిగ్గుపడటం దేనికి?అయితే, ఒకటి గుర్తుంచుకోవాలి మూర్తిపూజ అంటే ఆలయాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలకి చేసే అభిషేకాదులు మాత్రమే కాదు, అక్కడినుంచి మొదలుపెట్టి దృశ్యమాన ప్రపంచంలోని అన్ని రూపాలలోనూ భగవంతుణ్ణి చూడగలిగే స్థాయికి ఎదగాలి!

హిందూమతప్రచారకులు ముఖ్యంగా నోటిని అదుపులో పెట్టుకోవాలి,ఆసక్తిని కలిగంచడం కోసం హాస్యప్రసంగాలు చెయ్యడం మంచిదే గానీ హాస్యం అపహాస్యం స్థాయికి దిగజారకూడదు.గరికిపాటి నరసింహారావు లాంటి అనుభవజ్ఞులు కూడా ఒక్కోసారి ఆవేశం వల్లనో అనాలోచితంగానో చెప్పకూడని విషయాలు చెబుతున్నారు,అనకూడని మాటలు అంటున్నారు.ఈ మధ్యనే వారు గణేశ్ నిమజ్జం పేరుతో వ్యాపారమూ పోటీ ఎక్కువయ్యాయనీ అవన్నీ అక్కర్లేదనీ వాటిలో భక్తి ఉండదనీ ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఒంటరిగా చేసే పూజల్లోనే భక్తి ఉంటుందనీ మాట్లాడారు - అది నాకు నచ్చలేదు.ఒంటరి పూజని పెద్దలు అప్పటికే సర్వం త్యజించిన యోగులకి ప్రాణోత్క్రమణ సమీపించిందని తెలిసినప్పుడు మనిషి కనిపిస్తే చాలు "నాకు నెప్పిగా ఉందిరో!వైద్యం చెయించరో!నన్ను బతికించరో!" అని వ్యామోహం పెరక్కుండా ఉండటానికి చెప్పారు.గృహస్థు అయిన ప్రతి ఒక్కరికీ తన పాటికి తను వైదిక విధుల ప్రకారం బతకడంతో పాటు ధర్మప్రచారం కూడా ఒక ముఖ్యమైన విధి.

సత్యనారాయణవ్రతం కుటుంబసభ్యులు మాత్రమే చేసుకోవాలని చెప్పారా?అసలు ఆలయాలు ఉన్నదే సామూహిక ప్రార్ధన కోసం - అలాంటప్పుడు ఈయన అవన్నీ అక్కర్లేదు,మీ ఇంట్లో మీరు పూజలు చేసుకుంటే చాలు అంటారేమిటి!ఈయనే ఇలా చెప్తున్నప్పుడు ప్రబోధానంద లాంటివాళ్ళని మనం తట్టుకోగలమా?ప్రపంచ స్థాయిలోనే ఏకం కావలసిన సమయంలో హిందువులు ఒంటరిపక్షులు కాకూడదు - తస్మాత్ జాగ్రత్త!


కలిసి ఉంటే కలదు సుఖం!కలిసి నడిస్తే కలదు జయం!కలిసి బతికితే కలదు వైభవం!!

Thursday, 27 September 2018

నేను తర్వాతెప్పుడో ఉచ్చు వెయ్యబోతున్నట్టు బిల్డప్ ఇవ్వగానే "ఉచ్చేత్తన్నావా?నీది నీకే యేత్తాలే!" అని యెర్రిపప్ప క్యామెడీలు చెయ్యటం కాదు - అసలు నేను వేసిన ఉచ్చు ఏమిటో తెలుసుకోవాలి గద!

@Chiranjeevi YSeptember 25, 2018 at 5:41:00 PM GMT+5:30
సొషల్ మీడియాలో చదివి హరిబాబు రాసిందాన్ని ఖండించకపోతే, 

hari.S.babu
తమరు ఇంకా నన్నేదో ఖండించితే నేను సిగ్గుపడిపోయి అప్పటినుంచి ఎక్కడ ఏం మాట్లాడితే ఛీ!రంజీవి వొచ్చేసి నన్ను మళ్ళీ ఖండిస్తాడేమోనని తత్తరపడిపోతున్నానన్న భ్రమనుంచి బయటపడలేదన్న మాట!

అయితే కాసుకోండి ఫైనల్ స్ట్రోక్.మొట్టమొదటిసారి యేసు పుట్టుక గురించి మేరీకి గాబ్రియేలు చేప్తున్న భాగం యొక్క పూర్తి పాఠం ఇది:In the sixth month the angel Gabriel was sent from God to a city of Galilee named Nazareth, to a virgin betrothed to a man whose name was Joseph, of the house of David; and the virgin's name was Mary.

And he came to her and said, "Hail, O favored one, the Lord is with you!" But she was greatly troubled at the saying, and considered in her mind what sort of greeting this might be. And the angel said to her, "Do not be afraid, Mary, for you have found favor with God. And behold, you will conceive in your womb and bear a son, and you shall call his name Jesus. He will be great, and will be called the Son of the Most High; and the Lord God will give to him the throne of his father David, and he will reign over the house of Jacob forever; and of his kingdom there will be no end."

And Mary said to the angel, "How shall this be, since I have no husband?" And the angel said to her, "The Holy Spirit will come upon you, and the power of the Most High will overshadow you; therefore the child to be born will be called holy, the Son of God. And behold, your kinswoman Elizabeth in her old age has also conceived a son; and this is the sixth month with her who was called barren. For with God nothing will be impossible."

ఇది హరిబాబులో తప్పులు పట్టేసిన మేధాసంపత్తి నా ఒకడికే సొంతం అని విర్రవీగుతున్న తమరు ఆరోపిస్తున్నట్టు సోషల్ మీడియా నుంచో క్రైస్తవమత ద్వేషులైన హిందూమాతత్వవాదుల సైటునుంచో కొట్టుకొచ్చింది కాదు.రచయిత పేరుకు ముందు Rev.ఉంది.క్రైస్తవ సమూహంలో దానికి ఉన్న విలువ యేమిటో తమకు తెలియనిది కాదు.ఈ భాగాన్ని అనువదించకుండా ఉన్నది ఉన్నట్టు ఎందుకు దించేశానో తెలుసా?అనువదించడం కోసం సొంత వాక్యాలు వాడినా సరే హరిబాబు బైబులు చదవలేదని ఎటూ రూఢి అయిపోయింది గాబట్టి మార్చి రాశావు అని మీలాంటివాళ్ళు నను బ్లేం చెయ్యకుండా ఉండటానికే!

అనువదించటం తెలియక కాదు వదిలేసింది,ఇప్పుడు చెబుతాను చూడండి.betrothel అనే ఇంగ్లీషు పదానికి "ఉద్వాహం" అనేది సరైన తెలుగు పదం అనుకుంటున్నాను.అంటే, సంబంధం కుదుర్చుకున్నారు, కానీ పెళ్ళి కాలేదు.పెళ్ళి కుదిరిన ఆరవ నెలలో గాబ్రియేలు మేరీకి కనబడి సందేశం చెప్పాడు."the Lord is with you" అనే మామూలు మాటకి మేరీ అంత ట్రబుల్ ఎందుకు పడింది?ఆ with you అనే అతిచిన్నమామూలుమాటకి అర్ధం - "నీకు సంతానము కలుగులాగున సంభోగము వంటి క్రియతో దేవుడు నిన్ను కూడును!" అని."మీరు ఆలాగున ఏలా నిర్ధారింతురు?అక్కడ with me అను మాటయే ఉన్నది.లేనిది చెప్పుచున్నారు!నేను ముందే చెప్పియున్నాడను - మీరు బైబిలును చదవకపోవుట వల్లనే ఈలాగున చెప్పుచున్నారు" అని  అనిన యెడల నేనొక విషయమును స్పష్టపరచెదను. యేయేయే యేసు,మరియు యెహెహే యెహోవ చాలా చోట్ల నేను యేది చెప్పిననూ ఇశ్రాయేలీలకు మాత్రమే అర్ధమగునట్లు మార్మికముగ వచింతును అని నుడివినారు.మీదు మిక్కిలి ఆ విధమయిన అర్ధము లేనిచో మేరీ కంగారుపడి తొట్రిల్ల నవసరము లేదు,అవునా?అందుకే మేరీ కంగారు పడింది!"The Holy Spirit will come upon you" అని అనటాన్ని బట్టి అప్పటికి గర్భం వ్యక్తం కాలేదు,అవునా!

ఇది కొత్త నిబంధన నుంచి యేసు పుట్టుక గురించి చెప్పబడిన రెండు ప్రకటనలలో మొదటి ప్రకటన విషయం.ఇందులో నేను వక్రీకరించినది ఏమీ లేదు.ఇంగ్లీషు పూర్తి పాఠం ఇచ్చి దానిమీద విశ్లేషణ చేశాను.విశ్లేషణని వక్రీకరణ అని మీరు మాత్రమే అనేసి దాన్ని పట్టుకుని నేనే గెలిచాను అని సంకలు గుద్దుకుంటే కుదరదు.విశ్లేషణ వక్రీకరణ ఎప్పటికీ కాదు.

ఇంక విషయానికి వెళ్తున్నాను.బైబిలు చదవకపోవటం వల్ల తగినంత పాండిత్యం లేక తప్పుడురాతలు రాశానని అంటున్నారు గనక ఒక విషయం చెబుతాను.ఇది నా వాదనకి చాలా బలమయిన సాక్ష్యం కాబట్టి గుర్తుంచుకోండి.గాబ్రియేలు అనే పాత్ర బైబిలులో కేవలం నాలుగుసార్లు మాత్రమే కనపడతాడు.కొత్త నిబంధనలోని యేసు దేవుని కుమారుడు అని గొఱ్ఱెలని నమ్మించే సందర్భంలో మేరీకి ఒకసారీ యోసేపుకి ఒకసారి కనపడి యెహోవ సందేశాన్ని వినిపిస్తాడు.మేరీకి చెప్పిన సందేశంలో పాత నిబంధన కధలోని ఎలిజబెత్తు కు కూడా  ముట్లుడిగిన ముసలి వయసున కలిగిన వింత గర్భపు వార్తను తనే మోసుకెళ్ళిన సంగతిని చెప్తాడు కదా!

