Saturday, 2 September 2017

అయ్యా,ముష్టాఖ్ అహ్మద్!విగ్రహారాధనే అంత పాపమైతే దారి దోపిడీలూ మూకుమ్మడి చంపుళ్ళూ ఇంకెంత పాపం కావాలయ్యా?

Hello Mr.Abhilash,
=======================
          A year after his arrival in Medina, and thirteen years after his ‘call’, the apostle of Allah prepared himself for war in obedience to the command of Allah that he should attack the idolaters. He was then fifty‑three years old.


          Religious hostility and a measure of personal resentment against the Quraysh idolaters were deeply implanted in the mind of the apostle. He had sworn vengeance against them and, now that his followers were settled in Medina, he felt the time had come to make good his threats.

          Not far from Medina was the main caravan route which the Quraysh used in their trade with the north. Frankincense, silk, precious metals and leather passed regularly back and forth between Mecca, Syria, Abyssinia, and the Yemen. The prizes were too rich not to add an irresistible weight to basically religious and political impulses. And attack on the caravans of the Quraysh meant an attack on what was simultaneously their weakest and most valued link.

          This was the first occasion on which the white banner of Muhammad was seen. Muhammad sent out from Medina sixty or eighty of the Emigrants, led by Ubayda; none of the Helpers accompanied them. They rode as far as the water in the Hijaz and there found a great trading caravan of Quraysh from Mecca. There was no battle, but Sad shot an arrow which was the first arrow shot in Islam. Then the parties separated. Two men fled from the Unbelievers to join the Muslims; these were al‑Miqdad and Utba.

          At the same time, the apostle sent his uncle, Hamza, with thirty riders to the sea‑coast at al‑Is; there they met a party of three hundred men from Mecca, led by Abu Jahl, but a man named Majdi ‑who was on good terms with both sides ‑mediated between them and they separated without coming to blows. Hamza also bore a white banner which had been tied on by Muhammad, and some say that this was the first time the banner was seen; but his expedition and that of Ubayda occurred at the same time and this has caused the confusion.

          The apostle himself next went forth in search of the Quraysh and reached Buwat, in the direction of Radwa. But he returned to Medina without encountering his enemies and remained in Medina for some weeks before he again went forth. He passed through the valley of the Banu Dinar, then through Fayfau‑l-Khabar, then halted under a tree in the valley of Ibn Azhar. Food had been prepared for him nearby; there he prayed, and there his mosque is. He and his companions ate, and the very spot on which his cooking‑vessel stood is still known. He continued his journey until he reached al‑Ushayra in the valley of Yanbu and remained there for a month, forming alliances with neigh­bouring tribes along the sea‑coast, before returning to Medina. He encountered no enemies, the caravan from Mecca ‑ com­manded by Abu Sufyan ‑ having passed before he reached al‑Ushayra.

          When he returned from the expedition to al‑Ushayra, the apostle remained at Medina for only ten nights before he had to sally out against one Kurz, who had plundered the herds of Medina. He marched as far as the valley of Safawan in the region of Badr, but was unable to overtake Kurz, and returned to Medina, where he remained for a further two months. This was the first expedition to Badr.

          Shortly after this expedition to Badr the apostle sent Abdullah b. Jahsh and eight Emigrants on a journey. He gave a letter to Abdullah, but ordered him not to read it till the end of a two days' march; he also told him to avoid giving offence to any of his companions.

          After Abdullah had marched two days' journey, he opened the letter, and found it contained the following instructions: 'Go on to Nakhla, between Mecca and Al‑Taif, and keep watch over the Quraysh there and bring back news of their business.' Abdullah said, 'I read and obey!' Then he told his companions about the letter, and added, 'He has also prohibited me from forcing any one of you to do anything against his will. If, therefore, any of you wishes to earn martyrdom, let him come with me; but if not, let him go back.' All his companions went with him, and none remained behind, but at Bahran two of the travellers lost the camel which they had been riding in turns and they fell behind to look for it. Abdullah marched on with the rest of his companions to Nakhla, where they came upon a Quraysh caravan laden with raisins, tanned hides, and various other goods., and accompanied by four men.

          When the caravan saw Abdullah and his companions they were afraid because they had alighted so near to them, but when Ukkasha – whose head was shaved like that of a pilgrim – approached them, they recovered their confidence and said, “These are pilgrims, and we need have no fear of them.’

          This took place on the last day of the sacred month Rajab [October]. Abdullah and his companions conferred among themselves: ‘If we allow these people to continue and reach sacred territory tonight, they will be safe from us; but if we attack them now, we profane the sacred month.’ And they vacillated and hesitated to attack, but at last mustered up their courage and agreed to slay as many of the Quraysh as they could, and take possession of what they had with them. So Waqid shot an arrow and killed one of the Quraysh, two others were made prisoner, and the fourth fled.

          Then Abdullah, with his companions, the caravan, and the prisoners, returned to Medina, saying, One fifth part of our plunder belongs to the apostle of Allah.’ This was before Allah had made it encument on Believers to give up a fifth part of any booty to Him. One fifth of the caravan was set aside for the apostle of Allah, and Abdullah distributed the rest anong his companions.

          When they arrived at Medina, however, the apostle said, 'I did not command you to fight in the holy month, and he walked away from the caravan and the prisoners, and refused to take anything from them. The captors were crestfallen and decided they were doomed, and their Muslim brethren too, reproved them for their deed. In Mecca, the Quraysh were saying: “Muhammad and his companions have violated the sacred month; they have shed blood in it, and taken booty, and captured prisoners.’ The Jews interpreted the event as a bad omen for the apostle.

          When speculation on the subject became widespread Allah revealed these words to His apostle: 'They will ask thee about the sacred month and the fighting. Say "To fight in the sacred month is a matter of grave import, but to obstruct the worship of Allah and not to believe in Him, to prevent men from entering the holy mosque or to drive them out of it, these are of even graver import." '

          So the apostle of Allah took possession of the caravan and the prisoners. The Quraysh sent men to negotiate for the ransom of the prisoners, but the apostle replied that he could not release them until the two Emigrants who had fallen behind Abdullah to look for their camel returned, because he feared the Quraysh might have met and harmed them. 'If you have killed them, we shall kill our prisoners,' he said. But the two wanderers returned and the apostle released the prisoners, one of them making profession of Islam and remaining in Medina with Muhammad.

          When Allah made plunder permissible He allowed four parts to those who had won it, and one part to Himself and to His apostle, exactly as Abdullah had done with the captured caravan.

          This was the occasion when the first booty was taken by the Muslims, when the first prisoners were taken by the Muslims and when the first man was slain by the Muslims. It was eighteen months since the Emigrants had arrived in Medina.
=======================
          విగ్రహారాధనయే అంత భయంకరమైన పాపం అనిపించిన నీకు ఈ దారిదోపిడీలూ మూకుమ్మడి మానభంగాలూ ప్రవక్త ఖరీదు కట్టి టోకున జరిపించిన బానిసల వ్యాపారమూ గౌరవప్రదమయీన్ వ్యవహారాలుగా కనిపించాయా?పవిత్ర మాసంలో దోపిడీలు చేయించినందుకు ఇతరులు తనని తప్పు పడతారేమోనని తను చెప్పింది చెప్పినట్టు చేసుకొచ్చిన అనుచరుణ్ణి తిట్టిన దొంగవేషమూ మొదట నాకు వాటా అక్కర్లేదని నీలగడమూ తర్వాత అల్లాని పెంపుడు కుక్కలా వాడుకుని ఒక సుర్రాని చెప్పేసి తన కొక్కడికే 5వ వంతు దఖలు పర్చుకోవడమూ కూడా నీకు ప్రపంచంలోని ప్రజలందరికీ సన్మార్గం బోధించడానికి దేవాధిదేవుడు ఏరి కోరి పంపించిన అంతిమఋషి చెయ్యదగిన పనులుగానే కనిపించాయా?అవి కూడా గొప్పవే అయితే ఇంక లోకంలో దేన్ని తప్పు పట్టాలో కొంచెం క్లారిటీ ఇస్తావా?

          నువు "అవన్నీ బ్రిటిషు చరిత్రకారుల వక్రీకరణలకి గురయిన తప్పుడు రాతలు" అనకుండా ఉండటానికి Ibn Hishaam అనే భక్తుడు రాసిన మీ ప్రవక్త యొక్క తొలి అధికారికమైన జీవిత చరిత్రలోని భాగమే పైన ఇచ్చిన దోపిడీల చరిత్ర!

          మీవాళు ఇతారుల్ని దోచుకోవడం తప్పు కాదు గానీ హిందువులు తమ పూజలు తాము చేసుకుంటే నీకు నెప్పి దేనికి పుడుతున్నది?ఖబడ్దార్ అంటున్నారు,బస్తీ మే సవాల్ అంటున్నారు,అసభ్యమైన భాష మాట్లాడుతున్నారు అని నన్ను దుర్మార్గుడ్ని చెయ్యడం కాదు నీ ముడ్డి నలుపు చూసుకో!అన్ని చాలెంజిలు చేసినా టేకప్ చేసే దమ్ము లేదు గానీ నాలిముచ్చులా వచ్చి నా బ్లాగు దగిర తింగరి కామెంట్లు వేస్తున్నావేం?

          Former Saudi Shura Council Member Ibrahim Al-Buleihi Says about What was achieved by Islam in it's 1400 years of existence.


Ibrahim Al-Buleihi: When we want to study religious issue,we go back to our heritage.But when we want to study an earthly matter,such as why we are backward,while others are prosperous,we must search the answer elsewhere,not in our heritage.
Q:where is "elsewhere"?
Ibrahim Al-Buleihi: In the west,without a doubt.
Q:In the wet,not the East?
Ibrahim Al-Buleihi: The East only emulates (the West).Take japan, for example - if not for its openness to western culture,it too would have remained backward.The individualization of the Arab has been erased in this society...
Q:What do you mean by erased Individualism?
Ibrahim Al-Buleihi: He is incapable of independent thinking,and therefore, he rejects what is rejected by society, and accepts what is accepted by society.
Q:So "team spirit" prevails?
Ibrahim Al-Buleihi: It is the spirit of a herd,not of a team.It is the spirit of the herd that cannot fre itself from the captivity of the prevailing culture.Whatever society considers to be good,the individual considers to be good.He is incapable of independent thinking and of benefiting from the cultures of others.He is incapable of stepping out of the mold imposed on him since childhood.
Q:Should the Arab Individual be rebellious, for example?
Ibrahim Al-Buleihi: Not rebellious,but he should seek the truth.He must not efface self and dissolve into the herd.
Q:You criticize the Arabs and praise Israel.Do you think that the Arabs should follow the Israeli model?
Ibrahim Al-Buleihi: No,Israel did not create itself.It is an offshoot of the west.THey are an offshoot of Western Culture.That is why I compared Israel to Australia,New Zealand, and South Africa.I want to make a very important point.
Q:Excuse me,but I have a question.Do you consider the fact that some countries are offshoots of Western Culture to be a food or a bad thing?
Ibrahim Al-Buleihi: It's a positive thing.
Q:So we should be offshoots of the West as well?
Ibrahim Al-Buleihi: No,but we should benefit from this rich experience.It is the West that produced all this prosperity.To this day, we are a burden on the West.Even Japan admits that without benefiting from the West, it would not have developed.
Q:Prosperity in what?
Ibrahim Al-Buleihi In everything.In the value,liberties, and dignity of human beings,as well as in the development of science, of technology, and of life.Do you believe that life today is the same as it was ten centuries back?THe tremendous change was produced by the west.Who else produced it?
Q:But shouldn't the notions of the West - such as human rights - be viewed as an accumulated achievement, In which all societies played a role?
It is not an accumulated achievement.
Q:It was achieved solely by West?
Ibrahim Al-Buleihi: Undoubtedly.Tyranny is a tremendous obstacle, which makes any progress impossible.
Q:Do you believe that this theory applies to Iraq?after the fall of Saddam Hussein,whom you describe as...Iraq has not been permitted to achieve stability.
Ibrahim Al-Buleihi: The whole world has intervened in its affairs, as we have seen.
Q:The west,which you praise so highly,intervenes in Iraq.
Ibrahim Al-Buleihi: No.the west intervened in Japan's affairs as well.and managed to save japan from tyranny. Today,Japan is considered a model of democracy, of liberties,and of all the advantages that the West has produced.
Q:You said that during their conquests at the advent of Islam,the Arabs emerged from the deserts in order to conquest,not to learn.What did you mean by that?
Ibrahim Al-Buleihi: In my view,over the centuries,the Arabs believed - and continue to believe - that they have sufficient knowledge and wisdom, and that they do not need to learn anything from others.Because they appeared,on the stage of history,in order to conquer, not to learn,to teach,not to study...
Q:As guiders,not people seeking guidance of other.
Ibrahim Al-Buleihi: That's right.The delusion of the Arabs persists to this day,even though the entire world has changed.The world has changed, but they still believe that it is their duty to teach others,and it is the duty of others to heed them.The truth is that the Arabs have nothing to offer others,yet they continue...This horrible delusion,this belief in one's own perfection,the belief that others must learn from them,makes impossible for them to benefit from modern culture.

P.S:ఇంత ఉతుకుడు మాటల్ని అసలు వ్యక్తి పేరును ఉదహరించహ్కుండా తెలుగులోకి అనువదించి ఉంటే ఇస్లాముని అత్యంత నీచంగా అవమానించిన అధమాధముడి కింద లెక్క వేసి ఉందేవాళ్ళు నన్ను ముస్లిములే కాదు,హిందువుల్లోని సాధు సజ్జనులు కూడా!పధ్నాలుగు వందల యేళ్ళుగా ప్రపంచంలోని ముస్లిములు ఇతర మతస్థుల మీద పరాన్న భుక్కులుగా బతకడం గురించి ఒక ముస్లిమే కుండబద్దలు కొట్టి చెప్పాకనైనా హరిబాబు చెప్పింది నిజమేనని ఒప్పుకుంటారా?haribabu never tell lies!Every word he told about Islam is thoroughly checked up and all the sources are not a part of "కేవలం బ్రిటీష్ కల్పిత చరిత్ర" like you say.It is a well documented research paper on Islam.He that who denies it must condemn with a documentary proof from the Islamic literature itself or must withdraw that statement "ఈమధ్య ఒక ప్రముఖ బ్లాగర్ (పేరు ప్రస్తావించదలచుకోలేదు.అందరికీ తెలిసిన విషయమే) సాక్ష్యం మేగజైన్ లోని వ్యాసాలను వక్రీకరిస్తూ, ఎగతాళి చేస్తూ ఇస్లాం గురించి ఎవరో ఇస్లాం ద్రోహి వ్రాసిన కట్టుకధలనీ పట్టుకు వేలాడుతూ సాక్ష్యం మేగజైన్ ను ,దాని కంటెంట్ రచయితలలో ఒకరైన M.A.అభిలాష్ కు వార్నింగ్స్ ఇస్తూ ఖబడ్దార్, బస్తీమే సవాల్ అంటూ, సైకో అంటూ విపరీత పదజాలంతో దూషిస్తూ అనేక పోస్టులు తన బ్లాగులో పెట్టారు." immediately!

Still here is a challenge for the author of thus post to prove that haribabu is telling lies and why don't you take up?Do you have any fear of failure in supporting Islam?
-----------------------------
In fact, no ideology has been as genocidal as islam…
          In the total numbers we have updated over 80 million Christians killed by Muslims in 500 years in the Balkan states, Hungary, Ukraine, Russia.

