Tuesday, 10 May 2016

ఓ రామ - నీ నామ మెంతో రుచి,ఎంతో రుచి రా!

                          సీ||మోటు నిషాదుడు మౌనివరుడు పోవు
                              మార్గాన క్రూరత్వ మావహించి

                              జోడుకూడిన జంట క్రౌంచములందు పో
                              తును కూల్చగా యాడుదాని బాధ

                              మనసును కదిలించి మరిమరి వేధించి
                              శాపమై.నిందయై - కావ్యధార

                              గంగయై పొంగి - లోకాన మరల నిట్టి
                              ఘాతుకమును చేయ కుండునట్టి

                         తే||సాధు సజ్జనులను పెంచు దీక్ష తోడ
                             గిరులు ఝరులు ఉండువరకు నిలిచిపోవు
                             రామకధను తీరిచి దిద్దినాడు మౌని,
                             సాహితీమూర్తు లందు శాశ్వతుడు గాగ!
(17.07.2015)
------------------------------------------------------------------------------------------------------------------------------
          రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు. 

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం
నారదం పరిపప్రచ్చ వాల్మీకి ర్ముని పుంగవం

స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః
ఋషిభిః పూజిత స్సమ్యగ్ యథేంద్రో విజయీ పురా

విశ్వామిత్ర స్స ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవ మబ్రవీత్

తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్యస నిశాంపతేః
శయనీయం నరేంద్రస్య త దాసాద్య వ్యతిష్ఠత

వనవాసం హి సంఖ్యాయవాసాంస్యా భరణాని చ
భర్తార మనుగఛ్చంత్యై సీతాయై శ్వశురో దదౌ

రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కూలవతాం కులం
రాజా మాతా పితా చైవ రాజ అహితకరో నృణాం

నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుం
ఉటజే రామ మాసీనం జటావల్కల ధారిణం

యది బుద్ధిః కృతా ద్రష్టు మగస్త్యం తం మహామునిం
అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః

భరత స్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమచ ప్రబో
మృగరూప మిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి

గఛ్ఛ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం
వయస్యం తం కురు క్షిప్రమితో గత్వాద్య రాఘవ

దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియాప్రియే
సుఖదుఃఖ సహః కాలే సుగ్రీవ వశగో భవ

వంద్యాస్తే తు తపస్సిద్ధాః తపసా వీతకల్మషాః
స్రష్టవ్యాశ్చాపి సీతాయాః ప్రవృత్తిం వినయాన్వితై

స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీం
నిక్రమేణ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః

ధన్యా దేవా స్స గంధర్వా స్సిద్ధాశ్చ పరమర్షయః
మమ పశ్యంత యే నాధం రామం రాజీవలోచనం

మంగళాభిముఖీ తస్య సా సదాసీ న్మహాకపీః

ఉపతస్థే విశాఅక్షీ ప్రయతా హవ్యవాహనం

హితం మహార్థం మృదుపూర్వ సంహితం
వ్యతీత కాలాయతి సంప్రతి క్షమం

నిశమ్య తద్వాక్య ముపస్థిత జ్వరః
ప్రసంగ హనుత్తరమే తద బ్రవీత్

ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తోయం విభీషణః
లంకైశ్వర్యం ధృవం శ్రీమానయం ప్రాప్నోత్యకంటకం

యో వజ్రపాతాని సన్నిపాతానన చుక్షుభే వాపి చచాల రాజా
స రామబాణాభిహతో భృశార్తశ్చచాల చాపం చ చముమో చ వీరః

యస్య విక్రమ మాసాద్య రాక్షసా నిధనం గతాః
తం మన్యే రాఘవం వీరం నారాయణ మనామయం

న తే దదృశిరే రామం దహంత మరివాహినీం
మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మనా

ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ
బద్ధాంజలి పుటా చేద మువాచాగ్ని సమీపతః

చలనా త్పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపితాః
చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరం

దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాఛ్ఛాదన భాజనం
సర్వమేవావిభక్తం నో భవిష్యతి హరీశ్వర

యామేవ రాత్రిం శతృఘ్నః పర్ణశాలాం సమావిశత్
తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా దారకద్వయం


ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీ బీజసంయుతం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే

          నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు రామాయణంలో ప్రక్షిప్తాలు ఉన్నాయనీ,వాటిని తొలగించితే గానీ వాల్మీకి రామాయణం శుద్ధంగా ఉండదనీ పండితులు చాలా చర్చలు చెయ్యడం జరిగిందని విన్నాను.అప్పట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు.తర్వాత నిజం అయినా అయ్యుండొచ్చు అనిపించింది.కొన్ని తరాల పాటు చెప్పుకుంటూ వస్తున్న కధలో ఎక్కడో అక్కడ ఎవరో ఒకరికి తన పాండిత్యం కూడా అందులో ప్రదర్శించుదామనే దౌర్బల్యం ఉన్నవాళ్ళు కలిపితే కలిపి ఉండవచ్చు అనుకున్నాను.కానీ,ఈ గాయత్రీ రామాయణం గురించి తెలిశాక మాత్రం అలా జరిగి ఉందటానికి వీల్లేదు కదా అనిపిస్తున్నది.ప్రక్షిప్తాలతో సహా అందరూ కలిపి 24,000 శ్లోకాలకి అమర్చిన తర్వాత ఈ వరస రావడం తర్కానికి అందనిది - వాల్మీకి ముందుగానే అనుకుని చేస్తే తప్ప మామూలుగా అయితే ఇలా కుదరడం అసంభవం!రామాయణంలో వాడిన చందస్సు అనుష్టుప్ చందస్సు, పాత్రల పేర్లలో ఉన్న మార్మికత చూస్తే అపురూపం, యోగశక్తి జ్ఞానచక్రాల గుండా ప్రయాణం చేసేటప్పుడు సాధకుడికి కలిగే అనుభూతుల్ని కధాకధనంలో కనిపించే మలుపుల్లో వర్ణించి చెప్పటం:శివధనుర్భంగం జరిగినప్పుడు వర్ణించినది సాధకుడి మనస్సులో తొలిసారి దైవసంస్పర్శ జరిగినప్పటి అంతర్లోకపు భీబత్సాన్నే - వీటిల్లో దేనిని మనం కాకతాళీయంగా రాశాడని చెప్పగలం?ఇదీ అంతే,నిన్న గాక మొన్న చదివినవి ఇవ్వాళ్టికి మర్చిపోయేవాళ్ళు ఇంతకాలం గుర్తుంచుకునే విధంగా ఒక కధని చెప్పినవాడు మహామేధావి!అట్లాంటివాడి కవిత్వంలో తప్పులు వెదకటం,తన పైత్యం కొంత చేర్చటం కుదిరే పని కాదు!

          మంత్రాలలో గాయత్రీ మంత్రం శ్రేష్ఠమైనది అయితే ఆ గాయత్రిని ఇముడ్చుకున్న రామాయణం కూడా శ్రేష్ఠమైనదే అవుతుంది.సనాతన ధర్మంలో నిర్లక్ష్యం చెయ్యకూడని అవమానించకూడని అత్యంత మౌలికమైనవి మూడు - విశ్వామిత్ర గాయత్రి, ఈశావాస్యోపనిషత్తు ప్రధమ శ్లోకం, శ్రీ చక్ర యంత్రం!భరద్వాజ గాయత్రి,వశిష్ఠ గాయత్రి దాదాపు గాయత్రి,గణేశ గాయత్రీ మంత్రాలు అన్నీ ఒకే నిర్మాణం కలిగి ఉంటాయి.కానీ విశ్వామితుడు ప్రవచించిన సవితృ గాయత్రిలో భావం గొప్పది.వెలుగుని ఆహ్వానించటం!అంతటా నిండిపోవాలనుకోవటం!అందరికీ కోరుకోవటం - అందుకే గాధేయుడు విశ్వామిత్రు డయ్యాడు!!పశ్చిమ దేశాల వారు భౌతికమైన వాస్తవికతని గుర్తించి ప్రగతిశీలంగా ఉంటే మనవారు ఆధ్యాత్మికత పేరుతో సమాజాన్ని వెనక్కి నడిపిస్తున్నారని మేకాలే సృష్టించిన కొందరు రెటమతం చూపిస్తున్నారు గానీ వాస్తవికతని మన ప్రాచీనులు ఎప్పుడూ మరిచిపోలేదు.అలా మరిచిపోయి ఉంటే ఇలా మిగిలి ఉండేది కాదు.

          రామాయణం మొత్తం ఒక ఎత్తు సుందరకాండ ఒక ఎత్తు!మిగతా కాండల్లో ప్రత్యక్షంగా కనబడే రాముడు ఈ కాండలో పరోక్షంగా కనబడతాడు.మిగతా రామాయణ కధకి రాముడు నాయకుడైతే సుందరకాండలో జరిగే కధకి వాగ్విదాంవరుడైన కపిశ్రష్ఠుడు హనుమంతుడు అనుచర స్థానం నుంచి నాయకుడై యెదిగి తన విశ్వరూపం చూపిస్తాడు.ఇక్కడి విజృంభణ అంతా ఇంత గొప్పగా చూపించినవాడు రాముణ్ణి కలవగానే మళ్ళీ అనుచర శ్రేష్ఠుడిగా ఒదిగిపోతాడు!జగత్సుందరియైన సీతకీ పుంసాం మోహనరూపుడైన రాముడికీ ఆనందం కలిగించటం కొసం కపిసుందరుదైన హనుమంతుడు ఒక దుష్కర కార్యాన్ని నెత్తిమీద వేసుకుని అపజయం అంచుల వరకూ వెళ్ళి నిరాశపడి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి మళ్ళీ కూడదీసుకుని తనకి తనే జీవితాశని రగిలించుకుని రెట్టించిన పట్టుదలతో అదృష్టం కూడా తోడై కార్యసాఫల్యత వైపుకి ప్రయాణించిన దృశ్యాలని వాల్మీకి భూతద్దంలో పెట్టి చూపించి వర్ణించాడు.మాటిమాటికీ చావుని గురించి కొటేషన్లు రాసుకుని పులకించిపోతూ నాకు ఉరితాళ్ళు కావాలి,నన్ను చంపండి,నన్ను చంపండి అని అఘోరించేవాళ్ళు ఇలాంటివి చదవనే చదవరు గానీ సుందరకాండలో తొమ్మిది అతి ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి.ఛందస్సు రీత్యా వాటిని శ్లోకాలు అని వూరుకోవచ్చును గానీ వాటిలోని భావం కూడా గొప్పదే గనక మంత్రాలే అవుతాయి.శ్రీ రామాయణ మహామాలా నవరత్న మంత్రావళి అని పిలిచే తొమ్మిది శ్లోకాల్నీ అర్ధం తెలుసుకుని ప్రతి రోజూ జపిస్తూ ఉంటే ఒక సంవత్సరం తర్వాత అంతకు ముందరి జీవితానికీ అప్పటి జీవితానికీ తేడా మీకే తెలుస్తుంది.

శ్లోకం:-తతో రావణ నీతాయా సీతాయాః శత్రుకర్షణః
       ఇయేవ పదమన్వేష్టుం చారణా చరితే పధిః
భావం:-రావణునిచే అపహరించబడిన సీతను వెదకటానికి శత్రుకర్షణుడైన హనుమంతుడు చారణులు సంచరించే ఆకాశమార్గాన్ని యెన్నుకున్నాడు.
సారం:-ఈ శ్లోకం గాయత్రీ మంత్రంలోని 12వ అక్షరంతో సంవదిస్తుంది.గాయత్రీ మంత్రంలో ప్రశంసించబడిన దైవం సూర్య భగవానుడు.సూర్యుడు ఆకాశానికి అధిపతి.సూర్యదేవుని అనుగ్రహ ప్రాప్తికి నిర్దేశించబడిన రత్నం మాణిక్యం.మాణిక్యం రామావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యధాతవ
       ధృతి ర్దృష్టి ర్మతి ర్ధాక్ష్యం స్వకర్మసు నసీదతి
భావం:-ఓ వానరేంద్రా!నీకు విజయం సాధించటానికి తోడ్పడే నాలుగు ప్రధాన లక్షణాలు - జ్ఞాపకశక్తి,మేధస్సు,పట్టుదల,నేర్పు ఉన్నాయి.అందుచేత నీవు తప్పక విజయం సాధిస్తావు.
సారం:-ఈ మంత్రంలో నిక్షిప్తమైన విజయ రహస్యం మనస్సుకు సంబంధించినది.మనస్సును ప్రభావితం చేసే గ్రహం చంద్రుడు.చంద్రునికి ప్రీతిపాత్రమైన రత్నం ముత్యం.ముత్యం కృష్ణావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖం
       అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తకః
భావం:-ఐశ్వర్యానికి మూలం ఉత్సాహం.అదే అపరిమితానందానికి హేతువు.నిజానికి అన్ని యత్నాలకూ చోదకశక్తి ఇదే.విజయరహస్యం కూడా ఇదే.
సారం:-ఈ మంత్రం హనుమంతునిలోని ఆశావాదాన్ని వివరిస్తుంది.ఋణం,ఒత్తిడి మొదలైన మానసిక వ్యధలకు అంగారక గ్రహమే కారణం.అంగారకుడు శుభకరుడైతే అన్నిరకాల వ్యధల నుండి దూరం చేసి సర్వశుభాల నిస్తాడు.అంగారకునికి ప్రీతిపాత్రమీన్ రత్నం పగడం.పగడం నృసింహావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ జనకాత్మజాయై
       నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
భావం:-రామ లక్ష్మణులకు నమస్కారం.దేవి జనకాత్మజకు నమస్కారం.ఉద్ర,ఇంద్ర,యమ,వాయు,చంద్ర,సూర్య మరుద్గణాలకు నమస్కారం
సారం:-ఈ ప్రార్ధన చేసిన మరునిముషంలోనే హనుమంతుడు అశోకవనంపై దృష్టి సారించడం జరిగింది.అందువల్లనే దీనిని పండితులు కార్యసాఫల్యమంత్రంగా గుర్తించారు.మనస్సుబు సరైన సమయంలో సరైన మార్గంలో నడిపించటానికి నిర్దిష్టమైన గ్రహం బుధుడు.బుధుడు శుభకరుడైతే సునిశిత భావాలు అవసర సమయంలో స్ఫురిస్తాయి.బుధునికి ప్రీతిపాత్రమైన రత్నం పచ్చ.పచ్చ బుద్ధావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-ప్రియాన్న సంభవేత్ దుఃఖం అప్రియాత్ అధికం భయం
       తాభ్యాం హి వియుజ్యంతే నమస్తేషాం మహాత్మానం
భావం:-మనకు కలిగే దుఃఖాలన్నింటికీ మూలకారణం - వస్తువులతో గానీ,వ్యక్తులతో గానీ,విషయాలతో గానీ మనకు గల అనుబంధాల నుండి ఎక్కడ వియోగం కలుగుతుందోనని భయపడటం.అలాంతి భయాలకూ,దుఃఖాలకూ అతీతులైన మహాత్ము లందరికీ నేను నమస్కరిస్తున్నాను.
సారం:-ఈ మంత్రం సీతాదేవి మనకు చేస్తున్న జ్ఞానోపదేశం వంతిది.వేదాంత విషయాలకు సంబంధించిన గ్రహం గురుడు.గురునికి ప్రీతిపాత్రమైన రత్నం పుష్యరాగం.పుష్యరాగం వామనావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-రామః కమల పత్రాక్షః సర్వ సత్వ మనోహరః
       రూప దాక్షిణ్య ప్రసూతో జనకాత్మజే
భావం:-ఓ జనకాత్మజా!రాముని నేత్రాలు మిక్క్లి అందమైనవి.తామర పూరేకుల వంటివి.ఏ వ్యక్తి అయ్నా,ఎ ప్రాణి అయినా మోహ పరవశుడయ్యే అద్భుత సౌందర్యవంతు డాయన.విశిష్ట లక్షణాలతో,ఉత్తమ గుణాలతో ఆయన జన్మించాడు.
సారం:-ఈ శ్లోకంలో హనుమంతుడు రాముని వ్యక్తిత్వాన్ని వర్ణించడంలో చూపించిన నిజాయితీని గమనించిన తర్వాతనే సీతాదేవికి ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగింది.అందువల్లనే పండితులు దీనిని సుందరకాండ కంతటికీ ప్రకాశవంతమైన సన్నివేశంగా తీర్మానించి ఈ శ్లోకాన్ని వజ్రంతో సంవందించారు.శుక్రునికి ప్రీతిపాత్రమైన రత్నం వజ్రం.వజ్రం పరశురామావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-జయత్పతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః
       దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః
భావం:-మహాశక్తిశాలి అయిన రాముడికి జయం.మహావీరుడైన లక్ష్మణునికి జయం.ఎవరి చేతలు సకల జనులకూ శుభాలు కలగజేస్తాయో అట్టి కోసల దేశానికి రాజయిన రాముడికి నేను దాసుణ్ణి.
సారం:-ఈ శ్లోకంలోని జయజయ ధ్వానాలు లంకానగరవాసులకు హెచ్చరిక వంటివి.అప్పటివరకు సీతాదేవి పైన తన దుష్ప్రభావాన్ని చూపించిన సని ఆమెను వదలి రావణుని పీడించటం మొదలైంది.ఈ మంత్రంతో శనీశ్వరుడు సీతారాములకు శుభకరుడుగా మారాడు.శనీశ్వరునికి ప్రీతిపాత్రమైన రత్నం నీలం.నీలం కూర్మావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం మమ
       యది రాస్త్యైక పత్నీత్వం శీతోభవ హనూమతః
భావం:-ఓ అగ్నిదేవా!నేనే గనుక నాభర్త పట్ల అనుకూలవతి నైతే,నేనే గనుక విధి ననుసరించి వివాహమైన భార్యనే అయితే హనుమంతుడికి ఏ బాధా కలిగించవద్దు.
సారం:-జానకీదేవి ప్రార్ధనాపూర్వకంగా స్మరించిన ఈ మంత్రప్రభావం వల్లనే హనుమంతుడికి అగ్నితాపం దరిచేరలేదు.కాలిన గాయాలు,కుష్ఠు మదలైన వాటినుండి ఉపశమనం కొరకు జ్యోతిష్కులు రాహుజపాన్ని సూచిస్తారు.రాహువుకు ప్రీతిపాత్రమైన రత్నం గోమేధికం.గోమేధికం వరాహావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-నివృత్త వనవాసంచ త్యయాసార్ధ మరిందమం
     అభిషిక్త మయోధ్యాయాం క్షిపుంద్రక్షసి రాఘవం
భావం:-ఓ పూజ్యమాతా!నీ భర్త అసమాన వీరుడు.శత్రువులను సంహరించగలడు.అతడు విజయాన్ని సాధిస్తాడు.నీవు తిరిగి ఆయనను కలుసుకొనగలవు.మీరు మీ రాజ్యానికి వెళ్ళి అయోధ్యా సింహాసనాన్ని అధిష్ఠిస్తారు.
సారం:-ఈ మంత్రం సీతాదేవి హృదయానికి మిక్కిలి ఆనందం కలిగించింది.దీనినే మరల రాముని ఎదట చెప్పినప్పుడు ఆయనకూ అంతటి ఆనందాన్ని కలిగించింది.భవిష్యత్తులో జరగబోయే శ్రీరామ పట్టాభిషేకాన్ని హనుమంతుదు తన మనస్సులో ముందుగానే జరుపుకున్నాడు.కారాగార వాసం,బంధనం మొదలైన వాటినుండి విముక్తి కొరకు జ్యోతిష్కులు కేతుజపాన్ని సూచిస్తారు.కేతువుకు ప్రీతిపాత్రమైన రత్నం వైడూర్యం.వైడూర్యం మత్స్యావతార సూచకమైన రత్నం.

          వీటిలోని విశేషం ఏమిటంటే ప్రతి శ్లోకమూ నవగ్రహాలలో ఒక గ్రహానికి,నవరత్నాలలోని ఒక రత్నానికి అనుసంధానించబడి ఉంటుంది.దశావతారాలలో ఇంకా రాని కల్క్యావతారాన్ని వదిలేసిన వాటిలో ఒక అవతారంతో కూడా ఆ శ్లోకాలకి సంబంధం ఏర్పరచారు పండితులు - అందులో మాయా, మోసం ఏమీ లేవు.వాటన్నిటికీ ఉన్న సారూప్యతలని బట్టే ఆ సంబంధాన్ని కల్పించారు.కాబట్టి వీటిని ప్రతిరోజూ జపిస్తే నవగ్రహ పూజా,దశావతార స్మరణా కూడా చేసినట్టే!అయితే,ప్రతి శ్లోకానికీ భావం కూడా గొప్పదే,బ్రతుకు మీద ఆశని పుట్టించే మంచిమాటలు ఇవన్నీ!ఉదాహరణకి విజయానికి అవసరమయిన నాలుగు లక్షణాలూ నీకు ఉన్నాయి కనక విజయం సాధిస్తావు అని లక్షణాల లిస్టు చెప్పి హనుమంతుణ్ణి పొగొడుతున్నప్పుడు కవి ఈ లక్షణాలు మీలో ఉంటే మీరూ విజయం సాధిస్తారు అని చెప్తున్నాడు.సీత ద్వారా వాల్మీకి ఏమి చెప్పాడో దాని విస్తృత రూపమే గౌతమ బుద్ధుడి ద్వారా ప్రచారంలోకి వచ్చిన బౌద్ధమత సారం!వీటిని నేను చాలాకలం నుంచి జపిస్తున్నాను.ఫలితం కనబడుతున్నది.అందుకే ఇక్కడ భావంతో సహా ఉంచాను.నిత్యానుష్ఠానంలో వీటిని చేర్చుకుంటే ఫలితం తప్పకుండా మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది!

          సుందరకాండలో ఉన్న అద్భుతం ఇదైతే,తర్వాత వచ్చే యుద్ధకాండలో ఆదిత్యహృదయం అనే మరొక అద్భుతం ఉంది!కొందరికి ఇవన్నీ చాద్స్తంగా అనిపించవచ్చు,ఇన్ని మంత్రాలు,ఇన్ని చోట్ల ఇంత గట్టిగా నొక్కి చెప్పటం అవసరమా అని,తప్పు లేదు!దేహం దృఢంగా ఉంచుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి.జిం నిర్వాహకులు వెళ్ళిన ప్రతివాడికీ ఒకే ఓక్ డంబెల్సో,ఒకే ఒక బుల్వర్కరో ఇచ్చి సరిపెట్టెయ్యటం లేదు గదా!వెళ్ళిన వాళ్ళు కూడా మొక్కుబడిగా ఏదో ఒకటి ట్రై చేసి వచ్చెయ్యటం లేదు - ఓ నాలుగో అయిదో రకాలు వాడుతున్నారు.ఇదీ అంతే,ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండాలన్నా నేను దృఢంగా ఉండాలి అనే సంకల్పం ఒక్కటే సరిపోదు - ప్రాక్టీసు చెయ్యాలి!లేప్పోతే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది, యావంటావ్ సెగట్రీ?