అంటే, కొత్త నిబంధనలో గాబ్రియేలు కనపడే రెండు సందర్భాలను గురించి నాకు తెలుసునని అర్ధం అవుతున్నది.మేరీకి గాబ్రియేలు కనపడిన భాగాన్ని మక్కీకి మక్కీ దించేసిన వాడిని దానికి తోకలా ఉన్న భాగాన్ని ఎందుకు వదిలేశాను?నేను మీలా పిచ్చోణ్ణి కాదండి!ఆ ఇంగ్లీషు భాగం ఎక్కడ నుంచి తీసుకున్నానో ఆ వ్యాసం యొక్క ఉద్దేశం యేసు చారిత్రక యదార్ధతనీ దేవుని మహిమతో/వీర్యంతో కన్యగర్భమున జన్మించటాన్నీ కలిపితే అక్రమసంతానం అనే అర్ధం వస్తుందని నాకన్నా ముందే కొందరు సూచనప్రాయంగా చెబుతూ వాదిస్తున్నప్పటికీ "యేసు కన్యాగర్భమున దేవునికి జన్మించాడని చెప్పుకొనుటయే క్రైస్తవులకు గర్వకారణం!" అని బల్లగుద్ది వాదిస్తున్న వ్యాసం నుంచి తీసుకున్నాను.మరి అది నిరూపించాలంటే ఆ పెద్దాయన నా పోష్టులో మీరు ఉదహరించిన భాగం కూడా ఇవ్వాలి కదా!ఇచ్చాడు,కానీ నేను దాన్ని పేస్ట్ చెయ్యలేదు.పేస్ట్ చెయ్యకపోవటమే కాదు,మీరు "IT IS REALITY!" అని రంకెలు వేస్తున్న నా పోష్టులోని ఆ విషయానికి సంబంధించిన భాగంలో నేను చేసింది ఏమిటి?ఇది:ఈ మొత్తం సన్నివేశాన్ని అర్ధం చేసుకోవాలంటే ఇందులోని కొన్ని భాగాల్ని విడిగా తీసి ఒక్కొక్క పాయింటునీ అర్ధం చేసుకుంటే అన్నీ కలిసినప్పుడు ఒక అవగాహన వస్తుంది.మొదట "a virgin betrothed to a man" అనే పాయింటును చూద్దాం.అంటే,మేరీకి ఆరవ మాసం నడుస్తున్నప్పుడు గాబ్రియేలు దర్శనం ఇచ్చేటప్పటికి కూడా జోసెఫ్ అనే డేవిడ్ వంశీయుడితో పెళ్ళి కాలేదు.Betrothel అంటే మనలో తాంబూలాలు పుచ్చుకోవటంతో సమానమైన వివాహ పూర్వ దశ నడుస్తున్నది.ఇంతవరకు దృశ్యం సాఫీగానే ఉన్నది.అయితే చదువుతున్నప్పుడు గానీ వింటున్నప్పుడు గానీ మనకు రావలసిన మొదటి ప్రశ్న "అప్పటికే 6 నెలల గర్భవతి అయిన మేరీని కన్య అని సంబోధించడం ఎట్లా కుదురుతుంది?" అని.గాబ్రియేలు చెప్పిన తర్వాతనే గద మేరీకి కూడా అది దేవుని వీర్యం వల్ల వచ్చిన గర్భం అని తెలిసింది,అంతకుముందు అందరి దృష్టిలోనూ అది ఏ పురుషుడి వల్ల వచ్చిందో తెలియని అక్రమగర్భమే కదా!Betrothel గర్భంతో ఉన్నదని తెలిశాక జరిగితే జోసెఫ్ అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదా?Betrothel జరిగిన తర్వాతనే మేరీకి గర్భం వచ్చిందని తెలిసినా జోసెఫ్ వైపు నుంచి కనీసం ప్రశ్నించే స్థాయి అభ్యంతరం కూడా వ్యక్తం కాలేదా?ఇవేవీ జరగలేదంటే అప్పటి Nazareth సమాజంలో అటువంటి విశృంఖలత సహజమేనా?

మేరీకి సందేశం వినిపించిన భాగాన్ని ట్రూకాపీ చేసేశాను గాబట్టి నేను మార్చానని ఎవరూ అనలేరు.ఇక్కడ నేను కధనాన్ని వర్ణించి అది బైబిలు కధనంతో విభేదిస్తే వక్రీకరణ అవుతుంది కానీ అసలు కధనాన్ని వివరించకుండా దానిమీద ప్రశ్నలు వేస్తుంటే అది వక్రీకరణ ఎలా అవుతుంది?కానే కాదు!నేను తర్వాతెప్పుడో ఉచ్చు వేస్తున్నాను ముందు ముందు ఏదో ఉచ్చు వెయ్యబోతున్నట్టు బిల్డప్ ఇవ్వగానే "ఉచ్చేత్తన్నావా?నీది నీకే యేత్తాలే!" అని యెర్రిపప్ప క్యామెడీలు చెయటం కాదు.ఒక హిందువునైన నేను "అసలు బైబిలు కధనమే యేసు అక్రమసంతానం అని అనుమానం వచ్చేలా ఉంది, దానికి తోడు అతడొక చారిత్రక వ్యక్తి అనేది కూడా కలిపితే అనుమానం నిర్ధారణ అవుతుంది" అని చెప్పడం ఇష్టం లేక క్రైస్తవులకి ఉచ్చు వేశాను.నేను వేసిన ప్రశ్నలకీ అక్కడ చేసిన హడావిడికీ టెంప్ట్ అయిపోయి కొత్త నిబంధనలోని ఆ భాగాన్ని నాముందు పెడితే నేను మార్పులు చేసి చెప్తున్నానని వాదించటానికి వీల్లేకుండా నవరంధ్రాలూ బిగించి నొక్కేసి తను ఉటంకించిన భాగం నుంచే చూపించాలని ప్లాను వేశాను.

క్రైస్తవులకి వేసిన నా ఉచ్చులో మీరు పడ్డారు.ముందు మీరు "18." అంటూ ఇచ్చిన పొడుగాటి కధనాన్ని పేస్ట్ చేస్తున్నాను.అది ఇది:"18 యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. 
19 ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 
20 అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటక 
21 తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. 
22 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు 
23 అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. "

మీరు ఏ విధమైన తర్కమీమాంసాది ప్రజ్ఞల సాయం లేకుండా జస్ట్ కామన్ సెన్సుతో "19 ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. " అనే భాగానికి అర్ధం చెప్పండి!

ఇక్కడ బ్రేక్ చేసి మీరు జవాబు చెప్పాక తిరిగి కంటిన్యూ అయ్యేంత ఓపిక నాకు లేదు గనక నాకు అర్ధమయినది చెబుతాను.?తను కలవకుండా మేరీకి వచ్చిన గర్భం అక్రమమైనది అనుకున్నాడు గనకనే వదిలించుకోవటానికి ప్రయత్నించాడు - మేరీ గాబ్రియేలు సందేశం  గురించి చెప్పినా నమ్మలేదు కాబోలు, నమ్మడని భావించి మేరీ చెప్పి ఉండక పోవచ్చును కూడా!దూరదేశం పోవాలని యెందుకు అనుకున్నాడు?ఇక్కడ వదిలేస్తే జనం రాళ్ళతో కొట్టి చంపేస్తారు గనక జాలిపడి దూరదేశం తీసుకెళ్ళి వదిలెయ్యాలనుకున్నాడు!ఆ సన్నాహాలు చేస్తున్నప్పుడు గాబ్రియేలు యోసేపుకు కనపడి సందేశం చెప్పాక యోసేపు మేరీని ఆదరించాడు,అవునా?

ఈ మొత్తం కధ బైబ్లు రచయితలు గొర్రెల కోసం కలిపించి చెప్పారు గనక మనకి తెలిసింది గానీ యోసపూ మేరీ సమకాలికుల దృష్టిలో జీసస్ యోసేపూ మేరెల కన్నబిడ్డ, అంతే!అక్రమసంతానం అయినప్పటికీ గాబ్రియేలు సందేశపు కల్పన తీసేసి ఇప్పుడు ఆపాదించబడిన మంచితనం చేత  యోసేపు సర్దుకున్నా లేక ఎలాగూ పెళ్ళి కుదిరింది గదా అని తనే గర్భం చేసిన సక్రమ సంతానం అయినా వాళ్ళిద్దరి మధ్యనే జరిగిన గొడవ.తమ పవక్తకి మరెవరికీ లేని "మా ఏసు పాపంతో సంబంధం లేకుండా పుట్టాడు(?),పాపంతో సంబంధం లేకుండా బతికాడు(!)" అనే గొప్ప కోసం చెప్పిన ఈ కధ వల్ల సగం డ్యామెజీ జరుగుతూ ఉంటే చారిత్రక వ్యక్తి అని నిరూపించుకోవాలనే కక్కుర్తి వల్ల "గాటు పెట్టి పలాస్త్రికి డబ్బులడగటం బాలేదు దావీదూ!" అన్నట్టు జోక్యాబేజీ అయ్యింది.

P.S:"ఎవడికి తెలియదు?" అన్న అతిచిన్న ఝాడింపుకే 8గ్ర మహోగ్ర అత్యుగ్ర భీబత్సరసం కడుపు నిండా తాగినట్టు నాలుగు పోష్టుల దగ్గిర నానా హడావిడీ చేసి నేను చావుతిట్లు తిట్టినా చాలా వినయంతో కూడిన జవాబు చెప్పి కూడా ఆఖరికి క్రైస్తవుల మీద జాలితో చివరి జవాబు చెప్పకుండా ఆగిపోయిన నన్ను కాశ్మీరు టెర్రరిస్టులతో పోల్చి మీరు సాధించినది ఏమిటయ్యా అంటే నాకు బైబిలు కధనం ప్రకారమే యేసు అక్రమసంతానం అని నిర్ధారణ చేసే అవకాశాన్ని పువ్వుల్లో పెట్టి ఇవ్వటం.

ఈ వ్య్యూహం వెయ్యకుండా నా పొష్టులో ఈ పని చేసి ఉంటే దానికి పూర్తి బాధ్యత నాదే అయి వుండేది,కానీ ఇప్పుడు మాత్రం నూటికి నూరు శాతం మీదే బాధ్యత!"నేను బైబిలు చదివానని అన్నానే గానీ ఒప్పుకుంటున్నానని అనలేదుగా" అంటున్న సగం క్రైస్తవమతాభిమానీ తన బ్లాగులో ఇస్లామును మాత్రం అపూర్వమని పొగుడుతూ ఇతర మతాల్ని తప్పులు పట్టి విమర్శిస్తున్నాడని తెలిసినా సరే కేయస్ చౌదరి పట్ల చౌద్రీబాయ్ అనేటంత ఆప్యాయత ఒలకబోస్తూ హరిబాబుకి మాత్రమే టెర్రరిస్టు ముద్ర వేస్తున్న సగం హేతువాదీ అయిన మీరు ఒక పని చెయ్యండి రంజిత్ ఓఫీర్,డేవిడ్ సుగుణాఖర్,వీపీ రెడ్డి లాంటి నిఖార్సైన క్రస్తవుల దగ్గిరకి వెళ్ళి నామీదకి ఉసి గొల్పండి - మేమూ మేమూ చూసుకుంటాం!

దివిసూర్యసహస్రప్రభాభాసమైన దివ్యతేజస్సుతో వెలిగిపోయే కారణజన్ముడైన హరిబాబుకీ నిరంతరం అంద్గాంధ తమసాల మధ్యన పొర్లాడే దివాంధమైన చిరంజీవి వైకీ మధ్య యేనుగుకీ పీనుగుకీ మధ్య ఉన్నంత తేడా ఉందనేది వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధపర్యంతం ఉన్న గురుపరంపర పాదాల్ సాక్షిగా నేను చెబుతున్న పరమసత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

Monday, 17 September 2018

వాడే వీడు!వీడే వాడు!వీడు కారణజన్ముడు సుమా!

అనగనగా ఒక బాబు!
చిన్న బాబు,హరిబాబు!

మోసం,ద్వేషం లేని విచిత్రసీమ నుంచి!
ప్రేమం,మోదం నిండిన లోకం నుంచి!

ఏదో ఇచటుందని భ్రమిసినాడో!
లేదో,దేవదేవుని లీలావినోదమో!

ఈ భువిమీదకి జారిపడినాడు!
ఆ దివినుంచి వూడిపడినాడు!

ఎటు చూస్తే అటు మాయ!
ఎటు చూస్తే అటు ఛాయ!

నిజమేదో?భ్రమయేదో?
ఆకలేమిటో?ఏడుపేమిటో?
నిదరేమిటో?బెదురేమిటో?
ఇంతేనా?ఇంతేనా?ఇంతేనా?

ఎప్పుడూ పాలిచ్చి లాలించే
అమ్మని మొదటే గుర్తుపట్టాడు!
పక్కనే నుంచుని కులుక్కునే
నాన్నని వెంటనే గుర్తుపట్టాడు!