          Then we have India. The official estimate number of Muslim slaughters of Hindus is 80 million. However, Muslim historian Firistha (b. 1570) wrote (in either Tarikh-i Firishta or  the Gulshan-i Ibrahim) that Muslims slaughtered over 400 million Hindus up to the peak of Islamic rule of India, bringing the Hindu population down from 600 mil to 200 million at the time.

          With these new additions the Muslim genocide of non-Muslims since the birth of Mohammed would be over 669 million murders.


No Hindu will convert to Islam how bitter you cry about Idolatry - GO TO HELL!

Tuesday, 22 August 2017

చైనా - భారత్ అనే రెండు మదపుటేనుగులు నిజంగానే ఢీకొంటాయా?యుద్ధం ఈ రెండు దేశాలకే పరిమితమా లేక జరిగేది మరో ప్రపంచయుద్ధమా?

          Afghanistanతో 76 క్ల్.మీ,Bhutanతో 470 క్ల్.మీ,Hong Kongతో 30 క్ల్.మీ,Indiaతో 3380 క్ల్.మీ,Kazakhstanతో 1533 క్ల్.మీ,Kyrgyzstanతో 858 క్ల్.మీ,Laosతో 423 క్ల్.మీ,Macauతో 3 క్ల్.మీ,Mongoliaతో 4677 క్ల్.మీ,Myanmarతో 2185 క్ల్.మీ,Nepalతో 1236 క్ల్.మీ,North Koreaతో 1416 క్ల్.మీ,Pakistanతో 523 క్ల్.మీ,Russiaతో 3645 క్ల్.మీ,Tajikistanతో 414 క్ల్.మీ,Vietnamతో 1281 క్ల్.మీ - తన చుట్టూ ఉన్న 16 దేశాలతో భౌగోళిక సరిహద్దును పంచుకుంటూ మోరెత్తి కలహకుక్కుటనాదం చేస్తున్న బలిసిన కోడిపుంజులా కనిపించే చైనా స్వభావంలో కూడా పందెపుకోడినే తలపిస్తున్నది.
          తన చుట్టూ ఉన్న  ఈ దేశాల్లో దాదాపు ప్రతి దేశంతొనూ ఏదో ఒక దశలో సరిహద్దు వివాదం రావటం,అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అన్న చందాన మొదట చిన్న చిన్న దాడులతో విసిగించటం గానీ లేదా పెద్ద యుద్ఢం చేసి గానీ తన శక్తిని చూపించి భయపెట్టి తర్వాత వ్యాపార ఒప్పందాల లాభసాటి ఆశలను ఎర చూపించడం ద్వారా ఏకపక్షమైన ప్రయోజనాలనే సాధించింది.అయితే,1962లో భారత్ మీద జరిగిన యుద్ధంలో పూర్తి గెలుపు దాదాపు ఖాయమైన స్థితిలో కూడా ముందుకు వెళ్ళి గెలుపును పూర్తి చేసుకోవటానికి బదులు నిర్నిబంధమైన యుద్ధవిరమణ ప్రకటించి McMahon Line వెనక్కి వెళ్ళి సర్దుకోవడం విశేషం!

          North Koreaతో సరిహద్దుకు సంబంధించిన ఒక ఒప్పందం 1962లో చేసుకున్నప్పటికీ అది Yalu, Tumen అనే రెండు నదులతో కలిసి ఉంది కాబట్టి దాని లంకల విషయంలోనూ ఈ రెండు నదుల జన్మస్థానమైన Mount Paektu విషయంలోనూ రెండు దేశాల మధ్యన గొడవలు మొదలయ్యాయి.దీనికన్న పెద్ద సమస్య Tumen నది చివర్న సాగి రష్యాని కొరియాతో కలుపుతుంది.కొరియా వాళ్ళు చైనాకి ఉన్న అతి తక్కువ తీర ప్రాంతంలో 200 మైళ్ళ Fishing Zone ఏర్పాటు చేసుకున్నారు - ఇది చైనా యొక్క maritime military strategic borderకి బొక్క వేసింది!రష్యా 1990ల నాడు North Koreaతో సర్దుబాటు చేసేసుకున్నది గానీ చైనాకీ North Koreaకీ మధ్యన మాత్రం గొడవలు అలాగె ఉన్నాయి - దీనికి రెండు కారణాలు.

          ఆర్ధిక కోణంలో చూస్తే చైనా కుదుర్చుకునే ఏ ఒప్పందంలోనైనా లాభం పూర్తిగా గానీ లేదా ఎక్కువ గానీ తనకే రావాలనుకుంటుంది తప్ప 50-50 పద్ధతికి కూడా ఒప్పుకోదు - చైనా "విన్-విన్" దారిని ఎంచుకోవడం చాలా అరుదు!రాజకీయ కోణంలో చూస్తే North Korea పాక్షికంగా చైనా మీద ఆధారపడి ఉంది - అది North Korea పట్ల ఔదార్యంతో కూడిన ఉపేక్ష కాక ఎప్పుడో ఒకప్పుడు దారికి వచ్చే వీలున్నప్పుడు ఇప్పుడే తొందరపడి తక్కువ లాభంతో సర్దుకుపోవడం దేనికనే ఎదురు చూపు కావచ్చు.1998లో Kazakhstanతో Baimurz pass దగిర 680 square-kmల భూమి కోసం,Sary-Charndy River దగ్గిర 380 square-kmల భూమి కోసం చైనా Kazakhstanకి ధారాళంగా నూనె గనుల్లో పెద్ద యెత్తున పెట్టుబడులు,Kazakhstan అంతణినీ కలుపుతూ 3,000 కిలోమీటర్ల పొడుగున gas pipeline వెయ్యటం,15 సంవత్సరాల పాటు ఆర్ధికపరమైన సహకారం అందిస్తానని వాగ్దానం చేసింది.తన ప్రయోజనం కోసం దెబ్బ కొట్టటానికీ దబ్బు చల్లటానికీ - కూడా సిద్ధంగా ఉంటుంది చైనా - మొహమాటం లేదు!

          Afghanistanతో చైనాకి నిన్నమొన్నటి వరకు మంచి సంబంధాలే ఉండేవి.Wakhan Corridor అని పిలిచే ఈ రెండు దేశాల సరిహద్దు ప్రాంతం కొన్ని శతాబ్దాలుగా తేయాకు,పండ్ల క్యార్వాన్లు తిరుగుతూ మంచి లాభసాటి అయినది.ఒక సరిహద్దు ఒప్పందం 1963లోనే ఏర్పడింది,Cold War సమయంలో కూడా రెండు దేశాల స్నేహం చెదరలేదు.Afghanistanలో Taliban regime మొదలయ్యాకనే Afghanistanతో చైనాకి సమస్యలు మొదలయ్యాయి.వాళ్ళు చైనాలోని Xinjiang provinceలో ‘East Turkestan Islamic Movement’ పేరుతో Uyghur separatistsని రెచ్చగొట్టటం మొదలు పెట్టారు!అయితే, Afghanistan ప్రభుత్వం మాత్రం చైనాతో స్నేహంగానే ఉంటున్నది.

          మనకీ చైనాకీ గొడవలు మొదలైనది ఇంగ్లీషు వాళ్ళ పుణ్యమే!ఇంగ్లీషు వాళ్ళు వాళ్ళ సౌకర్యం కోసం చేసిన అడ్డదిడ్డం సరిహద్దుల మార్పులే ఈ రెండు దేశాల మధ్యన పెద్ద యెత్తున ఉద్రిక్తతలు పెరగడానికి కారణం.ఈ గొడవలు లేని మిందరి కాలంలో కొన్ని సహస్రాబ్దా పాటు ఈ రెండు దేశాల మధ్యన రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక మేళవింపు జరిగి రెండు దేశాల్నీ తమ అత్యున్నతమైన గత కాలపు వైభవాన్ని చూసులుని గర్వించేలా చేసింది!సాంస్కృతికంగా,సామాజికంగా,ఆధ్యాత్మికంగా,వైజ్ఞానిక విజయాల పరంగా ప్రాచీన కాలంలోనే సాటి వారెవ్వరూ చేరుకోలేని అత్యున్నత శిఖరాలను అందుకుని ఇప్పటికీ చెక్కు చెదరని తేజస్సునీ ఓజస్సునీ చూపిస్తున్నవి ఈ రెండు దేశాలే!ఈ రోజున గుర్తింపు పొందిన సరిహద్దులు ఒకనాడు లేకపోయినా ప్రాంతం పరిధిని బట్టి చూస్తే ఇప్పుడు ప్రపంచంలో గురింపు పొందిన నూట యాభై పైచిలుకు దేశాలలో అత్యంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది ఈ రెండు దేశాలకే.అలాంటి ఈ రెండు దేశాల మధ్యన యుద్ధం కోరుకోకూడనిదే!

          ఇప్పుడు దేశంలో చైనాతో యుద్ధం వస్తేనే బాగుండునని కోరుకుంటున్నవారిలో చాలామందికి అలా అనిపించడానికి 1962 నాటి యుద్ధం చేసిన గాయమే ముఖ్యమైన కారణం - అప్పటి దెబ్బకి ఇప్పుడు దెబ్బ తీసి జరిగిన అవమానానికి ప్రతెకారం తీర్చుకోవాలనే భావన ఉంది - సహజమే!కానీ ఆ యుద్ధానికి కారణాలు ఎన్ని, చైనా ఏయే కారణాలతో దూకుడుగా వచ్చి దాడి చేసిందో ఆయా కారణాలకి సమబంధించి ఏ లాభమూ పొందకుండా నెల రోజుల తర్వాత యుద్ధంలో తనదే పైచేయి అని తెలిసి కూడా తన కోరికల్ని తీర్చాల్సిందేనని పట్టు పటకుండా యుద్ధం ఆపేసి ఎందుకు నిశ్శబ్దం అయిపోయింది అనే విషయాలని పరిశీలిస్తే చాలా విచిత్రమైన విషయాలు తెలుస్తాయి!అసలు ఈ రెండు దేశాల మధ్యన నెల రోజుల పాటు అంత తీచ్రమైన యుద్ధం జరిగాక కూడా కొద్ది రోజుల్లోనే తమ మద్జ్యన ఏమీ జరగనట్టు వ్యాపార ఒప్పందాలూ దౌత్య సమబంధాలూ రెండు దేశాల ప్రభుత్వాలూ యధావిధిగా నడుపుకోవటం ఎలా సంభవించింది?సామాన్య ప్రజల్లో ఇప్పటికీ రగులుతున్న క్రోధం ప్రభుత్వ,అధికార వర్గాలలో ఎందుకు కనిపించ లేదు?ఈ అనుమానాలకి సరయిన కారణాలు తెలిస్తే ఇప్పుడు భారత్ ఎట్లా ప్రవర్తిస్తే బాగుంటుందో తెలుస్తుంది.

          వాస్తవానికి 1962లో అసలు యుద్ధం జరిగినప్పటికీ, సరిహద్దుకు సంబంధించిన సమస్యలు చాలాకాలం నుంచి కొనసాగుతున్నప్పటికీ 1959లో జరిగిన Tibetan uprising తర్వాత జరిగిన గొడవల్లో వాళ్ళు తరిమసిన దలై లామాకి మన దేశం ఆశ్రయం ఇవ్వడం ముఖ్యమైనది.నిజానికి అంతర్గత సమస్యల వల్ల ఈ కలహం 1950ల నుంచీ ఉన్నప్పటికీ 1959లో ఉద్గృతం కావడానికి United States ప్రమేయమే కారణం.టిబెటన్ గెరిల్లాలకి CIA తన అధ్వర్యంలో శిక్షణ ఇచ్చి పంపిస్తున్నదని తెలిసినప్పుడు చైనా తన దేశంలో విదేశీయుల సహాయంతో జరుగుతున్న తిరుగుబాటుని అణిచివేయాలనుకోవడం తప్పూ కాదు, దాని నాయకుడైన దలై లామా తన వైపు నుంచి దోషమేమీ లేని అమాయకుడూ కాదు - అవునా?

          Mao Zedong టిబెటన్ గెరిల్లాల తిరుగుబాటు బలం పెంచుకోవడానికి సంబంధించిన వార్తలు తెలిసినప్పుడు 1959 February 18వ తేదీన “The more chaotic [the situation] in Tibet becomes the better; for it will help train our troops and toughen the masses. Furthermore, [the chaos] will provide a sufficient reason to crush the rebellion and carry out reforms in the future.” అని అనటాన్ని బటి వ్యతిరేకుల పట్ల చైనా ఎట్లా వ్యవహరిస్తుందో తెలుసుకోవచ్చు - ఎంత ఉద్గృతంగా గొడవ చేస్తే అంత క్రూరంగా అణిచివెయ్యడమే తప్ప సమస్యని ఉభయతారకమైన పద్ధతిలో పరిష్కరించడం చైనా ఎప్పటికీ చెయ్యదు.భారత్ చైనాతో వ్యవహరించేటప్పుడు ఈ విషయంలో హెచ్చరికగా ఉండాలి!

          చైనా మొత్తానికి దలై లామా ఒక్కడే బౌద్ధ మతస్థుడు కాదు,మిగిలిన వాళ్ళు ఇప్పటికీ చైనా ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నారు.అతని సొంత రాజకీయపరమైన కారణాలతో అతను చైనా ప్త్రభుత్వాన్ని వ్యతిరేకించి ఉండవచ్చు - ఏ మతానికి సంబంధించినవైనా సరే ఆలయాలు, విహారాలు, చర్చిలు, మసీదులు, దర్గాలు వంటి స్థలాలు ఆర్ధికంగా బలమైనవి అయితే అవి రాజకీయాలకి అతీతంగా ఉండలేవు!ఈ రకమైన సంక్లిష్టతని అర్ధం చేసుకోలేని పండితుడు నెహ్రూ మానవత్వం, తొక్కా, తోలు అంటూ అడుసులో కాలెట్టాడు.చైనాకి కాలగూడని చోట కాలింది.వార్నింగులు ఇచ్చింది.అయినా పట్టించుకోలేదు.దీనికి తోడు "చైనా మనమీద దాడి చెయ్యటమా?నెవ్వర్!" అనుకుంటూనే ప్రతిపక్షాల నుంచి విమర్శల్ని తప్పించుకోవడం కోసం భారత్ Forward Policy అంటూ అప్పటికే వివాదాస్పదమైన McMahon Line వెంబడి Military Outpostలని పెంచింది - ఎందుకు పెంచాలో తెలియకుండా, ఎంత సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందో తెలుసుకోకుండా, ముందు వెనకలు చూసుకోకుండా చేసిన ఈ దుందుడుకు పనితోనే భారత్ అవమానానికి కారణమైన దిక్కుమాలిన యుద్ధం మొదలయ్యింది!

          ఈ Forward Policy అనేది  1961 November 2న నెహ్రూ అధ్యక్షతన defence minister Krishna Menon, foreign secretary M.J. Desai, Army Chief General P.N. Thapar, Intelligence Bureau director B.N. Mullick సభ్యులుగా ఉన్న ఒక కమిటీ ఆలోచించి పన్నిన వ్యూహం తెలివి తక్కువ నిర్ణయమేమీ కాదు.1962, February 4న ఢిల్లీలో Home Minister చేసిన "If the Chinese will not vacate the areas occupied by her, India will have to repeat what she did in Goa. She will certainly drive out the Chinese forces." అనే ప్రకటన కూడా గొప్పగానే ఉంది.