ఆదిత్య హృదయం


తతఓ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతే దృష్ట్వ అయుద్దాయ సముపస్థితం

దైవతశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణం
ఉపాగమ్య బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషిః

రామ రామ మహాబాహో శ్రుభు గుహ్యం సనాతనం
యేన సర్వా నరీన్ వత్సః సమరే విజయిష్యసి

ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శతృ వినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం

సర్వ మంగళ మంగళ్యం సర్వపాప పణాశనం
చింతాశోక ప్రశమన మాయుర్వధన ముత్తమం

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

ఏష బ్రహ్మాచ్ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్యోమో హ్యపాం పతిః

పితరో వసవ స్సాధ్యాః హ్యశ్విన్యౌ మరుతో మమః
వాయు ర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః

ఆదిత్య స్సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణ సదృశో భాను ర్హిరణ్యరేతా దివాకరః

సూర్యారాధన ప్రారంభం

హరిదశ్వ స్సహస్రార్చి స్సప్త స్సప్తి మరీచిమాన్
తిమిరోర్మధన శ్శంభు స్త్వష్టా మార్తాండ అంశుమాన్

హిరణ్యగర్భ శ్శిశిర స్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భో అదీతే పుత్ర శ్శంఖ శ్శిశిర నాశనః

వ్యొమనాధ స్తమోభేదీ ఋగ్యజుస్సామ పారగః
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీధీ ప్లవంగమః

అతపీమండలీ మృత్యుః పింగళ స్సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తస్సర్వ భవోద్భవః

నక్షత్ర గ్రహతారాణా మధిపో విశ్వభావనః
తేజసామపితేజస్వీ ద్వాదశాత్మ న్నమోస్తుతే

నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దివాధిపతయే నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః
నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః

నమ ఉగ్రాయ వీరాయ పాండురాయ నమోనమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమోనమః

బ్రహ్మేశానచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నా యామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమ స్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే

నాసయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరివిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః

సూర్యారాధన సమాప్తం

ఏవ మాపత్సు కృచ్చేషు  కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నో వసీదతి రాఘవ

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పితం
ఏత త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవ ముక్త్వా తధాగస్త్యో జగామచ యధాగతం

ఏతఛ్చృత్వా మహాతేజా నష్టశోకో భవత్తధా
ధారయమాన్ సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్ష మవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్నేన మహతాం వధే తస్య ధృతో భవత్

అధ రవిరవద న్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహ్ర్ష్యమాణ!హ్
నిసిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్య గతో వచస్త్వరేతి

          సూర్యారాధన ప్రారంభం,సూర్యారాధన సమాప్తం అనేవాటికి మధ్యలో ఉన్న పధ్నాలుగు శ్లోకాలూ మూడుసార్లు చదవాలి.ఇది పని చేస్తుందా లేదా అనే సందేహం అక్కర్లేదు,నాకు పని చేస్తున్నది.ఇదివరలో బ్లాగుల్లో హిందూమతం మీద జరుగుతున్న చర్చల్లో అంత దూకుడుగా వెళ్ళేవాణ్ణి కాదు.సరదాగా కప్లెట్ కామెంట్లతో సరిపుచ్చేవాణ్ణి,అన్యాపదేశంగా జోకులు వెయ్యటంతో సరిపెట్టేవాణ్ణి,విసుగుపుట్టి మధ్యలో ఆపేసేవాణ్ణి!గట్టిగా నిలబడి వాదించినవి చాలా తక్కువ!కానీ ఇప్పుడిప్పుడు గట్టిగా నిలబడుతున్నాను, ఎక్కడ నిలబడినా నేనే గెలుస్తున్నాను, అది ఆదిత్యహృదయం నిత్యానుష్ఠానంలో చేర్చిన తర్వాతనే జరుగుతున్నది.వ్యక్తిగత జీవితంలో కూడా విజయాల శాతం పెరిగింది.ఇక్కడ వ్యక్తిగత జీవితంలో విజయం ఎంతశాతం అవసరం అనే దాని గురించి ఒక మాట!అప్పు అనేది లేకుండా,చెయ్యకుండా,చెయ్యాల్సిన అవస్రం లేకుండా బతకగలిగితే చాలు.బడుగు జీవులైనా,మధ్యతరగతి జీవులైనా,కోట్లకి పడగేత్తిన వాళ్లయినా సరే - శ్రీరస్తు,శుభమస్తు,ఐశ్వర్యమస్తు!

          వాల్మీకి ద్వారా మనకి తెలిసిన రామాయణం అనే ఒక కధ గురించి ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా "మరల నిదేల రామాయణంబనగ..." అన్నట్టు ఇంకా చెప్పటానికి ఎంతో మిగిలి వుందనిపిస్తుంది!కవిత్వం,నాటకం,యక్షగాం,హరికధ,బుర్రకధ,సినిమా,టెలివిజన్ - అన్నిరకాల కళారూపాలూ శ్రీరామకధను స్పర్శించి పరు గడించి పులకించాయి.రామాయణాన్ని తిట్టినా పేరొస్తుందనేదానికి అప్పటివరకూ స్వీట్ హోం లాంటి సంసారపక్షపు నవల్లు రాసుకునే ఒక అనామక రచయిత్రి రామాయణ విషవృక్షంతో ఒక్కసారిగా అంత పేరు తెచ్చుకోవడమే నిదర్శనం:-(

ఈ వాట్సప్ సింగిల్ పేరాగ్రాఫ్ రామాయణం కూడా అలాంటిదే:
Student:Please tell us something about raaamaayanam in the simplest way!
Teacher:It is said that the Raamaayanam is happening in your body.Your soul is Rama,Your mind is Seeta,Your breath or lefe-force is hanumaan,Your awareness is lakshmana and Your ego is Raavana. When Seeta(Mind) was stolen by Raavana(Ego), then Raama(Soul) got restless. Now the soul(Raama) cannot reach the mind(Seeta) on its own, It has to take the help of the praana(Hanumaan).When the mind(Seeta) got reunited with the soul(Raama) and the ego(Raavana) vanished - everything goes healthy to the Body!This is the real significance of the story of raama.

          ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే రామాయణానికి ఉన్న సార్వజనీనతని నాస్తికులూ కమ్యునిష్టులకి కూడా వర్తించేటంత basic levelకి కుదించి చెప్పటం!నువ్వు నాస్తికుడివైనా,కమ్యునిష్టువైనా - ఒక లక్ష్యం పెట్టుకుని నిజాయితీగా దాన్ని సాధించటానికి పోరాడుతుంటే నీ మనస్సులో ఈ రామాయణం జరిగి తీరాల్సిందే!నువ్వు రామద్వేషివైనా సరే అబద్ధాలూ,పులుముడులూ లేకుండా నువ్వు గనక సత్యానికి కట్టుబడితే నీ జీవితప్రయాణం కూడా రామాయణమే అవుతుంది.

రామాయణం నచ్చినవాళ్ళు చచ్చినా చావనట్టే!
రామాయణం నచ్చనివాళ్ళు పుట్టినా పుట్టనట్టే!
జై శ్రీరాం!

Thursday, 5 May 2016

సంప్రదాయబద్ధంగా కనబడే నిత్యా మీనన్ సంప్రదాయం మీద విసురుతున్న సవాళ్ళు?!

     నేను పాతివ్రత్యం,ఏకపత్నీవ్రతం అనే కాన్సెప్టుల్ని గుడ్డిగా నమ్మను!ప్రాక్టికల్ ఆలోచనా ధోరణి ఉన్నవాళ్ళు ఎవరయినా సరే - నూటికి నూరుపాళ్ళు పాతివ్రత్యం ప్రదర్శించే ఆడదీ,నూటికి నూరుపాళ్ళు ఏకపత్నీవ్రతం పాటించే మగాడూ వాస్తవంగా ఉండరని ఒప్పుకోవాలి."నీతి కట్టె లాంటిది,కోర్కె మంట లాంటిది - అందుకే రాజరాజు కొంపకి నిప్పంటుకుంది!" అన్నాడు కవిత్వంతో అమృతం కురిపించిన కవి బాలగంగాధర తిలక్,నూటికి నూరుపాళ్ళు నిజమే!

     "గంగ నిజాంగ దీప్తులెగయంగ" వచ్చి సుతీక్ష్ణుడి వొళ్ళో కూచుని మోహం చూపించడం అనే దృశ్యాన్ని మనకి చూపించేటప్పుడు సంస్కృతంలో వ్యాసుడు గానీ తెనిగించిన కవిత్రయపు కవి గానీ కంగారు పడలేదు,ఎందుకని?అష్టవసువుల శాపవిమోచనం అనేది అర్ధవంతమైన కారణమే కావచ్చు,కానీ నిజాంగదీప్తులతో వచ్చి మోహం ప్రదర్శించింది అని రాస్తున్నప్పుడు,"ఛా!కల్మషహారిణి చేత వ్యామోహపు భాష మాట్లాడించటమా?" అని ఇద్దరిలో ఎవరూ సందేహపడలేదు - వింతగా లేదూ!

     పంచమహాపతివ్రతల్లో ఒకరిగా నిలబెట్టాలని పవిత్రతకి మారుపేరుగా చూపించాలనుకున్న తన కధానాయిక సీత యొక్క అంగాంగ సౌందర్యాన్ని వర్ణిస్తున్నప్పుడు వాల్మీకి ఎందుకు సిగ్గుపడలేదు?కాళిదాసు కూడా శ్యామలాదండకంలో శ్రీమాతని నఖశిఖపర్యంతం అణువణువునీ వర్ణించుతూ "హేమకుంభోపమోత్తుంగ వక్షోజ భరావనమ్రే","లసద్వృత్త గంభీర నాభీ సరిత్తీర..." లాంటి పదాలతో ఎందుకు అంత భీబత్సంగా విజృంభించాడు?

     మహామేధావి అంబేద్కర్ గారు ఒకేఒక పొరపాటు పని చేశాడు,ఆ ఒక్కపనీ చెయ్యకుండా ఉంటే ఎంత బాగుండేది!"రిడ్డిల్స్ ఆఫ్ రామ" అనే పుస్తకం రాశాడు.అందులో రాముడు అక్రమసంతానం అని నిరూపించాలని ఎంతో శ్రమించాడు - ప్రమాదో ధీమతామపి అని ఇన్నాళ్ళూ దీన్ని గురించి ప్రస్తావించకూడదనుకున్నాను,కానీ ఇప్పుడు తప్పటం లేదు.మహాభారతంలో పాండవుల జననమూ రాముడి జననం లాంటిదే.పాండురాజుకి సంతాన యోగ్యత లేదు,కానీ సంతానం కావాలి!వరాలూ,దేవతలూ,సద్యోగర్భాలూ అందమైన కల్పనలుగా తీసుకుంటే పాండురాజు అనుమతితో వేరెవరితోనో సంతానాన్ని కన్నది.అనుమతి అనగానే పురుషుడు అధికుడు గాబట్టే అనుమతి తీసుకున్నాది అని అర్ధం పీకితే ఒక దణ్ణం పెట్టి వూరుకోవడం తప్ప నేను చెయ్యగలిగినది లేదు. సంప్రదాయ ప్రకారం వివాహం యొక్క ముఖ్యమైన ఉద్దేశం సంతానం.ఆ అసంతానలేమిని పోగొట్టుకోవడానికి ఇవ్వాళ్తి వాళ్ళు సంతాన సాఫల్యతా కేంద్రాల చుట్టూ తిరుగుతూ లక్షలకి లక్షలు తగలెయ్యడం దగ్గిర్నుంచీ సర్రోగేట్ మదర్సుని వెతుక్కోవడం వరకూ పడరాని పాట్లు పడుతున్నట్టే వాళ్ళు కూడా కొన్ని ఎడ్జస్టుమెంట్లు చేసుకున్నారు. మాంసం తింటున్నామని ఎముకలు మెదలో వేసుకు తిరగనట్టే సాహిత్యరూపం కాబట్టి కొన్ని కల్పనల్ని చేశారు.ఇవ్వాళ వేరే విధంగా పిల్లల్ని కన్నవాళ్ళు మేము ఫలానా సర్రోగేట్ మదర్ని వాడుకుని పిల్లల్ని కన్నాం అని డప్పు వేసుకోవటం లేదు,అవునా?ఇదంతా స్త్రీకి గర్భధారణ మీద ఉన్న అధికారానికి గౌరవం ఇవ్వటమే కదా!ఎవరితో కన్నా వాళ్ళు కౌంతేయులు అయ్యారు,పాండురాజ నందనులు అయ్యారు.ఇక్కడే బ్లాగుల్లో మరొకచోట ఒకాయన క్షేతర బీజ ప్రాధాన్యం అనే మాట వాడగానే బూతులకి కూడా లంకించుకున్నారు - హైందవద్వేషం వాళ్ళలో మినిమం సంస్కారాన్ని కూడా పోగొట్టేసింది కాబోలు!ధర్మ,అర్ధ,కామ,మోక్షములకు సంబంధిన యే కార్యాన్ని అయినా నా భాగస్వామితోనే చేస్తాను అనేది వివాహంలో స్త్రీ పురుషులిద్దరూ చెయ్యాల్సిన ప్రమాణం.అది వివాహ జీవితంలో ఉండాల్సిన పవిత్రతకి సంబంధించిన ముఖ్యమైన సూత్రం.ఎవరు తప్పినా తప్పే!సడలింపు కావాలంటే రెండవ భాగస్వామి అనుమతి తప్పనిసరి!సంతానానికి క్షేత్రమే ప్రధానం అంటే తల్లికే ప్రాధాన్యత ఇచ్చారు!పిల్లలు లేనివాళ్ళు పిలల్ల కోసం పదే తాపత్రయాన్ని మనచుట్టూ చూస్తూ కూడా అలాంటి సన్నివేశాల చుట్టూ ద్వేషపాండిత్యాన్ని ప్రదర్శించటం నిజంగా క్రూరత్వమే!"పాతివ్రత్యం గురించి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళకు,ఇద్దరు ముగ్గురితో సంబంధం కలిగి ఉండేవాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ సాంప్రదాయబద్ధంగా పెరిగినవాళ్ళకు అదో ఘోరమైన నేరం!"మూడు పెళ్ళిళ్ళు చెసుకుని గాంధీ అనే పెట్టమారి మొగుడితో పాలేరు పని చేయించుకున్న రంగికి సీత యొక్క పాతివ్రత్యం అర్ధం కాలేదంటే ఆశ్చర్యం లేదు,కానీ అంబేద్కర్ గారు కూడా ఇలా బొక్కబోర్లా పడ్డాడంటే ఇబ్బందిగా అనిపిస్తున్నది.


     రామాయణంలో వాల్మీకి సీతని అలా వర్ణించడానికి చాలా లెక్క ఉంది."మాలిని 22" సినిమాలో నిత్యా మీనన్ బదులు పీటీ ఉష లాంటి ఫిగర్ని పెట్టి ఉంటే రాంగు క్యాస్టింగు కింద డైరెక్తర్ ముక్కచివాట్లు తిని ఉండేవాడు! విలన్ అన్నిసార్లు రేప్ చెయ్యడు,చేసినా మనకి విలన్ మీద జాలివేస్తూ క్యామెడీ సినిమా అయి ఉండేది:-)సినిమా అట్టర్ ఫ్లాపు అయ్యి ఉండేది.రామాయణంలో సీత అందం కూడా అంతే."సీతే జగత్సుందరీ!" అని వూరికే చెప్పి వూరుకోలేదు.రాముడు శివధనుస్సు విరవటానికి ముందు సీతకోసం చాలా యుద్ధాలు జరిగినాయి!మీరు సినిమాల్లో చూసినట్టు ఒక హాలూ,జరీ బుటేదారీ అల్లికల డ్రస్సుల్లో రాజులూ కనక సింహాసనాలూ లాంటి హడావిడితో అంతా ఒకే సీనులో జరిగిపోలేదు సీతా స్వయంవరం!శివధనుస్సుని ఒక బహిరంగ స్థలంలో పెట్టి చాటింపు వేశాడు.ఎవరయినా ఎప్పుదయినా వచ్చి అ చాలెంజిని టేకప్ చెయ్యవచ్చు.అది ఎత్తలేకపోతేనేం సీత లాంటి అందగత్తెని వదులుకుంటామా అని విదేహ మీదకి సైన్యసమేతంగా యుద్ధాలకే వచ్చారు.దణ్ణం పెట్టి తప్పుకోవాలనిపించే చప్పచప్పటి అందం కాదు సీతది,మగాళ్లని పిచ్చెక్కించే అందమే!సీత అట్లా లేకపోతే రావణాసురుడు అంతగా పిచ్చెక్కిపోడు గదా!

     కధ చదివిన మగ పాఠకుల మీదకి వాల్మీకి ఒక చాలెంజిని విసురుతున్నాడు!ఫర్ సప్పోజ్,మిల్కీ వైట్ తమన్నా రేపో మాపో పెళ్ళి చేసుకోబోతున్నదట!పెళ్ళి చేసుకున్న సంవత్సరంలోనే భర్త వ్యాపారంలో ఆస్తినంతా పోగొట్టుకుని ఒక మధ్యతరగతి ఇల్లాలిగా మీ ఇంటిపక్కనే కాపరం పెట్టిందనుకోండి.సంవత్సరం లోపే ముసలిదైపోదు,అదే అందం.మీరు బాగా డబ్బున్నవాళ్ళు - అనుకోండి!మీరేం చేస్తారు?నిన్నటి దాకా బట్టలిప్పి చూపించింది గాబట్టి తప్పు లేదనుకుని ఆ బుక్కా పకీరు వెధవతో ఏం సుఖపడతావు నా దగ్గిరకి రా  అని ప్రపోజ్ చేస్తారా? ఆమె ఒప్పుకోకపోయినా కిడ్నాప్ చేసి మీ కోరిక తీర్చుకుంటారా!వాల్మీకి సీతని అలా వర్ణించటం వెనక ఉన్న లెక్క ది.అందులో తిక్క ఎంతమాత్రమూ లేదు:-)

     సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్ళకి ఏ సందేహమూ రాదు,అక్కడ అన్నీ స్పష్టంగానే ఉంటాయి.పూర్తిగా ఆధునికంగా ఆలోచించేవాళ్ళకీ గందరగోళం ఉండదు - వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు స్పష్టంగా నిర్వచించుకుని ఉంటారు.ఎటొచ్చీ ఆధునికత పేరుతో "నేను రంకు చేస్తాను,కానీ నన్ను స్వైరిణి అనరాదు" అని సంప్రదాయవాదుల నుంచి తమకు మినహాయింపులు కోరుకునేవాళ్ళకి మాత్రమే ముతప్పాళ కురంగీన్యాకమ్మ తరహా సాహిత్యం నచ్చుతుంది!ఈ సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నామంటూనే మళ్ళీ ఈ సంప్రదాయవాదుల నుంచి మెచ్చుకోళ్ళు కోరుకోవడమనే గందరగోళం వాళ్ళలో ఉంది.తమలోకి తాము చూసుకుని తమ గందరగోళాన్ని తగ్గించుకుని అటోఇటో జరిగితే గొడవే ఉండదు కదా,ఎందుకీ దిక్కుమాలిన యేడుపు?

     నేనింతవరకూ చదవలేదు గానీ "సామాన్య" అనే ఒక విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివిన, ఓ IAS Officerగారి సతీమణి, దేశంలోని అనేక ముఖ్యమైన పట్టణాలలో నివాసం ఉన్న రచయిత్రి ఆంధ్రజ్యోతిలో "కమలిని" అని ఒక కధ రాశారు.దానిమీద లెఫ్టిస్టుల రంగసాని సారంగలో కల్పన అనే ఆవిడ భోరున ఏడ్చెసింది ఖదలో కమలిని రంకు చేసి మొగుడికి సారీ చెప్పటం ఆవిడకి నచ్చలేదట!అందుకని "సారీ సామాన్య, నేనే కాదు తమ మీద తమకు గౌరవం ఉన్న ఏ ఆడపిల్లా నీ కమలిని మాటలను క్షమిస్తుందనుకోను" అంటూ ఆక్రోశిస్తున్నది.ఇక్కడ వింతేమిటంటే నా బ్లాగులో "లాడెనుకి నేనూ,నాకు లాడెనూ" అని దీర్ఘాలు తీసిన నీహారిక "పాతివ్రత్యం,నైతికం,కట్టుబాటు అనేవి ఏ యుగంలోనైనా తప్పనిసరి.సమాజం మనుగడే వాటిపై ఆధారపడి నడుస్తున్నపుడు ఆధునిక మహిళల ఆత్మగౌరవం దెబ్బతిన్నంతమాత్రాన వాటివిలువ తగ్గిపోదు" లాంటి ఆణిముత్యాల్ని వెదజల్లటం!

     రాముణ్ణీ సీతనీ వెక్కిరిస్తూ శూర్పణఖని ప్రశంసించడమా,ఇక్కడిలా పాతివత్యాన్ని సమర్ధించడమా - ఏది నీహారిక యొక్క అసలు రూపం?వీటిల్లో ఏదీ కాకుండా నరసింహకిలా ఆరు రూపాలు ఉన్నాయా!ఈ ఆధునికంగా ఉంటూ సంప్రదాయంతో ఘర్షణపడెవాళ్ళలో ఉండే గందరగోళం అంతాఇంతా కాదు.శివ బాహుబలి అవంతికని రేప్ చేసేశాడని గోలపెట్టింది తెలుగావిడే!ఆవిడ మరి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చూడలేదా?ఆ సినిమాలో నిత్యామీనన్ "లడ్డూ కావాలా!" అని అడగటంలో చూపించిన రెచ్చగొట్టుడం గురించి గొడవచేయ్యలేదెందుకు?పట్టపగలు అందరూ అటూఇటూ తిరిగే వరండాలోనే ఒక ఆడది మగాణ్ణి రొమ్ముల్ని గట్టిగా అతనికేసీ అదుముతూ కావిలించుకుని కుర్రాడే కంగారుపడి కాఫీగ్లాసుని వొదిలేసేలా చెయ్యడం తప్పని అనిపించలేదా?ఇదివర్లో మగాడు ఏమయినా చెయ్యొచ్చు గానీ ఆడది సంసారపక్షంగా ఉండాలి అనేది తప్పు,ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం ఆడది ఏమయినా చెయ్యొచ్చు గానీ మగాడు సంసారపక్షంగా ఉండాలి అనెది ఒప్పు - గొప్ప చదువులు చదివి  ఈ ఆడవాళ్ళు నేర్చుకున్నది ఇది!

     సహజీవనం గురించి మణిరత్నం తీసిన ఓకే బంగారం సినిమాలో నిత్యామీనన్ క్యారెక్తర్ ఏంటి?మొదట్లో వీరవనితలా "ఆ పెళ్లొకటి చేసుకుంటే ఆ తాడొకటి వేసుకుంటే అన్నీ చేసేసుకోవచ్చా..దాంతో లైసెన్స్‌ వస్తుందా, లేకపోతే రాదా?" అనే ఒక్క డైలాగు గొప్పగా చెప్పడం సరే,తర్వాత చేసిన గొప్ప నటన ఏంటి?నేను చూసిన ట్రైలర్స్ మరియూ పాటలు అన్నింటిలోనూ చేసిన గొప్ప నటన ఏమిటి?దుప్పటిలో హీరోకి అతి దగ్గిరగా ఉండి హస్కీగా మూలగడం,చెంపలు చెంపలకి రాస్తూ పరవశించి పోతూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమసీని అత్యంత వాస్తవికంగా ప్రదర్శించటం!ఆ సీన్లని బట్టే, తెర మీద చూపించకపోయినా వాళ్ళ సహజీవనం పూర్తయ్యేసరికి జరగాల్సినవి అన్నీ చాలాసార్లు జరిగిపోయే ఉంటాయని నేను బల్లగుద్ది చెప్పగలను!లడ్డులాంటి పిల్ల అంత దగ్గిరగా కదుల్తూ దుప్పట్లో దూరి హస్కీగా మూలుగుతుంటే అస్ఖలితంగా ఎవడు ఉండగలడు?మణిరత్నం వాళ్ళని పెళ్ళి పేరుతో కలిపాడు గాబట్టి సరిపోయింది,లేకుంటే?ఒక విశృంఖలతని చాలాకాలం చూసి మొదట అరుంధతి తర్వాత వశిష్ఠుడు ఏర్పరచినది వివాహ వ్యవస్థ!దీన్ని కాదంటే ఒకప్పటి గుంపులో గోవిందా వాతావరణమె గతి – ఎందుకొచ్చిన గోల?వెనక్కి నడిచి మళ్ళీ అరుంధతికి ముందరి కాలానికి వెళ్ళి చేసేది ఏముంటుంది?మళ్ళీ అది బాగా లేదనుకుని ఇటే రావాలిగా!తాళి,కట్టుబాటు,సింబల్స్ లేకుండా వాళ్ళు చేసిన దేమిటి?దాంపత్యమూ సహజీవనమే కదా!సహజీవనం నుంచి దాంపత్యం లోకి ప్రయాణించారు వాళ్ళు – ఇందులో విప్లవాత్మకత యేముంది?

     ఈ నిత్యా మీనన్ అరిచి గింజుకున్నా ఎక్స్పోజింగు చెయ్యను,ఖాళీగా ఉంటాను గానీ అసభ్యతకి చోటివ్వను అని మొండిగా చెప్పేసి ఒళ్ళు చూపించకండా ఉండటం వల్ల కాబోలు ఎంత పొగిడినా అదోరకంగా అనుకోరులే అని ఒక సేఫ్ జోన్ ఏర్పడిపోయినట్టుంది చాలామంది మగాళ్ళకి.కానీ నిత్యా మీనన్ నటన ద్వారా చూపించే అసభ్యత చాలా డేంజరస్!ఓకే బంగారం దగ్గిర్నుంచీ సన్నాఫ్ సత్యమూర్తి వరకూ ఆపాత్రలన్నీ నెగిటివ్ టోన్ ఉన్నవే,కానీ మనకి వాటిల్లో పాజిటివ్ టోన్ ఉన్నట్టు అనిపిస్తుంది,ఎందుకని?ఈ రెండు సినిమాలే కాదు,మాలిని22లో అయితే నిజంగా నరేష్ అనే నటుడు నిత్యా మీనన్ అనే నటిని రేప్ చేస్తున్నాడేమో అనిపించేతంత సహజంగా ఉంది తన నటన – బాబోయ్!ఇంక నరేష్ పాత్ర మీద పగ తీర్చుకునే సీన్లలో అయితే ఆ కళ్ళు హర్రర్ మూవీ చూపించేశాయి:-(

     సరే,అది రేపిస్టుల్ని భయపెట్టే ఎఫేక్టు అని సర్దుకుపోవచ్చు,సన్నాఫ్ సత్యమూర్తిలో ఈ అమ్మాయి చేసిన పాత్ర ఏంటి?అప్పటికే తను ఒక మగాదితో ఉడాయించాలనేటంతగా ప్రేమలో ఇరుక్కుని హీరోని “లడ్డూ కావాలా?” అని రెచ్చగొడుతూ బిగియార కౌగలించుకోవడం అనే విచ్చలవిడితనం కూడా సంసారపక్షంగా ఉండే ఈ నిత్యా మీనన్ చెయ్యడం వల్ల ఏమాత్రం ఎబ్బెట్టుగా కనిపించలేదు – బాహుబలిలోని హీరో హీరొయిన్ల మధ్యన జరిగిన రొమాన్సు కూడా రేప్ మాదిరి ఫీలయిన ఆధునిక మహిళలకి కూడా!!ఓకే,సత్యమూర్తి సినిమా ధీం అంతా కొంచెం సీరియస్ టోనులో నడుస్తుంది గాబట్టి రిలీఫ్ కోసం దైరెక్టర్ చేసిన జిమ్మిక్కు లెమ్మనుజుందామా?కానీ నాకెందుకో ఇక్కడ సంసారపక్షంగా కనిపిస్తూ పరాయి మొగాణ్ణి ఒక ఆడది గట్టిగా కావిలించుకుంటే కిక్కురుమనకుండా వూర్కుని శివ బాహుబలి తనకి నచ్చి పెళ్ళి చేసుందామనుకున్న అమ్మాయితో కొంచెం దురుసుగా ఉండటానికి రేప్ అని పేరుపెట్టి హడావిడి చెయ్యటం వెనక ఒక ప్లాన్/ఎజెండా ఉన్నట్టు రూఢిగా తెలుస్తున్నది.