మెడ నిలిచిన తదాది
నేలమీద ఎప్పుడూ పారాడలేదు -
ఎప్పుడూ ఎవరో ఒకరి చేతుల్లోనే!

ముద్దులు మూటగట్టే చిన్న బాబుకు
అందరు చూడబట్టే బొమ్మను తీయించాలని
కూర్చోబెడితే - కూర్చోడే!
అటు చూస్తాడు!ఇటు చూస్తాడు!
చిటికేస్తే ఒకసారి ఇలా చూసి అలా తల తిప్పేస్తాడు!


బుజ్జిపండు చేతికి చిక్కిందొక చెక్కపండు!
"పండే కదా!" - తెలిసిందే,కొరకాలని అనుకున్నాడు.
"పండు కాదా?" - తెలియందే,చురుకానగ చూశాడు.
కదల్టం ఆపేశాడు,పెదాల్ని బిగించాడు,కన్బొమల్ని ముడేశాడు.
బొమ్మ వచ్చింది!

అప్పుడూ ఇంతే,ఇప్పుడూ ఇంతే,ఎప్పుడూ ఇంతే!
అందరికన్న ఎక్కువ తెలుస్తాడు!
తెలియంది కనిపిస్తే నిలుస్తాడు!
తపిస్తాడు!జ్వలిస్తాడు!శ్రమిస్తాడు!
సాధిస్తాడు!

వాడే వీడు!వీడే వాడు!
వీడు కారణజన్ముడు సుమా!
(18/09/2018)

Wednesday, 12 September 2018

భీమా-కొరెగావ్ అల్లర్ల నుంచ్బి అర్బన్ నక్సల్స్ అరెస్టుల వరకు జరిగిన జగన్నాటకం వెనక ఉన్న చిదంబర రహస్యం ఏమిటి?

"కత్తి గొప్పదా?కలం గొప్పదా?" అనే చర్చ ఇప్పటికీ స్కూళ్ళలో నడుస్తూనే ఉన్నదనుకుంటాను!కొన్ని మూర్ఖపు వాదనలు అంతే - ఎప్పటికీ తెగవు.ప్రతి కుర్రవెధవా కత్తినో కలాన్నో గొప్పదని నిరూపిస్తూ కొత్తపాయింటు పడతాడు.ఇదివరకు ఒక కుర్రాడు కత్తి గొప్పదని వాదించి ప్రైజు తెచ్చుకుంటే మళ్ళీ కత్తి గొప్పదని వాదించితే ప్రైజు రాదు - కలం గొప్పదని వాదించే కుర్రాడు కత్తి గొప్పదని వాదించిన కుర్రాడి పాయింటుకు మించిన గొప్ప పాయింటును పట్టాలి!కమ్యునిష్టు మేధావుల్లో చాలామందికి ఈ తరహా క్రియేటివిటీ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది.ఏ కమ్యునిష్టు పార్టీ సభ్యుడు/మానవహక్కుల సమర్ధకుడు/మావోయిస్టు కార్యకర్త యొక్క బయోడేటాని చూసినా విద్యార్ధి దశనుంచీ ఇలాంటి ప్రజ్ఞలో ఆరితేరినవాళ్ళుగా కనబడతారు.

ఒక సంస్థ బిర్వహణలో గానీ సమాజగమనంలో గానీ సమస్యలు వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇటువంటి ప్రజ్ఞ చాలా అవసరం.కానీ దీనినే బతుకుతెరువుగానో జీవనవిధానంగానో మార్చుకుని అది సాగడం కోసం లేని సమస్యల్ని సృష్టించడం గానీ ఉన్న సమస్యల్ని ఇతరులు పరిష్కరించుతుంటే అడ్డుపడటం గానీ చిన్న సమస్యల్ని పెద్ద సమస్యలుగా వర్ణించి భయపెడుతున్నప్పుడు గానీ పెద్ద సమస్యల్ని చిన్న సమస్యల పేరున కొట్టిపారేస్తున్నప్పుడు గానీ ఇలాంటి వాళ్ళ ప్రజ్ఞ ప్రజలకి ఉపయోగపడుతున్నప్పుడు ఎంత గొప్పగా పొగుడుతామో అంత గటిగానూ విమర్శించాల్సిందే!

అరవయ్యేళ్ళ క్రితం ఖమ్మం జిల్లాలో ఆదివాసీలు పోడు వ్యవసాయం అనే ప్రాచీనమైన పద్ధతిని పాటించుతున్నప్పుడు ప్రభుత్వం కానీ ఇతరులు కానీ వారిని నాగరికత వైపుకు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే "అగ్రవర్ణాల అధిపత్యపు సంస్కృతిని రుద్దడం!" అని అల్లరల్లరి చేసి సాగనివ్వని వాళ్ళు నిన్న గాక మొన్న ఆంధ్రజ్యోతి దినపత్రికలో అనాగరికమైన పోడు వ్యవసాయాన్ని ఆపివేసి దండకారణ్యాన్ని సతతహరితం చేశామని గొప్పలు చెప్పుకున్నారు - మావోయిస్టు సానుభూతిపరులు లేక సిద్ధాంతకర్తలు. యాభై అరవయ్యేళ్ళ ముందు ఇతరులు చెయ్యబొతే తప్పు అయినది ఇవ్వాళ వాళ్ళు చెయ్యడం వల్ల ఒప్పు అయింది!ఇది యాభయ్యేళ్ళ ముందు జరిగి ఉంటే బాగుండేది కదా అనిపించదు, తమ మూలంగానే జరగాలి అన్న స్వార్ధం - అందుకే ఆదివాసీల్ని అన్నేళ్ళ పాటు అనాగరికంగా ఉంచగలిగారు!

ఇవ్వాళ భీమా కొరెగావ్ అల్లర్ల కేసులో పట్టుబడిన వాళ్ళు కూడా ఇలాంటివాళ్ళే - చూట్టానికి చాలా మంచివాళ్ళలా కనబడతారు,అణగారిన ప్రజల కోసం పోరాడుతున్నట్టు హడావిడి చేస్తారు,దానివల్ల ఎన్ని నష్టాలు ఎదురైనా సహిస్తారు,దరిద్రాన్ని భరిస్తారు, జైళ్ళకి వెళతారు - కానీ ఆన్నింటి వెనకా స్వానురాగంతో కూడిన కీర్తికాంక్ష అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది, తమ ఉద్రేకపూరితమైన ప్రసంగాల్ని విని తమలాగే చావడానికీ జైళ్ళకి వెళ్ళడానికీ ముందుకురికే కుర్రాళ్ళని చూసినప్పుడు వాళ్ళ కళ్ళెలా మెరుస్తాయో చూడండి!

వెనకటి కాలంలో ప్రజాస్వామ్యం అనే మాట అసలు వూహకే రానప్పుడు రాజులు మంచివాళ్ళయితే సంతోషించడం,రాజులు పీడించితే కష్టాలు పడటం జరిగింది,నిజమే!అలాంటప్పుడు కొన్నిచోట్ల ప్రజలు తిరగబడిన సందర్భాలూ ఉన్నాయి,కొన్నిచోట్ల రాజు అసమర్ధతని అవకాశంగా తీసుకుని మంత్రి గానీ సేనాధిపతి గానీ రాజును చంపేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం లాంటివి కూడా జరిగాయి!కానీ ఇవ్వాళ ప్రజల అనుమతితో అధికారంలోకి వెళ్తున్నవాళ్ళని కూడా వాళ్ళకి నచ్చే మార్క్సిస్టు కబుర్లు చెప్పటం లేదు గాబట్టి ప్రజాద్రోహుల కింద తీర్మానించడం మూర్ఖత్వం కాదా!ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకన్న మేము మీకు న్యాయమైన పరిపాలన అందించగలం అని చెప్పి అధికారంలోకి రాగలిగిన పద్ధతిని వదిలేసి రహస్యకుట్రల ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం అనాగరికం కాదా?

వరవరరావు

ఇతన్ని గురించి ఒక్క మాటలో చెప్పలేం - కవి, జర్నలిస్టు, సాహిత్య విమర్శకుడు, ప్రతిభావంతుడైన వక్త, మావోయిస్టు సిద్ధాంతకర్త!గతంలో చాలాసార్లు జైలుకి వెళ్ళొచ్చాడు - సా.శ 1980లో భారతప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నాడన్న నేరం రుజువై రెండేళ్ళ జైలు శిక్షని అనుభవించాడు.ఈ కేసులో అరెస్టు చేసి తీసుకువెళ్తుంటే "విప్లవం వర్ధిల్లాలి!" అని నినాదాలు చేశాడే తప్ప వీసమెత్తు ఆందోళన కూడా పడలేదు,అలవాటైపోయింది కదా!తనకీ ఈ కేసుకీ సంబంధం ఉన్నట్టు ఆధారాలు లేకపోవడంతో తర్వాత వదిలేశారు.

సా.శ 2014లో “Raging war against India: Deconstructing the notion of India” ననే టాపిక్ మీద నిర్వహించిన చర్చలో పాల్గొనడానికి ముంబై వచ్చి Tata Institute of Social Sciences (TISS) వేదిక మీద చేసిన ప్రసంగంలోనూ Countercurrents.org పత్రిక వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ new democracy కోసం తాము చేసే మావోయిస్టు కార్యకలాపాలు ఎప్పటికీ అగిపోవని చాలా నమ్మకంగా చెప్పాడు - ప్రజల్లో ఉన్న అజ్ఞానమూ దరిద్రమూ వీరికి ఉద్రేకాన్ని ఇస్తున్నంతకాలమూ నవతరం వారసులకి కొదవ ఏముంది?

Countercurrents.org పత్రిక వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలకమైన ప్రశ్నలకి అతను ఇచ్చిన జవాబులు ఇవి:
AC: Where do you see the Dalit movement in Telangana state? KCR has already back-tracked from his promise of a Dalit CM.
VR: Making a Dalit CM is a token thing. He has installed a Dalit as the deputy CM but openly humiliated him in Warangal. Dr Thatikonda Rajaiah, who is from the Madiga community and along with deputy CM also the health minister, had promised of a health university in Warangal. KCR openly contested him saying how could you make such baseless promises and outrightly rejected his promise. KCR can make many promises and the deputy CM, who is a Dalit, can’t make. This negation shows KCR’s feudal attitude towards Dalits. Those who know him never expected he will make a Dalit as CM.
AC: How do you see the progress of the Maoist movement in the new state?
VR: The only future is the Maoist movement as it is the only alternative politics. People are vexed with parliamentary democracy, particularly after coming of Modi sarkaar. Media made Modi the PM and despite his rhetoric of “acche din”, he has hiked the petrol prices and rail charges. People are getting disillusioned with the Centre and all state governments, including Telangana government. A hall meeting against Operation Greenhunt was cancelled in Tirupati, AP. Leaders of mass organizations have been arrested in several places. In this situation I feel Maoist movement will gather strength in Telangana and newer states. 
AC: It has been alleged by many women underage cadres that they were sexually abused by the adult male Maoists…
VR: This is a falsehood created by the media. Many of the cadres who left the armed struggle and surrendered due to health or other reasons were forced to tell these lies to malign the movement. 
AC: So you deny there have been no cases of sexual abuse?
VR: No, there is always an exception. People who have indulged in sexual abuse have been punished severely and many of them have left the movement.
AC: If ban on CPI (Maoist) is lifted, will it join parliamentary politics?
VR: No! certainly not. There will be a big upsurge in the country if the ban is lifted. There will be mass activities. 
AC: What are your views on other Marxist parties like CPM and CPI (ML)?
VR: They are not Marxist parties at all. They have joined the parliamentary line. One can see the example of Left Front government in West Bengal, where it brought globalization policies in Nandigram, Singur. Only thing is when it comes to secular, democratic issues, particularly fighting against Moditva, we may work in mass organizations along with them. But, as long as they adhere to the imperialistic globalization, one can’t call them communist parties. 
AC: Maoist movement has sharply declined in West Bengal since coming of Trinamool government…
VR: It is slowly regaining strength again. There was a major setback after the so-called encounter of Kishenji, but the Maoist forces are becoming strong again. 
AC: What are your views on Muslim fundamentalism?
VR: As put by friend Gudiva Thiango, International monetary fundamentalism is more dangerous than religious fundamentalism. 
AC: Do you believe in democracy?
VR: Yes, I believe in democracy but in the name of democracy bourgeois dictatorship is being practiced in India. So, we are for “New democracy”. 
AC: It has been alleged that G.N. Saibaba, despite being a disabled, was given an Indian toilet deliberately. That is a violation of human rights. But, what about the rights of the government staffers and officials who are being kidnapped and killed just because they are government staffers?
VR: In any war, it’s not the fault of the soldiers, but what is important is which side they are taking. We can’t help it. We are sorry for the foot soldiers but that is the price one has to pay in a war. They are on the wrong side and we are on the side of the people. Right from the days of Kurukshetra to Second World War, this happened. 
అంటే,పార్లమెంటరీ డెమోక్రసీని తిరస్కరించడంలోనూ తాము చంపుతున్నవాళ్ళ పట్ల నిర్దయతో వ్యవహరించడంలోనూ ఆరితేరిన ఘటమేనని తెలుస్తున్నది కదా!