          కానీ యుద్ధం ముంచుకు వచ్చినప్పుడు కఠినమైన నిర్ణయాలు సత్వరం తీసుకోగలిగిన నెహ్రూ,మీనన్ ఇద్దరూ తమకున్న వామపక్ష భావజాలం పట్ల ఉన్న మక్కువ వల్ల చైనాతో సరైన పద్ధతిలో వ్యవహరించలేకపోవడమే ఆనాడు యుద్ధం రావడానికీ మన దేశం దుర్భరమైన అవమానానికి గురి కావడానికీ ఉన్న ముఖ్యమైన కారణం!వీళ్ళిద్దరూ చెయ్యకుండా మిగిల్చిన దరిద్రం ఏదైనా ఉంటే ఆ కొరతని Lieutenant General Brij Mohan Kaul తీర్చాడు.ఈ ముగ్గురు మూర్ఖులూ ఎవడికి తోచిన తలతిక్క పని వాడు చేసుకుంటూ పోయిన గందరగోళం వల్లనే ఆ యుద్ధం అంత తెలివితక్కువగా మొదలై ఒక నెల రోజుల పాటు భారత సైన్యాన్ని దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేసి అంత హఠాతుగానూ ఆగిపోయింది - చైనాకి జాలిపుట్టి యుద్ధవిరమణ ప్రకటించింది గానీ ఇంకాస్త ముందుకెళ్ళి యుధాన్ని పూర్తి చేసి మన దేశాన్ని ఆక్రమించుకుంటే మనం చెయగలిగినది ఏమిటి?మన బంగారాలు మంచివి కాక ఓడిపోయామని ఏడవటం తప్ప చైనాని తిట్టుకుని ప్రయోజనం లేదు.

         ప్రాచీన కాలం నుంచి ఎన్నో రాజవంశాల చేత పరిపాలించబడిన టిబెట్ క్రీ.శ 1912 నుంచి 13వ దలై లామా అధికారం కిందకి వచ్చింది.దలై లామా కేవలం ఒక బౌధ సన్యాసి కాదు.టిబెట్ ప్రాంతానికి రాజకీయ అధిపతి!ఇప్పుడు మనం చూస్తున్న ది 14వ దలై లామాని.క్రీ.శ 1914లో టిబెట్ బ్రిటిష్ ఇండియాతో ఒపందం కుదుర్చుకున్నది.స్వతంత్రం వచ్చాక సాంకేతికంగా తన స్థానాన్ని భరతదేశానికి దఖలు పరిచింది బ్రిటిష్ ఇండియా.కానీ,1949లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సాంస్కృతిక సారూప్యత పేరుతో టిబెట్,అరుణాచల్ ప్రదేశ్‌లని తమకి దఖలు పరచమని చైనా వాదనతో పొరపొచ్చాలు మొదలయ్యాయి!నిజానికి అది సాధ్యమా?ఆ లెక్కన అంతకు ముందెప్పుడో ఏ భారత దేశానికి చెందిన ప్రభువో చైనా ప్రాంతం మొత్తాన్ని పరిపాలించాడనేది రుజువైతే చైనా భారతదేశంలో కలిసి పోతుందా?

          అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచీ చైనా కమ్యునిష్టు పార్టీ దక్షీణ టిబెట్ కోసం అడుగుతూనే ఉంది,భారత్ చైనాకి అన్ని రకాల సహాయాలూ చేస్తూనే ఉన్నది,1950లో భారత్  "Indo-Chinese border" విషయంలో పర్వర్తిస్తున్న తీరుని గురించి చైనా నుంచి ప్రశంసలు పొందింది కూడా!భారత ప్రధాని పార్లమెంటులో అధికారికమైన బారత దేశపు map చూపించి "Our maps show that the McMahon Line is our boundary and that is our boundary...we stand by that boundary and we will not let anyone else come across that boundary" అని స్పష్తం చేశాడు,చైనా కూడా విన్నది,దాని మీద ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు,1851లో మన దేశం లడఖ్ దగ్గిర పాకిస్తానుతో పోరాడుతునన్ సమయంలో Aksai Chin దగ్గిర హదావిడి పెంచింది,తనకూ భరతదేశానికీ ఎలాంటి సరిహదు వివాదాలు లేవని చైనా చెప్తూనే ఉన్నది,అంతర్జాతీయ రాజకీయ రంగం చైనాని ఒంటరిని చేసిన సమయంలో భారత్ చైనాకి నామినీగా పని చేస్తూనే ఉన్నది,1950లో చైనా యొక్క People's Liberation Army ఉత్తర టిబెట్ సైన్యాన్ని ఓడించి తన అధికారాన్ని స్థాపించుకున్నది,భారత్ చైనాతో పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకున్నది,చైనా వెళ్ళగొట్టిన టిబెట్ రాజకీయ ప్రభువుని చేరదీసింది - మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే CIA 1956లో టిబెటన్ గెరిల్లాలకి శిక్షణ ఇచ్చిన స్థావరం భార్తదేశంలోని Kalimpong.ఇన్ని వరస తప్పులు మనవైపున ఉన్నప్పుడు చైనాని నిందించి ప్రయోజనం ఏమిటి?

          పై స్థాయిలో జరిగిన రాజకీయ నిర్ణయాల వెనక ఉన్న తప్పిదాలకి కృష్ణ మీనన్ కన్న తమ Forward Policyని చైనా తీవ్రంగా పరిగణించదని నమ్మబలికిన IB chief Mullickదే ఎక్కువ బాధ్యత ఉంది.అప్పటి ప్రతిపక్షాల అజ్ఞానం వల్ల జరిగిన రాజకీయ దాడికి కృష్ణ మెనన్ బలయ్యాడు - అతని తప్పులూ ఉన్నాయి గానీ IB chief హోదాలో ఉన్న Mullick సరయిన సమాచారం ఇవ్వడంలో ఫెయిలయినప్పుడు నెహ్రూ గానీ మీనన గానీ చెయ్యగలిగింది ఏముంది?మిగిలిన సగం దరిద్రాన్ని General B.M.Kaul పూర్తి చేశాడు.

          యుద్దం తర్వాత బలవంతంగా గెంటించుకున్న Brij Mohan Kaul అనే ఈ అతి మేధావి  Royal Military College నుంచి బయటికి వచ్చాక 1933 ఆగస్టు 31న Indian Armyలో Unattached List కింద Second Lieutenant హోదాలో చేరాడు.అప్పటి నుంచి ఇంగ్లీషు వాళ్ళ కాలంలోనూ స్వతంత్రం వచ్చాకనూ ఇతను పై స్థానాలకి ఎదగడంలో సైనికుడికి కావలసిన లక్షణాల కన్న అధికారంలో ఉన్నవాళ్లతో పరిచయాలే ముఖ్యపాత్ర వహించాయి - సాటి సైనికాధికారులకి ఇతని ఎదుగుదల అసహ్యాన్ని కలిగించేది!junior officer రోజుల నుంచీ జవహర్ లాల్ నెహ్రూకి ఇతను "personal favourite" అయ్యాడు.ఈ పరిచయం వల్ల అతను కెరీర్ మొత్తంలో ఏనాడూ సైనికుడిగా జీవించలేదు, అర్హతలేని అందలాల్ని అందుకోవడంలో ఎలాంటి సిగ్గునీ చూపించలేదు!ఇటువంటి వెధవలకి personal favorite హోదా ఇవ్వడంలోనే నెహ్రూ వెధవాయిత్వం కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది.

          అప్పటి వరకు Chief of General Staff (CGS) హోదాలో ఉన్న Lt General B.M. Kaul మన దరిద్రం కొద్దీ General officer Commanding (GOC) అయ్యాడు.మొట్టమొదటి రోజునే పటాలం పాండులా Namkachu లోయలోకి పోయి హడావిడి మొదలెట్టాడు.ఇతని నాయకత్వంలో భారత సైన్యం చైనా అధీనంలో ఉన్న Tse Jong స్థావరాన్ని పటుకున్నది,కానీ ఈ పెద్దమనిషి జబ్బుపడి తిరుగుటపాలో ఢిల్లీ చేరుకోగానే చైనా సైనికులు 800 మంది విరుచుకు పడి భార్త సైన్యాన్ని తుడిచి పెట్టేశారు.నిజానికి భారత్ యొక్క Forward Policyకి ఇది పూర్తి విరుద్ధం - వీలున్నంతవరకు చైనాని రెచ్చగొట్టకుండా defensive game ఆడాలనేది మంచి ప్లానే,చైనా కూడా తనంతట తను యుద్ధానికి రాకుండా చర్చలకి పిలుస్తూనే ఉంది.కానీ ఈ B.M. Kaul నెహ్రూ దగ్గిర తనకున్న personal favorite హోదాని అడ్డం పెట్టుకుని సొంత పెత్తనం చేశాడు.మనలో చాలామంది అనుకుంటున్నట్టు తొలిదాడి చైనా చెయ్యలేదు,భారత్ వైపునుంచి కౌల్ తొలిదాడి చేశాకానె చైనా తనకి కావలసిన సన్నివేశం జరగగానే తన శైలిలో తను రెచ్చిపోయింది.

          ఎంత సేపూ చైనా తమ Forward Policyని తీవ్రంగా తీసుకుని భారత్ మీద పెద్ద యెత్తున దాడి చెయ్యదు అన్న గట్టి నమ్మకంతో నెహ్రూ నుంచి కౌల్ వరకు అమాయకంగా ఉంటే చైనా వ్యూహం వీళ్ళ కెవరికీ తర్వాతెప్పుడో చైనా చెబితే తప్ప తెలియనంత రహస్యమైనది!కలింపాంగ్ విషయం తెలిసి చైనాకి భారత్ టిబెట్ వ్యవహారంలో కుట్ర చేస్తున్నదని చైనా అనుమానించినట్టు కొందరు చేస్తున్న విశ్లేషణ ఆధారాలు ఉన్నదే గానీ అసలు కారణం మరింత లోతైనది.ఆ లోతు తెలియక పోవడం వల్లనే భారత్, ముఖ్యంగా నెహ్రూ తనకి చేస్తున్న సహాయాల్ని మర్చిపోయి ఆ ఒక్క విషయానికి కనీసపు కృతజ్ఞత కూడా లేకుండా రెచ్చిపోయిందంటే మనలో చాలామందికి కష్టం అనిపిస్తున్నది!

          దాడికి దిగడంలోనూ వెనక్కి తగ్గడంలోనూ చైనాకి ఉన్న priorities వేరు,.RS Kalhaఅనే Iraqలో పనిచేసిన Indian ambassador ఒక వ్యాసంలో The then Chinese President Liu Shaoqi told the Sri Lankan leader Felix Bandaranaike that the 1962 conflict was ‘to demolish India’s arrogance and illusions of grandeur. China had taught India a lesson and would do so again and again.’ Mao Zedung confirmed this line of thinking when he told a Nepalese delegation in 1964 that the ‘major problem between India and China was not the McMahon Line, but the Tibetan question’. In 1973, Zhou Enlai was to tell Kissinger that the conflict took place because Nehru was getting ‘cocky’. అని చెప్పడాన్ని బట్టి చైనా కమ్యూనిష్టు పార్టీ ఎంత దుర్మార్గమైనదో వూహించుకోవచ్చు.ప్రపంచ స్థాయిలో తనకి లభిస్తున్న ఆదరణని చూసుకుని మురిసిపోతున్న నెహ్రూకి ఝలక్ ఇచ్చి కంగు తినిపించడమే చైనా లక్ష్యం - అది నేరవేరగానే యుద్ధం ఆపేసింది,అంతా తన క్రూరమైన లెక్క ప్రకారమే చేసింది చైనా.ఇవ్వాళ చైనాతో యుద్ధం వస్తే బాగుండునని కోరుకునేవాళ్ళు దీన్ని గుర్తుంచుకోవాలి!ఇంత క్రూరమైన చైనాతో యుద్ధం ఎంత ప్రమాదకరమైనదో తెలియని అవివేకులే చైనాతో యుద్ధానికి ఉవ్విళ్ళూరుతారు.

          భారతీయులు 1962 ఓటమిని ఎక్కువ చేసుకుని కుంగిపోవాల్సిన అవసరం లేదు. సరిగ్గా అయిదేళ్ళ తర్వాత 1967లో సిక్కిం సరిహదుల దగ్గిర భారత సైన్యం కేవలం 88 మందిని పోగొట్టుకుని హద్దును దాటి వచ్చిన చైనా సైనికుల్లో 340 మందిని మట్టుబెట్టి 450 మందిని క్షతగాత్రుల్ని చేసి 1962 నాటి అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నది.అసలు 1962 నాటి యుద్ధంలోనే అన్ని ప్రతికూలతల మధ్య మన సైనికుల పోరాట పటిమ చూసి చైనా సైనికులు జోహారు లర్పించారు.On October 10, these 50 Indian troops were met by an emplaced Chinese position of some 1,000 soldiers. The Chinese troops opened fire on the Indians believing that the Indians had intruded upon Chinese land. The Indians were surrounded by a Chinese positions which used mortar fire. However, they managed to hold off the first Chinese assault, inflicting heavy casualties. In the second assault, the Indians began their retreat, realising the situation was hopeless. The Indian patrol suffered 25 casualties, with the Chinese suffering 33. The Chinese troops held their fire as the Indians retreated, and then buried the Indian dead with military honors, as witnessed by the retreating soldiers. This was the first occurrence of heavy fighting in the war.చరిత్రలో ఒక దేశపు సైన్యం శత్రు దేశపు సైనికులకి గౌరవ వందనం చేసిన సన్నివేశం బహుశా ఇదొక్కటే కాబోలు!

          1949లో red army యొక్క ప్రపంచాన్ని కుదిపేసిన పది రోజుల తిరుగుబాటు జైత్రయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన చైనా కమ్యూనిష్టు పార్టీ 1962లో నిర్నిబంధ యుద్ధవిరమణ నాటి నుంచి మిగతా అన్ని సరిహద్దు దేశాలతో సమస్యల్ని సామ,దాన,భేద,దండాలలో ఏది వీలయితే అది ఉపయొర్గించి పరిష్కరించుకుని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడానికి కొంతకాలం పాటు చీకటి తెర వెనక దాక్కుంది.బయటికి రావడం రెండు విధాల దారుల్లో జరిగింది - 1990ల నుంచి economic infastructure పూర్తి చేసుకుని ప్రపంచ వాణిజ్యరంగంలోకి వచ్చి పెనుతుఫాను సృష్టించడం,ముత్యాల హారం లాంటి అమరికతో భారతదేశాన్ని కబళించడానికి తిరుగులేని సైనికవ్యూహం పన్నడం.