     అప్పటికాలంలో ఆడాళ్ళు అందరూ పవిత్రంగా ఉంటే తప్పు చెయ్యాలనుకున్న ఒక్క మగాడికీ,ఇప్పటికాలంలో మగాళ్ళు అందరూ సంసారపక్షంగా ఉంటే తప్పు చెయ్యాలనుకున్న ఒక్క ఆడదానికీ సహచరులు యెట్లా దొరుకుతారో!మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయినట్టు అంతరించిపోయిన జీవజాతుల్ని వదిలేస్తే విజయవంతంగా మనుగడ సాగిస్తున్న ప్రతి జీవజాతిలోనూ లైంగిక ద్వైరూపకత(Sexual Dimorphism) ప్రస్ఫుటంగా ఉన్నది.కొన్నింటిలో మగవి అందమైన ఆలంకారాల్ని సమకూర్చుకుని హొయలు చూపిస్తే కొన్నింటిలో ఆడవి సొబగుల్ని సమకూర్చుకుని బులిపిస్తున్నాయి - ఎవరు ఎన్ని పాట్లు పడినా ఒళ్ళో పెట్టనా దళ్ళో పెట్టనా అన్నట్టు కంగారు పడకుండా జతగూడాల్సినవి జతగూడి పిల్లల్నికని జాతిని పెంపొందించుకోవటానికి పడుతున్న తంటాలు!మనుషుళ్లో అది ఆడవాళ్ళు అందంగా ఉండటం,మగవాళ్ళు ధృఢంగా ఉండటం అనేలాగ కుదిరింది!అన్ని జీవజాతుల్లోనూ ఉన్నదే జరిగితే ఈ కొత్తరకం ఆడవాళ్ళు మాకన్యాయం జరిగినదని యేడవటం దేనికి?అయితే,ఇదంతా ఏకపక్షమా అంటే బాక్సింగు నేర్చుకున్న వీరనారులూ ఉన్నారు,మొహమాటంగా ఉండే హరిబాబులూ ఉన్నారు:-)

     సనాతన ధర్మంలో ప్రాచీన సాహిత్యాన్ని చూస్తే ఈ పవిత్రంగా ఉండటం గురించిన నిషేధాలు తక్కువే!జుదాయిజం నుంచి పుట్టిన అబ్రహామిక్ మతాల మాదిరి ఇక్కడ "ఇది పవిత్ర వాక్యం,దీన్ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే" అని ఒత్తిడి పెట్టే యేకైక గ్రంధం అంటూ ఏదీ లేదు.శృతి,స్మృతి - ఈ రెండూ కూడా ఒకే విషయానికి సంబంధించి ప్రాంతాని కొకరీతిగా చెప్పే పాఠాంతరాలతో ఉన్నాయి.అంటే,ఒక ప్రాంతంలో యేదయినా సమస్య వస్తే అక్కడి పెద్దలు సమయానికి తగిన పరిష్కారాన్ని చెప్పేవారు!పరిష్కారం సమస్యని రద్దు చేస్తేనే గదా అందర్నీ మెప్పించగలిగేది,అప్పుడు "మాకూ ఇలాంటి తవ్వాయి వొస్తే?" అని గుంజాటన పడేవాళ్ళ కోసం దాన్ని కూడా గ్రంధస్తం చేసేవాళ్ళు.అందుకే,ఇక్కడ దేన్ని గురించి కూలంకషంగా తెలుసుకోవాలన్నా ఆచార్యుడు/భాష్యకారుడు అనే మధ్యవర్తి అవసరం తప్పనిసరి.స్త్రీ పురుషుల మధ్యన ఉండాల్సిన నిబద్ధత గురించి బలంగా చెప్పిన మొదటి ఆఖరి గ్రంధం రామాయణమే!అంతకు ముందరి సాహిత్యం - వైదిక మంత్రాలలో గానీ,తర్వాతి కాలపు భారతేతిహాసం లాంటివాటిల్లో గానీ ఒకరికొకరు నిబద్ధంగా ఉన్న సీతారాముల వంటి జంట మరొకటి లేనే లేదు!ఆయా పాత్రల్లో బహుపత్నీత్వం,బహుపతీత్వం,స్వేచ్చా శృంగారం అనేవి యే దాపరికమూ లేకుండా కనబడతాయి.ఆయా పాత్రల్ని వర్ణించే రచయితలు కూడా అలాంటి ప్రస్తావనలు చేసేటప్పుడు సహజంగా జరుగుతున్నవాటిని వర్ణించే మామూలు వర్ణనలే చేశారు తప్ప నిషేధించబడినవాటిని చెప్తున్నట్టు అనిపించదు,మరి ఈ ఆధునిక మదనికా రదనికల "నొక్కేశారు,తొక్కేశారు,నీతుల్ని రుద్దేశారు" అనే గొడవకి కారణ మేమిటి?

     మతపెద్దలు ఆమోదించి సర్వులూ పాటించినట్టు కనబడే రామాయణ మహాభారతాల వంటి కధాత్మక సాహిత్యరూపాల తర్వాత మనుస్మృతి,కామసూత్రం,అర్ధశాస్త్రం వంటి తార్కిక గ్రంధాలలో కూడా వివాహం - పవిత్రత వంటివి నిషేధాజ్ఞల రూపంలో లేవు!మనుస్మృతి అనగానే "నస్రీ స్వాతంత్ర మర్హతి" అన్నాడని గోల చేసేవాళ్ళు మొత్తం శ్లోకంలో ఉన్న అర్ధాన్ని చెప్పడం లేదు."చినప్పుడు తండ్రి,యుక్త వయస్సులో సెదరులు,పెళ్ళయ్యాక భర్త,వృద్ధాప్యంలో కొడుకులూ స్త్రీకి రక్షణ ఇచ్చి తన కోరికల్ని తీర్చాలి - వొదిలెయ్యకూడదు" అని మగాళ్ళకి చెప్పడంలో తప్పేముంది?వాత్స్యయనుడైతే "పారదారికం","వేశ్యాధికరణం" అని రెండు అధ్యాయాలు రాశాడు - వాటిలోని ప్రతిపాదనలు ఇప్పటి ఆధునికులకి కూడా చెమట్లు పట్టించేటంత విప్లవాత్మకమైనవి!పారదారికం అంటే,ఒక స్త్రీకి భర్త ద్వారా సంతృప్తి లేకపోతే మరొక పురుషుడు ఆమెని సంతృప్తి పరచవచ్చును అంటున్నాడు!సింగిల్ పన్నా దైలాగు చెప్పి వూరుకోలేదు,ఒక అధ్యాయమే రాశాడంటున్నాను గదా!అందులో ఉన్నదంతా మొగుడికి తెలియకుండా దాన్ని సాగించుకోవడం కోసం ఉపాయాలూ,మధ్యవర్తులూ,రాయబారాలూ - అబ్బో, ఎందుకు లెండి మిమ్మల్ని చెడగొట్టటం:-)

     చాణక్యుడు యేకంగా విడాకుల ప్రస్తావన స్త్రీ వైపునుంచి వస్తే వెంటనే ఇచ్చెయ్యమన్నాడు,ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి.మొదటిది వివాహక్రతువు యొక్క ఉద్దేశం స్త్రీకి రక్షణా,సౌకర్యమూ,సంతోషమూ ఇవ్వటానికి కాబట్టి స్త్రీ సంతోషపడని వివాహం  వివాహమే కాదనేది,రెండవది,ఒకసారి విడాకుల ప్రస్తావన వచ్చాక వాళ్ళిద్దర్నీ కలిపి ఉంచితే బలవంతుడైన మగవాడు భార్య విడాకులు కోరుకోవటం అవమానంగా భావిస్తే ఆడదాని ప్రాణానికి ప్రమాదం తలపెట్టవచ్చును అనేది - ఇట్లా ప్రాచీన ధార్మిక సాహిత్యమంతా ఆడవాళ్ళకే సౌకర్యాలు అమర్చారు.ఇంక గాధాప్తశతి,శుకసప్తతి లాంటివి కట్టుతప్పిన శృంగారాన్ని కూడా రొమాంటిసైజ్ చేసి వర్ణిస్తాయి.ఈ రకమైన వాటిననిట్నీ కలిపి చూస్తే మొత్తం సాహిత్యంలో వీళ్ళు హైలైట్ చేసి చెప్పే పతివ్రతల కధలు చాలా తక్కువ శాతాన్ని ఆక్రమిస్తాయి.కోర్కెకి ప్రాధాన్యత ఇచ్చి నీతిని పట్టించుకోనివాళ్ళు,నీతికి ప్రాధాన్యత ఇచ్చి కోర్కెల్ని అణుచుకునేవాళ్ళు అప్పుడూ ఉన్నారు,ఇప్పుడూ ఉన్నారు,ఎప్పుడూ ఉంటారు!

     అయితే ధర్మంలో తప్పు లేనప్పుడు సమాజంలో కనపడుతున్న అసమానతలు ఎందుకు ఉన్నాయి?అసమానతలకి ఆస్కారమిస్తున్న ధర్మాన్ని విమర్శిస్తే తప్పేమిటి?ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు!వీటిని తప్పించుకుని తిరగడం ఇంకెంతో కాలం సాధ్యపడదు.ఒక మనిషిలో స్వార్ధం ముదిరితే అతను నీతుల్ని లెక్క చెయ్యడు,ఇతరుల్ని మోసం చెయ్యడానికి తప్పుడు సమర్ధనలు కనిపెట్టి అయినా తన కోరికల్ని తీర్చుకుంటాడు.ఒకప్పుడు అసలెవరికీ విధించని అపవిత్రతకి సంబంధించిన శిక్షలు ఇప్పుడు ఆడవాళ్ళకే విధించడం ఎప్పుడు మొదలైంది?బ్రాహ్మణుల వల్లనే వచ్చిందనడానికీ ఆధారాలు లేవు,బ్రాహ్మణుల పొడయే తగలని ఆదివాసుల సంస్కృతిలోనూ పురుషాధిక్యత ఉంది కదా!ఇంటిపెద్దగా పురుషుడు మాత్రమే ఉండి అతని కష్టార్జితమైన ఆస్తి వారసత్వంగా సంక్రమించేటప్పుడు ఏర్పడే గందరగోళాలకి తరుణోపాయంగా పురుషుడు ఎన్ని సానివాడల్ని సందర్శించినా పర్లేదు గానీ స్త్రీలు మాత్రం భర్తతో తప్ప పరపురుషుడితో సంగమించరాదనే నియమం పెట్టారు.కానీ ఇవ్వాళ స్త్రీలు కూడా ఆర్జనపరులుగా ఉన్నారు.దానిమూలంగా ఆస్తి మీద స్త్రీలకు కూడా వాటా వస్తున్నది!ఎప్ప్పుడైతే స్త్రీలు ఇల్లు దాటి సమాజంలోకి వచ్చి కలివిడిగా తిరగడం మొదలుపెట్టారో ఇన్నాళ్ళూ మంగవాళ్ళు తమ స్ఖాలిత్యాలకి చెప్పుకునే కలివిడితనం వీళ్ళకీ వచ్చింది.చెడిపోయే అవకాశాలు ఇద్దరికీ సమానంగా ఉన్నప్పుడు క్షమించడం అనేది యేకపక్షంగా ఎందుకు ఉండాలి అనే ప్రశ్నని సామాన్యగారు మగవాళ్ళకి వేస్తున్నారు!అందులో తప్పేమీ లేదు.మరొక కోణంలో ఆమె స్వేచ్చని కావాలని తప్పు చెయ్యటానికి వెసులుబాటుగా ఉపయోగించుకోవడం గురించి ఆడవాళ్ళకి హెచ్చరిక కూడా చేస్తున్నారు,ఇందులోనూ తప్పు లేదు!

     హిందూ సమాజం సంస్కరణకి వ్యతిరేకం కాదు.అందుకు సాక్ష్యం సంస్కరణ కోసం ఉద్యమించిన  యే సంస్కర్తా చంపబడకపోవటం,తన జీవితకాలంలోనే విజయం సాధించటం!నిత్యనైమిత్తికాలతో సతమతమయ్యే సామాన్యులు అజ్ఞానంతోనో వ్యామోహంతోనో  దురాచారాల్ని కొంతకాలం పాటించినా సంస్కర్తలు ఎప్పుడైతే అసలు ధర్మసూత్రాలలో ఉన్నదేమిటో చెప్పినప్పుడు బుద్ధిగా విని తమను తాము సంస్కరించుకున్నారు.స్వార్ధంతో ఆ నియమాల్ని పెట్టినవాళ్ళు,వాటివల్ల వెసులుబట్లు పొందుతున్నవాళ్ళు తప్పకుండా వ్యతిరేకిస్తారు,వ్యతిరేకించారు కూడా!కానీ సంస్కరణ ప్రయత్నాలు ఫలవంతమయ్యాయనేది వాస్తవం.ఈరోజు రెండు అతిచిన్న ఇబ్బందికరమైన అవశేషాలకి గురికావడం తప్పిస్తే హిందూ మహిళల పరిస్థితి మెరుగ్గానే ఉంది.ఆ రెండు ఇబ్బందులనే సామాన్య గారు తన కధలో ప్రస్తావించారు.ఆ దోషాలు కూడా తొలగించాల్సిందే.మరి,గొడవ ఎందుకొచ్చింది?ప్రత్యేకించి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చినా ఆగకుండా ఆమెమీద వ్యక్తిగతమైన దాడికి తెగబడటానికి వెనక ఉన్న రహస్యమేమిటి?

     మనుషుల ప్రవర్తనని శాసించే విషయంలో ఆధ్యాత్మికం వేరు,సామాజికం వేరు!సామాజికస్థాయిలో గౌరవం పొందాలన్నా అవమానించబడాలన్నా రాజ్యాంగమూ ప్రభుత్వమూ లాంటివాటితో సంబంధం ఉంటుంది.అక్కడ మైనార్టీలకి ప్రత్యేక హక్కులూ అవీ ఉంటాయి.అయితే,ఈ మైనార్టీలకి ఇచ్చే రిజర్వేషన్లు ఎక్కడ ఇస్తున్నారు,ప్రత్యేక సదుపాయాలు ఎక్కడ చేస్తున్నారు?ఉపాధి,సంపాదన,ప్రాతినిధ్యం,అధికారం వంటివాటికి కొన్ని పరిమితుల్లోనే ఇస్తున్నారు తప్ప  నేరాలు చేసి శిక్షనుంచి తప్పించుకునే వెసులుబాట్లని కల్పించడం లేదు - నూటికి లక్షమంది అడిగినా అలా ఎవరూ కల్పించరు!ఆధ్యాత్మికానికి ఈ ఉపాధి అవకాశాలతో సంబంధం లేదు కాబట్టి మైనార్టీల గురించి ఆలోచించాల్సిన ఆవసరం దానికి లేదు.ఈ తేడాలు ఒక ధర్మాన్ని సమాజంలోని ప్రజలతో పాటించేటట్లు చెయ్యడానికి సంబంధించినవి,కానీ అసలు యేది ధర్మం అనేది తేల్చాలి అంటే మాత్రం రెండు చోట్లా మెజార్టీ ప్రజలు దేన్ని సమర్ధిస్తే అదే ధర్మం!ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య గారి కమలిని కధని చదివితే అందులో ఇంత గొడవ చెయ్యాల్సిన అంశం యేదీ లేదు, మరెందుకు వీళ్ళు సామాన్య గార్ని క్షమించడం లేదు?

     ఇలా గందరగోళంలో చిక్కుకున్న రచయిత్రికీ,అదేరకం అయోమయంతో ఉన్న వనజ గారికీ నేను చెప్పేది ఒక్కటే - ఆవిడ కధలో మహాభారతం నుంచి ఒక కొటేషన్ వాడారు!ఈ దేశంలో కొందరికి ఎర్రకామెర్ల రోగం పట్టింది.వాళ్ళు హిందూమతంలో మంచి ఉందంటే చచ్చినా ఒప్పుకోరు.ఇదే సారంగలో అర్జున విషాదయోగానికీ ట్రోజన్ల కధకీ ఒకాయన పోలిక తీసుకురాబోయినందుకే ఇంకొకాయన "వీళ్ళనందుకు ప్రస్తావిస్తున్నారు!వీళ్ళు యే ఉత్పత్తి శక్తులకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?" అని వాంతులు చేసుకున్నాడు.నేను కమ్యునిజం గురించి నాలుగు ప్రశ్నలు వేసేసరికి అబ్బెబ్బెబ్బె నేను కమ్యునిష్టుని కాదు, జాతస్యహిందువుని అని మరోసారి మరోరకంగా వాంతులు చేసుకున్నాడు.అక్కడ ఇలాంటివాళ్ళ కామెంట్లే పడతాయి!ఇంక రచయిత్రి సంస్కారవంతులని భావించి విజ్ఞప్తులు చేసిన సారంగ ఎడిటర్లూ ఎడ్మిన్లూ ఆమెరికాలో ఉండి రెండు చేతులా ఆర్జిస్తూ దేశానికి సంబంధించిన విషయాల్లో మాత్రం హిందూమతాన్ని విమర్శించే కమ్యునిష్టులకి పక్కలేసే గాండ్లసంగులు!హిందూమతాన్ని విమర్శించే వ్యాసాలూ,కామెంట్లనే వారు ప్రచురిస్తారు.మరీ బాగుండదని కల్లూరి భాస్కరం గారిలాంటి వాళ్ళని ఆదరిస్తారు గుడ్విల్ కోసం కాబోలు!వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలిసింది గాబట్టి మీరు కంగారు పడకుండా మీ సాహితీసృజనని ఎప్పట్లాగే కొనసాగించండి.

     వీళ్ళంతా ఈ రాజ్యాలూ,యుద్ధాలూ,నీతులూ బ్రాహ్మలే పెట్టారు అని అంటున్నది మాటవరసకి నిజమే అని ఒప్పుకున్నా వాటిని అందరూ ఒప్పుకుని పాటించడం వల్లనే సంప్రదాయంగా స్థిరపడినాయి.ఆ ధర్మాలు అట్లా ఉన్నాయి గాబట్టి మాకు స్వైరిణులు అనే పేరు వస్తున్నది ,కనక ఆ ధర్మమే చెడ్దది అనే హక్కు వీళ్ళకి లేదు గాక లేదు!అసలు ధర్మాన్నే తప్పు పట్టేవాళ్ళని తలమీద చెయ్యేసి నొక్కేసినా తప్పు లేదు!


వెసులుబాటు కోసం వేసే ఎత్తులు విప్లవమూ కాదు,కట్టుబాటు కోసం పెట్టే ఒత్తిడి నియంతృత్వమూ కాదు!

Wednesday, 4 May 2016

అనేక విధాలుగా తనను తనే అర్చించుకంటాడు మానవుడు,అతని ఆత్మపూజకు నామాంతరమే అతను పూజించే దేవుడు!

సీ||యోగీంద్ర మానసాంభోరుహ ప్రాణనా
       యక!భోగీంద్ర శయన!సహేంద్ర

       వాశిష్ఠ సహృదవారిజ లోచనా
       నందకారక!శార్జ నందక ఘన

       పాంచజన్య ఢమరుకా శూలపాణీంద్ర!
       మాల్యాద్రి గరుడాద్రి మలయ వింధ్య

       సాహ్యాద్రి కాశీ ప్రయాగ క్షేత్ర
       భూజేంద్ర శక్తి సంపూరకాయ!

తే.గీ||కమల సంభవ గౌరీంద్ర పర్యవేష్ఠి
          త ప్రళయకాల వటపత్ర డోల లోల
          నాయ!భోగ యాత్రాను సంధాయక!ద్వి
          బాహు రపరో హరి!సమర బ్రాహ్మణాయ!
(01/05/2016)
-----------------------------------------------------------------------------------------------------------------
అహం బ్రహ్మాస్మి!
-----------------------------------------------------------------------------------------------------------------

Thursday, 28 April 2016

జై తమిళాంధ్ర!జై జై తమిళాంధ్ర!!జై జై జై తమిళాంధ్ర!!!

          రష్యా ఒకప్పుడు పోలెండ్‌పై ఆధిపత్యం ఏర్పరచుకొని అక్కడి విద్యాసంస్థల్లో పోలిష్‌ భాషలో విద్యాబోధనను నిషేధించింది; రష్యన భాషలోనే విద్యా బోధన జరగాలని శాసించింది. అదే రీతిలో, ఇంగ్లండ్‌ కూడా తన ఆధీనంలో ఉండిన స్కాటిష్‌ హైలాండ్స్‌లోని జనాల్ని తమ గాలిక్‌ భాషలో మాట్లాడనివ్వలేదు; అటు ఐర్లాండ్‌లోనూ ఇంగ్లీషునే ప్రోత్సహించింది. బిస్మార్క్‌ కాలపు జర్మనీ కూడా తన ఆధీనంలో ఉండిన పోలెండ్‌ దేశీయుల్ని పోలిష్‌ భాష బదులు జర్మనీ భాషనే వాడాలని ఆదేశించింది; సెల్స్‌విగ్‌ ప్రాంతపు డేనిష్‌ (డెన్మార్క్‌) వారిని డేనిష్‌ భాష బదులు జర్మన్‌ భాషనే వాడాలని శాసించింది. అంతేగాక, ఆ ప్రాంతాల వారిని జర్మన్‌ జాతీయులుగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించింది.

          ఇదే రీతిలో, మన పొరుగు రాష్ట్రం తమిళనాడు కూడా అక్కడి తెలుగువారి తెలుగు భాష విషయంలో అలాంటి ప్రయత్నాన్నే నేడు చేస్తోంది. తెలుగు భాష మాట్లాడడానికి, రాయడానికి, చదువుకోవడానికి, ఉద్యోగం పొందడానికి, కడకు అంగళ్ల వద్ద తెలుగులో బోర్డులు పెట్టుకోవడానికి కూడా వీలులేని పరిస్థితులు తమిళనాడులో సృష్టిస్తున్నారు. నేటి తమిళ రాజకీయ నాయకుల ఓట్ల రాజకీయంతో తమిళ భాషా రాజకీయం కలపడంతో ఏర్పడిన తమిళభాషా ఉద్రేక రాజకీయాల వలన, తమిళుల ఆధిపత్య ధోరణి వలన, తమిళుల దాడులు వలన, తమిళనాడు లోని తెలుగువారు స్వతంత్రతను, భాషను, సంస్కృతిని, కడకు ఉనికిని కూడా కోల్పోతున్నారు. ఇక్కడి తెలుగువారు తమిళులుగా మారిపోక తప్పడం లేదు. అంటే, తమిళనాడులో తెలుగు భాషాసంస్కృతులు శిథిల దశకు చేరువవుతున్నాయి. కనీసం రెండవ అధికార భాషగానైనా తెలుగు ఏర్పడితే తప్ప అక్కడి తెలుగు ఎక్కువ కాలం బతకదు.