గౌతమ్ నవ్లఖ

ఇతను మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ పాత్రికేయుడు.People’s Union for Democratic Rights (PUDR)లో చాలాకాలం పాటు క్రియాశీలక సభ్యత్వం కలిగిఉన్నాడు.ఆర్ధికశాస్త్ర పరిజ్ఞానం కూడా ఎక్కువే - నక్సలైట్ల హింసాయుత కార్యకలాపాల్ని సమర్ధించడంలో అఖండప్రజ్ఞానిధి!సా.శ 3011లో ఇతను కాశ్మీర్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇతని వల్ల అక్కడ పర్శానతతకి భగ్నం కలిగే అవకాశం ఉన్నదని చెప్పి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

ఇతను సభ్యుడైన  PUDR గతంలోనూ ప్రస్తుతమూ జార్ఖండ్ రాష్ట్రంలో హిందూ మహిళల్ని బెదిరించి,భయపెట్టి,బ్రెయిన్ వాష్ చేసి మతాంతరీకార్ణకి పాల్పడుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న PFI సంస్త మీద ప్రభుత్వం నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తున్నది - సాకల్ మానవాళికె స్మానత్వం కోసం ఉద్యమించే వీరు అన్ని మతాలనూ సమానంగా చూడాల్సింది పోయి బలవంతపు మతమార్పిడులు చేస్తున్నవాళ్ళని సమర్ధించడం దేనికి?

వరవరరావు మాదిరిగానే ఇతను కూడా నక్సలైట్లు మందుపాతరలు పేల్చి అమాయకుల్ని చంపడాన్ని ఎంతో ప్రతిభావంతమైన విశ్లేషణతో సమర్ధించగలిగిన అఖండప్రజ్ఞానిధి:
---------------------------------------
Posted Apr 23, 2014 by Gautam Navlakha
Places: India
“Maoists target teachers, ambulance” — that was the top headline all across the front page of a national daily, but one has got accustomed to mendacity, couched in righteous indignation. But before passing instant judgment, should we not examine what happened and why?

On 12 April the Maoists detonated two improvised explosive devices (IEDs) in southern Chhattisgarh, one near Ketulnar in Bijapur district, which ripped apart a minibus carrying nine polling staff, including five teachers, returning from duty, the other, which blew up an ambulance carrying five Central Reserve Police Force (CRPF) personnel who had hitched a ride at Darba, apart from a technician and the driver.  A spokesperson of the Dandakaranya Special Zonal Committee of the Communist Party of India (Maoist) has profusely apologized, admitting that the teachers and other employees “died due to our carelessness”.  Maoist cadre apparently targeted the minibus in haste when they “mistook those travelling in [it] . . . for security forces”.  It’s true that security forces, fearing for their lives, often prefer to travel in civilian vehicles alongside civilians, and they even keep changing vehicles to ensure their safety, never bothering about the security of the civilian co-travellers, whose lives they put on the line as a result of such panic.  Indeed, the five paramilitary personnel killed in the ambulance had forcibly hitched a ride on it.

The point we are making is that in a war the rules of engagement are different.  According to the Geneva Convention, combatants should not occupy a school, hospital etc for these sites can then become legitimate military targets of attack.  Thus, destruction of a building which was once a school is not the issue.  What needs to be looked at is whether the school was turned into an armed forces camp or not.  If it was, then by no stretch of imagination are combatants wrong in aiming their guns at such structures.  Answers sought under the Right to Information show that, from July 2000 to July 2012, the Maoists damaged three health centres and impaired 114 schools, of which 92 were battered during 2006-08.   Such statistics need to be put in the proper perspective.

Moreover, the state forces together with what are called “irregulars” or private vigilante outfits have been particularly vicious in perpetrating atrocities on unarmed tribal persons, marked by heinousness of a kind reserved for those deemed to be supporters of the Maoists.  What the paramilitary and state-funded, private vigilante groups and SPOs did in the Chintalnar area of Dantewada district in southern Chhattisgarh between 11 and 16 March 2011 comes to mind.  Or what happened on 28 June 2012 — the CRPF and its CoBRA commandoes fired indiscriminately, killing 19 ordinary villagers of Sarkeguda, Kothaguda and Rajpenta, and put to death with axes those who didn’t die from their bullet wounds.
---------------------------------------

తొలి యవ్వనం నాటినుంచి మొదలుపెట్టి ఇన్ని దశాబ్దాల  పాటు వర్గశత్రునిర్మూలన కోసం అకుంఠిత దీక్షతో పోరాడుతున్న అవిశ్రాంత యోధుడి నుంచి శత్రుస్థానంలో నిలబడినవాళ్ళ మీద కరుణ కోసం ఆశించడం వల్ల ప్రయోజనం ఏమిటి?

సుధా భరద్వాజ్

ఈమె కార్మికోద్యమ నేత,మానవహక్కుల కార్యకర్త - చత్తీస్ గడ్ రాష్ట్రం చేసిన భూసేకరణ విధానం వల్ల నష్టపోతున్న వారి తరపున చాలాకాలం నుంచీ పోరాడుతున్న లాయర్. PUDR యొక్క అనుబంధ సంస్థ అయిన People’s Union for Civil Liberties (PUCL)కి చత్తీస్ గడ్ శాఖలో General Secretary కూడా.

తన అధికారికమైన వెబ్‌సైట్ పేజి మీద, PUCL అఫ్జల్ గురు ఉరితీతను వ్యతిరేకిస్తూ నిరసన ప్రకటించింది - వేముల రోహిత్ ఇంటికొక అఫ్జల్ గురు వంటి తీవ్రవాదిని పుట్టించమనడానికి అఫ్జల్ గురు పట్ల వీరిలాంటివారు కురిపించిన ప్రశంసలే కారణం కావచ్చు! 

Republic TV సుధా భరద్వాజ్ ప్రకాష్ అనే మరొక ఉద్యమకారుడికి రాసిన ఒక ఉత్తరం తమకు దొరికిందనీ దాని ప్రకారం నక్సలైట్లకీ కాశ్మీర్ తీవ్రవాదులకీ కనెక్షన్ ఉన్నట్టు తెలుస్తున్నదనీ ఆరోపించింది.కానీ దానికి అవతలివాళ్ళు కూడా ఒప్పుకునేటంత బలమైన ఆధారాలను చూపించలేకపోవటంతో ఈమె వాటిని కొట్టి పారేశారు.


మనకి నచ్చకపోయినా వాళ్ళొక సిద్ధాంతాన్ని నముతున్నారు,కొన్ని మంచిపనులు చేస్తున్నారు,కొంత హింసని ప్రేరేపిస్తున్నారు,ఆ మంచిపన్లు చేస్తున్నందుకే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తమని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు గనకనే హింసకి పాల్పడుతున్నామని అంటున్నారు - అలాంటప్పుడు నిరాధారమయిన ఆరోపణలు చేస్తే వాళ్ళ వాదనకి మరింత బలం చేకూరుతుందనే ఇంగితజ్ఞానం ఆర్నాద్ గోస్వామి లాంటివాళ్ళకి లేదు.సిద్ధాంత ప్రాతిపదికన ఎదుర్కోలేక వ్యక్తిగత దాడులకి దిగితే సానుభూతి వాళ్ళకే బలం పెంచుతుంది - అది ఇవతలివాళ్ళకి తెలియకపోవటం వాళ్ళ అదృష్టం!

వెర్నన్ గొంజాల్విస్

ఇతను Communist Party of India (Maoist) సభ్యత్వం ఉన్నవాడు,సా.శ 2007లో Nagpur sessions court ఇతనిని Arms Act, Explosives Act and Unlawful Activities (Prevention) Act (UAPA) కింద నేరం చేశాడని నిర్ధారించి శిక్ష విధించింది.

ఈ కేసుకు సంబంధించిన ప్రాసిక్యూషన్ పార్కారం 9 డిటనేటర్లూ 20 జిలటిన్ స్టిక్కులూ ఒక వాకీ టాకీ ఒక కంప్యూటరూ నక్సల్ సాహిత్యమూ ఇతన్ని అరెస్టు చేసిన స్థలంలో దొరికాయి - అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.

నిఘా వర్గాల నివేదిక ప్రకారం ఇతను Maharashtra రేంజిలో మావోయిస్టు పార్టీకి మాజీ సెక్రెటరీ,జాతీయ స్థాయి కేంద్ర కమిటీలో సభ్యత్వం ఉండేది - ఇతని మీద దాఖలైన మొత్తం 20 కేసుల్లో 17 కేసులు బలమైన సాక్ష్యాలు లేకపోవటంతో వీగిపోయాయి.


ఇంతటి మేధావుల్నీ ఒక జీవీత్ కాలంపాటు దరిద్రానికీ శిక్షలకీ ప్రాణభయాలకీ వెరవకుండా తమ లక్ష్యం కోసం పోరాడుతున్న గౌరవనీయులైన వ్యక్తుల్ని వ్యక్తిగతమైన రాగద్వేషాలతో అవమానించడం తప్పు!వీళ్ళలో చాలామంది ప్రభుత్వోద్యోగాలు చేస్తూనో మరేదైనా చిన్నసైజు వ్యాపారం చేస్తూనో కుటుంబాల్ని లేమికి దూరంగా ఉంచినప్పటికీ ఇదే తెలివితేటల్ని స్వార్ధానికి ఉపయోగించుకోదలిస్తే కోట్లకి పదగలెత్తి ఉండేవాళ్ళు. ఏ చెట్టూ లేనిచోట ఆముదపు చెట్లే మహావృక్షాలన్నట్టు చెలరేగిపోతున్న మోదీలూ కేసీయార్లూ చందబాబులూ ఎన్నికల రంగంలోకి దిగి ఎదురు నిలబడితే వీళ్ళ రణనీతి ముందూ వ్యూహనిర్మాణచాతుర్యం ముందూ నిలబడగలరా?ప్రస్తుతానికి అతి తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రబుత్వంలో ఉన్నవాళ్ళని ఈ స్థాయిలో చికాకు పెట్టగలుగుతున్నారంటే అది వారు సాధిస్తున్న విజయం కిందనే లెఖ్ఖ!