          1990ల వరకు భారత్,చైనాలు ఆర్ధిక విషయంలో దాదాపు సరిసమానంగానే ఉండేవి.ఆ తర్వాతనే చైనా అనూహ్యమైన వేగంతో మన దేశాన్ని దాటి ముందుకు వెళ్ళింది.చైనా 1979లో ఇంటికి ఒకే బిడ్డ అనే నియమాన్ని గట్టిగా అమలు చెయ్యడంతో పనిచేసేవాళ్ళ మీద పోషించాల్సిన వాళ్ళ బరువు తగ్గింది.మావో జనాభాని తగ్గించడంలో కృషి చేసి వూరుకోకుండా ఆ తక్కువ మనుషుల్ని చక్కగా ఉపయోగించుకున్నాడు.విద్య,ఆరోగ్యం అనే రెంటినీ యెంత గట్టిగా సాధించాడంటే 1981 నాటికే చదువుకున్న చైనా ఆడవాళ్ళు చదువుకున్న ఇండియన్ ఆడవాళ్ళ కన్న రెట్టింపు అయ్యారు - ఇప్పటికీ మనం ఈ రెంటిలో వెనకబడిపోయే ఉన్నాం.మనవైపున చూస్తే నెహ్రూ అంతర్జాతీయ విషయాలపైన మక్కువతో కీర్తి ప్రతిష్థల వ్యామోహంలో క్షేత్రస్థాయి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు.చైనాకి విద్య,ఆరోగ్య రంగాల్లో ధృఢంగా ఉండి మానవవనరులు పుష్కలంగా ఉండటం వల్ల అభివృద్ధికి కావలసిన రోడ్లు,భవనాలు,రైల్వేలు,విమానాశ్రయాల వంటి infra structure ఏర్పరచుకోవడం సులువైంది.భారత్ మొదటి దానిలో వెనకబడటం వల్ల రెండో దానిలో కూడా వేగం మందగించింది.ఇలా ఆర్ధికంగా కొంత పుంజుకున్నాక చైనా భారతదేశాన్ని కబళించడం కోసం ముత్యాల హారం ప్లాను వెయ్యడం మొదలు పెట్టింది.
          ఇప్పటికి ముత్యాల హారం దాదాపు పూర్తయిపోయింది.China-Pakistan Economic Corridor (CPEC) పూర్తయితే ఆ కొసన ఉన్న పాకిస్తాన్ నౌకాశ్రయం చైనా అధీనంలోకి వస్తుంది - అదే ఆఖరు ముత్యం!ఈ 15 ముత్యాలు పరుచుకుని ఉన్న దేశాలలో ముఖ్యమైనవి - Myanmar, Bangladesh, SriLanka, Pakistan.చైనా Myanmarలో ఉన్న Kyaukpyu portని ఉపయోగించుకునే సౌకర్యం కోసం ఆ దేశంలో 2400 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ వేస్తున్నది.శ్రీలంకతో భారతదేశానికి కొన్ని శతాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి,అయినా చైనా అక్కడ కూడా అడుగు మోపి ఒక ముత్యాన్ని నాటింది!ఇక పాకిస్తాను ఇండియా మీద ద్వేషంతో ఇవ్వాళ చైనాకి వలస కన్న హీనంగా తయారైంది.అప్పుడు బ్రిటిష్ అద్గీనంలో ఉన్న ఇండియాని బ్రిటిష్-ఇండియా అని పిల్చినట్టు  ఇప్పుడు చైనా-పాకిస్తాన్ అని పిలిపించుకుంటున్న దుస్థితి పాకిస్తానుది.

          అయితే,చైనా ఇంత గొప్ప ప్లాను వేసినా మన దేశపు సైనిక వర్గాల ముందుచూపు వల్ల బంగాళాఖాతం,హిందూమహాసముద్రం రెండింటిలోనూ భారత్ దుర్నిరీక్ధ్యంగానే ఉంది కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు.విదేశాంగ విధాన రూపకర్తలు కూడా Look East policyని ప్రతిపాదించారు.మోదీ అధికారంలోకి రాగానే Look East policyని Act East policy చేసి ముత్యాల హారాన్ని బదలు కొట్టాలనే ప్రయత్నాలు మొదలైనాయి - ఆ పని కూడా దాదాపు పూర్తయింది!ఇరాన్-ఇండియా సంయుక్తంగా chabahar portని వాడుకునే ఒపందం వల్ల ఇండియాకి central asia వైపుకి పాకిస్తానుతో సంబంధం లేకుండా ఒక అడ్డదారి ఏర్పడింది,ఇది చైనా పీఠం వేసుకుని కూర్చున్న పాకిస్తాన్ పోర్టు Gawadarకి కేవలం 70 కి.మీ దూరంలో ఉంది.ఇండీయాకి Maldivesతో ఉన్న సుదీర్ఘమైన చారిత్రక సంబంధాల వల్ల ఆ దేశం చైనా స్థావరాల్ని తమ గడ్డ మీద అనుమతించనని మనకి వాగ్దానం చేసింది.మనకీ Maldivesకీ మధ్యన సైనిక సహకారం కూడా నడుస్తున్నది.

          శ్రీలంకలో చైనాని అనుమతించిన rajaPaksa ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయి పదవి నుంచి దిగిపోవటంతో పాటు చైనాతో అతను చేసుకున్న ఒపందాలు కూడా రద్దయినాయి.అక్కడ ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారత్ వైపుకి మొగ్గు చూపుతున్నది - ఒక ముత్యం దానంతటదే పగిలింది!Andaman-Nicobar దీవుల్ని ఇదివరకటి కన్న ఎక్కువ ఉపయోగించుకోవాలని నౌకాదళం పెద్ద సంఖ్యలో యుధనౌకల్నీ యుద్ధవిమానాల్నీ చేరుస్తున్నది.ఈ మధ్యనే మోదీ Bangladesh వెళ్ళినప్పుడు Hassinaతో ఒప్పందం కుదుర్చుకుని chittagang ముత్యాన్ని చైనా నుంచి లాగి వేశాడు.చైనాకి ఇదివరకే Miyanmarలోని coco దీవి స్థావరంలా ఉపయోగపడుతున్నది,కానీ భారత్ కూడా చైనా వ్యతిరేకతని లెక్క చెయ్యకుండా ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల్ని మెరుగు పరుచుకుంటున్నది.Myanmar తన సైనిక దళాలకి సాగర సంబంధమైన రక్షణ విషయంలో చైనా కన్న భారత్ మీదనే ఎక్కువ ఆధార పడాల్సిన పరిస్థితి ఉంది - ఇండియా దాన్ని ఉపయోగించుకుని Myanmarకి దగ్గరవుతున్నది.చైనా వల్ల ఇబ్బందులకి గురయిన Vietnam సహజంగానే మనవైపుకి వస్తుంది = రెండు దేశాలూ ఈ మధ్యనే సైనిక సహకారం కోసం ఒపందాలను కుదుర్చుకున్నాయి.మోదీ గారు దేశాలు పట్టి తిరుగుతున్నది పిల్లి తల గొరగడానికి కాదు, చైనా దురాక్రమణ నుంచి మన దేశాన్ని రక్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాడు!

          కమ్యూనిష్టులు మోదీ ఎప్పుడు అమెరికా వెళ్ళినా తనేదో అమెరికా పాదాల మీద పడిపోతున్నట్టు గగ్గోలు పెడుతున్నది మన దేశాన్ని పాకిస్తాను వాళ్ళు చేసినట్టు తమ కిష్టమైన చైనా పక్కలో పడుకోబెట్టకుండా అడ్డుకుంటున్నందుకే తప్ప దేశభక్తితో కాదు!నిజానికి అమెరికాయె "బాబ్బాబు!మీ మార్కెట్లో కొంచెం వాటా ఇవ్వు, హందూమహాసముద్రంలో కాస్త చోటివ్వ"మని బతిమిలాడుకుంటున్నది.ఆర్ధిక రంగాన్ని మినహాయిస్తే రాజకీయం, సాంస్కృతికం, సామాజికం, సైనికం వంటి రంగాల్లో ఏ దేశమూ మన దేశపు కాలిగోటికి కూడా సరిపోలదు!ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడూ మనం ఎవరినీ దేబిరించాల్సిన దుస్థితిలో లేము.ఆర్ధికంగా ఎదగకపోవడానికి Quality Education లేకపోవడమే కారణం.అది ఒక్కటీ సమకూర్చుకోగలిగితే పది చైనాలు కలిసి వచ్చినా తల తిరిగి ముద్ద నోట్లోకొచ్చేలా జవాబు చెప్పగలం!చైనా నుంచి దురాక్రమణ భయం లేకపోతే అమెరికా నుంచి ఇరాన్ వరకు గల పెద్దా చిన్నా అదెశాల్ని ఈ కాస్త సహాయం కూడా అడగాల్సిన పని లేదు - తమకి నచ్చిన చైనా మన దేశాన్ని ఆక్రమించుకుంటే వాళ్ళకి నెప్పి  దేనికి ఉంటుంది?ఉంటే గింటే చమ్మగా ఉంటుంది గానీ - కోవర్టు పనులు చేసి భారత్ ఓడిపోయేలా చెయ్యటానికైనా సిద్ధమే!

          ఇప్పుడు కూడా చైనా యొక్క దూకుడుకి అసలు కారణం డోక్లా వివాదం కానే కాదు,దెబ్బ తిన్నాకనే నెహ్రూకి అసలు నిజం తెలిసింది.కానీ, తన మాయకత్వానికి మూల్యం చెల్లిస్తూ నెహ్రూ పతనం కూడా మొదలై తప్పును సరిదిద్దుకునే సమయం అతని చేతి నుంచి జారిపోయింది!అప్పుడు తనకు సమ ఉజ్జీ స్థానాన్ని కోరుకున్నందుకు అన్ని సహాయాలు చేసిన నెహ్రూనే క్షమించని చైనా ఇప్పుడు మోదీని సమ ఉజ్జీ స్థానంలోకి రానివ్వకుండా జెల్ల కొట్టటానికి డోక్లాం వివాదం ఒక ముసుగు మాత్రమే!చైనాలో కమ్యూనిజం యొక్క ఉన్నతాదర్శాలు ఎప్పుడో చచ్చిపోయాయి - ఇప్పుడు అది కూడా కమ్యునిష్టులు విమర్శించే పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదపు నియంతలు చేసే అన్ని దుర్మార్గాల్ని చేసేసి మానవుల సామాజిక జీవితంలోని నైతికపతనానికి పరాకాష్ఠకి ఉదాహరణగా నిలుస్తున్నది.ప్రపంచ మానవాళి యొక్క నాగరికతని ముందుకు తీసుకెళ్ళడంలో ఉపయోగపడిన కాగితం, అచ్చు యంత్రం, తుపాకి మందు వంటి వాటిని ఆవిష్కరించిన చైనాకీ ఇప్పటి చైనాకీ పోలికే లేదు!

          ఇవ్వాళ చైనా తయారీ అంటే చవక ఫోన్లు మాత్రమే గుర్తుకు వస్తున్నాయి.చైనా ప్రపంచ మార్కెట్టులోకి .వచ్చి సాధించినది ఇతర దేశాల వాళ్ళ వస్తువుల్ని దొరకబుచ్చుకుని రివర్స్ ఇంజనీరింగ్ చేసి లేబరు చవగ్గా దొరుకుతుంది గనక అతి తక్కువ రేట్లకి అసలు వస్తువులకి పోటీగా వదలటం.ఒక పదిహేడేళ్ళ కుర్రాడికి మీరో సెల్ ఫోను ఇచ్చారు,వాడు ఒక్కొక్క స్క్రూ వరసగా విప్పుతూ ఏ వరసలో విప్పాడో గుర్తు పెట్టుకుని మళ్ళీ బిగించి పని చేయించగలిగితే అతనికి దాన్ని తయారుచెయ్యడం తెలిసిపోయినట్టే కదా!విడి పార్టులు గనక చవగ్గా దొరికితే వాడే సెల్ ఫోను తయారు చెయ్యగలడు.షాపు పెట్టేస్తాడు.చైనా యెదుగుదల కూడా ఇలాగే జరిగింది. చైనాలో కమ్యునిష్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ప్రపంచానికి ఇచ్చ్గిన సొంత క్వాలిటీ ప్రోడక్టులు చాలా తక్కువ.

          మనిషైనా దేశమైనా యెదగడానికి రెండే దారులు ఉన్నాయి - ఇతరుల్ని కూడా ప్రోత్సహిస్తూ తన శక్తికి తగిన స్థానం వరకు ఎదిగి ఆగిపోవడం, శిఖరాగ్రానికి చేరుకోవడం కోసం ఇతరుల్ని వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్ళడం - రెండవ దారిని యెంచుకుంది చైనా భారత్ విషయంలో.ఈ దారిని యెంచుకున్నవాళ్ళు యెవరూ సామరస్యానికి లొంగరు,కాబట్టి రెండు అదెశాల మధ్యన యుద్ధం తప్పదు - కాస్త వెనకా ముందూ,అంతే!విజయావకాశాల్ని లెక్కించేటప్పుడు సహజంగా చైనాకి పెద్ద దేశం,జనాభా యెకువ,ఒకసారి గెలిచి ఉంది ఆనెవి సానుకూలమైన అంశాలు.బహుశా,చైనా లోని నాయకులూ మీదీయా వీటిని చూసుకునే దూకుడు చూపిస్తున్నారు కాబోలు!కానీ,ఇప్పటి పరిస్థితి అంత ఏకపక్షం కాదు.

          ఇవ్వాళ భారత్ త్రివిధ దళాలూ మహా శక్తివంతమైనవి.చైనాతో యుద్ధం గనక వస్తే ఈసారి పదాతిదళానికి అప్పటి వ్యతిరేకతలు లేకపోగా యుద్ధరంగం చాలా అనుకూలమైనది.చైనాకు ఇప్పటికీ బలమైన నౌకాదళం లేదు.భారత్ మూడు రంగాలతోనూ ధృఢంగా ఉన్న స్థితిలో ఒక్క వాయుసేనతో చైనా గెలవడం అంత తేలిక కాదు.రాజకీయ నాయకులు బహిరంగ ప్రకటనలు ఎన్ని చేసినా యుధానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాల విషయంలో సైనికాధికారుల యొక్క నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది,అవి రహస్యంగానే ఉంటాయి.అయినాసరే, మొండికెత్తి యుద్ధానికి దిగితే భారత్ కన్న చైనాకే నష్టం యెక్కువ!

          ఆయుధ రంగ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చైనా బలహీనతలలో లోకల్ మేడ్ ఆర్టిలరీ కూదా ఒకటి.భారత్ వద్ద ఉన్న ప్రతి ఆయుధమూ ప్రతి క్షిపణీ ప్రతి జలాంతర్గామీ బ్రాండ్ వాల్యూ ఉన్నది కాగా చైనా ఎక్కడా ఆయుధాలు కొన్న దాఖలాలు లేవు, అవి కూడా రివర్స్ ఇంజనీరింగ్ ముద్దుబిడ్డలే కాబోలు - ఎంత గొప్పగా పనిచేస్తాయో ఇప్పుడు జరగబోయే యుద్ధంలో భారత్ మీద ప్రయోగించాకే తెలుస్తుంది.

          అయితే,రాజకీయంగా సామాజికంగా చైనాకు ప్రతిపక్షం లేకపోవడం వల్లనూ ప్రజల నుంచి వ్యతిరేకత ఉండనందువల్లనూ యుద్ధం ఎంత క్రూరమైన స్థాయిలో చేసినా అడిగేవాళ్ళు ఉండరు.కానీ భారత్ మాత్రం ఇంటిలోనిపోరును ఎదుర్కోవలసి వస్తుంది.ఇక్కడ చైనా గెలిస్తే బాగుండునని కోరుకునేవాళ్ళు కూడా ఉన్నారు.యుద్ధంలో గెలిచిన చైనా యోధులకి "మానవత్వం పరిమళించిన మంచిమనిషికి స్వాగతం" టైపు ఆహ్వానపు వీడియోలు కూడా వస్తాయేమో!ఇప్పుడు విజయశాంతి కాస్త ఒళ్ళు చేసింది గనక ఆ పార్టు బీవీ రాఘవులు ప్లే చేస్తే వరవరరావూ హరగోపాలూ కజీరు కనాయక్కూ అహస్తఫా ముస్తాఖు పక్కతాళం ముత్తయిదువుల వేషాలు వేస్తారు.హీరోగా సుమన్ అస్సలు ఉండకూడదు పొట్టివీరయ్యని తీసుకురావల్సిందే,ఎట్లాగూ ఆ వచ్చే చైనావాడు పొట్టిబుడంకాయే కదా!