           ఇందుకు దేశంలోని తెలుగువారు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు, పార్టీలు, భాషా సంస్థలు, భాషాభిమానులు, మొత్తంగా తెలుగు జనాలు తమిళనాడులోని తెలుగువారికి అండగా నిలవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది; ముఖ్యంగా తెలుగు భాషా ఉద్యమకారులు స.వెం.రమేశ్‌ వంటి వారికి అండదండలు చేకూర్చాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా జరగాలి.ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయమేమంటే, తమిళాంధ్రగా, దక్షణాంధ్రగా పిలువదగిన నేటి తమిళనాడులో క్రీస్తుశకం ఒకటి-మూడు శతాబ్దుల మధ్య నాటి ప్రాచీన తమిళ సంగం యుగ కాలం నుంచి నేటి వరకు తెలుగువారే మెజారిటీ జనాభాగా, తమిళులు మైనారిటీ జనాభాగా నేటి తమిళనాడులో జీవిస్తున్నప్పటికీ మెజారిటీ జనాలైన తెలుగు వారి భాష అణచివేతకు గురవుతోంది. అసలు, సంగం యుగ కాలానికి కావేరీ నది పరిసర ప్రాంతాలకు, వాటికి పశ్చిమాన ఉన్న నేటి కేరళలోని అరేబియా సముద్రం అంచువరకు మాత్రమే తమిళం ప్రాబల్యం కలిగి ఉండేది (అప్పటికి కేరళలో మాళయాళ భాషలేదు);

            కావేరికి ఉత్తరాన ఉండిన ప్రాంతాల్లో చాలావరకు వడుగర్‌ అనబడిన తెలుగు మాట్లాడే జనం ఉండేవారు (క్రీస్తుపూర్వం నుండే మాట్లాడే-తెలుగు ఉంది). 1911లో తిరుచినాపల్లిలో ఉమ్మడి మద్రాసు (తమిళాంధ్ర) తమిళ నాయకులు ప్రత్యేక రాష్ట్రంకై జరిపిన సమావేశంలో కావేరీ పరిసరాల నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రాంతాలతో కూడిన ప్రత్యేక తమిళ రాష్ట్రం ఏర్పరచాలని కోరడంబట్టి కావేరీ పరిసర దక్షణ ప్రాంతాల్లోనే తమిళం మాట్లాడే జనం ఎక్కువగా కేంద్రీకృతమై ఉండేవారని తెలుస్తోంది; ఉత్తర ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే జనం అధికంగా ఉండేవారని కూడా తెలుస్తోంది. కడకు, 1953లో ఆంధ్రరాష్ట్రం, తమిళరాష్ట్రం ఏర్పాటుకు ముందు కాలంనాటికి కూడా పాండిచ్చేరి, కోయంబత్తూరు, సేలం, బాలాఘాట్‌, డెంకెన్‌కోట, హోసూరు, కి?ష్టగిరి, హంపి వంటి ప్రాంతాల వరకు తెలుగు మాట్లాడేవారు అత్యధికంగా ఉండేవారు. డెంకెన్‌కోటలో పదిశాతం కూడా తమిళులు లేరు. ఇప్పుడు కూడా తమిళనాడులో తెలుగు వారు నలభైరెండు శాతం మందిపైగా ఉన్నారు, తమిళులు ముప్పై ఆరు శాతం మంది ఉన్నారు, ఇతర భాషీయులు ఇరవై శాతం వరకు ఉన్నారు.

             అసలు, తమిళనాడులోని మొత్తం ముప్పయ్‌ జిల్లాలలో తెలుగు లేని జిల్లా లేదు. మొత్తం 165 తాలూకాలలో తెలుగు పల్లెలు లేని తాలూకా లేదు. అక్కడి 332 కూలాలలో 150కి పైగా తెలుగు కులాలు ఉండగా 73 మాత్రమే తమిళ కులాలు ఉన్నాయి. సేలం జిల్లాలో వందేండ్ల క్రితం కూడా ఆస్తి పత్రాలు తెలుగులో రిజిస్టర్‌ అయ్యేవి. ధర్మపురిలో 1880 నాటికే తెలుగు బడి ఏర్పాటు చేశారు. 1658లో డచ్చివారికి నాగపట్నం ఓడరేవులో వ్యాపారం చేసుకోవడానికి తంజావూరు రాజు విజయరాఘవ నాయకుడు ఇచ్చిన అనుమతి పత్రం, ఒప్పంద పత్రాలు తెలుగులోనే ఉన్నాయి. అనగా, తమిళనాడులో ప్రాచీన కాలం నుండి నేటివరకు తెలుగువారే మెజారిటీగా ఉన్నాగాని, తెలుగువారే అత్యధిక కాలం అక్కడ పరిపాలన సాగించినాగాని తెలుగు భాష అణచివేతకు గురవుతోంది.
  
           అసలు, క్రీస్తుశకం ఒకటవ శతాబ్దికి పూర్వం నుండే తమిళనాడులోని తెలుగువారు దాదాపు పూర్తిగా అక్కడి స్థానికులే. అక్కడి మట్టిలో పుట్టి, అక్కడే పెరిగినవారు. అక్కడి పొలాల్ని దున్ని, వ్యాపారాల్ని చేసి అక్కడి సంపద పెంచిన వారు. అక్కడి సంస్కృతిని, తమిళాన్ని వికసింపజేసి, పలు రకాల కళల్ని అభివృద్ధి పరచిన వారే. అందుకే, తమిళ సంగంయుగపు కవులు, ఆతరువాతి కాలపు ఆళ్వారులు వంటి వారిలో అత్యధికులు తెలుగు వారైనప్పటికీ తమిళంలోనే తమ రచనల్ని చేసారు. తమిళాంధ్రలో, ప్రధానంగా నేటి తమిళనాడు ప్రాంతంలో వ్రాత తమిళానికే రాజపోషణ ఉండడం, వ్రాత తెలుగుకు రాజపోషణ లేకపోవడం, నేటి తెలుగు ప్రాంతాల్లోనూ వ్రాత తెలుగుకు క్రీస్తుశకం ఆరవశతాబ్దివరకు రాజపోషణ లేక పోవడం, తెలుగు ప్రాంతాల్లో, తమిళాంధ్ర ఉత్తర ప్రాంతాల్లో వ్రాత ప్రాకృతం, వ్రాత సంస్కృతంలకు రాజపోషణ ఉండడంతో నేటి తమిళనాడులోని ఒకప్పటి తెలుగు వారు కూడా తమిళంలోనే రచనలు చేయడం జరిగింది (సంగం కవులు, ఆళ్వారులు వలె).

           మరోవైపు, తమిళాంధ్రను పాలించిన తమిళ పాలకులు చోళులు, పాండ్యులు గాని, తెలుగు పాలకులు పల్లవులు, విజయనగర పాలకులు, నాయక రాజులు వంటివారు గాని, ఆధునిక కాలపు పాలకులైన ముఖ్యమంత్రులు పదహారు మందిలో పన్నెండు మంది (1920-2016 మధ్య) తెలుగు మూలాలు గలవారు గాని తమిళ భాషాభివృద్ధికి కృషి చేశారే గాని తెలుగు భాషాభివృద్ధికి కృషిచేయలేదు; ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. వీటన్నింటికి తోడు 1953లో ఒరిస్సా గంజాంలోని మల్నాడ్‌కు ఒంగోలు దగ్గరి చినగంజాంకు మధ్య ఉండిన ‘‘ఉత్తరసర్కార్ల’’ నాయకులు ఉమ్మడి మద్రాసు రాష్ర్టాన్ని (తమిళాంధ్రను) విడగొట్టించి ఆంధ్రరాష్ర్టాన్ని ఏర్పాటు చేయించడంతో నేటి రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉన్న జనాభాకు దాదాపు సమాన సంఖ్యలో నేటి తమిళనాడు ప్రాంతంలో ఉండిన తెలుగు వారు భాషాపరంగా దిక్కులేని వారయ్యారు;

             ఇప్పటికీ తెలుగును కాపాడుకోవడానికి ఎదురీత ఈదుతున్నారు. అంటే, క్రీస్తు పూర్వం నుంచి నేటి వరకు తమిళనాడులో నివసిస్తున్న జనంలో అత్యధికులు తెలుగు వారే. మద్రాసు మొదటి మేయర్‌ పిట్టి త్యాగరాయ శెట్టి తెలుగు వాడే. 1920-2016 మధ్యనాటి తమిళనాడు ముఖ్యమంత్రులు పదహారు మందిలో పన్నెండుమంది తెలుగువారే. ప్రతిపక్ష నాయకులూ చాలావరకు తెలుగువారే. కానీ తమిళనాడులో తెలుగు భాష దారుణంగా అణచివేతకు గురవుతోంది. దీనిని ఆపడానికి తమిళాంధ్ర పార్టీ ఉద్భవించాల్సిన అవసరం ఉంది.
        
            ఇక, ఉమ్మడి మద్రాస్‌ (తమిళాంధ్ర) ముఖ్యమంత్రుల విషయానికి వస్తే, తొలి ముఖ్యమంత్రిగా అగరం సుబ్బరాయలు రెడ్డి (1920-21), ఆతరువాత వరుసగా కాళహస్తి-పానుగల్లు రాజా రాజారామారాయణిం (1921-26), డాక్టర్‌ పి. సుబ్బరాయన్‌ (1926-30), బొల్లిని మునస్వామి నాయుడు (1930-32), బొబ్బిలి రాజా (1932-37), కూర్మా వెంకటరెడ్డి (1937), టంగుటూరిప్రకాశం (1946-47), ఓమందూరు రామస్వామిరెడ్డి (1947-49), పి.ఎస్‌. కుమారస్వామి రాజా(1949-52), సి. రాజగోపాలాచారి (1952-54) ముఖ్యమంత్రులయ్యారు. వీరిలో సుబ్బరాయన్‌ మాత్రమే తమిళుడు మిగిలిన వారంతా తెలుగువారే. వీరి తరువాత తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా ఉండినవారు కామరాజనాడర్‌(1954-63), ఎం. భక్తవత్సలం (1963-67), అన్నాదొరై (1967-69), కరుణానిధి(1969-76, 1989-91, 1996-2001), ఎం.జి. రామచంద్రన్‌(1977-87), జయలలిత(1991-96, 2001 నుంచి...). వీరిలో కామరాజ్‌, భక్తవత్సలం మాత్రమే తమిళులు. ఎం.జి.రామచంద్రన్‌ మళయాళి, జయలలిత కన్నడిగ (ఈమె తల్లి నెల్లూరు కావున ఈమెను కూడా తెలుగు వ్యక్తిగా భావించవచ్చు). అన్నాదొరై, కరుణానిధి తెలుగు వారు. ఇక, పెరియార్‌ రామస్వామి నాయకర్‌, స్టాలిన్‌, వై.గోపాలస్వామి, విజయకాంత్‌ కూడా తెలుగు ప్రముఖులే. అంటే, 1920-2016 మధ్యనాటి పదహారు మంది ముఖ్యమంత్రుల్లో పన్నెండుమంది తెలుగు వారే, ప్రతిపక్షనాయకులూ తెలుగు వారే.

        ఈ వివరాలు తమిళనాడులో తెలుగువారే జనాభాలోనూ, ఇతరత్రానూ అధిక్యంలో ఉన్నారని తెలియజేస్తున్నాయి. అయితే, తెలుగు భాష విషయంలో ఉనికిని కోల్పోతున్నారు. దీనిని ఆపడానికి తమిళాంధ్ర పార్టీని స్థాపించి, రాజకీయ అధికారాన్ని చేపట్టడమే మార్గంగా తోస్తోంది. 
------- డాక్టర్‌ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి
గతమెంతొ ఘనకీర్తి గలవోడ!చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ!!దూసుకెళ్ళు సత్తువ గలవోడ!!!

Saturday, 23 April 2016

ఒరేయి,మనిషీ!నన్ను చంపకురా నువ్వు చస్తావు!?

ఒరేయి,మనిషీ!

నీ కడుపు నింపే కూడును నేను!
నీకు నీడనిచ్చే గూడును నేను!
నువ్వు కట్టుకునే బట్టను నేను!

నువ్వు మోసే కాడెను నేను!
నిన్ను మోసె పాడెను నేను!
నిన్ను కాల్చే కట్టెను కూడా నేనేరా ఇడియట్!

నేనురా తరువుని నీ బతుకుతెరువుని,
కన్ను తెరిచి చూడరా నన్ను బతక నివ్వరా!

ఒక్క చెట్టునైనా పెంచు,
నన్ను నరుకుతూ నిన్ను నువ్వు నరుక్కుంటూ
డైనోసార్ల మాదిరి చావకు!

నేను మాయమైపోతే నువ్వూ మాయమైపోతావ్ - ఖబడ్దార్!!

Tuesday, 12 April 2016

హిందువులు మతతత్వ వాదులా?ఇతరులు ప్రజాస్వామ్య వాదులా!భారతదేశం హిందూరాజ్యంగా మారనుందా?!

          శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గా,మస్తాన్ వలి దర్గా,షేక్ దావూద్ వలి దర్గా - నెల్లూరు జిల్లాలో ఈ మూడు అత్యంత ప్రముఖమైన దర్గాలు.వీటిని ముస్లిములతో పాటూ హిందువులు కూడా సందర్శిస్తారు - ఎంతో భక్తిగా!కడపలో పెద్దదర్గా అని పిలుచుకునే అమీన్ పీర్ దర్గా ఉంది.ఇది మతాలకు అతీతంగా ఉంటూ హిందువులు,ముసిములు,క్రైస్తవులు నిత్యం సందర్శించడం వల్ల మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది.ఇవే కాదు,మొత్తం భారతదేశంలో  చాలా చోట్ల ఉన్నాయి,ఈ ప్రాంతాల్లో ఎక్కడా హిందువుల మధ్యా ముస్లిముల మధ్యా చిన్నపాటి గొడవలు కూడా లేవు.ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఇమాం బేగ్ బావి ఉంది.ఇది రామభక్తుడైన ఇమాం బేగ్ గారు యాత్రికుల సౌకర్యం కోసం కట్టించినది.అందువల్ల ఈ దేవాలయంతో ముస్లిములకు కూడా ఆధ్యాత్మికమైన అనుబంధం ఏర్పడింది.తిరపతి బాలాజీ అయితే బీబీ నాంచారు మూలంగా ముస్లిములకి కూడా ఇష్టమైన వాడే!మొన్నామధ్యన ఒక ముస్లిం కుర్రాడు వాళ్ళ నాన్న మొక్కుకుని బతికుండగా తీర్చలేకపోయాదని చెప్పి స్వామివారికి సువర్ణపుష్పాలు సమర్పించి వెళ్ళాడు.బహుశా ఇకముందు వీటిమీద కూడా సూడో సెక్యులరిష్టుల కన్ను పడితే వాటిని అట్లా ప్రశాంతంగా ఉండనివ్వరేమో?

          మీకా భయం అక్కర్లేదు!వెటి దగ్గిరకెళ్ళీ రాజకీయం చెయ్యదలుచుకుంటే హిందూ భక్తులూ,ముస్లిం భక్తులూ జాయింటుగా విరుచుకుపడి కీళ్ళు విరిగేలా తన్ని పంపిస్తారు.ఎందుకంటే ఇప్పుడు మీడియాకెమేరాల ముందు హడావిడి చేసేవాళ్ళూ,పత్రికల్లో విషపురాతలు రాసి పేరు తెచ్చుకుంటున్నవాళ్ళూ అసలు సమాజంలో కొస్తే ఎంతటి అనామకులంటే వీళ్ళ పక్కింటివాళ్ళకే వీళ్ళెవరో తెలియదు - నిజం!ఈ అయిదు ఖండాల భూమి మీద అంగుళం మేరలో కూడా దోపిడీ అనేది లేని ప్రపంచాన్ని సృష్టించే మహదాశయంతో ఉర్రూతలూగిపోతూ ఎప్పుడో స్థాపించబోయే వర్గరహితసమాజం గురించి చింకి లెక్చర్లు దంచుతూ యూనివర్సిటీ సెమినారు హాళ్ళలో వేముల రోహిత్ లాంటి పిచ్చపుల్లయ్యలతో చప్పట్లు మోతలు మోగించేవాళ్ళు తమ వీధిలో ఉన్న రేషన్ షాపులో జరుగుతున్న చిన్నపాటి దోపిడీని కూడా అరికట్టలేకపోతున్నారు,ఎందుకని?సిద్ధాంత బలం లేకనా,మంది చాలకనా,వాళ్ళ వీధివాళ్లకి వర్గరహితసమాజం అక్కర్లేకనా,వీళ్ళకి వర్గ్రహితసమాజం స్థాపించేటందుకు తగినంత వూపు రాకనా - ముహూర్తం బాలేకనా!

          మనం బలానికి బూస్టూ వయాగ్రా వాడినట్టు వీళ్ళకి వూపు రావాలంటే ఎరుపు కనబడుతూ ఉండాలేమో!అందుకే ఇలా జనాన్ని విడదీసి ఒకడి మీదకి మరొకణ్ణి ఎగదోసి రక్తపుటేరులు పారిస్తున్నట్టున్నారు.ఇద్దరు సఖ్యంగా ఉన్నవాళ్లని విడదియ్యాలంటే ఏం చెయ్యాలి>ఇద్దర్లో దద్దమ్మ ఎవడో కనిపెట్టి,మెల్లగా వాణ్ణి బుట్టలో వేసుకుని,రెండోవాడి మీద అబద్ధాలు చెప్పి నమ్మించాలి!అది చాలు విన్నవాడు అవతలివాడు తనకి చేసిన ద్రోహానికి ప్రతీకారంగా చేస్తున్నట్టు తనని తనే జస్టిఫై చేసుకుంటూ అవతలి వాడిమీద దాడి చెయ్యటానికి!వాళ్లలో ఎవడు గెలిచినా పర్లేదు వీళ్ళకి,వీళ్ళు సృష్టించిన రెండు వర్గాల్లో ఒక వర్గం పూర్తిగా నశించిపోతే ఇంక అక్కడ మిగిలింది వర్గరహితసమాజమేగా!

          ప్రొఫేసరు హరహరోంగోపాలు గారు గొప్ప వ్యాసం రాశాడు!ఒక వైపున దళితులకి చెవుల్లో పువ్వులు పెట్టటానికి అంబేద్కరునీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని తెగ పొగిడేస్తున్నాడు,ఇంకోవైపున ఆ రాజ్యాంగాన్ని ధిక్కరించే ఉగ్రవాదుల్ని పోగడనిస్తేనే వాక్స్వాతంత్రం అవుతుందని లాజిక్కులు లాగుతున్నాడు.ఒక కమ్యునిష్టు నాయకుడి కూతురు రాజ్యాంగాన్ని ధిక్కరించిన చోటికి వెళ్ళీనా వీడియోలో కనబడినా వూరికే వెళ్ళిందే తప్ప తను తిట్టలేదుగా అని సమర్ధించుకుంటున్నారు - కాంగ్రెసుతో అంత గాఠ్ఠిగా సావాసం చేసి సిగ్గు పడటం మర్చిపోయినట్టున్నారు!అక్కడ ఈ దేశపు రాజ్యాంగానికి అవమానం జరుగుతుంది అని తెలిసి కూడా వెళ్ళడం రాజ్యాంగాన్ని ధిక్కరించటం కాదు గాబోలు - ఏమి పాండిత్యం?ఒకే వ్యాసంలో రాజ్యాంగాన్ని పొగుడుతూనే దాన్ని ధిక్కరించటాన్నీ పొగడుతూన్నా తనకి తను కేతిగాడిలా కనబడకపోవటం వింతగా ఉంది.

          వాళ్లేమి కోరుకుంటూన్నారో స్పష్టంగానే తెలుస్తున్నది!టెర్రరిస్టుల్ని అమరవీరులుగా చిత్రించటానికీ, ఇంటికో టెర్రరిష్టుని పుట్టించమని దేశంలోని తల్లిదండ్రులకి విజ్ఞప్తుల్ని చెయ్యనివ్వటానికీ,ఈ దేశాన్ని ముక్కలు చెయ్యందని విదేశీయుల్ని ఆహ్వానించడానికీ అనుమతిస్తేనే అది నిజమైన భావస్వాతంత్ర్యమని వారి ఉద్దేశం, అంతేనా?వాళ్ళు భావస్వాతంత్ర్యాన్నే కోరుకున్నారు గాబట్టి అందులో తప్పేమీ లేదని కొందరు గోడమీదిపిల్ల్లులు వాదించదలుచుకుంటే వాళ్ళకి కూడా కలిపి ఈ మేధావులకి ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను.ఏ విధమయిన అనుమానమూ లేకుండా వాళ్ళు ఉగ్రవాదులని మీకు తెలుసు వాళ్ళు ఈ దేశాన్ని విచ్చిన్నం చెయ్యాలని దొంగతనంగా సరిహద్దులు దాటి వచ్చి ఈ దేశప్రజల్లో కొందర్ని హతమార్చడమూ మీకు తెలుసు..అయినా సరే,భావస్వాతంత్ర్యం పేరుతోనూ,మరొక రకం తిక్క విశ్లేషణ తోనూ ఇవ్వాళ ఒక ఉగ్రవాదిని నువ్వు అమరవీరుణ్ణి చేసి పొగిడితే రేపు పదిమంది పుట్టరా?నీ చేతల మూలంగానే ఇవ్వాళ్టి రోజున ఉగ్రవాదానికి నువ్వు సపోర్టు ఇస్తూ మళ్ళీ రేపటి రోజున ప్రభుత్వాన్ని ఉగ్రవాదాన్ని నిరోధించడంలో విఫలమైందని విమర్శిస్తావు - నువ్వు నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా,మరొకటా?

          హరహరోంగొప్పాలు గారు అమాయకంగా జాతీయత అంటే ఏమిటి అని అడుగుతున్నాడు.మహాశయా, యూనివర్సిటీ కుర్రాళ్ళకి పాఠాలు చెప్పగలిగిన ప్రొఫెసరువైన నీకు రాజనీతి శాస్త్రాల్ని మధించి నువ్వు మెలికలు పెట్టలేనంత గట్టి నిర్వచనాలు మేం చెప్పలేము గానీ నీ దేశప్రజల మీదకి నువ్వే ఉగ్రవాదుల్ని ఉసిగొలిపే వికృతమైన స్వేచ్చని కోరుకెవటం మాత్రం కాదు!మీడియా ముందు గంతులు వేసి పాప్యులారిటీ తెచ్చుకోవటం వరకూ సాగిననతకాలం సాగించుకోండి - మీకూ భుక్తి గడవాలిగా!కానీ క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉన్న సమైక్యతని మాత్రం చెదరగొట్టకండి.ఒకసారి అక్కడ పునాది కదిలి దేవుళ్ళు దెయ్యాలుగా మారితే అసలు మీరు క్షమంగానే ఉండరు, మీ స్వార్ధ రాజకీయాల మాట దేవుడెరుగు!దేశవిభజన నాటీ రక్తనదీప్రవాహాల తర్వాత కూడా ఈ దేశప్రజలు సమైక్యతనే కాంక్షించారు,దశాబ్దాని కొకసారి వ్యూహాలు పన్ని మీరు రగిలించిన విద్వేషాగ్నుల తర్వాత కూడా ఈ దేశప్రజలు స్నేహసౌభ్రాతృత్వాలనే కోరుకున్నారు.అయోధ్యలో మసీదు కూల్చడం హిందువుల కుట్ర,దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాం అని చెప్పి ఎన్నిచోట్ల బాంబుల్ని పేల్చినా తిన్ననైన ముస్లిములు ఎవరూ వాటిని నమ్మి మీవైపుకి రావడం లేదు!ఈసారి మళ్ళీ అలాంటి వ్యూహం పన్నితే అది మీకు అంతిమవ్యూహం అవుతుంది - మీ చేతులతో మీకు మరణశాసనం రాసుకోవద్దు!పిల్లి శాపాలకు ఉట్లు తెగవు, మీరు గత్తర చేసినంత మాత్రాన భారత్ ఖాజీ సాయెబుగారు పోయి తురకల్లో గల్సాడన్నట్టు రేపెప్పుడో హిందూరాజ్యం అవ్వదు - నూటికి 80% వాళ్ళే గనక ఇప్పటికే ఇది హిందువుల రాజ్యమే!