అరుణ్ ఫెర్రీరా

జైలు జీవితం ఇతనికి కొత్త కాదు.ఒకసారి బెయిలబుల్ వారంటుతో అరెస్టయ్యి Maharashtraలోని District and Sessions court of Gadchiroli బెయిల్ ఇచ్చేలోపు నాలుగున్నరేళ్ళు జైల్లో ఉన్నాడు - ఆఖరికి 2014లో అన్ని కేసుల్నీ  కొట్టేసింది కోర్టు.


ఇప్పటి కేసులో Unlawful Activities Prevention Act (UAPA)  కింద అరెస్టయ్యాడు.మీడియాకి ఇతను హాట్ ఫేవరేట్ - దుర్మార్గమైన రాజ్యం యొక్క క్రూరహింసకి బలైపోయిన ఇమేజి ఇచ్చేసింది!

ఫాదర్ స్టాన్ స్వామి

ఇతను Vistapan Virodhi Janvikash Andolan (VVJA) అనే సంస్థను స్థాపించి అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడు. Jesuit priest  అయ్యుండి కూడా లెక్క లేకుండా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటూ ఉండటం విశేషమే! ఈ యేడాది మొదట్లోనే Pathalgadi movement సందర్భంలో గొడవల్ని రెచ్చగొడుతున్నాడని ఇతనిమీద FIR దాఖలయ్యింది.


ఒక సీనియర్ పోలీస్ అధికారి ఇతను Elgar Parishad అనే సంస్థతో సంబంధాలు పెట్టుకుని దళితుల్ని హింసాపూరిత కార్యకలాపాల వైపుకి నడిపిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ తగిన సాక్ష్యాధారాలే దొరకడం లేదనీ చెప్తున్నాశు. ఇతను కూడా PUCL సభ్యుడేనని తెలుస్తున్నది.

ఆనంద్ తెల్తుంబ్డె

ఇతను సకల కళా వల్లభుడు - management professional, writer, civil rights activist, ఇంకా political analyst! మీడియాకి ఇతను వ్యాసాల ద్వార చర్చాల్ ద్వారా చిర పరిచితుడే. Goa Institute of Management దగ్గిర పాఠాలు చెప్పే ఫాకల్టీ మెంబర్ కూడాను. తమ మీద వేసిన కేసు గురించి “None of the people arrested last time and today had the remotest connection with Bhima-Koregaon. As for me, I had publicly written critically about observing the Bhima-Koregaon anniversary, incurring the wrath of Dalits,” అని బల్లగుద్ది చెప్పాడు.

ఒక జీవితకాలం పాటు తమ లక్ష్యం కోసం నిజాయితీగా ఆత్మవిశ్వాసంతో శ్రమించే వీళ్ళకీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికీ వచ్చిన అధికారాన్ని కనీసం అయిదేళ్ళ పాటు నిలబెట్టుకోవడానికీ నానా గడ్డీ కరిచే రాజకీయ నాయకులకీ పోలిక ఉందా!వీళ్ళలో ప్రతి ఒక్కరికీ తాము ఎవరికోసం పనిచేస్తున్నారో వాళ్ళనుంచి పూర్తి స్థాయి అభిమానాన్ని పొందుతున్నారు.వీళ్ళలోనే ప్రతిభావంతులైన న్యాయవాదులు ఉన్నప్పుడు వీళ్ళని వ్యతిరేకించేవాళ్ళు వూహిస్తున్న అద్భుతాలు ఏమీ జరగవు.గతంలో రొమిల్లా ధాపర్ బృందం ఆర్య-ద్రవిడ సిద్ధాంతం పేరున అబద్ధాలు చెప్పడం దగ్గిర్నుంచి తమవల్ల చనిపోతున్న అమాయకులను గురించి నిర్దయతో సమర్ధించుకోవడం వరకు తెలిసి చేస్తున్న పనులే కాబట్టి మనం వీరినుంచి పశ్చాత్తాపాలూ మారుమనస్సులూ ప్రాణరక్షణ కోసం వేడికోళ్ళూ ఆశించడం వృఢా!అప్పుడప్పుడు ఒక నలుగురైదుగురు అరెస్టయినా,జైలుకెళ్ళినా,చచ్చిపోయినా అజ్ఞానం,దారిద్య్రం,అంతరువులు సమాజంలో ఉన్నంతకాలం  అజ్ఞానాన్న్నీ దరిద్రాన్నీ అంతరువుల్నీ ధ్వంసం చెయ్యడం అనే జీవితలక్ష్యం ఉన్నవాళ్ళకోసం ఈ చారుమార్గం మూసుకుపోదు!

వీళ్ళని అరెస్టు చెయ్యటానికి కారణమైన సంఘటన మరొక రకమైన దృశ్యాన్ని చూపిస్తున్నది.వీళ్ళలో కొందరి ఇండైరెక్ట్ యాక్టివిటీ ఉండటం వరకు నిజమే గానీ వీళ్ళు మాత్రమే మొత్తం కారణం కాదు - కేంద్రంలో అధికారం చలాయిస్తున్న పార్టీ యొక్క దుడుకుతనం కూడా కీలకమైనదే!

భారతదేశపు గతం కానీ వర్తమానం కానీ భవిష్యత్తు కానీ ఒకవైపునుంచి చూస్తే గొప్పగానూ మరొకవైపునుంచి చూస్తే చెత్తగానూ ఉంటుంది!వ్యతిరేకులు కూడా ఒప్పుకు తీరాల్సిన సత్యం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన వైదిక సాహిత్యం మానవాళి ఆర్జించిన అన్ని వైజ్ఞానిక శాస్త్రాలకీ మాతృకయైన గణితశాస్త్రాన్ని అందించింది.దీని ప్రాచీనతని నిర్ధారించడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికీ లేదు.కొన్ని వందల వేల సంవత్సరాల పాటు గురుశిష్యపరంపరలో సాధించిన జ్ఞానాన్ని ఒక పతిమితమైన కాలానికి కుదించడం అసాధ్యం.వ్యతిరేకులు కూడా ఒప్పుకు తీరాల్సిన సత్యం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన వైదిక సాహిత్యం మానవాళి ఆర్జించిన అన్ని వైజ్ఞానిక శాస్త్రాలకీ మాతృకయైన గణితశాస్త్రాన్ని అందించింది.దీని ప్రాచీనతని నిర్ధారించడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికీ లేదు.కొన్ని వందల వేల సంవత్సరాల పాటు గురుశిష్యపరంపరలో సాధించిన జ్ఞానాన్ని ఒక పతిమితమైన కాలానికి కుదించడం అసాధ్యం.

చాలామంది వేదం అనగానే దేవుడు,మతం,కర్మకాండ,పరలోకం,పునర్జన్మ,పాపం,పుణ్యం అనేవాటికి పరిమితమైనదని అనుకుంటారు.కానీ మొత్తం వైదిక సాహిత్యంలో ఆ విషయాలకి ప్రాధాన్యత చాలా తక్కువ - ఎక్కువ శాతం ఇహలోకంలో మానవులు సుఖశాంతులతో జీవించడానికి ఆధారభూతమైన విషయాలే ఉన్నాయి!చాలాకాలం క్రితమే శ్రీమత్పరమహంస స్వామి జి.యస్.బి.సరస్వతి గారిచే ప్రచురించబడిన వేదార్ద ప్రకాశిక నుంచి కొన్నింటిని ఎత్తి చూపిస్తున్నాను ఇక్కడ.
ఋగ్వేద సంహిత యందలి ముఖ్యసారం
-------------------------------------------
మండలం - సూక్తం - ఋక్కు/మంత్రం -> విషయం
-------------------------------------------
2-3-6->బట్టలు నేయు విద్య
3-53-16->బండ్లు మరియు రధములు చేయుట
53-6-5->లోహపు పనుల విధానము
1-140-10->స్వర్ణకార విద్య అను బంగారపు పని
2-39-8->యుద్ధవీరులకు కవచములు నిర్మించుట,
8-53-2->మరియు వీనిని ధరించు పద్ధతులు
4-34-6->భుజకవచములు తయారుచేయుట
2-34-3->బంగారమును త్రవ్వి యెత్తెడి విధానము
6-46-11->సేనావ్యూహముల విభాగములతో కూడిన సంగ్రామ విధానము
4-47-1,8->కృషివిద్య
10-101-3,7->బావులను త్రవ్వుట,నాగలి చేయుట,విత్తనములు చల్లుట
10-25-4->నూతులు త్రవ్వెడి విధానము
10-93-13->బావుల నుండి నీటిని తోడి పైరులకు పారించు విధానము
1-27-2->సముద్రముపై నావలు నడుపు విధానము
4-55-6->పరదేశములకు సముద్రయానము చేసి ధనమార్జించు విధానము
1-7-16->ఆయుర్వేదం,ఔషధ విధానము
1-117-13->శల్యవిద్య,విరిగిన అవయవముల చికిత్సా విధానము
10-15-13->నక్షత్ర విద్య,చంద్రగతి,ఋతువుల యొక్క
1-164-148->పరివర్తనమునకు కారణము సూర్యుడని నిర్ధారించుట

యజుర్వేద సంహిత యందలి ముఖ్యసారం:
"సహస్ర శీర్షః పురుష" అనే మంత్రం నుంచి "శ్రీశ్చ తే లక్ష్మీచ" అనే మంత్రం వరకు 22 మంత్రములు
అ.30 మం.1.22 సృష్టి విద్య అయం గౌ
అ.9  మం.6  పృధివ్యాది లోకభ్రమణం
అ 18 మం. 24 ఏకాచ మే తిస్రశ్చమే అని ప్రారంభించి ముఖ్యమైన గణితసూత్ర విశ్లేషణము
అ 10:క్షత్రస్య యోనిరసీ మొదలుకొని "త్రాతారమింద్ర మవితారమింద్రం" వరకు రాజప్రజాధర్మ విషయము
అ. 25 మం.1 "పూషణం వశిష్ఠువా" మొదలు "ఇంద్రస్య క్రోతోదిత్యే పాజస్యం" వరకు గల 7 మంత్రములు శరీర ధర్మశాస్త్రం

సామవేద సంహిత యందలి ముఖ్యసారం:
ఇందులో ఎక్కువ ఈశ్వర భక్తి,స్తుతులు ఉంటాయి.అంతే కాదు, నిగూఢమైన బ్రహ్మవిద్యను గురించిన సాంకేతిక విషయం ఉంటుంది.

అధర్వవేద సంహిత యందలి ముఖ్యసారం:
మహద్యక్షం భువనయ్స -> ప్రశ్న,అనువాకం
"ద్వితీయో న తృతీయశ్చ","నమిదం నిగతం","సర్వే అస్మిక్ దేవాః" మంత్రములు బ్రహ్మవిద్యను గురించి
యత్పరమ మనమం దేవాపితరో మనుష్యాః మంత్రములు సృష్టివిద్యను గురించి
సాయంసాయం గృహపతి అంటూ ప్రతి మానవుడు ఆచరించవలసిన పంచయజ్ఞ విధి,గృహస్థ జీవన ధర్మ విధి

బ్రహ్మవిద్య అనేది కూడా మనస్సుని అదుపులో ఉంచుకోవడానికి పనికొచ్చే యోగం,ధ్యానం లాంటి సాంకేతికాంశాలను గురించిన గంభీరమైన తాత్విక చింతనయే - మూఢనమ్మకాల పేరుతో కొట్టిపారవేయడం కష్టం!అసలు ఇతర ప్రాంతాలలో విద్య అనేది ఉందని తెలియని కాలంలోనే ఇక్కడ ఆయిదు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విశ్వవిద్యాలయాలు ఏర్పడినాయి.ఇవన్నీ బౌద్ధమతం పెరిగిన తర్వాత వారు ఏర్పరచినవి.కానీ అంతకుముందు ఎక్కడికక్కడ గురుకుల సంప్రదాయం నడుస్తూ ఉండేది.నలందలో కేవలం బౌద్ధులే ఆచార్యులుగా లేరు, అంతకు ముందు నుంచి తాము సముపార్జించిన జ్ఞానాన్ని హిందూ పండితులు కూడా నిక్షేపించారు.హిందువులు బౌద్ధులు కొట్టుకు చచ్చారనేది హిందూమతద్వేషులు కల్పించిన కట్టుకధ.అది దలైలామా వంటి వారికి తెలుసు.