          యుద్ధం రావడమంటూ జరిగితే సైనికులకి వాళ్ళ జీవితలక్ష్యమే అది కాబట్టి ప్రాణాల్ని పణం పెట్టి పోరాడుతారు.కానీ మామూలు జనానికి మాత్రం పంబ రేగుతుంది.యుద్ధం వార్తల్ని చూసి సంతోషించడానికి క్రికెట్టు పోటీల్లా రంజుగా ఉండవు,అంత హింస!వ్యాపారస్తులు వెంటనే సరుకుల్ని దాచేసి కొంచెం కొంచెం వదులుతూ రేట్లు పెంచిపారెస్తారు.అమ్ముడుపోకుండా మిగిలిపోయిన పాత సరుకుల్ని కూడా బయటికి తీసుకొస్తారు.1962 యుద్ధం నెల రోజులు జరిగింది.సిక్కిం దగ్గిర దాడిని తిప్పి కొట్టటానికి పది రొర్జులు పట్టింది.నాలుగు నెలల కన్న ఎక్కువ సాగితే సామాన్య పౌర జీవనం అస్తవ్యస్తం కాక తప్పదు.పెద్ద నోట్ల రద్దు వరకు జరిగిన అన్ని నిర్ణయాలు మిశ్రమ ఫలితాలని ఇచ్చాయి గానీ "ఒక దేశం ఒక పన్ను" విధానం మాత్రం అమలు చేసిన ఇన్ని రోజుల తర్వాత కూడా గందరగోళం,అనుమానం కలిగిస్తున్నదే తప్ప సత్ఫలితాల నిస్తున్నట్టు కనబడటం లేదు.ఇప్పటి కిప్పుడు యుద్ధం వచ్చి అది సుదీర్ఘకాలం కొనసాగితే తట్టుకోగలమో లేదో తెలియదు.భారత ప్రభుత్వం తొందర పడకూడదు.వీలున్నంత వరకు యుద్ధాన్ని పనిబడి నెత్తిమీదకి తెచ్చుకోకూడదు.చైనా వేసిన ముత్యాల హారం అక్కడ ఉన్నంతవరకు భారత్ యుద్ధానికి దిగకపోవటమే మంచిది - ముత్యాల హారం పగలగొట్టాకనే భారత్ ప్రశాంతంగా ఉండగలదు!

          నేను పరిశీలించిన మేరకు  చైనా కూడా ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని కోరుకోవడం లేదు, వర్షాకాలం వరకు స్టేట్మెంట్ల ద్వారా బెట్టు చేసి అప్పుడు పనులు ఆపివేస్తున్నామని సైన్యాన్ని ఉపసంహరించుకుంటుంది - మోర్టారు పనులూ యుద్ధమూ ఈ రెండూ తలకు మాసినవాడు తప్ప వర్షాకాలంలో ఎవడూ చెయ్యడు.ఎందుకంటే, భారత్ ఇదివరకులా నంగిరిపింగిరి కబుర్లు చెప్పడం లేదు.చైనా గనక యుద్ధానికి దిగితే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నది.1962 గురించిన డైలాగులు అటువాళ్ళూ ఇటువాళ్ళూ పేల్చారు గానీ 1962లో భారత సైనికులు ఎదుర్కొన్న ప్రతికూలతల మధ్యన కూడా వారి పోరాటపటిమ చైనా సైన్యాధికారుల్ని చాలా భయపెట్టింది.

          రెండు దేశాలకీ తమకంటూ బలమైన సైన్యమూ,వ్యూహ నిర్మాణ చాత్రుర్యమూ ఇతరుల నుంచి సహాయాన్ని ఆశించని స్వాభిమానమూ ఉన్నాయి కాబటి యుద్ధం ఈ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కావచ్చు.అలాగే ఎవరికీ సంపూర్ణ విజయం దక్కకపోవచ్చు.భారత్ గనక టిబెట్ ప్రాంతాన్ని పట్టుకుని దలై లామాని అక్కడ నిలబెడితే చైనాకి నడుం విరిగినట్టు అవుతుంది.ఇది యుద్ధసమయంలో కుదరకపోయినా గెలుపోటములతో సంబంధం లేకుండా తర్వాతనైనా చెయ్యాల్సిన పని.ఎందుకంటే విస్తీర్ణం ఎక్కువయినప్పటికీ చైనాలో జనావాసానికి తగిన భూమి తక్కువ.ఒక్క టిబెట్ ప్రాంతమే మిగిలిన వాటికన్న మెరుగు.మొత్తం చైనా జనాభాలో 12% ఉండి వ్యాపారులకి లాభం తెచ్చిపెట్టేది అది ఒక్కటే - అప్పుడు చైనా దాన్ని వశపరచుకోవడానికి ప్రయత్నించిందీ దలై లామా తిరగబడిందీ అందుకే.దాన్ని గనక చైనా నుంచి వేరు చేస్తే ఇక మళ్ళీ భారత్ వైపుకి కన్నెత్తి చూసే ధైర్యం చెయ్యదు చైనా!

ప్రేమలోనూ యుద్ధంలొనూ గెలుపే ముఖ్యం - ఎలా గెల్చినా తప్పు లేదు!

Wednesday, 16 August 2017

మరో ప్రపంచం రేపటి కల్లా వచ్చేస్తుందా ముప్పాళ రంగనాయకమ్మ గారూ!నిజంగానే నిఖిలలోకం నిండుహర్షంతో పులకరిస్తుందా?

          నక్సల్బరీ ప్రాంతంలో చారు మజుందర్ అధ్వర్యంలో మార్క్సిస్ట్-లెనినిస్ట్ తిరుగుబాటు జరిగి 50 యేళ్ళు అయిన సందర్భంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో చాలామంది మేధావులు ఎన్నో కోణాల నుంచి పరిశెలిస్తూ వ్యాసాలు రాశారు,ఇకముందు కూడా రాస్తారేమో!ఇప్పట్ వరకు రాసినవాళ్ళలో ఉద్యమంలోకి వెళ్ళినవాళ్ళు తాము యవ్వనంలో ఉన్న కాలాన్ని - తమ కుర్రతనపు సినిమాల షికార్ల కబుర్లతో సహా  - గుర్తు చేసుకుని తాము ఆ దారిలోకి వెళ్ళడానికి తమ వైపు నుంచి కారణాలు చెప్పుకున్నారు!మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండునని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు - వారి నోస్టాల్జియా నాకూ నచ్చింది!కానీ,"మొదటి తరంలోని యువకుల్ని అంత తీవ్రస్థాయిలో ఉద్రేకింప జేసిన విప్లవ సిద్ద్గాంతం తర్వాత తరాల్లోని యువకుల్ని ఎందుకు నిరాశకు గురిచేసి ప్రజాదరణ కోల్పోయింది?" అనే మౌలికమైన ప్రశ్నకు జవాబు చెప్పే విషయంలో మాత్రం అందరిలోనూ తొట్రుపాటుగందరగోళంకంగారు మాత్రమే కనిపించాయి.ప్రపంచంలో ఏ భావజాలంఏ ఉద్యమంఏ రాజకీయ పార్టీఏ మతంఏ సినిమాఏ నాటకంఏ కవితఏ నాట్యంఏ రేఖాచిత్రంఏ వ్యసనంఏ దుర్మార్గం ప్రజల్ని సమ్మోహితుల్ని చెయ్యాలన్నా అందులో క్లారిటీ ఉండాలి.ఒక విషయం గురించి ఒక వాక్యమే చెప్పినా వెయ్యి వాక్యాలు చెప్పినంత క్లారిటీ ఇవ్వగలిగిన వాడు దోపిడీని కూడా ధర్మమే అని చెప్పి ఒప్పించి సకలజనుల్ని తనవెంట నడిపించుకోగలడు!మరిప్రజల్ని దోపిడీ నుంచి విముక్తం చేసే మహోన్నతమైన మార్క్సిస్టు సిద్ధాంతం గురించి ప్రజలకు చెప్పి ఒప్పించడానికి ఈ మేధావు లందరికీ క్లారిటీ ఎందుకు లేదు?

          కొందరు ఉద్యమంలోకి వెళ్ళనివారు - వారిలో కొందరు ఉద్యమంలోకి వెళ్ళినవారి సహాధ్యాయులే - వెళ్ళినవారికి "మీరు ఈ 50 యేళ్ళలో ఎంత ప్రగతిని సాధించారు?" అనే ప్రశ్నని సంధించారు.ఇంత కాలం పాటు మౌనం రాజ్యమేలి,ఇక యెవరూ చెప్పలేరనుకుంటున్న సందర్భంలో ముప్పాళ రంగనాయకమ్మ గారు రంగంలోకి దిగారు - "మరో ప్రపంచాన్ని రేపు చూస్తాం!" అని గొప్ప ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు.వ్యాసం చాలా చిన్నది, పత్రికవారు కూడా ఎక్కువ స్థలం ఇవ్వరు కాబట్టి తక్కువగానే చెప్పాల్సిన అవసరం కోసం తన సహజసిద్ధమైన వెకిలితనాన్ని తగ్గించుకుని పాయింట్ల వారీ జవాబులు చెప్పడం నాకు ఎంతగానో నచ్చింది - ఆమె ఎజెండా కక్కుర్తితో చేసే తక్కువస్థాయి వెక్కిరింతలు లేకుండా మాట్లాడటం బహుశా ఇదే మొదటిసారీ ఇదే ఆఖరుసారీ కావచ్చు!ఆమె ఇతరులు చాలాకాలంగా కమ్యూనిష్టుల్ని అడుగుతున్న ప్రశ్నలని అక్కడ ఉటంకించి వాటికి జవాబులు చెప్పారు.అయితే, మొదటి జవాబులోనే విప్లవాభిమానులకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు - "మరో ప్రపంచానికి నమూనా ఏదైనా ఉందా?"  అనే ప్రశ్నకి "నమూనా ఇప్పటికీ లేదు!" అని బల్లగుద్ది చెప్పేశారు, ప్రణాళిక మాత్రం ఉందట, గ్రహింపులు గాఢంగా లేక రష్యా-చైనాలు మంచి నమొనాలు కాలేకపోయాయట, అక్కడి అపజయాలకు కారణాలేమిటో అక్కడా ఇక్కడా కూడా ఇంకా గ్రహించలేదట, త్వరలోనే గ్రహిస్తారట.

          ఎప్పటికి గ్రహింపులు పూర్తవుతాయని తొందర పెట్టకూడదు,"నక్సల్బరీ ఒక లగ్జరీ కాదు.విప్లవం ఒక వ్యాపకం కాదు.విప్లవకారులకు త్యాగాలు భుజకీర్తులు తెచ్చిపెట్టవు.కేవలం ఉద్యమకారులే కాదు, వాళ్లను కాపాడుకోవటానికి ప్రజలూ ఎన్నో త్యాగాలు చేస్తున్నారు.ఆ త్యాగాలు ఎందుకు కొనసాగుతున్నాయి?మనిషిని, ప్రకృతిని, సామాజికవిలువలను ధ్వంసం చేసే నయా ఉదారవాద రాజకీయ ప్రక్రియ కొనసాగుతుంటే, దానికి ఎదురు నిలబడి పోరాడుతున్న ప్రజలనూ పార్టీలనూ బుద్ధిజీవుల మనుకునేవాళ్ళు 'మీ మరోప్రపంచం ఎక్కడ?' అని వెటకారం చెయ్యడం సరికాదు.నిజాయితీగా మరో ప్రపంచాన్ని కోరుకునేవాళ్ళు వారికి మద్దతు నివ్వటం కనీస కర్తవ్యం." అని అశోక్ కుంబము గారు పక్కనుంచి సలహాలు ఇస్తున్నారు, విని గ్రహింపు లేక ఎఱుక లేక తెలివిడి తెచ్చుకుని వారిని తొందర పెట్టకండి.రంగనాయకమ్మ గారు కూడా ప్రపంచంలో అనేకచోట్ల ఈ గ్రహింపులు జరుగుతూనే ఉన్నాయనీ,"మంచి" కోసం జరిగే ప్రయత్నాలు ఆగిపోవనీ,ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒకరోజున నమూనా ఏర్పడకపోదనీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ హేతుబద్ధమైన క్లారిటీ ఇచ్చి తీరాల్సిన ఈ ప్రశ్నకి జవాబుని సెంటిమెంటు ముక్తాయింపులతో ముగించారు.దీనితోనే ఈమె పాండిత్యమూ, ఆమెకి ఆ పాండిత్యాన్ని ప్రసాదించిన మార్క్సిజమూ ఎంత దిక్కుమాలినవో అర్ధమై నాకు హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి వారి కాటిసీను గుర్తొచ్చి జాలిగా అనిపించింది, నిజం!

          ఇక్కడ నేను బ్లాగుల్లో కమ్యూనిష్టు భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కుర్రనాగన్నల నందర్నీ ఎన్నోసార్లు "మీ సిద్ధాంతంలోని అతి ముఖ్యమైన వర్గరహితప్రపంచం అనే లక్ష్యం గురించి మార్క్సుగారు చెప్పినవాటిలో కనీసం  నాలుగు శాస్త్రీయమైన లక్షణాలని చెప్పండి!" అని అడిగాను - ఒక్కడూ ముందుకు రాలేదు.ఇప్పుడు వాళ్ళు ఓపిక తెచ్చుకుని వెతికి చూపించడానికి కూడా వీల్లేకుండా ఈ సీనియర్ మోస్ట్ కమ్యూనిస్ట్ మేధావి అసలు మార్క్సుగారు ఏ మోడలూ చెప్పలేదని స్పష్టం చేసింది - శుభం పలకరా మంకెన్నా అంటే పెళ్ళికూతురు ముండేదని అన్నాట్ట వెనకటి కెవడో!ఈవిడ ఈ వ్యాసం రాయకుండా ఉంటే ఇంకొన్నాళ్ళు విప్లవం లోకి వెళ్ళినవాళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్పుకునే వాళ్ళు,ఇప్పుడు వీళ్ళంతా గమ్యం తెలియని ప్రయాణం చేశారని ప్రజలకి అర్ధమైతే ఇప్పటివరకు వచ్చినట్టు ఇకముందు వీళ్ళ వెంట కళ్ళు మూసుకుని  రాగలరా?పోనీ కళ్ళు తెరుచుకుని వీళ్ళ వెంట నడవటానికైనా వీళ్ళు యెక్కడికి వెళ్తున్నారో తెలియకుండా తమని యెక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా వీళ్ళ వెనక ఎవరు వస్తారు?అలా రమ్మని అడిగే హక్కు వీళ్ళకి  ఎవరు ఇచ్చారు?మతాలని విమర్శించేటప్పుడు "వీటిలో స్పష్టత లేదు,మేము అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోతున్నారు - వూరికే నమ్మితే చాలునంటున్నారు" అని పడుతున్న తప్పునే వీళ్ళూ చేస్తున్నారు కదా!వర్గరహితప్రపంచం గురించి "అటువంటి 'మంచి' ప్రపంచం ఏర్పడితే, అది 'మాదే' కాదు, 'మీదే' కాదు, 'అందరిదీ' అవుతుంది" అని సుద్దులు చెప్పటం వరకూ బాగానే ఉంది - కానీ మనం అడిగిన ప్రశ్నలకి శాస్త్రీయమైన జవాబులు చెప్పకుండా సెంటిమెంటు ఒలకబోసి వీరు విమర్శిస్త్రున్న మతవాదుల లాగె వీరు కూడా ప్రవర్తించడం దేనికి?