          రాజకీయ,సామాజిక,ఆర్ధిక కోణాలలో ఎన్నివైపుల నుంచి పరిశీలించినా నిజమైన హిందువు ఎవడూ కులం పేరున గానీ మతం పేరున గానీ ఈ దేశప్రజలని విడగొట్టడు -- ఆ అవసరం యే హిందువుకీ లేదు!కనీసం కామన్ సెన్సుతో ఆలోచించినా అలా విదగొట్టడంలో ఉన్న ప్రమాదం గురించి తెలుసుకోవచ్చు.ప్రజల్ని తన సమర్ధతతో మెప్పించి రాజమార్గం ద్వారా గాక కుట్రలు,మోసాలు,జరుగుబాట్లు,తిరుగుబాట్లతో నిండిన వక్రమార్గం ద్వారా  అధికార పీఠానికి ఎగబాకే ఉద్దేశం ఉన్నవళ్ళు మాత్రమే అలా ప్రజల్ని గ్రూపులుగా విదగొడతారు.ఆ ప్రజల్ని గ్రూపులుగా విడగొట్టాలిన్స్ అవసరం ఇవ్వాళ కాంగ్రెసుకీ,కమ్యునిష్టులకీ ఎక్కువగా ఉంది,భాజపాకి తక్కువగా ఉంది

          అధికారంలో ఉన్న భాజపాకి తన అధికారం సుస్థిరం కావాలంటే హిందువుల్ని మరింతగా సంగహ్టితం చెయ్యడం తప్ప మరో మార్గం లేదు.పోగొట్టుకున్న అధికారన్ని తిరిగి దక్కించుకోవాలంటే కాంగ్రెసుకి హిందువుల్ని విడగొట్టటమూ, విశాల హందూ సమైక్యతకి అవరోధాల్ని సృష్టించడమూ తప్ప మరో మార్గం లేదు.కాబట్టి వైరివర్గాలు రెండూ ముసుగులు విప్పి కలహించుకుంటున్నాయి - అది స్పష్టం!వీరికి తొలి కబళాలుగా విశ్వవిద్యాలయ విద్యార్ధులు దొరికారు.దేశంలోని అన్ని ప్రముఖ రాజకీయపక్షాలూ విశ్వవిద్యాలయాల్ని రంగస్థలాలుగా చేసుకుని ఆడుతున్న ఈ ప్రచ్చన్న చదరంగం ఇతర రంగాలలోకి కూడా పాకకముందే మేల్కొని ఈ ధోరణుల్ని కట్టడి చెయ్యకపోతే చరిత్ర మధ్యయుగాల నాటి యుద్ధాలని మళ్ళీ మన కళ్ళముందు నిలబెడుతుంది!.

          ఈ తరం భౌతికంగా క్రీ.శ 2015లో ఉన్నప్పటికీ భావజాల సంఘర్షణ పరంగా కాలం కొన్ని శతాబ్దాలు వెనక్కి నడిచి తొలినాటి వీదేశె దండయాత్రల కాలంలో నిలబడి ఉంది.ప్రజలెప్పుడూ ఒక రకంగానే ఉన్నారు.ఇక్కడి ప్రజలు మహావృక్షాలు కారు,పచ్చిక బయళ్ళ వంటివారు.ప్రకృతిని గౌరవించి వినయంతో ఒదిగిఉండి పచ్చగా బతకడమే వారికి తెలుసు.ఎవరైనా తమ పాదాల కింద అణిచివెయ్యాలని చూస్తే పాదం ఒత్తిడి ఉన్నంతసేపు లొంగినట్టు కనిపించినా ఒత్తిడి పోగానే మళ్ళీ శిరసెత్తి నిలబడతారు!మహమ్మదీయులు ఈ దేశం మీద దాడి చేసిన ప్రతిసారి సంపద మాత్రమే కొల్లగొట్టలేదు,కసిగా ఆలయాల్ని ధ్వంసం చేసిపోయేవాళ్ళు!వాళ్ళటు వెళ్ళగానే తమ ఆలయాల్ని మళ్ళీ  కట్టుకునేవాళ్ళు తప్ప వాళ్ళు కట్టి పోయిన మసీదుల్ని మాత్రం వీళ్ళు కూల్చేవాళ్ళు కాదు!అయినా శవసంకరఖర్మ లాంటి చచ్చినబ్రాహ్మణుడు ఇస్లాము సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించదనీ,మహమ్మదీయ మతానిఈ హిందూమతానికీ పెళ్ళి జరిగిందనీ,అంతకుముందే ఉన్న సూఫీమతాన్ని పట్టుకుని ఈ రెంటికీ పుట్టిన పిల్లమతమనీ, సంగమాల గురించి దొంగకబుర్లు చెప్తున్నాడు - ఎవడికి చెప్తాడు ఈ కట్టుకధలు,ఎవడు వింటాడు వీడి రంకుకబుర్లు?పాత్రలు,పాత్రధారులు,సన్నివేశాలు,సంవిధానాలు,వ్యూహాలు,ఆర్భాటాలు అన్నింటితోనూ  సరిగ్గా ఆనాటి దృశ్యమే ఈనాడు కూడా కనబడుతున్నది.

     ప్రజల్ని విడగొట్టాలని అనుకున్నవాడికి ఒకటే ఆయుధం - ఆధారాలు లేకపోయినా అబద్ధాల్ని ప్రచారం చెయ్యటం,వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నమ్మనివాణ్ణి హిందూ ఫాసిస్టులని తిట్టటం!ప్రజల్ని కలపాలని అనుకున్నవాడికి ఒకటే ఆయుధం ఆధారాలతో సహా నిజాల్ని విప్పిచెప్పటం!హిందువులు ఎంతోకాలం స్తబ్దంగా ఉండలేరు,వీళ్ళు ఉండనివ్వరు,ఉండకూడదు కూడాను!


శాంతంగా హిందువులు గౌతమబుద్ధులు,రౌద్రంలో వీరభద్రులు - రెచ్చగొట్టకు అన్యాయమైపోతావ్!

Thursday, 7 April 2016

ఈ సంకరజాతి వంకరబుద్ధుల దుర్బ్రాహ్మణుడు హిందువుల్నీ ముస్లిముల్నీ కలపగలిగే కలశోదధి పూర్ణచంద్రుడట?నోరు తెరిస్తే అశుద్ధం కంపుకొట్టే వీడసలు మనిషే కాడు,చీ చీ!

     ఈ మధ్యనే రాణీ శివశంకర శర్మ అనే ఒక చండాలుడు ఈ భూ ప్రపంచంలో ఉన్నాడనీ,అదీ భారత దేశంలోనే పుట్టాడనీ,ఇంకా బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాడనీ తెలిసింది!వీదు "ది లాస్ట్ బ్రాహ్మిన్" అనే ఒక గ్రంధాన్ని రాశాడట - పుస్తకం గురించి చదివిన గుర్తు!ఇప్పటి బ్రాహ్మణులు నిజమైన బ్రాహ్మణులు కారనీ,అసలైన సనాతన ధర్మాన్ని ఆచరించే బ్రాహ్మణులు తమ కుటుంబంలోని వారేననీ,ఈ మధ్యనే ఆ కుటంబంలోని ఆఖరి బ్రాహ్మణుడు చచ్చిపోయాడనో,కమ్యునిష్టుల్లో కలిశాడనో  అన్నట్టు ఉంటుంది - రెండూ ఒకటే ననుకుంటా:-). సారంగలోనే "రెటమతం గురించి…ఒక  సంభాషణ" వ్యాసంలో వీడి పాండిత్యమూ,సంస్కారమూ మొదటిసారి చూశాను.

     మొదటి రెండు పేరాగ్రాఫులు చదివేసరికే ఇది ఏ బాపతు సరుకో తెలిసిపోయింది!"ఇస్లాంకి భరత ఖందపు సంస్క్తులకి జరిగిన వివాహ ఫలీంగా జన్మించినది సూఫీయిజం" అనే ముక్క చదివేసరికి సజ్జలు తింటే సజ్జలు జొన్నలు తింటే జొన్నలు రెట్టగా వేసినట్టు చదివింది చదివినట్టు కక్కుతున్న మనిషిలా కనిపించే కొత్తరకం కోళ్ళమందలో వీడూ ఒకడనిపించి నాకు నవ్వాగలేదు.ఈ మనిషిని పట్టించుకోవలసిన పన్లేదని అక్కడే తెలిసిపోయినా ఎటూ వెళ్ళాను గదాని ఓపిగ్గా చదివాను.ఇంత చెత్త పోష్టు నేనెప్పుడూ చదవలేదు,అసలు తను ఏం చెప్పాలనుకున్నాడో తనకైనా తెలుసా?పూటుగా గవళ్ళ గంగమ్మ గారి హస్తోదకం పట్టించిన పల్లెటూరి ముతక మనిషి కూడా ఇంతకన్నా స్పష్టంగానే మాట్లాడుతాడు, వీడేమి చదివాడో మరి!తీసుకున్న ప్రతి విషయం గురించీ ఎక్కడెక్కడి విషయాల్నీ పరిశోధించి నేను చెప్తున్నది నిజమా కాదా అని ఒకటికి పదిసార్లు నాకు నేనే తర్కించుకుని రూఢిగా తెలిసిన విషయాలు మాత్రమే రాసే నాలాంటివాడికి ఆ పోష్టు చివరి వరకూ చదవడమే కష్తమైపోతే వ్యాఖ్యాతల మీద అతను విసురుతున్న కామెంట్లలోని నీచత్వం మరీ కంపరం పుట్టించింది!

     నేను ఏ రాజకీయ పార్టీలను సమర్థించను. కానీ ఇలాంటి ధోరణి రోజురోజుకి వెగటు పుట్టిస్తోంది. ఈ భాజాపా రాజ్యాధికారం చేబట్టాక దేశం లో వింత పోకడలు చూస్తున్నాము. ఇంత వితండ వాదన, హిందూ మత దూషణ ఎప్పుడూ వినలేదు. అది social media వలన కూడా కావచ్చు. JNU, HCU రాజకీయం చూసాక మతిపోయింది !! ఈ విషయం మీద కొందరు FB లో కాశ్మీర్ కోసం పోరాడితే తప్పేంటి అంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించే జవాన్ లని దూషించటం చేస్తున్నారు.

     ఎజెండా రాజకీయాల కోసం ఔన్నత్యానికి ప్రతీకలుగా ఉండాల్సిన దేశభక్తి,భారతమాత,వందే మాతరం లాంటివాటిని కూడా బజారు కీడ్చి తమ నీచత్వాల్ని వాటికి పులుముతున్నారు,చీ!చీ!కంచె ఐలయ్య మరీ మూర్ఖంగా మాట్లాడుతున్నాడు.జాతీయోద్యమం మొదటిదశలో బెంగాల్ బ్రాహ్మణుడైన బంకిం చంద్ర దుర్గని ప్రతీకగా ఉంచి వందే మాతరం గీతాన్ని జనం మీద రుద్దాలని చూస్తే, సరస్వతినీ లక్ష్మినీ తప్ప ఇంకెవ్వర్నీ పూజించని మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణులు దానికి పోటీగా భారత మాతని పైకి తీసుకొచ్చి వొదిలారనీ చిలవలు పలవలుగా పులుముడు పాండిత్యం చూపిస్తున్నాడు.ఈ దేశాన్ని తల్లిగా భావించిన వాళ్ళు ఆ ఫలానా బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలొనూ మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలోనూ పుట్టటం అనేది కూడా ఈ ప్రబుద్ధుడికి కుట్రలా కనబడుతున్నది.మరొక చోట ఈ బ్లాగుల్లోనే సంస్కృతం ఫాసిస్టు భాష అని సూత్రీకరణలు చేస్తున్నాడు మరో పెద్దమనిషి!

     నిజానికి మొన్నీమధ్య వరకూ నేను నమ్మలేదు గానీ ఇపుడిప్పుడు నాకు ఈ దేశం నుంచి హిందూత్వాన్నీ హిందూ సంస్కృతికి సంబంధించిన సమస్తాన్నీ ఏమాత్రం ఆనవాళ్లు కూడా కనబడకుండా మాయం చెయ్యాలనే ఒక దుర్మార్గమైన వ్యూహం నడుస్తున్నదనే నమ్మకం క్రమక్రమంగా బలపడుతున్నది.పోనీ ఇవన్నీ నిజాలై ఉంటే ఒప్పుకోవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు గానీ పరిశోధించి చూస్తే చారిత్రకంగా వాస్తవికమైన సాక్ష్యాలు ఎక్కడా కనబడటం లేదు.దాదాపు ఒక పెద్ద సమూహం ఎన్నో వైజ్ఞానిక శాఖల పరిజ్ఞానాన్ని రంగరించి చెసిన పరిశోధనలతో "ఆర్యులు భారతదేశానికి బయటి నుంచి వచ్చారు" అనేది అబద్ధం అని తేలిపోయాక కూడా ఈ సామాజిక శాస్త్రవేత్త ముసుగులో ఉన్న హిందూత్వద్వేషి ఆర్యులు ఇక్కడికి రావడానికి ముందూ తర్వాతా అంటూ ఆకుకి పోకకి అందని సొల్లుకబుర్లు చెప్తున్నాడు.

     ఇతనొక్కడే కాదు,ఇవ్వాళ "నేను దేశద్రోహినని చెప్పుకోవడానికి గర్విస్తాను" అని రొమ్ము విరుచుకుని అంటున్న రాజ్దీప్ సర్దేశాయి లాంటివాళ్ళలో ఉన్న సామాన్య లక్షణం ఒక్కటే.పైన చెప్పిన ఉన్నతమైన పదాలను భాజపా ఇవ్వాళ కొత్తగా పుట్టించినట్టూ అవి వాళ్ళ ప్రైవేట్ స్లోగన్లు అయినట్టూ పులిమేస్తున్నారు.ఆ తర్వాత వీళ్ళ పులుముడు సూత్రీకరణలనే సార్వకాలిక సత్యాలుగా ప్రచారం చేసి వాటి సపోర్టుతో "అందువల్ల, ఇవన్నీ భాజపా/హిందూత్వ గాళ్ళకి సంబంధించినవి గాబట్టి హిందువులు కానివాళ్ళూ,భాజపాని వ్యతిరకించేవాళ్ళూ వీటిని గొప్పవి అనుకోనక్కరలేదు - ఇష్టమొచ్చినట్టు పీకిపాకం పెట్టెయ్యొచ్చు" అని జస్టిఫికేషన్ ఇచ్చేస్తారు.ఆ జస్టిఫికేషన్ మొదట అదే ఎజెండాతో ఉన్నవాళ్ళ ముందు పెట్టి ఆమోదముద్ర వేయించేసుకుంటారు,అప్పుడు ఇదిగో ఇంతమంది మేము చెబుతున్నవి నిజమని నమ్ముతున్నారు చూడండని అంటూ తమ మెడల్లో తమకు తామే ప్రజాస్వామ్యం/భావప్రకటన బోర్డులు తగిలించుకుని మమ్మల్ని వ్యతిరేకించేవాళ్లలో ఉన్నది భిన్నత్వాన్ని సహించలేని హిందూ మతతత్వం/ఫాసిస్టు మెంటాలిటీ అంటూ పూనకాలు తెచ్చేసుకుని ఇతర్లని దబాయిస్తారు!మైనారిటీగా ఉన్న నెగటివ్ ట్రెండుకి మెజారిటీగా కనబడే పాజిటివ్ షేడ్సుని తీసుకురావటమనే కొత్త సీసాలో పాతసారా లాంటి గోబెల్స్ ట్రిక్కు!ఒకసారి న్యాయబుద్ధికి దూరమైతే తప్పుల్నే ఒప్పులని కవరప్ చెసుకుంటూ అబద్ధాలతో పేనుకున్న పులుముడు పాండిత్యాలు ప్రదర్శించుకోవాల్సిన దుస్థితి తప్పదు - మూర్ఖ హిందూత్వవాదులకైనా,మూర్ఖ హిందూత్వ ద్వేషులకైనా!

     ఇప్పుడీ బౌద్ధిక పాషండుడు సంగమాల గురించి మాట్లాడుతున్నానంటూ హిందూ ముస్లిం ఐక్యత కోసం కృషి చేస్తున్నానని చెప్తూ ముస్లిం మతాన్ని సమర్ధిస్తూ హిందూ మతాన్ని విమర్శించే ఈ వ్యాసంలోనూ ఇదే చెయ్యాలని చూశాడు - కాకపోతే పొరపాటును సవరించుకునే కంగారులో జలతారు ముసుగు జారిపోయి ఉచ్చిష్టాల మీద పడి దొర్లుతున్న తన అసలు రూపం బయట పడిపోయింది.నాకు లాగే వీడి తెలివి తక్కువ కబుర్లకి ఒళ్ళుమండి డౌట్లడుగుంటే జవాబు చెప్పే దమ్ము లేక తిట్లకి తగులుకున్నడు,"సమాచారం జ్ఞానం కాదు,లింకులు తిని లింకులు విసర్జించడం కాదు" అంటూనే వాడూ ఓక లింకు ఇచ్చాడు.నేను నిజాయితీగా పోయి చూద్దును గదా,అక్కడెక్కడా ఈ గాడిద కూస్తున్నట్టు  ఇస్లాముకీ హిందూమతానికీ జరిగిన సంగమం గురించి ఒక్క మాట కూడా లేదు!మరి ఎక్కణ్ణించి కొట్టుకొచ్చాడు ఈ ఇందూత్వానికీ ఇస్లాముకీ పెళ్ళి జరిగితే సూఫీ పిల్ల పుట్టుకొచ్చిందనే రంకు పురాణం?పెళ్ళి కార్డులు కూడా పంపిస్తాట్ట,టిక్కెట్టు పెట్టి పెళ్ళికూత్రుర్ని వచ్చినవాడి కల్లా పక్కలో పడుకోబెడితే సరి - బ్రోకర్ బుద్ధులూ వీడూనూ!

     ఇప్పుడు హఠాత్తుగా పాత సంగతి ఒకటి గుర్తుకొస్తున్నది,వీడు రోహిత్ కార్ల్స్ సెగన్ సుభాషితాలు కొన్ని ముక్కలు ముక్క్కున బట్టి వదలడాన్ని ప్రస్తావిస్తూ కాషాయం కనబడితే చింపి పోగులు పెట్టిన వాణ్ణి హిందూత్వానికి అంట్గట్టాలని చూశాడు.ఆ పోష్టులో మిగతావాళ్ళు వీణ్ణి మళ్ళీ వృత్తివిద్యలకి పొమ్మంటావా,మళ్ళీ బ్రాహ్మణులే కవిత్వాలు రాయాలంటావా అని యేకిపారేస్తుంటే నేను కొంచెం సాయం చేసి వీడి పరువు కాపాడాను,లేకపోతే రొహిత్ ఫ్యాన్లు వీణ్ణి ఇంకా పీక్కు తినేవాళ్ళు.ఒక్క పోస్టు తిన్నగా రాయలేడు, ఎదవ గోల?!ఆ పోష్టులోనే ఒకాయన శ్రీపాద వారు ఎప్పుడో హిందువులు మతాభిమానాన్ని పెంచుకుని రాజకీయంగా ఐక్యం కావాలనే విషయం గురించి రాసిన మనకా మతాభిమానమా వ్యాసం లింకు ఇచ్చారు.ఈ హిందూ - ముస్లిం సయోధ్య,అస్పృశ్యుల ఆలయ ప్రవేశం,హిందువుల ఐక్యత లాంటివి  మొదలైందే ఆ కాలంలో, అప్పుడే ఆయన చాలా విషయాలు స్పష్టంగా చెప్పారు.ఈ మూర్ఖుడికి తెలియాల్సిన అతి ముఖ్యమైన విషయం మధ్వాచార్యుడూ,రామానుజులూ ఆఖరికి శంకరాచార్యుల వారు కూడా తమ కాలంలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి మూలానికి వెళ్ళి వైదిక సాహిత్యం నుంచే స్పూర్తి పొందారని సాక్ష్యాధారలతో సహా నిరూపించి చెప్పారు.ఈ అజ్ఞానసింధువు మాత్రం "వైష్ణవ శైవాల పుట్టుకకి మూలం ఇస్లామ్" అని వదరుతున్నాడు - ఏమి నీచత్వం?

     "సర్వసమగ్రమైన స్వయంసంపూర్నమైన విశ్వాసాల కారణంగా ఏమాత్రం హింసకు తావివ్వని పూర్తిశాంతియుతమైన వంద శాతం సహనశీలమైన హిందూయిజం హిందూఫాసిస్టుల రాజకీయ కల్పన మాత్రమే" నట,ఏమి సూత్రెకరణని ఎంత కష్టపడి చేశాడో!వెక్కిరింతకి వీడంటున్నాడు గానీ వేదవ్యాసుడే జయేతిహాసం పీఠికలో ఖండాంతరాలలో మనం యవనులూ,ంలేచ్చులూ అనుకునే వారిలో కూడా ఋషులు ఉన్నారు,వారికి కూడా నమస్కరిస్తున్నాను అన్నాడు కదా!వీడి అపరిపక్వ, అసమ్రగ తాత్త్విక అవగాహనని ప్రశ్నించడమే వ్యాఖ్యాతలు చేసిన నేరం కాబోలు,IDIOT..ఈ గొట్టాం గోవిందరాజులు ఏం చేప్తే అది నోరుమూసుకుని విని నమ్మాలి,వీణ్ణి ఎదిరించి మాట్లాడితే ఫాసిజం అంటాడు.ఆడలేని సానిది మద్దెల ఓడన్నదనే సామెతని వీడిలాంటి వాళ్ళని చూసే పుట్టించి ఉంటారు!ప్రశ్నించే ధోరణి ముఖ్యమట, ప్రశ్నించే ధోరణిని బట్టి జవాబులు ఉంటాయట, మరి వీడు రాస్తున్నధోరణిని బట్టి కదా ప్రశ్నలు వచ్చింది?

     తను రాస్తున్నది తనలే అర్ధం కాని పెతి అడ్డగాడిదా హిందూమతాన్ని విమర్శించటమే!గట్టిగా నిలదీస్తే నీది హిందూ ఫాసిజం అని ముద్ర కొట్టెయ్యొచ్చునని ఎంత ధైర్యమో?ఇలాంటి గొట్టాం గాళ్ళు ఫాసిస్టులు అనగానే హిందువులు దడుచుకుని,సిగ్గుపడి వెనక్కి తగుతారని ఎంత దురాశ, పాపం:-)"చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచి రందరున్, తొల్లి గతించె"ననే పాండవోద్యోగవిజయాలు మొదలై చాలాకాలమయిందని ఇంకా తెలియడం లేదు ఎర్ర ఇసుకలో తలదూర్చిన ఈ వెర్రి పక్షులకి.ఉత్తర భారతంలో కొంత ముక్కని తప్ప సమస్త భరతావనినీ ఏనాడూ అవిచ్చిన్నంగా పరిపాలించని మొఘలుల్ని మొత్తం భారతదేశాన్ని పరిపాలించినట్టు పొగడ్డం,అటు ఆఫ్ఘనిస్థానున్ నుంచి ఇటు కేరళ స్మౌద్రతీరం వరకూ ఇటు గ్జ్రాత్ నుంచి అటు ఈఎశాన్యప్రాంతాల వరకు అధీనంలోకి తెచ్చుకుని పరిపాలించిన శాతవాహనుల వంటి హిందూ ప్రభువుల మహాసామ్రాజ్యాల్ని మాత్రం ప్రాంతీయ రాజ్యాలుగా ప్రచారం చేసిన అధములది ఏమిటో మరి?మ్యాపూ సాక్ష్యంగా ఉన్నా కూడా పట్టించుకోకుండా హిందువుల్ని తక్కువ చేసి ముస్లిముల్ని ఎక్కవ చేసి చెపడం దేన్ని సూచిస్తుంది?

     అసలైన నీచత్వం ఏమిటంటే ఎవరో శ్రీనివాసుడు గారు వీడు లింకులు వద్దంటున్నాడు అగ్దాని  వేదాల నుంచి ఉపనిషత్తుల ఉంచి వీడి వాదనకి విరుద్ధంగా ఉన్న విషయాల్ని స్స్క్ష్యంగా చూపిస్తే "బేక్ టు వేదాస్ తరహా ప్రొటె స్టంటు భావజాలంతో నిండిన చర్చ వల్ల చర్చలో వైవిధ్యం నశించింది " అంటూ తీసిపారేసి,ఆయన మరింత సూటిగా తన తప్పుని ఎత్తి చూపించేసరికి స్మసారవంతుడైన అనిషి ఎవడూ అంత సభ్యతా సంస్కారాలతో కేవలం వాదనలో విభేదించిన ప్రతిస్పర్ధి మీద వాడకూడని మాట ఒకటి వాడాడు.నిజంగా అది చదవగానే నాకు అసహ్యంతో వొళ్ళు జలదరించింది!దాన్ని పర్చురించిన సారంగ అడ్మిన్ ఎవరో గానీ వాడు కూడా వీడిలాంటి వాడే అయ్యుండాలి!

     "కర్ణాటకలో శూద్రులు బ్రాహ్మణ వుచ్చిష్టాలమీద పడి దొర్లినట్లు, సంస్కృత గ్రంధాలపై దొర్లద్దు.", - ఈ ఒక్క మాట చాలు వీడు ఎంతటి అధమాధమ నికృష్ట కుసంస్కారియో కళ్ళకి కట్టినట్టు చెప్పటానికి.ఇదే ముఖాముఖి చర్చ అయి ఉండి ఈ పందినీ,ఈ పందిని చర్చలోకి తీసుకొచ్చిన అడ్మిన్ పందినీ అక్కడికక్కడ చెప్పుతో కొట్టినా ఎవరూ తప్పు పట్టననంత నీచమైన మాట అది!మోడరేషన్ ఉంది గాబట్టి చద్వి అర్ధం చేసుకుని ప్రచురించిన సారంగ అడ్మిన్ సంస్కారం అంత గొప్పగా యడ్చింది!