నలందకు చేరిన అపారమైన జ్ఞానసంపద భక్తియార్ ఖిల్జీ మూలాన ధ్వంసమయితే మిగిలినవి నిరాదరణకు గురయినప్పుడు అక్కడి సాహిత్యమూ నాశనమైపోయింది.అశ్రద్ధ వల్ల కొంత భోగలాలస నుంచి పుట్టిన నిర్లక్ష్యం వల్ల కొంత పోయింది.తొలినాటి వారు సంకలించి గ్రంధస్తం చేసిన దానిలో నేటికి మిగిలినది చాలా తక్కువ.

సనాతనధర్మం తన ప్రాభవాన్ని కోల్పోవడానికి కూడా కర్ణుడి చావులాగే ఆనేక కారణాలు ఉన్నాయి.వాటిలో  బలమైనది మాత్రం రాజకీయాధికారం చేజారిపోవడమే అని నేను భావిస్తున్నాను.రాజనీతికి సంబంధించి ప్రాచీన వైదిక సమాజం ఎట్లా ఉండేది అని ఆలోచిస్తే అంతా అగమ్యగోచరం!పూ.సా.శ 4500 నాటిదని చెప్తున్న వైదిక యుగానికి చెందిన హరప్పా సంస్కృతికి సంబంధించిన వివరాలూ వైదిక సాహిత్యంలో జనమేజయుడి గురించిన ప్రస్తావనలూ "ఆర్య","దాస" వంటి అపార్ధానికి గురయిన కొన్ని పదాలూ బ్రాహ్మణ,వైశ్య,క్షత్రియ,శూద్ర అనే సామాజిక విభజనలూ తెలియడం తప్పించి పూర్తి రూపం కనబడటం లేదు.ఇప్పుడు మిగిలిన అన్ని విషయాలూ మనకి అనవసరం రాజకీయ సుస్థిరతకు సంబంధించిన విషయాలు మాత్రం చూడాలి.అట్లా చూస్తే తొలినాటి మాతృస్వామిక గణరాజ్యం రక్తసంబంధం గాఢాత్ మీద ఆధారపడి ఐకమత్యాన్ని ప్రదర్శించేదని అనుకోవచ్చు.

స్వసమూహలైంగికసంబంధాన్ని నిషేధించిన తర్వాత పురుషస్వామ్యం బలపడి సోదర గణాల ఐకమత్యం క్రమేణ విస్తరించి జనపదాలు అయిన కాలం నుంచి చారిత్రక విశేషాలు ఎక్కువ తెలుస్తున్నాయి.ఆనాటి షోడశ మహాజనపదాలు పరస్పర కలహాల నుంచి పుట్టిన బలమైన సామ్రాజ్య దశలోనికి నడిచాయి.ఈ రాజులు తమ రాజకీయాధికారాన్ని విస్తృతం చేసుకోవడానికి యుద్ధాలు చేసినా పరిపాలనకు పాటించిన సంప్రదాయాలు ఒకటే గనుక ఒక ప్రాంతం ఎంతమంది రాజుల మధ్య మధ్య చేతులు మారినా ప్రజలకి తేడా తెలిసేది కాదు.ఎక్కడో ఒకరిద్దరు తప్ప ఏ రాజూ నిరంతరం యుద్ధాల్లో మునిగి తేలిన దాఖలాలు లేవు.వ్యవసాయం,వ్యాపారం,పరిశ్రమల వంటి వాటిలో ఉత్పాదకతనీ నాణ్యతనీ పెంచడంలో అందరు రాజులూ పోటీ పడటం వల్లనే ప్రపంచం నలుమూలలా హిందూ సంస్కృతికి సంబంధించిన అవశేషాలు అన్ని చోట్లా బయటపడుతున్నాయి.అబ్రహామిక్ మతాలు పిట్టకమునుపు అసలు మతం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు, ప్రపంచ మానవాళి సనాతన ధర్మాన్నే పాటించింది!

సా.శ 10వ శతాబ్దం నుండి చెదురుమదురు దాడులతో మొదలైన ఇస్లామిక్ యోధుల ప్రభంజనం బాబర్ ఢిల్లీ కోటని పట్టడంతో ఈ దేశచరిత్రలో సుస్థిరమైన ప్రభావాన్ని చూపించేటంత స్పష్టమైన రూపం దాల్చింది.ఇతను ఓడించినది కూడా ముస్లిం పాలకుణ్ణే గానీ అతను ఇంత ప్రభావశీలి  అయిఉండేవాడు కాదేమో!చాలామంది హిందూ రాజులలో ఐకమత్యం లేకపోవడం వల్లనే ఇవన్నీ సంభవించాయని అనుకుంటారు.కానీ అది పూర్తిగా తప్పు.అప్పటి ఢిల్లీ నవాబు ఎందుకో తుపాకిమందు వంటి ఆధునికతని సాధించుకోలేదు.వీళ్ళకి సమకాలికుడైన దక్షిణాదికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు అప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఒక మహాసైన్యాన్ని నిర్మించుకుని ఉన్నాడు - బాబరు గనక తొందరపడి దక్షిణాదికి వెళ్ళి ఉంటే అతని చేతిలో మట్టికరిచి ఉండేవాడు!

ఉత్తరాదిలో ముస్లిముల పాలన మొదలైన చాలాకాలం వరకు దక్షిణాదిలో వాళ్ళ అలికిడి లేదు.అయితే,ఔరంగజేబు,బహమనీ,ఆదిల్షాహీ,నిజాం షాహీ వంటివాళ్ళ వల్ల దక్షిణాదిన కూడా ప్రవేశించింది,వ్యాపించింది,హిందూమతం ఇష్టమైన పాలకులు హిందూమతాన్నీ జైనమతం ఇష్టమైన పాలకుడు జైనమతాన్నీ బౌద్ధమతం ఇష్టమైన పాలకులు బౌద్ధమతాన్నీ ప్రోత్సహించినట్లుగానే ముస్లిం పాలకులు ఇస్లామునూ ప్రోత్సహించారు.ఈ పాలకులు ముస్లిములే గానీ ఇస్లామిక్ రాజ్యం అనేదాని ముఖ్యలక్షణమైన ఖలీఫాకి నిర్నిబంధమయిన విధేయతని ప్రకటించినట్టు ఆధారాలు లేకపోవటం వల్ల ఇది పూర్తి స్థాయి ఇస్లామిక్ రాజ్యం కాకపోవచ్చు. కొన్ని శతాబ్దాలు గడిచాక పారిశ్రామిక విప్లవం ఇచ్చిన హుషారుతో అన్ని దేశాలనూ ఆక్రమించిన బ్రిటిషర్లు భారతదేశాన్ని కూడా వశం చేసుకుని వలసరాజ్యం స్థాపించారు.


శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఇక్కడ విడిది చేసిన విదేశీయుల సౌకర్యం కోసం చర్చిలు కట్టిన ఆధారాలు ఉన్నాయి గానీ ఇంగ్లీషువాళ్ళ అధికారం స్థిరపడిన తర్వాతనే క్రైస్తవం ఎక్కువ వ్యాపించిందని తెలుస్తుంది.అంతకుముందు పరిచయం లేని ఒక కొత్త సంస్కృతి తమ తలుపు తడుతున్నప్పుడు "పురాణ మిత్యేవ న సాధు సర్వం!" అని కొత్త సంస్కృతిని ఆహ్వానించేవాళ్ళూ ఉంటారు,"నవీన మిత్యేవ న సాధు సర్వం!" అని తిరస్కరించేవాళ్ళూ ఉంటారు.సంస్కృతులకు సంబంధించి స్వపర భేదం ఉంటుంది కానీ ప్రజల్ని పరిపాలించే రాజకీయాధికారానికి స్వపర భేదం ఉండదు.హిందూ ముస్లిం క్రైస్తవ పాలకులు అందరూ పరిపాలనకి సంబంధించి ఒకే సంస్కృతిని ప్రదర్శించారు.అయితే ముస్లిం పాలకులు ఇక్కడి ఆదాయాన్ని ఖలీఫాకి పంపించలేదు గానీ ఈస్టిండియా కంపెనీ రద్దయి దేశం రాణి అధీనంలోకి వెళ్ళడం వల్ల నిధులూ ఆదాయమూ కూడా లండనుకి తరలించబడినాయి - వలసరాజ్యపు లక్షణమే అది కదా!

ఈ విభిన్నతయే ముస్లిములు కలిసిపోయినంత స్థాయిలో క్రైస్తవులు హిందువులతో కలిసిపోలేక ఎడంగా ఉండిపోవటానికి ఒక కారణం కావచ్చు -క్రైస్తవ మతప్రచారకుల మతమార్పిడులు అగ్నికి ఆజ్యం పోశాయి.ప్రధమ బారత స్వాతంత్య్ర పోరాటం అని పిలుచుకునే సిపాయి కలహం నాడు హిందువులూ ముస్లిములూ కలిసే పోరాడిన చరిత్ర కళ్ళముందు కనబడుతుంది. పాకిస్తాన్ ఏర్పాటును సుగమం చేసుకోవడం కోసం నాయకులు విడగొట్టేవరకు స్వాతంత్య్రోద్యమంలో హిందువులూ ముస్లిములూ కలిసి నడిచారు. కానీ క్రైస్తవులు అంత ఎక్కువ సంఖ్యలో కలిసి రాలేదు.ఉద్యమం నడుస్తున్న కాలంలో అది పెద్ద విషయమని కూడా ఎవరూ అనుకోలేదు - పోనివ్వండి!

ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం నాడు హిందువులతో కలిసి పోరాడిన ముస్లిములు ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం నాటికి హిందువులతో కలిసిఉండలేమని భీష్మించటానికి కారణమైన వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్.ఇతని పూర్వీకులు మొఘల్ పరిపాలనా కాలంలో పై స్థాయి ప్రభుత్వానికీ కింది స్థాయి ప్రజానీకానికీ మధ్య శ్రేణి ఉద్యోగులుగా పని చేశారు.అదే వరసలో ఇతని కాలానికి ఆంగ్లేయులు పై స్థాయి వారయ్యారు.అన్ని కాలాల లోనూ అన్ని ప్రాంతాల లోనూ అన్ని రాజ్యాల లోనూ ఈ మధ్యశ్రేణియే చాలా కీలకమైనది.వీళ్ళు మంచివాళ్ళయితే రాజు చెడ్డవాడైనా మంచిపేరు తెచ్చుకుంటాడు. వీళ్ళు చెడ్డవాళ్ళయితే రాజు మంచివాడైనా చెడ్డపేరు తెచ్చుకుంటాడు.యూరోపియన్ ప్రభువులకి ఒక అలవాటు ఉంది.తాము బతిఉండగానే సమాధి మీద తమ గురించి కవితాత్మకమైన పొగడ్తల్ని రాయించి చూసుకుని మురిసిపోయేవాళ్ళు.అదే వరసలో ఒక కవి ఒక రాజు గురించి "ఒక్క చెడ్డ మాట మాట్లాడలేదు!ఒక్క మంచిపని చెయ్యలేదు!" అని రాసి తెచ్చాడు.నిజానికి అందులో కాలగూడని చోట సురసిర కాల్చేటంత భయంకరమైన వ్యంగ్యం ఉంది:-)రాజుందుర్మార్గుడయితే రాసినవాడి తల ఎగిరిపోవటం ఖాయం!రాజుగారు మంచివాడు కాబట్టి "మాట్లాడటం నేను చెయ్యగలిగిన పని కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను!పనులు చెయ్యాల్సింది అధికారులు కాబట్టి వాళ్ళని నేను కంట్రోల్ చెయ్యలేను!" అనేసి వూరుకున్నాడు.