          ఇక రెండవదైన "మరో ప్రపంచంలో కూడా ఏదో ఒక ప్రభుత్వం ఉండాల్సిందే కదా?" అనే ప్రశ్నకి ఈమె చెప్పిన జవాబు మరింత అయోమయాన్ని పెంచింది, నిజం!ఒకటి గుర్తుంచుకోండి, నేను ఈ వ్యాసాన్ని అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు గానీ మీకు నా విశ్లేషణల్ని చెబుతున్నప్పుడు గానీ ఆమె పట్ల గానీ కమ్యునిష్టు సిద్ద్గాంతం పట్ల గానీ నేను నెగెటివ్ యాటిట్యూడ్ చూపించటం లేదు - ప్రస్తావన గంభీరమైనది అయిన సందర్భంలో నేనెప్పుడూ చవకబారుగా ప్రవర్తించను - అది మీకు తెలిసే ఉంటుంది.ఎంత సానుకూలంగా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించినా ఈ సమాధానం నాకు గందరగోళాన్నే మిగిల్చింది.ఎందుకంటే,వర్గరహితప్రపంచానికి ఒక మోడల్ ఇప్పటికి యేదీ లేదని చెప్పేశాక అది యెట్లా ఉంటుందో తెలియని స్థితిలో ఉండి "'మరో ప్రపంచం' అంటే, దాని అర్ధం వేరు.'ప్రభుత్వం' ప్రసక్త్రి మరో ప్రపంచానికి వర్తించదు" అని తేల్చి చెప్పేసి మొదలుపెట్టడం ఎట్లా సాధ్యం?

          ప్రభుత్వం ఆనెది అణచివేత మొదలైన కాలంలో పుట్టిందని తెలిస్తే అణచివేత పోయినప్పుడు ప్రభుత్వం కూడా అంతరించిపోతుందని యెంత తేలిగ్గా  చెబుతున్నది - ఇది అమాయకత్వమా, అహంకారమా, అంధకారమా!ఈ ప్రస్తావన లోని కీలకమైన భావం యేమిటంటే క్రైస్తవులు వూహించి చెప్పిన ఈడెను స్వర్గం లాంటి స్థితిలో మానవసమాజం ఒకప్పుడు ఉండేదని ఈమె నమ్మి మనకి చెబుతున్నది - నిజంగా అలాంటి మంచికాలం ఒకటి ఉన్నదని ఈమె మరియూ ఈమె నమ్ముతున్న సిద్ధాంతాన్ని సూత్రీకరించిన మార్క్సు గారూ చెబుతున్నప్పుడు మొదటి ప్రశ్నకి జవాబుగా ఈమె నమూనా లేదని యెందుకు చెప్పినట్టు?అప్పటి నమూనాని కనుక్కోవడానికి సెంటిమెంట్లు అక్కరలేదు - పరిశోధన చాలు, ఆధారాలు సేకరించితే చాలు, శాస్త్రీయమైన విశ్లేషణ చేస్తే చాలు కదా!

          నాకు తెలిసినంతవరకు మార్క్సు మొత్తం మానవ చరిత్రని నాలుగు దశల కింద విడగొట్టాడు - తర్వాతై దశలకి రాజస్వామ్య దశ,భూస్వామ్య దశ,పారిశ్రామిక దశ అని పేరు పెట్టినవాడు మొదటి ఆటవిక దశని మాత్రం ఆదిమ కమ్యునిష్టు సంస్కృతిని ప్రదర్శించే మౌలిక దశ అన్నాడు.భవిష్యత్తులో ఏర్పడబొయే వర్గరహితసమాజం కూడా కొద్ది తేడాలతో ఈ లక్షణాలనే ప్రదర్శిస్తుందని  కూడా చెప్పాడు, అవునా కాదా?మార్క్సు దగ్గిర్నుంచీ రంగనాయకమ్మ వరకు వారి సిద్ధాంతం పట్ల స్పష్తత లేకపోవటానికీ ఈమె రెండు ప్రశ్నలకీ రెండు పరస్పర విరుద్ధమైన జవాబులు ఇవ్వటానికీ ఈ ఆటవిక దశ పట్ల ఉన్న మితిమీరిన ప్రేమయే కారణం!నిజానికి ఈ దశ అంత ఉన్నతమైనది కాదు, దీనిలోని లోపాలు బయటపడటం వల్ల లేదా వీరి సిద్ధాంతం విశ్లేషిస్తున్న యాంటీ ధీసిస్ ఈ వ్యవస్థలో ప్రవేశించటం వల్లనే మానవసమాజం తర్వాతి దశలోకి అడుగు పెట్టిందనేది వాస్తవం.అంటే, ప్రభుత్వం లేని కమ్యునిష్టు సమాజం స్థిరంగా ఉండదనేది కూడా వాస్తవమే అవుతుంది కదా!వీరు భవిష్యతులో ప్రపంచ ప్రజలను అందర్నీ నడిపించటానికి ప్రయత్నిస్తున్న ప్రోటోటైప్ ఒకప్పుడు కొంతకాలం భూమిమీద ఉనికిలో ఉండి, వీరు చెబుతున్న గతితార్కికభౌతికవాదం ప్రకారమే వైరుధ్యాలు పెరిగి తర్వాతి దశలోకి ప్రవేశించింది, అవునా?మరి, ఆ దశనుంచి ముందుకి వచ్చిన ఇన్ని వేల సంవత్సరాలు గడిచాక ఇప్పుడు మళ్ళీ ఆ దశలోకి వెళ్ళటం ఎట్లా కుదురుతుంది?సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా సెల్ ఫోన్ల వాడకం తగ్గించుకోలేని వాళ్ళని ఆటవిక సమాజాన్ని అనుసరించమని చెప్పడం ఏమి తెలివి?

          ఇక మూడవదైన "మీ మరో ప్రపంచంలో కూడా పెత్తనం కొందరి చేతుల్లోనే ఉంటుంది కదా?" అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబుతో నాకు విభేదం యేమీ లేదు - అది యుక్తియుక్తంగానే ఉన్నది!కాకపోతే అడిగినవారు ప్రశ్నని మరింత నిర్దుష్టంగా అడగకపోవటం వల్ల ఈమెకి వచ్చిన వెసులుబాటు అది."కొందరి" అనే పదానికి బదులు "కమ్యూనిష్టు పార్టీ సభ్యుల" అని ఉండాల్సింది.వర్గరహితసమాజం అనే భావనని మొత్తం సమాజానికి లక్ష్యంగా నిర్దేశిస్తున్నది కమ్యూనిష్టు పార్టీయే కాబట్టి దానికి జవాబుదారీగా వర్గరహితసమాజాన్ని వైరుధ్యాలు ప్రవేశించి అది కొత్త దశలోకి అడుగుపెట్టనివ్వకుండా అనంతకాలం వరకూ పట్టి ఉంచే గురుతరమైన బాధ్యతని కమ్యూనిష్టు పార్టీయే తీసుకుంటుంది -  అది వారి గతితార్కికచారిత్రకభౌతికవాదానికి విరుద్ధమైనా సరే!వర్గరహితప్రపంచం ఏర్పడితే దోపిడీ అంతమౌతుందని మాత్రమే చెబుతున్నారు గానీ మేము కమ్యూనిష్టు పార్టీని రద్దు చేసుకుంటామని చెప్పడం లేదు, అవునా?ఈమె ఒకే రకం వాక్యనిర్మాణాన్ని ఉపయోగించి "స్వంత శ్రమ లేకుండా జీవించే హక్కు ఎవరికీ లేదు, అందరూ శ్రమ చెయ్యాలి అని నిబంధన పెడితే అది పెత్తనం కాదు - శ్రామికవర్గం దోపిడీ నుంచి విముక్తి చెందే ఆత్మరక్షణ మార్గం!" అని చెప్తున్నవన్నీ ఆదర్శాలే తప్ప వాటిని సాధించాల్సిన సిద్ధాంతం లోని శాస్త్రీయతకీ వాటికీ ఎలాంటి సంబంధమూ లేదు.

          నాల్గవ ప్రశ్న మూడవ ప్రశ్నకి నకలు,ఐదవ ప్రశ్న నాల్గవ ప్రశ్నకి నకలు,ఆరవ ప్రశ్న ఐదవ ప్రశ్నకి నకలు - అడిగిన వారికి మార్క్సిస్టు సిద్ధాంతం మీద సరయిన అవగాహన లేకపోవడం వల్ల వచ్చిన తంటా అది!అందుకే,ఆమె కూడా "నేటి పోలీసు వ్యవస్థ వంటిది ఉంటుందా లేదా?" అన్న ప్రశ్నకి "దోపిడీయే లేకపోతే పోలీసులు ఎందుకు?" అనే ప్రశ్ననీ "పోలీసు వ్యవస్థ లేని రాజ్యం ఉంటుందా?" అన్న ప్రశ్నకి "రాజ్యమే ఉందదంటున్నప్పుడు పోలీసుల ఉనికి దేనికి" అనే ప్రశ్నకి సరిపోయే "దోపిడీ అదృశ్యమే రాజ్యం అదృశ్యం" అనే ప్రతిపాదననీ "మరో ప్రపంచంలో శాంతిభద్రతల సమస్యలే తలెత్తవా?" అన్న ప్రశ్నకి "ఒకచోటుకి చేరే ధనరాసులు లేకపోతే శాంతి భద్రతల మాట దేనికి?నిరుపేద గుడిసె ముందు వాచ్‌మెన్ ఉంటాడా?" అనే ప్రశ్ననీ జవాబుగా చెప్పేసి సరిపెట్టేసింది!

          ఏడవ ప్రశ్నకి చెప్పిన జవాబును మాత్రం కొంచెం ప్రత్యేకించి చూడాలి - "మీ పాలన నచ్చని అసమ్మతివాదుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తారు" అన్నదానికి ఈమె చెప్పిన పరిష్కారం అద్భుతంగా ఉంది!హిట్లర్ సినిమాలో రాజేంద్రప్రసాదు క్యారెక్టరు చిరంజీవి క్యారెక్టరు గురించి "ఇద్దరు వెళ్ళారు,ఇద్దరు వచ్చారు - మీ అన్నయ్యకి ఎప్పుడూ నలుగురు చెల్లెళ్ళకి తక్కువుంటే తోచదు కాబోలు!" అన్నట్టు ఇప్పటి వరకు అడవుల్లో వున్న నక్సలైట్లు నగరానికి వస్తారు,ఇప్పటి వరకు నగరాల్లో ఉన్న విప్లవ వ్యతిరేకులు అడవుల్లోకి వెళ్తారు - భలే పరిష్కారం,ఒక్క టిక్కట్టుకి రెండు సినిమాలు "జింబో నగర ప్రవేశం","పాండవ వనవాసం"!గబుక్కున తియానన్మెన్ స్క్వేరులోనూ బెంగాల్లోనూ కేరళాలోనూ చేసినట్టు జాలీ దయా లేకుండా చంపేస్తాం అని చెప్పడానికి ఇబ్బంది పడినట్టున్నారు కాబోలు,కాగితాలు ఖరాబు చెయ్యడమే తప్ప ఈవిడ ఎప్పుడూ తుపాకి పట్టుకున్న దాఖలా లేదు గదా!అడిగిన ప్రశ్నల కన్నిటికీ హేతుబద్ధమైన జవాబులు చెప్పేశాననుకున్న భ్రమతో కూడిన సంతృప్తితో మరిన్ని ప్రశ్నలు అడగలేదని అసంతృప్తిని వ్యక్తం చేసి బిచ్చగత్తె తన బొచ్చెలో తనే బిచ్చం వేసుకున్నట్టు కొన్ని అయాచిత ప్రశ్నలకి కూడా ఎంతో శ్రమపడి జవాబులు చెప్పారు.

          కానీ, డూప్లికేట్ ప్రశ్నల్నీ వాటికి చెప్పిన ఫ్లాంబొయంట్ జవాబుల్నీ కలిపి చూస్తే అడిగింది ముష్టి మూడు ప్రశ్నలు - మొదటి రెండు ప్రశ్నలకీ ఒకే జవాబు చెప్పిఉంటే, మిగిలిన జవాబులు దానికి అనుగుణంగా ఉంటే, అప్పుడు ఈ జవాబులు అడిగిన ప్రశ్నలకి సరయిన జవాబులు అయి ఉండేవి.అక్కడే బొక్కబోర్ల పడిపోవడం వల్ల ఈవిడ పడ్డ శ్రమకి పూచికపుల్ల విలువ కూడా లేకుండా పోయింది!ఇంతవరకు వెక్కి వెక్కి ఏడుస్తున్న కమ్యునిష్టు భావజాలపు అభిమానులు గుక్కపట్టి ఏడ్చేలా చెయ్యటానికే పనికొస్తుందే తప్ప వార్ని ఓదార్చటానికి అస్సలు పనికిరాదు ఈమె రాసిన వ్యాసం - కమ్యూనిస్టు సానుభూతి పరులు ఇప్పుడు ఏమి చెయ్యాలి?ఈమె అధాటున రష్యాతో పాటు చైనాని కూడా పనికిమాలిన మోడల్ అనేశారు.మరి దీన్ని చైనా ఫ్యాన్లు యెలా ఒప్పుకుంటారు?

          అసలు వర్గరహితసమాజం ఏర్పడటమే చరిత్ర యొక్క అంతిమదశ అని చెప్పటం "వ్యవస్థల యొక్క చరిత్ర ధీసిస్,యాంటిధీసిస్ - వీటి సంఘర్షణ నుంచి పుట్టే సింధీసిస్ అనే ప్రక్రియలతో నడుస్తుంది" అనే వీరి గతితార్కిక చారిత్రక భౌతికవాదపు సూత్రానికి విరుద్ధం.ఎందుకంటే,అప్పటికి ధీసిస్ అయిన వర్గరహిత సమాజంలో యాంటిధీసిస్ పుట్టదని గ్యారంటీ యేమిటి?ఆ గ్యారంటీ ఇవ్వాలంటే ఆ మోడల్ ఎట్లా ఉంటుందో వీళ్ళకి తెలియాలి!తమకే తెలియని విసయంలో వీళు మనకి గ్యారెంటీ యెలా ఇవ్వగలరు?గ్యారెంటీ లేకుండా వీళ్ళని మనం ఎందుకు నమ్మాలి?ఇన్నేళ్ళు సిద్ధాతంలో తలబంటి ముణిగిన ఈమెకే అసలు విషయంలో క్లారిటీ లేని స్థితిలో ఉన్న రంగనాయకమ్మ గారు దొసో కొపిత్యలో పవిత్రగ్రంధంలో అన్ని ప్రశ్నలకీ జవాబులు ఉన్నాయి చదువుకుని తరించండని మనకి ఉబోస ఇస్తున్నారు - హవ్వ!ఒక్క అక్షరంలో కూడా హేతుబద్ధతను ప్రదర్శించలేని ఈ వ్యాసాన్ని రంగనాయకమ్మ గారు రాయకుండా ఉంటే ఎంత బాగుండేది - మరి కొంతకాలం పాటు కమ్యునిష్టు సిద్ధాంతం త్యాగధనుల కన్నీటి కధల పేరున సానుభూతి తెచ్చుకుని చచ్చేది!మూలిగే నక్కమీద తాటిపండు పడింది, వేసింది దాని కన్నబిడ్డే.తల్లి ఏం చెయ్యగలదు?తన బాధకి తను మూలగటమే తప్ప కన్నబిడ్డని తిట్టుకోనూ లేదు తన్ని తగిలెయ్యనూ లేదు - పాపం!

ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ!

Sunday, 13 August 2017

రెండు తలతిక్క వరాలు - ఒక అర్ధవంతమైన కధ!

          హిందువుల కాలగమనంలో చతుర్యుగాలకు ప్రత్యేక స్థానం ఉంది.కల్పం,మన్వంతరం వంటి సుదీర్ఘమైన కాలావధులు బ్రహ్మ ఆయుర్దాయానికి సంబంధించినవి.అంతా బాగుండి నూరేళ్ళు బతకగలిగిన మానవులకి కూడా ఏనాటికైనా తమ జీవితకాలంలో వాటి ప్రారంభాన్ని గానీ అంతాన్ని గానీ తెలుసుకునే అవకాశమే లేదు.అసలు వాటి ప్రభావం మానవుల మీద ఉండనే ఉండదు.కానీ కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలు అట్లా కాదు.ఈ యుగాలో మానవుల జీవిత కాలాలు, స్వభావాలు, ధర్మాభిరతి వంటివి పూర్తి వైవిధ్యంతో ఉంటాయి.

          కృతయుగంలో మానవుల సగటు ఆయుర్దాయం 400 సంవత్సరాలు, త్రేతాయుగంలో 300 సంవత్సరాలుద్వాపర యుగంలో 200 సంవత్సరాలు, కలియుగంలో 100 సంవత్సరాలు.ఇవి సగటు లెక్కలు మాత్రమే కాబట్టి కొందరు ఎక్కువ కాలం బతకవచ్చు, కొందరు తక్కువ కాలం బతకవచ్చు - random asortment of biomertric distribution!ప్రవర్తన రీత్యా కృతయుగం మానవులలో పాపవాంఛలు లేని సుకృతయుగం - త్రేతాయుగంలో ధర్మం పట్ల అశ్రద్ధ పెరిగి కొంత  మలినం అయితే ద్వాపరంలో పరిస్థితి మరింత దిగజారి కలియుగానికి వచ్చేసరికి సర్వభ్రష్టత్వం కనబడుతుంది.అయితే, కలియుగం అంతమైపోయిన తర్వాత సృష్టి మొత్తం అంతమైపోదు - మళ్ళీ కృతయుగం మొదలవుతుంది.

          ఈ అనంత కాలగమనంలో నూరేళ్ళు కూడా బతకలేని కలికాలపు మనిషి ఎంత అహంకారం ప్రదర్శిస్తున్నాడు? ఒక పాతికేళ్ళు తనకి దొరికిన పుస్తకాలు మాత్రం చదివేసి ఇంక చదవాల్సిన పుస్తకాలు లేవన్నట్టు తనకన్న తెలివైనవాడు లేడనీ తనకే అన్నీ తెలుసుననీ తనకి తెలియనివన్నీ అశాస్త్రీయమైన విషయాలనీ ఎట్లా రంకెలు వేస్తున్నాడో!కొన్ని లక్షల సంవత్సరాల వయస్సు గల గురుపరంపరాప్రోషితమైన వేదవిజ్ఞానం కన్న తన పాతికెళ్ళ రుబ్బుడు పాండిత్యం గొప్పదని అనుకోవటం ఎంత వెర్రితనం?పాతికేళ్ళ క్రితం మొబైలు ఫోను యెరగని మనమే ఒకప్పుడు మనం మొబైలు ఫోను వాడకుండా పాతికేళ్ళు బతికామంటే నమ్మలేకుండా ఉన్నామే - వీళ్ళ పాతికేళ్ళ జ్ఞానం వాళ్ళ వేనవేలయేళ్ళ జ్ఞానానికి ఎట్లా సమానం అవుతుంది?

          మనవాళ్ళు కాలాన్ని ఎనిమిది రకాలుగా కొలిచారు - ఇవ్వాళ నిద్రపోయిన వాడు తెల్లారి నిద్ర లేస్తాడని గ్యారెంటీ లేదు కాబట్టి ఒక పగలు ఒక రాత్రి కలిసిన రోజుని అహోరేవ సంవత్సరం అన్నారు.శ్రీరాముడు రెండవసారి పట్టాభిషేకం తర్వాత 11,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు నేది అహోరైవ కాలం,దాన్ని మామూలు లెక్కకి మారిస్తే సుమారు 33 యేళ్ళు కావచ్చు.అప్పటి కావ్యాల్నీ, కధల్నీ చదివేటప్పుడు వాటి నిజమయిన అర్ధం తెలుసుకోవాలంటే ఇలాంటి సూక్ష్మమైన వివరాలు కూడా తెలియాలి!ఇవ్వాళ సెల్సియస్,ఫారన్‌హీట్ ఉష్ణోగ్రతల మధ్యన ఉన్న మార్పిడి ఈ ఎనిమిదింటికీ ఉన్నది - ఏ కాలమానం ప్రకారం చెప్పినా విలువ ఒకటే.మారకపు విధానం తెలియాలి,అంతే!

          దేవతలు వరాలు ఇవ్వడం,మునులు శాపాలు ఇవ్వడం కూడా అంతే - హీరణ్యకశిపుడు చావు లేకుండా వరం కోరుకోవడానికి బ్రహ్మ కోసం తపస్సు చేస్తుంటే పంచభూతాలు గడగడ వణికిపోయాయి.అదే హిరణ్యకశిపుడు తపస్సు నుంచి బయటికి వచ్చాక అదే పంచభూతాల నుంచి చావు రాకూడదని వరం అడిగాడు, వింతగా లేదూ?ఆ కధ రాసినవాడూ ఈ కలికాలపు పుచ్చొంకాయలకి దొరికిపోయి తెల్లమొహం వేసేటంత పిచ్చోడు కాదు, తెలియక రాయలేదు. ఆ కధ అట్లా చెబితేనే తను చెప్పాల్సిన నీతి జనానికి బాగా యెక్కుతుంది అని తెలిసే రాశాడు.ఇదే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు కుటుంబసభ్యులకి ధైర్యం చెబుతూ ఎంతో జ్ఞానబోధ చేస్తాడు, మరి యేమిటి తేడా?ఇవ్వాళ్టి రెటమతం వాళ్ళ లాగే అతనిదీ పెదవి చివరి పాండిత్యం - మనస్సుకి యెక్కలేదు.


          తన నుంచి ప్రభవించిన ఈ సృష్టిలో దేవుడు అంతటా ఉన్నాడని ఒప్పుకోలేక ఇవ్వాళ ముష్టాఖ్ అహ్మద్ అంటున్నట్టు మానవుడి వినియోగం కోసం అప్పనంగా కట్టబెట్టిన ఈ సృష్టితాలలో దేవుడు లేడు గాక లేడు అని విర్రవీగాడు. తను లేడు లేడంటున్న దేవుడు తన వొంట్లోనే ఉన్నాడని తెలియక వాళ్ళనీ వీళ్ళనీ చూపించండి చూపించండని గద్దించి తీరా తను చావు రాకుండా ఉండటం కోసం పెట్టిన అన్ని మెలికల్నీ దాటుకుని నరహరి రూపంలో వచ్చి కళ్ళముందు కనబడగానే ఆయువులు శోషించి నశించిపోయాడు - తీట తీరింది, చావు దక్కింది!నిజానికి పౌరాణిక కధలలోని ఈ రాక్షసులు చారిత్రక యుగంలోని నియంతల వంటివాళ్ళు.చావు లేకుండా వరాలు కోరడం,విష్ణుభక్తుల్ని హింసించటం,దేవుడి చేతిలో చచ్చిపోవటం లాంటి కాల్పనికతని పక్కన పెట్టి అక్కడ ఇచ్చిన వివరాల నుంచి జాడలు పట్టి అసలు కధ ఎట్లా జరిగి వుంటుందో హేతుబద్ధంగా వూహిస్తే ఇలా ఉంటుంది.

          దాదాపు ప్రతి కధలోనూ ఆ రాక్షాసరాజు ఏదో ఒక నగరానికి రాజు అని చెప్తారు.ఇతని ప్రభావానికి ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోయిందని చెప్తారు,మళ్ళీ  ఇరుగుపొరుగు రాజ్యాల ప్రస్తావనా ఉంటుంది - ఈ రాజు ఆ రాజ్యపు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ పొరుగు రాజు ఎట్లా వూరుకుంటాడు?చరిత్రకి తెలిసిన ఇటీవలి మహారాజ్యాలు తప్ప ప్రాచీన కాలంలోని రాజ్యాల విస్తీర్ణం చాలా తక్కువ - ఒక నగరం చుట్టూ ఉన్న కొన్ని జనపదాలు, అరణ్యాలు మాత్రమే!ఇంత చిన్న రాజ్యానికి రాజు మొత్తం భూమి నంతట్నీ చాప చుట్టడం లాంటి పనులు చెయ్యగలడా?చెయ్యలేడు!వాళ్ళు అతలాకుతలం చేసింది వాళ్ళ రాజ్యంలోని ప్రజలనే, అక్కడ ఉండి ఆ రాజు క్రూరత్వానికి బలి అవుతున్నవాళ్లలో ఆ కధ మొదటిసారి చెప్తున్నవాడికి తన రాజ్యమే ప్రపంచం అవుతుంది.ఎక్కడ ఎవడు ఎవర్ని అణిచివేసినా ఆ పని ఒక్కడే చెయ్యలేడు  - సహాయకులు ఉంటారు,జనానికి మేలు చెయ్యకుండా జనం చేత పొగిడించుకోవడమే నియంతృత్వం అయినప్పుడు నేనే దేవుణ్ణి అనటం దగ్గిర్నుంచి నాకు దేవుడు కనబడి నేను చెప్పినట్టు మిమ్మల్ని వినమన్నాడని డప్పు కొటుకోవటానికి తన కులబ్రాహ్మణుల చేత చావు లేని వరాల పిట్టకధని వ్యాపింపజేస్తాడు దుర్మార్గుడైన రాజు.ఈ రాజు నిరంకుశత్వాన్ని భరించీ భరించీ సహనం చచ్చిపోయి ఎవడయినా ఆ రాజుని చంపితే అప్పటివరకు ఉన్న నమ్మకాల వల్ల చంపిన వాడు సాక్షాత్తూ దేవుడి అవతారమే తప్ప వరప్రసాదిని సామాన్యుడు చంపలేడు అని జనం అనుకోవడం సహజమే కదా!బహుశా ఇందిరాగాంధీని చంపిన కాపలావాళ్లలా జరిగి ఉండొచ్చు హిరణ్యకశిపుడి చావు.దాన్ని గ్రంధస్థం చేసేటప్పుడు జనశ్రుతంగా చేరిన అదనపు కల్పనలతో కలిసి ఒకే కధ కొన్ని చిన్న చిన్న మార్పులతో ఎన్నో చోట్ల కనబడుతుంది.

          ఈ మధ్యనే ఆర్ధర్ కానన్ డాయల్ సృష్టించిన షెర్లాక్ హోమ్స్ పాత్ర నిజమైనదే అనుకుని అతని అడ్రసుకి ఉత్తరాలు రాసినవాళ్ళు ఉన్నారు, అట్లాగే అమెరికన్లు కేప్టెన్ అమెరికా పాత్రని కల్పిత పాత్ర అంటే ఒప్పుకోరు - ఎందుకని?ఆ పాత్రల్ని అంత సజీవమైన వాతావరణంతో సృష్టించిన ఆయా రచయితల రచనా ప్రతిభ ఒక కారణం అయితే,పాఠకుల వైపునుంచి ఆ పాత్రలలో తమకు సారూప్యతని చూడటం అంతకన్న బలమైన రెండవ కారణం - ఈ సారూప్యత మనలో లేనప్పుడు ఆ పాత్రల అడ్రస్సులకి ఉత్తరాలు రాసే పిచ్చిపనులు చెయ్యము, కదా!

          సరిగ్గా, హిందూ పురాణాలలోని పాత్రల్ని కొందరు హిందువులు అతిగా అభిమానించడానికీ కొందరు హిందూమతద్వేషులు అతిగా విమర్శించడానికీ ఈ సారూప్యతయే కారణం.హిందువులు అక్కడ నాయక పాత్రలో ఉన్న దివ్యపురుషుడితో తాదాత్మ్యం చెంది అభిమానిస్తారు, ఇతరులు ఈ హిందువులు అభిమానించే పాత్రలను ద్వేషించి ఆ ఉన్నతమైన వ్యక్తిత్వం గల పాత్రల చేతుల్లో హతమారిన నీచమైన పాత్రలని అభిమానిస్తారు.ఒక విచిత్రమైన విషయం యేమిటంటే ఆయా కధల్లో గెలిచినవాణ్ణి అభిమానించినవాళ్ళు నిజజీవితంలో కూడా గెలుస్తుంటే ఓడిపోయినవాళ్లని అభిమానించేవాళ్ళు నిజజీవితంలో కూడా ఓడిపోతున్నారు.ఇవ్వాళ్టి ఓటమి వెనక కారణాలు తెలుసుకుని రేపటి గెలుపు కోసం కృషి చెయ్యకుండా "మేము హిందువుల దుర్మార్గానికి గురైన పీడిత,తాడిత,రోదిత కులాల వాళ్ళం!" అని ప్రకటించేసుకుని ప్లేగ్రౌండు నుంచి తప్పుకుని పెవిలియనుకే అతుక్కుపోయి ఓడిపోయేవాళ్ళకి చీర్ లీదర్లుగా పనిచేస్తూ అక్కడే ఉండిపోతున్నారు:=)

          పురాణ కధల్ని పనిగట్టుకుని ఆ విధమైన పాత్రచిత్రణతోనే రక్తి కట్టించిన ఆనాటి రచయితలు బహుశా తాము జీవించిన కాలంలోనే ఇటువంటి వెధవాయిత్వాల్ని చూసి వాటినే ఆయా రాక్షస పాత్రలలో చూపించి ఉంటారు.ఉదాహరణకి మళ్ళీ హిరణ్యకశిపుడినే తీసుకుని పరిశీలించి చూస్తే వాడు మొదట "నాకు చావు రాకూడదు!" అని కోరుకున్నాడు, బ్రహ్మ దేహధారులకి చావు తప్పదు, అది నా శక్తికి మించినది,మరేదైనా కోరుకోమన్నాడు, అయినా సరే - ఆయన ఇవ్వలేనంటున్న దానినే ఆయన నుంచి కొట్టెయ్యాలని తన క్రియేటివిటెని ఉపయోగించి "దానితో చావకూడదు, దీనితో చావకూడదు, వాడితో చావకూడదు, వీడితో చావకూడదు, అక్కడ చావకూడదు, ఇక్కడ చావకూడదు" అని హిరణ్యాక్ష వరాలు అడిగాడు.హిరణ్యకశిపుడు కోరిన వరాలకి హిరణ్యాక్ష వరాలు అని పేరు దేనికి పెట్టినట్టు?తమ్ముడు హిరణ్యాక్షుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి కోరుకుంటున్నాడు కాబట్టి!