     దాంతో నేనొక కామెంటు వేశాను.రోహిత్ గాడి గురించిన టాపిక్కులోనే ఒక వ్యక్తి నాపేరు ప్రస్తావించి సూటిగా నన్ను బ్లేం చేస్తుంటే నేను చెప్పుకున్న జవాబుని పబ్లిష్ చెయ్యనప్పుడ సారంగ ఎర్ర పైత్యకారు లందరికీ వాళ్ళ రక్తపు వాంతులు చేసుకోవడానికి అవ్కాశమిచ్చే పెద్ద రంగసాని అని తెలిసిపోయింది.అయినా,మరీ ఇంత చండాలం వెదజల్లుతుంటే తట్టుకోలేకపోయాను.
----------
రాణి శివశంకర శర్మ గారు ప్రతిపాదించిన ఈ వ్యాసం మొత్తం మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగంచే విషయం ఏదీ లేదు. ఇవ్వాళ తమలో తాము ర్యాడికల్ ఇస్లాం అని సభ్యతాయుతంగా పిలుచుకుంటూ ఉన్న పరమ భయానకమైన ఉగ్రవాద సానుకూల దృక్పధంతో ఉన్నదానిని అమెరీకన్ ” రెచ్చగొట్టుడు”కి ప్రతిస్పందన అని తేల్చి చెప్పడం మాత్రం స్పష్టంగా అర్ధమయింది.దానిలో సత్యం ఉన్నమాట వాస్తవం!
సూఫీయిజం గురించి వారి అవగాహనలో వాస్తవవిరుద్ధమైన అంశాలు చాలా ఉన్నాయి – కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. తనతో విభేదిస్తున్న వారిని లింకుభక్షకులు అని ఎద్దేవా చెయ్యడం తప్ప వారి వాదనలో శాస్త్రీయత లేదు. అసలు మొట్టమొదటిగా విలువైన ప్రశ్నలతో ముందుకొచ్చిన మృత్యుంజయ రావు గారి వాస్తవికమైన ప్రశ్నలలో ఏ ఒక్కదానికీ వారు జవాబు చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
నాకు తెలిసిననత వరకు ఇప్పటి ఇస్లాముకీ సూఫీఇజంకీ ఎలాంటి సంబంధమూ లేదు.చాలామంది పాకిస్తాన్ అట్లా ముస్లిం ప్రభావితంగా తయారవడానికి మొగహ్లులూ మరియూ ఇతర ముస్లిం పాలకులూ బలవంతంగా మతం మార్చహ్డమే కారణం అనుకుంటారు.కానీ,ఇక్కడ ముస్లిములు రాజ్యాధికారం స్థాపించిన తర్వాత గదా వాళ్ళు నలవంతంగా మతం మార్చహ్గలిగేది?చరిత్రని చూస్తే ఇవ్వాళ మనదేశం నుంచి విడిపోయిన ఓక్ప్పటి వైదీక్ సంస్కృతి పరిఢవిల్లిన నేలమీఅద్ ఈ సూఫీల ప్రభావం ఎక్కువగా ఉందేది.వారి పద్ధతి అంతా హిందూమతంలో అప్పుదప్పుడూ కనబడిన భక్తి ఉద్యమాల ధోరణిలో ఉంటుంది. తొలితరం ముస్లిం ప్రభువులు ఇక్కడ రాజ్యం ఏర్పరేచేటప్పటికే ఆ ప్రాంతాల్లో సూఫీ సంప్రదాయం ఉండేదని చారిత్రకాధారాలు తెలియజేస్తున్నాయి.
వారి ఉద్దేశం హిందూమతం ఇస్లాం నుంచి కూడా కొంత స్వీకరించినది అనే విషయాన్ని ప్రతిపాదించడం కావచ్చు,కానీ స్పష్తంగా చెప్పలేకపోయారు.పైగా వారి వ్యాఖ్యలలో కూడా గట్టి విషయసేకరణతో చక్కని విశ్లేషణలు చెయ్యగలిగిన వ్యక్తికి ఉండాల్సిన ఓపిక,సహనం లాంటి వాటికి బదులు వ్యాఖ్యాతల్ని లింకు భక్షకులు అంటూ విసుగు పుట్టిస్తున్నారు.సూటిగా చెప్పాలంటే సందేహాలు అడుగుతున్నవారి మీద విసుక్కుంటూ ఆగ్రాహం ప్రదర్శించి వారినే హిందూ ఆధిపత్య ధోరణులతో ప్రభావితమై ప్రశ్నలు వేస్తున్నారని ముద్రలు వేసేసి సరైన జవాబు చెప్పడం అనే తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నారని ఆయాన్ కామెంట్లని పరిశీలిస్తే తెలుస్తుంది.మొదటి కామెంటు నుంచీ ఇక్కడి ప్రశ్నలకి ఆయాన్ జవాబులు చెప్పదల్చుకుంటే కొంత సమయం తీసుకుని స్పష్తత వచ్చాకనే జవాబులు చెప్పడం మంచిది.
పస్తుతం ఇస్తున్న జవాబులలో అసలు శాస్త్రీయత గానీ విషయ పరిజ్ఞానం గానీ ఏమీ లేవు
స్వస్తి.
----------
          మీరు సంకర శర్మ కాదు.అసలు మీరు ఆ పోష్టుకే వెళ్ళలేదు.ఇవన్నీ ఎందుకు,ఈ పోష్టులో నేను ఇప్పటివరకూ రాసింది కూడా పట్టించుకోకుండా,కేవలం నా కామెంటును మాత్రం చదివితే మీకు నేను ఏం చెప్తున్నానో అర్ధం అవుతుంది కదా!వ్యాసకర్త ఒక విష్యం చెప్పాలనుకుని దారి తప్పి అస్పష్టంగా గొణుగుతున్నాడు.పైగా ఇతర్లు తప్పు ఎత్తి చూపిచినా ఒప్పుకోకుండా తన తప్పుడు వాదనల్ని మొండిగా సమర్ధించుకుంటున్నడు.కొంచెం తెలివిగా జవాబ్లు చెప్పదల్చుకుంటే ప్రస్తుతానికి నోరు మూసుకుని కొంత టైము తీసుకుని తీరుబడిగా అన్నీ ఆలోచించుకు రమ్మని, కదా!ఈ చిన్న విషయం కూడా వీడికి అర్ధం కాలేదు.నన్ను చర్చలోకి రమ్మంటూ కామెంటు వేస్తున్నాడే తప్ప "కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి జవాబు చెప్పరా గాడిదా!" అంటున్న నా స్టయిల్ వార్నింగ్ బుర్రకి ఎక్కనే లేదు.
----------
RANI SIVA SANKARA SARMA
హరి. ఎస్ బాబు గారూ
ఇవ్వాల రే డికల్ ఇస్లాం అని పిలుస్తున్న దాని వెనుక అమెరికా రెచ్చగొట్టే తత్వం వుందన్న మీఅవగాహన చాలా ప్రధానమైనది. యీఅవగాహన మీరు మెచ్చిన మృత్యుంజయ రావు గారికిలేదు. వివిధకోనా లలొ పరిశీలించి అన్ని జాతి విద్వేషాలని వోకేగాట కట్టెయాలనీ మొత్తం అంతర్జాతీయ జాతి హననం లో మతవిద్వెషాలలో అమెరికాని కాని మరొకరిని కాని ప్రధాన నిందితులని చెయ్యక్కరలేదనీ అన్నిటినీ చెదురుమదురు విడి సంఘటనలుగానే చూడాలనీ శ్రీనివాసుడు గారి అభిప్రాయం. దీని ప్రకారం బ్రిటీషు వలస వాదాన్ని కుడా విసాలద్రుష్తితొ చూడాలి. జనరల్ డయ్యర్ నీ భగత్సింగు నీ వొకేద్రుష్టితో చూడాలి. వివిధకోనాలని యాంత్రికంగా నిరుద్వేగంగా చూడాలి అదేగొప్పవిశ్లేషన సంభాషణ.
మీద్రుష్టి అందుకు భిన్నమైనది. అంతర్జాతీయవేదికపై అమెరికా ఉగ్రవాద భూతాన్ని సృష్టించింది అమెరికాయే అనే స్పష్టమైన అవగాహన మీకు వుంది. నావ్యాసంలో అది ముఖ్య అంశం. అందువల్ల మీతో సంభాషణ సాధ్యంకావచ్చు.
----------
          నాకు నిజంగా ఇప్పుడు వీడి తెడ్డుతనం గురించి పూర్తి అవగాహన వచ్చేసింది,అక్కడ పోష్టులో కొందరింకా వీణ్ణి "మీలాంటి విజ్ఞులు..." అని సంబోధిస్తున్నారు.వీడు హిందూ ముస్లిం ఐక్యత గురించియే కాదు ఏ విషయానికి సంబంధించిన చర్చలోనైనా వేస్ట్ క్యాండిడేట్!అంత సూటిగా నీ జవాబుల్లో శాస్త్రీయత లేదురా,కొంచెం వాగుడు తగ్గించి గమ్మునుండు,కొంచెం టైము తీసుకుని అన్నీ సరిచూసుకునిరా అని గడ్డిపెట్టినట్టు చెప్పినా ఎక్కలేదు వీడికి అని చిరాకు ఇంకా ఎక్కువైంది.మొదటి కామెంటు అనవసరంగా వేసి దారిన పోయే చెత్తని నెత్తిమీదకి తెచ్చుకున్నట్టు తెలిసిపోయింది.వీడి స్థాయి ఏమిటో స్పష్టంగా తెల్సిపోయింది,కానీ పిలుపు మర్యాదగా ఉందే!ద్యూతక్రీడకి పిల్చినప్పుడు ధర్మరాజుకీ ఇదే ఇబ్బంది ఎదురయ్యింది కాబోలు!వీడు దొంగవెధవని తెలుసు,వెళితే మర్యాదగా బయటపడ్డం కష్టమని కూడా అప్పటికే తెలిసిపోయింది,కానీ ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకుండా నేను సైలెంట్ అయిపోతే బాగుండదు.ఈ కామెంటు వెయ్యడం ద్వారా సారంగ నాకు తలుపు తెరిచింది,ఇప్పుడు పిలుస్తున్నది తను గాబట్టి కామెంటు పడకపోతే నిలదీసే అవకాశం ఉంది.అయినా నేను చర్చలోకి దిగదల్చుకోలేదు.మరో కామెంటు వేశా ఎటువంటి మొహమాటాలకీ పోకుండా ఉన్నదున్నట్టు కక్కేశా! 
----------
ఈమధ్యన సారంగలో నా కామెంట్లు కొన్ని పబ్లిష్ కాలేదు.భాషలో గానీ విషయంలో గానీ ఏ తప్పూ లేకపోయినా ప్రచురితం కాలేదు.ఒక వ్యక్తి నన్ను పేరుపెట్టి ఒక దోషారోపణ చేస్తున్నాడు,అతనికి చెప్పే ఈ జవాబుని పబ్లిష్ చెయ్యమని విజ్ఞప్తి చేసినా అది పబ్లిష్ కాలేదు.ఈ సారంగ వారు ఒక ఎజెండా ఉండి కలిసిన గ్రూపు కాబట్టి వారి ఎజెండాకి విరుద్ధంగా ఉన్న కామేంట్లు గనక ప్రచురించి ఉందకపోవచ్చునని అనుకుని ఇంక ఇక్కడి చర్చల గురించి సీరియస్ దృష్టితో చూదటం మానేశాను.
ఇక ప్రస్తుతాని కొస్తే మీరు విషయ ప్రతిపాదన లోనూ వ్యాఖ్యాతలకు చెప్పే జవాబులలోనూ కనిపిస్తున్న విసుగునీ,కోపాన్నీ,అసహ్యాన్నీ,ఆధిపత్య ధోరణినీ గమనించి చిరాకు పుట్టి ప్రచురించకపోయినా కనీసం చదివి అర్ధం చేసుకుంటారని వేశాను.చిత్రంగా మీరు నన్నే చర్చకి ఆహ్వానిస్తున్నారు.
దేనిమీద చర్చించాలి నేను?మీరు కేవలం కొన్ని స్టటుమెంటులు విసీరెశారు,దేనికీ ఆధారాలు చూపలేదు,ఆధారాలు అడిగిన వాళ్ళని హిందూ ఫాసిష్టులు అనేస్తున్నారు. ఇంత హడావిడి చేసే బదులు మీ వాదనలకి సాక్ష్యాలు చూపించవచ్చును గదా!మీరు మీ వాదనని ఖచ్చితమైన సాక్ష్యాధారల్తొ చేస్తే మీరు హిందూ ఫాసిస్టు ముద్ర వేసేసిన శ్రీనివాసు గారు కిక్కురుమనకుండా ఒప్పుంకుంటారు కదా!
P.S: ఒకప్పుడు ఆర్యుల దాడి సిద్ధాంతాన్ని అది శుద్ధ తప్పని తెలిసి కూడా భుజాని కెత్తుకుని ఇన్నేళ్ళు మోసి ఇవ్వ్వళ్టి కుర్రాళ్ళు నిలదీస్తుంటే “Who cares?” అనే దిక్కుమాలిన స్థితికి వెళ్ళకుండా ఉండాలంటే ఆధారాలతో వాదించండి.ఆధారాలు చూపించకుండా చెప్పింది నేను గాబట్టి నువ్వు ఒప్పేసుకోవాలి,ఒప్పుకోకపోతే నీకు హిందూ ఫాసిస్టు పేరు తగిలించేస్తాను అనే రకం బెదిరింపులు కూడా ఫాసిజమే!దీనికి ముందరి తోక ఏమిటనది నేను చెప్పను – మీరు కనుక్కోండి:-) నాకీ చర్చలో దూరాలని ఏమాత్రం ఆసక్తి లేదు,ఒకవేళ చర్చ మొదలుపెట్టినా అన్ని కామెంట్లూ పబ్లిష్ అవుతాయనే గ్యారెంటీ లేదు,ఎందుకొచ్చిన గోల!ఆధారాలు లేని మాటల్ని మీరు ఎవర్ని మార్చటానికి ఇంత కష్టపడుతున్నారో ఆ చరిత్రా,సమాజమూ కూడా పట్టించుకోదు,కందకి లేని దురద కత్తిపీటకా అన్నట్టు మీతో “కర్ణాటకలో శూద్రులు బ్రాహ్మణ వుచ్చిష్టాలమీద పడి దొర్లినట్లు, సంస్కృత గ్రంధాలపై దొర్లద్దు” అని తిట్టించుకునే దురద నాకు లేదు:-(
శుభం!
----------
          వీడు నిజంగా మనిషి అయి ఉండి వీడికి కనీసపు తెలివి అయినా ఉండి ఉంటే ఈ కామెంటు చదివాక మళ్ళీ నోరెత్తకుండా సైలెంట్ అయిపోయి ఉండేవాడు,హరిబాబుని కూడా తన ఎజెండాకి వాడుకుందామనే చావు తెలివితో ఉన్న వీడికి  హరిబాబు ఇలాంటి బేఖారీ ఎదవలకి దొరకడని తెలుసుకోలేకపోయాడు.నేను వీణి చివర్లో తిట్టిన చావు తిట్లు ప్రచురించిన సారంగ ఇదువరకటి అత్ప్పులని కడిగేసుకుంది,అన్ని తిట్లు త్ని కూడా ఇంకా దులూకుని తిరుగ్తున్న వీది సిగ్గులేని బత్కుకు పగవాడికి కూడా రాకూడదని కోరుకోండి!అర్వాత శ్రీనివాసుడు గారు నాకు హెచ్చరికలు చేశారు గానీ ఈ మొదటి కామెంటు చద్వగానే నాకు తెలిసిపోయింది నన్ను తన ఎజెండాకి అనుకూలంగా వాడుకోవాలని చూస్తున్నాడని!
----------
RANI SIVA SANKARA SARMA
హరిబాబు గారూ
మిమ్మల్ని మెచ్చుకొంటూనె సంభాషణకి ఆహ్వానించాను అనే సంగతి మరిచిపోవద్దు. అమెరికా కి రెచ్చగొట్టే తత్వం వుండడం వల్లనే , ఉగ్రవాదం ఆవిర్భవిమ్చిందన్న అవగాహన మీరు మెచ్చిన యి ద్దరికీ లేకపోవడం విషాదకరం.మీ మాటని తిరుపాలు గారు కవితాత్మకంగా ఆహ్వానించారు కూడా
అందువల్ల నాకు కావలసిన ఆధారాలు మీదగ్గర లభిస్తాయని ఆశిస్తున్నాను.
ఆదిపత్యదోర ణి ని ఇష్టపడని మీరు సంస్కృత ఆధిపత్యాన్ని కూడా వ్యతిరేకించ గలరని ఆశిస్తాను. భారతీయ బహుళ సంప్రదాయాలలో మాత్రు భాషలు కూడా వేదంలా గౌరవి ంచ బడ్డాయని మీకు తెలుసు కదా? సూఫీయిజాన్ని కూడా స్థానికమని గుర్తించిన విశాలహృదయులు మీరు. నా కామెంటుని కేవలం శ్రీనివాసుడు గారికే రిజర్వు చేసి వుంచుతున్నానని హామీ యిస్తున్నాను
----------
          "నాకు కావలసిన ఆధారాలు మీదగ్గర లభిస్తాయని ఆశిస్తున్నాను." - ఒక వ్యక్తి వాడిన పదజాలాన్ని బట్టీ ఆ మాటల్లోని ధ్వని విశేషాన్ని బట్టి చెప్పని వాట్ని కూడా తెలుసుకోగలిగిన నేను వీడింత స్పష్టంగా చెప్పాక గూడా అర్ధం చేసుకోకపోతే నాకు నేను పెట్టుకున్న "చిచ్చరపిడుగు" బిరుదుకే అవమానం!అయినా ముస్లిం తీవ్రవాదానికి కొంతవరకూ అమెరికన్ రెచ్చగొట్టే ధోరణి కారణం అనేది ఒప్ప్పుకున్న ఒకే ఒక్క కారణానికి ఇంత హడావిడి చేస్తున్నాడు,అది కూడా ఒక కారణమే తప్ప అదే అంతా కాదుగా!ప్రఓంచమంతట్నీ ఇస్లామీకరించాలని లిస్టులో భారతదేశాన్ని కూడా వేసుకోవటం గురించి కూడా నాకు తెలుసు.అవన్నీ ఈ కోడిమెదడు గాడికి అక్కర్లేదు,ఇక్కడ హరిబాబు నుంచి తనకి సొంతంగా దొరకని ఆధారాలు పిండుకుందామనే రంధిలో ఉన్నాడు.

          వీడి పైత్యకారి తనం తగలెయ్య!అసలు వాదన తప్పురా అని ఘోషిస్తుంటే "మీరు సంస్కృత ఆధిపత్యాన్ని కూడా వ్యతిరేకించ గలరని ఆశిస్తాను" అని రెచ్చిపోతున్నాడు,వీడికేం ఇచ్చా వెర్రా!"వీడికేం పిచ్చా వెర్రా?!" అనేది కన్యాశుల్కంలో పెద్ద బాంబు లాంటి జోకండి!అది అర్ధం కావాలంటే కొంచెం వెనకా ముందూ తెలియాలి!బ్రాహ్మలు చాలా చాలా గడుసైనోళ్ళండి!తిట్టినా పొగిడినా అన్నింటినీ సంస్కృతంలో అఘోరిస్తారు గనడి!అందుకే వాళ్ళు తిట్టినా పొగిడినట్టే అనిపిస్తుందండి!సరే,నాటకంలో ఒక బాపనాయన ఒక కింది కులం అతన్ని "నీ ఇంట కోడి గాల్చా!" అని విసుక్కున్నాడండి!దానికా విన్నవాడు "చిత్తం,రోజూ కాల్తూనే ఉందండి!" అంటాడు.దానికి రిటార్టుగా ఈ బాపనాయన మరో బాపనాయనతో అంటాడు,"వీడికేం పిచ్చా వెర్రా" అని!బాపనాయన శ్రాద్ధభోజనంలో పెట్టే మాంసం గురించిన చావుతిట్టు తిడుతున్నాడు.అవతలాయన రోజూ తిండి కోసం కాల్చటం గురించి ఆశీసులు ఇస్తున్నాడని అనుకున్నాడు.వీడి తెలివీ అట్లానే అఘోరించింది, వీడట బ్రాహ్మణు డట!మేధావి యట!మహా మాంత్రికు డట!