అంత ముఖ్యమైన స్థానంలో ఉన్న ఈ సయ్యదు గారు కూడా మొదట్లో కులీనదర్పపు ఔదార్యం ఒలకబోస్తూ హిందువులకీ ముస్లిములకీ ఇంగ్లీషు చదువుకుని ప్రభుత్వోద్యోగాలు సంపాదించుకుని బాగుపడమని ఉబోస లిస్తూ ఉండేవాడు.ఆయన అహానికి మొదటి దెబ్బ సిపాయి కలహంతో పడింది.ముస్లిములని కాళ్ళావేళ్ళా పడినా వాళ్ళు ఇతని మాట విన్లేదు.తిక్కరేగి ఇంగ్లీషువాళ్ళ మీదనే తిట్లపురాణం ఎత్తుకున్నాడు. మీరే ఈ తిరుగుబాటుకి కారణం అని చాలా హడావిడి చేశాడు.ఆఖరికి ఇంగ్లీషువాళ్ళు లందను రమ్మని కనురంపి సంజాయిషీ అడిగేటప్పటికి తెలివి తెచ్చుకుని ఇంగ్లీషు వాళ్ళకి తిరుగుబాటు వల్ల కలిగిన ఇబ్బందికి మనస్తాపం చెంది అలా విమర్శించానని చెప్పుకుని మర్యాదని కాపాడుకున్నాడు.ఈ ముచ్చట గడిచి మూడ్ మార్చుకునే లోగానే హిందీ - ఉర్దూ కలహంలో ఇతను సమర్ధించిన ఉర్దూకి బదులు హిందీకి సపోర్టు పెరగడంతో ఖాజీ సాయిబు తురకల్లో గల్సినట్టు మరింత రెచ్చిపోయాడు.అప్పటినుంచి హిందువులకి తూ చ్చి చెప్పేసి ముస్లిముల కోసం మాత్రమే పనిచేస్తూ స్కూళ్ళూ,కాలెజిలూ,ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ లాంటివాటిని స్థాపించి పోషించి సా.శ 1930ల కల్లా స్వతంత్రం వస్తే ప్రధాని పదవికి పోటీ పడే స్థాయిలో ముస్లిం నాయకుల్ని తయారు చేశాడు!

ఏమైతేనేం, సా.శ 1947లో బ్రిటిష్ ఇండియా అనే పేరుతో ఉన్న దేశం అప్పటికి గుర్తింపు పొందిన ప్రపంచంలోని అన్ని దేశాలూ ఒప్పుకున్న ఖచ్చితమైన సరిహద్దులతో ఆధునికమైన పార్లమెంటరీ డెమోక్రసీని పాటించే ఇండియన్ రిపబ్లిక్ అవతరించింది!

అయితే, పోరాటంలో పాల్గొని స్వతంత్రం తీసుకొచ్చిన కొద్దిమంది నాయకులు అయినంత స్థాయిలో ప్రజానీకం ఎడ్యుకేట్ కాలేదు - నిన్నటి మొన్నటి పాలకుల వల్ల అలవాటయిన ఫ్యూడల్ మనస్తత్వం నుంచి బైటికి రాలేదు.తమ స్వైరకల్పనలలో తాము మునిగి తేల్తున్న స్వాతంత్య్రానంతర ప్రభుత్వాధినేతలు ఈ వైరుధ్యాన్ని పట్టించుకోలేదు - అన్నింటినీ "గిసే గిసే గిర్ జాయేంగే..." అని కొట్టి పారెయ్యటం ఆనవాయితీ అయిపోయింది అందరికీ.తమ పాటికి తాము న్యాయంగా పరిపాలిస్తూ అభివృద్ధిని నమోదు చేస్తూ ఉంటే చాలు సమస్యలు వాటంతటవే పరిష్కారం అయిపోతాయని అనుకున్నారు.కానీ అలా జరగలేదు.వారి కృషి వల్ల ఎంతో కొంత అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే గానీ సామాజికుల మనస్తత్వాలు నిరంతరాయమైన అభివృద్ధిని సాధిస్తూ అభివృద్ధి ఫలాల్ని అందరూ పంచుకునే విధంగా ఉండటానికి బదులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ అభివృద్ధిని కుంటుపరుస్తూ మళ్ళీ పరాధీనత తప్పదేమోనని భయపడే విధంగా తయారయ్యాయి.

ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన దేశం మొత్తం ఒక రకమైన వాతావరణలో ఉంటే భీమా-కోరేగావ్ ప్రాంతంలో మరో రకమైన వాతావరణం కనబడుతుంది.సా.శ 1818 జనవరి 1న ఇగ్లీషు సైన్యంలో ఉన్న కొద్ది మంది మెహర్ సైనికులు రెండవ బాజీరావు అధ్వర్యంలో నడిచిన పెద్ద సైన్యాన్ని వోడించారు.ఇంగ్లీషువాళ్ళు దానికి గుర్తుగా అక్కడొక విజయస్తంభం నిర్మించి మెహర్ వీరుల పేర్లని చెక్కించారు.ఇంగ్లీషువాళ్ళ పాలనలో ఏమి జరిగిందో గానీ స్వతంత్రం వచ్చాక అంబేద్కరీయులు దీనిని సామ్రాజ్యవాదం-జాతీయవాదం కోణం నుంచి గాక బ్రాహ్మణాధిపత్యం-దళితోద్యమం అనే కోణం నుంచి తాము చూసి ఇతర్లకి చూపించడం మొదలుపెట్టారు.

తమ కులంలోనో మతంలోనో గొప్ప వీరులు గానీ గొప్ప నేతలు గానీ ఉంటే వారిని స్మరించుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు.మహాత్మా గాంధీ ఇంగ్లీషువాళ్ళు మనకి అన్యాయం చేస్తున్నారని దితీయ స్వాతంత్య్ర సంగ్రామం పేరుతో వారిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలని పోరాడుతున్న సమయంలోనే రెండవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తే భారతీయుల్ని ఇంగ్లీషువాళ్ళ తరపున యుద్ధానికి వెళ్ళమని పిలుపు ఇచ్చాడు.ఇంగ్లీషువాళ్ళు అడిగారో లేదో తెలియదు - తమ మీద పోరాడుతున్నవాళ్లని తమ తరపున యుద్ధానికి వాళ్ళు ఎట్ల పిలుస్తారు?వాళ్ళు ఒప్పుకున్నారో లేదో తెలియదు గానీ యుద్ధంలో సహాయం చేస్తే యుద్ధం పూర్తయ్యాక ఇంగ్లీషువాళ్ళు స్వతంత్రం ఇస్తామన్నారని అనుకున్నారు.యుద్ధం అయ్యాక ఇంగ్లీషువాళ్ళు స్వతంత్రం ఇవ్వలేదు.అయినా గాంధీ గారి పిలుపుకి స్పందించి ఆ యుద్ధంలో పాల్గొన్నవాళ్ళు నిజాయితీగానే పోరాడారు.కొందరు అమరు లయ్యారు,కొందరు క్షేమంగా తిరిగొచ్చారు.వారిని స్మరిస్తే పాప్యులారిటీ రాదు కాబట్టి వారు అనామకులుగానే మిగిలిపోయారు!

ఎవరూ లాభం లేకుండా ఏ పని చెయ్యనప్పుడు అంబేద్కరీయులు తమ లాభం కోసం ఆ మెహర్ సైనికుల్ని వాడుకుంటే తప్పేమిటి?చూసీ చూడనట్టు పోవచ్చుగా!ఇన్ని వందల యేళ్ళ పాటు ఆ కార్యక్రమం చిన్న చిన్న సంఘటనలు తప్పించి పెద్ద సంచలనం రేకెత్తించకుండా జరిగిపోయి ఈ సంవత్సరం మాత్రమే ఎందుకు ఇంత భీబత్సాన్ని రగిలిస్తున్నది?ఇన్నేళ్ళు మామూలుగా జరిగినప్పుడు ఇవ్వాళ జరిగినది కాకతాళీయమైన ఒక సంఘటనకి అనుకోకుండా చెలరేగిన విధ్వంసమా!

నేను ఇదివరకే చాలాసార్లు చెప్పాను - స్వతంత్రం వచ్చిన దగ్గిర్నుంచీ జరిగిన ఏ ఒక మతకలహమూ ఏ ఒక  సామాజిక విధ్వంసమూ అనుకోకుండా జరిగినది కాదని - ఇక్కడ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు పధకం ప్రజారం నడిపించిన దుష్ట రాజకీయం ఇది!

సా.శ 2018వ సంవత్సరం అసలు "బ్రాహ్మణ పీష్వాల మీద మెహర్ సైనికులు విజయం సాధించిన యుద్ధం" జరిగి 200 యేళ్ళు అవుతుంది.దానితో ఈసారి జనసమీకరణ పెద్ద స్థాయిలో జరుగుతుందనీ ప్రసంగాలలో తీక్ష్ణత పెరుగుతుందనీ దానిమీద ఆసక్తి ఉన్నవారు ముందునుంచీ వూహిస్తున్నదే!వూహించిన విధంగానే,దళిత బహుజన మేధావులు ఆనాటి పీష్వాల స్వస్థానం అయిన Shaniwar Wada అనే చోట "Elgar Parishad" పేరుతో బహిరంగ సభ జరిపారు.ప్రసంగాల లోని విషయం మోదీ ప్రధానిత్వంలో నడుస్తున్న భాజపా హిందూత్వ రాజకీయాల్ని "నయా పీష్వా వాదం" అని యుద్ధానికి పిలుపు ఇవ్వడమే!

మోదీ ముఖ్యమంత్రిత్వంలో జరిగిన గుజరాత్ అల్లర్ల సమయం నుంచీ ఈ మాట వినబడుతూనే ఉన్నప్పటికీ ఈసారి బలంగా వినపడటంతో భాజపా శ్రేణూలకి తగలరాని చోట మూలాలు కదిలిపోయేటంత దెబ్బ తగిలింది.పైకి ఎంత హిందూత్వం కబుర్లు చెప్పినా ఒక బలమైన వోటు బ్యాంకు తమకి దూరం అయితే గెలుపు కష్టమే కదా,అసలు ఏ రాముణ్ణి నిచ్చెనమెట్టుగా వాడుకుని అధికారంలోకి వచ్చారో ఆ రాముణ్ణే కూరలో కరివేపాకుని తీసేసినట్టు మర్చిపోయింది కూడా అందుకే కదా!