          బ్రహ్మ కోరుకోమన్నది ఒక్క వరమే - మనవాడు ఆ ఒక వరంలోనే లెక్కపెట్టి 21 కండిషన్లతో మడతపేచీలు పెట్టి "1.గాలిలో మరణం లేకుండుట, 2.నేలమీద మరణం లేకుండుట, 3.నిప్పుతో మరణం లేకుండుట, 4.నీటిలో మరణం లేకుండుట, 5.ఆకాశంలో మరణం లేకుండుట, 6.దిక్కులలో మరణం లేకుండుట, 7.రాత్రి సమయంలో మరణం లేకుండుట, 8.పగటి సమయంలో మరణం లేకుండుట, 9.చీకట్లో మరణం లేకుండుట, 10.వెలుగులో మరణం లేకుండుట, 11.జంతువులచే మరణం లేకుండుట, 12.జలజంతువులచే మరణం లేకుండుట, 13.పాములచే మరణం లేకుండుట, 14.రాక్షసులతో యుద్ధంలో మరణం లేకుండుట, 15.దేవతలతో యుద్ధంలో మరణం లేకుండుట, 16.మానవులతో యుద్దంలో మరణం లేకుండుట, 17.అస్త్రాల వలన మరణం లేకుండుట, 18.శస్త్రాల వలన మరణం లేకుండుట, 19.యుద్దాలలో ఎవరూ ఎదురు నిలువలేని శౌర్యం, 20.లోకపాలకు లందరిని ఓడించుట, 21.ముల్లోకాలమైన విజయం" అని కోరుకున్నాడు, ఏమిటీ తలతిక్క వరం?ఇప్పటికీ కొంతమంది యెదటివాళ్ళని యేమి అడగాలో తెలియక తింగరి కోరికలు కోరినప్పుడు హిరణ్యాక్ష వరాలు అని అంటూనే ఉన్నారు కదూ!

          అక్కడికీ వీడి పైత్యకారితనానికి బ్రహ్మకే నవ్వు వచ్చి "అన్నా! కశ్యపపుత్ర! దుర్లభము లీ యర్థంబు లెవ్వారికిన్; మున్నెవ్వారలుఁ గోర రీ వరములన్; మోదించితిన్ నీ యెడన్.నన్నుం గోరిన వెల్ల నిచ్చితిఁ బ్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైకశీలుండవై." అని ఒక ఉబోస కూడా ఇచ్చాడు.అయినా వింటాడా?అసలు అంత హడావిడి చేసింది దేనికి?అన్ని కండిషన్లు పెట్టింది కుదురుగా ఇంట్లో కూర్చోడానికి కాదే - అలా కూర్చుంటే ఇప్పటికీ బతికి ఉండేవాడేమో పాపం!ఒకనాఁడు గంధర్వ యూధంబుఁ బరిమార్చు; దివిజుల నొకనాఁడు దెరలఁ దోలు; భుజగుల నొకనాఁడు భోగంబులకుఁ బాపు; గ్రహముల నొకనాఁడు గట్టివైచు; నొకనాఁడు యక్షుల నుగ్రత దండించు; నొకనాఁడు విహగుల నొడిసిపట్టు; నొకనాఁడు సిద్ధుల నోడించి బంధించు; మనుజుల నొకనాఁడు మద మడంచు;గడిమి నొకనాఁడు కిన్నర ఖచర సాధ్య చారణ ప్రేత భూత పిశాచ వన్య సత్త్వ విధ్యాధరాదుల సంహరించు దితితనూజుండు దుస్సహ తేజుఁ డగుచు రెచ్చిపోయాడు.ఆఖరికి శ్రీమహావిష్ణువు వీడు తన కొడుకుని అడిగిన వరాల లిస్టుని జల్లెడ పట్టేసి లూప్‌హోల్స్ అన్నీ దొరకబుచ్చుకుని చంపేశాడు!

          ఇదంతా హిట్లర్ కధలాగే కనిపిస్తున్నది నాకు!మొదట సమసమాజస్థాపన పేరుతో మొత్తం భూమినంతట్నీ చాపలా చుట్టేసి తన కుర్చీ కింద పెట్టేసుకుని తను ఏంచేస్తే అది ఘనకార్యమన్నట్టు పరిపాలించగలిగిన ఏకచ్చత్రాదిపత్యం కోసం కలలు కంటూ బాత్ సోషలిస్టు పార్టీలో చేరాడు.అది సరయిన పద్ధతిలో సాధించగలిగినది కాదని తెలిసొచ్చి మానవుల్ని ఆర్యులు, యూదులు అనే రెండు రకాల్ని చేసి యూదుల వల్లనే మీరు కష్టాలు పడుతున్నారని అబద్ధాలు చెప్పి తక్కినవాళ్ళని నమ్మించి ఆర్యుల తరపున యూదుల్ని చంపుతూ నియంతృత్వానికి దిగాడు - అలివిమాలిన యుద్ధానికి దిగి ఓడిపోతే యుద్ధనేరాల కింద కైమా కొట్టేస్తారనే నిజం అహాన్ని కుంగదీసి కుక్కచావు చచ్చాడు!పురాణకధ లోని రణ్యకశిపుడు కోరుకున్న అమరత్వం అనేది అలంకారికమైన వాస్తవంగా చూస్తే చారిత్రక వ్యక్తి ఐన హిట్లర్ కోరుకున్న సమస్త భూమండలానికీ ఏకరాట్ కావాలనే దురాశ!మహమ్మదీయ రాజ్యం, వర్గరహితసమాజం అనే భావనలలో ఉన్నది కూడా ఇదే లక్ష్యం.తమ నిర్వాకాలకి చెప్పుకునే సమర్ధనలతో సహా ఈ వర్గాల మధ్యన ఎన్నో పోలికలు ఉండటాన్ని గమనిస్తే వేదవ్యాసుడి శేముషీ వైభవం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చును.

          ఒక్క హిరణ్యకశిపుడే కాదు,దాదాపు పురాణకధల్లోని ఒక్కో రాక్షసుడూ ఒక్కో రకం తెలివి చూపించి ఒక్కో రకం అంతాన్ని కోరుకున్నారు.వృద్ధక్షత్రుడు గుర్తున్నాడా - జయధ్రధుడి తండ్రి!జయధ్రధుడు పుట్టినప్పుడు జ్యోతిష్కులు జయధ్రధుడు తల తెగి నేల మీద పడటం వల్ల మరణిస్తాడని చెప్పారు. అంతే!కొడుకు కోసం ఘోరమైన తపసు చేసి బ్రహ్మను మెప్పించి కొడుకు చిరంజీవి కావాలని కోరుకున్నాడు.బ్రహ్మ కుదరదనేసరికి సూటిగా తన కోడుకు మరణానికి ఎవడు కారణమైతే వాడు కూడా చచ్చిపోవాలని కోరుకుంటే సరిపొయ్యేదానికి "నా కొడుకు తల ఎవడి చేతుల్లోనుంచి నేలమీదకి పడుతుందో వాడి తల వెయ్యిముక్కలవ్వాలి!" అని కోరుకున్నాడు - ఫలితం, తనే చచ్చాడు.

          మగధ రాజైన గర్గ్యుడు ఒకసారి యాదవుల కులగురువుతో జరిగిన పండితచర్చలో ఓడిపోయాడు.అక్కడ తనకి ఘోరమైన వమానం జరిగిందని శివుడి కోసం 12 యేళ్ళు కఠోరమైన తపస్సు చేశాడు.శివుడు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే యాదవులు సమస్తం నాశనమై పోవాలని కోరుకున్నాడు.అది శివుడు కూదరదనేసరికి ఏ యాదవ వీరుడి చేతిలోనూ ఓడిపోని కొడుకుని ప్రసాదించమన్నాడు - ఆయన నవ్వుకుని ఇతని కోరిక నెరవేర్చాడు.తనకి జరిగింది జ్ఞాన సంబంధమైన ఓటమి అయినప్పుడు వాళ్లని ఓడించగలిగిన పాండిత్యం గల కొడుకుని కోరుకుంటే సరిపోయేది - పాండిత్యం వల్ల కలిగిన ఓటమికి రాజకీయపరమైన గెలుపుని పరిష్కారం అనుకున్నాడు!ఏమైతేనేం,ఈ వరం కారణాన గర్గ్యుడికి కాలయవనుడు పుట్టాడు - ఇది ఒక తలతిక్క వరం.

          వీళ్ళందరి గొడవ ద్వాపరయుగానికి సంబంధించినదయితే, కృతయుగానికి సంబంధించిన ముచికుందుడిది మరో రకం గొడవ!కుమారస్వామి సేనానిత్వంలోకి రాకముందు రాక్షసుల మీద జరిగిన యుద్ధాల్లో ఈ రాజు దేవతల సైన్యానికి నేతృత్వం వహించేవాడు.ఈయన కష్టం చూసి ఇంద్రుడు సంతోషించి వరం కోరుకోమన్నాడు.అప్పటికి నిరంతరాయమైన యుద్ధాలతో అలిసిపోయి ఉన్నాడు కాబోలు - వరం గిరం ఏం వొద్దు, వొదిలేస్తే భూమ్మీదకి పోయి పెళ్ళాం బిడ్డలతో కాలం గడుపుతానని అన్నాడు.ఇంకెక్కడి కుటుంబం, మీ కాలానికీ మా కాలానికీ ఉన్న తేడా వల్ల నువ్విక్కడ ఉన్న కాలంలో భూమ్మీద రెండు మూడు తరాలు గడిచిపోయాయి అని చెప్పేసరికి ముందరి అలసటకి ఇప్పటి నిరాశ తోడై బుర్ర పనిచెయ్యకనో ఏమో - ముందు కంటినిండా కునుకు తీస్తే చాలనుకుని తన నిద్రకి ఏమాత్రం భంగం కలగని ఏకాంత ప్రదేశాన్ని కోరుకుని తన నిద్రని ఎవడయినా భగ్నం చేస్తే వాడు అక్కడికక్కడే కాలి బూడిదై పోవాలని కోరుకున్నాడు.చక్కగా సర్వసంపద్విలసితమైన రాజ్యానికి రాజుని చెయ్యమని కోరుకుంటే ఆ వైభవంలో నిద్రాసుఖం ఉండదా?ఇది మరొక తలతిక్క వరం.

          సనాతన ధర్మం పదే పదే నొక్కి చెబుతున్నది యేమిటంటే మంచి, చెడు అనేవి స్థిరమైనవి కావు,సాపేక్షమైనవి - ఒకరికి మంచి అనిపించేది మరికరికి చెడు అనిపిస్తుంది,ఒక కాలంలో చెడు అయినది మరొక కాలంలో మంచి అవుతుంది.సృష్టికర్త విశ్వరచనలో పెట్టిన అతి ముఖ్యమైన నియమం యేమిటంటే ఒక కోరికని మనసా,వాచా,కర్మణా కోరుకుంటే ఆ బలమైన కోరిక తప్పక నెరవేరి తీరుతుంది!మనకి తలతిక్క వరాలు అనిపించాయి గానీ భగవాన్ శ్రీకృష్ణుదికి మాత్రం ఈ రెండూ తప్పక నెరవేర్చాల్సిన కోరికలు అనిపించాయి - బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టినట్టు అసలు సంబంధమే లేని ఈ రెండు కోరికలకీ ఒక చిత్రమైన లంకె పెట్టి నెరవేర్చాడు!

          కాలయవనుడు పెరిగి పెద్దవాడై శ్రీకృష్ణుడికి దుస్సహమైన శత్రువుగా మారాడు. శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి రానే వొచ్చాడు, కాలయవనుడి వరం వల్ల శ్రీకృష్ణుడు అతన్ని గెలవలేకపోతున్నాడు, చేసేది లేక శ్రీకృష్ణుడు యుద్ధరంగం నుంచి పారిపోతున్నాడు, కాలయవనుడు శ్రీకృష్ణుణ్ణి వెంటపడి తరుముతున్నాడు, శ్రీకృష్ణుడు ఒక గుహలోకి వెళ్ళాడు, కాలయవనుడు కూడా వెళ్ళాడు, అక్కడ శ్రీకృష్ణుడి బదులు ఒక వృద్ధుడు నిద్రపోతున్నాడు, శ్రీకృష్ణుడి దొంగవేషాల్లో ఇదీ ఒకటనుకుని కాలయవనుడు ఆ వృద్ధుణ్ణి కదిలించి నిద్ర లేపాడు - ఇంకేముంది, ఆ వృద్ధుడు నిద్ర లేచి కళ్ళు విప్పిన మరుక్షణం కాలయవనుడు కాలి బూడిదైపోయాడు.అలా ఒకదానికొకటి సంబంధం లేని గర్గ్యుడి తలతిక్క వరం ముచికుందుడి తలతిక్క వరం శ్రీకృష్ణుడి లీలావినోదం వల్ల ఒకదానినొకటి పరిపూర్తి చేసుకున్నాయి - కృష్ణం వందే జగద్గురుం!

          ధృవుడు, ప్రహ్లాదుడు, కర్దముడు, అంబరీషుడు - వాళ్ళు కేవలం తమ వృద్ధిని కోరుకున్నారు గనక తాము పొందిన వరాల వల్ల పూర్తి ప్రయోజనం పొందారు.హిరణ్యకశిపుడు, గర్గుడు తమ వరాల్ని తమ వృద్ధి కోసం కాకుండా ఇతరుల క్షయానికి వాడటం వల్లనే ఇతరులకి కోరుకున్నది తమ మీదకే వచ్చిపడి నాశనమై పోయారు.ఆ పురాణకధలు కల్పనలే అని తేలిగ్గా కొటిపారెయ్యొచ్చు, కానీ చుట్టూ చూస్తే ఇవ్వాళ్టికీ కొందరి జీవితాల్లో అవి వాస్తవరూపం దాల్చి కనబడుతున్నాయి - కొందరు తమకూ ఇతరులకీ వృద్ధిని కోరుకుంటూ ఉభయతారకమైన పద్ధతిలో బతుకుతున్నారు, కొందరు ఒక ప్రతికూలమైన అనుభవం ఎదురవగానే తత్వం గ్రహించి తమ తప్పుల్ని దిద్దుకుని క్రమవినాశనాన్ని తప్పించుకుంటున్నారు, కొందరు ఎన్నిసార్లు తలకి బొప్పెలు కట్టినా పట్టనట్టు మళ్ళీ మళ్ళీ చుప్పనాతి పనులు చేస్తూ ఏడుపుగొట్టు బతుకులు బతుకుతున్నారు.విచిత్రం యేమిటంటే, ఇవ్వాళ్టి ఈ ఆఖరి రకం వాళ్ళు కూడా దేవుణ్ణి తమలో చూడకుండా ఎక్కడో గుడికోనో, మరెక్కడో స్వర్గంలోనో ఉన్నానుకుని వాళు చేస్తున్న పనులు వాళ్ళు చెబితే తప్ప దేవుడికి తెలియవని అనుకుంటున్నారు - మళ్ళీ వీళ్ళు నాస్తికులు కూడా కాదు, దేవుడు ఉన్నాని నమ్ముతారు, కాని తమలోని దుర్మార్గపు ఆలోచనలు మాత్రం దేవుడికి తెలియవని అనుకుంటారు - అచ్చం హిరణ్యకశిపుడి లాగే!


వృద్ధిని కోరుకుంటే వృద్ధి,క్షయాన్ని కోరుకుంటే క్షయం - తధాస్తు!!!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...