          ఆ పోష్టు మీరు చదివినా కామెంట్లని బట్టి ఇలాంటివి తెలుసులేరు గనక చెప్తున్నాను,అక్కడ పేర్చిన చదరంగపు బల్లమీద నేను సెంటరులో నిలబడి ఉన్నట్టు నాకు ఈ కామెంటుతో పూర్తిగా అవగతమయ్యింది - ఇంక దాడికి వ్యూహం తప్పదు.నన్ను ఉపయోగించుకుని తన పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు,నేనిప్పుడు కవలం పరువు నిలబెట్టుకోవడం కాదు అప్రతిహతమైన గెలుపుతో బయటపడితే తప్ప "చిచ్చరపిడుగు" బిరుదుకి న్యాయం జరగదు!ఇక్కడి నుంచి చివరి తిట్ల పురాణం వరకు నేను వేసిన ప్రతి కామెంటు వెనకా ప్రస్తుతానికి బ్లాగుల్లో నేను తప్ప మరెవడూ ప్రయోగిగించలేని ప్రత్యక్షరగర్భిత రణవ్యూహం ఉంది!
----------
శర్మ గారూ,
మీరు నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు.నేను చెప్పింది మీ ప్రస్తావనలకి ఆధారాలు చూపించలేదని.వ్యాసంలో గానీ కామెంట్లలో గానీ ఎక్కడా మీరు ఇస్లాము వలాన్ హిందూమతంలో వచ్చిన మార్పుల గురించిన నికరమైన అధారాలు చూపించటం లేదు!
పైగా హిందూ ఫాసిజం,బ్రాహ్మనాధిక్యత లాంటి పారిభాషిక పదాల్లోకి సంస్కృత భాషాధిక్యత దుర్మార్గం అనే కొత్త్తమాటని కూడా తీసుకొచ్చారు.ఈ మాత నేనిప్ప్పుడే వింటున్నాను.కాబట్టి ముందు దీని గురించి నాకు కొంచెం విశదీఎకరిస్తే బాగుంటుంది.మీరు మరోసారి పిలిచారు గాబట్టి వ్యాసంలోని విషయాల గురించిన ఒక పెద్ద ప్రస్తావన చెయ్యాలంకుంటున్నాను.దానికికొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు.
----------
RANI SIVA SANKARA SARMA
హరి. ఎస్ . బాబు గారూ
పాపులర్ హిందూయిజం, సాధారణగ్రామీణ ప్రజలవిశ్వాసాల పట్ల శ్రీనివాసుడు గారికి చాలా చిన్న చూపు వుంది.[ యింతకు ముందు నేను విశ్లేషించినట్లు ] విశాలహృదయులు ఐన మీరు శ్రీనివాసుడుగారిని సంస్కరించగలరని నా ఆకాంక్ష.
----------
శర్మ గారూ,
కుల.మత భేదాలు పోయి అందరూ ఒక్కటవ్వాలనడం కూడా ఫాసిజమే అయినప్పుడు మెరు దేని గురించి ఆందోళన పడుతున్నారు?
O
ప్రస్తుతానికి ఈ ఫాసిజం ప్రభావం లేకుండా జనం ఒకరితో ఒకరు పోట్లాదుకుంటూ శోభాయమానంగానే ఉన్నప్పుడు పరిస్థితి మీకు నచ్చినట్టుగానే ఉందిగా!ఇంకెందుకీ ఆవేశం?బహుశా దీన్నంతా ఇలాగే ఉంచెయ్యకుండా అందర్నీ కలిపేస్తారేమోనని భయమా?!
O
సంస్కృత భాషాధిపత్యం అని కొత్త మాట ఎత్తుకున్నారు.దానికీ సాక్ష్యాలు చెప్పడం లేదు,ఆధారాలు అసలు వ్యాసంలో ప్రతిపాదించిన విషయానికే లేవు.ఎందుకీ వూకదంపుడు కొటేషన్లు మరియూ స్టేటుమెంట్ల రొచ్చుగుంటలో పడి దొర్లటం?
O
అఫ్సర్గా దర్గా దగ్గిరికి వెళ్ళి చూడమని ఇతర్లకి ఉబోస ఇస్తున్నారు.మీరెప్పుడయినా వెళ్ళారా?అక్కడ మీకు కనిపించినదేమిటి?
ఎక్కడికో వెళ్ళ నక్కర లేదు.నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగ గురించి కనీసం విన్నారా?అక్కడొక్క చోటే కాదు,ఆంధ్రా,తెలంగాణా,రాయలసీమ ప్రాంతాలలో జిల్లాకి మూ నాలుగు చొప్పున దర్గాలు ఉన్నాయి.కొన్ని దర్గాలకి వంశపారంపర్య ధర్మకర్తలు హిందువులు.గత యాభయ్యేళ్ళలో గానీ,ఇంకా గట్టిగా లెక్కిస్తే 200 ఏళ్ళుగానూ ఉంది ఉందని గొంతు చించుకుంటున్నది బలీయంగా ఉన్నప్పుడు గానీ,అయోధ్యలో మసీదును కూల్చినప్పుడు గానీ ముంబాయిలో బాంబు పేలుళ్ళు జరిగినప్పుడు గానీ మరోసారీ మరోసారీ అక్కడి వాతావ్రణం ఏమయినా చెక్కు చెదిరిందా!”హిందువులూ ముస్లిములూ కలిసిమెలిసి బతకాలి” అనే సూక్తి ముక్తావళులు ఎవరు ఎవరికి చెప్పాలి?”ఇప్పటికే కలిసిమెలిసి ఎవరి మతాన్ని వారు నిష్ఠగా పాటించుకోవడం అనే మినిమం సెక్యులరిస్ట్ గోలు కూడా దాటి రెండో మతం వాళ్ళు తమ మతనిష్ఠని పాటించుకోవటానికి సహాయాలు చేసుకుంటూ వసుధైవ కుటుంబం అనే మ్యాగ్జిమం హ్యూమనిస్ట్ గోలు దగ్గిర నిలబడిన వాళ్ళకి మీరు కొత్తగా వెయ్యాలనుకుంటున్న ఈ సుత్తి చెత్తగా ఉంటుంది సుమా!” అంచెప్పేసి చెబుతుంది శాస్త్రం:-)
O
కాబట్టి,మీరు ఇక్కడ చెయ్యాల్సినది పామరులకి చెప్పినట్టు సూక్తిముక్తావళులు చెప్పడం కాదు,హిందూత్వం మీద దాడి జరుగుతున్నది,హినువులు రాజకీయంగా సంఘటితం అవ్వాలి అంటున్న పండితమ్మన్యుల్ని కట్టడి చెయ్యటం – వాళ్ళు ఇట్లా ఏ ఆధారాలూ చూపించకుండా కొన్ని కొటేషన్లూ కొన్ని స్టేటుమెంట్లూ విసిరి “నేను మీలాంటి పాశ్చాత్య మోహినులని వదిలించే మహా మాంత్రికుణ్ణి. హాం ఫట్” సొంతడబా కొట్టుకుంటే లొంగరు.
O
మాటే శంఖంలా,పిడుగులా,అగ్నికణంలా భయపెట్టాలి.నువ్వు మాట్లాడినదే ఆఖరి మాట కావాలి.విన్నవాడికి రెండో మాట లేకుండా నువ్వు చెప్పింది వొప్పుకుని క్రియలోకి దిగటం తప్ప మరోదారి లేదనిపించేతట్టు ఉండాలి.అంత శక్తి మీకు ఉన్నట్టు లేదు
O
అసలు ప్రపంచంలో ఇవ్వాళ కనబడుతున్న ఇస్లామిక్ టెర్రరిజాన్ని ముందుకు తెచ్చిన విలన్ వేరే ఉన్నాడు.వాడిమీద ఈమధ్యనే ఒక పోష్టు కూడా వేశాను.ఇక్కడ చదవండి!ఇక్కడ రెండు పక్షాలుగా చేరి వాదించుకుంటున్న ఇరువర్గాలూ కూడా అసలు శత్రువుని చూడకుండా నీడతో యుద్ధం చేస్తున్నారని నాకనిపిస్తున్నది
O
నేనెప్పుడూ ఎక్కడా చర్చలలో పాల్గొనలేదు.నా పద్దతి ఇట్లా ఉంటుంది.ఒక సమస్య ఉంటే దాని గురించి ఇతర్లు అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పగలిగినంత క్షుణ్ణ్మగా తెలుసుకుని ఉన్న గదరగోళాన్ని తగ్గించహ్డానికి సూచనలు ఇవ్వడమే తప్ప కొత్త గందరగోళాన్న్ని జనం మీదకి వదిలే పని నేనెప్పుడూ చెయ్యను.ఇంక చర్చించటం, నాకెట్లా కుదురుతుంది?
OOO
సత్యం శివం సుందరం!
----------
RANI SIVA SANKARA SARMA
సూఫీయిజమ్ కోర్ ఆఫ్ ఇస్లాం.-చందోలు చంద్రశేఖర్
వైదిక సంకృతి పరిఢవిల్లిన నేలమీద సూఫీల ప్రభావం ఎక్కువ. భక్తి ఉద్యమాల ధోరణిలో వుంటుంది -హరి. ఎస్. బాబు.
మీమిత్రులు యిద్దరి దగ్గర నాకు కావలిసిన ఆధారాలు వున్నాయి. ఎందుకంటే మీరు ఆధారాలు లేకుండా మాట్లాడరు
బాబ్ర్రీ మసీదు లాంటి దుర్మార్గమైన జాతివ్యతిరేక చర్యలకి హిందూ ముస్లిం సమైక్యత తొణికిసలాడే దర్గాలో పరిష్కారం వెతుకుతున్నారు హరి> ఎస్ > బాబు గారు. గ్రామీణ సంస్కృతుల పట్ల చిన్నచూపు కల శ్రీనివాసుడు గారికి యిది కనువిప్పు. క్రుతజ్ణతల్ హరి బాబు గారూ.
----------
thus spoke SarmatooshTra:
దారాషికోహో ఉపనిషత్తులని తురక భాషలోకి అనువాదం చేసి స్వమతం వారిచేత, సకుటుంబీయుల చేత వివక్షకు గురయ్యాడు.
but history proves ఒథెర్
ఔరంగజేబు షికోని హౌదా మీదనుంచి దించి చేసిన హడావిడి వ్యూహం ఫలించే నిముషం వరకూ దారా షికో మొఘల్ సార్వభౌముడిగా అప్రతిహతమైన అధికారాన్ని అనుభవిస్తూ ఉండేవాడు.తను కేవలం ఈ ఉపనిషత్తుల్ని తర్జుమా చేసుకుంటూ కూర్చుని పర్పాలనని నిర్లక్ష్యం చేసేటంత అసమర్ధుడూ కాదు.రాజధాని మొత్తాన్ని తన చేతిలో ఉంచుకుని ఔరంగజేబుని దూరంగా పెట్టాడు.ఏమయినా సరాఎ అధికారం అత్నకే కావాలని అనుకున్నవాడు ఏ చిన్న అవకాశాన్నీ వొదులుకోడు – ఔరంగజేబు చేసింది అదే!
మీరు దారాషికో ఉపనిషత్తుల్ని తర్జుమా చెయ్యాలనుకుంటున్నదుకే అతన్ని అధికారం నంచి తొలగించారు అనటం వింతగా ఉంది.బహుశా ఔరంగజేబుకి సయాయపడిన లంచగొండి,కేవలం లంచ మీద ఆసతో గాక దారా చేస్తున్న్ ఇస్లామికి – హిందూ సంకరం ఇష్తం లేనివాడిగా మీరు కొత్త కధలు చెప్పాలని అనుకుంటున్నట్టు ఉంది.
----------
RANI SIVA SANKARA SARMA
thus spok sarmatooshtra
నేను అధికారం నుంచి తొలగించారు అనలేదు . ఏమన్నానో మొదట మీరే చెప్పారు. చూసుకోండి
----------
@sarma
నేను అధికారం నుంచి తొలగించారు అనలేదు .
@haribabu
అయిదు నిమిషాల కుట్రకి బలయ్యే వరకు సర్వంసహాధిపత్యం గల పాదుషాకి వివక్ష ఎలా సంభవం?వివక్ష అంటే అధికులు అల్పుల పట్ల చూపించే అహంభావ ప్రదర్శన కదా!
----------
RANI SIVA SANKARA SARMA
హరిబాబు గారూ
అధికులు కూడా వివక్షని ఎదుర్కొంటారు , సాంస్కృతిక మతపర కారణాలవల్ల.
----------
తలకట్టులో ఉన్న రెటమతమే మీవ్యాంలోనూ వ్యాఖ్యల లోనూఒ కనిపిస్త్న్నది:-) దేనికీ సాక్ష్యాలూ రుజువులూ ఏమీ ఇవ్వకుండా శ్రీమాన్ రాణి శివ సంకర శర్మ అని పేరుగల గొప్ప పండితుడను నేను ఏది చెప్పినా మీరు కాదనకుండా ఒప్పుకోండి.నన్ను కాదన్నవారు హిందూ ఫాసిష్టులే!
O
పేరు మహత్యం కాబోలు:-(
O
P.S:అన్నట్టు ఇదివరలో మీరు ద్వేషిస్తున్నహిందూ బ్రాహమణ ఫాసిస్టులు ఇట్లాగే వేదం రహస్యం గహనం అన్నట్టు గుర్తు,మీరూ అదే దారిలో నడుస్తున్నారు – ఇయేవ వేదం?!
----------
RANI SIVA SANKARA SARMA
హరి బాబు గారూ
వేదం రహస్యం గహనం అని వుపనిషత్తులే చెప్తున్నాయి . మీరే మీరాజకీయ ప్రయోజనాలకోసం వీధిపాలు చేస్తున్నారు. వీధియుద్ధంగా మారుస్తున్నారు. శ్రీనివాసుడిగారి దగ్గరప్రేమ తత్వాన్ని నేర్చుకోండి .
----------
మీరు నన్నిక్కడికి ఎందుకు ఆహ్వానించారో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ఇంక ప్రేమతత్వం కూడా నేర్చుకోవాలా,హయ్యో రామా!
O
సంస్కృతం యొక్క ఆధిపత్యం అన్నారు,దాని గురించి నాకు తెలిసింది చెబుతాను.హైస్కూలు రోజుల్లో రెండు సంవత్సరాలు చదివాను.తెలుగులాగే మార్కులు కలవ్వు గాబట్టి చెప్పేవాళ్ళు యెంత రుద్దినా అప్పట్లో నాకు శ్రద్ధ కుదరక పెద్దగా వంటబట్టలేదు.కానీ,కొంత చరిత్ర ఈ మధ్యనే చదివాను.
O
మాగధి,పైశాచి లాంటి అయిదు ప్రాకృత భాషల నుంచి వాటిలో ఉన్న మంచి విషయాల్ని తీసుకుని సంస్కరించి పాణిని అనే ఋషి నిర్మించాడు.నిర్మించాడు అని ఎందుకు అంటున్నాను?కేవలం వాటిని కలపి,పిండి,పిసికి సరిపెట్టుకోకుండా భాష అనేది ఎట్లా ఉండాలి అని కొన్ని శాస్త్రీయమైన ప్రతిపాదనలతో,నిర్వచనాలతో దిట్టమైన ప్రణాళికతో తయారు చేసినది గాబట్టి!
O
అందులోని మొదటి విశేషం,ఎన్ని మాటలననైనా కలిపి ఒక కొత్త మాటని తయారు చెయ్యగలగటం.ఇవ్వాళ మనం ఇంగ్లీషు భాషలో కూడా hexagonal మరియు homoe eraktus లాంటి సాంకేతిక పారిభాషిక పదాలన్నీ లాటిన్ నుంచి తీసుకున్నవే కదా! అలాంటి లక్షణం దానికన్నా సంస్కృతానికే ఎక్కువ – మీకు తెలియదని కాదు,మీకున్న ఎజెండా వల్ల తెలియనట్టు నటిస్తున్నారు,కదూ!
O
పాణిని భాషకి ఉండాల్సిన ప్రాధమిక లక్షణాల్ని శాస్త్రీయంగా ఏర్పాటు చెయ్యటం వల్లనే కదా కంప్యూటర్ ఎనలాగ్ లాంగ్వేజికి ఎక్కగలిగింది.ఒక భాషకి గానీ వ్యక్తికి గానీ ఒక గౌరవాన్ని అందుకోవటానికి అన్ని అర్హతలూ ఉండి గౌరవించబడుతున్నప్పటికీ దానిని కూడా ఫాసిస్టు లక్షణంగా లెక్కించవచ్చునా?
O
మీకో ఎజెండా ఉంది.దానికి ప్రచారం కల్పించుకోవడంలో తప్పు కూడా లేదు,కానీ దానికి మీరు ఎంచుకున్న ఏకపక్షపు దారి మాత్రం ఇప్పుడు మీరు ద్వేషిస్తున్న బ్రాహ్మణ ఫాసిస్టులు ఎంచుకున్న దారియే.వారు వేదం రహస్యమైనది కాబట్టి మీరు నేర్చుకోవద్దు,నేర్చుకోవాలనుకోవడమే కాదు,దూరంగా వుండి చెవులలో దూర్చుకున్నా ఆ చెవుల్లో సీసం కరిగించి పోస్తామన్నట్టుగానే మీరు కూడా దేనికీ రుజువులూ సాక్ష్యాలూ ఇవ్వకుండా నేను చెప్పాను కాబట్టి మీరు ఒప్పుకోవాల్సిందే అనే దారిలో వెళ్తున్నారు అని నా భావం.
O
అర్ధమయ్యే మీ సహజమైన అతితెలివితో అర్ధం కానట్టు నటిస్తూ నాకు శ్రీనివాసుడి గారినుంచి ప్రేమతత్వం నేర్చుకోమని వెటకారాలు కురిపిస్తున్నారని నాకర్ధమయింది.ఎజెండాలతో సంబంధం లేకుండా మానవసహజమైన మర్యాదలలో మొదటిది అతిధి అబ్యాగతుల్ని దైవసమానులుగా చూడటం.కానీ మీరేమి చేశారు?రానన్నవాణ్ణి పనిగట్టుకుని ఆహ్వానించారు!సూటిగా అడిగిన ఏ ప్రశ్నకీ జవాబు చెప్పలేదు.అసలు సాక్ష్యాధారాలు చూపించడం గురించి పట్టించుకోకుండా పూచికపుల్ల కింద చూసి అవమానించినది కాక వ్యంగ్యాలు కురిపిస్తున్నారు,ఎందుకండీ ఇంత ….?!
వ్యూహాత్మకంగా నా స్వాభిమానాన్ని దెబ్బతియ్యాలనుకుంటున్న ఇటువంటిచోట ఎక్కువ సేపు గడపటం నాకు సరిపడదు.బహుశా ఇదే సారంగలో నా ఆఖరి కామెంటు – సారీ!
----------
RANI SIVA SANKARA SARMA
హరిబాబు గారూ
రహస్యవిద్య అనేది వుపనిషత్తులకి గల సార్థకనామధేయం . నన్ను నిందించేందుకు ఆకాన్సెప్టు నికూడా వదలలేదు మీరు. మీకా సంప్రదాయ సంస్క్రుతులపైన గౌరవం?
----------
రానన్నవాణ్ణి పనిగట్టుకుని ఆహ్వానించారు!సూటిగా అడిగిన ఏ ప్రశ్నకీ జవాబు చెప్పలేదు.అసలు సాక్ష్యాధారాలు చూపించడం గురించి పట్టించుకోకుండా పూచికపుల్ల కింద చూసి అవమానించినది కాక వ్యంగ్యాలు కురిపిస్తున్నారు,ఎందుకండీ ఇంత ….?!
----------
RANI SIVA SANKARA SARMA
శ్రీరాం గారూ
బౌద్ధం మతం కాదుట. సూఫీయిజం అన్ని మతాలూ సంప్రదాయ సంస్కృతులు భాషలూ రాజకీయాలూ మానవ సంబంధమైనవాటన్నిటి కీ అతీతంగా మన మృత్యుమ్జయరావు గారికీ , శ్రీనివాసుడుగారికీ హరిబాబుగారికీ అలాంటి గొప్పవాళ్లకి మాత్రమే కనబడే బ్రహ్మ పదార్థాన్ని మించిన బ్రహ్మ పదార్థమట.
యింక మీరూ నెనూ మిగిలాం యీమామూలు నేలమీద మతం వున్న సాధారణ మానవులం. హరిబాబు గారు అంటున్నారు ఆయన చెవుల్లో సీసాలు పోస్తామని. పాకిస్తాను లో సూఫీయిజాన్ని కూడా వాళ్ళకే వదిలెయ్యండి మనకెందుకు ఆగోల?
----------
NAGARAJU
MARCH 16, 2016 AT 11:08 AM
1.దర్గాల సంస్కృతి మన దేశ సూఫీ ఆచరణలో భాగమే.
2.ఈ రోజు హిందూమతంగా మనం చెప్పుకుంటున్నది పూర్తిగా దానికి విరుద్ధం. ప్రజల విశ్వాసాలనూ, ఆచరణనూ అది లాఘవంగా ఆక్రమించింది.
mmmmmmmmmmmmmm
నేనిప్పుడొక ప్రాజెక్టులో దర్గాల గురించీ,దేవాలయాల గురించీ శ్రద్ధగా చదువుతున్నాను.
దర్గాలు,ముఖ్యంగా ముస్లింపకీర్లు – జాగ్రత్తగా చదవండి సూఫీలు కాదు,మహమ్మదు ప్రవక్త ప్రవచించిన ఇస్లాము మతాన్ని ప్రచారం చేసే పకీర్లు చనిపోయాక,వారి సమాధి చుటూ కట్టే ఒక భవనం.నేనిప్పుడు దాదాపు ఆంధ్రాలో ఉన్న దర్గాలను గురించి మొత్తం చదివాను.అన్నీ ముస్లింపకీర్లకి సంబంధించినవే.నాకెక్కడా ఈ దర్గాల్లో సూఫీ సన్యాసులకి సంబంధించిన ఆధారాలు కనబడలేదు.కనీసం నమ రాస్తున్నది నిజమా కాదా చెక్ చేసుకుందాం అనేపాటి కామన్ సెన్సు కూడా లేనివాళ్ళు ఇక్కడ ఎంతెంత విలువైన సుభాషితాలు చెప్తున్నారు?
ఈ వ్యాసకర్తకి తెలుగు అర్ధం కాదు కాబోలు.ఒకప్పుడు బ్రాహ్మణులు వేదాలు చాలా రహస్యమైనవి,మ్మీకు అర్ధం కావు.కాబట్టి వేదాల గురించి మేము ఏది చెప్తే అదే నమ్మండి అంట్న్నట్టు “మీకో ఎజెండా ఉంది.దానికి ప్రచారం కల్పించుకోవడంలో తప్పు కూడా లేదు,కానీ దానికి మీరు ఎంచుకున్న ఏకపక్షపు దారి మాత్రం ఇప్పుడు మీరు ద్వేషిస్తున్న బ్రాహ్మణ ఫాసిస్టులు ఎంచుకున్న దారియే.వారు వేదం రహస్యమైనది కాబట్టి మీరు నేర్చుకోవద్దు,నేర్చుకోవాలనుకోవడమే కాదు,దూరంగా వుండి చెవులలో దూర్చుకున్నా ఆ చెవుల్లో సీసం కరిగించి పోస్తామన్నట్టుగానే మీరు కూడా అని నా భావం.” అని కొటేషన్ పెట్టి ఇతని ధోరణి కూడా అలాగే ఉంది కదా అంటే అందులో మొదటి పార్టు మాత్రమే తీసుకుని తన మర్యాదలేమిని బయటపెట్టుకుంటున్నాడు.శ్రీనివాసుడు అయినా శ్రీరాం అయినా నాకు ఇద్దరూ తెలియని వాళ్లే.వాళ్లకి సపోర్టుగానూ రాలేదు,వాళ్ళు నాకు సపోర్టు వస్తారనీ రాలేదు.వాయస్కర్త సంభాసహణ కోసం ఆహ్వానిస్తే వచ్చాను.
సంభాషణ కోసం పిలిచినవాడికి నేను అడిగినవాటికి జవాబు చెప్పే బాధ్యత లేదా?నేను అడిగిన వాటికి జవాబు చెపప్కుండా నా కామెంట్ల నుంచి తనకి పనికివచ్చే ముక్కల్ని ఏరుకుని కక్కడానికా నన్ను ఇకడికి పిలిచింది?ఇది ఎజెండాలతో సంబంధం లేకుండా మానవసహజమైన మర్యాదని కూడా అతిక్రమించి పారెయ్యడం
సారంగ మళ్ళీ తన ఎజెండా ప్రకారం పాత అలవాటునే చూపిస్తున్నదా?నేను Mr.SARMA అంటూ సంబోధిస్తూ వేసిన కామెంటు ఏమయ్యింది?అది అక్కడ నుంచి తీసేసినా వదలను.రోజుకి ఒకసారి చొప్పున కొన్ని రోజులూ,గంటకి ఓకసారి చొప్పున కొన్ని రోజులూ మీవెంట పడి వేధిస్తా!ఈ వ్యాసరచయితా సారంగ అడ్మిన్ సెక్షనూ నాతో చప్రాసీ పని చేయించుకుందామని ఎత్తువేసి ఆహ్వానించినట్టు స్పష్తంగా తెలుస్తూనే ఉంది.ఇక్కడ మీరు వెయ్యకపోతే నా బ్లాగులో ఉపయోగించుకుంటాను.ఇలాంటి వాటి విషయంలో నేను ఇంకా గట్టిగా ఉంటాను – బస్తీ మే సవాల్!
----------