ఆ పరిస్థితి కాంగ్రెసుకి గనక వస్తే వెంఠనే దేబిరింపుల సెక్షన్ ఓపెన్ చెస్తుంది,"మేం మీకేం అపకారం చేశామండీ!మా పొట్ట కొట్టకండీ!మీకేం కావాలో చెప్పండీ!ఏది కావాలన్నాఇస్తామండీ!అధికారం మాత్రం లాక్కోవద్దు,లాక్కోవొద్దు,లాక్కోవొద్దు!" అని ఘొల్లున యేడుస్తూ కాళ్ళ బేరాని కొచ్చేస్తుంది.కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అలాంటివాళ్ళు కాదు,బతిమిలాడుకుని పని సాధించుకోవటం కన్న బెదిరించి పని జరిపించుకుని గర్వించడంలో ఉన్న మజా యేమిటో తెలిసినవాళ్ళు - వెరైటీ కోసం రూటు మార్చారు.గొడవలు జరిగాయి.సంచలనం మొదలైంది.దళిత నేతలకీ కావలసింది అదే కద - ఇరు వర్గాలూ సంచలనం నుంచి ఎవరి లాభం వాళ్ళు పిండుకునే ప్రయత్నాలు చేశారు.

ఇది అనుకోకుండా ఒక నిప్పురవ్వ  లాంటి చిన్న సంఘటన జరిగి అది పెద్దది కావడం కాదు.పోలీసుల పరిశోధన తర్వాత తేలిన విషయం యేమిటంటే,కేంద్రంలో ఇప్పుడు అప్రతిహతమయిన అధికారం అనుభవిస్తున్న పార్టీకి చెందిన స్థానిక నాయకులు పధకం ప్రకారం చేసిన పనుల వల్లనే గొడవలు జరిగాయి!డిసెంబర్ 29న Bhima Koregaonకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న Vadhu Budruk గ్రామంలో Govind Gopal Mahar సమాధి దగ్గిర ఒక సైన్ బోర్డు వెలిసింది.ఈ మహర్ కులస్థుడు చత్రపతి శంభాజీ మహరాజుకి అంత్యక్రియలు జరిపించాడట - అదీ ఔరంగజేబు ఆజ్ఞని ధిక్కరించి!అయితే,స్థానిక మరాఠాలలోని ఒక కుటుంబం తమ పూర్వీకులే అంత్యక్రియలు జరిపించారని నమ్ముతారు - అంటే,"ముల్లును ముల్లుతోనే థీయవలె!వజ్రాన్ని వజ్రంతోనే ఖోయవలె" అన్నట్టు మెహర్లని మహర్లతో కొట్టడానికి అల్లుతున్న కొత్తకధ అని తెలియడం లేదూ!మరాఠాలు దీన్ని తప్పుడు చరిత్ర అంటూ గొడవ మొదలుపెట్టారు.అదే రోజు సాయంకాలం దళితులు ఆ బోర్డును ధ్వంసం చేసినందుకు మరాఠాల మీద SC/ST Prevention of Atrocities Act కింద కేసు ఫైల్ చేశారు.పోలీసులూ స్థానిక నాయకులూ ఇరుపక్షాల్నీ కూర్చోబెట్టి బతిమిలాడుకోవటంతో అప్పటికి సద్దుమణిగిన ఉద్రేకాలు మళ్ళీ  పొంగుకొచ్చి ఏడుగురికి గాయాలయ్యాయి,ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు స్థానికుల అభిప్రాయాల్ని సేకరించి జరిపిన విచారణలో radical Hindutva leader  అయిన Milind Ekbote మరియు Sambhaji Bhide ‘Guruji’. అనుచరుల ప్రమేయం ఉందని తేలింది.Ekbote తరచు  సమాధిని సందర్శిసూ ఉండటం,దాన్ని పరిరక్షించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చెయ్యటం అందరికీ తెలిసిన విషయమే!ఈ రకమైన విషయాలు బయట పడటం వల్ల అధికారంలో ఉన్న హిందూత్వ పార్టీకి లాభం గూబల్లోకి వచ్చి బోల్డు ఖోపం వొచ్చేసింది.తమ బొక్కని కప్పుకోవటానికీ అమాయక ప్రజల్ని కొంతకాలం దృష్టిని ఈ గొడవ నుంచి మళ్ళించటానికీ "అర్బన్ నక్సల్స్ ఏరివేత" నాటకం మొదలు పెట్టారు!అయితే, వాళ్ళలోనే మంచి లాయర్లు ఉండి,జైలుశిక్షలకి కూడా వెరవ్ని మొండితనం ఉండి,వీళ్ళ కన్న పదిరెట్లు పోరాటపటిమ ఉన్న నక్సలైట్లని వీళ్ళు ఏమీ చెయ్యలేరు, అది వీళ్ళకీ తెలుసు!భీమా-కొరెగావ్ అల్లర్లలో తమ ప్రమేయం ఉందనే విషయం మరుగున పడిపోతే చాలు ఈ అధికార బధిరాంధక శవాలకి!

దళిత నాయకులు ఆంగ్లసైన్యం తరపున పోరాడిన వీరుల్ని వారి శౌర్యాన్ని మెచ్చుకోవడం వరకు చేస్తే ఎలాంటి అభ్యంతరమూ లేదు.కానీ ఆ మహత్కార్యాన్ని తీసుకొచ్చి ఇవ్వాళ్టి మనుగడ కోసం నడుపుకుంటున్న రాజకీయాలకి వాడుకోవటం నీచత్వాలలోకల్లా పరమ నికృష్టమైనది!ఒక సైన్యం ఇంకో సైన్యాన్ని గెలవడానికి అనేకమైన కారణాలు ఉంటాయి.ఆంగ్లేయుల తరపున పోరాడిన  మెహర్లకి ఆంగ్లేయులు ఇచ్చిన శిక్షణ పీష్వాలు తమ సైనికులకి ఇచ్చిన శిక్షణ కన్న అధునాతనం అయినా మెహర్లు పీష్వాలని ఓడించటం సాధ్యమే.సైన్యాన్ని నడిపించే యుద్ధవ్యూహాలు పటిష్టమైనవి అయినా కూడా సైనికుల సంఖ్యతో సంబంధం లేకుండా గెలుపు సాధ్యమే.ఒకోసారి రెండు సైన్యాలూ తలపడిన యుద్ధభూమి కూడా క్రికెట్ మ్యాచిల్లో పిచ్ మాదిరి ఓడిపోతుందనుకున్న సైన్యానికి గెలుపుని సాధించి పెడుతుంది.ఇవ్వాళ్టి దళిత నాయకుల్లో అమాయకులు ఎవరూ లేరు,వారూ విద్యావంతులే,నిజాలు వారికీ తెలుసు. లాభం కోసం ఇలా "సగం నిజం-సగం అబద్ధం->పూర్తి నిజం!" అనే పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు.

ఈ మధ్యనే తూర్పుగోదావరి జిల్లా శ౦ఖవర౦లో ఒక ఇన్సిడె౦ట్ జరిగింది.ఒక కాలనీలో పెళ్ళి వేడుక జరుగుతుంది. ఆ వేడుకకి అటె౦డ్ ఆయిన వాళ్ళలో కొ౦దరికి మాటా మాటా వచ్చి కొట్లాటకి దారితీసి ఇద్దరిని సజీవ దహనం చేసి చ౦పేశారు. మర్నాడు న్యూస్ లో ఒక ఐటమ్ గా ప్రచురితమై రెండవ రోజుకి మరుగునపడిపోయి౦ది. మూడవ రోజున మర్చిపోయారు.ఇదే గొడవ వేరే సామాజిక వర్గానికి, వీళ్లకు వచ్చి పై ఇన్సిడె౦ట్ జరిగియు౦టే ఈ వార్త రెండు రోజులకు మరుగున పడి ఉండేదా?

దళిత నాయకులు మినిమ౦ ఓ నెల రోజులు గలీజ్ చేయకుండా ఉండడం జరుగుతుందా? ధర్నాలు చేయకుండా ఉ౦టాయా? కమిటీలు వేయకుండా ఉ౦టాయా? సి.ఎమ్ రాజీనామా కోరకు౦డా ఉ౦టాయా?అ౦టే ప్రాణం ఎలా పోయింది అన్నది కాదన్న మాట ముఖ్య౦. ఎవడి చేతిలో పోయి౦దనేది ముఖ్య౦ అన్న మాట!

లాభానికీ ప్రయోజనానికీ ఇంత గట్టిగా అంకితమైనవాళ్ళ దగ్గిరకెళ్ళి "మనస్సాక్షి,పాపభీతి" అనే సొల్లుకబుర్లు చెప్పి వాళ్ళని దారికి తెచ్చుకోగలమన్న భ్రమ నాకైతే లేదు.అప్పటి బ్రాహ్మణులు మా పూర్వీకుల్ని పుట్టుకని బట్టి అవమానించారు అని అంటూనే ఇప్పటి బ్రాహ్మణుల్ని పుట్టుకని బట్టి దూషించడం అంటే నీ అశుద్ధాన్ని నువ్వే తినడం అని వాళ్ళకి అర్ధం కావాలి,ఎప్పటికి అర్ధం అవుతుంది?


మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పుస్తకాల్లోని యుద్ధాలని చూసినా చాలు ఏ యుద్ధమూ "అణిచివేతకి గురయిన మెహర్లు బ్రాహ్మణుల మీద గెలిచి తీరాలనే ఆవేశంతో యుద్ధం చెయ్యడం" లాంటి ఒకే ఒక కారణం గెలుపుని తెచ్చిపెట్టదని తెలుస్తుంది.అధికారంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని ఇవన్నీ ప్రజలకి క్షీత్రస్థాయిలో చెబితే క్రమంగా ఈ "మెహర్ల విజయం దళిత విజయం" అనే వాదన బలహీన అపడుతుంది.కానీ ఇలాంటి పనులు వాళ్ళు జనవరి 1న హడావిడి చేస్తారు గాబట్టి మనం డిసెంబరులోనే హడావిడి మొదలు పెడదాం అనే మనస్తత్వంలో ఇన్నవాళ్ళు చెయ్యలేరు.కేరళ వరదలకి దేశంలోని ప్రతివాడూ అయ్యో అంటుంటే ఒక కుయ్యా "వాళ్లు గోమాంసం తింటున్నారు,అందుకే వరదలు వచ్చాయి,వాళ్ళకి సాయం చెయ్యకండి!" అని అంటున్నవాళ్ళని మనం మళ్ళీ మళ్ళీ గెలిపిస్తూ ఉంటే  మళ్ళీ మళ్ళీ ఇలాంటి భీబత్సాలు జరుగుతూనే ఉంటాయి.

ప్రపంచం మొత్తాన్నీ వర్గరహితసమాజం అనే అద్భుత వ్యవస్థలోకి నడిపించగలమనే కమ్యూనిష్టులూ దళితుల కోసం అహరహం శ్రమిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ఆయా సంస్థల చైర్మన్లూ అరచేతిలో స్వర్గాలు చూపించే మ్యానిఫెస్టోలని ప్రకటిస్తున్న రాజకీయ నాయకులూ నిజాయితీగా ప్రజల కోసం కాకుండా అస్మదీయులకు సంపదల్ని దోచిపెట్టడానికే పరిశ్రమిస్తున్నారు.అన్నింటిలోనూ భాజపా వ్యూహమే మరింత ప్రమాదకరమైనది!ఇటు హిందువుల వోట్లతో అధికారానికి వచ్చి హిందువుల కోసం ఏమీ చెయ్యకుండా వీళ్ళని మోసం చేస్తూనే మైనార్టీల వోట్ల కోసం వాళ్ళనీ చీల్చుతూ దేశాన్ని అంతర్యుద్ధం వైపుకి నడిపిస్తున్నది - కాబట్టి ఈసారి బలాన్ని తగించి పొగరును దించాలి.వోడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా తప్పు లేదు.

వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల సాక్షిగా నేను చెబుతునది ఓకటే - తను తప్ప దేశానికి దిక్కు లేదనుకునే పార్టీ అత్యంత భయానకమైనదని రాజనీతిజ్ఞులు ఘోషిస్తున్నది పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!! 

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...