@శర్మ
ఆదు నిక హిందూ ఫాసిజం నిర్మాణం లో బ్రాహ్మణుల పాత్ర ముగిసింది . యితరులు ఆరంగాన్ని ఆక్రమించారు. లాస్ట్ బ్రాహ్మిణ్ లోని నాప్రతిపాదన నిజమైంది.
@హరిబాబు
మీబోటి బ్రాహ్మణులు చెంబులైతే చెంబులు బ్రాహ్మణులౌతాయి,తప్పేంటి?చెంబూ శాశ్వతమే,బ్రాహమణత్వమూ శాశ్వతమే – పొజిషన్లు మారతాయి – అన్నీ ఒక గంగలో మునిగేవే కదా!
----------
Mr.SARMA,HOLD YOUR TONGUE!
WHO ARE YOU TO BLAME ME?
HARI.S.BABU
MARCH 14, 2016 AT 3:34 AM
ఈ టైం స్టాంప్ ఉన్న కామెంటులో నేను నీమీద చేసిన ఆరోపణ ఏమిటి?తెలుగు చదవడం వచ్చా,రాదా?
1. సూఫీయిజం గురించి వారి అవగాహనలో వాస్తవవిరుద్ధమైన అంశాలు చాలా ఉన్నాయి – కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. తనతో విభేదిస్తున్న వారిని లింకుభక్షకులు అని ఎద్దేవా చెయ్యడం తప్ప వారి వాదనలో శాస్త్రీయత లేదు.
2. చరిత్రని చూస్తే ఇవ్వాళ మనదేశం నుంచి విడిపోయిన ఓక్ప్పటి వైదీక్ సంస్కృతి పరిఢవిల్లిన నేలమీఅద్ ఈ సూఫీల ప్రభావం ఎక్కువగా ఉందేది.వారి పద్ధతి అంతా హిందూమతంలో అప్పుదప్పుడూ కనబడిన భక్తి ఉద్యమాల ధోరణిలో ఉంటుంది. తొలితరం ముస్లిం ప్రభువులు ఇక్కడ రాజ్యం ఏర్పరేచేటప్పటికే ఆ ప్రాంతాల్లో సూఫీ సంప్రదాయం ఉండేదని చారిత్రకాధారాలు తెలియజేస్తున్నాయి.
3. వారి ఉద్దేశం హిందూమతం ఇస్లాం నుంచి కూడా కొంత స్వీకరించినది అనే విషయాన్ని ప్రతిపాదించడం కావచ్చు,కానీ స్పష్తంగా చెప్పలేకపోయారు.పైగా వారి వ్యాఖ్యలలో కూడా గట్టి విషయసేకరణతో చక్కని విశ్లేషణలు చెయ్యగలిగిన వ్యక్తికి ఉండాల్సిన ఓపిక,సహనం లాంటి వాటికి బదులు వ్యాఖ్యాతల్ని లింకు భక్షకులు అంటూ విసుగు పుట్టిస్తున్నారు.సూటిగా చెప్పాలంటే సందేహాలు అడుగుతున్నవారి మీద విసుక్కుంటూ ఆగ్రాహం ప్రదర్శించి వారినే హిందూ ఆధిపత్య ధోరణులతో ప్రభావితమై ప్రశ్నలు వేస్తున్నారని ముద్రలు వేసేసి సరైన జవాబు చెప్పడం అనే తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నారని ఆయాన్ కామెంట్లని పరిశీలిస్తే తెలుస్తుంది.
I GAVE YOU A SUGGGESTION:మొదటి కామెంటు నుంచీ ఇక్కడి ప్రశ్నలకి ఆయాన్ జవాబులు చెప్పదల్చుకుంటే కొంత సమయం తీసుకుని స్పష్తత వచ్చాకనే జవాబులు చెప్పడం మంచిది.
పస్తుతం ఇస్తున్న జవాబులలో అసలు శాస్త్రీయత గానీ విషయ పరిజ్ఞానం గానీ ఏమీ లేవు
తెలుగు వాడివే కదా,ఇంత పొడుగు వ్యాసం తెలుగులోనే అఘోరించావు కదా – నువ్వు దేనికీ ఆధారాలు చూపించడం లేదు అని చెప్పడం అర్ధం అయ్యే ఉండాలి,కదా!
RANI SIVA SANKARA SARMA
MARCH 14, 2016 AT 8:14 AM
ఈ టైం స్టాంప్ ఉన్న కామెంటులో నువ్వు చహెసింది ఏమిటి?
“మీద్రుష్టి అందుకు భిన్నమైనది. అంతర్జాతీయవేదికపై అమెరికా ఉగ్రవాద భూతాన్ని సృష్టించింది అమెరికాయే అనే స్పష్టమైన అవగాహన మీకు వుంది. నావ్యాసంలో అది ముఖ్య అంశం. అందువల్ల మీతో సంభాషణ సాధ్యంకావచ్చు.” – ఈ ఆహ్వానంలో నువ్వు నానుంచి కోరుకున్నది ఏమిటి?నేను నువు ఆధారాలు చూపించడం లేదు,నీ వాదనలో శాస్త్రీయత లేదు అని అంటుంటే దేని గురించి నేను నాతో సంభాషించాలనుకున్నావు?నేను అడిగిన వాటికి జవాబులు చెప్పకుండా నాతో సంభాషణ ఎట్లా సాధ్యమౌవుతుంది!
HARI.S.BABU
MARCH 15, 2016 AT 12:25 AM
మళ్ళీ ఈ టైం స్టాంప్ దగ్గిర నేను నీకు అర్ధమయ్యేలా చెప్పినది ఏమిటి?ఇదయినా నీకు అర్ధమయ్యిందో లేదో,నాకు తెలియదు – కానీ తెలుగ్లోనే చెప్పాను గాబట్టి అర్ధం అయ్యి ఉందచ్చు అని అనుకోవటంలో తప్పు లేదు కదా!
1. ఈమధ్యన సారంగలో నా కామెంట్లు కొన్ని పబ్లిష్ కాలేదు.భాషలో గానీ విషయంలో గానీ ఏ తప్పూ లేకపోయినా ప్రచురితం కాలేదు.ఒక వ్యక్తి నన్ను పేరుపెట్టి ఒక దోషారోపణ చేస్తున్నాడు,అతనికి చెప్పే ఈ జవాబుని పబ్లిష్ చెయ్యమని విజ్ఞప్తి చేసినా అది పబ్లిష్ కాలేదు.ఈ సారంగ వారు ఒక ఎజెండా ఉండి కలిసిన గ్రూపు కాబట్టి వారి ఎజెండాకి విరుద్ధంగా ఉన్న కామేంట్లు గనక ప్రచురించి ఉందకపోవచ్చునని అనుకుని ఇంక ఇక్కడి చర్చల గురించి సీరియస్ దృష్టితో చూదటం మానేశాను.
2. మీరు విషయ ప్రతిపాదన లోనూ వ్యాఖ్యాతలకు చెప్పే జవాబులలోనూ కనిపిస్తున్న విసుగునీ,కోపాన్నీ,అసహ్యాన్నీ,ఆధిపత్య ధోరణినీ గమనించి చిరాకు పుట్టి ప్రచురించకపోయినా కనీసం చదివి అర్ధం చేసుకుంటారని వేశాను.
3. మీరు కేవలం కొన్ని స్టటుమెంటులు విసీరెశారు,దేనికీ ఆధారాలు చూపలేదు,ఆధారాలు అడిగిన వాళ్ళని హిందూ ఫాసిష్టులు అనేస్తున్నారు. ఇంత హడావిడి చేసే బదులు మీ వాదనలకి సాక్ష్యాలు చూపించవచ్చును గదా!మీరు మీ వాదనని ఖచ్చితమైన సాక్ష్యాధారల్తొ చేస్తే మీరు హిందూ ఫాసిస్టు ముద్ర వేసేసిన శ్రీనివాసు గారు కిక్కురుమనకుండా ఒప్పుంకుంటారు కదా
ఇంత సూటిగా “ఎందుకీ పనికిరాని సుత్తి?ముందు ఆధారాలు చూపించు!” అని అంటున్నది కూడా నీకు అర్ధం కలేదా!
“ఆధారాలు లేని మాటల్ని మీరు ఎవర్ని మార్చటానికి ఇంత కష్టపడుతున్నారో ఆ చరిత్రా,సమాజమూ కూడా పట్టించుకోదు,కందకి లేని దురద కత్తిపీటకా అన్నట్టు మీతో “కర్ణాటకలో శూద్రులు బ్రాహ్మణ వుచ్చిష్టాలమీద పడి దొర్లినట్లు, సంస్కృత గ్రంధాలపై దొర్లద్దు” అని తిట్టించుకునే దురద నాకు లేదు” – అని నేను నీకు ముందే చెప్పాను,అర్ధమయిందా లేదా?!
దానికి మళ్ళీ నీ గ్యారెంటీ ఇస్తూ నువ్వు చెప్పినది ఏమిటి?
RANI SIVA SANKARA SARMA
MARCH 15, 2016 AT 12:44 AM
ఈ టైం స్టాంప్ దగ్గిర నువ్వు కోరుకున్నది ఇది:
“అందువల్ల నాకు కావలసిన ఆధారాలు మీదగ్గర లభిస్తాయని ఆశిస్తున్నాను.
ఆదిపత్యదోర ణి ని ఇష్టపడని మీరు సంస్కృత ఆధిపత్యాన్ని కూడా వ్యతిరేకించ గలరని ఆశిస్తాను. ”
అంటే,నువ్వు నీ వాదనని సమర్ధించుకోవడానికి కొన్ని క్లూల కోసం నన్ను వాడుకుందామనే యావ తప్ప నేను అడ్గిన వాటికి జవాబులు చెప్పే ఉద్దేశం నీకు లేదు,అవునా కాదా?
I AM NOT AN IDIOT,PLEASE MIND IT?!
ఆ తర్వాత నిన్ను ఎన్నిసార్లు ఆధారాల కోసం,సాక్ష్యాధారల్ కోసం రెట్టించాను?నాకు చెవులో పెట్టకు,నీలాంటి వాళ్లని చాలామందిని చూశాను.
1. వ్యాసంలో గానీ కామెంట్లలో గానీ ఎక్కడా మీరు ఇస్లాము వలాన్ హిందూమతంలో వచ్చిన మార్పుల గురించిన నికరమైన అధారాలు చూపించటం లేదు!
పైగా హిందూ ఫాసిజం,బ్రాహ్మనాధిక్యత లాంటి పారిభాషిక పదాల్లోకి సంస్కృత భాషాధిక్యత దుర్మార్గం అనే కొత్త్తమాటని కూడా తీసుకొచ్చారు.ఈ మాత నేనిప్ప్పుడే వింటున్నాను.కాబట్టి ముందు దీని గురించి నాకు కొంచెం విశదీఎకరిస్తే బాగుంటుంది.
2. సంస్కృత భాషాధిపత్యం అని కొత్త మాట ఎత్తుకున్నారు.దానికీ సాక్ష్యాలు చెప్పడం లేదు,ఆధారాలు అసలు వ్యాసంలో ప్రతిపాదించిన విషయానికే లేవు.ఎందుకీ వూకదంపుడు కొటేషన్లు మరియూ స్టేటుమెంట్ల రొచ్చుగుంటలో పడి దొర్లటం?
3. కాబట్టి,మీరు ఇక్కడ చెయ్యాల్సినది పామరులకి చెప్పినట్టు సూక్తిముక్తావళులు చెప్పడం కాదు,హిందూత్వం మీద దాడి జరుగుతున్నది,హినువులు రాజకీయంగా సంఘటితం అవ్వాలి అంటున్న పండితమ్మన్యుల్ని కట్టడి చెయ్యటం – వాళ్ళు ఇట్లా ఏ ఆధారాలూ చూపించకుండా కొన్ని కొటేషన్లూ కొన్ని స్టేటుమెంట్లూ విసిరి “నేను మీలాంటి పాశ్చాత్య మోహినులని వదిలించే మహా మాంత్రికుణ్ణి. హాం ఫట్” సొంతడబా కొట్టుకుంటే లొంగరు.
ఎలాంటి తడబాటూ,గందరగోళం లేకుండా నా పద్ధతేమిటో సూటిగా చెప్పాను “నేనెప్పుడూ ఎక్కడా చర్చలలో పాల్గొనలేదు.నా పద్దతి ఇట్లా ఉంటుంది.ఒక సమస్య ఉంటే దాని గురించి ఇతర్లు అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పగలిగినంత క్షుణ్ణ్మగా తెలుసుకుని ఉన్న గదరగోళాన్ని తగ్గించహ్డానికి సూచనలు ఇవ్వడమే తప్ప కొత్త గందరగోళాన్న్ని జనం మీదకి వదిలే పని నేనెప్పుడూ చెయ్యను.ఇంక చర్చించటం, నాకెట్లా కుదురుతుంది?” అని!
HARI.S.BABU
MARCH 16, 2016 AT 3:06 AM
నేను విదమరిచి చెప్పింది కూడా అర్ధం కాలేదా?ఏఅమన్నాను నేను!
“తలకట్టులో ఉన్న రెటమతమే మీవ్యాంలోనూ వ్యాఖ్యల లోనూఒ కనిపిస్త్న్నది:-) దేనికీ సాక్ష్యాలూ రుజువులూ ఏమీ ఇవ్వకుండా శ్రీమాన్ రాణి శివ సంకర శర్మ అని పేరుగల గొప్ప పండితుడను నేను ఏది చెప్పినా మీరు కాదనకుండా ఒప్పుకోండి.నన్ను కాదన్నవారు హిందూ ఫాసిష్టులే!”
మరి,దానికి నీ ఎస్పాన్స్ ఏమిటి? ఏమీ లేదు!కనీసం ఇప్పటికయినా అర్ధం చేసుకుంటావనుకున్నాను,ఉహూ!పైన వెధవ సెటైర్లు మొదలెట్టావు “మీ రాజకీయ ప్రయోజనాల కోసం వుపనిషత్తుల్ని వీధిపాలు చహెస్తున్నారు” అంటూ.
శ్రీనివాసుడు గారు MARCH 15, 2016 AT 6:54 PM దగ్గిర నాకు క్లూ ఇవ్వాల్సిన పని లేదు.I CAN READ BETWEEN THE LINES MIND IT YOU IDIOT!
FROM THE BEGINNING I KNOW WHAT IS YOUR CUNNING STRATEGY.
నీలాంటి పుచ్చొంకాయలకి దొరికే బడుద్ధాయిని కాను నేను.చిచ్చర పిడుగుని.నాతో పెట్టుకోవద్దు.తిన్నగా ఆధారాలు చూపించి ఒక మాట గట్టిగా చెప్పలేవు.నాకు ఉబోసలు ఇస్తున్నవు.కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీ ఉండాలి.ఇంక చాలు.అనవసరంగా నాగురించి ఒక్క మాట కూడా తూలకు.ఇంతటితో సరి – చెల్లుకు చెల్లు,హళ్ళికి హళ్ళి,సున్నంకి సున్న – ఢాం తుస్సు ఢ ఢ ఢ ఢాం:-)
P.S: నేను వేసే కొన్ని కామెంట్లు రెండూవిప్లా పదునైన కత్తులు.పబ్లిష్ చేస్తే ఒక రకం దేంజరు,చెయ్యకపోతే మరొక రకం డేంజరు – చూద్దాం దీని రిజల్టు ఎట్లా ఉంటుందో?!

----------

అసలు మహమ్మదు ప్రవక్త చెప్పిన ఇస్లాము కన్నా ముందే సూఫీ సంప్రదాయం ఉనికిలో ఉంది అని నిర్ద్వందంగా తేలిపోయినప్పుడు అది హిందూ మతమూ ముస్లిం అమతమొ కలిసిన రూపం అని చెప్పే మొదటి సూత్రీకరనే అబద్ధం అని తేలిపోయినప్పుడు,ఇంకా సూఫీఇజం లక్షణాలు ఏమిటి,దానిలో ఏకేశ్వరోపాసన ఉందా,గురువులు ఎట్లా ఉండేవాళ్ళు,వాళ్లేమి బోధించారు ,అది ఎన్ని మతాలలో అంతర్భాగమై ఉంది – ఈ సుత్తి చర్చలన్నీ అవసరమా?
----------
RANI SIVA SANKARA SARMA

నేను కలశాన్ని , కలశం లోని కలశాన్నీ
ఔను నేను కలశాన్ని
హిందూ ముస్లిం సమన్వయం అనే చంద్రోదయం కోసం యెదురుచూస్తున్న కల శో దధిని
కలశం లోని ఫాసిస్టు విషాన్ని వేరుచేసి గరలంలా కంఠాన బిగబట్టగల శంకరుణ్ణి.
త్రిశూలాన్ని పరశువుగా మార్చగల బ్రాహ్మణ శంకరుణ్ణి.
హిట్లర్ మూకల పాలిట ప్రమధగణాన్ని.
[కలశం =చెంబు , పాలు. కల శో దధి పూర్ణ చంద్రమా పెద్దన మను చరిత్ర. ]
----------
క్షేత్రస్థాయిలో దర్గాల దగ్గిరా ఒంటిమిట్టలో ఇమాం బేగ్ గారి బావి దగ్గిరా,తిరుత్తణి మురుగన్ కోవెల దగ్గిర సమొహంగా వచ్చి కొలిచే ముస్లిముల దగ్గిరా ఆల్రెడీ పరిఢవిల్లుతున్న దానికోసం మీరు ఇప్పుడు ఎదురు చూడట మేమిటి?బహుశా అక్కడికి కూడా వెళ్ళి “అనద్త్=రూఒ అక్లిసుండాలనుకుంటున్న హిందూ ముస్లిం ఐక్యతా ఫాసిస్టు స్వభావాన్ని” చెదరగొట్తేసి అకక్డ కూడా విద్వేష విషాన్ని పెంచాలని ఉబలాట అప్డుతున్నట్టున్నారు,అది మీ తరం కాదు.

రండి సంభాషించుకుందాం అని పిలిచి నేను అడిగ్న ఏ ఒకక్ పర్శ్నకీ జవాబు చెప్పకుండా నేనొక అర్ధంతో చెప్పినదాన్ని దాన్ని సగం తుంచి వ్యతిరేకంగా మార్చి మీకు అనుకూఅలంగా అన్వయించుకోవడం గొప్ప సంస్కారం – నిజంగానే బ్రాహ్మణ్యం మీలో ఎప్పుడో చచ్చిపోయింది?!
----------
RANI SIVA SANKARA SARMA

హిందూ ఫాసిస్టు బ్రాహ్మణిజం నాలో ఎప్పుడో చచ్చిపోయింది
మీలో మొదలైంది
అదే నేను చెప్పినది కూడా.
----------
శర్మా,
మొదటిసారి ఒక విచిత్రమైన వ్యక్తిని చూస్తున్నాను ఇక్కడ!
ఈ శ్రీనివాసుడు గారు అనే వ్యక్తి గతంలో నీతో వాదన జరిపి ఉండాలి,కాబట్టి పాతపగలు ఉంటే ఉండొచ్చు.కానీ నాతో నువ్వు ఇక్కడ ప్రవర్తించిన పద్ధతి ఎంత దుర్మార్గంగా ఉంది!ఇంత దుర్మార్గం చేసి కూడా ఏమాత్రం సిగ్గు పదకుండా ఎలా ఉందగలుగుతున్నావు?అనద్రూ పొగుదుతున్న సాక్ష్యం ఉన్న తనలోని గొప్పదనాన్ని చూసుకుని గర్వించహెవాళ్లని చూశాము,తనలో దుర్మారం ఉందని సాక్ష్యాలతో సహా రుజువైతే ,”ఔను,నేను దుర్మార్గుణ్ణే అయితే ఏంటి?” అని బరితెగించేవాళ్లని చూశాము.కానీ,చారిత్రకాధారాలతో ఇస్లాము కన్నా ముందే సూఫీఇజం అనేదాని ఉనికి ఉంది అని తెలిసిపోయి వ్యాసంలోని నీ మొదటి స్టేటుమెంటు పూర్తిగా అబ్ద్ధం అని రుజువయ్యాక గూడా నాదే సత్యం మీదంతా హిందూ ఫాసిజం అని అనగలుగుతున్నావణ్ణి నిన్నొక్కణ్ణే చూస్తున్నాను!
ఆ వ్యాఖ్యలు శ్రీనివాసుడు గారికే,మీకు కాదు అని గ్యారెంటీ ఇచ్చి సంభాషణకి ఆహ్వానించిన వ్యక్తి నాతో ఇంత నీచంగా వ్యవహరించి కూడా పశ్చాత్తాపాన్ని కాకుండా ఇంకా రెటమతంగానే మాట్లాడటాన్ని మానవమాతృడెవడయినా జీర్ణించుకోగలడా?
అంత గట్టిగా నా మర్యాదని కాపాడతానని హామీ ఇచ్చి సంభాషణకి పిలిచి “ఇక్కడ నానుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు?నేను దేని గురించి వాదించాలి!” అని అడిగిన తొలి ప్రశ్న నుంచి “వ్యక్తి గానీ భాష గానీ గౌరవించబడటానికి అన్ని అర్హతలూ ఉండి గౌరవించబడటం కూడా ఫాసిస్టు లక్షణమేనా?” అనే ఆఖరి ప్రశ్న వరకూ ఏ ప్రశ్నకీ ఎందుకు జవాబు చెప్పలేదు?సంభాసహ్ణ అంటే ఎదటి మనిషి అడిగిన ప్రశ్నకి జవాబు చెపటం కాదా?అది మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు గుర్తు చహెశాను!ఇప్పుడూ అడ్గుతున్నాను,నాకు జవాబు కావాలి. అర్ధం కాకపోవడానికి నేను సంస్కృతంలో రాయలేదు,కనీసం గ్రాంధికమూ వాడలేదు – అయినా ఎందుకు జవాబు చెప్పడం లేదు? నా ప్రశ్నలకి జవాబు చెప్పకుండా నా మాటల్ని వక్రీకరించిన అధముడివి – నువ్వు చెప్పే నీతులు ఎవడు వింటాడు!
నువ్విక్కడ నాకు చేసినది ఒక మనిషి ఇంకోక మనిషికి కాదు,ఓక జంతువు ఇంకొక జంతువుకు కూడా చెయ్యని అవమానం,అయినా సిగ్గు లేకుండా వదరుతున్నావు.కనీసపు సంస్కారం కూడా లేని నీకు నేను బ్రాహ్మణుణ్ఝీ,ఈశ్వరుణ్ణి అని చెప్పుకుంటే ఇతర్లకి అవి గప్పాలు గానూ డబ్బా కొట్టుకోవడంగానూ అనిపించి నవ్వుకుంటారనే ఇంగితజ్ఞానం కూడా లేకపోయింది!
పిలిచి మరీ అవమానించడం అనే దుర్మార్గం చేసి మానవసహజమైన మర్యాదని కూడా దాటి ఇంకా ఇట్లా ఉండగలుగుతున్నావంటేనే నీలోని నీచత్వం ఎంత తారాస్థాయిలో ఉందో అర్ధమవుతుంది!
హరిబాబుని ఇంత నీచంగా అవమానించిన దానికి ఫలితం ఏమిటో త్వరలోనే సాక్ష్యం కనపడుతుంది నీకు!తెలిసో తెలియకో మనుషులు చేసే ప్రతి తప్పుకీ ఒక పరిహారం ఉంటుంది,కానీ తెలిసి తెలిసీ పరిహారం లేని తప్పు చేశావు నువ్వు.ఎంతో సహనంగా నీ తప్పేమిటో పదే పదే చెప్పినా మొండిగా మాట్లాడుతున్నావు,మానవత్వమే లేని నీకు హిందూ ముస్లిం ఐక్యత లాంటి గంభీరమైన విషయాల్ని చర్చించే అర్హత ఎక్కడుంది?బౌద్ధ భిక్షు సంఘాలలో కూడా అంతరువులు ఉంటాయి,తెలుసా?మొట్టమొదటి హోదా “అర్హతుడు”,అంటే భిక్షు సంఘంలో శాశ్వతంగా ఉండటానికి అర్హతల్ని సాధించిన వాడు అని అర్ధం.అది లేకపోతే అక్కడా కొన్ని బోధనల్ని చెప్పరు!ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు వాగే నీలాంటివాడు అందుకు కూడా పనికిరాడు.
అన్నీ తెలిసే చేస్తున్న పాపానికి నిష్కృతి ఉంటుందా!ఇంకా దిగజారకుండా ఆగితే బాగుంటుంది! హరిబాబుని ఇంత నీచంగా అవమానించిన దానికి ఫలితం ఏమిటో త్వరలోనే సాక్ష్యం కనపడుతుంది నీకు! తెలిసో తెలియకో మనుషులు చేసే ప్రతి తప్పుకీ ఒక పరిహారం ఉంటుంది,కానీ తెలిసి తెలిసీ పరిహారం లేని తప్పు చేశావు నువ్వు
ఛీ!ఛీ!

----------
  సారం గఈ నా చావుతిట్లని ప్రచురించటంతో నాకు నేను పెట్టుకున్న అప్రతిహతమైన గెలుపు నాకు దక్కింది!
----------
P.JAYAPRAKASA RAJU .

వాద , ప్రతి వాదనలు – ఏక వచన ప్రయోగాలు – దూషణ పర్వం – తర్వాతి ప్రస్థానం ఏమిటో ! సారంగ సంపాదకవర్గం ఇక ఇంతటితో దీనిని కట్టడి చేయండి !!
----------
SRIRAM

తప్పుల తడకలతో రాసిన ఈ వ్యాసం,తప్పుడు సిద్దాంతం ప్రతిపాదిస్తూ రచయిత చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. పైగా ప్రశ్నించిన వారిపై ఈ తిట్ల పురాణం చదివేవారికి అసహనానికి గురిచేస్తుంది. రచయిత ఓటమిని హుందాగా ఒప్పుకోకుండా గేలిచేయటం ఈ ఇంటర్నెట్ యుగంలో ఎవ్వరు క్షమించరు. ఇంతటితో శ్రీనివసుడు, హరిబాబు వ్యాఖ్యలు రాయటం ఆపితే చాలా బాగుంట్టుంది.
----------

@శ్రీరాం
ఎక్కడ ఆపాలో నాకు తెల్సు.నాపేరు పెట్టి “బ్రహ్మపదార్ధం ” అంటూ వాగి ఉండకపోతే నేను అసలు మాట్లాడేవాడినే కాదు.
మొత్తం సారంగ మీదే బోరు కొట్టేసింది!
సమాప్తం!స్వస్తి!శుభమ్!
----------
          మొత్తానికి సారంగ కూడా వీడి అశుద్ధపు కామెంటుని ప్రచురినిన పాపాన్ని కూడా కడుక్కుని పరిహారం చేసుకుని తన పరువు నిలబెట్టుకునట్టు ఉంది.ఇకముందు కూడా సారంగ ఇలాగే వ్యవహరిస్తే మంచిది.ఈ దెబ్బతో నాకిన్నాల్ళు కొంచెం వూగిసలాటగ ఔన్న ఒక విషయంలో స్పష్టత వచ్చింది.నిజానికి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఈ ఎర్రపైత్యంగాళ్ళు చూపిస్తున్న అసహనం వల్ల జర్గబోయే అల్లాండం బెల్లాండం పెమాదాలు ఏమీ రావు గానీ ఒకవేళ,వైరివర్గాలు రెండూ ముఖాముఖి తలపడినప్పుడు నేను తటస్థంగా ఉండాలా రంగంలోకి దిగాలా అనేదాని గురించి నాకొక స్పష్టత వచ్చింది.

          రెండూ పాలిచ్చే జంతువులే అయినా చిన్న చిన్న అలవాట్ల అవిషయాలలో కొడా చాలా తేడాలు ఉంటాయి ఆవు జాతికీ,గేదె జాతికీ.ఒంటిమీద నీటి చ్క్క పడితే చాలు ఆవు కంగారు పడి విదిలించుకుంటుంది.అదే గేదె జాతి,ముఖ్యంగా దున్నపోతు కుంభవృష్టి కురుస్తున్నా ఏమీ పట్టించుకోదు.వీడు కూడా దున్నపోతు లాంటివాడే,నాతో ఇన్ని తిట్లు తిని కూడా సిగ్గు లేకుండా ఇంకా బాహుబలి గురించీ వాటి గురంచీ వీటి గురించీ ఒంకా పుడింగి కామెంట్లు వేస్తూనే ఉన్నాడు.కనీసం పోటుగాడిలా హరిబాబుని సాయానికి పిల్చి అక్కడ తన పరువు తనే పోగొట్టుకున్న విషయమినా బుర్రకి ఎక్కి ఉండదు,పాపం!కొన్ని జన్మ లంతే!

కేవలం ఇలాంటి దొంగవెధవలు ద్వేషిస్తున్నందుకే హిందువులు గర్వంగా తలెత్తుకు తిరగొచ్చు!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...